breaking news
SPSR Nellore
-
బాలికపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్పై మైపాడుబీచ్కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. -
సచివాలయ ఉద్యోగుల ‘ఆత్మగౌరవం’ భగ్నం
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్హాల్లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్హాల్కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.మా డిమాండ్లు నెరవేర్చాలిఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో క్యాడర్ అప్గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
కొందరికే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం
● 38 వేల మంది ఉంటే 17 వేల మందికే.. నెల్లూరు(వీఆర్సీ సెంటర్): కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం పేరుతో మోసం చేసిందని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజా ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్కు రూ.30 వేల వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 38 వేల మంది ఆటో డ్రైవర్లుంటే 17,400 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని, 300 విద్యుత్ యూనిట్లు కరెంట్ బిల్లు, వాహనాలపై పెండింగ్లో ఉన్న పాత చలానాలు వంటి చిన్న కారణాలు చూపుతూ ఎగనామం పెట్టారన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అత్యఽధికంగా చలానాలు విధించే జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు పెంచలయ్య, రవీంద్ర, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 58.460 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.460 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలా శయం నుంచి కండలేరుకు 3,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 430, పిన్నేరు కాలువకు 140, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వసతుల్లేవు.. అకాడమీలా?
● కూటమి ప్రభుత్వంలో క్రీడా రంగం నిర్లక్ష్యం ● సిబ్బందికి జీతాలు ఎప్పుడిస్తారో..నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను రూపొందించాల్సిన విధానాన్ని వదిలిపెట్టింది. ఉమ్మడి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి 13 నెలలపాటు జీతాలివ్వలేదు. రెండు నెలల క్రితం ఒక్కొక్కరికి నెలలో సగం జీతం మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం తీసుకుని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. రెండు నెలల క్రితం శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సమావేశం పెట్టి కాంట్రాక్ట్ సిబ్బందికి పూర్తి జీతాలిస్తామని ప్రకటించింది. అయితే ఆ రెండు నెలల నుంచి ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు. జిల్లా సంస్థలో 26 మంది కోచ్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. అంతంతమాత్రంగా.. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వసతుల్లేవు. ఆడేందుకు మైదానాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. కనీసం మార్కింగ్ వేసేందుకు సున్నంకు కూడా డబ్బుల్లేవు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి మార్కింగ్, తాగునీటి వసతి, లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితితోపాటు జీతాలందని కోచ్లు, సిబ్బంది పనిచేయడమే కష్టంగా ఉంది. క్రీడాకారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు నామమాత్రంగా జరిగాయి. క్రీడాకారులకు పరికరాల్లేవు. నగదు ప్రోత్సాహం సరిపోలేదు. ఇండోర్ స్టేడియంలో ఆడేందుకు వసతులు తక్కువే. ఫ్లోరింగ్ నుంచి స్లాబ్ వరకు అత్యంత ప్రమాదకరంగా ఉంది. స్విమ్మింగ్ పూల్లో నీటిని శుభ్రపరచడానికి కూడా వ్యయం భరించలేని పరిస్థితి నెలకొంది. వాకింగ్ ట్రాక్, హాకీ మైదానం గుంతలమయంగా తయారైంది. సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్న బాస్కెట్బాల్ కోర్టు నిండా నెర్రెలు ఏర్పడ్డాయి. వీటిని మరమ్మతులు చేసే ప్రయత్నాలు జరగలేదు. చిన్నచూపు చూస్తూ.. కూటమి ప్రభుత్వం కనీస వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ఇటీవల అకాడమీలను ఏర్పాటు చేస్తామంటూ శాప్ అధికారి, డైరెక్టర్ల బృందం నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పరిశీలించి హడావుడి చేశారు. అసలు ప్రభుత్వం క్రీడా రంగాన్ని చిన్నచూపు చూస్తున్న నేపథ్యంలో అకాడమీలు ఎప్పటికి ప్రారంభమవుతాయని సీనియర్ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. పరికరాలు, కోచింగ్ ఇచ్చే సిబ్బంది బాగోగులు పట్టించుకోకుండా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతి జిల్లాలో అకాడమీలను ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమంటున్నారు. కోచ్ల సంఖ్య : 5 డేటా ఎంట్రీ ఆపరేటర్లు : 2 అకౌంటెంట్ : 1 ఆఫీస్ సబార్టినేట్ : 3 గ్రౌండ్ మార్కర్, గ్రౌండ్ మెన్, సెక్యూరిటీ : 3 నైట్ వాచ్మెన్, డే వాచ్మెన్ : 2 ఇండోర్ స్టేడియం అటెండర్ : 2 స్విమ్మింగ్ పూల్ సెంటర్లు : 2 స్విమ్మింగ్ పూల్ వాచ్మెన్లు : 2 ఎలక్ట్రీషియన్ : 1 కేర్టేకర్ వెంకటగిరి సెంటర్ : 1 కేర్టేకర్ గూడూరు సబ్ సెంటర్ : 1 కేర్టేకర్ ఓజిలి సబ్ సెంటర్ : 1 కాంట్రాక్ట్ ఉద్యోగులు -
వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు
నెల్లూరు(క్రైమ్): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.80 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో సుబ్బమ్మ, వెంకయ్య దంపతులు ఉంటున్నారు. ఆదివారం వారు ఇంట్లో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దంపతులు బయటకు పరుగులు తీశారు. పూరిల్లు కావడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఇన్చార్జి ఏడీఎఫ్ఓ శ్రీనాథ్రెడ్డి ఆదేశాలతో లీడింగ్ ఫైర్మెన్ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ● నవాబుపేటలో జగన్మోహన్ నివాసముంటున్నారు. అతని ఇంటి వెనుకున్న గదిలో పాత సామగ్రి, చెక్క వస్తువులున్నాయి. ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. రూ.30 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. రైలు కిందపడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వే గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. సిబ్బంది సమాచారం మేరకు నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఆమె కేసు నమోదు చేశారు.స్నేహితులతో వెళ్లి.. ● అదృశ్యమైన బాలుడు ● ఆచూకీ కనుగొన్న పోలీసులు, గ్రామస్తులు సోమశిల: ఓ బాలుడు అడవిలో అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులు గాలించి గుర్తించిన ఘటన ఆదివారం అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని ఆమనిచిరివెళ్ల గ్రామానికి చెందిన కూసుపాటి కొండయ్య కుమారుడైన వెంకటకృష్ణ పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. భోజనాల తయారు చేసేందుకు కట్టెల కోసం వెళ్లి తిరిగిరాలేదు. అక్కడున్న యువకులు గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. అందరూ ఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. పల్లిపాడు గ్రామం వద్ద బాలుడి ఆచూకీ లభ్యమైందని ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి తెలిపారు. ఎటువంటి హాని కలగకుండా వెంకటకృష్ణ బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రాళ్లపాడు ప్రాజెక్ట్లో మృతదేహం లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్లో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. కొత్త స్పీల్వే పాత గేట్లకు మధ్యలో ఉన్న జనరేటర్ రూమ్ వద్ద నీటిలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై నారాయణ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్ట్లో నీరు లోతుగా ఉన్నందున బోటు సాయంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీస్తేనే ఇది హత్య, ఆత్యహత్యా అనేది నిర్ధారణ అవుతుందని పోలీసులు వెల్లడించారు. -
విద్యాశాఖలో బదిలీలలు
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. కూటమి నాయకుల జోక్యంతో అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అఽధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చక్రం తిప్పినట్లు తెలిసింది. కొందరు టీచర్ల నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున తీసుకుని రికమండ్ చేసినట్లు సమాచారం.