breaking news
SPSR Nellore
-
పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలి
వింజమూరు(ఉదయగిరి): జిల్లాలో పంచాయతీల అభివృద్ధిపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని డీపీఓ వసుమతి పేర్కొన్నారు. వరికుంటపాడు, వింజమూరు, దుత్తలూరు, కొండాపురం, కలిగిరి మండలాల పంచాయతీ కార్యదర్శులతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో మెరుగైన పారిశుధ్యం కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, డీఎల్పీఓ వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. కాటేపల్లి పంచాయతీలో డీఎల్పీఓ విచారణ వింజమూరు(ఉదయగిరి): మండలంలోని కాటేపల్లిలో పంచాయతీ నిధుల దుర్వినియోగంలో సర్పంచ్ విజయలక్ష్మమ్మపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణను కావలి డీఎల్పీఓ వెంకటరమణ గురువారం జరిపారు. ఫిర్యాదు చేసిన మధు, సర్పంచ్ను ఒక వేదికపై కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వీరికి సర్దిచెప్పి సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. పంచాయతీలో రూ.29 లక్షల నిధులున్నాయని, వీటిని ఉపయోగించి గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలన్నారు. సర్పంచ్పై పలు ఆరోపణలు ఉండటంతో చెక్పవర్ను రద్దు చేశారని, డిప్యూటీ ఎంపీడీఓ రామారావుకు డ్రాయింగ్ పవర్ ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి, బండి కృష్ణారెడ్డి, జిలానీ, రామయ్య తదితరులు పాల్గొన్నారు. షట్టర్ల పనితీరుపై ఆరా సంగం: సంగంలోని పెన్నానదిని ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ గురువారం పరిశీలించారు. షట్టర్లను పరిశీలించి.. వాటి పనితీరుపై డీఈ, ఏఈని ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. మోంథా, దిత్వా తుఫాన్లతో సాగునీటి వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. డెల్టా వ్యవస్థ, కనుపూరు కాలువలు పూడిపోవడమే కాకుండా, పలు చోట్ల షట్టర్లు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నాయని వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొన్ని పనులను ప్రారంభించామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తుఫాన్ నష్టాలపై జేఈ, డీఈ , ఈఈ స్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేను నిర్వహించి.. రానున్న రోజుల్లో వీటిని తట్టుకునేలా షట్టర్లు, నిర్మాణాలను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తుఫాన్లతో సంభవించిన నష్టాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి, నిధుల మంజూరు కోసం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపేలా చర్యలు చేపడుతున్నామన్నారు. డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పల్స్పోలియో ప్రచార మెటీరియళ్ల పంపిణీ నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ప్రచార మెటీరియళ్లను పీహెచ్సీలకు డీఎంహెచ్ఓ సుజాత ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. వీటిని ఆయా పీహెచ్సీల డాక్టర్లు.. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు అందజేయనున్నారు. పోలియో బూత్ల వద్ద బ్యానర్లను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయనున్నారు. -
లభ్యం కావడం లేదు
యూరియా లభ్యం కాక అల్లాడిపోతున్నాం. రైతు సేవా కేంద్రంలో ఎకరాకు బస్తా లెక్కన రెండు వారాల క్రితం అందజేశారు. వచ్చిందీ అధికార పార్టీ నేతలకే సరిపోయింది. రెండో కోటా యూరియా కోసం బస్తాను రూ.350 నుంచి రూ.400 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. – మోటుపల్లి వెంకటేశ్వర్లు, రైతు, రాజోలుపాడు దుకాణంలో కొనుగోలు చేస్తున్నాం రైతు సేవా కేంద్రాల వద్ద ఎకరాకు ఒక బస్తా యూరియా చొప్పున ఇస్తుండటంతో అది ఏ మాత్రం సరిపోవడంలేదు. ఇక్కడ నేతల పెత్తనం అధికంగా ఉంది. దీంతో ఎరువుల దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. – పెంచలరెడ్డి, రైతు, పులికల్లు కంటితుడుపుగా ఇస్తున్నారు.. మారిన వాతావరణ పరిస్థితుల తరుణంలో తగినంత యూరియాను అందించకపోతే వరి పైరులో దిగుబడులు రావు. కుంటిసాకులతో సరఫరాను తగ్గించి ఎకరాకు మూడు బస్తాలే అనడం సరికాదు. బ్లాక్లో రూ.400 చొప్పున కొనుగోలు చేసి తెచ్చుకున్నా. పదెకరాలు సాగు చేస్తున్న నాకు మూడు దఫాలుగా ఇస్తామని చెప్పారు. వాళ్ల చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి. – ఇటుకల పెంచలయ్య, రైతు, మహిమలూరు, ఆత్మకూరు గతంతో పోలిస్తే ఖర్చు పెరిగింది సాగు చేయాలంటే పరిస్థితులు అనుకూలించడంలేదు. వర్షాలతో దెబ్బతిన్న నారుమడులను కాపాడుకోవడం ఓ ఎత్తయితే.. యూరియా కోసం తిరగడం మరో సమస్యగా మారింది. పుష్కలంగా అందించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదు. బ్లాక్లో విక్రయాలు జరగకుండా సక్రమంగా పంపిణీ చేయాలి. – వెంకటేశ్వర్లురెడ్డి, రైతు, కొండమీదకొండూరు, ఏఎస్పేట గత ప్రభుత్వ తరహాలో ఆదుకోవాలి బత్తాయి, వరిని రెండెకరాల చొప్పున నాటా. మరో 15 రోజుల్లో బత్తాయి తోటకు నీళ్లు వేస్తా. గతంలో ఆర్బీకేల్లో యూరియా అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ తరహాలో మమ్మల్ని ఆదుకోవాలి. – నూతలపాటి మాల్యాద్రి, వెంగమాంబపురం, వేంపాడు, వరికుంటపాడు ● -
అధిక ధరలకు విక్రయాలు
స్థానిక సొసైటీ, రైతు సేవా కేంద్రాల్లో యూరియా కొరత ఉంది. దీంతో ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇవి కావాలంటే వేరే ఏదైనా కొనుగోలు చేయాలనే నిబంధనలు విధిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నాం. – హరీంద్ర, రైతు, విడవలూరు ప్రణాళికతో సరఫరా రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా సరఫరాకు చర్యలు చేపట్టాం. ఈ సీజన్కు సంబంఽధించి 94 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. ఇప్పటి వరకు 48 వేలను సరఫరా చేసి రైతులకు అందుబాటులో ఉంచాం. ఎకరాకు మూడు బస్తాలను వినియోగించాలి. ఈ మేరకు కార్డులనూ అందజేశాం. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపడతాం. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి ● -
మేయర్ రాజీనామాకు కౌన్సిల్ ఆమోదం
● సర్వసభ్య అత్యవసర సమావేశం ● హాజరైన 38 మంది కార్పొరేటర్లు నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో కౌన్సిల్ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనికి సంబంధించి కార్పొరేషన్ కార్యాలయానికి అన్ని వైపులా అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. అందర్నీ తనిఖీ చేసి వివరాలను అడిగాకే లోపలికి పంపారు. ఇన్చార్జి మేయర్ రూప్కుమార్యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎక్స్అఫీషియో సభ్యుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హాజరయ్యారు. గోవా టూర్ వెళ్లిన కార్పొరేటర్లు ప్రత్యేక వాహనంలో చేరుకున్నారు. సమావేశంలో మేయర్ స్రవంతి రాజీనామాను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కొత్త మేయర్ను ఎన్నుకునేంత వరకు ఇన్చార్జి మేయర్గా రూప్కుమార్యాదవ్ వ్యవహరించనున్నారు. కొత్త మేయర్ ఎన్నిక చట్ట ప్రకారం జరుగుతుందని, అప్పటి వరకు తాత్కాలిక మేయర్గా తానుంటానని చెప్పారు. ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కమిషనర్ నందన్, సెక్రటరీ శ్రీలక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఎంహెచ్ఓ కనకాద్రి తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న కాకాణి పూజిత
పొదలకూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులకు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆమె గురువారం మండలంలోని కల్యాణపురం గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నెల్లూరు నుంచి వెళ్తున్నారు. మట్టెంపాడు వద్ద ముందు వెళ్లే మోటార్బైక్ను వెనుక వైపు నుంచి మరో బైక్ ఢీకొంది. దీంతో మండలంలోని డేగపూడి గ్రామానికి చెందిన యువకులు గాయపడ్డారు. అదేమార్గంలో వస్తున్న పూజిత వెంటనే కారు ఆపి అంబులెన్స్కు ఫోన్ చేశారు. అది రావడం ఆల స్యం అవుతుందని తన కారులో ఎక్కించుకుని వైద్యసేవల నిమిత్తం బయలుదేరారు. అంబులెన్స్ ఎదురుపడగా అందులో క్షతగాత్రులను ఎక్కించి పంపారు. దీంతో సకాలంలో యువకులకు వైద్యసేవలందాయి. పూజిత వెంట వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజాద్ తదితరులు ఉండి బాధితులకు సహాయపడ్డారు. -
అడవి కాదు.. కండలేరు మట్టికట్టే
● కట్ట కూడా కనిపించకుండా కంపకర్ర ● లోపలికి దిగిపోతున్న వేర్లు ● ఇది ప్రమాదమంటున్న రైతులుపొదలకూరు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద మట్టికట్టగా గుర్తింపు ఉన్న కండలేరు జలాశయం కట్టపై పర్యవేక్షణ కొరవడింది. మోంథా, దిత్వా తుఫానుల కారణంగా కురిసిన భారీ వర్షాలకు జలాశయంలోకి నీరు వచ్చి చేరడంతో అధికారులు హైరానా పడ్డారు. మట్టికట్ట కావడంతో దాని భద్రతపై అనుమానాలున్నాయి. 60 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో స్పిల్వే నుంచి నీటిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. అయితే అక్కడి పరిస్థితిని చూస్తున్న రైతులు నివ్వెర పోతున్నారు. 12 కి.మీ పొడువున ఉన్న కట్టపై ఏపుగా కంపకర్ర పెరిగి కనిపించడం లేదు. చాలారోజుల క్రితం.. తెలుగుగంగ అధికారులు ప్రతి ఏడాది కట్టపై జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలి. అయితే పనులు చేపట్టి చాలారోజులైంది. దీంతో నేడు అడవిని తలపిస్తోంది. కంపకర్ర వేర్లు కట్ట లోపలకు దిగడంతో ముప్పు ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2023లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 3 కి.మీ మేర కంపకర్రను తొలిగించారు. తర్వాత జంగిల్ క్లియరెన్స్ జోలికి వెళ్లలేదని రైతులు తెలిపారు. కండలేరును పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు గతంలో చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మూడు మండలాల పరిధిలో.. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల, కండలేరు ప్రాజెక్ట్ల ద్వారా లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు పండించుకుంటున్నారు. 64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కండలేరు జలాశయాన్ని నిర్మించారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు 60 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో అటు అధికారులు, ఇటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అభద్రతాభావంతో ఉన్నారు. 12 కి.మీ నిడివి ఉన్న కట్ట జీరో నుంచి 0.50 కి.మీ వరకు చేజర్ల మండలం, 0.50 కి.మీ నుంచి 6 కి.మీ వరకు పొదలకూరు మండలం, 6 కి.మీ నుంచి 12 కి.మీ వరకు రాపూరు మండలంలో ఉంది. పర్యవేక్షణ, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కింద 4 సబ్డివిజన్ కార్యాలయాలు, అందులో డీఈఈలు, 18 మంది ఏఈలు ఉన్నారు. అయితే ఏళ్ల తరబడి కట్టపై ఏపుగా పెరిగిన కంపకర్రను తొలగించడంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు అంటున్నారు. నిధుల లేమి కారణమా? లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉందంటున్నారు. పటిష్టత కోసం గతంలో నిపుణుల కమిటీ సలహా మేరకు పనులు కూడా చేపట్టారు. తరచూ ప్రాజెక్ట్ను పరిశీలించేందుకు నిపుణులు వస్తుంటారు. స్లూయీజ్ల వద్ద కూడా.. మట్టికట్ట స్లూయీజ్ల వద్ద కంపకర్ర పెరిగిపోతోంది. లోలెవల్, హైలెవల్ స్లూయీజ్లు మట్టికట్టకు ఉన్నాయి. లోలెవల్ నుంచి ఏటికాలువకు నీరు వదులుతారు. అవసరమైనప్పుడు ఎడమగట్టు కాలువ పంపింగ్ స్కీమ్ నుంచి విడుదల చేస్తుంటారు. అయితే ఎడమ కాలువకు ప్రస్తుతం గ్రావిటీ ద్వారానే విడుదల జరుగుతోంది. జలాశయంలో నీరు తగ్గి 30 టీఎంసీలకు పడిపోతే హైలెవల్ స్లూయీజ్కు నీరు అందని సమయంలో మాత్రమే పంపింగ్ స్కీమ్ను వినియోగించడం జరుగుతుంది. కట్టపై నీరు నిలబడకుండా నిర్మించిన డ్రెయిన్స్ కూడా కంపకర్ర వల్ల మూసుకుపోయాయి. వర్షం కురిసిన సమయంలో కట్టపై నుంచి డ్రెయిన్స్ ద్వారానే నీరు కింద వచ్చేస్తుంది. అవి అక్కడక్కడా ధ్వంసమై ఉన్నాయి.సబ్ డివిజన్ల వారీగా అంచనాలు మట్టికట్టపై జంగిల్ క్లియరెన్స్ కోసం సబ్ డివిజన్ల వారీగా అంచనాలు వేయడం జరిగింది. టెండర్లను పిలిచి వీలైనంత త్వరలోనే పనులు చేపడతాం. నా సబ్డివిజన్ పరిధిలో మూడు బిట్లుగా రూ.5 లక్షల వంతున అంచనాలు రూపొందించడం జరిగింది. – నాగేంద్రబాబు, డీఈ, తెలుగుగంగ -
చందన, సీఎంఆర్లో వీక్లీ డ్రా
నెల్లూరు(బృందావనం): క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా చందన, సీఎంఆర్ ఫెస్టివ్ వండర్స్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా వీక్లీ డ్రా స్కూటీ విజేతగా వి.జితేంద్ర నిలిచారు. అతనికి హీరో ప్లెజర్ స్కూటీని కార్పొరేషన్ ఇన్చార్జి మేయర్ పోలుబోయిన రూప్కుమార్ గురువారం అందజేశారు. అలాగే డైలీ డ్రా విజేతలు 35 మందికి గ్రైండర్, పాన్సెట్, మిక్సీ, రైస్కుక్కర్, డిన్నర్ సెట్లను పంపిణీ చేశారు. డైలీ డ్రా తీసి విజేతలకు రూప్కుమార్ ప్రకటించారు. గ్రైండర్ను ఎ.నాగమణి, పాన్సెట్ను ఎం.భార్గవి, మిక్సీని ఎండీ ఇనాయతుల్లా, రైస్కుక్కర్ను కె.విద్యావతి, డిన్నర్సెట్ను జి.వెంకటేశ్వర్లు గెలుపొందారు. సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పండగల సందర్భంగా ఏడు వారాలపాటు వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి కూపన్స్ ఇచ్చి రోజూ 5 గృహోపకరణాలు, 7 స్కూటీలు, న్యూ ఇయర్కు మలేసియా ట్రిప్, సంక్రాంతికి టాటా టియాగో కారు అందజేస్తున్నామన్నా రు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, శైలేష్, మేనేజర్లు వాసు, కిశోర్ పాల్గొన్నారు. -
కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం
అనుమసముద్రంపేట: మండలంలోని కావలియడవల్లి వద్ద ఉన్న బ్రిడ్జి గురువారం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు మళ్లించినట్లు ఎస్సై సైదులు తెలిపారు. వివరాలు.. హసనాపురం నుంచి కలిగిరి వెళ్లే రహదారిలో కావలియడవల్లి వద్ద కాలువపై ఆర్అండ్బీకి చెందిన బ్రిడ్జి ఉంది. ఇది కూలడంతో కలిగిరి – పామూరుకు వెళ్లే వాహనాలను హసనాపురం, జమ్మవరం, గుంపర్లపాడు మీదుగా మళ్లించారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశముందని తెలిసినా ఆర్అండ్బీ అధికారులు, కూటమి నేతలు పట్టించుకోలేదు. ఆ రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కావలియడవల్లి, అక్బరాబాదు, హసనాపురం వాసులు కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించొద్దు
● సీపీఐ ఆధ్వర్యంలో నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి. దీనిపై పోరాటాలు చేసి జైలుకెళ్లేందుకునైనా సిద్ధంగా ఉన్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్కుమార్ అన్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్లు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని ప్రైవేటీకరించే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరమవుతారన్నారు. ఇంకా పేద ప్రజలకు ఉచిత వైద్యం కూడా అందే పరిస్థితి ఉండదన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్యశాలల్లో ఉద్యోగభద్రత, రిజర్వేషన్ హక్కులు దెబ్బ తింటాయన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, నాయకులు రామరాజు, దామా అంకయ్య, రమణయ్య, మధు, మాలకొండయ్య, సిరాజ్, షాన్వాజ్, వినోదిని తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామంలో చాంపియన్ ఫార్మర్ ఎంపిక
నెల్లూరు(దర్గామిట్ట): సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలోని సచివాలయంలో రెండోరోజు గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లాలో చేపట్టిన చాంపియన్ రైతు ప్రాజెక్ట్పై ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఒక చాంపియన్ ఫార్మర్ను ఎంపిక చేసి మిగిలిన వారికి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. యాంత్రీకరణ పెంచడం, ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించడం, పంటల విలువ జోడింపు లాంటివి చేపట్టామన్నారు. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చూస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యం, యాంత్రీకరణను ప్రోత్సహించేలా కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. విశాఖకు నిమ్మకాయల ఎగుమతి పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డు నుంచి గురువారం విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రికి నిమ్మకాయలను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఎగుమతి చేసినట్టు ఏడీఏ అనితాకుమారి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ విశాఖ మార్కెట్ వ్యాపారులు ఇక్కడి కాయలను నాణ్యతను పరిశీలించి మళ్లీ పంపాల్సిందిగా సమాచారం ఇచ్చారన్నారు. మూడు జిల్లాలకు కలిపి మొత్తం 11 టన్నుల కాయలను ఎగమతి చేశామన్నారు. నెలాఖరు నుంచి ఢిల్లీ మార్కెట్కు కూడా ఇక్కడి వ్యాపారులను ఎగుమతి చేస్తారని, ధరలు మోస్తరుగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు తమ శాఖ పర్యవేక్షణలో అవసరమైన జిల్లాకు కాయలను ఎగుమతి చేస్తామన్నారు. విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి అల్లూరు: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని పురిణి పంచాయతీ తుఫాన్ నగర్ గ్రామంలో గురువారం జరిగింది. అల్లూ రు ఎస్సై శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. ఇందుపూరు గ్రామానికి చెందిన చెప్పల్లి సురేష్ (36) మరో ముగ్గురితో కలిసి తుఫాన్ నగర్లో కొత్తగా కడుతున్న ఓ ఇంటికి సెంట్రింగ్ పనుల నిమిత్తం వెళ్లాడు. 16 అడుగుల బోను పిల్లర్లు పెడుతున్నారు. ప్రమాదవశాత్తు బోను అదుపుతప్పి సమీపంలోని 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దానిని పట్టుకుని ఉన్న సురేష్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సురేష్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. కండలేరులో 60.600 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం 60.600 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,750 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 1,160, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
సోషల్ ఆడిట్ సర్వేను పూర్తి చేయాలి
నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో మౌలిక వసతుల స్థితిగతులను తెలిపే సోషల్ ఆడిట్ సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని డీఈఓ బాలాజీరావు ఆదేశించారు. నెల్లూరు దర్గామిట్టలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో జిల్లాలోని సీఆర్ఎంటీలకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం – మౌలిక సదుపాయాల కల్పనకు సర్వే జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు ఏ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలన్నా సీఆర్ఎంటీల పాత్ర కీలకమన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ డోనర్ యాప్లో ఆయా పాఠశాలలకు ఏ వసతులు కావాలి, వాటిని సమకూర్చే విధంగా దాతల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్బాబు, సీఎంఓ రమణయ్య, డిప్యూటీ డీఈఓ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
21 నుంచి పల్స్పోలియో
నెల్లూరు(అర్బన్): ఈనెల 21 నుంచి జిల్లాలో పల్స్పోలియో కార్యక్రమం జరుగుతుందని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 5 ఏళ్లలోపు వయసున్న 2,94,604 మంది పిల్లల్ని గుర్తించామన్నారు. వారికి 2,396 బూత్ల ద్వారా చుక్కల మందును వేస్తామన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ 403 హైరిస్క్ ప్రాంతాల్లో 82 మొబైల్ బూత్ల ద్వారా బ స్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ఉన్న ప్రాంతాల్లో పోలియో చుక్కలు మందు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విజయవంతం చేయాలని తల్లిదండ్రులను కో రారు. కార్యక్రమంలో జిల్లా టీబీ, ఎయిడ్స్, లెప్రసీ నివారణ అధికారి డా క్టర్ ఖాదర్వలీ, కావలి డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.బ్రిజిత, డీఎంఓ హుస్సేనమ్మ, డీపీ ఎంఓ డా.సునీల్కుమార్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ సు రేంద్ర, డాక్టర్ అమరేంద్రనాథ్రెడ్డి, ఎస్ఓ సహన, డి ప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పోరాటం
వైద్య విద్య ఉచితంగా అందించాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సమంజసం కాదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. – ఇందుప్రియ, బీటెక్, నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకం చేశాను. నాలాంటి పేద విద్యార్థుల భవిష్యత్ కోసం కోటి సంతకాలతో కూడిన ప్రతులను గవర్నర్కు అందజేసినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య అందించాలి. – అన్నవరపు శ్రీశాంత్, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, దగదర్తి● -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నెల్లూరు(క్రైమ్): రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు అధికారులు ఫేస్వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారులపై రోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆపి డ్రైవర్లు ముఖం శుభ్రం చేసుకుంనేందుకు నీళ్లు ఇస్తున్నారు. అనంతరం వారితో కొద్దిసేపు మాట్లాడి జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. రాత్రివేళల్లో ప్రధానంగా నిద్రమత్తు, మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే వాహనాన్ని నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి విశ్రాంతి తీసుకోవాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకుండా రోడ్డుపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను గమనిస్తూ వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని హెచ్చరిస్తున్నారు. -
నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్): స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమో.. సహచర విద్యార్థి వేధింపులో.. మరే ఇతర కారణమో తెలియదు గానీ పదో తరగతి చదువుతున్న ఓ బాలిక నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేటలో గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు... ఫతేఖాన్పేటలో నివసిస్తున్న తిరుపాల్, స్వాతి దంపతులకు నాగచైతన్య, లావణ్య (15) పిల్లలు. తండ్రి ఓ ఎల్రక్టానిక్ షాప్లో సూపర్వైజర్గా, తల్లి ఓ షోరూంలో పనిచేస్తున్నారు. లావణ్య తన ఇంటి సమీపంలోని ప్రియాంక ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పదో తరగతి చదువుతోంది.మూడున్నర నెలల క్రితం అదే పాఠశాలలో చదువుతున్న సహచర విద్యార్థి ఇన్స్ట్రాగామ్లో ఓ మెసేజ్ చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో 15 రోజుల ముందు స్కూల్లో లావణ్య బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఘటనపై యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, దురుసుగా ప్రవర్తించడంతోపాటు సదరు బాలుడికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాలలో పరీక్ష రాసిన అనంతరం ఇంటికెళ్లిన బాలిక చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కళాశాల నుంచి ఇంటికొచ్చి గమనించిన సోదరుడు నాగచైతన్య విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు తెలియజేశాడు. చిన్నబజార్ పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై బాలిక తల్లిదండ్రులు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ కరస్పాండెంట్ను విచారిస్తున్నారు. -
మున్సిపల్ కార్మికులపై విరిగిన లాఠీ
నెల్లూరు (బారకాసు): సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసేశారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయిన కొందరు.. లాఠీచార్జ్లో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందర్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారంతా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడించేందుకు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. మరోవైపు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతోంది. తమ సమస్యలపై వినతిపత్రాన్ని అధికారులకు అందజేయాలనే ఉద్దేశంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝుళిపించడంతో కార్మికులు కిందపడిపోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు తాకరాని చోట తాకుతూ గందరగోళం సృష్టించారు. కార్మికులను ఇష్టానుసారం లాఠీలతో కొట్టారు. సీఐటీయూ నేతలు, కార్యకర్తలతోపాటు అనేకమంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. రక్తగాయాలైన మహిళల్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం 63 మంది కార్మికులు, యూనియన్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి ముత్తుకూరు పోలీస్స్టేషన్కు తరలించారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, కమిషనర్ నందన్, ఇన్చార్జి మేయర్ రూప్కుమార్యాదవ్ వచ్చి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పగా కార్మికులు అంగీకరించలేదు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చివరికి అరెస్ట్ చేసిన వారిని తీసుకొచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద విడిచి పెట్టడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు. -
రెవెన్యూ సదస్సా.. టీడీపీ కార్యక్రమమా?
● ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై తెలుగు తమ్ముళ్లు ఉలవపాడు: మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం రెవెన్యూ సదస్సు జరిగింది. దీనికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ హాజరయ్యారు. నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే స్టేజీపై కూర్చోవాలి. కానీ కూటమి పార్టీల నేతలు కూర్చొని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఉలవపాడు మండల టీడీపీ అధ్యక్షుడు రాచగల్లు సుబ్బారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొల్లి అవినాష్, నాయకుడు బెల్లం కృష్ణమోహన్ కూర్చోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. మరో వైపు రెవెన్యూ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నెలల తరబడి తిప్పుకుంటున్నారని, ఇకనైనా మారండి.. లేకుంటే రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. భర్త మరణించిన తర్వాత భార్య పేరుపై మ్యుటేషన్ చేయడానికి కూడా నెలల తరబడి తిప్పుకుంటున్నారన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే కారణాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్, సర్పంచ్ గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక నేడు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషుల జిల్లా జట్టు ఎంపికలు సంగం మండలం దువ్వూరు గ్రామంలోని కలవకూరి కోటారెడ్డి క్రీడా ప్రాంగణంలో గురువారం జరుగుతాయని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు పి.హరీష్, కార్యదర్శి గంటా సతీష్ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో జరిగే 72వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల పురుషుల కబడ్డీ చాంపియషిప్లో నెల్లూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. 85 కిలోల్లోపు బరువున్న వారు మాత్రమే హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 72785 55777 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. కొనసాగుతున్న నిరసన దీక్షలుసైదాపురం: మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలంటూ సైదాపురంలో బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నేతలు మాట్లాడుతూ ప్రస్తుత విధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సైదాపురం నుంచి తిరుపతికి వెళ్లాలంటే అధిక ప్రయాణ భారం పడుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు గంగాధర్, షఫీ, వివిధ సంఘాల ప్రతినిధులు చెంగల్రావు, అనిల్, పవన్ తదితరులున్నారు. -
32 మంది పిల్లలు.. ఒకరే టీచర్
● వెంకట్రాదిపాళెంలో ఇదీ పరిస్థితి ● తల్లిదండ్రుల ఆవేదనవింజమూరు(ఉదయగిరి): చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. వాటి బాగోగులు పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం పిల్లలకు పాఠాలు చెప్పేందుకు టీచర్లు కూడా లేని పరిస్థితి ఉంది. వింజమూరు మండలంలోని వెంటాద్రిపాళెం ప్రాథమిక పాఠశాలలో 32 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్ ఉన్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు వారే విద్యాబోధన చేయాల్సి ఉంది. దీంతో పిల్లల చదువులు కుంటు పడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్కూల్కు ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులుండాలి. వేసవిలో జరిగిన బదిలీల్లో కిస్తీపురం బడికి చెందిన మాలకొండయ్య ఇక్కడికి బదిలీ అయ్యారు. కొన్నిరోజులు వచ్చారు. అయితే రిలీవర్ రాకపోవడంతో కిస్తీపురంలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో భాగ్యలక్ష్మి అనే తెలుగు అసిస్టెంట్ను (క్లస్టర్ టీచర్) డిప్యుటేషన్ వేశారు. ఆమె వారంలో మూడురోజులు మాత్రమే స్కూల్కు వస్తున్నారు. వెంట్రాదిపాళేనికి రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఆ రోజుల్లో కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. పక్కనే ఉన్న చంద్రపడియలోని ఎంపీపీ స్కూల్లో ఎనిమిది మంది విద్యార్థులుండగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో ఒకరిని డిప్యుటేషన్ వేసి సమస్యను తీర్చాలని వెంటాద్రిపాళెంవాసులు కోరుతున్నారు. ఒకే టీచర్ కావడంతో సెలవు పెడితే డిప్యుటేషన్పై వేరే వారిని పంపుతున్నారు. దీంతో వారు కూడా బోధన సక్రమంగా చేసే పరిస్థితి లేదు. టీచర్ బుధవారం సెలవు పెట్టడంతో హైస్కూల్ క్లస్టర్ నుంచి డిప్యూటేషన్ వేశారు. మండల ఎంఈఓలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయాన్ని బుధవారం నిపుణుల కమిటీ పరిశీలించింది. ప్రస్తుత నీటి నిల్వలు, విడుదల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయంలో 60 టీఎంసీల నీరు ఉండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఆరా తీశారు. అనంతరం హైలెవల్, లోలెవల్ స్లూయీస్, హెడ్రెగ్యులేటర్ను బృందం పరిశీలించింది. హెడ్రెగ్యులేటర్ వద్ద ఉన్న గేట్లు చాలా కాలంగా ప్రెజర్ ఇస్తేనే పైకి లేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం గేట్ల పరిస్థితిని పరిశీలించామని కమిటీ సభ్యులు తెలిపారు. నీరు తగ్గాక మరోసారి చూసి గేట్లు ఎందుకు పైకి రావడం లేదో తెలుసుకుంటామన్నారు. అప్పుడే గేట్లు మార్చాలా?, లేదా మరమ్మతులు చేపట్టాలా అనే విషయం చెప్పగలమన్నారు. ప్రస్తుతం నీరు ఉన్నందున చెప్పడం కష్టంగా ఉందన్నారు. నీరు తగ్గిన తర్వాత లీకేజీ ఎక్కడి నుంచి వస్తుంది?, ఎలా మరమ్మతులు చేపట్టాలో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ కమిటీలో తిరుపతి క్యాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శారద, నెల్లూరు తెలుగుగంగ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ సుబ్రహ్మణేశ్వరావు, ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ నాగేంద్రబాబు, ఏఈ అనిల్ తదితరులున్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● కూలీల సంఖ్య పెంచండి ● డ్వామా పీడీ గంగా భవానినెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పథకం అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ గంగా భవాని హెచ్చరించారు. బుధవారం డ్వామా కార్యాలయంలో క్లస్టర్ ఏపీడీలు, వివిధ మండలాల ఏపీఓలతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు గుర్తించి వాటిని జాబ్కార్డులు కలిగిన కూలీల చేత పూర్తి చేయించాలన్నారు. సోషల్ ఆడిట్ రికవరీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజూ ఆయా పంచాయతీల్లో జరుగుతున్న పనులను పరిశీలించాలన్నారు. ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. కూలీల సంఖ్య పెంచే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. స మావేశంలో అడిషనల్ పీడీ స్వరూప్ పాల్గొన్నారు. -
15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● పోలీసుల ముమ్మర తనిఖీలు నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వేలిముద్రలను పరిశీలించారు. నేర చరిత్ర లేదని తేలిన అనంతరం వారిని విడుదల చేశారు. రాత్రివేళల్లో అకారణంగా ఎవరైనా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లో గస్తీని పెంచారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 106 మంది వాహనదారులపై ఈ చలానాలు వేసి రూ.66,871 ఫైన్ విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 15 కేసులు పెట్టారు. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు పాల్గొన్నారు. -
తమిళనాడు నుంచి జిల్లా జలాల్లోకి బోట్లు
● సీఎంకు తెలిపిన కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): ‘తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లాలోని సముద్ర జలాల్లోకి అక్రమంగా బోట్లు వస్తున్నాయి. అవి రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా సీఎం చంద్రబాబును కోరారు. సీఎం ఆధ్వర్యంలో బుధవారం అమరావతిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్కు హిమాన్షు శుక్లా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పాండిచ్చేరి, కారైకల్ నుంచి వచ్చిన రెండు బోట్లను జువ్వలదిన్నె తీర ప్రాంతం వద్ద పట్టుకుని సీజ్ చేశామన్నారు. కొంతకాలం తర్వాత మరో రెండు బోట్లు రావడంతో వాటిని కూడా పట్టుకుని కేసులు పెట్టామన్నారు. తరచూ బోట్లు రావడం స్థానిక మత్స్యకారులకు ఇబ్బందిగా మారిందన్నారు. అలాగే వారికి ఉపాధి అవకాశాల కల్పనకు వివధ చర్యలను వివరించారు. ఖరీఫ్ సీజన్లో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాలని టార్గెట్ ఇచ్చారన్నారు. అయితే మిగిలిన జిల్లాలతో నెల్లూరును పోల్చుకుంటే ఇక్కడ ముందస్తు రబీ, లేట్ ఖరీఫ్ ఉంటుందన్నారు. అక్టోబర్ నెలలో 10,214 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిగిలింది లేట్ ఖరీఫ్లో కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. -
20న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
నెల్లూరు(టౌన్): 2025 – 26కు సంబంధించి జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈనెల 20వ తేదీన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో నిర్వహించనున్నారు. ఇది ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా మండలానికి 3 ఎగ్జిబిట్స్ లెక్కన 114 ఎగ్జిబిట్స్ను విద్యార్థులు, టీచర్లు ప్రదర్శించనున్నారు. వ్యక్తిగత, గ్రూపు, టీచర్స్ విభాగాల్లో ప్రదర్శన ఉంటుంది. అత్యుత్తమ ప్రతిభ చూపిన గ్రూపు విభాగంలో 7, టీచర్స్ విభాగంలో 2, విద్యార్థి విభాగంలో 2 ఎగ్జిబిట్స్ను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఈనెల 23, 24 తేదీల్లో విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో జరుగుతుంది. కాగా జిల్లా స్థాయి కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూఖ్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, జేసీ వెంకటేశ్వర్లు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు మిగిలిన ప్రజాప్రతినిధులు, డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య హాజరుకానున్నారు. బుధవారం జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి మాట్లాడుతూ ఆరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర స్థాయికి ఎంపికన వారికి బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రదర్శనకు సంబంఽధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
అసంబద్ధంగా జిల్లా పునర్విభజన
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: అసమర్థుడు అధికారంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దానికి సీఎం చంద్రబాబు చేపట్టిన జిల్లాల పునర్విభజన నిర్ణయం ఉదాహరణగా నిలుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. కలువాయి మండలాన్ని జిల్లాలోనే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలోకి కాకాణికి పార్టీ నేతలు బుధవారం విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడారు. లేని సమస్యలను సృష్టించి ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతో రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను జిల్లా నుంచి విడగొట్టడంపై మండిపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డితో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లాలో కలుపుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ హామీలను గుప్పించారని, అయితే దాన్ని అమలు చేయకపోగా, జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చడం దారుణమని చెప్పారు. ఈ దుర్మార్గపు నిర్ణయాలు భావితరాలకు శాపాలుగా మారనున్నాయని తెలిపారు. ఈ మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చడంతో అక్కడి ప్రజలు తమ అస్థిత్వాన్ని కోల్పోతారని, జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్లు వెళ్లాలంటే ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. జిల్లా రైతాంగంతో సాగునీరు, రెవెన్యూపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయన్నారు. సర్వేపల్లి రైతులకు కష్టాలు తప్పవు ప్రజా సమస్యలను తెలియజేసేందుకు ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని గత సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లాల పునర్విభజనలో స్థానిక ప్రజల సమస్యలను ఆనాడు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి వాటిని జిల్లాలోనే కొనసాగించారని తెలిపారు. జిల్లా నుంచి ఈ మండలాలు విడిపోతే సర్వేపల్లి రైతులకు సాగునీటి కష్టాలు తప్పవన్నారు. నియంతలా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నోరుమెదపడం లేదని విమర్శించారు. జిల్లా ప్రజలకు తీరని ద్రోహం లేఖలు రాస్తూ మభ్యపెట్టేందుకు సోమిరెడ్డి యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చిన విధంగా, గూడూరు ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార పార్టీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాలను విడిచి, జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు వద్ద తమ గళం వినిపించాలని కోరారు. -
అధికారం అండ.. తమ్ముళ్ల దందా
వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ వెంటాద్రిపాళెంలో విలువైన భూమిని అధికార పార్టీ అండతో స్వాహా చేసేందుకు ఓ వ్యక్తి యత్నిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా.. ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పడు కాకుండా ఇందులో పనులు చేపడుతున్నారు. తాజాగా ఆక్రమణ పర్వం బుధవారం మరోసారి జరుగుతుండటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదీ నేపథ్యం.. వెంకటాద్రిపాళెంలోని సర్వే నంబర్ 233 – 1, 233 – 2లో గల 11.55 ఎకరాల్లో 0.5 సెంట్ల చొప్పున 80 మందికి ఇళ్ల పట్టాలను 1994లో అప్పటి ప్రభుత్వం అందజేసింది. కొంత భూమిని గ్రామావసరాల కోసం ఉంచారు. మరోవైపు పక్కా గృహాలను సర్కార్ మంజూరు చేయకపోవడంతో అక్కడ నిర్మాణాలను చేపట్టలేదు. ఇది వింజమూరు – గుండెమడకల ప్రధాన తారు రోడ్డును ఆనుకొని ఉండటంతో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ రూ.30 లక్షల వరకు ఉంది. దీంతో టీడీపీకి చెందిన ఓ వ్యక్తికి కన్ను దీనిపై పడింది. బోగస్ పట్టాలు సృష్టించి.. గ్రామానికి చెందిన బత్తుల భూదేవమ్మ పేరుతో 3.77.. బత్తుల మంగమ్మ పేరుతో 4.90 ఎకరాలకు 2010లో డీ ఫారాలున్నాయి. వీటిని రికార్డుల్లో 2018లో అప్పటి తహసీల్దార్ శ్రీరాములు గుట్టుచప్పడు కాకుండా నమోదు చేశారు. విషయం తెలియడంతో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు షాక్కు గురయ్యారు. బోగస్ పట్టాలను సృష్టించి భూమిని కాజేస్తున్నారంటూ అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి ఆత్మకూరు ఆర్డీఓ బాపిరెడ్డి విచారణ జరపగా, 47 బోగస్ పట్టాలను మ్యూటేషన్ చేశారని తేలడంతో తహసీల్దార్ శ్రీరాములును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ సుధాకర్.. బోగస్ పట్టాల ద్వారా నమోదైన పేర్లను తొలగించగా, ఈ రెండు పేర్లను మాత్రం పట్టించుకోలేదు. ఇదే విషయమై నాటి నుంచి గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. బోర్డు పెట్టారు.. పీకేశారు గతేడాదిలో టీడీపీ అధికారంలోకి రావడంతో భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. వివాదాస్పద భూమిలో ఎవరూ ప్రవేశించకూడదనే బోర్డును అధికారులు పెట్టినా, దాన్ని తొలగించి మరీ తమ పనిని అక్రమార్కులు కానిస్తున్నారు. దాదాపు 20 రోజుల క్రితం జేసీబీతో చెట్లను రాత్రి వేళ తొలగిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి బుధవారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయమై వీఆర్వో రవితేజను సంప్రదించగా, ఇళ్ల స్థలాలకు పట్టాలను ఇచ్చారని కొందరు.. డీ ఫారం పట్టాలిచ్చారని మరికొందరు చెప్తున్నారని.. వివాదం జరగడంతో ఇరువర్గాలకు సర్దిచెప్పామని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని బదులిచ్చారు. విలువైన భూమికి ఎసరు స్వాహా చేసేందుకు వ్యక్తి యత్నం అడ్డుకున్న స్థానికులు చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు గ్రామంలో ఉద్రిక్తత బోగస్ పట్టాలు సృష్టించారు బోగస్ పట్టాలను 2018లో పాత తేదీలతో సృష్టించి పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అప్పటి ఆర్డీఓ విచారణ జరిపి ఇదే విషయాన్ని గుర్తించినా, రికార్డుల్లో పేర్లను తొలగించలేదు. టీడీపీ ప్రభుత్వం రావడంతో ఎమ్మెల్యే పేరు చెప్పి భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకుంటున్న గ్రామస్తులను బెదిరిస్తున్నారు. – రత్తయ్య -
మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన
● కార్పొరేషన్ కార్యాలయ ఎదుట వంటావార్పు నెల్లూరు(బారకాసు): తమ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో పారిశుధ్య కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్మికులు ఉదయం ఆరింటికే కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వంటావార్పు అనంతరం అక్కడే భోజనాలు చేశారు. నిరసనలో భాగంగా కోలాట ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం 44 రోజులుగా ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో సమ్మె చేపట్టిన 14 రోజులకు సంబంధించిన వేతనాల విషయమై మంత్రి నారాయణతో చర్చలు జరిపిన అనంతరం వీటిని అందిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, కమిషనర్ ప్రకటించారని, అయితే నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు పట్టించుకోవడంలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 136 మంది కార్మికులను 60 ఏళ్లు నిండాయనే కారణంతో అర్ధాంతరంగా ఇళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యలను ఇప్పటికై నా పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రకటించారు. నేతలు కత్తి శ్రీనివాసులు, పెంచలనరసయ్య, సుధాకర్, సూరినారాయణ, చైతన్య, నరసింహ, రాజా, అశోక్, దేశమూర్తి, సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇదీ జరిగింది..