నెల్లూరు(టౌన్): ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించారు. పాత నెల్లూరు జిల్లా నుంచి 21 మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. వీరిలో 17 మంది ఎస్జీటీలు, నలుగురు స్కూల్ అసిస్టెంట్లున్నారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి 23 మంది టీచర్లు వచ్చారు. వీరిలో 18 మంది ఎస్జీటీలు, ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లున్నారు. వీరందరూ జిల్లా విద్యాశాఖాధికారికి రిపోర్ట్ చేయగా ఆయా స్థానాలు కేటాయించారు. ఇద్దరికి స్పెషల్ ఆర్డర్లు మ్యూచువల్, స్పౌజ్తో సంబంధం లేకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేసింది. ఈ విషయంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కోట మండలం మల్లాం జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ను నెల్లూరు నగరం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్కు, పెళ్లకూరు మండలం నెలబల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ను కోవూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్కు బదిలీ చేశారు. ఈ బదిలీలు అక్రమంగా జరిగినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా ఉత్తర్వులు జారీ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతర్ జిల్లాల ట్రాన్స్ఫర్స్లో అక్రమాలు ఇతర జిల్లాల నుంచి 21 మంది టీచర్ల రాక ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు 23 మంది మరో ఇద్దరి బదిలీకి నేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు చక్రం తిప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలుడబ్బులిచ్చి.. మ్యూచువల్, స్పౌజ్ అవకాశమున్న వారికి అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహిస్తారు. జిల్లాలో పనిచేస్తున్న టీచర్, మరో జిల్లాలో పనిచేస్తున్న వారు మ్యూచువల్పై బదిలీ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ విషయంలో కొందరు అక్రమాలకు తెరలేపారు. కూటమి నేతల జోక్యం ఎక్కువైంది. పలువురు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి బదిలీలు చేయించుకున్నారని ప్రచారం ఉంది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కొందరికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇప్పించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాఽధికారి బాలాజీరావును వివచారణ కోరగా మ్యూచువల్, స్పౌజ్లకు సంబంధించి బదిలీల్లో అక్రమాలు జరగలేదన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్డర్లు వచ్చాయన్నారు. -
నిలిచిన 104 సేవలు
● వైద్యులు సమ్మెలో ఉండటమే కారణం ● హాజరుపట్టికలో మాత్రం సంతకాలు ● ఏఎన్ఎంల ఆన్లైన్ రిపోర్టులు కూడా బంద్సాక్షి టాస్క్ఫోర్స్: గ్రామాల్లో 104 వాహన సేవలు నిలిచిపోయాయి. కందుకూరు మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యులు సమ్మెలో ఉన్నారు. దీంతో రోజుకు ఒక గ్రామానికి వెళ్లాల్సిన 104 వాహనం ఆగింది. ఆయా గ్రామాల్లోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యసేవల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు లేకపోవడంతో ఉన్నతాధికారులు సేవలను పూర్తిగా ఆపేశారు. వైద్యులు లేకపోయినా ప్రతి సచివాలయం పరిధిలో ఒక విలేజ్ క్లినిక్ ఉంటుంది. అందులో ఎంఎల్హెచ్పీ, సచివాలయ ఏఎన్ఎం, 104 వాహన సిబ్బంది ఉంటారు. వారి ద్వారా కూడా మందులిచ్చే అవకాశం ఉంది. కానీ అలా జరగడం లేదు. సంతకాలు మాత్రం పెడుతూ.. ఇదిలా ఉండగా వైద్యులు సమ్మెలో ఉంటూ కూడా విధుల్లో ఉన్నట్టు హాజరుపట్టికలో సంతకాలు చేస్తుండటం విశేషం. గత నెల 26వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. అయితే విధులకు హాజరైనట్లు సంతకాలు చేసి ఉన్నారు. జీతం తీసుకునేందుకు వారే చేశారా? లేదా పీహెచ్సీలోని సిబ్బంది చేశారా? అనే విషయంపై అనుమానాలున్నాయి. సమ్మెలో ఉంటూ విధులకు హాజరైనట్లు సంతకాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. డాక్టర్లకు సెప్టెంబర్ నెలలో పూర్తి జీతం వస్తే ఉన్నతాధికారులు కూడా పరిశీలించకుండా ఇచ్చినట్లవుతుంది. గత నెలలో ఓ ఏఎన్ఎం అనారోగ్యం కారణంగా చికిత్స పొందింది. ఆమ్మెకు సంబంధిత జీతంతోపాటు ఎర్న్ లీవ్లకు సంబంధించి బిల్లులు చేయలేదు. ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగికి జీతం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎంలు రోజూ ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. వారి చేత డాక్టర్లు నమోదు చేయించడం లేదు. ఇబ్బంది పడుతూ.. ప్రస్తుతం సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పీహెచ్సీలోని ఇద్దరు వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కందుకూరు అర్బన్ పీహెచ్సీ నుంచి వైద్యురాలిని ఇన్చార్జిగా వేసినప్పటికి 104 సేవలు గ్రామాల్లో అందడం లేదు. కందుకూరు మండలంలో 19 పంచాయతీలు, 13 సచివాలయాలున్నాయి. రోజూ 104 వాహనం ద్వారా రోగులను పరీక్షించాల్సి ఉంది. కానీ దీనికి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టలేదు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● ఒకరి మృతి, మరొకరు గల్లంతు నెల్లూరు సిటీ: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని కొత్తూరు శ్రీలంక కాలనీకి చెందిన గణేశన్ నరసింహ అలియాస్ విశాల్ (19) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవల దేవరపాళెంలోని అమ్మమ్మ ఇంటికొచ్చాడు. నరసింహకు అదే ప్రాంతానికి చెందిన బేల్దారి పనులు చేసే కోటయ్య, విజయ్, లోకేశ్లు స్నేహితులు. ఆదివారం నలుగురూ ఈత కొట్టేందుకు జొన్నవాడ సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లారు. విజయ్కు ఈత రాకపోవడంతో దిగలేదు. అయితే లోకేశ్, కోటయ్య, నరసింహ నదిలోకి దిగారు. కోటయ్య, నరసింహకు కూడా ఈత రాదు. నదిలో వారిద్దరూ గల్లంతయ్యారు. ఇది గుర్తించిన లోకేశ్ కేకలు వేశాడు. స్థానికుల సమాచారంతో సీఐ వేణు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లు వారి కోసం గాలించారు. నరసింహ మృతదేహాన్ని బయటకు తీశారు. కోటయ్య కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. సోమవారం ఉదయం పరిశీలిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒకరు మృతిచెందడం, మరొకరు గల్లంతు కావడంతో దేవరపాళెంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విర్రవీగే టీడీపీ నేతలు, పోలీసులూ జాగ్రత్త
తోటపల్లిగూడూరు: ‘టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంటే.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే విధంగా విర్రవీగే టీడీపీ నేతలు, పోలీసులు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉంటే మంచిది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటో మీ ఊహకే వదిలేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడిన సౌత్ఆములూరు వైఎస్సార్సీపీ నేత వేముల శ్రీనివాసులును ఆదివారం కాకాణి పరామర్శించారు. కాకాణి మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికార మదంతో కక్ష సాధింపు, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. శాంతిభద్రతలను నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ మరింత దిగజారిపోతున్నారని విమర్శించారు. రౌడీషీటర్లు మితి మీరి ప్రవర్తిస్తూ సామాన్యులపై, ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులను ముమ్మరం చేశారన్నారు. టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహలేని స్థితిలో ఉన్న పార్టీ కార్యకర్త వేముల శ్రీనువాసులు చేత పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని దాడి చేసిన వారిపై మొక్కుబడిగా కేసులు నమోదు చేసి, దాడి గురైన వ్యక్తిపై అట్రాసిటీ కేసులు బనాయించడం ఎంత వరకు సబబన్నారు. వైఎస్సార్సీపీలో బలంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను పోలీసులతో ఏదో విధంగా భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. అధికారం ఉందని విర్రవీగే టీడీపీ నాయకులకు, వారికి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసులు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదని వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టించిన టీడీపీ నాయకులు కావచ్చూ, అధికారులు కావచ్చూ పడే పాట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే వారి ఊహకు కూడా అందని విధంగా ఉంటాయన్నారు. జగనన్న చెప్పిన విధంగా తప్పు చేసిన అధికారులు, బదిలీ అయినా, పదవీ విరమణ చేసినా, సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కోని వచ్చి శిక్ష విధించడం ఖాయమన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే డిజిటల్ బుక్లో నమోదైన ప్రతి ఒక్కరిపై విచారణ చేసి అన్యాయం చేసిన వారిని, అందుకు సహకరించిన అధికారులకు కచ్చితంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ఇప్పటికై నా ఎస్పీ జిల్లాలో అమాయకులపై జరుగుతున్న దాడులపై పక్షపాత వైఖరితో కాకుండా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కష్టకాలంలో జెండాను భుజాన మోసిన సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మద్దెన వెంకట సుబ్బానాయుడును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుఽధీర్రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, మండల ఉపాధ్యక్షుడు చెరుకూరు శ్రీనివాసులనాయుడు, పార్టీ నాయకులు టంగుటూరు పద్మనాభరెడ్డి, గూడూరు విష్ణుమోహన్రెడ్డి, మన్నెం చిరంజీవులగౌడ్, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, మారంరెడ్డి బుజ్జిరెడ్డి, చెరుకూరు సరళమ్మ, టంగుటూరు సురేష్ రెడ్డి, ఉండాల వంశీకృష్ణారెడ్డి, చిల్లకూరు ప్రవీణ్రెడ్డి, తూపిలి ఽఉదయ్రెడ్డి, లేబూరు మల్లి, రంగినేని కిరణ్, కిశోర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి.. మీ ఊహకే.. మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరిక -
రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు
● ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలను అడ్డుకున్న పోలీసులు ● ప్రభుత్వం, పోలీసులకు ఎందుకు ఉలికిపాటు అంటూ నిలదీత నెల్లూరు (పొగతోట): తమ న్యాయమైన డిమాండ్లతోపాటు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ, నెల్లూరు జేఏసీ ఆధ్వర్యంలో పురమందిరంలో (టౌన్హాల్) ఆత్మగౌరవ సభ జరగనీయకుండా భారీగా మోహరించిన పోలీసులు ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ, కలెక్టర్ బంగ్లాల వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరినా నిరాకరించారు. ర్యాలీకి అనుమతి లేదని, ఐదుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులు మండుటెండలో మట్టి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. గంటల తరబడి ఎండలో ఉండడం, కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వీలు లేకపోవడంతో మహిళా ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, నాయకులను ఎటు వైపు కదలనీయకుండా ఉగ్రవాదులను, తీవ్రవాదులను, రౌడీమూకలను, సంఘవిద్రోహ శక్తులను కట్టడి చేసినట్లు కట్టడి చేశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేలపై కూర్చొని నిరసన కొనసాగిస్తూ పోలీసుల వైఖరి, జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ నేతల తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వంతోపాటు పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తమ నిరసన కార్యక్రమాలపై ఎందుకు ఉలికిపడుతుందని నిలదీశారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు, ప్రొబేషన్ కాలంలో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రొబేషన్ డిక్లరేషన్, 9 నెలలు ఆలస్యంగా చేసినందున, తొమ్మిది నెలల బకాయిలు, 6 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగోన్నతుల కల్పించాలని, అడ్వాన్స్ ఆటోమేటిక్ స్కీమ్ ద్వారా అదనపు ఇంక్రిమెంట్, సీనియారిటీ జాబితా, నిర్దిష్టమైన జాబ్ చార్ట్, అంతర్ జిల్లాల బదిలీలు, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కల్పించాలంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తమ ప్రధాన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ జేఏసీ నాయకులు మధుబాబు, జగదీష్, హరీష్, పాండు, సురేంద్ర, బాలాజీనాయక్, శ్రీనివాసులురెడ్డి, సతీష్రెడ్డి, బాలాజీనాయక్, జయశ్రీ, మేఘన, సురేంద్ర, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతించకపోవడం శోచనీయం – పాండు, నెల్లూరు జేఏసీ నేతఉద్యోగుల పరిస్థితులు అత్యంత దారుణం – రజని, సచివాలయ ఉద్యోగి ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది – బి.మధుబాబు, జేఏసీ చైర్మన్ ఉద్యోగుల ఐక్యత ఏమిటో నిరూపిస్తాం – పిల్లి హరీష్. జేఏసీ ప్లానింగ్ సెక్రటరీ పోలీసుల తీరుతో ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది. సభకు అనుమతించి తర్వాత నిరాకరించడం ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా చేశాయి. సచివాలయ ఉద్యోగులందరూ రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా ముందుకు సాగుతాం. సచివాలయ ఉద్యోగుల ఐక్యతేమిటే రాష్ట్ర ప్రభుత్వానికి చాటి చెబుతాం. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధన కోసం జేఏసీ నిరంతరం శ్రమిస్తోంది. ఉద్యోగుల సమస్యల సాధన కోసం అన్ని జిల్లాల్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లో సభకు అనుమతి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు సభను అడ్డుకోవడం దుర్మార్గం. ముందుగా అనుమతి ఇచ్చి సభ నిర్వహణ సమయంలో ఉద్యోగులను టౌన్హాల్ నుంచి బయటకు పంపించి, గేట్లకు తాళాలు వేయడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి తీరు ఎక్కడా చూడలేదు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు ముందుగా పోలీసుల అనుమతి కోరాం. తొలుత అనుమతిచ్చినప్పటికీ తర్వాత నిరాకరించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఉద్యోగులను మండుటెండలో రోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గం. తమ సమస్యలను అధికారులకు చెప్పుకొనేందుకు ర్యాలీ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం. పోలీసుల తీరు దారుణం. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 17 సర్వేలు నిర్వహించాం. ఇంటింటా సర్వే పేరుతో రోజూ ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగాల్సివస్తోంది. అతి తక్కువ వేతనాలతో ప్రజలకు సేవలందిస్తున్నాం. -
కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె
నెల్లూరు (అర్బన్): పీహెచ్సీల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సమ్మె శనివారం ఐదో రోజూ కొనసాగింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె ఆపేది లేదని ప్రభుత్వ డాక్టర్ల సంఘం నేత డాక్టర్ బ్రహ్మేశ్వరనాయుడు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని 52 పీహెచ్సీల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఓపీ సేవలను బహిష్కరించారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది డాక్టర్లు విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనే దానికి వెళ్లారు. మరికొంత మంది డాక్టర్లు స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా కార్యాలయం మందు ధర్నా చేశారు. డాక్టర్ బ్రహ్మేశ్వరనాయుడు మాట్లాడుతూ గత సంవత్సరం తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు పోగా ప్రభుత్వం కొంత గడువు కావాలని , ఈ లోపు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ హామీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు సమ్మె బాట పట్టామన్నారు. పీహెచ్సీల్లో 20 నుంచి 25 ఏళ్లుగా ఒకే కేడర్లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండా డాక్టర్లు పని చేయడం బాధాకరమన్నారు. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితితో ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించేందుకు జీఓ నంబర్ 99ను రద్దు చేయాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని అటవీ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలన్నారు. సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం ఇవ్వాలన్నారు. డాక్టర్లు సమ్మెలో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవీన్కుమార్రెడ్డి, శ్రావణి, జ్యోతిరాణి, విజయలక్ష్మి, సాయిప్రియాంక, రమ్య, మనోజ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్లకు అండగా ఉంటాం
నెల్లూరు సిటీ: ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు సాయం పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. లక్ష్మీపురంలోని ఎస్బీఎస్ కల్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17,406 మంది డ్రైవర్లకు రూ.26.1 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేశామన్నారు. ఎవరికై నా పథకం అందకపోతే సచివాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతోపాటు హెల్ప్లైన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. తొలుత నగరంలోని మినీబైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి స్టోన్హౌస్పేట వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆటోడ్రైవర్ల నుంచి స్పందన కరువైంది. వీరి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు చాలా వరకు ఖాళీగా కనిపించాయి. ఆటోడ్రైవర్లు అరకొరగా కనిపిస్తే.. టీడీపీకి చెందిన మహిళలతో కల్యాణ మండపాన్ని నింపేయడం విస్మయాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ చందర్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9వ తేదీ స్కానింగ్కు రమ్మన్నారు
– సుబ్బమ్మ, వెంకటరెడ్డిపల్లి, కలువాయి మండలం నేను వయోభారంతో ఉన్నాను. ఆరోగ్యం బాగలేక శనివారం మరో ఇద్దరిని తోడు తీసుకుని పెద్దాస్పత్రికి వచ్చాను. డాక్టరమ్మ రక్తపరీక్షలతోపాటు పెల్విస్కి స్కానింగ్ రాశారు. అయితే స్కానింగ్ వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు. నాకు 9వ తేదీ స్కాన్ చేస్తామని చీటీ మీద రాసిచ్చారు. ముందే నొప్పితో బాధపడుతున్నాను. రిపోర్టును చూసి ఆపరేషన్ చేస్తామని గైనకాలజీ విభాగం డాక్టర్ చెప్పారు. తీరా స్కానింగ్ వద్దకు వస్తే ఐదో రోజులు ఆగి రమ్మని చెప్పడం దారుణం. మా ఊరు నుంచి నెల్లూరుకు వచ్చేదానికి, పోయేదానికి ముగ్గురికి చార్జీలు రూ.600 అయ్యాయి. పైఖర్చులు మరో రూ.200 అయ్యాయి. మళ్లీ ఇంకో రోజు రావాలంటే ఇలాగే ఖర్చులు అవుతాయి. నాలాంటి వాళ్లకు ఇంత స్థాయిలో ఖర్చులు పెట్టుకోవడం, తిరగడం సాధ్యమేనా?. నా పరిస్థితిని, నా వయస్సును పరిగణలోకి తీసుకోవాలి కదా?. ● బుజబుజనెల్లూరు చెందిన హబీబా గత వారంలో గైనకాలజి విభాగంలో వైద్యం కోసం వచ్చారు. డాక్టర్ చెక్ చేసి స్కానింగ్ పరీక్ష రాశారు. స్కానింగ్ వద్దకు వెళ్తే ఆ రోజుకు పేర్లు ఎక్కువగా ఉన్నాయి.. రెండు రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాం.. ఆ రోజు వచ్చి పరీక్ష చేయించుకోమని సమాధానమిచ్చారు. హబీబా ఎంత బతిమాలిడినా సిబ్బంది ఒప్పుకోలేదు. ఒక్కరే డాక్టర్ ఉన్నారు. సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఆమె ఉసూరుమంటూ ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి రేడియాలజీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఫుల్గా ఉంది. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మరో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరొక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉన్నారు. అయినా ఆ రోజు అందరూ లేరని, ఒక్కరే ఉన్నారంటే.. డ్యూటీకి వచ్చి థంబ్ వేసి సొంత, ప్రైవేట్ ప్రాక్టీస్కు వెళ్లిపోయి ఉంటారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన రేడియాలజి ప్రొఫెసర్ హెచ్ఓడీ రూమ్కు పరిమతం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలు లేకపోలేదు. -
అవినీతి తప్ప.. అభివృద్ధి ఎక్కడ?