పలు సెటిల్మెంట్లలో ఎమ్మెల్యే సురేష్ జోక్యం జలదంకి మండలం గట్టుపల్లిలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్నాయుడి హత్యోదంతం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు తలనొప్పిగా మారింది. అదే గ్రామంలో ఓ మామిడి తోట సెటిల్మెంట్లో ఈయన జోక్యంపై పలు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హత్య కేసులో శాసనసభ్యుడి పాత్రపై విచారణ కోరుతూ ఎస్పీ అజితా వేజెండ్లకు సదాశివరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా టీడీపీ అధిష్టానం సైతం ఆరాతీస్తోందని సమాచారం. మొత్తమ్మీద ఈ ఉదంతాలు ఎమ్మెల్యే వర్గీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. జలదంకి మండలం గట్టుపల్లిలో 88 ఎకరాల మామిడి తోటపై ఏలూరు జిల్లా ధర్మాజీగూడేనికి చెందిన గారపాటి సదాశివరావు.. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన తలశిల వెంకటనరసింహరావు మధ్య భూ వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలూ ఉన్నాయి. ఈ క్రమంలో సదరు భూమిలో నరసింహరావు గతేడాదిలో ప్రవేశించడం.. సదాశివరావును కిడ్నాప్ చేయడం.. దీనిపై స్థానికంగా కేసు నమోదు కావడం చకచకా జరిగాయి. ఈ ఉదంతంలో సదాశివరావుకు గట్టుపల్లికి చెందిన గొట్టిపాటి ప్రసాద్నాయుడు అండగా ఉన్నారు. దీంతో సదరు తోటను దక్కించుకోవడం నరసింహరావుకు కుదరలేదు. గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ ఆధికారంలోకి రావడంతో ఎమ్మెల్యేను వెంకటనరసింహరావు ఆశ్రయించారు. ఈ క్రమంలో సెటిల్మెంట్కు తన సోదరుడు కాకర్ల వెంకట్ను ఎమ్మెల్యే పురమాయించారనే ప్రచారం ఉంది. సాక్షి టాస్క్ఫోర్స్: కాకర్ల సురేష్.. ఉదయగిరి ప్రజలకు మూడేళ్ల క్రితం వరకు పరిచయం లేని పేరు. నారా లోకేశ్ ఆశీస్సులతో కాకర్ల ట్రస్ట్ పేరుతో ఈ గడ్డపై కాలు మోపి రాజకీయ పండితులు ఊహించని విధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ను సాధించి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు షాక్ ఇచ్చారు. ఎలక్షన్లో విజయం సాధించాక.. తనకు అడ్డొచ్చే సొంత పార్టీ వారిని ముందుగానే గుర్తించి అణిచేశారు. దీంతో స్వపక్షంలోనే ఆయనపై తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. మరోవైపు ఎమ్మెల్యే సురేష్, ఆయన ముఖ్య అనుచరుల కనుసన్నల్లో పలు సెటిల్మెంట్లు, వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలొచ్చాయి. ఫిర్యాదు.. ప్రకంపనలు ఈ తరుణంలో ఈ ఏడాది మేలో నరసింహరావు తన అనుచరులతో వచ్చి తోటను ఆక్రమించారు. దీనిపై స్థానిక పోలీసులను భూ యజమాని సదాశివరావు ఆశ్రయించగా, ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే ఉన్నారని, వారితో సెటిల్ చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఎమ్మెల్యే సోదరుడు వెంకట్ను సంప్రదించగా, సానుకూల స్పందన రాలేదు. భూమిని విక్రయించాలని, రూ.15 కోట్ల విలువజేసే దీన్ని రూ.2.3 కోట్లుకు అమ్మిపెడతానని చెప్పారు. దీంతో తన భూమి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని గ్రహించి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల క్రమంలో సదాశివరావుకు మద్దతుగా ఉన్న గొట్టిపాటి ప్రసాద్నాయుడ్ని కిరాయి హంతకుల ద్వారా నరసింహరావు గత నెల 26న హత్య చేయించారు. ఈ వ్యవహారంలో పోలీసులు, ఎమ్మెల్యే, కొంతమంది స్థానికుల పాత్ర ఉందనీ, పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరుతూ ఎస్పీకి సదాశివరావు ఫిర్యాదు చేశారు. వీరి ద్వారా తన ప్రాణాలకు హాని పొంచి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని కూల్చి.. ఆపై ఆక్రమించి వింజమూరు బంగ్లా సెంటర్లో రూ.1.5 కోట్ల విలువజేసే ఓ భవనాన్ని అక్రమంగా కూల్చి, దౌర్జన్యంగా ఆక్రమించడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. దీంతో భవన యజమానురాలు రోడ్డున పడ్డారు. అగ్రిగోల్డ్ సంపద స్వాహా పర్వంలోనూ శాసనసభ్యుడి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని కొన్ని విలువైన ప్రభుత్వ భూములను చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే అంశమై అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఈ వరుస ఘటనలతో సొంత క్యాడర్లోనే ఎమ్మెల్యే గ్రాఫ్ మసకబారుతోంది. వత్తాసు పలుకుతున్న స్థానిక పోలీస్ యంత్రాంగం సంచలనంగా మారిన టీడీపీ నేత ప్రసాద్నాయుడి హత్య శాసనసభ్యుడి పాత్రపై విచారణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు ఆరాతీస్తున్న టీడీపీ అధిష్టానం సొంత క్యాడర్లోనే మసకబారుతున్న గ్రాఫ్ -
నిధుల దుర్వినియోగంపై విచారణ నేడు
వింజమూరు (ఉదయగిరి): మండలంలోని కాటేపల్లి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణను కందుకూరు డీఎల్పీఓ గురువారం జరపనున్నారని డిప్యూటీ ఎంపీడీఓ రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించనున్నారని చెప్పారు. నిధులను దుర్వినియోగం చేసిన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు చేపట్టడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వైనంపై ‘లక్షలు మింగేసి.. లక్షణంగా’ అనే శీర్షికన కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. జాబ్ మేళా రేపు నెల్లూరు(పొగతోట): ముత్తుకూరులోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్లో జాబ్మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 పరిశ్రమల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 86398 67407, 87126 55686 నంబర్లను సంప్రదించాలని సూచించారు. యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు నెల్లూరు(పొగతోట): యూరియాకు కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను మళ్లించినా ఏజెన్సీల లెసెన్స్లను రద్దు చేసి ఎరువుల నియంత్రణ చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 31 నాటికి 52,902 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 52,173 మేర అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరుకు ఆరు వేల టన్నులు రానున్నాయని వెల్లడించారు. కౌన్సిల్ అత్యవసర సమావేశం నేడు నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య అత్యవసర సమావేశాన్ని గురువారం ఉదయం 10.30కు నిర్వహించనున్నామని కమిషనర్ (ఎఫ్ఏసీ) శ్రీలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కౌన్సిల్ సమావేశాన్ని గురువారం నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత శనివారం ప్రకటించారు. ఆపై తన ప్రతినిధుల ద్వారా రాజీనామా లేఖను ఆదివారం పంపగా, దాన్ని కలెక్టర్ ఆమోదించారు. దీంతో అవిశ్వాస తీర్మానం కోసం నిర్ణయించిన కౌన్సిల్ మీట్ కాస్త సాధారణ సమావేశమైంది. మరోవైపు దీన్ని ఎవరో ఒకరి అధ్యక్షతన జరపాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ను ఇన్చార్జి మేయర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్రవంతి రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు. ఆపై లేఖను రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారికి కార్పొరేషన్ అధికారులు పంపనున్నారు. పరిశీలన అనంతరం తదుపరి మేయర్ ఎన్నికను ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం ఎన్నికల కమిషన్పై ఆధారపడి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇన్చార్జి మేయర్గా రూప్కుమార్యాదవ్ కొనసాగనున్నారు. అయితే దీన్ని జారీ చేస్తారా.. లేక ఆయన్నే కొనసాగించాలంటూ ఉత్తర్వులు విడుదలవుతాయాననే అంశం తెలియాల్సి ఉంది. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 63,738 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,746 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ప్రసన్నను కలిసిన మావులూరు
నెల్లూరు రూరల్: వైఎసార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మావులూరు శ్రీనివాసులురెడ్డి.. మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని నెల్లూరులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, నాయకులు అంగా ఫకీరయ్య పాల్గొన్నారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బీద రవిచంద్ర?నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్కు వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవకాశం కల్పించారు. ఆయన స్థానంలో రవిచంద్రకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. గతంలో రవిచంద్రకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పెంచలయ్య హత్య కేసులో మరొకరి అరెస్ట్నెల్లూరు సిటీ: ప్రజా నాట్యమండలి కళాకారుడు, సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో మరో నిందితుడైన అరవ కామాక్షి సోదరుడు అరవ పెంచలయ్యను మంగళవారం నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించారు. పూరిల్లు దగ్ధం ● రూ.2.50 లక్షల ఆస్తి నష్టం తోటపల్లిగూడూరు: విద్యుదాఘాతంతో పూరిల్లు దగ్ధమై రూ.2.50 లక్షల ఆస్తి నష్టం జరిగిన ఘటన పాతపట్టపుపాళెంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. కోడూరు పంచాయతీ పాతపట్టపుపాళెం గ్రామానికి చెందిన కోడూరు శారదమ్మ కూలీ పనులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ జరిగి పూరింట్లో మంటలు చెలరేగాయి. కళ్ల ముందే జరిగిన ఘటనతో తేరుకున్న కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే పూరిల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. ఈ ప్రమాదంలో కొంత నగదు, ఇంటి సామగ్రితో కలిసి సుమారు రూ.2.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ శారదమ్మ కోరింది. విజయవాడ వెళ్లిన కలెక్టర్ నెల్లూరు(దర్గామిట్ట): విజయవాడలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం వెళ్లారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ చర్చించనున్నారు. డీఈఓ కార్యాలయానికి పిలుపు?వింజమూరు(ఉదయగిరి): మండలంలోని జనార్దనపురం పాఠశాల ఉపాధ్యాయుడు ఆవుల రాజు, ఎంఈఓ 2 మధుసూదన్ను విచారణ నిమిత్తం డీఈఓ కార్యాలయానికి పిలిచినట్లు సమాచారం. ఆదివారం పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన డీఈఓ బాలాజీరావు.. డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ను విచారణాధికారిగా నియమించారు. ఆదివారం ఆయన విచారణ చేసి నివేదికను డీఈఓకు పంపారు. ఈ క్రమంలో బుధవారం ఆ ఇద్దరిని విద్యాశాఖ కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిచినట్లు సమాచారం. చేపల గుంతలపై జేడీ సమీక్ష సంగం: సంగం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం మత్స్యశాఖ జేడీ శాంతి చేపల గుంతలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అనుమతుల్లేకుండా వేసిన చేపల గుంతలను తొలగించాలని, అదేవిధంగా అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సోమ్లానాయక్, ఎస్సై రాజేష్, విద్యుత్ శాఖ ఏఈ మన్మథరావు, మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. -
‘కోటి సంతకాలు’ విజయవంతంపై కృతజ్ఞతలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలియజేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితతో కలిసి విలేకరుల సమావేశంలో కాకాణి మంగళవారం మాట్లాడారు. నాడు ఎంతో ఉన్నతాశయంలో 17 మెడికల్ కళాశాలలకు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని, అయితే వీటిలో పదింటిని ప్రైవేటీకరించేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పూనుకున్నారని ఆరోపించారు. దీనికి నిరసనగా కోటి సంతకాలను సేకరించామని, వీటిని గవర్నర్కు అందజేయనున్నామని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రజాప్రయోజనాల కంటే తన స్వార్థమే ముఖ్యమని విమర్శించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని, అయినా ప్రజలు ముందుకొచ్చి విజయవంతం చేశారని చెప్పారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నిర్వహించిన ర్యాలీలకు ప్రజలు భారీగా హాజరై సక్సెస్ చేశారని వివరించారు. టీడీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు నగరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి అశేష జనవాహిని తరలివచ్చిందన్నారు. తమ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, అనేక అడ్డంకులను పోలీసులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలను విస్మరించి, అధికార పార్టీ నేతలకు ఖాకీలు కొమ్ముకాస్తున్నారని, టీడీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదనేందుకు నెల్లూరులో నిర్వహించిన ర్యాలీనే నిదర్శనమని తెలిపారు. జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఏడు లక్షల సంతకాలను సేకరించామని వెల్లడించారు. అందరి సహకారంలోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. నిరసనను తెలియజేస్తూనే ఉంటాం టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనను తమ పార్టీ తెలియజేస్తూనే ఉంటుందని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అధికారం లేకపోతే ప్రజల మధ్య టీడీపీ ఎప్పుడూ ఉండదని చెప్పారు. పార్టీలకతీతంగా ప్రతి ఇంటి నుంచీ తరలివచ్చి తమ వ్యతిరేకతను సంతకాల రూపంలో తెలియజేశారన్నారు. మాటకు కట్టుబడే నేత జగన్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నేత జగన్మోహన్రెడ్డి అని పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వలాభం కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ఆ తర్వాత మరోలా మాట్లాడటం ఆయన నైజమని విమర్శించారు. అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. కాకాణి పూజిత మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేసేందుకు అవకాశంగా ప్రజలు ఉపయోగించుకున్నారని చెప్పారు. నెల్లూరులో నిర్వహించిన ర్యాలీ ప్రభుత్వ వైఫల్యానికి.. వారిపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు. -
ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చర్యలు
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు, ప్రజా జీవనానికి భంగం కల్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం గంజాయి విక్రయ కేసులో అరెస్ట్ అయిన సిరాజ్, జమీర్, కల్లూరుపల్లిలో జరిగిన ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో నిందితుడు అరవ పెంచలయ్యను పోలీసు అధికారులు నెల్లూరులోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు రోడ్డుపై నడిపించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, నిల్వలు, అక్రమ రవాణా, చీకటి కార్యకలాపాలపై సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సంతపేట, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్లు వైవీ సోమయ్య, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. గరుడ వాహనంపై నృసింహుని చిద్విలాసం రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఉన్న పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం రాత్రి బంగారు గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. స్వాతి నక్షత్రం కావడంతో మూలమూర్తిని చందనంతో అలంకరించారు. వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో శాంతి హోమం చేశారు. మధ్యాహ్నం అన్నదానం జరిగింది. రాత్రి బంగారు గరుడ వాహనంపై శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి క్షేత్రోత్సవం నిర్వహించారు. ఉభయకర్తలుగా పెంచల నరసింహప్రసాద్ నాయుడు, పద్మావతి వ్యవహరించారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసులురెడ్డి, ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలస్వామి, భక్తులు పాల్గొన్నారు.నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలిసైదాపురం: సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ ఉమ్మడి కార్యాచరణ కమిటీ కన్వీనర్ డీపీ పోలయ్య అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నేతలు మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఆ మండలాలను నెల్లూరులోనే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఎస్కే గంగాధర్, ఎస్కే రఫీ, సభ్యులు పాల్గొన్నారు. దూరం పెరిగింది.. ఎందుకో? ఉదయగిరి: కావలి నుంచి సీతారామపురం వరకు జరుగుతున్న జాతీయ రహదారి రోడ్డు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో హైవేపై కొన్నిచోట్ల వివిధ ప్రాంతాల దూరం తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దుత్తలూరులోని ఫ్లై ఓవర్ కింద భాగంలో ఏర్పాటు చేసిన బోర్డులో దుత్తలూరు నుంచి వింజమూరు దూరం 25 కిలోమీటర్లుగా నమోదు చేశారు. కానీ వాస్తవ దూరం 20 కి.మీ. గతంలో రోడ్లు భవనాల శాఖ అఽధికారులు ఏర్పాటు చేసిన బోర్డులో కూడా 20 కి.మీ దూరంగా ఉంది. వాస్తవంగా బైక్లు, కార్లు ఇతర వాహనాల మీటరు రీడింగ్ చూసినా అంతే దూరం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో 5 కి.మీ దూరం ఎందుకు పెంచారో అని వాహనచోదకులు చర్చించుకుంటున్నారు. -
జిల్లాలో ఇలా..
● జిల్లాలో పదో తరగతికి నూరు రోజుల ప్రణాళిక అమలు ● మానిటరింగ్కు ఇన్చార్జీల ఏర్పాటు ● ఇతర శాఖల్లో పనిచేసే వారికి బాధ్యతలు ● జిల్లాలోని 38 మండలాలకు 38 మంది ● రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారుల అనధికార ఆదేశాలు ● సంబంధంలేని వ్యక్తుల నియామకంపై వ్యతిరేకత ఇన్చార్జీలను నియమించడమేమిటి..? విద్యారంగంపై ఇతర శాఖల పెత్తనమేమిటి. నూరు రోజుల కార్యక్రమ పర్యవేక్షణకు ఇలా వేరే వారిని నియమించడం సహేతుకుం కాదు. ఇది ఉపాధ్యాయుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగునకు టీచర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తుండగా, పర్యవేక్షణ పేరుతో భయాందోళనలకు గురిచేయడం తగదు. – మోహన్దాస్, రాష్ట్ర నేత, ఏపీటీఎఫ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నాం నూరు రోజుల ప్రోగ్రామ్ ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుంది. కార్యక్రమ పర్యవేక్షణకు ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓ ఉన్నారు. అయితే ఇతర శాఖల వారిని ఇన్చార్జీలుగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. – చలపతిశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు పదో తరగతిలో నూరు రోజుల కార్యక్రమ అమలుకు ఇన్చార్జీలను నియమించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని ఆయా పాఠశాలలకెళ్లి రోజూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇన్చార్జీలకు సహకరించాల్సిందే. పదో తరగతిలో 100 శాతం ఫలితాలే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. – బాలాజీరావు, డీఈఓ తరగతి గదిలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడెలాంటి ఆదేశాలు జారీ చేస్తారో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికే రకరకాల యాప్ల నమోదుతో హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటుండగా, తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో నూరు రోజుల ప్రణాళికను విధిగా అమలు చేయాలని సర్కార్ ఆదేశించింది. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవుల్లోనూ తరగతులను నిర్వహించాలని పేర్కొనడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాలోని 38 మండలాలకు ఒకరు చొప్పున ఇన్చార్జీలను కలెక్టర్ హిమాన్షు శుక్లా నియమించారు. విద్యాశాఖతో సంబంధం లేని ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులను అపాయింట్ చేయడంపై టీచర్లు గుర్రుగా ఉన్నారు.Planningనెల్లూరు (టౌన్): పదో తరగతికి సంబంధించి అమలు చేస్తున్న నూరు రోజుల ప్రణాళిక గందరగోళానికి దారితీస్తోంది. విద్యాశాఖతో సంబంధంలేని వ్యక్తుల నియామకం అగ్గిని రాజేస్తోంది. ఈ ఆదేశాలపై ఆ శాఖలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియ మొత్తం ఇన్చార్జీల కనుసన్నల్లో జరగనుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ మొదలుకొని స్లిప్ టెస్ట్, మార్కుల నమోదు, రిజిస్టర్ల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు.. ఇలా అన్నింటినీ పబ్లిక్ పరీక్షల ప్రారంభం వరకు ఇన్చార్జిలే పర్యవేక్షించనున్నారు. ఇన్చార్జీలుగా ఇతర శాఖల అధికారులు రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, వైద్య, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, ఇరిగేషన్, జీఎస్డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్, వెటర్నరీ తదితర శాఖల్లో పనిచేస్తున్న అధికారులను ఇన్చార్జీలుగా నియమించారు. వీరంతా వారి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకెళ్లి పదో తరగతిలో ప్రణాళిక అమలు అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. స్లిప్ టెస్ట్లు, ఉపాధ్యాయుల హాజరు, పదిలో షైనింగ్.. రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలను బోధిస్తున్నారాననే అంశాన్ని రోజూ పర్యవేక్షించాలి. ఉపాధ్యాయుల హాజరు నమోదు, సబ్జెక్ట్ టీచర్లొస్తున్నారా, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తున్నారాననే అంశాన్ని మానిటర్ చేయాల్సి ఉంది. వీరి పర్యవేక్షణపై మండిపాటు ఇతర శాఖల అధికారులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ప్రతి మండలానికీ ఎంఈఓ – 1, 2లున్నారు. వీరితో పాటు నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు ప్రాంతాల్లో డిప్యూటీ డీఈఓలతో పాటు ప్రతి పాఠశాలకూ హెడ్మాస్టర్ ఉన్నారు. ప్రణాళిక అమలు పర్యవేక్షణకు వీరున్నప్పుడు ఇతర శాఖల అధికారులను ఇన్చార్జీలుగా నియమించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరిని అపాయింట్ చేయడం తమను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, రికార్డులు, పది సిలబస్పై వీరికి ఏ మేరకు అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ నూరు రోజుల పాటు సదరు ఇన్చార్జీలు తమ శాఖలో జరిగే పనులను మాని.. దీన్ని పర్యవేక్షిస్తారాననే అనుమానాలూ తలెత్తుతున్నాయి. జిల్లాలో 393 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 16 వేల మందికిపైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 16 ఉంచి నిర్వహించనున్నామంటూ షెడ్యూల్నూ ప్రకటించారు. ఈ తరుణంలో ఈ నెల ఆరు నుంచి నూరు రోజుల ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించారు. దీని అమలును పర్యవేక్షించేందుకు గానూ మండలానికో ఇన్చార్జీని నియమించాలని రాష్ట్ర పాఠశాల శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో వీరిని నియమిస్తూ ఉత్తర్వులను కలెక్టర్ విడుదల చేశారు. -
పల్లె సీమల్లో రెవెన్యూ చిచ్చు
● పేట్రేగిపోతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ● రైతు పొలంలో దౌర్జన్యంగా దారి ఏర్పాటు ● కోర్టు ఆదేశాలున్నా, పట్టించుకోని అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్: అధికార యంత్రాంగం నోరు మెదపకపోతుండటంతో పచ్చని పల్లె సీమల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. జిల్లాలోని సైదాపురం మండలంలో గల ఓ రైతు పొలంలో దారిని దౌర్జన్యంగా వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మండలంలోని గిద్దలూరుకు చెందిన రైతు కొండా లక్ష్మణరెడ్డికి సర్వే నంబర్ 578లో ఎకరా 65 సెంట్ల భూమి ఉంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితో సదరు భూమిలో దారి వేసేందుకు పలుమార్లు యత్నించారని రైతు చెప్పారు. తనకు న్యాయం చేయాలంటూ వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు విన్నవించుకున్నానని తెలిపారు. కోర్టును ఆశ్రయించగా, రైతు అనుమతి లేకుండా దారి వేయొద్దనే ఉత్తర్వులను పొందామని వివరించారు. ఈ క్రమంలో నోటీసులను సైతం ఇవ్వకుండా దారి వేసేందుకు కొలతలు తీసేందుకు స్థానిక అధికారులు సోమవారం వచ్చి, ట్రాక్టర్తో దున్నేందుకు యత్నించారన్నారు. ఈ క్రమంలో రైతు కుటుంబసభ్యులు, మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతలకు అడ్డొచ్చిన మహిళలపై దౌర్జన్యం చేసి పక్కకు నెట్టేశారు. చివరికి పొలం మధ్యలో దారిని మంగళవారం వేశారు. రెవెన్యూ అధికారుల తీరుతో ఇరువర్గాల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మండలంలోని పాలూరులో దళితులు, భూస్వాముల మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. వీటిలో అధికార పార్టీ నేత జామాయిల్ సాగు చేపట్టారని, ఈ విషయంలోనూ పచ్చ నేతలకే రెవెన్యూ అఽధికారులు జై కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
● వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో మంగళవారం ఎన్ఎస్ఎస్ విభాగం, నోవా బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో వీఎస్యూ కళాశాల, అనుబంధ రావూస్, ఆదిత్య, కృష్ణచైతన్య, డీఆర్డబ్ల్యూ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటాన్ని మించిన పుణ్యకార్యం మరొకటి లేదన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్శంకర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ బీవీ సుబ్బారెడ్డి, నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
20.95 కిలోల గంజాయి స్వాధీనం
● నలుగురు పాత నేరస్తుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రేతల ఇంటిపై సంతపేట పోలీసులు మంగళవారం దాడి చేసి 20.95 కిలోల గంజాయి, నగదును స్వాధీనం చేసుకున్నారు. సంతపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్స్పెక్టర్ సోమయ్య మంగళవారం వెల్లడించారు. నగరంలోని కపాడిపాళెంలో గల రాయపువీధిలో నివాసం ఉంటున్న ముంతాజ్కు సిరాజ్, జమీర్, పాషుర్ కుమారులు. ఒడిశా, విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున గంజాయిని నెల్లూరుకు తీసుకొచ్చి వీటిని చిన్న పొట్లాలుగా మార్చి నగరంలో విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. గతంలో ముంతాజ్తో పాటు సిరాజ్, జమీర్, కోడలు సుభానీపై పీడీ యాక్ట్ను ఎస్ఈబీ, సంతపేట పోలీసులు ప్రయోగించారు. అయినా వీరి తీరులో మార్పురాలేదు. గంజాయి విక్రయాలు సాగిస్తున్నారనే సమాచారం ఇన్స్పెక్టర్కు అందింది. ఎస్సై బాలకృష్ణ, సిబ్బందితో కలిసి ముంతాజ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న 20.950 కిలోల గంజాయిని, రూ.5,600ను స్వాధీనం చేసుకొని.. ముంతాజ్, ఆమె కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభానీని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పాషుర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ 6,28,500 ఉంటుందని చెప్పారు. -
రేషన్ బియ్యం స్వాహాపై కొలిక్కిరాని విచారణ
ఉదయగిరి: స్థానిక పౌరసరఫరాల గోదాములో రూ.కోటి విలువజేసే సరుకుల మాయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సివిల్ సప్లయ్స్ జిల్లా డీఎం అర్జున్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అందులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా విచారణ జరుగుతున్నా, పూర్తి వివరాలను ఇప్పటికీ వెల్లడించలేదు. కాలయాపన చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో నిందితులను కోర్టులో బుధ, గురువారాల్లో హాజరుపర్చే అవకాశం ఉందని సమాచారం. బియ్యం మాయం వెనుక జిల్లా డిపోలో పనిచేసే ఓ టెక్నికల్ పర్సన్తో పాటు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ బియ్యం అక్రమ రవాణా వ్యాపారి హస్తం ఉందనే అంశం విచారణలో వెల్లడైందనే ప్రచారం జరుగుతోంది. ఎస్ఈఐఎల్ ఎనర్జీకి సెక్యూరిటీ ఎక్సలెన్స్ అవార్డు తోటపల్లిగూడూరు: దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ సంస్థయిన ఎస్ఈఐఎల్ ఎనర్జీకి ఉత్తమ సెక్యూరిటీ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫైర్ అండ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో అవార్డును అందుకున్నామని సీఈఓ జన్మేజయ మహాపాత్ర తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నెల్లూరు(దర్గామిట్ట): ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్లను నియమించనున్నామని డీఆర్వో విజయ్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వే చేసి వివరాలను సేకరించి, ఆపై పార్టీల ప్రతినిధులకు వివరించనున్నామని చెప్పారు. ఓటర్ల లి స్టులో డోర్ నంబర్లుండేలా చూడాలని పలువు రు కోరారు. వివిధ పార్టీలకు చెందిన రాజేష్, శ్రీనివాసులు, శ్రీరామ్, మాదాల వెంకటేశ్వర్లు, దయాకర్, సంజయ్కుమార్, సుధాకర్, రసూల్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 70,251 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,862 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. అడవుల్లో ముగిసిన జంతు గణన ఉదయగిరి రూరల్: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని అడవుల్లో చేపట్టిన జంతు గణన మంగళవారంతో ముగిసిందని రేంజ్ అధికారి కుమార్రాజా తెలిపారు. 13 బీట్లలో 45 వేల ఎకరాల విస్తీర్ణంలో జంతు గణనను చేపట్టామని చెప్పారు. జంతువుల పాదముద్రలు తదితరాలను సేకరించామని వివరించారు. వీటిని యాప్లో నమోదు చేసి, వివరాలను బయో ల్యాబ్కు పంపనున్నామని వెల్లడించారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ..
● డీసీఓ కార్యాలయం వద్ద నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): సమస్యలు పరిష్కరించాలంటూ నెల్లూరులోని జిల్లా సహకార శాఖాధికారి (డీసీఓ) కార్యాలయం వద్ద మంగళవారం జేఏసీ నా యకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టిన అనంతరం డీసీఓ గుర్రప్పకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల్లో పనిచేసే వారి రిటైర్మెంట్ వయస్సును 62కు పెంచాలన్నారు. రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాన్నారు. 2019 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారిని పర్మినెంట్ చేసి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. బదిలీలు మూడు సంవత్సరాలకు ఒకసారి కాకుండా నిరంతర పక్రియగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రా మానాయుడు, లీగల్ సెల్ నాయకులు సురేష్కుమార్రెడ్డి, గౌరవాధ్యక్షుడు రమణమూర్తి, ట్రెజరర్ రాధయ్య, నాయకులు మల్లికార్జునగౌడ్ పాల్గొన్నారు. -
కూటమి పాలనలో దళితులకు అన్యాయం
● డీఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన ఆత్మకూరు: ‘కూటమి పాలనలో దళితులకు న్యాయం జరగడం లేదు. సొంత పార్టీకి చెందిన వారైనా పట్టించుకోవడంలేదు’ అని పలువురు వాపోయారు. జనసేనకు చెందిన వ్యక్తి కులం పేరుతో దూషించి కర్రతో దాడి చేసిన విషయమై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత దళితులు, పలు ప్రజా సంఘాల వారు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 6వ తేదీన చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారానికి చెందిన దొంతల గంగయ్య అనే దళితుడు తన పొలంలో పశువులు మేపుతున్నాడు. సమీప పొలానికి చెందిన రైతు తాను సాగు చేస్తున్న పిల్లిపెసరలో పశువులు రాకుండా చూడాలని చెప్పి వెళ్లాడు. గ్రామానికి చెందిన జనసేన నాయకుడు కనకం సుధాకర్ తన మేకలను పిల్లిపెసరలో మేపుతున్నాడు. దీంతో గంగయ్య అడ్డుచెప్పాడు. సుధాకర్ కర్రతో గంగయ్యపై దాడి చేసి కులం పేరుతో దూషించి గాయపరిచాడు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆరు రోజుల క్రితం ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్ను బాధితులు కలవడంతో న్యాయం చేస్తానని చెప్పారు. కానీ కేసు కట్టకపోగా పలువురు బెదిరిస్తున్నాడని గంగయ్య వాపోయాడు. తాను టీడీపీ కార్యకర్తనేనని, దెబ్బలు తినేందుకే సభ్యత్వం ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నాడు. న్యాయం జరగకపోవడంతో నిరసనకు దిగామన్నారు. డీఎస్పీ వేణుగోపాల్ కార్యాలయంలో అందుబాటులో లేరు. ఈ విషయమై నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాధితులకు ఫోన్ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మకూరు పోలీసులకు ఫోన్ చేసి, కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ బాధితులకు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు నందా ఓబులేసు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి టి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ.. తూర్పు ప్రాంతంతో సమానంగా పశ్చిమ మెట్ట ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి మూడు నెలలు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లోని ఎస్సార్ శంకరన్ హాల్లో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించే అంశమై పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే 11 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని, ఆరు కంపెనీల కోసం భూసేకరణ జరుగుతోందని వెల్లడించారు. జలదంకి, దుత్తలూరులో కొన్నింటిని నెలకొల్పేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బీపీసీఎల్ భూమి పూజకు సన్నాహాలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రాజెక్ట్ కోసం 3200 ఎకరాలను సేకరించామని, మరో 2800 ఎకరాలకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి పూజను జరపనున్నారని తెలిపారు. ఇండోసోల్ పరిశ్రమకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని చెప్పారు. 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇఫ్కో కిసాన్సెజ్కు భూములను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్, బీపీసీఎల్ పరిశ్రమల ఏర్పాటుతో కావలి నియోజకవర్గం ఇండస్ట్రియల్ టౌన్షిప్గా అభివృద్ధి చెందనుందని ప్రకటించారు. కోవూరు చక్కెర కర్మాగారాన్ని ఏపీఐఐసీకి అప్పగించి, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. నెల్లూరు నగరంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలను అభివృద్ధి చేస్తూ.. ఇక్కడే యువతకు ఐటీ తరహాలో ఉద్యోగాలు కల్పించేందుకు గానూ ఉన్నత రంగాల్లో స్థిరపడిన పలువురు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. డెల్టా ఆధునికీకరణకు చర్యలు చేపడతామని వెల్లడించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర వాణిజ్య పంటలవైపు రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్ధి, సరికొత్త విధానాలతో పంటలను సాగు చేసే ఒక చాంపియన్ రైతును ఎంపిక చేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమాలను నిర్వహించనున్నామని వివరించారు. అర్జీల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై అభిప్రాయం తెలుసుకునేందుకు ఆడిట్ టీమ్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక గ్రామం.. ఒక నెల కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయనున్నామని చెప్పారు. నెల్లో ఒక గ్రామంలో నాలుగుసార్లు అధికారులే నేరుగా ప్రజల వద్దకెళ్లి సమస్యలను అడిగి పరిష్కరించనున్నారన్నారు. సదరు విలేజ్లో 50 శాతం సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దీన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. మైపాడు బీచ్.. ఉదయగిరి కోటను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. -
నారాయణా.. మా మొర ఆలకించండి
● విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు ● సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ● అడ్డుకున్న పోలీసులునెల్లూరు(బారకాసు): మంత్రి నారాయణ కార్మికుల మొర ఆలకించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి పారిశుద్ధ్య, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కార్మికులు, డ్రైవర్లు విధులు బహిష్కరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్డులో అనిల్ గార్డెన్స్ వద్దనున్న పార్కు వద్దకు కార్మికులందరూ చేరుకున్నారు. భారీ ర్యాలీగా మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. ర్యాలీ వద్దకు వచ్చిన మంత్రి పర్సనల్ సెక్రటరీ వెంకటేష్కు అర్జీని ఇచ్చి సమస్యల తీవ్రతను తెలియజేశారు. అనంతరం మాగుంట లేఅవుట్ నుంచి మినీ బైపాస్ వైపు కార్మికులు ర్యాలీ చేపట్టారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చేంత వరకు విధుల బహిష్కరణ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు రూరల్ కార్యదర్శి కె.పెంచలనరసయ్య మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారన్నారు. పాలకవర్గ సభ్యులు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని, ప్రజా, కార్మికుల సమస్యలు గాలికొదిలేశారన్నారు. కార్యక్రమంలో నేతలు కొండా ప్రసాద్, జి.నాగేశ్వరరావు, సుధాకర్, నరసింహ, ఆర్ఎం సునీల్ కుమార్, సీహెచ్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకాసురుల బరితెగింపు
పొదలకూరు: నిబంధనలకు పాతరేసి ఇసుకాసురులు పెన్నానదిని కుళ్ల పొడుస్తున్నారు. ఇష్టానుసారంగా యంత్రాలు పెట్టి లోడేస్తూ భారీ వాహనాల్లో ఇసుకను బయటి రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేస్తున్న ఈ తంతుపై ప్రశ్నించే అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మండలంలోని సూరాయపాళెం రీచ్లో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికితీసి యార్డుకు తరలించి అక్కడి నుంచి అమ్మకాలు సాగించాలి. అయితే సంబంధిత కాంట్రాక్టర్ డ్రెడ్జింగ్కు నీళ్లొదిలి ఏకంగా యంత్రాలను వినియోగించి ఇసుకను లోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగం బ్యారేజీ నుంచి నీటి ప్రవాహం వల్ల విరువూరు ఓపెన్ రీచ్లో ఇసుకను తరలించడం లేదు. సూరాయపాళెం రీచ్లోనే ప్రస్తుతం లోడేస్తున్నారు. రోడ్డు నిర్మాణం ఇటీవల సోమశిల ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయడంతో ప్రవాహం పెరిగి పెన్నా నదిలో ఇసుకను తీసేందుకు వీలుపడలేదు. దీంతో కొంతకాలం ఈ ప్రక్రియకు విరామం ప్రకటించారు. అయితే సూరాయపాళెం డ్రెడ్జింగ్ పర్మిట్ను అడ్డుపెట్టుకుని నేరుగా నది వద్దకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టి భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. అక్కడే లారీలు, టిప్పర్లలో ఇసుకను లోడ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ఇష్టం వచ్చిన కాకిలెక్కలు వెల్లడిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం డ్రెడ్జింగ్ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ యంత్రాలను వినియోగించేందుకు వీల్లేదు. అంతేకాక నేరుగా నది సమీపానికి టిప్పర్లు, లారీలు వెళ్లకుండా దూరంగా యార్డును ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అలాంటి నిబంధనలు పాటించడం లేదు.డ్రెడ్జింగ్ లేకుండా యంత్రాల వినియోగం పెన్నానదిలోకి నేరుగా రోడ్ల నిర్మాణం నిబంధనలకు తూట్లు పట్టించుకోని అధికారులు -
బీమా రంగానికి తీవ్ర నష్టం
నెల్లూరు(అర్బన్): బీమా రంగంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక రంగానికి, ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని ఎల్ఐఏసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సీఏబీ కార్యదర్శి నరసింహులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నెల్లూరులోని జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో ఉన్న ఎల్ఐసీ సీఏబీ కార్యాలయం వద్ద ఆ బ్రాంచ్ ఏజెంట్లు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో బీమా రంగంపై విదేశీ పెత్తనం ఏర్పడుతోందన్నారు. ఇప్పటి వరకు ఎల్ఐసీ సేకరించే ప్రీమియం రైల్వే, రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు లాంటి వాటి కోసం ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందించేదన్నారు. తాజా నిర్ణయంతో ప్రజలు చెల్లించే ప్రీమియంకి భద్రత లేకుండా పోతుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓఐ నాయకులు రజనీకాంత్, రషీద్ పాల్గొన్నారు. -
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
నెల్లూరు (దర్గామిట్ట): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్తో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు అమరజీవి అన్నారు. ఆయన త్యాగ ఫలితంగానే తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. డీబీసీడబ్ల్యూఓ వెంకటలక్ష్మమ్మ, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే డీడీ నాగశేఖర్, తదితరులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానంలో ఇంటర్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు తెలిపారు. నగరంలోని రావూస్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు ఓరియంటేషన్ తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇంటర్బోర్డు అబ్జర్వర్ జీ నరసింహరావు రీసోర్స్పర్సన్లు పరీక్షల నిర్వహణ విధానంపై పరీక్షల సిబ్బంది, సీఎస్, ఏసీఎస్, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీవీఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు రేపు నెల్లూరు (టౌన్): జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్ బాలాజీరావు సోమవారం తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్ట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. తెలుగులో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం’, ఇంగ్లిష్లో ‘ఎఫిషియంట్ అండ్ స్పీడ్ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టీస్’ అనే అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 95538 84296 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కామాక్షితాయి దర్శన వేళల్లో మార్పు బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లుగా ఈఓ శ్రీనివాసులరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి శుక్రవారం మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 గంటల వరకు దర్శనం కల్పిస్తామని వివరించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఫిర్యాదుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 114 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంఽధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, డీసీఆర్బీ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, టీవీ సుబ్బారావు, ఫిర్యాదు విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● ఓ వ్యక్తి వాట్సాప్లో పరిచయమయ్యాడు. ఆన్లైన్లో బిట్ కాయిన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక నగదు వస్తుందని ఆశ చూపాడు. రూ.11,65,771 పెట్టుబడి పెట్టాను. నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● నా ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచాను. నేను ఓ చిన్న ఇంట్లో ఉంటున్నా. పెద్ద కుమారుడు, కోడలు ఆ ఇంటినిచ్చి వెళ్లిపోవాలని నన్ను, నా భర్తను వేధిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలని ఇందుకూరుపేట మండలంకు చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● నా కుమార్తె భర్తతో విభేదాల కారణంగా నా వద్దనే ఉంటోంది. అతని వేధింపులు భరించలేక ఒకటిన్నర నెల క్రితం కుమార్తె ఎటో వెళ్లిపోయింది. ఆచూకీ తెలియజేయాలని రాపూరుకు చెందిన ఓ మహిళ కోరారు. ● నా పొలం విషయంలో ప్రసాద్ మరికొందరు నాపై దాడి చేశారు. దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయినా పొలం సాగుచేసుకోనివ్వకుండా ప్రసాద్ ఇబ్బందులు పెడుతున్నారని కలువాయికి చెందిన ఓ ఫిర్యాదు చేశాడు. ● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం వేధిస్తున్నారు. నా జీవనాధారం కష్టంగా ఉంది. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● భర్త మరణించడంతో అత్త, ఆడపడుచులు కొట్టి నన్ను, నా ముగ్గురు ఆడపిల్లలను ఇంటి నుంచి గెంటేశారు. జీవించడం కష్టంగా ఉందని బిట్రగుంటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. -
యూటీఎఫ్ నూతన కమిటీ ఏర్పాటు
నెల్లూరు(టౌన్): యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని కార్యాలయంలో సోమవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా అచ్చయ్య, అధ్యక్షుడిగా వీరి శేషులు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాజావలీ, అఽసోసియేట్ అధ్యక్షురాలిగా సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చలపతిశర్మ, కోశాధికారిగా మురళీధరరావుతోపాటు 14 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏడుగురు రాష్ట్ర కౌన్సిలర్లు, ఏడుగురు ఆడిట్ కమిటీ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. అనంతరం యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విధానాలు మార్పు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 12వ పీఆర్సీని ప్రకటించడంతోపాటు 30 శాతం ఐఆర్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. -
గంజాయి మాఫియాకు నేతల సాయం
● పెంచలయ్య కుటుంబానికి రూ.7.20 లక్షల సాయం నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డబ్బుల కోసం గంజాయి మాఫియా ఏ స్థాయికైనా వెళ్తోంది. వారికి రాజకీయ నేతలు, పోలీసులు సాయం చేస్తున్నారు’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు యు.వాసుకి అన్నారు. గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన పెంచలయ్య సంతాప సభను సోమవారం నెల్లూరులోని టౌన్హాల్లో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాకు అవకాశాలు ఇవ్వకూడదన్నారు. పెంచలయ్య కుటుంబానికి సీపీఎం అండగా ఉంటుందన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుకూరులో రాజకీయ గొడవల్లో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిందన్నారు. పెంచలయ్య సమాజంలో మార్పు తీసుకొచ్చే క్రమంలో హత్యకు గురయ్యాడన్నారు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. అనంతరం పార్టీ సేకరించిన విరాళం రూ.7.20 లక్షలను పెంచలయ్య భార్య దుర్గకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి పెంచలయ్య కుటుంబానికి రూ.లక్ష సాయం చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీ నేతలు మూలం రమేష్, అరిగెల నాగేంద్రసాయి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి శ్రీనివాసులు, రాంబాబు, లక్ష్మీరెడ్డి, బసవరాజు, శివశంకర్, మోహన్రావు, మాదాల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, అజయ్కుమార్ పాల్గొన్నారు. -
18న మేయర్ స్థానంపై స్పష్టత
● అప్పటి వరకు ఇన్చార్జి మేయర్గా రూప్కుమార్యాదవ్ నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంపై 18న స్పష్టత రానుంది. శనివారం రాత్రి స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, తన ప్రతినిధి ద్వారా రాజీనామా లేఖను కలెక్టర్కు అందజేసిన విషయం తెలిసిందే. మేయర్ రాజీనామా విషయాన్ని కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎన్నిక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిర్దేశాల మేరకు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్యాదవ్కు ఇన్చార్జి మేయర్గా బాధ్యతలను అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెల 18వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సమావేశం జరిగే వరకు రూప్కుమార్ ఆ స్థానంలో కొనసాగుతారు. ఇదే సమమావేశంలో మేయర్ రాజీనామాను కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారికి నివేదికను అందజేస్తారు. ఎన్నికల అధికారి పరిశీలించి తదుపరి కొత్త మేయర్ ఎన్నికపై నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంటుంది. అప్పటి వరకు ఇన్చార్జి మే యర్గా రూప్కుమార్ను కొనసాగించే విషయంలో మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ
నెల్లూరు రూరల్: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సోమవారం ఆవిష్కరించారు. సుపరిపాలన బస్సు యాత్రలో భాగంగా సోమవారం అయ్యప్ప గుడి సెంటర్ నుంచి హరనాథపురం వరకు మోటార్బైక్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాజ్పేయి విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో మాట్లాడారు. పదవులు కాదు.. విలువలు ముఖ్యమని నమ్మిన నేత వాజ్పేయి అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ను వృథా చేయొద్దు : జేసీ● నెల్లూరులో ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ను వృథా చేయకుండా పొదుపుగా వాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జేసీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం నెల్లూరులోని విద్యుత్ భవన్ నుంచి కస్తూర్బా కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. జేసీ ముఖ్య అతిథిగా విచ్చేసి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లలో, కార్యాలయాల్లో అవసరమైన సమయాల్లోనే లైట్లు, ఫ్యాన్లు వినియోగించాలని సూచించారు. సోలార్, విండ్ విద్యుత్పై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం, అకౌంట్స్ ఆఫీసర్ మురళి, ఈఈలు శేషాద్రిబాలచంద్ర, లక్ష్మీనారాయణ, శ్రీధర్, పరంధామయ్య, రమేష్ చౌదరి, బెనర్జీ, భానునాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి కమిషనర్గా శ్రీలక్ష్మి నియామకంనెల్లూరు (బారకాసు): కమిషనర్ వైఓ నందన్ మూడురోజుల విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు నగర పాలక సెక్రటరీగా ఉన్న ఎం.శ్రీలక్ష్మికి (ఎఫ్ఏసీ) బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. బుధవారం వరకు కమిషనర్గా విధులు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కెరీర్ ఫెస్ట్నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 18వ తేదీ వరకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. సోమవారం నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో మెంటల్ హెల్త్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో స్వీయ అవగాహన, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళిక, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. మండల స్థాయిలో ఐదు బెస్ట్ మోడల్స్ ఎంపిక చేసి ఈనెల 20న జిల్లా లెవల్ ప్రోగ్రాం కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లరిగేలా తిరిగినా.. వీడని నిర్లక్ష్యం
నెల్లూరు(దర్గామిట్ట): సమస్యలు పరిష్కరించండి సారూ అంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లా పాలనాధికారికి చెప్పినా పరిస్థితులు మారడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధిక శాతం వినతులు భూ సమస్యలపైనే వస్తున్నాయి. గ్రామ, మండల స్థాయి రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం సామాన్య ప్రజానీకానికి శాపంగా మారుతోంది. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 433 సమస్యలపై అర్జీలు రాగా అందులో 187 రెవెన్యూ సమస్యలు కావడం గమనార్హం. మున్సిపల్ సమస్యలు 53 తదితరాలున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● రాపూరుకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి షాపులు కడుతున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని సైదాన్ సాహిబ్, ముత్తహన్షఫీ వినతిపత్రం అందజేశారు. ● గూడూరు డివిజన్ను నెల్లూరులో కలపాలని బీజేపీ నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతిపత్రమిచ్చారు. ● రేషన్కార్డులో మాకు సంబంధం లేని వారిని చేర్చడంతో సంక్షేమ పథకాలు కోల్పోతున్నాం. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ముత్తుకూరు మండలం ఈదూరు మిట్టపాళేనికి చెందిన సుప్రజ వాపోయారు. ● నెల్లూరును డ్రగ్స్, గంజాయి రహితంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, నగరంలో ఇటీవల జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సామాజికవేత్త ఈర్ల రమణయ్య జేసీకి వినతిపత్రం అందజేశారు. ● బధిరులకు ప్రభుత్వ ఆర్థిక, సంక్షేమ ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని బధిరుల జిల్లా సంక్షేమ సంఘం చైర్మన్ మస్తానయ్య, ప్రవీణ్ కలెక్టర్కు విన్నవించారు. ● కలువాయి మండలం టీపీ అగ్రహారానికి చెందిన నాపా పెంచలమ్మ పేరున ఉన్న భూమికి సంబంధించి రికార్డులు తారుమారు చేశారని, చర్యలు చేపట్టాలని నాపా నవీన్ కోరారు. ● వేదాయపాళెం రెవెన్యూ పరిధిలో బోగస్ రికార్డులు సృష్టించి స్థలాన్ని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించలేదు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని చేకూరి సురేష్ కోరారు. కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ పోటెత్తి వస్తున్న ప్రజలు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన -
తిరుపతి వద్దు.. నెల్లూరు ముద్దు
● పునర్విభజనకు వ్యతిరేకంగా కలువాయి వాసుల ఆందోళన నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా పునర్విభజనపై నిరసన సెగలు రగులుతున్నాయి. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయొద్దని, యథాతథంగా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతూ ఆ మండల ప్రజలు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కలువాయి వాసులు పెద్ద ఎత్తున నెల్లూరుకు చేరుకుని కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తిరుపతి వద్దు.. నెల్లూరు ముద్దు, సేవ్ కలువాయి అంటూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి నుంచి తిరుపతికి దూరం 140 కిలోమీటర్లు కాగా రోజుకు ఒక్క బస్సు మాత్రమే ఉందన్నారు. నెల్లూరుకు 69 కిలోమీటర్ల దూరం కాగా ప్రతి అరగంటకు బస్సు ఉందన్నారు. కలువాయి మండలాన్ని ఆత్మకూరు డివిజన్ నుంచి గూడూరు డివిజన్లోకి మార్చి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతామన్నారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్నది మండల ప్రజల ఏకాభిప్రాయమన్నారు. అందువల్ల ఆత్మకూరు డివిజన్లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా కలువాయి వాసుల వద్దకు వచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలువాయి మండల నాయకులు రఘురామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మహిళలు, యువకులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
● కూరగాయలు కొనేందుకు వచ్చిన వ్యక్తి మృతి ● ఇద్దరికి తీవ్ర గాయాలు దుత్తలూరు: అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన దుకాణాల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం మండలంలోని నందిపాడు సెంటర్లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మర్రిపాడు మండలం ఉమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బిల్లుపాటి నరేష్ నందిపాడు సెంటర్లో కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. మర్రిపాడు మండలం పెదమాచనూరు గ్రామానికి చెందిన ఆకుల రమణారెడ్డి (52), అంబటి వెంకటకృష్ణమ్మలు అక్కడికెళ్లి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన గడ్డం రామసుబ్బారెడ్డి పని నిమిత్తం కావలికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో నందిపాడు సెంటర్ సమీపంలోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి కుడివైపునున్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. నరేష్తోపాటు రమణారెడ్డి, వెంకటకృష్ణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో వారొచ్చి క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమణారెడ్డి మృతిచెందాడు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు, నెల్లూరు వైద్యశాలలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
అమరజీవికి నివాళులర్పించిన కాకాణి
నెల్లూరు రూరల్: నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలనే ప్రజల దశాబ్దాల కల నెరవేరలేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం స్మరించుకునేలా చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరజీవి బాటలో నడుస్తూ పేదల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జగన్ సుపరిపాలనను రాష్ట్ర ప్రజలందరూ తిరిగి కోరుకుంటున్నారన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం వైఎస్సార్సీపీ శ్రేణులందరూ కలిసి పనిచేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాకాణి రిట్ పిటిషన్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్న్రెడ్డి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణను కాకాణి కోరారు. రిట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ ప్రభుత్వం, సీబిఐ, సిఐడీతో పాటు ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం అదేశించింది. గతంలో తనపై నమోదైన కేసులపై సీబీఐ విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు మెయిల్ చేశారు. సీఎం స్పందించకపోవడంతో కాకాణి.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
అధికారం ఉంది.. మా ఇష్టం
అనుమసముద్రంపేట: టీడీపీ ప్రభుత్వ తీరుపై ఏఎస్పేట మండలం శ్రీకొలను గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 35 ఎకరాల మేత పోరంబోకు భూమిని సోలార్ ప్లాంట్కు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకొలను గ్రామంలోని సర్వే నంబర్ 411లో ప్లాంట్కు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో శ్రీకొలను, హసనాపురం, జువ్వలగుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు మండిపడున్నారు. జేసీబీతో చేయిస్తున్న పనులను సైతం నిలుపుదల చేయించారు. మూడు గ్రామాల్లో 1,500 గేదెలు, 10 వేల గొర్రెలు, 5 వేల మేకలున్నాయి. వర్షాకాలంలో చెరువుకు వెళ్లేందుకు దారి ఉండదు. ఈ క్రమంలో గ్రామాల్లో ఎక్కువ శాతం ఈ జీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దాదాపు 362 ఎకరాల మేత పోరంబోకు భూముల్లో పశువులు, మేకలు, గొర్రెలను మేపుతుంటారు. సంబంధం లేకుండానే.. ఇటీవల కూటమి నేతలు ఈ భూములపై కన్నేశారు. గతంలో వాటి జోలికి పోవ్వొద్దని రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారు. అయితే కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా ఆర్ఎస్ఆర్లో చుక్కల భూమిగా రికార్డులో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వందేళ్ల నుంచి 411 సర్వే నంబర్లోని మేత పోరంబోకు భూమిలో ఆక్రమణలకు గురికాకుండా రైతులు కాపాడుకుంటూ వచ్చారు. కానీ సోలార్ ప్లాంట్ పేరుతో 32 ఎకరాల భూమిని ఇప్పటికే అప్పగించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామనత్తం కలిగిన భూములను పంచాయతీలు తీర్మానం చేయాలి. ఇందుకోసం ముందుగా గ్రామసభలను నిర్వహించి సర్పంచ్ చేత తీర్మానం చేయించాల్సి ఉంటుంది. సర్పంచ్ దళిత మహిళ కావడంతో అగ్రవర్ణాలకు చెందిన ఓ టీడీపీ నేత పంచాయతీకి సంబంధం లేకుండానే తహసీల్దార్ చేత నివేదికలు కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఈ తంతుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ ప్లాంట్కు మేతపోరంబోకు భూముల కేటాయింపు ఉద్యమం చేస్తామంటున్న గ్రామస్తులు32 ఎకరాలు మాత్రమే ఇచ్చాం శ్రీకొలను గ్రామంలోని సర్వే నంబర్ 411లో ఉన్న భూములు ఆర్ఎస్ఆర్లో చుక్కల భూమిగా రికార్దైంది. ఇందులో కేవలం 32 ఎకరాలు మాత్రమే సోలార్ ప్లాంట్కు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. రైతులతో చర్చిస్తాం. – అనిల్ కుమార్, తహసీల్దార్, ఏఎస్పేట -
అవే చివరి గోరుముద్దలు..
● ఎంతో ఆనందంతో కుమార్తెకు భోజనం తినిపించి.. ● జాగ్రత్తలు చెప్పి తిరుగుపయనం ● అంతలోనే ఇన్నోవా ఢీకొని తల్లిదండ్రుల మృతి ఆత్మకూరు: విధి పగబట్టి.. దంపతులను కబళించింది. కుమార్తెకు గోరుముద్దలు తినిపించి.. తిరుగుపయనమైన పది నిమిషాలకే వీరిని ఇన్నోవా పొట్టనబెట్టుకుంది. వివరాలు.. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. ఆయన సన్నకారు రైతు కాగా.. గత ప్రభుత్వ హయాంలో వలంటీర్గా ఆమె పనిచేశారు. పెద్ద కుమార్తె మనస్విని నెల్లూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్.. చిన్న కుమార్తె తేజస్విని ఆత్మకూరులోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ తరుణంలో వీరు గురుకుల పాఠశాలకు ప్రతి ఆదివారం వెళ్లి తేజస్విని యోగక్షేమాలను ఆరాతీసి క్యారియల్లో తీసుకొచ్చిన భోజనాన్ని తినిపించి వచ్చేవారు. ఈ తరుణంలో ఇలానే వెళ్లి కుమార్తెను కలిసి.. తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బద్వేల్ నుంచి నెల్లూరుకు రాంగ్ రూట్లో వెళ్తున్న ఇన్నోవా వీరి బైక్ను ఢీకొంది. ఆపై బైక్తో సహా కారు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్సై జిలానీ ఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషాదఛాయలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు.. ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. పది నిమిషాల క్రితమే తనను పలకరించి భోజనం పెట్టి ఇంటికెళ్తున్న తల్లిదండ్రులు మరణించారనే విషయాన్ని తెలుసుకున్న తేజస్విని, ఉపాధ్యాయులతో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతురాలి తల్లిదండ్రులు, సోదరి, బంధువుల రోదనలతో విషాద వాతారణం నెలకొంది. కాగా ఇన్నోవా డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులకు కొందరు తెలియజేశారు. కేసును సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
దందా లోగుట్టు.. పెరుమాళ్లకెరుక
ఉదయగిరి పౌరసరఫరాల గోదాములో సరుకులు మాయమైన ఉదంతం జిల్లాలో చర్చనీయాంశమైంది. బియ్యం, చక్కెర, కందిపప్పు కొద్ది నెలలుగా స్వాహా అవుతున్నా, తనిఖీల్లో అధికారులెందుకు గుర్తించలేకపోయారాననేదే అసలు ప్రశ్న. ఒక వేళ కనుగొన్నా, ఎందుకు బయటపెట్టలేదనేదీ అంతుచిక్కడంలేదు. పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాక జిల్లా, రాష్ట్రాధికారుల బృందాలు హడావుడిగా తనిఖీలు జరిపి ఇదే అంశాన్ని నిర్ధారించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదయగిరి: టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతోంది. జలదంకి, కడపకు చెందిన ఇద్దరు ముఖ్య నేతల అనుచరులు ఉదయగిరి ప్రాంతం నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించే హక్కును పొందారనే ప్రచారం ఉంది. వీరికి సంబంధించిన వాహనాలూ పట్టుబడ్డాయి. మారిన పంథా రేషన్ కార్డుల లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని డీలర్లు గతంలో సేకరించేవారు. ఆపై వీరి నుంచి వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ దందాలో నూతన పోకడలను అవలంబిస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి సివిల్ సప్లయ్స్ గోదాముల నుంచే బియ్యాన్ని వ్యాపారులు అక్రమంగా రవాణా చేసే సంస్కృతికి తెరలేపారు. ఈ క్రమంలోనే స్థానిక గోదాము నుంచి బియ్యాన్ని స్వాహా చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల ప్రమేయం..? ఉదయగిరి సివిల్ సప్లయ్స్ గోదాములో సరుకుల స్వాహా వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉందనే ప్రచారం గుప్పుమంటోంది. బియ్యం, చక్కెర, కందిపప్పు, ఇతర సరుకుల మాయం వెనుక స్థానిక ఎమ్మెల్ఎస్ పాయింట్లో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉందని పౌరసరఫరాల అధికారులు తేల్చారు. దీనిపై సివిల్ సప్లయ్స్ జిల్లా డీఎం అర్జున్రావు ఉదయగిరి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అయితే ఈ ఉదంతం వెనుక ఉన్నతాధికారులు, రాజకీయ నేతల హస్తం సైతం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో నిజాలు నిగ్గు తేలేనా..? జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం ఫిర్యాదు మేరకు ఎమ్మెల్ఎస్ పాయింట్లో విధులు నిర్వర్తించే ముగ్గురిపై విచారణ సీఐ వెంకట్రావు పర్యవేక్షణలో జరుగుతోంది. బియ్యం స్వాహా వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే నిజాలూ తెలిసే అవకాశం ఉంది. నిష్పాక్షపాతంగా ఎంకై ్వరీ జరిపి దీని వెనుకన్న వారి పాత్రను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. వామ్మో.. ఇంతా ఉదయగిరి ఎమ్మెల్ఎస్ పాయింట్ నుంచి 211.55 టన్నుల బియ్యం.. 1587 కిలోల చక్కెర.. 1378 కిలోల కందిపప్పు.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన 2525 కిలోల బియ్యం బస్తాలు.. అంగన్వాడీ కేంద్రాలకు చెందిన 0.12 టన్నులు (మూడు కిలోల) బియ్యం బస్తాలు, ఏడు లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను స్వాహా చేశారనే అంశాన్ని రాష్ట్రాధికారుల బృందం తేల్చింది. వీటి విలువ రూ.1,05,43,876గా పేర్కొన్నారు. కారకుల నుంచి రూ.2,10,87,755ను రివకరీ చేయాలని నివేదికలో పొందుపర్చారు. ఈ పరిణామాల క్రమంలో వ్యవహారంతో సంబంధమున్న ఉదయగిరికి చెందిన ముగ్గురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయగిరిలోని సివిల్ సప్లయ్స్ గోదాము (ఫైల్)ఉదయగిరి ఎమ్మెల్ఎస్ పాయింట్లో మాయాజాలం కలకలం సృష్టిస్తున్న బియ్యం స్వాహా వ్యవహారం కొల్లగొట్టిన సరుకుల విలువ అక్షరాలా రూ.కోటి ఇంత పక్కదారి పట్టించడం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సాధ్యమా..? పెద్దల హస్తంపై అనుమానాలు -
జిల్లా విభజన.. జల సంఘర్షణ
పొదలకూరు: కూటమి ప్రభుత్వం జిల్లాల విభజన సర్దుబాటు తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. ప్రధానంగా రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలకు చెందిన రైతులతోపాటు సాధారణ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక పరిస్థితులతోపాటు ప్రజాభీష్టం మేరకు విభజన జరగలేదని అభిప్రాయపడుతున్నారు. ఆ మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలపడంతో జిల్లాల మధ్య సాగునీటి వివాదాలు చోటుచేసుకునే అవకాశంతోపాటు పొదలకూరు మండలానికి సాగునీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని మేధావులు అంటున్నారు. దీంతో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చూస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నిరసనలు, డిమాండ్లపై ఇప్పటి వరకు స్పందించిన దాఖలాల్లేవు. మూడు మండలాలను తిరుపతిలో కలిపితే భవిష్యత్ ఉంటుందని మంత్రివర్గ సబ్ కమిటీకి చెందిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్ వెల్లడించారు. సాగునీటిపై ఆందోళన పొదలకూరు మండలంలో సోమశిల, కండలేరు నుంచి సాగునీరు అందుతుంది. 90 శాతం వ్యవసాయం ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న కాలువల నీటి ద్వారానే మెట్ట, మాగాణి వ్యవసాయం సాగుతోంది. ప్రాజెక్ట్లు ఒక జిల్లాలో, కాలువలు మరో జిల్లాలో ఉంటే సాగునీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని ప్రజాప్రతినిధులతోపాటు రైతులు అభిప్రాయపడుతున్నారు. పొదలకూరు మండలంలో సోమశిల దక్షిణ కాలువ ఉంది. దీనికి కలువాయి రిజర్వాయర్ ద్వారా చేజర్ల మండలం మీదుగా నీరు సరఫరా కావాల్సి ఉంది. అలా జరిగితే చేజర్ల మండలంలో 20 వేల ఎకరాలు, పొదలకూరు మండలంలో 5 వేల ఎకరాలు రబీ సీజన్లో వరినాట్లు పడతాయి. కలువాయిని తిరుపతిలో కలిపితే రిజర్వాయర్ ఒక జిల్లాలో కాలువలు మరో జిల్లాలో ఉంటాయి. గత ప్రభుత్వంలో కొనసాగింపు సాగునీటి జలాల సమస్యలు తలెత్తుతాయని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా పునర్విభజనలో ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకుంది. దీని ప్రకారం కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించింది. ఈ మూడు మండలాలు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నా భౌళిక పరిస్థితులు, సాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో కొనసాగించారు. అయితే కూటమి ప్రభుత్వం తిరిగి పునర్విభజనను చేపట్టి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలను పూర్తిగా తిరుపతి జిల్లాలో కలపడంపై నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి 32 చెరువులకు.. కండలేరు జలాశయం రాపూరు మండలంలో ఉండగా 11 కి.మీ పొడువున్న మట్టికట్ట చేజర్ల, పొదలకూరు, రాపూరు మండలాల పరిధిలో ఉంది. పొదలకూరుకు వరప్రదాయినిగా ఉన్న కండలేరు ఎడమగట్టు కాలువ ద్వారా పొదలకూరు, చేజర్ల మండలాల్లో 32 చెరువులకు నీటిని అందించి మెట్ట, మాగాణి పంటలు పండుతున్నాయి. కండలేరులో నీరు తగ్గితే ఎడమగట్టు కాలువకు పంపింగ్ స్కీమ్ ద్వారా విడుదల చేస్తుంటారు. స్కీమ్ రాపూరు మండలంలో ఉంది. ఈ కాలువ కింద 22 వేల ఎకరాల్లో పంటలకు నీటిని అందించాల్సి ఉంటుంది. కండలేరు ఒకటో నంబర్ బ్రాంచ్ కాలువ ద్వారా పొదలకూరు, సైదాపురం మండలాల్లో 10 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు బ్రాంచ్ కాలువ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ కాలువకు రాపూరు మండలం సంక్రాంతిపల్లి పికప్ ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.కండలేరు జలాశయం ప్రాజెక్ట్లు ఒకచోట.. కాలువలు మరోచోట కండలేరు మట్టికట్టలో కొంత భాగం పొదలకూరులోనే.. తీవ్ర నష్టం కలిగే అవకాశం మండలాల విభజనపై నిరసన గత ప్రభుత్వంలో కలువాయి, రాపూరు, సైదాపురం నెల్లూరులోనే.. -
ఇరిగేషన్ పనులపై సీబీఐ విచారణకు సిద్ధమా..?
పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా.. గత ప్రభుత్వం, ఇప్పటి సర్కార్లో జరిగిన దోపిడీపై నిగ్గుతేల్చే దమ్ముందానంటూ సోమిరెడ్డిపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని నల్లపాళెంలో ఆదివారం పర్యటించి.. రైతుల సమస్యలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. తాను చేసిన అవినీతి ఆరోపణలపై సోమిరెడ్డి మాట్లాడకుండా.. గత ప్రభుత్వ హయాంలో షట్టర్లు బిగించకుండా దొంగ బిల్లులు చేసుకున్నారంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతిని దాటవేసేందుకు ఎంత యత్నించినా, ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో ఆయనకు అనుకూలంగా నివేదికలను తయారు చేయించుకునేందుకు యత్నిస్తున్నారని, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే పలాయనం చిత్తగిస్తున్నారని విమర్శించారు. దేవుళ్లకే శఠగోపం పెడుతున్న వారికి ఇతర పనుల్లో అవినీతికి పాల్పడటం పెద్ద లెక్క కాదని చెప్పారు. గోవధను ప్రోత్సహిస్తున్నారు.. గొలగమూడి రోడ్డులో సంతను సోమిరెడ్డి కుమారుడు పెట్టించి.. నెలకు రూ.ఐదు లక్షలను వసూలు చేస్తున్నారని, ఆవులను విక్రయించే వారికి వత్తాసు పలుకుతూ గోవధను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బ్రాందీషాపుల్లోనూ కమీషన్లను వసూలు చేస్తున్నారని విమర్శించారు. మోంథా తుఫాన్ పేరుతో పనులు చేయకుండానే రూ.16.9 కోట్లను దోచుకునేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. ఇరిగేషన్ పనులే కాక ప్రతి శాఖలో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించి గ్రామాల్లో సభలను ఏర్పాటు చేసి ఎండగడతామని ప్రకటించారు. సర్వేపల్లిలో గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను వదలకుండా దోపిడీకి పాల్పడుతూ.. పామాయిల్ ట్యాంకర్ల వద్దా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడుతూ, ధనార్జనే ధ్యేయంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. యూరియా లభ్యం కావడం లేదని.. వరి సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అనంతరం నల్లపాళెంలో నంది రమణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, నేతలు పోలిరెడ్డి, లచ్చారెడ్డి, నంది శ్రీనివాసులురెడ్డి, శ్రీహరి, శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరమణారెడ్డి, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దొంగ బిల్లులు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలి దోపిడీపై నిగ్గుతేల్చాలి సోమిరెడ్డిపై ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
కూటమి నేతల మధ్య ఘర్షణ
● దాడి చేసుకున్న జనసేన, టీడీపీ నేతలు ● ఇద్దరికి గాయాలు ● పరస్పర ఫిర్యాదులు ● రాజీ కోసం ప్రయత్నాలుసంగం: రాష్ట్ర మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఆదివారం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో దువ్వూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద టీడీపీ, జనసేన నేతలు నడిరోడ్డుపై శనివారం రాత్రి కొట్టుకోగా ఇద్దరు నేతలు గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దువ్వూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ మారెళ్ల కృష్ణమ్మ కుమారుడు, టీడీపీ దళిత నేత మారెళ్ల శ్రీనివాసులు అంగడి వద్ద ఆత్మకూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన నేత దాడి భానుకిరణ్ ఫ్లెక్సీ కట్టేందుకు శనివారం అర్ధరాత్రి ప్రయత్నించాడు. అంగడి వద్ద తమ పార్టీ ఫ్లెక్సీలు కట్టుకుంటామని, మీరు కట్టవద్దంటూ శ్రీనివాసులు అడ్డుపడ్డాడు. దీంతో ఘర్షణ జరిగి ఇద్దరూ కొట్టుకున్నారు. కిరణ్ రాయితో కొట్టడంతో శ్రీనివాసులు ముఖంపై గాయమైంది. శ్రీనివాసులు కొట్టడంతో భాను సైతం స్వల్పంగా గాయపడ్డాడు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. భాను కులం పేరుతో దూషిస్తూ రాయితో గాయపరిచాడని శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంలో రెండు పార్టీల కు చెందిన పెద్ద నేతలు రాజీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా బయటపడి కేసులు లేకుండా చూసుకోవాలని ఇరువురికి సూచించినట్లు తెలిసింది. భగ్గుమన్న దళిత నేతలు దాడిలో శ్రీనివాసులు గాయపడితే అగ్రవర్ణాల వారు కేసును రాజీ చేసేందుకు ప్రయత్నించడంపై దళిత నేతలు భగ్గుమంటున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగం పోలీసులు రెండు ఫిర్యాదులను తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పరీక్ష రాసొచ్చాడు.. అంతలోనే..
● బాలుడ్ని ఢీకొన్న కారు ● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి సోమశిల: నవోదయ పరీక్ష రాయించి.. తమ కుమారుడ్ని ఉన్నత స్థానానికి చేర్చాలని ఆ తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. వీరు ఒకటి తలవగా, విధి మరొకటి తలచింది. పరీక్ష రాసి ఇంట్లో సందడిగా గడిపి.. ఆపై పొలాల్లో వరినాట్లు జరుగుతుండటంతో అక్కడికెళ్లి రోడ్డు పక్కన ఉండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని చాపురాళ్లపల్లికి చెందిన సన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సుప్రజ దంపతుల ద్వితీయ కుమారుడు ఆనంద్రెడ్డి (11) కలువాయిలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. నవోదయ పరీక్ష నేపథ్యంలో బాలుడ్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చి పరీక్ష రాయించారు. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. హైవే పక్కన తమ పొలాల్లో వరినాట్లు జరుగుతుండటంతో అక్కడికెళ్లి రోడ్డు పక్కన ఉండగా, చుంచులూరు వైపు నుంచి అతివేగంతో వస్తున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆత్మకూరు వైద్యశాలకు తరలించేందుకు యత్నించగా మార్గమధ్యలోనే మృతి చెందారు. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి తెలిపారు. కాగా బాలుడ్ని ఢీకొన్న వాహనానికి తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని, దీన్ని రాపూరు టోల్గేట్ వద్ద గుర్తించామని చెప్పారు. -
శుభమస్తు షాపింగ్మాల్లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని శుభమస్తు షాపింగ్మాల్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తున్న ‘క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్’ ఎలక్ట్రిక్ స్కూటీ 7వ లక్కీ డ్రా ఆదివారం జరిగింది. దీనిని ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ శ్రీధర్ తీశారు. విజేతగా డానియల్ మోహన్ (అద్దంకి) నిలిచారు. శ్రీధర్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలోనే కాకుండా సామాజిక దృక్పథంలో నిర్వహిస్తున్న హృద్రోగుల కోసం లోడింగ్ డోస్ కిట్, మజ్జిగ చలివేంద్రం, నిరాశ్రయులకు అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని శ్రీధర్ తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా భలే పండగలు.. భలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా జనవరి 17 వరకు 39 స్కూటర్ల ఎలక్ట్రిక్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే రెండు పెద్ద పండగలకు రెండు పెద్ద కార్లు డ్రాను డిసెంబర్ 29న, జనవరి 19న నిర్వహించనున్నట్లు తెలిపారు. -
విద్యాశాఖాధికారుల విచారణ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం జనార్దనపురం పాఠశాల ఉపాధ్యాయుడు తరచూ విధులకు గైర్హాజరు కావపోవడం.. ఈ విషయం తెలిసినా ఎంఈఓలు చర్యలు చేపట్టకుండా అతడికి మద్దతుగా నిలవడం.. శనివారం అటెండర్ను డిప్యుటేషన్ వేయడంతో పాఠశాల శాశ్వతంగా మూతబడే అవకాశం ఉందంటూ ఆదివారం సాక్షిలో ‘ఆ బడికి అయ్యోరే శాపం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో డీఈఓ బాలాజీరావు స్పందించి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ను ఆదేశించారు. ఆయన వింజమూరు ఎంఈఓ కార్యాలయానికి వచ్చారు. పాఠశాలకు చెందిన రికార్డులను కార్యాలయం అటెండర్ బి.శ్రీహరి ద్వారా తెప్పించుకున్నారు. అనంతరం ఎంఈఓ 1 పి.రమేష్, ఎంఈఓ 2 మధుసూదన్రెడ్డి, టీచర్ ఆవుల రాజు, శనివారం విధుల్లో ఉన్న అటెండర్ శ్రీహరిని విచారించారు. వారి నుంచి లిఖితపూర్వకంగా సంజాయిషీ లేఖలను తీసుకున్నారు. తర్వాత డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ డీఈఓ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి నివేదికను పంపుతామన్నారు. కాగా విచారణాధికారి జనార్దనపురం వెళ్లి గ్రామస్తుల స్టేట్మెంట్ తీసుకోలేదు. -
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
● పిన్నెల్లి సోదరులను జైల్లో పెట్టడం అన్యాయం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: చంద్రబాబు, లోకేశ్లు వైఎస్సార్సీపీ నేతలపై పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసు కారణంగా జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంక్రటామిరెడ్డితో కాకాణి శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మే నెలలో ఒక వర్గం టీడీపీ నాయకులు మరో వర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులను స్కార్పియో వాహనంతో గుద్ది చంపడం జరిగిందన్నారు. ఇరువర్గాలు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వర్గీయులేనని, చనిపోయిన వ్యక్తుల కుటుంబీకులు మరో వర్గం టీడీపీ నాయకులు చంపారని చెప్పడం, స్వయానా జిల్లా ఎస్పీ ఒక వర్గం టీడీపీ నాయకులను, మరో వర్గం టీడీపీ నేతలు చంపినట్లు ప్రకటించారన్నారు. అయితే అన్యాయంగా ఈ కేసులో పిన్నెల్లి సోదరులను ఇరికించి కక్ష సాధింపులకు పాల్పడటం దారుణమన్నారు. ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించగా ఇంటిరియమ్ ప్రొటెక్షన్ ఇవ్వగా, తప్పుడు పత్రాలు సృష్టించి రద్దు చేయించారని తెలియజేశారు. ఆ తరువాత పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రొటెక్షన్ లభించిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వానికి సర్కార్ లాయర్లు ఉన్నా, లక్షలు రూపాయలు ఖర్చు చేసి సిద్థార్థ్ లూథ్రా వంటి లాయర్తో వాదించగా ప్రొటెక్షన్ రద్దు చేయడంతో సుప్రీంకోర్టు రెండు వారాలలోపు లొంగిపోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోవడంతో కోర్టు రిమాండ్ విధిస్తూ, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. చంద్రబాబుకు పాలనపై పట్టు కోల్పోవడంతో పాటు, పార్టీ పరంగా కూడా దారుణంగా ఉండటంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత పార్టీ నాయకులు అదే పార్టీ నాయకులను చంపేస్తుండటంతో చంద్రబాబు పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేశ్లు వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. గుండ్లపాడులో జరిగిన హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేకున్నా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జైలు పాలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలోనే ఓ కేసులో ఇరికించడంతో 54 రోజులపాటు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. మళ్లీ ఈ హత్య కేసులో అనేక కుట్రలు చేసి జైలుకు పంపడం మంచి పద్ధతి కాదన్నారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తులను ఎవరు చంపారో స్పష్టమైన ఆధారాలు ఉన్నా పిన్నెల్లి సోదరులను ఇరికించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జైల్లో కూడా అనేక ఇబ్బందులు పెట్టేలా కుట్రలు చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసులు కూడా కూటమి నాయకులకు వంతుపాడుతూ అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసులు తమ విధులను పక్కన పెట్టి కూటమి నాయకులు చేసే పాపాల్లో భాగస్వాములు కావడంతో జిల్లాలోనూ అరాచకాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు అధైర్యపడి వణికిపోయే పరిస్థితి ఉండదని, న్యాయ పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
మేయర్ దెబ్బకు.. టీడీపీ గంగవెర్రులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ స్రవంతిపై అవిశ్వాస ఘట్టం టీడీపీని కొద్ది రోజులుగా గంగవెర్రులెత్తించింది. ఊహించని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎంట్రీ.. సైకిల్ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేసింది. తాజాగా మేయర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అధికార పార్టీ నేతలకు స్ట్రోక్ తగిలినట్లు అయింది. ఈ నెల 18న అవిశ్వాసానికి సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్ల సంఖ్యా బలం (కోరం)పై మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిలో వణుకు పుట్టించింది. ఈ క్రమంలో ఫిరాయింపు కార్పొరేటర్లతో మీటింగ్.. ఈటీంగ్ కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. అందరికీ రూ.లక్షల్లో తాయితాలు, రూ.కోట్లల్లో కాంట్రాక్ట్ వర్కులిస్తామని హామీలిచ్చారు. అయినా ఆఖరి క్షణంలో చేజారిపోతారేమోననే ఆందోళనతో అందరితో ప్రమాణాలు చేయించారు. దీంతో అవిశ్వాసం నల్లేరుపై నడకేననే ధీమాతో ఉన్న మంత్రి, నెల్లూరు రూరల్కు కొందరు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. పచ్చ పార్టీలోకి ఫిరాయించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమ చేజారకుండా ఉండేందుకు అస్త్రశస్త్రాలు సంధించారు. అయినా అధికార పక్ష నేతలను భయం వెంటాడుతుండటంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వశక్తులొడ్డుతూ ఆపసోపాలు పడ్డారు. ప్రలోభాలతో పాటు రిసార్ట్స్కు తరలించి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. అష్టదిగ్బంధం టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలను తిప్పిగొట్టేందుకు మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి పన్నిన పద్మవ్యూహంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు మైండ్ బ్లాకై ంది. టీడీపీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో చేర్పించారు. ఈ హఠాత్పరిణామంతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలో గుబులు పట్టుకుంది. ఇంకెంత మంది చేజారిపోతారోననే ఆందోళన స్టార్టయింది. దీంతో ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. టీడీపీ చేతిలో 40 మంది కార్పొరేటర్లున్నా, అవిశ్వాసానికి ఇంకా నాలుగు రోజుల గడువున్న తరుణంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉన్న వారు తమ చేజారిపోకుండా ఉండేందుకు రిసార్టుల్లో ఉంచి.. గురువారం తీసుకొచ్చేలా పక్కా స్కెచ్తో కార్పొరేటర్లను అష్టదిగ్బంధం చేశారు. గొంతెమ్మ కోర్కెలు తీర్చి.. టీడీపీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లకు అవిశ్వాస తీర్మానం కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలతో పాటు పలు కాంట్రాక్ట్ పనులను ఇస్తామంటూ నిన్నామొన్నటి వరకు చెప్తూ వచ్చారు. అయితే వీరిలో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీన్ రివర్సయింది. ఇదే అదునుగా భావించిన కొందరు తమకు రూ.25 లక్షల కారు, రూ.40 లక్షల నగదును డిమాండ్ చేశారు. దీంతో గత్యంతరం లేక వీరి గొంతెమ్మ కోర్కెలను తీర్చారు. మేయర్ రాజీనామా ప్రకటనతో.. మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. అవిశ్వాసాన్ని నెగ్గేందుకు రూ.కోట్లు ఖర్చు చేశారు. రాజకీయ వ్యూహాలు, పోలీసులతో కిడ్నాప్ పన్నాగాలూ పన్నారు. అయితే చివరి క్షణంలో మేయర్ ప్రకటనతో ఇప్పటికే లబ్ధి పొందిన కార్పొరేటర్లు రాక్ కాగా, రూ.కోట్లు ఖర్చు పెట్టి ఆపసోపాలు పడిన టీడీపీ నేతలు షాక్కు గురయ్యారు. అవిశ్వాసానికి సర్వశక్తులొడ్డిన మంత్రులు ఆనం, నారాయణ ఫిరాయింపుదారులకు భారీగా డబ్బు, కాంట్రాక్ట్లతో ప్రలోభాలు తలొగ్గని వారిపై పోలీస్ కేసులతో అస్త్రశస్త్రాలు అయినా చేజారిపోతారనే భయంతో రిసార్ట్స్కు తరలింపు ఆఖరి క్షణంలో స్రవంతి రాజీనామా ప్రకటన కార్పొరేటర్లు రాక్.. మంత్రి, ఎమ్మెల్యే షాక్ -
ప్రజా ప్రతినిధులు బిజీబిజీ
నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు ప్రజల సమస్యలపై చర్చించేందుకు తీరికలేకుండా పోయింది. జిల్లాలో వివిధ సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటిపై చర్చించేందుకు కూటమి నేతలకు సమయం దొరకలేదు. గూడూరును నెల్లూరులో విలీనం చేయాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కందుకూరు సమస్య మరో పక్క వెంటాడుతోంది. ఇది కాక రైతులు యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. తుపాన్ల వల్ల పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం రైతులకు అందలేదు. శ్రమించి పంటలు పండించిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. ఇటువంటి సమస్యలపై చర్చించేందుకు ప్రజా ప్రతినిధులకు వీలుకుదరలేదు. శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు హాజరుకాలేదు. కావలి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ మాత్రమే హాజరయ్యారు. వారు కూడా సమస్యలేమీ లేవన్నట్లు కొద్దిసేపు కూర్చిని వెళ్లిపోయారు. గత నెలలోనూ ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. విజయదీపిక ఆవిష్కరణ పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన విజయదీపిక స్టడీ మెటీరియల్ను జెడ్పీ చైర్పర్సన్, జేసీ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు, శాసనసభ్యులు ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 418 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 20,500 మంది పదో తరగతి విద్యార్థులకు విజయదీపికను అందించనున్నారు. ఆ మండలాలను నెల్లూరులో కొనసాగాలి.. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సమావేశంలో తీర్మానం చేశారు. సభ్యులందరూ తీర్మానాన్ని బలపరిచారు. దీనిని ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్పర్సన్, సీఈఓ తెలిపారు. రూ.1.50 కోట్లతో నూతన గెస్ట్హౌస్ పాత జెడ్పీ గెస్ట్హౌస్ శిథిలావస్థకు చెరుకోవడంతో దానికి కుల్చివేశారు. నూతన జెడ్పీ ఆవరణలో రూ.1.50 కోట్లతో కొత్త గెస్ట్హౌస్ నిర్మాణానికి తీర్మానం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరగా అనుమతి తీసుకుని గెస్ట్హౌస్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. బడ్జెట్ ఆమోదం సమావేశంలో డిప్యూటీ సీఈఓ జెడ్పీ బడ్జెట్ను ప్రతిపాదించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలతో రూ.61,07,26,000 ఆదాయం కాగా రూ.61,06,73,896లు ఖర్చుగా బడ్జెట్ రూపొందించారు. రూ.52,104 మిగులు బడ్జెట్తో అంచనాలు సిద్ధం చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో రూ.76,45,62,703లు ఆదాయం. రూ.71,98,30,376 లు ఖర్చుగా బడ్జెట్ చూపించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి – జెడ్పీ చైర్పర్సన్ సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా సరఫరా చేయాలన్నారు. తుపాన్ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల పంటను మద్దతు ధరలకే కొనుగోలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు డక్కిలి జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ మృతికి సంతాపంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని తీర్మానం చేయాలంటూ కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్కుమార్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులందరూ కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. కలువాయి మండలాన్ని ఆత్మకూరు డివిజన్లో కొనసాగించాలన్నారు. జెడ్పీ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా ప్రజా సమస్యలపై చర్చించేందుకు తీరికలేని నేతలు యూరియా కొరతపై సభ్యుల నిలదీత పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ -
ఆ బడికి.. అయ్యోరే శాపం
వింజమూరు (ఉదయగిరి): కొందరు ఉపాధ్యాయులు, మరికొందరు విద్యాశాఖాధికారుల వైఖరికి ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పాతరేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నెలనెలా జీతాలు తీసుకుంటూ.. కనీసం వారానికొక్కసారి కూడా విధులకు హాజరు కాకుండా గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్ను శాపంగా మారుస్తున్నారు. ఇటువంటి ఉపాధ్యాయుల మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు రాక మూత పడే పరిస్థితి వస్తోంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలు మూత పడితే.. భవిష్యత్లో ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాద ఘట్టికలు మోగుతున్నాయి. తాజాగా వింజమూరు మండలం జనార్దనపురం నుంచే తొలి అడుగులు పడుతున్నాయి. ఆ ఉపాధ్యాయుడు రాకతో తిరగబడిన బడి రాత ఆ గ్రామంలో మొత్తం 850 మంది జనాభా. అందరూ రూ.వేలల్లో ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించలేదని పేదలే. 2021 విద్యా సంవత్సరానికి ఐదుగురు ఉపాధ్యాయులు, 70 మంది పిల్లలతో ప్రాథమికోన్నత పాఠశాలగా ఉండేది. అదే విద్యా సంవత్సరంలో ఆవుల రాజు అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలకు బదిలీ కావడంతో ఆ బడి రాత తిరగబడింది. మిగతా ఉపాధ్యాయులు సైతం ఇతని చేష్టలు బరించలేక వేరే పాఠశాలలకు బదిలీ అయిపోయారు. అప్పటికే విద్యార్థుల సంఖ్య సైతం సగానికి పడిపోయింది. సదరు ఉపాధ్యాయుడు తన సొంత పనులతో కనీసం వారానికి ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిల్లల చదువులు కుంటుపడ్డాయి. గ్రామస్తులు ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గత్యంతరం లేక పిల్లల భవిష్యత్ కోసం అప్పులు చేస్తూ ప్రైవేట్ స్కూల్స్కు పంపుతున్నారు. గతేడాది 33 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. వీరు కడు పేదలు కావడంతో ప్రైవేట్కు పంపే స్తోమత లేక ఆగిపోయారు. వచ్చే ఏడాది ఇక్కడ ఉంచమని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అటెండర్తో చదువులా? జనార్దనపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవుల రాజు తరచూ విధులకు డుమ్మా కొడుతున్నాడు. సదరు ఉపాధ్యాయుడు ప్రస్తుతం డిసెంబరులో 2వ, 12వ తేదీ మాత్రమే పాఠశాలకు వచ్చారు. మిగతా 8 రోజులు మెడికల్ సెలవులో ఉండడం గమనార్హం. ఇటీవల కూడా ఇదే పరిస్థితి వచ్చినా.. విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో శనివారం కూడా మరోసారి అటువంటి పరిస్థితే ఏర్పడింది. ఇతని స్థానంలో మరో టీచరును డిప్యుటేషన్పై వేయాలి. కానీ ఎంఈఓ మధుసూదన్రెడ్డి తన కార్యాలయంలో అటెండర్గా పనిచేసే బి.శ్రీహరిని చదువు చెప్పడానికి కు పంపించారు. ఈ విషయమై ఎంఈఓను వివరణ కోరితే కావలిలో జరిగే ఆటల పోటీలకు 28 మంది టీచర్లు వెళ్లినందున సర్దుబాటులో సమస్య వచ్చిందన్నారు. ఎంఈఓ, టీచరు మధ్య పరస్పర అవగాహనతో జరుగుతున్న ఈ విషయం మండలంలోని అందరూ టీచర్లకు తెలిసిందే. టీచర్కు కొమ్ముకాస్తున్న ఎంఈఓ ఉపాధ్యాయుడు రాజు గత ఏప్రిల్లో జరిగిన బదిలీల్లో జలదంకి మండలం మేములపాడుకు బదిలీ ఆయ్యారు. అయితే జనార్దనపురానికి రిలీవర్ రాకపోవడంతో ఇక్కడే కొనసాగుతున్నారు. అంటే విధులు జనార్దపురంలో.. వేతనం జలదంకి మండలంలో తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు టీచర్ హాజరు పట్టీ పరిశీలిస్తే ప్రభుత్వం ప్రకటించిన సెలవులే కాకుండా 31 సీఎల్, 14 ఈఎల్, 33 మెడికల్ లీవులు పెట్టారు. మరి నెలనెలా పూర్తి వేతనం తీసుకుంటున్నారని, అయితే సర్వీస్ రిజిస్టర్లో (ఎస్సార్)లో మెడికల్, ఈఎల్లు నమోదు కావడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరి ఎంఈఓలకు తెలియకుండా, వారి పాత్ర లేకుండా ఇదేలా సాధ్యమా అనేది అంతుచిక్కని ప్రశ్న. జిల్లా అధికారులు ఇలాంటి పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి చెందిన పాఠశాల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద అభివృద్ధి ఐదుగురు ఉపాధ్యాయులు, 70 మంది విద్యార్థులు గతేడాదిలో 33 మంది.. ఈ ఏడాది నలుగురే విద్యాశాఖ ఉదాసీనత.. విద్యార్థుల భవిష్యత్ పాతర ఫలితంగా పాఠశాల శాశ్వత మూత దిశగా అడుగులు ప్రజాధనాన్ని రూ.లక్షల్లో జీతాలు తీసుకునే విద్యాశాఖాధికారులు, రూ.వేలల్లో జీతం తీసుకునే అయ్యోరు బరితెగించారు. విధులకు డుమ్మా కొట్టి.. అధికారులకు ముడుపులు కొట్టి.. బోధనకు మట్టి కొట్టి.. విద్యార్థుల భవిష్యత్కు శాశ్వతంగా పాతరేశారు. ఓ అయ్యోరు.. తన బాధ్యతలను విస్మరించి, విధుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, స్వార్థ పూరితంగా వ్యవహరించడంతో ఆ బడికి శాపంగా మారింది. ఆ గ్రామం మొత్తం ప్రభుత్వ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. వచ్చే విద్యా సంవత్సరానికి ఆ బడి విద్యాశాఖ రికార్డుల్లో శాశ్వతంగా మూతబడి పోనుంది. మారుమూల ప్రభుత్వ పాఠశాల కావడంతో విద్యార్థుల భవిష్యత్ను కాంక్షించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్లో రూ.6 లక్షలు ఖర్చు పెట్టి మరుగుదొడ్లు, భవనాల ఆధునికీకరణతోపాటు తరగతి గదుల్లో వసతులు తదితర సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు సదరు ఉపాధ్యాయుడి నిర్వాకం కారణంగా విద్యార్థుల్లేని పరిస్థితికి వచ్చి మరో ఏడాదికి ఈ పాఠశాలను శాశ్వతంగా మూతవేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఈ గ్రామానికి విద్యశాపంగా మారుతోంది. మరో వైపు ఆధునికీకరించిన పాఠశాల భవనాలు నిరుపయోగంగా మారనున్నాయి. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
నెల్లూరు (లీగల్): కక్షిదారులు రాజీపడొస్తే లోక్ అదాలత్లో సత్వర న్యాయాన్ని అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్ ఆయన మాట్లాడారు. కేసులను రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం ఓ కేసులోని బాధితులకు రూ.కోటి చెక్కును ఆయనతో పాటు జేసీ వెంకటేశ్వర్లు, ఎస్పీ అజితా వేజెండ్ల, కమిషనర్ నందన్ అందజేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 58,191 కేసులను పరిష్కరించారు, లబ్ధిదారులకు రూ.30,48,38,493ను చెల్లించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కోవూరులో 5450, కావలిలో 5269, ఆత్మకూరులో 2175, ఉదయగిరిలో 3274, గూడూరులో 1077, వెంకటగిరిలో 5210, కోటలో 1521, నాయుడుపేటలో 2161, సూళ్లూరుపేటలో 2711 కేసులు పరిష్కారమయ్యాయి. నెల్లూరులోని వివిధ కోర్టుల్లో కేసుల పరిష్కారానికి తొమ్మిది ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా న్యాయమూర్తులు గీతా, శ్రీనివాస్, సోమశేఖర్, శ్రీనివాస్, స్వాతి, భరద్వాజ్, శారద, అబ్దుల్ రహిమాన్, నిషాద్నాజ్, మెంబర్లుగా సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసరావు, శిఖివాహన్, కృష్ణయ్య, శేఖర్ వ్యవహరించి 30,343 కేసులను పరిష్కరించారు. వేనాటి చంద్రశేఖర్రెడ్డి, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం 'బ్యాగో'గులు
విద్యార్థులకు ఎంతో కీలకమైనవి బ్యాగులు. చిట్టి భుజాలతో పాఠ్యపుస్తకాలను ఇందులో ఉంచుకొని పాఠశాలకు ఠీవిగా వస్తారు. నాణ్యతతో కూడిన వీటిని అందించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి నాసిరకమైనవి అంటగట్టింది. వీటిని ఇచ్చిన రెండు నెలలకే చినిగిపోతున్నాయంటే ఇవి ఎంత క్వాలిటీవో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సర్కారీ పాఠశాలల్లో చదివే వారు సామాన్యులనే అంశాన్ని విస్మరించి అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా వ్యవహరిస్తున్న టీడీపీ తీరుపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. మా ఇద్దరు పిల్లలు జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇచ్చిన బ్యాగులు రెండు నెలలకే పూర్తిగా చినిగిపోయాయి. మొద ట్లోనే జిప్లు పాడైపోతే కొత్తవి వేయించాం. అయి నా బ్యాగ్ పైభాగం దెబ్బతింటోంది. పుస్తకాల బరువుకు హ్యాండిళ్లు ఆగడం లేదు. తరచూ తెగిపోతున్నాయి. మళ్లీ మళ్లీ కుట్టించాల్సి వస్తోంది.– జీవన్కుమార్, పోస్టల్ కాలనీనెల్లూరు(టౌన్): తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని గత ఎన్నికలకు ముందు ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తీరా కొలువుదీరాక కార్పొరేట్కు పెద్దపీటేస్తూ.. సర్కారీ బడులపై అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. నాడు – నేడు మొదలుకొని స్టూడెంట్లకు అందజేసే విద్యా కానుక వరకు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. విద్యాసంవత్సర ప్రారంభంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ పేరుతో అందజేసిన పలు వస్తువులు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా బ్యాగులు రెండు నెలలకే చినిగిపోయాయి. ఈ పరిణామాల క్రమంలో వీటి నాణ్యతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.అత్యంత దుర్భరంగాప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కార్ అందజేసిన బ్యాగులు దుర్భరంగా మారుతున్నాయి. రెండు నెలలకే ఇవి చినిగిపోతున్నాయి. వీటిని కొందరు కుట్టించినా, సమస్య మళ్లీ మొదటికొస్తోంది. ఫలితంగా దెబ్బతిన్న వాటితోనే స్కూళ్లకు రావాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరికొందరు చేసేదేమీ లేక కొత్త వాటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.నాటి బ్యాగులు.. నేటికీ పదిలంగాగత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థకు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పెద్దపీటేశారు. నాడు – నేడుతో వీటి రూపురేఖలను సమూలంగా మార్చి.. స్టూడెంట్స్కు నాణ్యతతో కూడిన బ్యాగులను అందజేశారు. ఇవి నేటికీ పదిలంగా ఉండటంతో ఇప్పటికీ పలువురు విద్యార్థులు వీటినే వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సర్కార్ అందించిన బూట్లు, సాక్సులు సైతం నాసిరకంగానే దర్శనమిస్తున్నాయి.జిల్లాలో ఇలా..జిల్లాలో 3221 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ఫౌండేషన్ – 968.. బేసిక్ ప్రైమరీ – 1187.. మోడల్ ప్రైమరీ – 79, హైస్కూళ్లు – 288, హైస్కూల్ బీపీఎస్ – 74, హైస్కూల్ ఎమ్పీఎస్ – 31. ఇందులో 1,61,959 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో బ్యాగులు, బెల్ట్, నోట్ బుక్స్, షూలు, సాక్సులు, యూనిఫారం, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, టెక్స్ట్, వర్క్ బుక్స్ను అందజేశారు. విద్యా సంవత్సర ప్రారంభ రోజునే ఇవ్వాల్సిన వీటిని దాదాపు రెండు, మూడు నెలల పాటు అందజేశారు.ధర భారీగా.. నాణ్యత డొల్లగా..!బ్యాగుల పరిస్థితి దారుణంగా మారింది. ఒక్కోదానికి రూ.600 నుంచి రూ.700 వరకు వెచ్చించామని ప్రభుత్వం చెప్తున్నా, వాటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికిచ్చిన జిప్పులు, హ్యాండిళ్లు నెలకే ఊడిపోవడం లేదా తెగిపోతున్నాయి. పైన, కింది భాగాలు చినిగిపోతున్నాయి. వీటిని కుట్టించినా మరో ప్రాంతంలో దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా పుస్తకాలెక్కడ పడిపోతాయోననే ఆందోళనలో విద్యార్థులున్నారు. కొందరు కొత్త వాటిని కొనుగోలు చేస్తుండగా, మరికొందరు ఉన్న వాటినే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు సైజులతో సంబంధంలేకుండా కొందరికి షూస్ను అందజేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నాసిరకంగా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు.నాసిరకంగా ఉన్నాయిమా బాబు జెడ్పీ హైస్కూ ల్లో చదువుతున్నాడు. బ్యాగులు నాసిరకంగా ఉండటంతో తరచూ దెబ్బతింటున్నాయి. దీంతో కొత్త దాన్ని కొను గోలు చేయాల్సి వస్తోంది. నాణ్యతతో ఉన్న వాటినిస్తే విద్యాసంవత్సరం పూర్తయ్యేంత వరకు ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది పేదలు. వీటిని కొనుగోలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. నాణ్యతతో కూడిన బ్యాగులను ఇవ్వాలి.– సూరి, పద్మావతి సెంటర్ -
కూటమి నాయకుల్లో భగ్గుమన్న వర్గ విభేదాలు
నెల్లూరు: జిల్లాలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలో టిడిపి జనసేన నాయకులు మధ్య ఫ్లెక్సీల వివాదం కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. జనసేన నాయకడు భాను కిరణ్పై టీడీపీ నాయకులు దాడులకు దిగారు. ఈ ఘటనలో గాయపడ్డ జనసేన నేత భాను కిరణ్ను ఆత్మకూర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. ఇవి జిల్లాల వారీగా స్థానిక నాయకుల మధ్య ఘర్షణలకు దారి తీస్తూ ప్రజల్లో అసంతృప్తి పెంచుతున్నాయి.అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక నేతల పనితీరు, అధికారుల వ్యవహారశైలి పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో చంద్రబాబు నాయుడు జిల్లా వారీగా సర్వేలు చేయిస్తున్నారని సమాచారం.పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణలు బహిరంగంగా జరిగాయి. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత వ్యాఖ్యలు జనసేన వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఒంగోలులోనూ నేతల మధ్య విభేదాలు ముదిరాయి.కర్నూలు జిల్లా: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కేటాయింపులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీసీ వర్గాలకు విలువ ఇవ్వలేదని ఆరోపణలు, పదవుల కేటాయింపులో అసంతృప్తి వ్యక్తమైంది. -
21న బ్లూబర్డ్–6 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన బ్లూబర్డ్–6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈనెల 21న ప్రయోగించబోతోంది. ఇస్రో రూపొందించిన బాహుబలి (ఎల్వీఎం3–ఎం6) రాకెట్ ద్వారా దీనిని నిర్వహించనుంది. అక్టోబర్ 19వ తేదీనే అమెరికా నుంచి ఈ ఉపగ్రహం షార్కు చేరుకుంది. ఈ ప్రయోగాన్ని గత నెలలో నిర్వహించాల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వచ్చింది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. గతంలో పంపిన బ్లూబర్డ్ ఉపగ్రహాల కన్నా.. 10 రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పని చేసేలా దీనిని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికాల మధ్య ఇది రెండో అతిపెద్ద సహకారం. జూలైలో ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని.. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెల 31న పీఎస్ఎల్వీ సీ62 ప్రయోగాన్ని నిర్వహించేందుకు కూడా ఇస్రో చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల వ్యవధిలో రెండు ప్రయోగాలు నిర్వహించడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుంది. -
గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కారు కుట్ర
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాల తర్వాత గిరిజన మహిళకు దక్కిన రాజ్యాధికారాన్ని చంద్రబాబు చిదిమేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నత పదవి అయిన మేయర్గా ఓ గిరిజన మహిళకు అవకాశం కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు నేతలు అనేకానేక కుట్రలకు పాల్పడి, మేయర్ను, ఆమె కుటుంబ సభ్యులను, కార్పొరేటర్లను పైశాచికంగా వేధించి, చివరకు ఆ పదవి నుంచి గిరిజన మహిళా మేయర్ను తప్పించారు. ఇందుకోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన వికృత రాజకీయం రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. నాలుగేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన మహిళ అయిన పోట్లూరు స్రవంతిని అత్యున్నతమైన మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. నెల్లూరు నగర పాలక సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాలన సాగించారు. బాబు ప్రభుత్వం రాగానే కుట్ర చంద్రబాబు ప్రభుత్వం రాగానే మేయర్ పదవిని చేతిలోకి తీసుకొని, దోపిడీ చేయాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కుట్ర పన్నారు. నగర మేయర్ను అధికార పార్టీలోకి తీసుకోవాలని ప్రయతి్నంచారు. అధికార పార్టీలోకి రాలేదన్న కారణంతో పాటు తాము చెప్పిన చోట సంతకాలు చేయలేదన్న అక్కసుతో మేయర్ కుటుంబాన్ని అష్టకష్టాలు పెట్టారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పూర్తి కాలం పదవిలో కొనసాగనీయకుండానే ఆమెను పదవి నుంచి దింపేసి, మంత్రి నారాయణకు అనుకూలుడైన కార్పొరేటర్కు ఆ పదవి కట్టబెట్టేందుకు కుట్రలకు తెగబడ్డారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు. మేయర్ పీఠంపై డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ను కూర్చోబెట్టేందుకు కార్పొరేటర్లకు తాయిలాలు ఎరవేశారు. కార్పొరేటర్లు లొంగకపోవడంతో వేధింపులు, అరాచకాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై అక్రమ కేసులు, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ బెదిరించి 40 మందికి పైగా కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడంతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాల్సి వచ్చింది. అధికార పార్టీ చెప్పిన విధంగా ఉండాలని రాయబేరాలు చేసినా మేయర్ ససేమీరా అనడంతో మంత్రి, ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 18 నెలలుగా ఆమెను, ఆమె కుటుంబాన్ని రౌడీమూకలతో బెదిరించారు. కార్పొరేషన్ పరిధిలో భవనాల మార్టిగేజ్ విషయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని, కార్పొరేషన్ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేశారంటూ పలు అక్రమ కేసులతో మేయర్ భర్త జయవర్దన్ను జైలుపాలు చేశారు. మేయర్ను సోషల్ మీడియాలో మానసికంగా వేధించారు. కార్పొరేషన్లో మేయర్కు దక్కాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మేయర్ అన్నింటినీ భరిస్తూ వచ్చారు. చివరకు ఆమెపై అవిశ్వాసం పెట్టడానికి నిర్ణయించారు. అవిశ్వాసానికి సహకరించాలని కార్పొరేటర్లపైనా వేధింపులు, బెదిరింపులు మితిమీరాయి. తమకు మద్దతు పలకని కార్పొరేటర్లను పోలీసులతో కిడ్నాప్ చేయించి క్యాంపు రాజకీయాలకు దిగారు. కార్పొరేటర్లకు తాయిలాలు ప్రకటించి తమ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న తరుణంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ టీడీపీలోకి ఫిరాయించిన ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి వైఎస్సార్సీపీలో చేర్పించి, ఝలక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో టీడీపీ గంగవెర్రులెత్తిపోయింది. క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు ఇచ్చి క్యాంపులకు తరలించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను సైతం తాయిలాలతో పాటు అక్రమ కేసులతో బెదిరించి టీడీపీ కండువా కప్పారు. వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్లను కూడా అసభ్య పదజాలాలతో బెదిరించారు. వారి కుటుంబాలను సైతం టార్గెట్ చేశారు. దీంతో మేయర్ స్రవంతి తన వల్ల మహిళా కార్పొరేటర్లు పడుతున్న బాధకు చలించి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఒక్కో కార్పొరేటర్కు రూ.40 లక్షలు..?