● గ్రావెల్తో రూ.100 కోట్ల కొల్లగొట్టిన సోమిరెడ్డి ● కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి తప్ప.. అభివృద్ధి బూతద్దంతో వెతికినా కనిపించడం లేదని, తండ్రీకొడుకులు కలిసి అన్ని వనరులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. పొదలకూరు మండలం దుగ్గుంటరాజుపాళెం, ముదిగేడు, ఇనుకుర్తి గ్రామాల్లో కాకాణి శనివారం పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అని ఆరా తీశారు. సహజ వనరుల దోపిడీ తప్ప, అభివృద్ధి కానరావడం లేదని స్థానికులు స్పష్టం చేశారు. కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి, ఆయన కుమారుడు ఈ పదహారు నెలల్లోనే రూ.100 కోట్లు గ్రావెల్ కొల్లగొట్టేశారని ఆరోపించారు. ఇక ఇసుకలో అయితే లెక్కేలేదన్నారు. వీరిద్దరి అక్రమార్జన తో పొదలకూరు మండలం విరువూరు, సూరాయపాళెం గ్రామాల ఇసుక రీచ్ల చుట్టు పక్కల గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నేలటూరు జెన్కో ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ అక్రమ తరలింపులో తన వాటా పెంచాలని డిమాండ్ చేస్తూ సోమిరెడ్డి ఏకంగా జెన్కోపై దాడికి తన మనుషులను పంపించారి విమర్శించారు. పొదలకూరులో లేఅవుట్ల యజమానులను బెదిరించి రూ.కోట్లల్లో డబ్బులు దండుకున్నారని, అంగన్వాడీ పోస్టులను అర్హత లేని వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాలు, బెల్టు షాపులకు సోమిరెడ్డి రేట్లు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సోమిరెడ్డి ముఠా వెంకటాచలం మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేశారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. పామాయిల్ ట్యాంకర్ల దోపిడీ, ప్రైవేట్ పొలాల్లో చెట్లను నరికివేయడం వంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను వైఎస్సార్సీపీ శ్రేణులు డిజిటల్ బుక్లో నమోదు చేయాల్సిందిగా సూచించారు. పార్టీ నాయకులతో అనుచితంగా వ్యవహరించే వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. దుగ్గుంటరాజుపాళెంలో నూతన గృహప్రవేశం చేసిన మందారపు మోహన్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి ఇనుకుర్తిలో శస్త్రచికిత్స చేయించుకున్న ముడి మస్తానయ్యను, భార్యా వియోగానికి గురైన ముదిగేడుకు చెందిన మాలపాటి ఓబుల్రెడ్డి, సంగాపు సుబ్బయ్యలను పరామర్శించారు. కార్యక్రమంలో బచ్చల సురేష్కుమారెడ్డి, ఎం.వెంకటశేషయ్య, పెదమల్లు రమణారెడ్డి, కేతు రామిరెడ్డి, కోనం బ్రహ్మయ్య, ఎం.సుందరయ్య, ఎం.జనార్దన్, మండి శంకర్రెడ్డి, నోటి వెంకటేశ్వర్రెడ్డి, ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
● ఆర్అండ్బీ ఎస్ఈకి వినతిపత్రం నెల్లూరు (అర్బన్): రోడ్లు, భవనాల శాఖ సర్కిల్ పరిధిలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమించక తప్పదని ఆ శాఖ ఉద్యోగులు, ఏపీ ఇరిగేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అమరావతి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎం శరత్బాబు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఎస్ఈ గంగాధరంను కలిసి వినతి పత్రం అందజేశారు. శరత్బాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని గత ఏప్రిల్లోనే రాత పూర్వకంగా అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటికి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. తిరుపతి జిల్లాకు బదిలీ చేసిన 17 మందిని తక్షణమే జిల్లాకు తీసుకురావాలన్నారు. అందులో దివ్యాంగురాలైన మహిళను తిరుపతి జిల్లాకు పంపడం బాధాకరమన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొంది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగులు నాలుగు నెలలు విధులు నిర్వర్తించాక రివర్షన్ పొందిన ఉద్యోగులు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలని, వారి పదోన్నతులు కొనసాగించాలని కోరారు. సీనియార్టీ ప్రకారం పెండింగ్లో ఉన్న టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు జేటీఓలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మస్తానయ్య, నారాయణ, సురేష్, నాగేశ్వరరావు, షబ్బీర్ అహ్మద్, రత్నం తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడు సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగి.. తెలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్ను ధరించి ఉన్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై హరిచందన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాల కోసం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఆరాతీస్తున్నారు. రైల్లోంచి జారిపడి.. కొడవలూరు: రైల్లోంచి జారిపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తలమంచి రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ వెంకటేశ్వరరావు వివరాల మేరకు.. తలమంచి రైల్వేస్టేషన్ వద్ద గల 190 – 25ఏ – 27 పోస్టుల మధ్య ఎగువ లైన్లో రైల్లోంచి జారిపడటంతో విజయవాడకు చెందిన కందుకూరి రమేష్ (30) మృతి చెందారు. మృతుడు రెండు చొక్కాలు, రెండు ప్యాంట్లను ధరించి ఉన్నారు. రైల్లో యాచించే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడి వద్ద ఆధార్ కార్డు లభించిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరులో అనుమానాస్పద మృతి..? ఆత్మకూరు రూరల్: పట్టణంలోని బీఎస్సార్ సెంటర్ సమీపంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఘటన అనుమానాస్పద మృతి అనే ప్రచారం జరుగుతోంది. ఈద్గా ఆవరణలో చోటుచేసుకున్న ఈ ఘటనను ప్రముఖులు, ఇతరుల ఒత్తిడితో సాధారణ మరణంగా పోలీసులు చిత్రీకరిస్తున్నారనే చర్చ సాగుతోంది. మృతుడి కుటుంబసభ్యులు సైతం సాధారణ మరణంగానే పోలీసులకు వాంగ్మూలమిచ్చార ని తెలుస్తోంది. కాగా ఈ విషయమై ఆత్మకూరు సీఐ గంగాధర్ను సంప్రదించగా, అన్ని కోణాల్లో విచారించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు. -
బాధ్యతాయుతంగా సబ్స్టేషన్ల నిర్వహణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సబ్స్టేషన్లను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య ఆదేశించారు. నగరంలోని 33 / 11 కేవీ వైఎమ్సీఏ సబ్స్టేషన్ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. సాంకేతిక విధివిధానాలు, రికార్డుల నిర్వహణ, ఫీడర్లలో లోడ్ తదితరాలను పర్యవేక్షించారు. ఎల్సీ, లాగ్బుక్, ఫీడర్ రీడింగ్ రిజిస్టర్లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. నోడల్ ఆీఫీసర్ శేషాద్రిబాలచంద్ర, ఈఈ లక్ష్మీనారాయణ, డీఈఈలు కిరణ్, సుప్రియ, ఏఈలు లక్ష్మీబాయి, లక్ష్మి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సోమశిల: బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతసాగరం మండల పరిధిలోని మినగల్లు సమీపంలో గల ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కొత్తపల్లికి చెందిన చిలకా కృష్ణారెడ్డి తన బైక్పై ఆత్మకూరువైపు నుంచి వస్తున్నారు. ఇదే సమయంలో కాకూరువారిపల్లికి చెందిన సుబ్బారెడ్డి (65), వెంకటసుబ్బారెడ్డి మినగల్లులో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి తిరిగి నడుచుకొని బయల్దేరారు. ఈ తరుణంలో మినగల్లు సమీపంలోని సచివాలయం వద్ద బైక్ ఢీకొనడంతో సుబ్బారెడ్డి తలకు బలమైన గాయమైంది. హాస్పిటల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. వెంకటసుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడగా, బైక్పై ఉన్న కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం ఆత్మకూరు హాస్పిటల్కు.. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. సుబ్బారెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి తెలిపారు. -
ఏమిటయ్యా ఈ పరేషాన్..?
ఇంకా ఎంతసేపు నిరీక్షించాలో..? వేలిముద్ర వేస్తూ.. పడిగాపులు కాస్తున్న మహిళలు అష్టకష్టాలు పడుతూ వస్తున్న వృద్ధుడు ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో రేషన్ సరుకులను పొందడంలో వృద్ధులకు కష్టాలు ఎదురవుతున్నాయి. దూరంలోని షాపులకెళ్లి సరుకులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అక్కడ పడిగాపులు కాయలేక పండుటాకుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నెల్లూరులోని జేమ్స్గార్డెన్లో గల చౌక దుకాణం వద్ద ఈ పరిస్థితులు కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ట్రాలీ తెచ్చిన తంటా
● వంతెనపై ఇరుక్కున్న లారీ ● రెండు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ దగదర్తి: భారీ లోడుతో వెళ్తున్న ట్రాలీ ఇరుక్కుపోయి ముందుకు కదల్లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ దాదాపు రెండు గంటల పాటు స్తంభించింది. మండలంలోని అల్లూరు రోడ్డు వద్ద జాతీయ రహదారి రైల్వే వంతెనపై శనివారం జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. వివరాలు.. రైల్వే వంతెనపై రోడ్డు రెండు వరుసలే ఉంటుంది. ఈ క్రమంలో కావలి నుంచి నెల్లూరువైపు భారీ లోడ్తో వెళ్తున్న ట్రాలీ రైల్వే వంతెనపైకి రాగానే మధ్యలో ఇరుక్కుపోయి ముందుకు కదల్లేదు. దీంతో వాహనాన్ని డ్రైవర్ నిలిపేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది.. మార్జిన్ రాళ్లను తొలగించి ట్రాలీ ముందుకెళ్లేలా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి ఆరు వరుసలకు గానూ ఇక్కడ రెండే ఉండటంతో ఈ పరిస్థితి నిత్యకృత్యమవుతోంది. -
షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధం
● రూ.ఐదు లక్షల నష్టం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధమైన ఘటన మండలంలోని మినగల్లు బీసీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న రామయ్య, లక్ష్మమ్మ దంపతులు మెషీన్తో కర్పూరాన్ని తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో షాపులో అర్ధరాత్రి వేళ మంటలు వ్యాపించడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు విషయాన్ని బాధితులకు తెలియజేశారు. అక్కడికెళ్లేలోపు మెషీన్తో పాటు గది మొత్తం పూర్తిగా కాలిపోయింది. రూ.ఐదు లక్షల నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతిస్థిమితం లేక కాలువలో దూకి.. కలువాయి(సైదాపురం): తెలుగుగంగ కాలువలో దూకి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పర్లకొండ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. చింతలాత్మకూరుకు చెందిన నాగిళ్ల రవి (30) తెలుగు గంగ కాలువలో దూకారు. దాచూరు సమీపంలోని కండలేరులో మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి ఎస్సై కోటయ్య చేరుకొని విచారణ చేపట్టారు. నాగిళ్ల రవికి మతిస్థిమితం సక్రమంగా లేదని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. చిన్నారిని అక్కున చేర్చుకొని.. నెల్లూరు(పొగతోట): నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఎనిమిదేళ్ల బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లిపోయారు. విషయాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, బాలల సంరక్షణాధికారి సురేష్ అక్కున చేర్చుకున్నారు. చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు కాప్ చిల్డ్రన్స్ హోమ్లో చేర్పించారు. పూర్తి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిస్తే అప్పగిస్తామని, వివరాలు తెలిసిన వారు 90007 89793 నంబర్ను సంప్రదించాలని అధికారులు కోరారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరులో శనివారం నాటికి 58.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు 3600 క్యూసెక్కుల నీరు చేరుతోందని వివరించారు. కండలేరు నుంచి సత్యసాయిగంగకు 430, పిన్నేరుకు 140, లోలెవల్కు 40, హైలెవల్కు 30, మొదటి బ్రాంచ్ కాలువలకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని చెప్పారు. పొదలకూరు నిమ్మ ధరలు పెద్దవి: రూ.40 సన్నవి: రూ.25 పండ్లు: రూ.15 -
నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ
● ఎస్పీ అజిత నెల్లూరు(క్రైమ్): కేసుల్లో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. స్టేషన్ల వారీగా కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలని సూచించారు. మహిళల భద్రత, మత్తు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నంబర్లాట, పేకాట తదితరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, నేరాలకు తరచూ పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, జిల్లాను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లను నిర్వహించాలని సూచించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలను ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించి, అక్కడి ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్నెస్లో పొందుపర్చడంతో పాటు రాత్రి గస్తీని పెంచి అనుమానితుల వేలిముద్రలను సేకరించాలన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు అందే నష్టపరిహారంపై సఖీ వన్స్టాప్ సెంటర్ సిబ్బంది తెలియజేశారు. ఏఎస్పీ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్య కాదు.. హత్యే
● మృతుడి బంధువుల ఆరోపణ ● అంత్యక్రియలను అడ్డుకున్న వైనం కొండాపురం: మండలంలోని సాయిపేట బీసీ కాలనీలో బండారు సుధాకర్ (51) ఉరేసుకొని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని కొండాపురం పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే ఇది హత్యేనని ఆరోపిస్తూ గ్రామంలో శనివారం జరగాల్సిన అంత్యక్రియలను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. మృతుడి సో దరులు, బంధువులు బండారు ప్రసాద్, రమేష్, శ్రీనివాసులు, కొండయ్య, మల్లె చిన్నయ్య, మరికొందరు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో సానంగుల రవితో సుధాకర్ భార్య మల్లేశ్వరికి వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో ఆమె అన్న తురకా మాధవ, సునీత, లక్ష్మీకాంతమ్మ, వేణు మరికొందరితో కలిసి సుధాకర్పై దాడి చేసి ఉరేసి చంపారని ఆరోపించారు. కొంత మంది అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరించారని చెప్పారు. రామాలయం వద్ద సుధాకర్పై మల్లేశ్వరి బంధువులు దాడి చేస్తుంటే గ్రామం మొత్తం చూశారని, అదే రోజు రాత్రి హతమార్చారని ఆరోపించారు. వీరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొండాపురం ఎస్సై మాల్యాద్రి.. గ్రామానికి చేరుకొని నచ్చజెప్పేందుకు యత్నించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
ముత్యాలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు రైతు ద్రోహి
పథకాలను నిలిపితే ఊరుకునేదిలేదు ● ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలా..? ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: తనకెంతో విజన్ ఉందంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్పుకొంటారని.. వరి కోతలు కోసి ధాన్యాన్ని తక్కువ ధరలకే తెగనమ్ముకున్నాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని రాజవోలుపాడులో వరి కోతలు పూర్తయిన పొలాలను గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు రైతు ద్రోహి అని ధ్వజమెత్తారు. గతేడాది ఇదే సమయంలో ధాన్యం పుట్టి ధర రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండిందని, అయితే ప్రస్తుతం రూ.15 వేల్లోపే పలుకుతోందని చెప్పారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తూతూమంత్రంగా ప్రస్తావించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. అధికార పక్షంలో ఉన్న ఆయన.. సీఎంకు చెప్పి ధాన్యానికి గిట్టుబాటు ధరను ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. దళారులకు లాభం చేకూర్చేందుకే.. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. భారీగా ఎగ్గొట్టారు.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 54 లక్షల మందికి రైతు భరోసాను అందించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 47 లక్షల మందికే ఇస్తున్నామని చెప్తూ.. మిగిలిన వారికి ఎగ్గొట్టి రైతు సేవా కేంద్రాల చుట్టూ తిప్పుకొంటోందని ఆరోపించారు. యూరియా లభించక రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తాను పంటల ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకున్న అంశాన్ని ప్రస్తావించారు. నేతలు మోటుపల్లి వెంకటేశ్వర్లు, దాసరి భాస్కర్గౌడ్, జెట్టి సురేంద్రరెడ్డి, మందల వెంకటశేషయ్య, ఈగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు: రాజకీయ ఒత్తిళ్లతో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మొగళ్లూరు, నావూరుపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడారు. నావూరుపల్లికి చెందిన చొప్పా రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ను నిలిపివేయడం దారుణమని, ఈ వ్యవహారమై హైకోర్టును ఆమె ఆశ్రయించడంతో బకాయిలతో సహా పింఛన్ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. దీంతో ఆమెకు పింఛన్ను ఈ నెల ఒకటినే అందజేశారని వివరించారు. అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. టీడీపీ నేతల మాటలను నమ్మి పథకాలను నిలిపేస్తే ప్రభుత్వం మారాక విచారణను జరుపుతామని వివరించారు. అదుపుతప్పిన శాంతిభద్రతలు సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కాకాణి ధ్వజమెత్తారు. మండలంలోని కల్యాణపురంలో శుక్రవారం పర్యటించిన ఆయన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆయన కుమారుడు బరితెగించి విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమార్జనతో రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హత్యలు, ఆక్రమణలు, బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు, బ్లాక్మెయిలింగ్ తారస్థాయికి చేరాయని విమర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన అక్కెం వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీదేవి గృహ ప్రవేశ కార్య క్రమానికి హాజరయ్యారు. నేతలు బచ్చల సురేష్కుమార్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వెన్నపూస దయాకర్రెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, ఆకుల గణేష్రెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, చెన్నూరు గంగిరెడ్డి, విజయలక్ష్మి, ఆకుల లక్ష్మి, గాలం వెంగయ్య, రమేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
సత్ప్రవర్తనతో మెలగాలి
వెంకటాచలం: తప్పులను మరోసారి చేయకుండా.. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ఫ్యామిలీ కోర్టు, సెషన్స్ జడ్జి నిఖిత సూచించారు. మండలంలోని చెముడుగుంట వద్ద గల జిల్లా కేంద్ర కారాగారంలో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె మాట్లాడారు. చేసిన తప్పులు గతమని, భవిష్యత్తు అనే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి మాట్లాడారు. గాంధీ చూపిన అహింస మార్గం జీవితంలో కొత్త అఽధ్యయానికి నాంది కావాలని సూచించారు. మార్పువైపు అడుగులేస్తూ, జైలు నుంచి బయటకొచ్చాక సత్ప్రవర్తనతో మెలగాలని కాంక్షించారు. అనంతరం ఖైదీలకు వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు, జైలర్లు రవిబాబు, శివశంకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా సాగునీటి వ్యవస్థ నిర్వహణ
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్ పనులు, మరమ్మతులపై కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో అన్ని మేజర్, మైనర్ చెరువులను 50 శాతానికిపైగా నీటితో నింపాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ పనులకు సంబంధించిన నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. కండలేరు, సర్వేపల్లి రిజర్వాయర్ల వద్ద అత్యవసర పనులకు నిధులను కేటాయిస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ స్కీమ్ ద్వారా ఎంపిక చేసిన పనులపై ప్రతిపాదనలను వెంటనే పంపాలని సూచించారు. పంట కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క, పూడికతీత, రిజర్వాయర్ల వద్ద షట్టర్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు, కాలువల బలోపేతానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉద్యాన పంటలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలని కోరారు. ఇరిగేషన్, సోమశిల ప్రాజెక్ట్ ఎస్ఈలు దేశ్నాయక్, వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డ్వామా పీడీ గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు అవార్డులు స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు లభించాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలను జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు ఈ నెల ఆరున సత్కరించనున్నారని వివరించారు. -
గాంధీ, లాల్బహదూర్ శాస్త్రికి ఘన నివాళి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వారి చిత్రపటాలకు మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కాకాణి మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధన కోసం పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రిటిష్ వలస పాలకుల కంటే దారుణంగా, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, ఉక్కుపాదంతో అణచి వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమయ్యాయని, ప్రభుత్వ పాలన మహనీయుల సిద్ధాంతాలకు విఘాతం కలిగించే విధంగా ఉండటం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గాంధీజీ కలలు సాకారం చేసేందుకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
కాలం తీరిన కూల్డ్రింక్పై ప్రశ్నించినందుకు..