మేయర్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాకైంది. ఉన్న వారు చేజారిపోతారనే ఆందోళనతో కలవరపాటుకు గురై క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది. తాయిలాలతో పాటు విందు, వినోదాలనూ ఏర్పాటు చేశారనే టాక్ సింహపురిలో గుప్పుమంటోంది. మొత్తమ్మీద నో కాన్ఫడెన్స్ మోషన్ ప్రక్రియ టీడీపీ కాన్ఫడెన్స్ ను దెబ్బతిస్తోంది.సాక్షి పొలిటికల్ టాస్్కఫోర్స్: అవిశ్వాసం.. ఈ పదం వింటే సింహపురిలో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మేయర్పై ఈ నెల 18న జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడక అని నిన్నామొన్నటి వరకు అంతా భావించారు. అయితే సీన్ కట్ చేస్తే పరిణామాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఇమడలేక.. అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్బై చెప్పి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్తో పాటు మరొకరి కుమారుడ్ని కిడ్నాప్ చేయించారు. ఆపై వారిని బెదిరించి టీడీపీ కండువాలు కప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. నాడు విస్మరణ.. నేడు ప్రాధేయపడుతూ.. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది. ఈ క్రమంలో 40 మంది కార్పొరేటర్లను ప్రలోభాలను గురిచేసి తమ పంచన చేర్చుకుంది. ఈ తరుణంలో సైకిలెక్కిన వారిని నిన్నామొన్నటి వరకు చీపురుపుల్లల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీసేశారు. అయితే ఇప్పుడు వారు అవసరం కావడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్ చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అనిల్ రంగప్రవేశంతో సీన్ రివర్స్ వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండింది. ఈ తరుణంలో టీడీపీ వ్యవహార శైలికి అడ్డుకట్టేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేరి్పంచడంతో నివ్వెరపోవడం నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వంతైంది. దీంతో మరికొందరు చేజారి పోకుండా క్యాంపులకు తరలించారు. క్యాషే.. క్యాషునిన్నామొన్నటి వరకు కార్పొరేటర్లను లెక్కచేయలేదు. ఈ తరుణంలో అనిల్ రంగప్రవేశంతో వీరికి డిమాండ్ అమాంతం పెరిగింది. మంత్రి, ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. కండువాలు మార్చకండంటూ ప్రాధేయపడటాన్ని ప్రారంభించారు. తాయిలాలనూ ఎరేశారు. ఒక్కో కార్పొరేటర్కు రూ.25 లక్షల వరకు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించే వాహనమెక్కించారు. సందట్లో సడేమియాగా నెల్లూరు సిటీకి చెందిన ఒకరు రూ.40 లక్షలను డిమాండ్ చేశారనే చర్చ స్టార్టయింది. కొసమెరుపేమిటంటే ఈ మొత్తాన్ని ముందే ఇస్తేనే వాహనమెక్కుతానని స్పష్టం చేయడంతో ఆయన అడిగినంత మేర సమర్పించారనే టాక్ నడుస్తోంది. దీంతో ఆయన క్యాంపునకు సై అన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నారాయణ, కోటంరెడ్డి సతమతమవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు. -
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరులో కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
డీఎస్పీ జోక్యంతో కేసు నమోదు
ఆత్మకూరు: కులం పేరుతో దూషించడంతోపాటు కర్రతో దాడి చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారమైనా చేజర్ల పోలీసులు పట్టించుకోలేదు. ఆత్మకూరు డీఎస్పీ జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్య ఈనెల 6వ తేదీన పొలంలో మేకలు మేపుతున్నాడు. పక్క పొలానికి చెందిన నరాల వెంకటేశ్వర్లు తాను సాగుచేస్తున్న జీలుగ పైరులో పశువులు రాకుండా చూడాలని గంగయ్యకు చెప్పి ఇంటికెళ్లాడు. అదే సమయంలో గ్రామంలో అధికార కూటమి పార్టీకి చెందిన సుధాకర్ జీలుగ పైరులో మేకల్ని తోలాడు. గంగయ్య అలా చేయొద్దనగా సుధాకర్ నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రతో దాడి చేశాడు. దీంతో గంగయ్య తల, చేతికి గాయాలయ్యాయి. కొద్దిసేపటికి సుధాకర్ వెళ్లిపోయాడు. అదేరోజు బాధితుడు చేజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని చెప్పి పంపారు. వారం రోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో ఎస్సైని ఫోన్లో సంప్రదించగా స్టేషన్కు వస్తే రాజీ చేస్తానని, రాకపోతే మీపై కూడా కేసు పెడతానంటూ బెదించాడని బాధితుడు వాపోయాడు. పలువురి సాయంతో డీఎస్పీ కె.వేణుగోపాల్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేశారు. -
తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
● సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా ● జోగి రమేష్ సోదరులతో ములాఖత్ వెంకటాచలం: సీఎం చంద్రబాబు చేసే తప్పులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడితో శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు సాగిస్తున్న నకిలీ మద్యం తయారీని జోగి రమేష్కు అంటగట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక.. సంబంధం లేని ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేయడం రెడ్బుక్ రాజ్యాంగంలో భాగమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తమ పార్టీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా కుట్రలు సాగిస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో వాస్తవాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించే యత్నం చేయలేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా జోగి రమేష్ సోదరులు కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. గళం విప్పే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని అణగదొక్కేందుకు యత్నించడం తగదని హితవు పలికారు. తమ పైశాచికానందం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను జైలుకు పంపినా, అది తాత్కాలికమేననే విషయా న్ని చంద్రబాబు, లోకేశ్ గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసే తప్పులపై ప్రజలు లెక్కలు కడుతున్నారని, సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. డిస్టిలరీల మొదలుకొని లిక్కర్ షాపులు, బెల్టుషాపులు ఇలా అన్నీ టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వంటి వారిపైనా అక్రమ కేసులు పెట్టి వేధించారని, వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. -
చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం
● రూ. 25 లక్షల విలువైన సామగ్రి దగ్ధం ఉదయగిరి: పట్టణంలోని పంచాయ తీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీబాలాజీ చెప్పుల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్ని గుర్తించిన స్థానికులు యజమాని కె.వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. వెంటనే అతనొచ్చి షట్టర్ తీసి చూడగా అప్పటికే పూర్తిగా మంటలు వ్యాపించాయి. రూ.25 లక్షల సామ గ్రి దగ్ధమైంది. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దుకాణం వెనుకవైపు ఉన్న కిటికీ ద్వారా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నిప్పంటించారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
రోడ్డెక్కిన అంగన్వాడీలు
నెల్లూరు(దర్గామిట్ట): హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని అంగన్వాడీ వర్క ర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవా రం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ పేర్కొందని, అయితే నేటికీ అతీగతీ లేదని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా రూ.24,860ను ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చిందని, దీని మేరకు అందజేయాలని డిమాండ్ చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమ్మె కాలంలో తమకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నేతలు శేషమ్మ, మల్లెమ్మ, కామాక్షమ్మ, సంపూర్ణమ్మ, రాధ, ప్రమీల, లక్ష్మీ కాంతం, సుగుణమ్మ, మసస్తామ్మ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
లక్షలు మింగేసి లక్షణంగా..!
వింజమూరు (ఉదయగిరి): అధికారం అండతో కొందరు చెలరేగిపోతున్నారు. లక్షలను స్వాహా చేసినా.. లక్షణంగా ఉంటున్నారు. వింజమూరు మండలం కాటేపల్లికి చెందిన సర్పంచ్ విజయలక్ష్మమ్మ అప్పట్లో విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు కలిసి రూ.లక్షల పంచాయతీ నిధులను కాజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిధుల దుర్వినియాగం వాస్తవమేనని తేల్చారు. వీటిని పంచాయతీ ఖాతాలో జమ చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసు పెడతామంటూ సర్పంచ్కు నోటీస్ను జారీ చేశారు. అయితే అధికార పార్టీ అండతో ఈ ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయడంలేదు. ఇంత జరుగుతున్నా, క్రిమినల్ కేసును పెట్టకుండా.. నిధులను రికవరీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇదీ జరిగింది.. మండలంలోని కాటేపల్లికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ విజయలక్ష్మమ్మ తన పదవీ కాలంలో రూ.24.13 లక్షలను స్వాహా చేశారని కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి ఈ ఏడాది ఏప్రిల్లో నివేదిక ఇచ్చారు. దీంతో ఆర్నెల్ల పాటు చెక్ పవర్ను రద్దు చేస్తూ, 15 రోజుల్లో సంజాయిషీని జిల్లా పంచాయతీ అధికారి కోరారు. అయినా సదరు సర్పంచ్ స్పందించకపోవడంతో మరో నోటీస్ను గత నెల్లో జారీ చేశారు. నిధులను వారంలో పంచాయతీ ఖాతాలో జమ చేయాలని, లేకపోతే క్రిమినల్ కేసు నమోదు చేసి నిధులు రాబడతామని తెలిపారు. అయినా సదరు సర్పంచ్ ఖాతరు చేయలేదు. ఇంత జరిగినా ఎలాంటి చర్యలను అధికారులు చేపట్టలేదు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులపై ప్రేమెందుకో..? పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఉందని విచారణలో కందుకూరు డీఎల్పీఓ తేల్చారు. అయితే వీరిలో కార్యదర్శి ప్రసన్నలక్ష్మినే సస్పెండ్ చేశారు. మిగిలిన విజయమ్మ, శీనయ్యపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికార బలం ఉండటంతోనే చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల పక్కదారి.. నేటికీ కొనసాగుతూ.. కాటేపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం ఇప్పటికీ జరుగుతూనే ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తాగునీటి మోటార్ల రిపేర్ల పేరుతో అధిక మొత్తంలో ఎం బుక్లను రికార్డు చేసి నిధులను డ్రా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గరిష్టంగా రూ.12 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని, అయితే రూ.33 వేల వరకు డ్రా చేశారని చెప్తున్నారు. పంచాయతీలో రూ.29 లక్షల నిధులు అందుబాటులో ఉన్నా, ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు సర్పంచ్ తీర్మానాలివ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.భారీగా నిధుల దుర్వినియోగం రికవరీకి ఆదేశాలిచ్చినా పట్టించుకోని సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల తీరూ ఇంతే అఽధికారం అండతో బేఖాతర్ -
వైఎస్సార్సీపీ నాయకులకు పదవులు
నెల్లూరు సిటీ: జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్సీపీలో రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. కోవూరు నియోజకవర్గానికి చెందిన మావులూరు శ్రీనివాసులురెడ్డి రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీగా, నెల్లూరు నగరానికి చెందిన మన్నేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం పబ్లిసిటీ విభాగం జనరల్ సెక్రటరీగా, రూరల్కు చెందిన పప్పు విజయ్రెడ్డి ఐటీ విభాగం సెక్రటరీగా, సిటీకి చెందిన ఖాజన వెంకటశేషయ్య ఆచారిని రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జనవరిలో సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నెల్లూరు (టౌన్): డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు www. bseap.gov.inలో దరఖాస్తు చేసుకొని, ఆపై కాపీని డౌన్లోడ్ చేసి డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఫీజును ఈ నెల 27లోపు చెల్లించాలని కోరారు. డ్రాయింగ్ – లోయర్ గ్రేడ్ రూ.100.. హయ్యర్ గ్రేడ్ రూ.150.. హ్యాండ్లూమ్ వీవింగ్ – లోయర్ గ్రేడ్ రూ.100.. హయ్యర్ గ్రేడ్ రూ.200.. టైలరింగ్, ఎంబ్రాయిడరీ – లోయర్ గ్రేడ్ రూ.150.. హయ్యర్ గ్రేడ్ రూ.200 ఫీజును చెల్లించాలని తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో వచ్చే నెల మూడు వరకు.. రూ.75తో వచ్చే నెల ఆరు అవకాశముందని చెప్పారు. పిన్నెల్లి సోదరులతో అనిల్ ములాఖత్ వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగా..కొడవలూరు: మాజీ మంత్రి, వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వీరి చలపతిరావు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్బాబు, పార్టీ ఇందుకూరుపేట మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, నేత కలువ బాలశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో తండ్రికి జీవిత ఖైదు నెల్లూరు (లీగల్): కన్న కూతురిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు దశరథ్కు జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల మేరకు.. వింజమూరు బీసీ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ దశరథ్కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్లోని మేనమామ ఇంట్లో ఉండేవారు. 12 ఏళ్ల రెండో కుమార్తె ఎనిమిదో తరగతి వరకు చదువుకొని ఇంటి పనుల్లో తల్లికి చేదోడువాదోడుగా ఉండేవారు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకోవడంతో భార్య విసిగిపోయి తన సోదరుడి ఇంటికెళ్లిపోయారు. ఆపై పెద్దలు రాజీచేయడంతో ఇంటికొచ్చారు. ఈ తరుణంలో దుస్తులు, చెప్పులను కొనిస్తానని చెప్పి కుమార్తెను ఇంటి నుంచి 2020, జూన్ 25వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో వింజమూరు తీసుకెళ్లారు. ఆ సమయంలో దుకాణాల్లేకపోవడంతో కలిగిరిలోని బంధువులు ఇంటికి రాత్రి వెళ్లారు. కొద్దిసేపటికి బయల్దేరగా, మార్గమధ్యలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సెంటర్లో బాలికను వదిలి వైన్ షాపులో మద్యం సేవించొచ్చారు. ఆపై వింజమూరు బయల్దేరగా, మార్గమధ్యలో నేరేడుపల్లి సమీపంలోని నిమ్మ తోట వద్ద బైక్ను ఆపి కుమార్తెను చెట్ల చాటుకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై తల్లికి బాలిక మరుసటి రోజు చెప్పారు. దీంతో తల్లి తన బంధువులతో కలిసి వింజమూరు పోలీస్స్టేషన్లో అదే ఏడాది జూన్ 27న ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు కావడంతో కావలి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపి దశరథ్ను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో చార్జిషీట్ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు. -
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్మెహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.మా పార్టీకి సంబంధం లేని మేయర్పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చలపతిరావు
కొడవలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వీరి చలపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులను పార్టీ కార్యాలయం గురువారం విడుదల చేసింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం ఈయన కొనసాగుతున్నారు. డీసీఎమ్మెస్ చైర్మన్గా గతంలో రెండుసార్లు పనిచేశారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహణ నెల్లూరు (టౌన్): జవహర్ నవోదయ విద్యాలయలో ప్రవేశానికి గానూ శనివారం నిర్వహించనున్న పరీక్షను పారదర్శకంగా జరపాలని విద్యాలయ ప్రిన్సిపల్ పార్వతి పేర్కొన్నారు. దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లకు గురువారం నిర్వహించిన ఓరియెంటేషన్ ప్రోగ్రామ్లో ఆమె మాట్లాడారు. ఆరో తరగతిలో ప్రవేశానికి గానూ జిల్లా వ్యాప్తంగా 3069 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హాల్టికెట్, ఆధార్ జెరాక్స్ కాపీ, బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ప్యాడ్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 10.30కు రిపోర్ట్ చేయాలన్నారు. తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశం నేడు నెల్లూరు (టౌన్): విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై టౌన్హాల్ రీడింగ్ రూమ్లో తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్నామని పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. పారిశ్రామిక పార్క్ భూముల పరిశీలన దగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల జాతీయ రహదారి పక్కన పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సేకరించాల్సిన భూములను జేసీ వెంకటేశ్వర్లు, కావలి ఆర్డిఓ వంశీకృష్ణ గురువారం పరిశీలించారు. సర్వే నంబర్ 47లో సుమారు 21 ఎకరాల్లో భూములను రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. వీటిని ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని, ఏమైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని జేసీ కోరారు. ఆర్ఐ ప్రియాంక, మండల సర్వేయర్ రూబియా, వీఆర్వో బాలనాగమ్మ తదితరులు పాల్గొన్నారు. అరుణపై పీడీ యాక్ట్ కోవూరు: జిల్లాలో దొంగతనం, దాడులు, బెదిరింపులు, మోసాలు, గంజాయి కేసులతో పలుమార్లు వివాదాల్లో నిలిచిన లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ను అమలు చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు కోవూరు పోలీసులు తరలించారు. పెన్నా డౌన్ స్ట్రీమ్ పర్యవేక్షణ సంగం: సంగంలో పెన్నా డౌన్ స్ట్రీమ్ ఎడమవైపు గట్టులో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈఈ అనిల్కుమార్రెడ్డి గురువారం పరిశీలించారు. ఇటీవల వచ్చిన తుఫాన్ల ప్రభావంతో డౌన్న్స్ట్రీమ్ ఎడమ వైపు గట్టు కోతకు గురవుతోంది. దీన్ని పరిశీలించిన అనంతరం గట్టు రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతు పనులను తక్షణమే చేపడతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే శాశ్వత రక్షణ కల్పించేలా పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. -
స్టార్టప్లపై యువత ఆసక్తి
● వీఎస్యూ వీసీ శ్రీనివాసరావు వెంకటాచలం: స్టార్టప్లపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోందని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్యూలో గురువారం టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్వంలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్న్ షిప్ అండ్ స్టార్టప్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఐడియా టు ఎగ్జిక్యూషన్ పేరుతో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు సంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, తమ సృజనాత్మకత, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని సూచించారు. స్టార్టప్ల్లో విజయం సాధించాలంటే మార్కెట్పై అవగాహన, స్పష్టమైన ప్రణాళిక, టీమ్ వర్క్, కొత్త ఆలోచనలు కీలకమని వెల్లడించారు. విద్యార్థుల్లో వ్యాపార ధోరణిని పెంపొందించేందుకు యూనివర్సిటీ అన్నివిధాలా సహకరిస్తుందని తెలియజేశారు. మంచి స్టార్టప్ ఐడియా తెచ్చిన వారికి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహిస్తామన్నారు. స్టార్టప్ల ప్రాముఖ్యత, వ్యాపార ఆలోచనలను అమలు దిశగా తీసుకెళ్లే వ్యూహాలు, ప్రస్తుత పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాల గురించి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ రూసా సీఈఓ వంశీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో టూరిజం మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అనుమతుల్లేని గ్యాస్ ఏజెన్సీపై కేసు
● 133 ఫుల్, 92 ఖాళీ సిలిండర్లు, రెండు వాహనాల స్వాధీనం నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని రామ్ గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. అనుమతి లేకుండా ఏజెన్సీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి కథనం మేరకు.. రూరల్ మండలంలోని కొత్తకాలువ సెంటర్ వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీలో గురువారం తనిఖీలు జరిగాయి. ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా పీఈఎస్ఓ లైసెన్స్, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారని గుర్తించారు. విక్రయాలకు సిద్ధంగా ఉంచిన రూ.6.87 లక్షల విలువైన కమర్షియల్ సిలిండర్లు 133, 92 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించే రెండు అశోక్ లేలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 6ఏ కేసు నమోదు చేశారు. కాగా సిలిండర్లను భద్రంగా ఉంచేందుకు పీఎంకేఆర్ భారత్, శ్రీవెంకయ్య స్వామి, శ్రీకార్తీ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలకు తరలించారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ శ్రీహరి, రూరల్ తహసీల్దార్ ఎస్.కృష్ణప్రసాద్, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటరెడ్డి, సహాయ పౌరసరఫరాల అధికారి లక్ష్మీనారాయణరెడ్డి, డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి డబ్బుతోనే కార్పొరేటర్ల కొనుగోలు
● కోటంరెడ్డి సోదరుల అక్రమాలపై విచారణ జరపాలి ● మేయర్ భర్త జయవర్ధన్ నెల్లూరు రూరల్: గంజాయి డబ్బుతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్నారని మేయర్ స్రవంతి భర్త పొట్లూరి జయవర్ధన్ ఆరోపించారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అక్రమాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు ఎన్ని కోట్లిచ్చి టీడీపీలో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సామాన్య గిరిజన బిడ్డ మేయర్గా ఉంటే, ఆమెను పీఠం నుంచి దింపేందుకు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు కార్పొరేటర్లను రహస్య స్థావరాలకు తరలించి.. విమానాల్లో తిప్పుతూ రూ.కోట్లను వెచ్చిస్తున్నారని, దీని వెనుక గంజాయి మాఫియా డాన్ ఉన్న విషయం వాస్తవం కాదానని ప్రశ్నించారు. నెల్లూరులో ఓ వ్యక్తి ఇన్చార్జి మేయర్ కుర్చీ కోసం నాలుగేళ్లుగా ఎక్కని గడప.. తిరగని ఇల్లు లేదని విమర్శించారు. ఈ అవకాశం కల్పిస్తామని రూ.రెండు కోట్లను వసూలు చేసింది గంజాయి మాఫియా డాన్ కాదానని ప్రశ్నించారు. రాజకీయ భిక్ష పెట్టిందెవరు..? తన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది నేనేనంటూ పెద్ద మనిషి పదేపదే చెప్తున్నారని, అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతోనే స్రవంతికి మేయర్ పీఠం దక్కిందని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న స్నేహితులను సైతం మోసం చేసిన ఘనుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అని మండిపడ్డారు. ఇన్ని ఆస్తులెక్కడివి..? పాల డబ్బాకు వంద రూపాయల్లేవని చెప్పుకొన్న నువ్వు ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలని కోటంరెడ్డిని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్లో ప్రభుత్వ భూములు, గంజాయితో వచ్చిన డబ్బులతో మాగుంట లేఅవుట్లో రూ.20 కోట్లతో ఇల్లు.. హైదరాబాద్లో రూ.30 కోట్లతో విల్లా.. బెంగళూరులో రూ.100 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కొనింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. ఇసుక మాఫియా ద్వారా వచ్చిన రూ.30 కోట్లతో డైమండ్లు, బంగారం సంపాదించింది నిజం కాదానన్నారు. ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి రూ.వందల కోట్లతో ఇల్లు కడుతున్నారని, ఈ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వీరి అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. -
నవాబుపేట పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఐదో డివిజన్ గిరిజన కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, ఆరో డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ తనయుడు మద్దినేని శ్రీధర్ను నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారనే విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, కామాక్షిదేవి.. స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్స్టేషన్ లోపలికి అనిల్, చంద్రశేఖర్రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను భారీగా మోహరించారు. ఖాకీలు అదుపులోకి తీసుకున్న ఇద్దరి ఆచూకీ అర్ధరాత్రి వరకు తెలియకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వారి కుటుంబసభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసుల ఫోన్లు స్విచ్ఛాఫ్ తాడేపల్లిలో ఓబిలి రవిచంద్ర, శ్రీధర్ను పోలీసులు గురువారం సాయంత్రం ఐదు గంటలకు అదుపులోకి తీసుకొని నెల్లూరు తరలిస్తున్నామని కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే వీరిని ఎక్కడికి తీసుకెళ్లారో అర్ధరాత్రి వరకు తెలియలేదు. పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే అవి స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. ఏ కేసులు నమోదు చేశారోననే అంశంపైనా స్పష్టతను ఇవ్వలేదు. మరోవైపు పోలీస్స్టేషన్లోనే అనిల్కుమార్యాదవ్, చంద్రశేఖర్రెడ్డి దాదాపు రెండు గంటలకుపైగా ఉన్నారు. తమ పార్టీ నేతల వివరాలు తెలిసేంత వరకు వెళ్లేది లేదని పార్టీ శ్రేణులు భీష్మించుకొని కూర్చున్నారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న అనిల్కుమార్యాదవ్పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న చంద్రశేఖర్రెడ్డి ఓ కార్పొరేటర్, మరొకరి కుమారుడి అరెస్ట్ నేపథ్యంలో భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పోలీసుల మోహరింపు ఎప్పుడేమి జరుగుతుందోననే ఉత్కంఠ అర్ధరాత్రి వరకు వివరాలు వెల్లడించని పరిస్థితి కుటుంబసభ్యుల ఆందోళన -
ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్
● కడప కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు(క్రైమ్): పదేపదే నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లపై పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మూలాపేట రాజీవ్ గృహకల్పకు చెందిన ఎస్.జయప్రకాష్ ప్రస్తుతం నవాబుపేటలో ఉంటున్నాడు. అతడిపై చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. నెల్లూరు నగరం, బుచ్చి పోలీస్స్టేషన్లలో ఐదు కేసులున్నాయి. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన షేక్ షాహుల్ హమీద్ ప్రస్తుతం జనార్దనరెడ్డి కాలనీ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నాడు. చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అతడిపై 28 కేసులున్నాయి. పలుమార్లు పోలీసులు ఇరు వురికి కౌన్సెలింగ్ నిర్వహించినా వారితీరులో మా ర్పురాలేదు. పదేపదే నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరిద్దరిపై కలెక్టర్ అనుమతితో పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న జయప్రకాష్, షాహుల్ హమీద్కు చిన్నబజారు పోలీసు లు నోటీసులు అందజేశారు. అనంతరం వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు గురువారం తెలిపారు. బ్యాగ్లు కత్తిరించి నగదు, సెల్ఫోన్ చోరీ నెల్లూరు(క్రైమ్): తల్లీకుమార్తె హ్యాండ్ బ్యాగ్లను కత్తిరించి నగదు, సెల్ఫోన్ను గుర్తుతెలియని దుంగులు అపహరించిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామంలో సుజాతమ్మ నివాసం ఉంటున్నారు. ఆమె బుధవారం తన కుమార్తెను తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. కుమార్తెకు చికిత్స చేయించి తిరిగి తమ స్వగ్రామం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్కు వచ్చారు. బస్సు ఎక్కే క్రమంలో సుజాతమ్మ హ్యాండ్ బ్యాగ్ను గుర్తుతెలియని దుండగులు కోసి అందులో ఉన్న రూ.50 వేల నగదు, ఆమె కుమార్తె చేతిలోని సంచిని కోసి రూ.7 వేల నగదు, సెల్ఫోన్ తదితరాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ.. ● తెలుగుగంగ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా పొదలకూరు: స్థానిక తెలుగుగంగ, సోమశిల డీఈ కార్యాలయాల వద్ద మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కలువాయి, రాపూరు మండలాల్లో సోమశిల, కండలేరు జలాశయాలున్న కారణంగా నీటి పారుదలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. కాలువలు ఒక జిల్లాలో, ప్రాజెక్ట్లు మరో జిల్లాలో ఉంటే రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన పైమూడు మండలాలను యథావిధిగా కొనసాగించాల్సిందిగా కోరారు. ధర్నాలో సీహెచ్ చినసుబ్రహ్మణ్యం, సీహెచ్ వెంకటేశ్వర్లు, గురుస్వామి, జనార్ధన్రెడ్డి, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. కాస్మొటిక్స్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు నెల్లూరు(క్రైమ్): కంపెనీతో సంబంధం లేకుండా నకిలీ ఎమ్మార్పీ ధరలు అతికించి ఫేస్క్రీమ్స్ను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఓ కంపెనీకి చెందిన ఫేస్క్రీమ్ రూ.699 ఉండగా స్టిక్కర్ను తొలగించి రూ.1,699కు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా చిన్నబజారులోని సావన్ కాస్మొటిక్స్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో తయారీ తేదీ లేకుండా, ఎక్స్పైరీ అయిన వస్తువులు సైతం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుకాణంలోని సరుకును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీటీఓ విష్ణురావు తదితరులు పాల్గొన్నారు.కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 60.460 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,750 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 830, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 70, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. -
విశాఖకు నిమ్మ ఎగుమతులు
పొదలకూరు: స్థానిక నిమ్మ మార్కెట్ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నిమ్మ కాయలను కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎగుమతి చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి మాట్లాడారు. 10 టన్నుల కాయలను రైతుల నుంచి సేకరించి పంపుతున్నామని పేర్కొన్నారు. కిలోకు రూ.15 గిట్టుబాటయ్యేలా చర్య లు చేపడుతున్నామని వెల్లడించారు. తిరుపతి, చిత్తూ రు, కోనసీమ, అన్నమయ్య, కాకినాడ జిల్లాలకు మరో 15 టన్నుల కాయలను శుక్రవారం ఎగుమతి చేయనున్నామని వివరించారు. సొసై టీ చైర్మన్ మస్తాన్బాబు, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ, సెక్రటరీ ఇలియాజ్ పాల్గొన్నారు. -
క్యాంపునకు తరలింపు
టీడీపీని వెంటాడుతున్న అవిశ్వాస భయం ● నిన్నటి వరకు గెలుపు ధీమా ● తాజా పరిణామాలతో ముచ్చెమటలు ● మేయర్ స్రవంతికి పెరుగుతున్న మద్దతు ● మిగిలిన వారూ ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారనే ప్రచారం ● అధికార పార్టీ ఉచ్చులోంచి బయటపడే యోచనలో మరికొందరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ టీడీపీ సాగిస్తున్న దుర్మార్గపు వైఖరికి చెక్ పడనుందనే ప్రచారం జోరందుకుంది. నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి 2021లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గిరిజనులకు మేయర్గా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో స్రవంతికి ఆ స్థానాన్ని అప్పగించారు. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపింది. అధికార అండతో సంతలో పశువులను కొనుగోలు చేసిన రీతిలో కార్పొరేటర్లకు పచ్చ కండువాలు కప్పి ప్రజాతీర్పును అపహాస్యం చేసింది. అంతటిలో ఆగకుండా మేయర్పై అవిశ్వాసాన్ని ప్రకటించి.. ఇక విజయం తమదేననే ధీమాతో ఉన్న వారికి షాకులమీద షాకులు తగులుతున్నాయి. తాజా పరిణామాలతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. కార్పొరేటర్లతో జగన్మోహన్రెడ్డి సైకిల్ పార్టీకి షాక్ ● వైఎస్సార్సీపీలో కార్పొరేటర్ల చేరిక సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై ఈ నెల 18న పెట్టిన అవిశ్వాస తీర్మాన వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో పచ్చ కండువా వేసుకున్న ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి చక్రం తిప్పి వీరిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో శుక్రవారం చేర్పించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఐదు, ఆరు, 16, 51వ డివిజన్ల కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, మద్దినేని మస్తానమ్మ, వేనాటి శ్రీకాంత్రెడ్డి, సాహితి.. రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్ కార్పొరేటర్ ఫమీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. మేము వైఎస్సార్సీపీ వెంటే ఉంటాం.. మీకో దండం..!వైఎస్సార్సీపీలోకి ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరిన ఐదుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను తిరిగి కప్పుకొన్నారు. మరో ఐదుగురు సైతం చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మాన రోజు నాటికి మరికొందరు సైతం మద్దతిచ్చే యోచనలో ఉన్నారని సమాచారం. మా మద్దతు స్రవంతికే..సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ పొట్లూరి స్రవంతిపై ఈ నెల 18న జరపనున్న అవిశ్వాస తీర్మాన సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాలు సున్నా. ఈ తరుణంలో గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో కొలువుదీరిన టీడీపీ కన్ను ఈ స్థానంపై పడింది. ఇంకేముంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు పచ్చ కండువాలను నయానో.. భయానో కప్పారు. హామీలతో పబ్బం కొన్ని నెలల క్రితం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలోనూ ఫిరాయింపు కార్పొరేటర్లకు ఎన్నెన్నో హామీలిచ్చి పబ్బం గడుపుకొన్నారు. తీరా ఇది పూర్తయ్యాక ముఖం చాటేశారు. మేయర్పై ఇదే తరహాలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి కార్పొరేటర్ల మద్దతుపై నమ్మకం సన్నగిల్లిందనే టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో గతంలో ఎన్నడూ అపాయింట్మెంట్ను సైతం ఇవ్వని అమాత్యుడు తాజాగా, సిటీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమై.. ఒక్కొక్కరికీ రూ.రెండు కోట్ల మేర కాంట్రాక్ట్ పనులు, రూ.50 లక్షల చొప్పున తాయిలాలిస్తామంటూ హామీలిచ్చారు. మేయర్కు అంతర్లీనంగా మద్దతు టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది కార్పొరేటర్లను తమ పంచన చేర్చుకున్నారు. అవిశ్వాసానికి సన్నద్ధమైన క్రమంలో అధికార పార్టీ, మేయర్ దంపతుల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మెజార్టీ బలం ఉందనే ధీమాతో ఉన్న టీడీపీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి, ఎమ్మెల్యేల పోకడల నేపథ్యంలో.. తమ రాజకీయ భవిష్యత్తును కాంక్షిస్తున్న కార్పొరేటర్ల వైఖరిలో మార్పు కనిపించింది. తాజాగా మేయర్కు మద్దతు పెరుగుతుండటంతో అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయి. అవిశ్వాస వాయిదాకు యత్నాలు అధికార బలంతో కుయుక్తులు పన్ని గిరిజన మహిళను గద్దె దింపేందుకు అవిశ్వాస అస్త్రాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి బయటకు తీశారు. తమ అస్మదీయులను ఆ పీఠమెక్కించేందుకు కుయుక్తులు పన్నారు. 40 మంది కార్పొరేటర్ల మద్దతుండటంతో విజయం తమదేననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే మేయర్ స్రవంతి తటస్తంగా ఉండటంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. తమకెలాంటి సంబంధం లేదనే రీతిలో వ్యవహరిస్తోంది. అయితే టీడీపీకి మద్దతిచ్చే కార్పొరేటర్లకు కాంట్రాక్ట్ వర్కులు, తాయిలాలిస్తామని చెప్పినా.. వారి వైఖరిలో మార్పు కనిపిస్తుండటంతో కాపాడుకునేందుకు ఆ పార్టీ పెద్దలు అష్టకష్టాలు పడుతున్నారు. రంగంలోకి కీలక నేతలు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. అధికార పక్షానికి చెమటలు పట్టించేలా పచ్చ కండువా కప్పుకొన్న ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి సొంతగూటికి వచ్చేలా చేయడంతో టీడీపీ శిబిరం షాక్కు గురైంది. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 20 మంది కార్పొరేటర్లలో నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉన్న వారిని కాపాడుకునేందుకు టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పుడెవరు చేజారుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పలువుర్ని ప్రత్యేక వాహనాల్లో క్యాంపునకు తరలించారు. టీడీపీ నేత విజయభాస్కర్రెడ్డి, పట్టాభిరామిరెడ్డి రంగంలోకి దిగారు. ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. -
మేత పొరంబోకులో సోలార్ ప్లాంటా..?