● మహిళపై దాడి మనుబోలు: ఓ దుకాణ యజమాని తనపై దాడి చేసి గాయపరిచాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం తహసీల్దార్ రమాదేవికి ఫిర్యాదు చేసింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పారిచర్ల కోటమ్మ గతనెల 27వ తేదీన తన మనుమడు ధనుష్ను దుకాణానికి వెళ్లి కూల్డ్రింక్ తీసుకురావాలని చెప్పింది. అతను పడాల రాధయ్య దుకాణానికి వెళ్లి మాజా బాటిల్ తెచ్చాడు. దాన్ని తెరవగా వాసన వచ్చింది. పరిశీలించగా కాలం తీరిపోయినట్లు తెలిసింది. కోటమ్మ దుకాణానికి వెళ్లి డబ్బు తిరిగివ్వాలని కోరింది. ఆగ్రహించిన యజమాని రాధయ్య ఆమైపె కర్రతో దాడి చేశాడు. బాధితురాలు అదేరోజు మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారు ఇంత వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతోపాటు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదు. దీంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట సీపీఎం నాయకుడు బీసీ భాస్కర్ ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు
● ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ నెల్లూరు(పొగతోట): ‘జిల్లా పరిషత్ నుంచి 15 శాతం నిధులు అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు మంజూరయ్యాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఆమె సీడీపీఓలతో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో పౌష్టికాహారం నాణ్యతగా లేకుంటే సమాచారం ఇవ్వాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పిల్లలు బరువు, ఎత్తు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యకర్తలకు సంబంధించి రిటైర్మెంట్, మరణించిన అనంతరం వచ్చే బెనిఫిట్స్ పెండింగ్ ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రాల్లో ఉండే బాలలకు సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో నీతి ఆయోగ్ ద్వారా ఎంపికై న కేంద్రాల పరిశీలనకు అధికారులు వస్తారన్నారు. -
15 నుంచి నిరవధిక సమ్మె
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న చలో తిరుపతి సీఎండీ కార్యాలయం, 15వ తేదీన నిరవధిక సమ్మె చేస్తామని ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీ యాక్షన్ కమిటీ నాయకుడు షేక్ అల్తాఫ్ తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని దర్గామిట్టలోని ఏపీఎస్పీడీసీఎల్ అతిథి భవనంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల్ని యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, దామోదర్, నజీర్ఖాన్, వెంకటేశ్వర్లు, హజరత్వలీ, కృష్ణ, ప్రసాద్, పతంజలి, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
నెల్లూరు(బృందావనం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో గురువారం గుంటబడి మైదానంలో ఆర్ఎస్ఎస్ విజయదశమి మహోత్సవం వేడుకగా సాగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొనగళ్ల శోభన్బాబు విచ్చేసి మాట్లాడారు. దేశ ఐక్యతలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్ర ఎనలేనిదిగా వివరించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలో ప్రదర్శన చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ బయ్యా రవికుమార్, చిన్నబజార్ ఉపనగర కార్యవాహ్ పనబాక నరేంద్ర, స్వయంసేవకులు, మాతృమూర్తులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వినతి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న గీతాంజలి మృతిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సీఐ రోశయ్యకు వినతిపత్రం అందజేశారు. వైద్య విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, ఆత్మస్థైర్యం పెంపొందించేలా మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్రెడ్డి, నగర అధ్యక్షుడు ఎండీ తౌఫిక్, రూరల్ అధ్యక్షుడు రోహిత్, నాయకులు చంద్ర, శరత్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.133 లేయర్ రూ.110 బ్రాయిలర్ చికెన్: రూ.238 స్కిన్లెస్ చికెన్: రూ.262 లేయర్ చికెన్: రూ.187 -
నెల్లూరు: ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: ఏసీఎస్ఆర్(ACSR) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని గీతాంజలి హాస్టల్ రూమ్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని.. నంద్యాల నుంచి నిన్నే(గురువారం) హాస్టల్కి వచ్చింది. హాస్టల్లోకి మీడియాను యాజమాన్యం అనుమతించలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.విద్యార్థిని ఆత్మహత్యపై సీఐ రోశయ్య మాట్లాడుతూ.. గీతాంజలీ హాస్టల్ 3వ అంతస్తులోని రూమ్లో ఉంటుందని.. దసరా సెలవులకు తన స్వగ్రామం వెళ్లి నిన్న రాత్రి తిరిగి వచ్చిందని.. నేటి నుంచి అనాటమీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. ఉదయం స్నేహితురాలతో కలిసి టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిందని.. రూమ్ డోర్ లాక్ చేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామన్నారు. స్నేహితురాలు, తల్లిదండ్రులను విచారణ చేపట్టిన తరువాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ పేర్కొన్నారు. -
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు
రాపూరు: వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు మేలు చేకూరిందని నెల్లూరు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి షరీనా తెలిపారు. మండలంలోని ఆదురుపల్లిలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం యంత్రాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించిందన్నారు. ట్రాక్టర్ స్పేర్ పార్టులపై 18 నుంచి 5 శాతానికి తగ్గించిందని తెలిపారు. రైతులు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వ్యవసాయం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఏఓ సోమసుందర్, ఈఓపీఆర్డీ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మహాసమాధి మహోత్సవాలు ఆరంభం
నెల్లూరు(బృందావనం): పద్మావతి నగర్లోని శ్రీసాయిదర్బార్ అద్దాల మందిరంలో 107వ మహాసమాధి (ఆరాధన) మహోత్సవాలను బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. భిక్షాటన కార్యక్రమాన్ని ఆ మందిరం మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. షిర్డీ సంప్రదాయం ప్రకారం సాయినాథుడి స్వరూపులుగా భక్తులు పద్మావతి నగర్, బాలాజీ నగర్, ఏసీ నగర్, సరస్వతీనగర్ తదితర పురవీధుల్లో భిక్షాటన చేశారు. తొలుత మందిరంలో షిర్డీవాసుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయిభక్తులకు పాదపూజ నిర్వహించారు. ఉభయకర్తలుగా గునుపూడి వేణుగోపాల్, రాజ్యలక్ష్మి, కోటంరెడ్డి అమర్నాథ్రెడ్డి, శ్రీలత వ్యవహరించారు. కార్యక్రమాలను మధుసాయి, గౌరవ సలహాదారులు పాబోలు రామసుబ్బయ్య తదితరులు పర్యవేక్షించారు. విజయదశమి సందర్భంగా గురువారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
దసరా ఉత్సవాల్లో విచ్చలవిడిగా జూదం
● అనికేపల్లిలో డైమండ్ డబ్బా నిర్వహణ ● నిర్వాహకులకు టీడీపీ నాయకుల అండ ● పట్టించుకోని అధికారులు వెంకటాచలం: దసరా పండగ సందర్భంగా మండలంలోని అనికేపల్లి గ్రామదేవత ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజైన మంగళవారం గ్రూపు డ్యాన్స్లు వేయించారు. అలాగే విచ్చలవిడిగా డైమండ్ డబ్బా నిర్వహించారు. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో యువకులు వచ్చారు. టీడీపీ నాయకుల అండతో నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డైమండ్ డబ్బా జూదాన్ని నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున వరకు ఇది జరిగింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ జూదం జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో నిర్వాహకులు అనికేపల్లిలోనూ దర్జాగా జరిపి భారీగా సొమ్ము చేసుకున్నారు. అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో ప్రతి ఆదివారం డైమండ్ డబ్బా సాగుతుండటంతో తమ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
అన్నదాతపై మొసలి కన్నీరు
పొదలకూరు: రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తూ.. ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నేదురుమల్లిలో బుధవారం పర్యటించిన ఆయన రైతులతో ముచ్చటించి వారి సమస్యలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ధాన్యం దిగుబడయ్యాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక మిల్లర్లకు నష్టాలకు విక్రయించాక తాపీగా వీటిని ఏర్పాటు చేస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పుట్టి ధాన్యాన్ని రూ.12 వేలకు అన్నదాతలు తెగనమ్ముకుంటే.. సోమిరెడ్డి మాత్రం అసెంబ్లీలో మొక్కుబడిగా ప్రస్తావించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ప్రజల నుంచి అధిక విద్యుత్ చార్జీలను వసూలు చేసిన చంద్రబాబు నేరం చేశారని ఆరోపించారు. వీటిని 12 వాయిదాల్లో చెల్లిస్తాననడం దారుణమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వీటిని పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన సోమిరెడ్డి రైతులను ఆదుకోవడాన్ని అటుంచి కుమారుడితో కలిసి గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను అక్రమంగా తరలించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బిజీగా ఉన్నారని కాకాణి ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకోవడం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి కార్యక్రమాలతో పాటు అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు ఓటెందుకు వేశామని రైతులతో పాటు ప్రజలు తమను తాము ప్రశ్నించుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నించడమే కాకుండా సోమిరెడ్డి అవినీతి కార్యకలాపాలను అడ్డుకున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఆయన అక్రమాలకు సహకరిస్తున్న అధికారులెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రజాకోర్టులో వారిని ఎండగట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పతకమూరి నాగయ్యను పరామర్శించారు. ఆపై చీర్ల వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. బచ్చల సురేష్కుమార్రెడ్డి, ఎంపీటీసీ పెంచలనాయుడు, సర్పంచ్ ఉడతా రమేష్, వెంకటశేషయ్య, రవి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నిర్దయగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలా..? అసెంబ్లీలో సోమిరెడ్డి మొక్కుబడి ప్రస్తావన ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె
నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ డాక్టర్ల సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరుకుంది. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద అన్ని పీహెచ్సీల డాక్టర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘ అధ్యక్షుడు అమరేంద్రనాథ్రెడ్డి మాట్లాడారు. న్యాయమైన కోర్కెల కోసం ఆందోళనకు ఏడాది క్రితం శ్రీకారం చుట్టామని, వీటిని నెరవేరుస్తామని.. కొంత సమయం కావాలని అప్పట్లో ప్రభుత్వం కోరిందన్నారు. అయితే నేటికీ పరిష్కరించకపోవడంతో విధిలేక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. పీహెచ్సీల్లో చేరిన డాక్టర్లు 25 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతులకు నోచుకోకుండా ఒకే కేడర్లో పనిచేస్తున్నారని, వీరికి టైమ్ బౌండ్ ప్రమోషన్లను కల్పించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తొలుత వైద్యులు సమావేశమై, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మె చేయాలని తీర్మానించారు. సంఘ కార్యదర్శి శ్రీనివాసులు, నిర్వహణ కార్యదర్శి బాలచంద్రబాబు, కోశాధికారి రవీంద్రనాథ్రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రావణి, డాక్టర్లు సునీల్కుమార్, వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు అహ్మద్బాబు, నవీన్, శివకల్పన తదితరులు పాల్గొన్నారు. రోగుల ఇబ్బందులు ప్రభుత్వ డాక్టర్లు ఆస్పత్రికెళ్లి థంబ్ వేసి ఓపీ చూడకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో వైద్యమందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు రావడం లేదని తెలిసిన నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులకెళ్లి భారీగా వెచ్చిస్తూ అప్పులపాలవుతున్నారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
అనుమసముద్రంపేట: సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సచివాలయ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్పేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేత ఖాదర్వలీ మాట్లాడారు. వలంటీర్ విధులైన ఇంటింటి సర్వే నుంచి విముక్తి కల్పించాలని.. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని.. ఉద్యోగులను వారి మాతృశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నేతలు రఘు, శేఖర్, షరీఫ్, దేవా, శివ, అస్గర్, ఏడుకొండలు, మస్తాన్, యస్దానీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షిస్తాం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయానికి సంబంధించిన భూములను పరిరక్షిస్తామని ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కామాక్షితాయి ఆలయానికి చెందిన భూమి ఆక్రమణపై ‘టీడీపీ నేత బరితెగింపు’ అనే శీర్షికన సాక్షిలో గత నెల 27న కథనం ప్రచురితమైన నేపథ్యంలో కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న 40 సెంట్ల ఆలయ భూమి ఆక్రమణకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, తహసీల్దార్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపడతామని వివరించారు. రికార్డుల్లో సదరు భూమి ఆలయానికి చెందినట్లు ఉందని, సంబంధిత ఆధారాలను ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్ అధికారులకు ఇచ్చామని పేర్కొన్నారు. కాగా నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నామని చైర్మన్గా నియమితులైన తిరుమూరు అశోక్రెడ్డి తెలిపారు. -
విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): విజయదశమిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ఈ సందర్భంగా పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. శుభాకాంక్షలు నెల్లూరు రూరల్: జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలను విడుదల చేశారు. పింఛన్ల పంపిణీ నెల్లూరు(పొగతోట) / నెల్లూరు (బారకాసు): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం పంపిణీ చేశారు. నగరంలోని మూలాపేటలో గల ఈఎస్సార్ఎం స్కూల్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసి మూడేళ్లుగా మంచానికే పరిమితమైన పక్షవాత రోగి సిరివెళ్ల శ్రీనివాస్కు రూ.15 వేలు, ఒంటరి మహిళ శారదకు రూ.నాలుగు వేలను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను ఆరాతీశారు. శ్రీనివాస్కు సంబంధించిన మెడికల్ రిపోర్టులను పరిశీలించి.. అవసరమైతే ఎమ్మారై స్కాన్ను తీయించాలని సూచించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 3,07,543 మందికి గానూ 2,88,308 మందికి తొలి రోజు పంపిణీ చేశారు. కమిషనర్ నందన్,, ఎడ్యుకేషన్ సెక్రటరీ రజని తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లిలో 798 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 798 బేళ్లను బుధవారం విక్రయించామని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. వేలానికి 1063 బేళ్లు రాగా, వీటిలో 798ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 1,00,613 కిలోల పొగాకును విక్రయించగా, రూ.2,16,28,247.70 వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్ట ధర రూ.330.. కనిష్ట ధర రూ.80.. సగటు ధర రూ.214.96గా నమోదైందని తెలిపారు. పది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. -
వైద్య విద్య ప్రైవేటీకరణ తగదు
జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయం సాక్షిప్రతినిధి, నెల్లూరు: పేదలు.. బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే యత్నాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్లో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళితులు, పేదలు నిరసనను మంగళవారం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎస్సీ సెల్ నేతలతో కలిసి కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేరిగ మురళీధర్ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. విద్య, వైద్యమనేది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అని కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలనైనా.. ఒక్క సీటైనా అదనంగా తీసుకురాలేదని గుర్తుచేశారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ధనవంతులు సైతం సరైన వైద్యాన్ని అందుకోలేకపోయారని చెప్పారు. ప్రభుత్వ వైద్యులే చికిత్స చేసి పలువురి ప్రాణాలను కాపాడిన అంశాన్ని ప్రస్తావించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశమై శాసనమండలిలో ప్రభుత్వాన్ని తాను నిలదీస్తే, జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించారని మేరిగ మురళీధర్ విమర్శించారు. అధికార, ధనబలంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే వేధిస్తున్నారని.. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేసి, భవిష్యత్తులో బుద్ధి చెప్పి.. కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలు ఉన్నత చదువులను అభ్యసిస్తే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గ్రహించిన జగన్మోహన్రెడ్డి నాడు – నేడు పేరుతో పాఠశాలలు, వైద్య విద్యను బలోపేతం చేశారని ఆనం విజయకుమార్రెడ్డి కొనియాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే యత్నాలను మానుకోకపోతే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. ఏడు మెడికల్ కళాశాలలను ఒకే సంవత్సరంలో జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అయితే పది కాలేజీలను కంప్లీట్ చేయాలంటే 23 ఏళ్లు పడుతుందని చంద్రబాబు పేర్కొనడం, ఆయన చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. మెడికల్ కళాశాలలను తాము నడపలేమని, సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖను చంద్రబాబు రాయడాన్ని ప్రజలు క్షమించరని కామరాజు పేర్కొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు బద్దెపూడి రవీంద్ర, స్వర్ణా వెంకయ్య, మందా రవికుమార్, ఎస్సీ సెల్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు రాఘవేంద్ర, నవకోటి, రాహుల్గాంధీ, రాజేష్కుమార్, పాముల శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి యిర్మి యా, నేతలు మొయిళ్ల గౌరి, తనూజరెడ్డి, ఖలీల్ అహ్మద్, వెంకటశేషయ్య, బొబ్బల శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు దూరం చేసేందుకే కుట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలను విక్రయించి సొమ్ము చేసుకోవడమే చంద్రబాబు లక్ష్యం దీన్ని అడ్డుకొని తీరుతాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన జవాబు చెప్పలేక పలాయనం ఒక్క కళాశాలనైనా తీసుకొచ్చారా..? చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం ప్రజలు క్షమించరు బుద్ధి మార్చుకోండి.. పరిస్థితిని స్వయంగా గమనించిన నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వైద్యమందాలని.. పేదలు డాక్టర్లవ్వాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారని కాకాణి చెప్పారు. వీటిలో ఐదింట్లో అడ్మిషన్లు జరగ్గా, మరో ఐదు పూర్తయ్యాయన్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతుండగా, అధికారం మారడంతో సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టాక పదింటిని ప్రైవేటీకరిస్తానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. వీటిని విక్రయించి సొమ్ము చేసుకోవడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. గతంలో మెడికల్ సీట్లు 2360 ఉండేవని, అయితే జగన్మోహన్రెడ్డి కృషితో ఇవి 4910కు పెరిగాయని పేర్కొన్నారు. కళాశాలలు పూర్తయితే మరిన్ని సీట్లొచ్చే అవకాశం ఉందని, ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. -
వైభవం.. అమ్మవారి ఉత్సవం
జిల్లాలో శరన్నరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో, కన్యకాపరమేశ్వరి ఆలయంలో, మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో, జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయంలో అమ్మవారు దుర్గా అలంకరణలో దర్శనమిచ్చారు. ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో లలితాపరమేశ్వరిగా అలంకరించారు. పెంచలకోనలో అమ్మవారు రాజ్యలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. – సాక్షి నెట్వర్క్ ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో లలితా పరమేశ్వరి అలంకారం కన్యకాపరమేశ్వరి ఆలయంలో.. -
దివ్యరూపం.. మహాతేజం
తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో మలయప్ప స్వామి దేదీప్యమానంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో బ్రహ్మోత్సవాల్లో మూడో స్నపన తిరు మంజనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సేద తీరారు. సాయంత్ర వేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో దివ్య మంగళరూపంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు వాహన సేవల్లో కళాకారులు, వివిధ ప్రాజెక్ట్ల ఆధ్వర్యంలో కళాకారులు అభినయం భక్తులను ఆకట్టుకుంది. ఆలయంతోపాటు ఫల, పుష్ప ప్రదర్శన శాలలోని పుష్ప, విద్యుత్ అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నాదనీరాజనం, ఆస్థాన మండపంలో కళాకారులు భక్తి, సంగీత కార్యక్రమాలు అలరించాయి. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రథోత్సవానికి సర్వం సిద్ధం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7.00 గంటల నుంచి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. చక్రస్నానం కోసం పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ సేవలో శ్రీనివాసుడి కటాక్షం తిరుమంజనంలో సేదతీరిన శ్రీవారు నేడు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం రేపటి చక్రస్నానంతోముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
సర్వే రిపోర్ట్ మాయాజాలం
● కొన్ని రిజిస్ట్రేషన్లకు సబ్మిట్ చేయడం తప్పనిసరి ● నకిలీవి సృష్టిస్తున్న కేటుగాళ్లు ● ఓ కార్యాలయంలో ఇచ్చినట్లు వెలుగులోకి.. నెల్లూరు సిటీ: కేటుగాళ్లు నకిలీ సర్వే రిపోర్ట్లను సృష్టించి జేబులు నింపుకొంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో సృష్టించి క్రయదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెల్లూరు ఆర్ఓ, స్టోన్హౌస్పేట, బుజబుజ నెల్లూరు, కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని రిజిస్ట్రే షన్లకు తప్పనిసరిగా సర్వే రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సర్వేయర్లు ఇచ్చేది సరిపోయేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చే దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ, కాలువల పక్కనుండే స్థలాలు, సర్వే నంబర్లు భిన్నాలు అయినప్పుడు పలు కారణాలతో సర్వే రిపోర్టును క్రయదారులు పొందుతారు. సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు. నకిలీ కలకలం జిల్లాలో మండల, డిప్యూటీ సర్వేయర్లు కలిపి 80 మంది వరకు ఉన్నారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి డాక్యుమెంట్ సర్వే నంబర్ల ప్రకారం స్థలం హద్దులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించి రిపోర్టు ఇస్తారు. కాగా బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ సర్వే రిపోర్ట్ల వ్యవహారం కలకలం రేపింది. దీనిని గుర్తించిన ఆ సబ్ రిజిస్ట్రార్ సర్వేయర్కు ఫోన్ చేసి ఇది మీరు ఇచ్చిందేనా అని ప్రశ్నిస్తే.. తాను ఇవ్వలేదని, సంతకం ఫోర్జరీ చేశారని చెప్పడం గమనార్హం. నకిలీదిగా గుర్తించి రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. కాగా పదుల సంఖ్యలో నకిలీ సర్వే రిపోర్ట్లను కొందరు కేటుగాళ్లు సృష్టించి జిల్లా వ్యాప్తంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిసింది. రూ.10 వేలిస్తే.. ఈ స్థలం తమదేనని ప్రభుత్వం ద్వారా నిర్ధారించేందుకు యజమాని చలానా కట్టాలి. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి రిపోర్ట్ను సిద్ధం చేస్తారు. అయితే కొందరు రిపోర్ట్ ఇవ్వాలంటే రూ.10 వేలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేటుగాళ్లు నకిలీవి సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. పలువురు ప్రభుత్వ సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు థర్డ్ పార్టీగా బంధువులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చెముడుగుంటలో వ్యక్తి దారుణ హత్య
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీకి వెళ్లే మార్గంలో బుజబుజనెల్లూరు పరిధిలోని న్యూకాలనీకి చెందిన వల్లూరు మల్లికార్జున (55) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. న్యూకాలనీలో నివాసముంటున్న మల్లికార్జున సోమవారం రాత్రి 7 గంటల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. మంగళవారం సాయంత్రం చెముడుగుంట పంచాయతీ పరిధిలో నక్కల కాలనీకి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు విచారించగా ఆ మృతదేహం మల్లికార్జునదిగా తేలింది. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం హత్య చేశారా?, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? తదితర అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మల్లికార్జున చనిపోయాడని సమాచారం తెలియడంతో అతని భార్య వనమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం వేలుముద్రలు సేకరించింది. కాగా మృతదేహం ఉన్న ప్రాంతానికి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. ఫొటోలు తీయొద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తవ్వుకో.. దోచుకో..!