● అడ్డుకున్న రైతులు అనుమసముద్రంపేట: మండలంలోని శ్రీకొలనులో గల సర్వే నంబర్ 411లో దాదాపు 311 ఎకరాల మేత పొరంబోకులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ యజమానులు సిద్ధం చేస్తుండగా, రైతులు గురువారం అడ్డుకున్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా భూములను ఎలా ఇస్తారంటూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పశువుల మేత కోసం ఈ భూములు ఏళ్లుగా ఉన్నాయని, ఇప్పుడు హఠాత్తుగా సోలార్ ప్లాంట్కు ఇచ్చేందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా తమకు కలెక్టర్ నుంచి అనుమతులున్నాయని, ప్లాంట్ను ఇక్కడే ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. దీనికి రైతులు అంగీకరించకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులకు సంస్థ ప్రతినిధులు సమాచారమివ్వగా, వారొచ్చి రైతులకు నచ్చజెప్పారు. -
బాధితులకు సత్వర న్యాయం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులను పారదర్శకంగా పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. డివిజన్ల వారీగా నమోదైన అట్రాసిటీ కేసులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో 147 కేసుల్లో రూ.1.74 కోట్లు, నవంబర్లో 48 కేసుల్లో రూ.36.75 లక్షలు నష్టపరిహారంగా బాధితులకు చెల్లించినట్లు చెప్పారు. ఇంకా 65 కేసుల్లో రూ.94 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్పీ డాక్టర్ అజిత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయాలు, పార్టీలకతీతంగా పారదర్శకంగా నమోదు చేస్తున్నామని చెప్పారు. అక్రమ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని స్టేషన్ల పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. తొలుత కమిటీ సభ్యులు జిల్లాలోని పలు సమస్యలపై ప్రస్తావించారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు వంశీకృష్ణ, పావని, డీఎస్పీలు శ్రీనివాసరావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ● సభ్యులు ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ చాలా వరకు తప్పుడు కేసులు కడుతున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత పోలీస్ అధికారులు కేసులు కట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సాయిప్రసాద్ మాట్లాడుతూ పోలీసు కేసులు చాలావరకు తప్పులుగా ఉన్నాయని, కావలి, కందుకూరు, విడవ లూరు ఇలా చాలా పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. గంధం శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల్లో సమన్వయం కొరవడిందని, దానిని సరి చేసుకోవాలని కోరారు. దుంప ఏసోబు మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించి నోటీసులివ్వకుండా మీ ఇల్లు రోడ్ వైండింగ్లో పోతోందని తోటపల్లిగూడూరులో కూల్చారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. -
విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలు నెల్లూరు (టౌన్): విద్యతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ‘విలువల విద్యా సదస్సు’ను పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు హాజరై ప్రవచనలు చేశారు. తొలుత సరస్వతీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సనాతన ధర్మాలతో పాటు తల్లిదండ్రులు, గురువులపై నైతిక విలువలు తెలియజేసే అవగాహన విద్యార్థులకు అవసరమని చెప్పారు. అనంతరం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలను నెల్లూరులో నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు పద్యాలతో పుస్తకాన్ని రూపొందించారని వివరించారు. విద్యార్థుల సందేహాల నివృత్తి సదస్సులో దాదాపు 45 నిమిషాల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలు చేశారు. విద్యార్థులు నవ్యశ్రీ, సందీప్, మేఘన, ఆస్మిన్, ధనలక్ష్మి నిఖిల్ అడిగిన ప్రశ్నలు, సందేహాలను అర్థమయ్యేలా నివృత్తి చేశారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్రెడ్డి, ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని ఘటనలు
● ఆగస్ట్ 13వ తేదీన నెల్లూరు – ముత్తుకూరు రోడ్డు మార్గంలో కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు ఏమీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ● 30వ తేదీన నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వెళ్లే లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. తెల్లవారుజామున కావడంతో వాహనాల రాకపోకల్లేవు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ● నవంబర్ 22వ తేదీన కారు వేగంగా వచ్చి డివైడర్ను ఎక్కింది. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
నెల్లూరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కిడ్నాప్
సాక్షి, నెల్లూరు: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే.. నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మేయర్పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్)లను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్ జగన్ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది. -
నెల్లూరులో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్), కాయల సాహితి (51వ డివిజన్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), షేక్ ఫమిదా (34వ డివిజన్) ఉన్నారు.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. -
నవోదయలో ప్రవేశానికి 13న పరీక్ష
మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నారని కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ పార్వతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 4174 మంది హాజరుకానున్నారని చెప్పారు. హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కార్డుతో గంట ముందే చేరుకోవాలని కోరారు. వివరాలకు 93460 22106 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఫైళ్ల పరిష్కారంలో జిల్లాకు ద్వితీయ స్థానం నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్లను త్వరగా పరిష్కరించడంలో కలెక్టర్ల పనితీరుకు ర్యాంకులను సీఎం చంద్రబాబు బుధవారం ప్రకటించారు. గడిచిన మూడు నెలల్లో వివిధ శాఖల నుంచి 682 ఫైళ్లు రాగా, ఇందులో 628ను క్లియర్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
పర్యావరణ మనుగడకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కీలకం
నెల్లూరు(అర్బన్): తీర ప్రాంత మనుగడకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కీలకమని ఫారెస్ట్స్ కన్జర్వేటర్, గుంటూరు ఐకేవీ రాజు పేర్కొన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పరిరక్షణపై వివిధ తీర ప్రాంత జిల్లాల అటవీ శాఖ అధికారులు, మత్స్య, మైరెన్ శాఖలు, గ్రీన్ టీ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ప్రాంతీయ వర్క్షాపును నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సముద్రంలోని నాచును తిని, పగడపు దిబ్బలను కదిలించి చేపలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా తాబేళ్లు ఉపయోగపడతాయని వివరించారు. ఈ కారణంగా మత్స్య సంపద పెరిగి తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు ఉపాధి లభిస్తోందని వివరించారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒడ్డుకొచ్చి గోతులు చేసి గుడ్లు పెడుతాయని.. పౌర్ణమి, అమావాస్య రాత్రుల్లో మెరిసే వెలుగులను చూస్తూ తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్తాయని తెలిపారు. ఒక్కో తాబేలు 60 నుంచి 120 వరకు గుడ్లు పెడుతాయని, వీటిని కాపాడాలని కోరారు. తమిళనాడుకు చెందిన జాలర్లు 500 హెచ్పీ మోటార్లు కలిగిన హైస్పీడ్ ట్రాలీ బోట్లతో రాష్ట్రంలో వేట సాగిస్తున్నారని, దీని వల్ల మన సంప్రదాయ మత్స్యకారుల వలలు తెగిపోవడమే కాకుండా తాబేళ్లు మృతి చెందుతున్నాయని చెప్పారు. సముద్రంలో ఎనిమిది కిలోమీటర్ల మేర వెళ్లి వేట సాగించాల్సి ఉన్నా, రెండు కిలోమీటర్ల పరిధిలోనే జరుపుతున్నారని తెలిపారు. నిబంధనలు అతిక్రమంచే వారిపై మత్స్య, మైరెన్, అటవీ శాఖలు చర్యలు చేపడతాయని వెల్లడించారు. సముద్ర తాబేళ్లు, ఇతర జంతువుల నమూనా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎఫ్ఓ మహబూబ్బాషా, మత్స్యశాఖ జేడీ శాంతి. గ్రీన్ ట్రీ చైర్పర్సన్ సుప్రజాధరణి, మత్స్యకార సొసైటీ చైర్మన్ కొండూరు పోలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: సీఎం చంద్రబాబు పాలనపై రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాల వాహనాన్ని మండలంలోని సర్వేపల్లిలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్య విద్యనందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని వివరించారు. అయితే టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక, వీటిని ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకోవడం దారుణమని చెప్పారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూస్తుంటే, చంద్రబాబుపై వారిలో ఎలాంటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని చెప్పారు. తమ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తే, ప్రస్తుతం దేన్నీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, వలంటీర్లకు రూ.పది వేలిస్తామని చెప్పి అందర్నీ వంచించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ ఆర్భాటపు ప్రచారాలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసేందేమీలేదని ఎద్దేవా చేశారు. సంబంధం లేని విషయాన్ని మాట్లాడి రాష్ట్ర పరువును జాతీయ స్థాయిలో మంటగలిపారని విమర్శించారు. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు(దర్గామిట్ట): రైతుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నాను సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షానవాజ్, గంగపట్నం రమణయ్య మాట్లాడారు. తుఫాన్ కారణంగా 14 వేల ఎకరాల్లో నారుమడులు.. 1.5 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. దాదాపు 200 ఎకరాల్లో వేరుశనగ దెబ్బతిన్నాయని చెప్పారు. నార్లు పోసుకునేందుకు విత్తనాలు అందుబాటులో లేవని, అవసరమైన మేర సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, దీనికి గానూ 6.7 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచుతామని చెప్పినా, ఆచరణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. నేతలు రామరాజు, వినోదమ్మ, సిరాజ్, రాజగోపాల్, దర్గాబాబు, ఏడుకొండలు, మున్నా, మస్తాన్, ఆదినారాయణ, వనజ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాస్టింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి
సీతారామపురం: సొరంగ మార్గ పనుల వద్ద బ్లాస్టింగ్ జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఆర్డీఓ పావని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారతమాల ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో సొరంగ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. రోజూ ఎన్నిసార్లు బ్లాస్టింగ్ చేస్తున్నారనే అంశాన్ని మ్యాక్స్ ఇన్ఫ్రా బృందాన్ని ఆరాతీశారు. పని ప్రదేశంలో ముందుజాగ్రత్తగా అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని కోరారు. నిర్ణీత గడువులోపు టన్నెల్ పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. తహసీల్దార్ ఫాజిహా తదితరులు పాల్గొన్నారు. -
అందరూ ఉన్న అనాథ ‘పెద్దిరెడ్డి’
కన్నబిడ్డల ఆదరణ కరువు ● భార్య మరణంతో కష్టాలు ఆరంభం ● ఇల్లు అమ్ముకున్న కొడుకు.. వీధిన పడిన పెద్దాయన ఉదయగిరి: ఈ పెద్దాయన పేరు బిజ్జం పెద్దిరెడ్డి. వయసు 75 ఏళ్లు. ఒకప్పుడు బాగా బతికాడు. నలుగురు సంతానంలో ఇద్దరు బిడ్డలు చిన్నతనంలోనే చనిపోయారు. ప్రస్తుతం కొడుకు, కూతురున్నారు. భార్య మృతిచెందారు. వృద్ధుడిని బిడ్డలు పట్టించుకోలేదు. దీంతో కలిగిరిలో ఆర్అండ్బీ అతిథి గృహంలో తలదాచుకుంటున్నాడు. బిడ్డలిద్దరూ ఆర్థికంగా ఉన్నవారే. కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, దోమల దెబ్బకు తల్లడిల్లుతూ అనాథగా మారాడు. కలిగిరికి చెందిన పెద్దిరెడ్డి కష్టపడి పనిచేసి బిడ్డలను చదివించాడు. కొడుకు పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. కూతురికి వివాహమైంది. కలిగిరిలో ఉంటున్నారు. భార్య ఉన్నంత కాలం పెద్దిరెడ్డికి ఇబ్బంది లేదు. కానీ ఆరునెలల క్రితం ఆమె చనిపోవడంతో కష్టాలు మొదలైనట్లు చెబుతున్నాడు. ఉన్న ఇంటిని కొడుకు అమ్మేసి వెళ్లిపోయాడు. ఓ అనాథాశ్రమంలో తండ్రిని చేర్చగా అక్కడ ఉండలేక సొంతూరికి వచ్చేశాడు. ఇక్కడ ఉండేందుకు ఆవాసం లేదు. కూతురు చేరదీయలేదు. దీంతో పెద్దిరెడ్డి ఆర్అండ్బీ బంగ్లాలో ఉంటూ నరకయాతన పడుతున్నాడు. తనకు వచ్చే పింఛన్తో కాలం వెళ్లదీస్తున్నాడు. కూతురు అప్పుడప్పుడూ అన్నం పెడుతుందని చెబుతున్నాడు. తనకు దయనీయ పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. -
ఆరు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఆరు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను బుధవారం ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఎస్సైను ఇన్చార్జిగా నియమించారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయా బృందాలతో ఐజీ సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ప్రతి బృందం తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో నేర నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహించాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. లాడ్జీలు, హోటల్స్ను తనిఖీలు చేయడంతో పాటుగా వారాంతాలు, పండగ రోజుల్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో ఆయన తన చాంబర్లో జేసీ వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో నిమ్మసాగు చేపట్టారని, ఇందులో ఈ సీజన్లో 25 వేల ఎకరాలు కాపునకు వస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నిమ్మ విస్తీర్ణం పెరిగినందున మన ప్రాంతం నుంచి పంపించే నిమ్మకు డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా పతనమయ్యాయని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ రాష్ట్రంలో నిమ్మ డిమాండ్ ఉన్న కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. జిల్లా నుంచి నిమ్మ పంటను ఆయా జిల్లాల్లో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరగా, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు జిల్లా నుంచి నిమ్మ పంటను వెంటనే ఆయా జిల్లాలకు పంపించి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత తదితరులు పాల్గొన్నారు. కిలో నిమ్మకు రూ.15లైనా ఇవ్వండి ● జేసీ వెంకటేశ్వర్లు పొదలకూరు : ప్రభుత్వ మార్కెట్ వ్యాపారులు కిలో నిమ్మకాయలకు కనీసం రూ.15లైనా అందజేయాలని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక నిమ్మమార్కెట్ యార్డు కార్యాలయంలో బుధవారం వ్యాపారులు, రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు పెద్ద మనుస్సు చేసుకుని నెలరోజుల పాటు రైతులకు కనీసం రూ.15 అందజేయాల్సిందిగా సూచించారు. దిగుబడి అధికంగా ఉండడం వల్ల డిమాండ్ పడిపోయి ధరలు దిగజారినట్టుగా వ్యాపారులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ మార్కెట్లో కాయలు వద్దంటున్నారని నష్టాలకు వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు నెలరోజుల పాటు రైతులను ఆదుకుంటే తర్వాత ధరలు పెరుగుతాయని.. నిమ్మ సంక్షోభం నుంచి గట్టెక్కుతుందని జేసీ పేర్కొన్నారు. కొందరు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పురుగు మందులు, ఎరువులను అందజేస్తే కొంత గట్టెక్కుతామని, ఉపాధి హామీలో కాయలను కోసేందుకు కూలీలను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి, హెచ్ఓ ఆనంద్, ఏఎంసీ సెక్రటరీ ఇలియాజ్ పాల్గొన్నారు. -
పేలిన లారీ టైరు
● ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని డ్రైవర్ మృతి గుడ్లూరు: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందారు. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. విజయవాడ వైపు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీ మోచర్ల సమీపంలోకి రాగానే టైరు పేలింది. దీంతో లారీని అదుపు చేయలేకపోయిన చైన్నెకి చెందిన డ్రైవర్ పెరుమాళ్(47) ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడు. క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడ్లూరు ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు. -
ఎనీటైమ్ తాగుతూ తూగుతూ
● మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ మద్యం వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి అవకాశం ఉన్నంత మేరకు విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటుండగా, నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన ఎక్సైజ్శాఖ మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో 200 మద్యం దుకాణాలు, 36కుపైగా బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. మద్యం అమ్మకాలు పెంచుకుని జేబులు నింపుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సమయపాలనకు నీళ్లొదిలారు. మద్యం దుకాణాలు ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించాలి. అయితే అనేక దుకాణాలు, బార్లలో నైట్సేల్స్తో పాటుగా తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగుతున్నాయి. నిత్యం మద్యం అందుబాటులో ఉండటంతో నేరాలు పెరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. – నెల్లూరు(క్రైమ్) -
సాయం చేయబోయిన వ్యక్తిపై కత్తితో దాడి
● మద్యం మత్తులో యువకుల వీరంగం నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో బైక్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డుపై పడిన యువకులను లేపేందుకు వెళ్లిన వ్యక్తిపై సదరు యువకులు కత్తితో దాడిచేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వెంకటేశ్వరపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, సేకరించిన సమాచారం మేరకు.. ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు బైక్పై వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ చివర(పడుగుపాడు వైపు) నుంచి వెంకటేశ్వరపురం వైపు రాంగ్రూట్లో బయలుదేరారు. రోడ్డుపైనున్న స్పీడ్బ్రేకర్లను ఎక్కించే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో యువకులు కిందపడ్డారు. వెనుక బైక్లో వస్తున్న వెంకటేశ్వరపురానికి చెందిన షేక్.బాబు గమనించి తన బైక్ను పక్కనే నిలిపి యువకులను లేపే ప్రయత్నం చేయగా వారు అతనిపై కత్తితో దాడిచేశారు. దీంతో బాబు కాలికి గాయమైంది. స్థానికులు యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని సైతం కత్తితో వీరంగం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా? కేసులు పెట్టినా చంపేస్తామని బెదిరిస్తూ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతికత ఆధారంగా నిందితులు జనార్ధనరెడ్డి కాలనీ వారని తేలడంతో గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు. -
టీడీపీ నేతలతో చెప్పించండి
● పైసలిస్తేనే పని ● దళిత రైతును ఇబ్బంది పెడుతున్న ఏపీఓ అనుమసముద్రంపేట: ‘పైసలిస్తేనే పని జరుగుతుంది. కార్యాలయం చుట్టూ తిరగొద్దు. టీడీపీ నాయకుల చేత చెప్పించండి’ ఇది ఎవరో అన్న మాటలు కాదు. ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత రైతుని వేధిస్తున్న వైనమిది. బాధితుడు పిడుగు మాలకొండయ్య వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం చిన్నఅబ్బీపురం గ్రామంలో ఆయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయమని గత నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే మంజూరు చేయకపోగా ఎకరాకు రూ.7 వేలు డిమాండ్ చేశాడు. అంతేగాక పైఅధికారులు వచ్చినప్పుడు పెట్రోల్ ఖర్చులతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టించాలని, దీనికితోడు టీడీపీ నాయకుల చేత సిఫార్సు చేయించుకోవాలని ఆ దళిత రైతుకు ఏఎస్పేట ఏపీఓ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో రైతు మాలకొండయ్య 15 రోజుల క్రితం నెల్లూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు సైతం అర్జీ ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేదని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికై నా స్పందించి పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. -
జిల్లాల మధ్య జల వివాదం తీసుకురావొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాల విభజనతో జల వివాదం తీసుకురావొద్దు. ఇక్కడి పలు ప్రాంతాలను తిరుపతి జిల్లాలో కలిపేందుకు చేస్తున్న ప్రక్రియను వెంటనే ఆపివేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. శ్రీహరికోట, శ్రీసిటీ, సిలికా, మైకా గనులు తిరుపతి జిల్లాకు వెళ్లిపోవడం జరిగిందన్నారు. కండలేరు జలాశయాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే జల వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్లో కలిపే ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెకంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, సీఐటీయూ నాయకురాలు రెహానా బేగం పాల్గొన్నారు. -
పొలం పనులకు వెళ్లగా..
● పాముకాటుకు వ్యక్తి మృతి జలదంకి (కలిగిరి): జలదంకి మండలం జమ్మలపాళెం గ్రామం కొత్త ఎస్సీ కాలనీకి చెందిన మైనంపాటి రాజశేఖర్ (42) మంగళవారం పాముకాటుతో మృతిచెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. రాజశేఖర్ కూలీ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాజశేఖర్ను చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. రాజశేఖర్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ సుజాత హెచ్చరించారు. నెల్లూరు సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం సలహా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. వైద్యుల రెఫరల్ స్లిప్పులు తీసుకుని స్కానింగ్ చేసి వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గర్భిణులకు కాకుండా ఇతరులకు చేసే స్కానింగ్ వివరాలను వేరొక రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ కిరణ్, సభ్యులు అనాటమీ అసోయేట్ ప్రొఫెసర్ డా.స్వర్ణలతా రెడ్డి, పీడియాట్రిషన్ డా.నానాజిరావు, డీఐఓ డా.ఉమామహేశ్వరి, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓ నేతలు కవితారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా జడ్జిగా ఎంపికనెల్లూరు (లీగల్): నెల్లూరు నగరానికి చెందిన తిరువళ్లూరు ప్రతిమ జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈమె 2003లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 2020లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికై పర్చూరులో విధులు నిర్వర్తించారు. 2023లో నెల్లూరు మొబైల్ ప్రత్యేక కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రతిమను పలువురు న్యాయవాదులు అభినందించారు.8 సవర్ల బంగారు నగల మాయంనెల్లూరు(క్రైమ్): బీరువాలోని నగలు మాయమైన ఘటనపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మూలాపేట ఈఎస్ఆర్ఎం స్కూల్ సమీపంలో నిషాద్ కుటుంబం నివాసం ఉంటోంది. గతనెల 15వ తేదీ ఆమె బీరువాలోని ఎనిమిది సవర్ల బంగారు నగలు కనిపించలేదు. జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారితో కలిసి మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళపై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశ్వంలో ఉచిత నవోదయ మోడల్ టెస్ట్తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం విద్యాసంస్థల్లో గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ నవోదయ విద్యాలయ – 2026 పరీక్షకు సంబంధించి ఉచిత మోడల్ టెస్ట్ జరుగుతుందని ఆ విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మంగళవారం తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఈనెల 13వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా ఎగ్జామ్ జరుగుతుందన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పరీక్ష రాయొచ్చన్నారు. విద్యార్థులు హాల్టికెట్ (అడ్మిట్ కార్డు) జెరాక్స్ కాపీని తీసుకురావాలన్నారు. వివరాలకు 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. డ్రెయిన్లో మృతదేహంముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవం గ్రామ బుడ్డీ డ్రెయిన్ శుభ్రం చేస్తుండగా మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. ఐదురోజుల క్రితం నీటిలో మునిగి మృతిచెందినట్టు భావిస్తున్నారు. పోలీసులు వివరాలు సేకరించారు. -
సమస్యల జాతర
నెల్లూరు (అర్బన్): జిల్లాకే రెఫరల్ ఆస్పత్రిగా ఉన్న దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనేలా తయారైంది . 750 పడకలున్న పెద్దాస్పత్రికి అసౌకర్యాల సుస్తీ చేసింది. నిధులున్నా రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాలనాధికారి పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. స్పెషలిస్టు డాక్టర్లున్నా.. నగరంలో బోధనాస్పత్రిగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నైపుణ్యం కలిగిన స్పెషలిస్టు వైద్యులున్నారు. అన్ని రకాల సాధారణ వైద్యసేవలతో పాటు ఈఎన్టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్, పురిటి పిల్లలు, న్యూరాలజీ, యూరాలజీ, కేన్సర్, గుండె తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన భవనాలు, విశాలమైన వార్డులున్నాయి. ఆధునిక మాడ్యులేటర్ ఆపరేషన్ థియేటర్లున్నాయి. రోజూ సరాసరిన ఓపీ 1,200 నుంచి 1,400 వరకు, ఇన్పేషెంట్లు 500 మంది వరకు ఉంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉరుస్తున్న ఓపీ గదులు గైనకాలజీ విభాగం వద్ద ఓపీ రోగుల కోసం మూడు నెలల క్రితం రూ.19 లక్షలు ఖర్చు చేసి రేకులతో రెండు గదులు నిర్మించారు. అయితే ఈ నిర్మాణంలో ఎంత కమీషన్లు తిన్నారో తెలియదు గానీ చినుకు పడితే చాలు ఉరుస్తున్నాయి. దీంతో వర్షాలు పడే సమయంలో డాక్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. ఉక్కపోతలో ఆపరేషన్లు పెద్దాస్పత్రిలో అధునాతన మాడ్యులేట్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. అందులో ఏసీలు చాలా కాలంగా పని చేయడం లేదు. దీంతో డాక్టర్లు ఉక్కపోత మధ్యనే ఆపరేషన్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా ఆగిపోతే నరకం చూస్తున్నారు. రోగులకు ఇక్కట్లు ఆస్పత్రిలో నడవలేని రోగులు వైద్యం కోసం వస్తే వీల్చైర్ దొరకడం గగనమవుతోంది. ఒక్కోదఫా గంటకు పైగా వెతికి స్టాఫ్ను బతిమాలాడుకుంటే తప్ప వీల్చైర్ దొరకడం లేదు. స్ట్రెచర్లదీ అదే పరిస్థితి. ఓ వైపు వీల్చైర్లు, స్ట్రెచర్ల కొరత వెంటాడుతుంటే ఉన్న వాటిని పలువురు సిబ్బంది ఆస్పత్రి దుప్పట్లు, రికార్డులు, ఇతర పనులకు వినియోగిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది కారణంగా.. ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ స్టాఫ్ను కాదని అవుట్ సోర్సింగ్ విభాగం వారిని నియమించారు. దీంతో పనులు సక్రమంగా జరగడం లేదు. పలు బిల్లులు ఆగిపోతున్నాయి. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, మెడికల్ బోర్డుకు వచ్చే కేసుల రికార్డులు సకాలంలో పంపాలంటే సదరు సిబ్బంది భారీ స్థాయిలో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆరునెలల క్రితం ఓ మహిళా చిరుద్యోగి అనారోగ్యంతో తాను ఉద్యోగం చేసే స్థితిలో లేనందున సర్టిఫికెట్ ఇవ్వాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. అలా సర్టిఫికెట్ ఇస్తే తనను అన్ఫిట్గా భావించి బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆమె ఆశ పడింది. అధికార పార్టీకి చెందిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కూడా సిఫార్సు చేయించింది. అయినప్పటికీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆ ఫైల్ను కదిలించేందుకు రూ.70 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె చేసేదేమీ లేక డబ్బులిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి అప్పటి సూపరింటెండెంట్ సిద్ధానాయక్పై ఆగ్రహం వ్యక్తం చేయగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తిరిగి నగదును బాధితురాలికి ఇచ్చారు. రెగ్యులర్ సిబ్బందిని కాదని అలాంటి వారిని కీలక పోస్టుల్లో నియమించడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొత్త సూపరింటెండెంట్ వచ్చినప్పటికీ లోపాలు సరిచేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలని రోగులు కోరుతున్నారు. ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. ఒకటో నంబర్ వద్ద వందలాది మంది ఓపీలు తీసుకుంటారు. దాని పక్కనే మరుగుదొడ్డి ఉంది. అందులో మొదట పురుషులు, ఆ తరువాత సీ్త్రలకు గదులున్నాయి. అయితే రెండింటికీ ఒకే ద్వారం ఉండటంతో సీ్త్రలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోగి కాపలా ఉంటే మరొకరు లోపలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్క మహిళే వచ్చినప్పుడు వారి బాధ వర్ణనాతీతం. మరోవైపు బాత్రూములను ఉదయం ఒక్కసారే శుభ్రం చేస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. వందలాది మంది వినియోగిస్తుండడంతో ఓపీ వరకు దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే వార్డుల్లోని మరుగుదొడ్లను సక్రమంగా శుభ్రం చేయకపోతుండడంతో దుర్వాసనను భరించలేక రోగులు వైద్యం వద్దు దేవుడా అటూ డిశ్చార్జి చేయించుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి అనుభవం ఏకంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) సభ్యుడి భార్యకే ఎదురైంది. అయినా హెచ్డీఎస్ కమిటీ సభ్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు.సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం ఆస్పత్రిలో బాత్రూములు, లిఫ్ట్లు, అడ్మినిస్ట్రేషన్లో జరిగే లోపాలను సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి దృష్టికి తీసుకెళ్లాం. ఆమె సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. మిగతా వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. –మడపర్తి శ్రీనివాసులు, పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్ ఓపీ వద్ద సీ్త్ర, పురుషులకు ఒకే బాత్రూమ్ పని చేయని లిఫ్ట్లు ఏసీల్లేక ఉక్కపోతలో ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు రూ.19 లక్షలతో ఎంసీహెచ్ మహిళా ఓపీ గదుల నిర్మాణం మూడు నెలలకే ఉరుస్తున్న వైనం పట్టించుకోని అధికారులు -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఆట్యాపాట్యా నేషనల్స్ జూనియర్స్ చాంపియన్షిప్కు నెల్లూరులోని ఎమ్మెస్సెమ్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ తెలిపారు. పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రిషిత, వైష్ణవిని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిడుగురాళ్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా బాలికల జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. పీడీ అజయ్కుమార్, పీఈటీ రేష్మా తదితరులను అభినందించారు. -
రెండు కార్ల బోల్తా
● ఐదుగురు టీచర్లకు తీవ్ర గాయాలు వలేటివారిపాళెం: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని బోల్తా పడి ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలేటివారిపాళెంలోని హెరిటేజ్ పాల కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కందుకూరులో నివాసం ఉంటున్న ఐదుగురు టీచర్లు వలేటివారిపాళెం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు స్కూల్కు కారులో బయలుదేరారు. మండలంలోని నూకవరం గ్రామానికి చెందిన మరో కారు అతివేగంగా వచ్చి టీచర్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలో బోల్తా పడ్డాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన టీచర్లను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పాఠశాల పీడీ ఐజాక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై మదిరినాయుడు తెలిపారు. -
కోటి సంతకాల సేకరణ విజయవంతం
నెల్లూరు సిటీ: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది, కందుకూరు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో మహాయజ్ఞంలా సాగిందని చెప్పారు. తాము సేకరించిన సంతకాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి ఊరేగింపుగా బుధవారం తీసుకురానున్నామని వెల్లడించారు. ప్రతులను గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముగింపు సభను 15న నిర్వహించనున్నామని చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్కు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో 17న అందజేయనున్నామని ప్రకటించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం తమతో కలిపి నడిచాయన్నారు. కరుడుగట్టిన టీడీపీ మద్దతుదారులూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపారని వివరించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబు, నేతలకు కడుపు మండిపోతోందని చెప్పారు. ఇండిగో వ్యవహారంలో వార్ రూమ్ నిర్వహించామని చెప్పుకొని టీడీపీ నవ్వులపాలైందని ఎద్దేవా చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలను సేకరించామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పేరుతో సోమిరెడ్డి దోపిడీ
పొదలకూరు: రైతుల పేరుతో దోపిడీకి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్పడుతున్నారని.. మోంథా, దిత్వా తుఫాన్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిధులను భారీగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. మండలంలోని పులికల్లు సమీపంలో కండలేరు స్పిల్వే కాలువ పనులు, నిమ్మ తోటలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎస్డీఎమ్మెఫ్, ఓ అండ్ ఎం కింద నిధులను ఒకే ఏడాదిలో మంజూరు చేయించుకొని పనులు చేయకుండానే దొంగ బిల్లులు సృష్టించారని ధ్వజమెత్తారు. కొత్తగా అవే పనులకు ఎఫ్డీఆర్ కింద నిధులు మంజూరు చేయించుకొని రూ.16.9 కోట్లను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. జిల్లా చరిత్రలో ఇలా ఇరిగేషన్ తాత్కాలిక పనుల కోసం ఇంత పెద్ద మొత్తంలో రూ.93.27 కోట్లను గతంలో మంజూరు చేయలేదని చెప్పారు. కలెక్టర్ను అధికార పార్టీ నేతలు తప్పుదారి పట్టించారో.. లేక ఒత్తిళ్లకు ఆయన లొంగి పనులు మంజూరు చేశారో అర్థంకావడం లేదన్నారు. విచారణ జరిపితే జైలుకెళ్లడం ఖాయం ఇరిగేషన్ పనులపై విచారణ నిర్వహిస్తే సోమిరెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు జైలుకెళ్లడం ఖాయమని కాకాణి చెప్పారు. తమ హయాంలో అవినీతి జరిగిందని సోమిరెడ్డి పదేపదే అంటున్నారని, ఇరిగేషన్ పనులపై బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కండలేరు స్పిల్వే పనుల కోసం తండ్రీకొడుకు హడావుడి చేశారని, కాలువ తవ్వించి 100 క్యూసెక్కులను సైతం విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వ సొమ్ముపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని ఇరిగేషన్ అధికారులివ్వడంలేదని ఆరోపించారు. నష్టాన్ని అంచనా వేయాలి దిత్వా తుఫాన్తో జిల్లాలో రైతులకు జరిగిన నష్టంపై వెంటనే అంచనాలేయాలని డిమాండ్ చేశారు. వీరిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. వరి పండించొద్దంటూ సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో నిమ్మ రైతులు నిలువునా నష్టపోయారని, తోటల్లో నీరు చేరి ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు. వర్షాలు తగ్గి వారమవుతున్నా, అంచనాలేసేందుకు అధికారులు రాలేదని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా యూరియాపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు విధించి కార్డులను అందజేస్తోందని ధ్వజమెత్తారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, విత్తనాలను ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, నేతలు ఎనిమిరెడ్డి పెంచలరెడ్డి, యాతం పెంచలరెడ్డి, నారాయణరెడ్డి, రామిరెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, పోలంరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శేఖర్రెడ్డి, కోడూరు జనార్దన్రెడ్డి, సుందరయ్య, జనార్దన్, కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లిలో రూ.16.9 కోట్ల స్వాహాకు స్కెచ్ ఒకే ఏడాదిలో పలు పద్దుల కింద పనులు దోచుకునేందుకే తుఫాన్ సమయంలో హడావుడి ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
నైపుణ్య పెంపుతో ఉపాధి అవకాశాలు
కొడవలూరు: నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందొచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని వెంకన్నపురంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని దక్షిణ భాగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, ఉత్తర భాగం అత్యంత వేగంగా డెవలప్ కానుందని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమలు భారీగా రానున్నాయని, వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. వెంకన్నపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న క్రమంలో నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగావకాశాలను పొందాలని సూచించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్ర చైర్మన్ కృష్ణయ్య, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీఎల్డీఓ వసుమతి, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం రేపు నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్.. మాన్యువల్ స్కావెంజర్స్ కమిటీల సమావేశాలను కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉదయం నిర్వహించనున్నామని ఎస్సీ సంక్షేమ జిల్లా సాధికారిత అధికారి శోభారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. -
కరకట్టల పటిష్టతకు ప్రతిపాదనలు
సంగం: జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో కరకట్టల పటిష్టత, నిర్మాణం కోసం రూ.530 కోట్లతో ప్రతిపాదనలను పంపామని ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ తెలిపారు. సంగం బ్యారేజీ సమీపంలోని పొర్లుకట్టలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సెంట్రల్ డివిజన్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు రూ.50 కోట్ల ఎఫ్డీఆర్ నిధులు మంజూరయ్యాయని, పనులను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు. లష్కర్లకు జీతాలు ఆగి ఉన్నాయనే విషయం తెలిసిందన్నారు. వరదలతో పొర్లుకట్టతో పాటు ఇసుక దిబ్బ కోతకు గురవుతోందని రైతులు తెలియజేశారని, దీని పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. తహసీల్దార్ సోమ్లానాయక్, డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
తీరుమారాలి.. లేదంటే బడితపూజే
● యువకులకు పోలీసుల కౌన్సెలింగ్ ● ముమ్మరంగా తనిఖీలు నెల్లూరు(క్రైమ్): రాత్రి వేళల్లో అకారణంగా రోడ్లపై ఉండి మాట్లాడుకోవడం, మద్యం మత్తులో వాహనాల్లో చక్కర్లు కొట్టడం, పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, బహిరంగంగా మద్యం తాగితే సహించేది లేదు. తీరుమారాలి. లేనిపక్షంలో లాఠీ దెబ్బలు తప్పవని పోలీసు అధికారులు యువకులను హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుగా పోలీసు అధికారులు రాత్రి వేళల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. అకారణంగా రోడ్లపై తిరుగుతున్న యువకులకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 59 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్పై 45 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ఎంవీ యాక్ట్ కింద 231 కేసులు నమోదు చేసి రూ.1,42,035ల జరిమానా విధించారు. పోలీస్ చర్యలతో రాత్రి రోడ్లపై తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగరంలో.. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు జరిగాయి. బహిరంగంగా మద్యం తాగడంపై నాలుగు, డ్రంక్ అండ్ డ్రైవ్పై ఆరు కేసులు నమోదు చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను నిర్ణీత వేళల్లో మూయించి వేశారు. డ్రైవ్లో నెల్లూరు నగర ఇన్చార్జి, రూరల్ డీఎస్పీలు ఎం.గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
నూరు శాతం రికవరీలు సాధించాలి
నెల్లూరు(పొగతోట): బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, ఉన్నతి రుణాల రికవరీలను నూరు శాతం సాధించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ మండలాల్లో రికవరీల శాతం తక్కువగా ఉందని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. సంఘ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ.. తప్పులను సవరించుకుంటూ ముందుకుసాగాలని చెప్పారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుక్ కీపింగ్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. వెంకటాచలంలో మగ్గం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇక్కడ 30 మందికి శిక్షణిచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మిల్లెట్స్ వంటకాలపై కావలి మండలంలో శిక్షణ కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. పండ్ల తోటలు సాగుచేసే సభ్యులు సోలార్ డ్రయర్లను ఉపయోగించుకొని అధిక అదాయాన్ని పొందొచ్చన్నారు. డీపీఎంలు మురళి, మధుసూదన్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టెట్కు పక్కాగా ఏర్పాట్లు నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఏర్పాట్లను పక్కాగా చేయాలని డీఆర్వో విజయకుమార్ పేర్కొన్నారు. టెట్ నిర్వహణపై కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీఓ అనూషతో కలిసి మంగళవారం నిర్వహించిన పరీక్షల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 10,645 మంది హాజరుకానున్నారని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు నెల్లూరు (లీగల్): ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో కోవూరు మండలం పాటూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు రాయదుర్గం వెంకటేశ్వర్లుకు ఇరవై ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా (పోక్సో) కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. పాటూరులోని కామాక్షమ్మ కాలనీలో వెంకటేశ్వర్లు.. బాలిక నివాసం ఉంటున్నాడు. ఈ తరుణంలో 2021, ఏప్రిల్ 21న బేల్దారి పనులకు బాలిక తండ్రి వెళ్లారు. ఇంటి పనుల్లో తల్లి ఉండగా, ఉదయం పది గంటల సమయంలో వీధిలో బాలిక ఆడుకోసాగింది. ఈ తరుణంలో రూపాయిచ్చి.. మిఠాయి కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై వెంకటేశ్వర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడి వికృత చేష్టలకు భయపడిన బాలిక విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు. సోలార్ ప్లాంట్కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు సాక్షి, అమరావతి: జిల్లాలోని కరేడులో ఏర్పాటు చేయనున్న సోలార్ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు ప్రభుత్వం రూ.14 కోట్లకుపైగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై మినహాయింపునిచ్చింది. ఏపీఐఐసీ ద్వారా సూర్యచక్ర డెవలపర్స్కు బదలాయించే భూముల రిజిస్ట్రేషన్ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఎనిమిది వేల ఎకరాల్లో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారని తెలిపింది. -
రవాణా వాహన యజమానుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందంగా మారింది. డీజిల్, టైర్లు, ఇన్సురెన్స్, విడిభాగాల ధరలు పెరుగుతుండటంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్న వీరిపై తాజాగా ఫిట్నెస్ పిడుగు పడింది. ఈ రేట్లను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణ
నెల్లూరు(టౌన్): రవాణా వాహనాలకు బాడుగలు కరువై యజమానులకు దిక్కుతోచడంలేదు. అరకొరగా లభిస్తున్నా, పోటీతత్వంతో పదేళ్ల క్రితం ఉన్న కిరాయితోనే కాలాన్ని సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి చాలదన్నట్లు డీజిల్, ఇన్సురెన్స్, టైర్లు, వాహన విడిభాగాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని మోయలేకే సతమతమవుతున్న ఓనర్లపై ఫిట్నెస్ చార్జీల భారం గుదిబండలా మారింది. వాహన కాలపరిమితి 15 ఏళ్లు దాటితే ఒకలా.. 20 ఏళ్లు దాటితే మరో తరహాలో అనే విధంగా చార్జీలను పెంచేశారు. ఫిట్నెస్ లేకుండా తిరుగుతూ, రవాణా అధికారుల కంటపడితే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో కాలం చెల్లిన వాహనాలను మూలనపడేసే పరిస్ధితి నెలకొనే అవకాశముందని యజమానులు పేర్కొంటున్నారు. తమ బాధలను పరిణగనలోకి తీసుకొని ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో ఐదు లక్షల వాహనాలు జిల్లాలో వాహనాలు ఐదు లక్షలకుపైగా ఉన్నాయని రవాణా అధికారులు చెప్తున్నారు. వీటిలో ట్రాన్స్పోర్టుకు చెందినవి 1.2 లక్షలు కాగా బైకులు, కార్లు 3.10 లక్షలకుపైగా ఉన్నాయి. ఆటోలు 20,174.. గూడ్స్ క్యారియర్లు 14,500.. వ్యవసాయ ట్రాక్టర్లు 12,284.. వాణిజ్య ట్రాక్టర్లు 3900.. లారీలు 12 వేలు.. మిగిలినవి సీసీ, స్కూల్ బస్సులు, లగ్జరీ క్యాబ్లు, మొబైల్ క్లినిక్లు, మ్యాక్సీ, మోటార్ క్యాబ్లు తదితరాలున్నాయి. కాలం చెల్లిన వాహ నాలపై టెస్టింగ్, సర్టిఫికేషన్ ఫీజులతో పాటు జీఎస్టీ చార్జీలనూ మోపారు. వాహనాలు – ఐదు లక్షలకుపైగా.. ట్రాన్స్పోర్టు వాహనాలు – 1.2 లక్షలు కాలం చెల్లిన వాహనాలపై అధిక భారం గతంతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్ల మోత పెంపు నిర్ణయంపై ప్రభుత్వాల బంతాట ట్రాన్స్పోర్టు వెహికల్స్ను తిప్పలేమంటున్న యజమానులు డీజిల్, టైర్లు, ఇన్సురెన్స్, విడిభాగాల ధరలు ౖపైపెకి సమ్మెకు సన్నద్ధమవుతున్న ఓనర్లు పెరిగిందిలా.. జిల్లాలో ఇలా.. చార్జీలను తగ్గించాలి రవాణా వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ చార్జీలను భారీగా పెంచారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలవగా, పెంపు తమ పరిధిలో లేదని చెప్తున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలను తిప్పే పరిస్థితి లేదు. బాడుగలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొత్త వెహికల్స్ను కొనుగోలు చేసే అవకాశమూ లేదు. మా బాధలను అర్థం చేసుకోవాలి. – నారాయణ, జిల్లా సెక్రటరీ, లారీ యజమానుల సంఘం -
నేరాల కట్టడికి పటిష్ట చర్యలు
నెల్లూరు(క్రైమ్): నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. నగరంలోని వేదాయపాళెం, నెల్లూరు రూరల్తో పాటు పొదలకూరు, రాపూరు పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, పాతనేరస్తులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితరాలపై ఆరాతీశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలిచ్చారు. ఇటీవల జరిగిన పలు కేసులకు సంబంధించిన వివరాలను ఆరాతీశారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. నేరాలకు తరచూ పాల్పడే యాక్టివ్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లను నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు రైతులపై కనికరం లేదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి తోటపల్లిగూడూరు: దిత్వా తుపానుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినా చంద్రబాబు ఏ మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని పాపిరెడ్డిపాళెంలో సోమ వారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న నారుమళ్లు, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ దిత్వా తుపానుతో కురిసిన భారీ వర్షాలకు నాట్లు, నారుమళ్లు దెబ్బతిని జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. సబ్సిడీ విత్తనాలను అందించే ఆలోచన చేయకపోవడంతో రైతులే నగదు వెచ్చించి కొనుగోలు చేసి మళ్లీ నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారన్నారు. కనీసం రైతులకు నష్టపరిహారం అందించే దిశగా ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేసి పరిమితి విధించడం దౌర్భాగ్యమన్నారు. రైతులు యూరియా బస్తాను రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, విత్తనాలు, యూరి యా, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించకుండా టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఇంటి ముంగిటకే అందించామన్నారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఏటా రూ.13,500 వంతున పెట్టుబడి సాయం అందించామని గుర్తుచేశారు. ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానన్న చంద్రబాబు రెండేళ్లకు గానూ రూ.10వేలు రైతన్న చేతిలో పెట్టి మమ అన్పించాడన్నారు. వర్షాలకు నష్టపోతే సబ్సిడీపై విత్తనాలు, పంటల బీమా సాయాన్ని అందించి జగన్మోహన్రెడ్డి ఆదుకుంటే ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదన్నారు. రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్క ఉద్వోగం ఇవ్వలేదన్నారు. నారా లోకే్శ్ రాష్ట్రంలో రైతుల పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా విమాన సంస్థ ఇండిగో గురించి మాట్లాడడం చూసి జాతీయ మీడియా ఏకిపారేస్తుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి అవినీతి సొమ్మును దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద లేదన్నారు. అవినీతే పరమావధిగా భావిస్తున్న సోమిరెడ్డిని సర్వేపల్లి ప్రజలు, రైతులు ఎప్పుడో మర్చిపోయారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు దిత్వా తుపాను నష్టాన్ని అంచనా చేయించి రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యద ర్శి చిల్లకూరు సుఽధీర్రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, మండలాధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, వైస్ఎంపీపీ చెరుకూరు శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు. -
బొబ్బలపై రౌడీషీట్ను తొలగించాలి
● నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలి ● ఎస్పీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, ఆనం వినతి నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్సీపీ నగరాధ్యక్షుడు, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్యాదవ్పై అన్యాయంగా పెట్టిన రౌడీషీట్ను తొలగించాలని, నెల్లూరు నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి ఎస్పీ అజిత వేజెండ్లను కోరారు. ఈ మేరకు పోలీసు కార్యాలయంలో ఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. నగరంలో పట్టపగలే అల్లరిమూకలు హత్యలకు తెగబడుతున్నారన్నారు. చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో హత్యలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆదివారం కొందరు యువకులు సిటీ బస్సుడ్రైవర్, కండక్టర్పై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారన్నారు. నగరంలో శాంతిభద్రతల కోసం వైఎస్సార్సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు. బొబ్బల శ్రీనివాస్యాదవ్పై రాజకీయ కక్షతో రౌడీషీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. బొబ్బలపై రౌడీషీట్ను తొలగించాలని ఎస్పీని కోరగా స్పందించి న్యాయం చేస్తామన్నారని తెలిపారు. కక్ష పూరితంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్గా, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటను సాకు గా చూపిస్తూ బొబ్బల శ్రీనివాస్యాదవ్ అక్కడ లేకపోయినా రాజకీయ కక్షతో టీడీపీ నేతలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రోద్బలంతో దర్గామిట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. రౌడీషీటర్లను పెంచి పోషిస్తున్న ఆఫీసు, నాయకులెవ్వరన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమన్నారు. గతంలో నెల్లూరు రాజకీయాల్లో రౌడీగ్యాంగ్లు, గంజాయి గ్యాంగ్ల ప్రమేయం ఉండేది కాదన్నారు. పదేళ్లుగా దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, కార్యకర్తలను భయపెట్టడం, పార్టీలు మారకుంటే కేసులు పెడుతామని బెదిరించడం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. మరే ఇతర నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి లేదన్నారు. పెంచలయ్య హత్యకేసులో నిందితులు ఎవరితో అంటకాగుతున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాజకీయాల్లో గంజాయిబ్యాచ్ లు, రౌడీషీటర్లకు, వారికి సహకరిస్తున్న వ్యక్తులకు తావ్వివొద్దని ప్రజలకు మనవి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్యాదవ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, స్టేట్ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనపై నిరసన సెగలు
నెల్లూరు(అర్బన్): జిల్లాల పునర్విభజనపై నిరసన సెగలు రగులుతున్నాయి. కలువాయి, సైదాపురం, రాపూ రు మండలాలను యధాతధంగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ ఆయా మండలాల ప్రజలు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట కలువాయి మండలంతో పాటు కండలేరు పునరావాస కాలనీలకు చెందిన ప్రజలు ప్రజా సంఘాల నేతలతో కలిసి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కొందరు అర్ధనగ్నంగా కూర్చుని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హిమాన్షుశుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మిడతల రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గూడూరు డివిజన్ను తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గద్దెనెక్కాక ఆ హామీని మరిచి కలువాయి, సైదాపురం, రాపూరు ప్రాంతాలను కూడా తిరుపతి జిల్లాలో కలుపుతామనడం దుర్మార్గమన్నారు. కండలేరు జలాశయం విభజన మూలంగా నీటి యుద్ధాలు జరుగుతాయన్నారు. సోమశిల ప్రాజెక్టు నీటి వాటా విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయన్నారు. కలువాయి నుంచి నెల్లూరుకు 60 కి.మీ దూరం కాగా తిరుపతికి 140 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎవరి కోసమో జిల్లాను విభజిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంటే పవన్కళ్యాణ్ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. బ్రిటిష్ పాలకుల కన్నా దుర్మార్గంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. నాయకులు కందికట్ల రాజేశ్వరి, బైరి శ్రీనివాస్, సుబ్బారెడ్డి, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, అనూరాధ, బీసీవై పార్టీ నేతలు హజరత్యాదవ్, గోపాల్, మనోహర్ హింద్, ఆనంద్, నరేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కలువాయి(సైదాపురం): కలువాయి బస్టాండ్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. తొలుత ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం ఒంటికాలుపై నిలబడి తమ నిరసనను తెలియజేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని ఉంచాలని, తిరుపతి జిల్లాలో కలిపితే కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. -
నాలుగు కేజీల గంజాయి స్వాధీనం
● నలుగురు రౌడీషీటర్ల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. మాగుంటలేఅవుట్ రైల్వేట్రాక్ వద్ద, జీజీహెచ్ సమీపంలో గంజాయిని విక్రయించేందుకు తరలిస్తున్న నలుగురు రౌడీషీటర్లను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ బీ కళ్యాణరాజు మీడియాకు వెల్లడించారు. టెక్కెమిట్టకు చెందిన ఎం ప్రవీణ్, లేక్వ్యూకాలనీకి చెందిన జే మహేష్, సారాయంగడి సెంటర్కు చెందిన షేక్ ముక్తియార్, షేక్ అబ్దుల్ మజీద్పై దర్గామిట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. వ్యసనాలకు బానిసైన వీరు ఈజీ మనీకోసం గంజాయి విక్రయాలకు తెరలేపారు. దీనిపై దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కళ్యాణరాజుకు పక్కా సమాచారం అందింది. ఆదివారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి మాగుంటలేఅవుట్ రైల్వే ట్రాక్ సమీపంలో మహేష్, ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీజీహెచ్ వద్ద ముక్తియార్, అబ్దుల్ మజీద్ను అదుపులోకి తీసుకుని వారి వద్ద మరో రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందకు వెళ్తున్నామని వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ముక్తియార్పై మర్డర్ కేసు ఉందన్నారు. ఎక్కడైనా గంజాయి రవాణా, విక్రయాలు, నిల్వ, సేవనం వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే 94407 96308 లేదా డయల్ 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
పునర్విభజన ప్రక్రియపై చర్చ
నెల్లూరు సిటీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, గూడూ రు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్తో నెల్లూరు మాగుంటలేఅవుట్లోని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రక్రియపై చర్చించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు వీరి చలపతిరావు, కొండూరు అనిల్బాబు, కలువ బాలశంకర్రెడ్డి, తదితరులు ఉన్నారు. రేపట్నుంచి టెట్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఏపీ టెట్–2025 పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ బాలాజీరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పొట్టేపాళెం సమీపంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్స్, కావలిలోని విశ్వోదయ, బోగోలులోని ఆర్ఎస్ఆర్, నెల్లూరులోని నారాయణ, కోవూరులోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలల్లో టెట్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్డెస్క్ను 99890 02174, 93910 61007 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,343 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,505 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
పిల్లలు పట్టించుకోవడం లేదు
● వృద్ధుల ఆవేదన ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): ‘మా పిల్లలు పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలి’ అని పలువురు వృద్ధులు కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 148 మంది తమ సమస్యలపై ఎస్పీ అజితకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చట్టపరిధిలో బాఽధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ, పీసీఆర్, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నేను వృద్ధుడిని. ఆస్తి కోసం నా కుమారుడు సునీల్ ఇబ్బంది పెడుతున్నాడు. ఇంట్లోంచి గెంటేసి తాళం వేశాడని కావలికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా జీవనాధారం కోసం ఉన్న పొలాన్ని సాగు చేసుకోనివ్వకుండా కుమారుడు ఏడుకొండలు ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంగం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● నా కుమారుడు తిరునాళ్లకు వెళ్లి మరణించాడు. టీపీగూడూరు పోలీస్స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. నా కుమారుడు చనిపోయిన ప్రాంతాల్లో నీటి గుంతల్లేవు. పూర్తి స్థాయిలో విచారించాలని టీపీగూడూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హేమంత్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఇదేమని ప్రశ్నించినందుకు తన తల్లితో కలిసి నాపై దాడి చేశాడని వేదాయపాళేనికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. ● అనిల్, మరికొంతమంది నాపై గతంలో దాడి చేశారు. నేనిచ్చిన ఫిర్యాదుపై రాపూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అయినా వారు నన్ను బెదిరిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని రాపూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా కుమార్తె గత నెల ఏడో తేదీ నుంచి కనిపించడం లేదు. చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుక్కోవాలని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. -
హద్దు మీరితే కఠిన చర్యలు
● రోడ్లపై నిందితులను నడిపించిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. బస్సు డ్రైవర్ మన్సూర్, సలాంపై బ్లేడ్లతో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గాంధీబొమ్మ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు రోడ్డుపై నడిపించారు. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య వివరాలను వెల్లడించారు. వేదాయపాళెం గాంధీనగర్కు చెందిన మన్సూర్, ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలాం ఎస్ఎఎస్ ప్రైవేట్ సిటీ బస్సులో డ్రైవర్, కండక్టర్గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం బస్సు బోసుబొమ్మ వైపు వెళ్తుండగా.. మద్యం మత్తులో యువకులు బాబు ఐస్క్రీమ్ వద్ద రోడ్డుపై అడ్డంగా బైక్ పార్క్ చేసి మాట్లాడుతూ ట్రాఫిక్కు అంతరాయం కల్గించారు. డ్రైవర్ హారన్ కొట్టి అడ్డు తొలగాలని చెప్పారు. దీంతో వారు డ్రైవర్, కండక్టర్లపై దాడి చేయగా వారిద్దరూ బైక్ తాళం తీసుకెళ్లారు. నిందితులు బస్సును వెంబడించి బోసుబొ మ్మ వద్ద అడ్డుకుని బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు.. బాధితుల ఫిర్యాదుపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు సంతపేట గోపిటీ సెంటర్కు చెందిన మదన్ అలియాస్ బాబీ, శ్రీకాంత్, సంతపేట ప్రాంతానికి చెందిన అజయ్, నితిన్, తేజగా గుర్తించి సోమవారం రాత్రి తిక్కనపార్కు సమీపంలోని శివాలయం వద్ద అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం
● సర్వే చేపట్టిన అధికారులకు బెదిరింపులు ● వెనుదిరిగిన తహసీల్దార్ సాక్షి టాస్క్ఫోర్స్: నగరంలో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి, విచారణ చేపట్టేందుకు వెళ్లిన తహసీల్దార్ను ఆక్రమణదారులు బెదిరించారు. అడ్డగించడంతో చివరకు వెనుదిరిగారు. 54వ డివిజన్ భగత్సింగ్ కాలనీలో కొంతకాలంగా పలువురు టీడీపీ నాయకులు, వారి సానుభూతిపరులు రూ.కోట్ల విలువైన కార్పొరేషన్, ఇరిగేషన్ స్థలాలను ఆక్రమించి కట్టడాలు కట్టి క్రయ, విక్రయాలు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులందాయి. దీంతో సోమవారం నెల్లూరు అర్బన్ తహసీల్దార్ షఫీమాలిక్ తన సిబ్బందితో కలిసి కాలనీకి వెళ్లారు. ఆయన, సిబ్బందిని స్థానిక టీడీపీ నాయకులు, వారి సానుభూతిపరులు అడ్డుకున్నారు. గతంలో కూడా సర్వే, విచారణ కోసం వచ్చిన పలు శాఖల అధికారులను కూడా ఇదే విధంగా మహిళల సాయంతో అడ్డగించి బెదిరించిన సందర్భాలున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ ఆక్రమణలు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.పొలంలో పడి రైతు మృతిమనుబోలు: రొంపి దుక్కి దున్నిన పొలంలో ప్రమాదవశాత్తూ పడి ఓ రైతు మృతిచెందిన ఘటన మండలంలోని చెరుకుమూడి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆలూరు కృష్ణయ్య (60) పొలం గట్టుపై నడిచి వెళ్తూ జారిపడిపోయాడు. ఈ క్రమంలో బోర్లా పడగా ముఖం బురదలో కూరుకుపోయింది. అటుగా వెళుతున్న రైతులు గమనించి చూసేసరికి అప్పటికే ఊపిరి ఆగిపోయింది. -
మా మొర ఆలకించండయ్యా..
● అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిట ● వినతులు స్వీకరించిన కలెక్టర్నెల్లూరు(అర్బన్): ‘అయ్యా ఎన్నిసార్లు తిరిగినా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు సమస్యలను పరిష్కరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్కు వచ్చాం. మీరైనా మా మొర ఆలకించండయ్యా’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వేశాఖ ఏడీ రఘురామరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.మా స్థలాన్ని పోలీస్ కుటుంబం కబ్జా చేసింది కావలి పట్టణం ట్రంక్ రోడ్డును ఆనుకుని మాకు ఆస్తి ఉంది. మా స్థలానికి, రోడ్డుకు మధ్యలో ఉండే కొంత శివాయి స్థలం ఎప్పట్నుంచో మా స్వాధీనంలో ఉంది. అయితే టు టౌన్ కానిస్టేబుల్ రాజేంద్ర తల్లిదండ్రులు అక్కడ చికెన్ షాపు పెట్టారు. అందువల్ల తమ స్థలానికి దారి, ఇతర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో పట్టా స్థలాన్ని అమ్ముకుందామని నిర్ణయించుకున్నాం. అయితే అడ్డంగా ఉన్న చికెన్ షాపు వల్ల కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దానిని తీసేయాలని కోరాం. అందుకు విరుద్ధంగా ఇంకా విస్తరించి పెద్ద షాపు పెట్టారు. అడిగితే దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారు. కావలి పోలీసులకు, ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేశాం. న్యాయం జరగలేదు. చికెన్ షాపు తొలగించి ఆదుకోవాలి. – శోభనాల సాయిసుస్మిత, కుటుంబ సభ్యురాలు, కావలి -
చిన్నా వదిలేసి వెళ్లిపోయావా..
● బస్సు ఢీకొని బాలుడి మృతి ఇందుకూరుపేట: బాలురిద్దరూ ఉదయం నిద్ర లేచారు. స్కూల్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో అన్న కళ్ల ఎదుటే తమ్ముడు ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విషాదకర ఘటన మండలంలోని గంగప ట్నం గ్రామంలో సోమవారం జరిగింది. గంగప ట్నం పంచాయతీ వేపచెట్టుదిబ్బకు చెందిన పులి మురళి, మనోజకుమారి దంపతులకు ఇద్దరు బాలురు సంతానం. మురళి కూలీ పనులకు వెళ్లేవాడు. సుమారు నాలుగైదు నెలల క్రితం విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అప్పట్నుంచి పిల్లలు కార్తీక్, కిరణ్ (11)ను తల్లి చూసుకుంటోంది. సైకిల్కు పంక్చర్ కావడంతో కిరణ్.. తన అన్న కార్తీక్తో కలిసి టైరు తీసుకుని మరో సైకిల్పై గంగపట్నం బయలుదేరాడు. ఈ క్రమంలో రాముడుపాళెం నుంచి గంగపట్నం వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. సైకిల్ తొక్కుతున్న కార్తీక్ పక్కన పడిపోగా కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అప్పటి వరకు కళ్లెదుటే ఉన్న కిరణ్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించింది. సోదరుడు కార్తీక్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. కిరణ్ స్థానికంగా ఉన్న గంగపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతిపట్ల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సంతాపం ప్రకటించారు. -
కారుణ్య నియామకాల ఉత్తర్వుల అందజేత
నెల్లూరు(అర్బన్): వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ నలుగురు వ్యక్తులు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం కలెక్టరేట్లో ఉత్తర్వులు అందజేశారు. షేక్ అమిత్, కె.చందుకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్గా, ఎన్.నానీకి పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా, యు.హరీష్కుమార్కు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ డీఆర్వో విజయకుమార్, ఏఓ తుమ్మా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. గొంతుపై కత్తిపెట్టి.. బంగారు నగల చోరీవెంకటాచలం: గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ గొంతుపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించి బంగారు నగల్ని చోరీ చేసిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తమలపాకుల సుగుణమ్మ ఇంటి వద్దకు తెల్లావారుజామున 5 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై వచ్చి ఆగాడు. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి ఆమె గొంతుపై కత్తిపెట్టి అరిస్తే చంపేస్తానన్నాడు. మెడలోని బంగారు సరుడు, ఇంకా ఉంగరం, కమ్మలు లాక్కొని పరారయ్యాడు. సుగుణమ్మ కేకలు వేసి చుట్టుపక్కల నివాసాల వారికి తెలిపింది అనంతరం నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేశారు. -
అక్రమ రీచ్పై తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
సోమశిల: బడా టీడీపీ నేతలు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాతో తమ రోడ్డు ధ్వంసమవుతుందంటూ ఆ పార్టీ శ్రేణులే తిరగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు పెన్నానది రీచ్ వద్ద సోమవారం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఆ పార్టీ బడా నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో ఎక్కడికక్కడ అనధికారికంగా రీచ్లు ఏర్పాటు చేసుకున్నారు. పెన్నానదిలో మండల పరిధిలోని పడమటి కంభంపాడు రీచ్ ద్వారా నిత్యం వందల టర్బో లారీలు, టిప్పర్లతో ఇసుకను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.వాహనాల్లో సామర్థ్యానికి మించి అధిక లోడ్లతో రవాణా చేస్తున్నందున సోమశిల–ఉప్పలపాడు వరకు సుమారు 8 కిలోమీటర్ల ప్రధాన రహదారి అడుగడుగునా భారీ లోతులో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సాఫీగా నడిచిపోయే పరిస్థితి లేదు. దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాదారులకు చెబితే.. పూడుస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన మోంథా, దిత్వా తుఫాన్లతో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా చెరువును తలపించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సైతం సోమశిలకు వెళ్లకుండా ఉప్పలపాడు వద్ద నుంచి మళ్లించుకుని వెళ్లిపోతున్నాయి. పర్యాటక కేంద్రం సోమశిలకు ప్రయాణికుల రాకపోకలు స్తంభిస్తున్నాయి.ఈ అనధికార రీచ్ మంత్రి ఆనం ఇలాకాలో జరుగుతున్న కారణంగా ధైర్యం చేసి ప్రశ్నించేవారు లేకుండా పోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు భారీగా తరలివచ్చి రీచ్ వద్ద ధర్నాకు దిగారు. దెబ్బతిన్న రహదారి గుంతలను పూడ్చండి, లేదంటే రవాణా నిలిపివేయండని నిర్వాహకులను టీడీపీ మండల ఉపాధ్యక్షుడు ఉప్పల విజయకుమార్ హెచ్చరించారు. ఇసుక వాహనాలను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇసుక తవ్వే జేసీబీలను నిలువరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటికే పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిడి రావడంతో మారు మాట్లాడకుండా ఆందోళనకారులు మౌనంగా వెనుదిరిగారు. -
సోమిరెడ్డి.. అవినీతి అనకొండ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం నీతులు వల్లించే సోమిరెడ్డి అవినీతి అనకొండ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సొంత ఆస్తులనే త్యాగం చేశానని చెప్పుకొనే ఆయన ఎవరి కోసం త్యాగం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. దేవుడి భూమిని కాజేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడమే కాకుండా అధికారులతో కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్న ఘనుడని ఎద్దేవా చేశారు. పెద్ద మనిషనే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉండి పంచాయితీ చేస్తారని డబ్బులను సోమిరెడ్డి దగ్గర ఇరుపక్షాలిస్తే.. పరిష్కారమయ్యాక వారికివ్వకుండా కొట్టేశారని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారని చెప్పారు. సోమిరెడ్డి గెలుపుపై పందెం కాసిన నేతలు, కార్యకర్తలను పిలిచి ఆ మొత్తంలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడాన్ని చూసి విస్తుపోవడం వారి వంతవుతోందని విమర్శించారు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో పర్సంటేజీలు వసూలు చేయడం.. బదిలీలకు వచ్చే చిరుద్యోగులను వదలకుండా మామూళ్లను దండుకుంటున్నారని ఆరోపించారు.నగరంలోని శ్రీనివాస మహల్ వద్ద జేబులు కొట్టే అలవాటు సోమిరెడ్డికి గతంలో ఉండేదని, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ.. ఇంటికెళ్లిన వారి జేబులు తడుముతున్నారంటూ ఆ పార్టీ నేతలే కథలుగా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి కారెక్కాలంటేనే కాంట్రాక్టర్లు, అధికారులు, వ్యాపారులు భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ సర్కార్ కొలువుదీరాక ప్రభుత్వ భూములతో పాటు, దేవుడి మాన్యాలు సైతం దోపిడీకి గురవుతున్నాయని ధ్వజమెత్తారు. కాకుటూరు శివాలయానికి దాత హరిప్రసాద్రెడ్డి ఇచ్చిన 48 సెంట్ల భూమిని రూ.కోటికి లేఅవుట్ యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకుంది వాస్తవం కాదానని ప్రశ్నించారు. వీటిని కాపాడాలంటూ దేవదాయ శాఖ కార్యాలయ ఎదుట భక్తులు నిరసన తెలియజేస్తే, వారి మనోభావాలను దెబ్బతీసేలా హేయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేవస్థానం కోసం రోడ్డు వేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమిరెడ్డి నోరుతెరిస్తే అవినీతి కంపును సర్వేపల్లి ప్రజలు భరించలేకపోతున్నారని చెప్పారు. దేవాలయ భూమిని విక్రయించడం అన్యాయమని ప్రశ్నిస్తున్న తనపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పిరికిపందలు పెట్టే కేసులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్, మట్టి, బూడిదను దోచుకుంటూ, బల్కర్ల నుంచి రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పామాయిల్ అసోసియేషన్ పేరిట డబ్బుల కోసం సోమిరెడ్డి బెదిరిస్తున్నారంటూ ట్యాంకర్ యజమానులు మీడియా ఎదుట వాపోయారంటేనే ఆయన దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన అవినీతిని ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.జైల్లో పెట్టించినా ఆయన అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. కోర్టులో ఫైళ్ల అదృశ్యం కేసుపై సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా.. సోమిరెడ్డి తన అనుకూల పత్రికల్లో అసత్యాలు రాయిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. శివాలయ భూములపై కలెక్టర్ విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదించి.. వీటిని పరిరక్షించి భక్తుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. చుక్కలు చూపిస్తున్న గ్రామీణ రోడ్లు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మామూలు రోజుల్లోనే రహదారులు గుంతలమయంగా ఉంటాయి. అలాంటిది గతవారం రోజులుగా జోరు వర్షాలు కురవడంతో పట్టణంలోని రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 16వ వార్డులోని చెన్నూరు రోడ్డు నుంచి రాజుపాళెం రోడ్డు వైపు ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రయాణించాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ రహదారి వెంబడి తహసీల్దార్ కార్యాలయం, గ్రంథాలయం, అంబేడ్కర్ భవన్, బెజవాడ గోపాల్రెడ్డి పార్కు, సామాజిక ఆరోగ్యం కేంద్రం, పోలీస్స్టేషన్, ఎస్పీ బాలు వసతి భవనం, డీఎల్ఎన్నార్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. నిత్యం కొడవలూరు మండలం రాజుపాళెం, బుచ్చిలోని రూరల్ ప్రాంతాల నుంచి ఈ రహదారిపై వేల మంది ప్రయాణిస్తుంటారు. అధికారులు ఇదే దారిన వెళ్తుంటారు. అ యినా రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు.. మరోపక్క చెన్నూరురోడ్డులోని మలిదేవి కాలువ వద్ద నుంచి శివాలయం వరకు రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తోంది. వాహనదారులు, పాదచారులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఈ రోడ్డుపై వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటన ఈ ప్రాంతాల వద్ద ఉందంటే మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే.తహసీల్దార్కు వినతిపత్రం అందజేత మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఆ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ, వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణ తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాళెం నుంచి రాజుపాళెం వైపు వెళ్లే రోడ్డు, మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్అండ్బీ ద్వారా గానీ, మున్సిపల్ కమిషనర్ ద్వారా కానీ శాశ్వతంగా రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని తహసీల్దార్ను కోరినట్లు వివరించారు. -
చిరుతిండ్లతో రోగాలు.. ప్రజారోగ్యంపై శ్రద్ధేదీ?
నెల్లూరు(బారకాసు): ఆహారానికి సంబంధించి నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉంది. చిరుతిండ్లను ప్రజలు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే అవి ఎంత వరకు ఆరోగ్యకరం.. అనేది అటు వ్యాపారులు, ఇటు అధికారులు ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. అధిక శాతం చిరుతిండ్ల వ్యాపారాలు రోడ్లుపైనే నడుస్తున్నాయి. నిత్యం వాహనాలతో రేగే దుమ్మూధూళి నుంచి కనీస రక్షణ ఉండటం లేదు. అధికారులు కనీసం అటువైపు కూడా చూడటం లేదు. చివరకు ప్రజలు కూడా రోడ్లపై విక్రయించే చిరుతిండ్లతో రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వివిధ పట్టణాల్లో డయేరియా లక్షణాలతో జనం ఆస్పత్రి పాలవుతున్న నేపథ్యంలో నెల్లూరులోనూ ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దుమ్మూధూళి పడేలా.. నగరంలోని ప్రతి ప్రధాన వీధిల్లో ఆహార పదార్థాలు విక్రయించే టిఫిన్ బండ్లు, స్వీట్లు అమ్మే దుకాణాలు కనిపిస్తుంటాయి. రకరకాల స్వీట్లతో పాటు బజ్జీలు, పకోడి, కారంపూస, బూంది, చెకోడీలను విక్రయిస్తుంటారు. నూనెతో చేసిన పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తూ రోడ్డు వెంట వెళ్లేవారి నోరూరిస్తుంటాయి. రోడ్డు పక్కన వ్యాపారాలకు ఎవరూ అభ్యంతరం పెట్టరు. అయితే తినుబండారాలను దుమ్మూధూళి పడేలా ఉంచటం కచ్చితంగా వినియోగదారుల ఆరోగ్యానికి మంచింది కాదు. నగరంలోని ఇరుకురోడ్లలో తిరిగే వాహనాల్లోంచి వచ్చే పొగ, టైర్ల నుంచి లేచే దుమ్ము ఎక్కువ. నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దుమ్ము తేలికగా అతుక్కుపోతుంది. దీనికితోడు కొందరు మరిగించిన నూనెను పదేపదే వాడుతున్నారు. ఇది హానికరమని తెలిసినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. అంతేకాకుండా పలుచోట్ల నూనె ప్యాకెట్లను కట్ చేయకుండా వేడి కడాయ్లో ఉంచడం వల్ల ప్లాస్టిక్ కవరు కరిగిపోయి నూనె బాండీలో పడుతోంది. ఇది ఎంతో హానికరమైనా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. హానికరమని తెలిసినా కొనేస్తున్న జనం కేన్సర్ విజృంభిస్తున్న నేటి రోజుల్లో హానికరమైన తినుబండారాలకు దూరంగా ఉండాలనే భావన జనంలో ఉండటం లేదు. రోడ్ల వెంట దుమ్మూధూళి పడేచోటనే కొనుగోలు చేసి తింటున్నారు. స్వీట్లు వంటివి తక్కువ ధరకు వస్తున్నాయనగాని కొనేసి, బంధుమిత్రులకు కానుకగా ఇస్తున్నారు. తినుబండారాలపై తగిన రక్షణ ఏర్పాట్లు ఉండేలా చూడాల్సిన అధికారులు అటుకేసి చూడటం లేదు. ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారులకు ఎవరైనా పనిగట్టుకుని ఫిర్యాదు చేస్తే మినహా, పట్టించుకోవటం లేదు. విధిగా తనిఖీలు చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పీకలు తెగుతున్నాయ్.. !
సింహపురిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై చేష్టలుడిగి చూస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో విచక్షణరహితంగా పీకలు కోస్తూ.. హత్యలకూ తెగబడుతున్నారు. జిల్లాలో ఎటు చూసినా నేరప్రవృత్తి పెరిగిపోతోంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం అమ్మకాలు, పేకాట, వ్యభిచార గృహాల నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి. తమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారంటూ గంజాయి ముఠాలు ఏకంగా తరిమితరిమి చంపిన ఉదంతం మర్చిపోకముందే.. తాజాగా తమ బైక్కు దారివ్వలేదని సిటీ బస్సు డ్రైవర్ పీక కోశారు. అడ్డుకోబోయిన కండక్టర్పై కత్తులతో దాడి చేశారు. ఇదంతా చూస్తుంటే నెల్లూరుకు ఏమైందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎవరేమి చేస్తారోననే భయం ప్రజలను వెంటాడుతోంది. గత నెల 28న ఉద్యమకారుడు పెంచలయ్య హత్యను మరువకముందే.. మద్యం మత్తులో కొందరు యువకులు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్లతో విచక్షణరహితంగా ఆదివారం పట్టపగలు దాడి చేసిన ఉదంతం నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి.పోలీసులపైనా దాడులుశాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ చర్యల్లో భాగంగా నిరంతర తనిఖీలు, నేరస్తుల కదలికలపై నిఘా, రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లను పోలీస్ అధికారులు నమోదు చేస్తున్నా, నేరాలు అదుపులోకి రావడం లేదు. ఖాకీలపై దాడులు చేసేందుకు సైతం నిందితులు వెనుకాడటం లేదు. నేరాల కట్టడికి మరింత దూకుడును పెంచాల్సిన అవసరాన్ని వరుస ఘటనలు తెలియజేస్తున్నాయి.నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచిటీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నేరాలు పెరుగుతున్నాయి. నేరస్తుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పాతకక్షలు కత్తులు దూస్తున్నాయి. కిరాయి సంస్కృతి పెచ్చుమీరుతోంది. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అసాంఘిక శక్తులు, అల్లరిమూకలు మత్తులో వీరంగం చేస్తున్నాయి. మత్తుకు బానిసలైన వారు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. పెన్నా సమీపంలో జరిగిన జంట హత్యలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదంటూ స్థానికులపైనా దాడులు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. లేడీ డాన్, దేవరకొండ సుధీర్, హసన్ గ్యాంగ్లతో పాటు పలువురు రౌడీషీటర్ల వద్ద పెద్ద ఎత్తున గంజాయిని ఇటీవల స్వాధీనం చేసుకొని జైళ్లకు పంపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఓ ధర్మకాటా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను సంతపేట పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపుల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం, గంజాయిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతో పాటు నేరస్తులపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర వాసులు కోరుతున్నారు.జోరుగా అసాంఘిక కార్యకలాపాలుజిల్లాలోని కొందరు నిర్వాహకులు ఇళ్లు, లాడ్జిలను వేదికగా చేసుకొని పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్ని లాడ్జిల నిర్వాహకులతో ముందస్తు ఒప్పందాలు కుదర్చుకొని వారాల తరబడి ఆడిస్తున్నారు. నగరంలోని రెండు లాడ్జిలపై పోలీసులు దాడులు చేసి నిర్వాహకులతో పాటు జూదరులను అరెస్ట్ చేసి రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. -
నూడకు భూ సమర్పయామి
ఉదయగిరి నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న వింజమూరులో విలువైన ప్రభుత్వ భూములపై తమ్ముళ్ల కన్ను పడింది. పట్ణణ భవిష్యత్తు అవసరాలను విస్మరించి సుమారు రూ.70 కోట్ల విలువజేసే ల్యాండ్ను నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)కి అప్పనంగా కట్టబెట్టేందుకు ఫైల్ను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. నియోజకవర్గ ముఖ్య నేత ఆదేశాల మేరకు కావలి – దుత్తలూరు జాతీయ రహదారి పక్కనే (జగనన్న లేఅవుట్ను ఆనుకొని) ఉన్న దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. నుడా అని పైకి చెప్తున్నా, ఆ ముసుగులో విలువైన భూములను కొట్టేసే కుట్ర కోణముందనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.వింజమూరు (ఉదయగిరి): పట్టణాభివృద్ధి వద్దు.. తమ స్వలాభమే ముద్దు అనే రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వింజమూరులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇక్కడి విలువైన ప్రభుత్వ భూమిపై వీరు కన్నేశారు. వాస్తవానికి వింజమూరు నుంచి దుత్తలూరు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో జీబీకేఆర్ ఎస్టీ కాలనీని ఆనుకొని జాగీర్ వనం వరకు ఉన్న భూముల ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేయగా, స్తిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 400 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలను ఉచితంగా ఇచ్చి.. జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అనేక మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.సంపద సృష్టంట..!గ్రామ సర్వే నంబర్ 839, 1599, 1602, 1603, 1604, 1605, 1608, 1611, 1614, 1616లో 94.53 ఎకరాలను నుడాకు ఇచ్చే అంశమై జిల్లా అధికారులకు ప్రతిపాదనలను తహసీల్దార్ హమీద్ పంపారు. ఈ తరుణంలో భూములను జేసీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పది రోజుల క్రితం పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంపద సృష్టి కోసం అంటూ వాటిని తిరస్కరించారు. ఈ పరిణామాల క్రమంలో భూములు నుడాకు అప్పగించే ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏదీ ముందస్తు ప్రణాళిక..?ఉదయగిరి నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్ణణం వింజమూరు. త్వరలో నగర పంచాయతీ హోదా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రెవెన్యూ డివిజన్గా మార్చేందుకూ అవకాశాలున్నాయి. ఇక్కడ గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలు, మోడల్ స్కూల్, పట్ణణ ప్రజల క్రీడా అవసరాల నిమిత్తం మినీ స్టేడియం తదితరాలను కేటాయించే ఛాన్స్ ఉంది. పారిశ్రామికవాడకు ల్యాండ్స్ను కేటాయించాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. ఈ తరుణంలో పట్టణ ప్రగతికి ఇవెంతో కీలకం. అయితే వీటిన్నింటినీ నుడాకు కేటాయిస్తే భవిష్యత్తులో ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.భూముల ధరలకు రెక్కలు2022లో జాతీయ రహదారి రావడంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మామిడి తోటలను కొంతమంది ఎస్టీలు సాగు చేస్తున్నారు. భూముల పరిశీలన నిమిత్తం ఇటీవల వచ్చిన ఎమ్మెల్యే, జేసీ ఎదుట తమ సమస్యను వీరు లేవనెత్తారు. భూముల్లో ప్లాట్లేసి విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి చేయాలంటూ శాసనసభ్యుడు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. అర్హత ఉన్నవారికి వేరే చోట ఇస్తామని తెలిపారు. విలువైన భూములను లాక్కొని.. ఎక్కడో తమకెందుకని అవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువజేసే భూములను కాజేసేందుకు నుడా పేరుతో ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గతంలో ఇలా..నుడాకు ప్రతిపాదించిన సర్వే నంబర్లలో జీబీకేఆర్ కాలనీకి చెందిన 53 మంది ఎస్టీలకు 130 ఎకరాలకు లీజు పట్టాలను సీజేఎఫ్ఎస్ పేరుతో 1978లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. వీటిలో కొంత మేర విక్రయించగా, మరికొన్నింటిని సాగు చేయకుండా వదిలేశారు. ఈ తరుణంలో భూములను అన్యాక్రాంతం చేశారంటూ 2010, జూలైలో లీజు ఉత్తర్వులను రద్దు చేస్తూ అనాధీనంగా అప్పటి కావలి ఆర్డీఓ వెంకటేశ్వర్లు మార్చారు. ఈ తరుణంలో కోర్టును కొందరు ఆశ్రయించగా, భూముల్లేని పేదలకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మండలంలోని రావిపాడులో డీ ఫారం పట్టాలను కొందరికి ఇచ్చారు. గతంలో ఇచ్చిన లీజును రద్దు చేసినా, వాటిని కొందరు సాగు చేసుకుంటున్నారు.పరిశీలించి.. తగు నిర్ణయం తీసుకుంటాంవింజమూరులో నుడాకు భూముల కేటాయింపు కోసం ప్రతిపాదనలొచ్చాయి. వీటిని పరిశీలించాం. అన్ని విషయాలను పరిగణించి తగు నిర్ణయం తీసుకుంటాం. – మొగిలి వెంకటేశ్వర్లు, జేసీ -
విత్తనాల కోసం వెతుకులాట
పొదలకూరు: జిల్లాలో దిత్వా తుఫాన్తో నార్లు దెబ్బతిన్న రైతులు విత్తనాల కోసం వెతుకులాడుతూనే ఉన్నారు. డీలర్ల వద్ద ధర అధికంగా పలకడంతోపాటు మొలకెత్తుతాయో లేదో అని సందేహపడుతున్న వారు రైతులు సొంతంగా ప్రాసెసింగ్ చేసిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు పరిసర ప్రాంత పెన్నార్ డెల్టా అన్నదాతలు బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు, బత్తులపల్లిపాడు తదితర ప్రాంతాలకు వెళ్లి వరి విత్తనాలను తెచ్చుకుని నార్లు పోసుకున్నారు. భారీ వర్షాల కారణంగా నార్లు, నాట్లు దెబ్బతినడంతో కొందరు తిరిగి నార్లు పోసుకోవాల్సి వస్తోంది. దిత్వా తుఫాన్తో ముసురుపట్టి వర్షం కురిసిన సమయంలో 20 శాతం మాత్రమే నార్లు పోసుకున్నారు. మరో 20 శాతం మంది ముసురులోనే నార్లు పోసుకోవడంతో భారీ వర్షాలకు నష్టపోయారు. ఎన్నో ఇబ్బందులు రైతులు వరిసాగు కోసం విత్తన సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న విత్తనాలు సరిపోవడం లేదు. దీనికితోడు సాగు చేయాలనుకునే రకాలు లభ్యం కాకపోవడంతో కర్షకులు గ్రామాలు తిరగాల్సి వస్తోంది. పొదలకూరు మండలం బత్తులపల్లిపాడులో సౌత్మోపూరుకు చెందిన వారు విత్తన శుద్ధి చేసి (ప్రాసెసింగ్) విక్రయిస్తున్నారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 (షుగర్ లెస్) రకాలను 25 కిలోల సంచి రూ.1,100కు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో కొందరు అన్నదాతలు అక్కడే విత్తనాలను తీసుకెళ్తున్నారు. మరికొందరు కేఎన్ఎం 12510, 7715 రకాలను సాగు చేస్తున్నారు. గతేడాదే జిల్లాలో ఈ రకాలను సాగు చేయడంతో పరిమితంగా విత్తనాలు లభ్యమవుతున్నాయి. దీంతో రైతులు 12510, 7715 రకం సాగు చేసిన వారి నుంచి విత్తనాలను సేకరించారు. ఈ రకం విత్తనాలు మంచి దిగుబడినిస్తుందని చెబుతున్నారు. కేఎన్ఎం 12510 రకం ఎకరాకు ఐదు పుట్లు దిగుబడినిస్తుందని సాధారణ రకం కంటే 20 రోజులు పంటకాలం పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి విత్తనాలపై ఎలాంటి రాయితీ లేకపోవడం, అవసరమైనవి అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నార్లు పోసుకోవాలంటే రైతులకు ఇబ్బందులు దిత్వా తుఫాన్కు నీటి మునిగిన నారుమళ్లు విత్తన సేకరణకే రూ.వేలు వెచ్చిస్తున్న వైనం జిల్లాలో 20 శాతమే నార్లు పోసిన కర్షకులు వరి విత్తనాలకు అందని రాయితీలు -
స్పిల్వే నుంచి నీటి విడుదల నిలిపివేత
పొదలకూరు: కండలేరు స్పిల్వే నుంచి నీటి విడుదలను తెలుగు గంగ అధికారులు ఆదివారం నుంచి నిలిపివేశారు. కండలేరు జలాశయంలో ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు ఉన్నాయని, పైతట్టు నుంచి ఊహించని విధంగా నీరు వస్తున్నట్టు ఆందోళన చెందిన అధికారులు స్పిల్వే నుంచి 500 క్యూసెక్కుల నీటిని స్వల్పంగా విడుదల చేశారు. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే ఏటికాలువలో కలిసి మనుబోలు మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా సముద్రం వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనుబోలు మండలంలోని గ్రామాలకు ఇబ్బందులు కలుగుతాయని, జలాశయానికి పైతట్టు నుంచి నీరు రావడం తగ్గిపోవడంతో స్పిల్వే నుంచి నీటిని నిలిపివేసినట్టు అధికారులు అంటున్నారు.పెన్నానదిలో మృతదేహం ఇందుకూరుపేట: మండలంలోని ముదివర్తిపాళెం వద్ద పెన్నానదిలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామానికి చెందిన గుత్తి మల్లికార్జునరావు (52) మృతదేహం నదిలో కొట్టుకురాగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి జేబులో లభ్యమైన ఆధార్కార్డు ఆధారంగా వివరాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.117 మద్యం బాటిళ్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని కామాటివీఽధికి చెందిన సీహెచ్ మల్లికార్జున అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని చైతన్య ఎలక్ట్రానిక్ ధర్మ కాటా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతను కావలి ముసునూరులో ఉంటూ రోజు దుకాణానికి వచ్చి వెళ్తున్నాడు. ఆదివారం దుకాణంలో మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ ఉంచారని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య నేతృత్వంలో ఎప్సై బాలకృష్ణ దాడి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన 117 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం ఎక్కడ? ఎప్పుడు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు తదితర వివరాలపై ఎకై ్సజ్ అధికారుల సాయంతో ఆరా తీస్తున్నారు. కసుమూరులో కార్డన్ సెర్చ్ ● 46 వాహనాల స్వాధీనం వెంకటాచలం: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ అధికారులు కసుమూరులోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం కార్డన్ సెర్చ్ చేశారు. వాహనపత్రాల్లేని 46 వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు. నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు నేతృత్వంలో వెంకటాచలం ఇన్స్పెక్టర్ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి కసుమూరులోని తిప్ప, బీసీ కాలనీ, పెద్దూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇళ్లలోని వారి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 39 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు, రెండు జంటలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైలెక్కుతుండగా..
● జారిపడి మహిళ మృతి నెల్లూరు(క్రైమ్): కదిలే రైలు ఎక్కుతూ ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్ఫారం, రైలుకు మధ్యలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. అసోమ్ రాష్ట్రానికి చెందిన బి.సోనా (35) కుటుంబ సభ్యులతో కలిసి నాగాన్ ఎక్స్ప్రెస్ రైల్లో తాంబరానికి బయలుదేరారు. రైలు స్టేషన్లో మూడోనంబర్ ప్లాట్ఫారంపై ఆగింది. సోనా వాటర్ బాటిల్, స్నాక్స్ కొనుక్కునేందుకు దిగి దుకాణం వద్దకు వెళ్లింది. ఇంతలో రైలు ముందుకు కదలడంతో ఆమె పరుగులు తీస్తూ ఎక్కే ప్రయత్నం చేయగా కాలు జారింది. దీంతో ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. ఫ్లాట్ఫారం, రైలుకు మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రగాయమై మృతిచెందింది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జూడో జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఉలవపాడు: ఉమ్మడి నెల్లూరు జిల్లా జూడో క్రీడాకారుల ఎంపిక ఆదివారం కరేడు గ్రామంలో జరిగింది. జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలు జరిపారు. మొత్తం 25 మంది పాల్గొనగా 14 మంది ఎంపిక చేసినట్లు కార్యదర్శి మురళి తెలిపారు. పి.కావ్య (కావలి), పి.పవిత్ర, సాగర్, బాలాజీ (కొత్తసత్రం), ఎ.సాయిఅక్షిత (వలేటివారిపాళెం), హైమ (లింగసముద్రం), లోకేశ్, ఉదయ్ సందేశ్ (కరేడు), శ్రీను, సందీప్, జె.హర్షిణి (కలిగిరి), ఎం.అల్లూరయ్య, శివప్రసన్నకుమార్ (రంగాపురం), పి.జీవిత (కందుకూరు) ఎంపికయ్యారు. వీరు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి నెల్లూరు తరఫున పాల్గొంటారని తెలియజేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
సంగం: మండలంలోని తరుణవాయి వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే విధంగా సంగం నాలుగు రోడ్ల సెంటర్లో నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు కళ్లు తిరిగి పడి తలకు తీవ్ర గాయమైన ఘటన ఆదివారం జరిగాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని జెండా దిబ్బ గ్రామానికి చెందిన షామీర్ అనే యువకుడు తన ఎఫ్ జెడ్ బైక్పై గ్రామం నుంచి సంగానికి బయలుదేరాడు. తరుణవాయి వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టింది. దీంతో షామీర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంగం 108 అంబులెన్స్లో బుచ్చిరెడ్డిపాళెం తరలించారు. వైద్యుల సూచనల మేరకు షామీర్ను నెల్లూరుకు తీసుకెళ్లారు. ● సంగం నాలుగు రోడ్ల సెంటర్ వద్ద చేజర్ల మండలం పెళ్లేరుకు చెందిన సహదేవుడు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. అతను ఆలయాల్లో గీతాపారాయణం చేస్తుంటాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు సంగం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ స్టాఫ్ నర్సు వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సంగం 108 అంబులెన్స్లో ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావడంతో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
ప్రభుత్వ హామీ.. మాటలకే పరిమితం
కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వ మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. కందుకూరును చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించామని, చెత్త లేకుండా చేశామంటూ ఊదరగొట్టారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గుట్టలుగా పేరుకుపోతూ.. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ సీఎం చంద్రబాబు కందుకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో సభ జరిగింది. మున్సిపాలిటీని చెత్త రహితంగా తీర్చిదిద్దుతామని, డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కనిగిరి రోడ్డులోని దూబగుంట వద్ద నూతన డంపింగ్ యార్డు, చెత్త ప్రాసెస్ మెషినరీని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ ఆ యార్డుకు చెత్తను తరలించలేదు. మెషినరీ పూర్తిగా మూలనపడిపోయింది. అదే సందర్భంలో నాడు పట్టణంలోని గుర్రంవారి పాళెం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి యార్డులో ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని, చెత్త రహిత మున్సిపాలిటీగా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. ఏళ్ల తరబడి కందుకూరు మున్సిపాలిటీని వేధిస్తున్న సమస్య అలాగే ఉంది. కొండంత ఉన్నా.. ఇటీవల కాలంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని ప్రకారం కొంత మెషినరీని ఏర్పాటు చేసిన సంస్థ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 26 వేల టన్నుల వరకు చెత్తను ప్రాసెస్ చేసింది. కాంట్రాక్ట్ ముగియడంతో వారు పనిని ఆపేశారు. వాస్తవానికి డంపింగ్ యార్డులో నేటికీ పేరుకుపోయి ఉన్న చెత్త 40 వేల టన్నుల వరకు ఉంది. ఇంకా రోజూ మున్సిపాలిటీలో చేపట్టే సేకరణ ద్వారా 25 టన్నుల వరకు చెత్త వచ్చిపడుతోంది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన చెత్త ఓవైపు కంపు కొడుతుంటే మరోవైపు కొత్తగా వచ్చి చేరుతున్న దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం డంపింగ్ యార్డు సమస్యను పూర్తిగా పరిష్కరించామంటూ ప్రచారాన్ని ఊదరగొడుతుండటం గమనార్హం. కానీ ప్రస్తుతం యార్డులో చెత్త ప్రాసెస్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో సమస్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే యార్డు సామర్థ్యాన్ని మించి పూర్తి స్థాయిలో నిండిపోయి కొత్తగా పోగవుతున్న దాంతో ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం తిరిగి కాంట్రాక్ట్ పునరుద్ధరిస్తే తప్ప డంపింగ్ యార్డులో ప్రాసెస్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో కందుకూరును పట్టి వేధిస్తున్న చెత్త సమస్య ఇప్పటికే పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డంపింగ్ యార్డులో రోజురోజుకూ పేరుకుపోతున్న చెత్త కుప్పలు కాంట్రాక్ట్ పూర్తి కావడంతో చెత్తశుద్ధిని నిలిపివేసిన సంస్థ 26 వేల టన్నులు ప్రాసెస్ పూర్తి, ఇంకా మిగిలింది 40 వేల టన్నులు అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హామీ నేటికీ అలాగే సమస్య -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
‘నార్కో అనాలిసిస్ టెస్ట్కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
సాక్షి, నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ‘‘సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా..?. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెం అయిన సిగ్గు పడ్డాలి’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యే సొమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశాం. టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు. దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటి?’’ అని కాకాణి మండిపడ్డారు.‘‘సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా?. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్కు సిద్ధం’’ అని కాకాణి సవాల్ విసిరారు.దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏంటి?. దేవుడి భూములు వేరుచేసి రోడ్డు ఎందుకు వేశారు?. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు’’ అని కాకాణి ఆరోపించారు. -
కక్ష సాధింపు.. కాకాణిపై మరో అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. రాజకీయ విమర్శలు ఎదుర్కొలేక కాకాణిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పీఎస్లో సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. కాకాణిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశాలు చేయగా.. కక్ష సాధింపులో భాగంగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది.ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.