● సర్వేపల్లిలో ఆగని గ్రావెల్ దందా ● పట్టించుకోని అధికారులు వెంకటాచలం: మండలంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ రవాణాపై సోషల్ మీడియా, పత్రికల్లో నిత్యం కథనాలు ప్రచురితమవుతున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని సర్వేపల్లి, గుడ్లూరువారిపాళెం, కాకుటూరు, వెంకటాచలం, గొలగమూడి, రామదాసుకండ్రిగ గ్రామాల్లో గల చెరువుల్లో గ్రావెల్ను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. తాజాగా ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెంలోని చెరువుల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా గ్రావెల్ను తవ్వుతున్నారు. దీన్ని మనుబోలు మండలం కాగితాలపూరు సమీపంలోని రొయ్యల గుంటల వద్దకు తరలిస్తున్నారు. అధికారుల మొద్దు నిద్ర చెరువుల్లో గ్రావెల్ను అక్రమంగా తవ్వి దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నా, అధికారులు మొద్దు నిద్రను వీడటంలేదు. సామాన్యులెక్కడైనా ట్రాక్టర్ మట్టి తోలుతుంటే వెంటనే వాలిపోయే వీరు.. గ్రావెల్ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడంలేదని ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం గ్రామాల రైతులు మండిపడుతున్నారు. గ్రావెల్ గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందుతున్నా, అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు. -
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
● జన విజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు నెల్లూరు(బృందావనం): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలి. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలి’ అని పలువురు నేతలు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని వర్థమాన సమాజం హాల్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగిది. జిల్లా హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలకు చెందిన వారు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపించేలా ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. పీపీపీ విధానం ద్వారా ప్రజలకు ఆరోగ్యం, పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరంచేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్థలు ప్రజలను ఏ విధంగా కాపాడాయో వెల్లడించారు. ప్రజలకు అవగాహన కలిగించి వారిని చైతన్యపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపాందించాలన్నారు. సమావేశంలో నాయకులు బుజ్జయ్య, గాలి శీనయ్య, నారాయణ, డాక్టర్ ఖాదర్బాషా, డాక్టర్ ఎండీ షఫీ, ఎంవీ చలపతి, ఎ.విజయకుమార్, విద్యాచరణ్, కృష్ణ, ఎన్.శంకరయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాలతో కాసులు
ప్రజారోగ్యం ఏమైతేనేం.. తమ జేబులు నిండితే చాలన్నట్లుగా మారింది టీడీపీ నేతలు, పోలీసులు, మత్స్యశాఖ అధికారుల వైఖరి. చేపల గుంతల్లో చికెన్ వ్యర్థాలను డంప్ చేస్తూ.. భారీగా కాసులు గడిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఈ తంతు అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. వీటిని తరలించే వాహనాలు అడపాదడపా పట్టుబడుతున్నా, కంటపడకుండా తరలుతోంది భారీగానే ఉంటుందని అంచనా. ఇంత జరుగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో చికెన్ మాఫియా ఆగడాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. సమీప రాష్ట్రాల నుంచి చికెన్ వ్యర్థాలను జిల్లాకు యథేచ్ఛగా తీసుకొచ్చి.. చేపల చెరువుల్లో డంప్ చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, సంగం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం మండలల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో చేపలను పెంచుతున్నారు. తక్కువ ధరకే వస్తుండటంతో.. సాధారణంగా చేపలు కిలోపైగా పెరిగేందుకు దాదాపు ఆర్నెల్ల నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. రైతుల నుంచి కిలోను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అదే మేతగా బ్రాండెడ్ ఫీడ్కు ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. వీటితో నాలుగు నెలలకే కిలో.. అంతకుమించి బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి చికెన్ వ్యర్థాలను జిల్లాకు తీసుకొచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కిలోను ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15కు విక్రయిస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో.. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు, పొదలకూరు, తోటపల్లిగూడూరు, సంగం ప్రాంతాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు, పోలీస్ అధికారుల కనుసన్నల్లో మాఫియా బరితెగిస్తోంది. పదుల సంఖ్యలో వర్కర్లు వీరికి అండగా ఉన్నారు. ముందుగా బెంగళూరు, చెన్నై, కేరళ ప్రాంతాల్లో చికెన్ వ్యర్థాల సేకరణ కోసం డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసమే రూ.కోట్లను వెచ్చించారు. అక్కడే కొందర్ని చేరదీసి వారి ద్వారా నిత్యం సేకరిస్తున్నారు. ఆపై రాత్రివేళ లోడ్ చేసి నెల్లూరుకు చేరుస్తున్నారు. నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఈ వాహనాలు టో-ల్గేట్లు దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో కట్టడి చేసే అవకాశం ఉంది. అయినా పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.పది వేల చొప్పున పోలీస్ శాఖకు నెలవారీ మామూళ్లను ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. ఈ రకంగా నెలకు వంద వాహనాలు తిరిగితే స్టేషన్కు రూ.పది లక్షల మేర అందుతోందని సమాచారం. సర్కిల్, డీఎస్పీ స్థాయి అధికారులకు సైతం ఇదే పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీటిని ఆపేందుకు ఎవరూ ఉత్సాహం చూపడంలేదు. మత్స్యశాఖ అధికారులకు సైతం నెలకు రూ.లక్షల్లో అందుతోందని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగితేనో.. వాహనం పాడైన సందర్భాల్లోనో ఈ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.కోట్లల్లో ఆదాయం కిలోకు రూ.పది మేర వెచ్చించి.. చేపల చెరువు యజమానులకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఈ రకంగా చూస్తే జిల్లాలో నెలకు రూ.పది కోట్ల వ్యాపారం జరుగుతోందని సమాచారం. మాఫియాకు భారీగా ఆదాయం వస్తుండటంతో దీనిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు మాఫియా భారీగా సమర్పి స్తోందనే టాక్ ఉంది. ఆరోగ్యానికి చేటే.. చికెన్ వ్యర్థాలను ఆహారంగా తీసుకునే చేపలను భుజిస్తే ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది మాంసాహార ప్రియులు చెరువుల్లో పెంచే చేపలనే తింటున్నారు. ఈ – కోలి బ్యాక్టీరియా చేరి కేన్సర్, జీర్ణకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతా ఆర్భాటమే..చికెన్ వ్యర్థాల విషయమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల్లో కట్టడి చేయాలని పేర్కొన్నా, అవేవీ అమలుకు నోచుకోవడంలేదు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, ఆత్మకూరు రూరల్ ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు.. మాఫియాలో చేరారు. కొందరు పోలీస్ అధికారులు సహకారం అందిస్తుండటంతో వ్యాపారం సజావుగా సాగుతోంది. అడపాదడపా వాహనాలను పట్టుకున్నట్లు చూపుతున్నారు. ఆత్మకూరు మండంలోని వాసిలిలో చికెన్ వ్యర్థాల డంపింగ్ కేంద్రాన్ని జనసేన నేతలు చూపి పోలీసులకు పట్టించారు. ఇంత జరుగుతున్నా, పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. -
సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవ ర్యాలీ
● అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలిగిన వైనం ● ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శనను సోమవారం నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ల జేఏసీ నేతలు సతీష్రెడ్డి, బాలు, పాండురంగ మాట్లాడారు. ఉన్నత చదువులను అభ్యసించి ఎంతో ఆశతో సచివాలయ ఉద్యోగాల్లో చేరామని, తమ సమస్యలను సర్కార్ నెరవేర్చకపోయినా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్నామని చెప్పారు. తమ మెడపై కత్తిపెట్టి వలంటీర్ల విధులను చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటి సర్వేను చేయాలనడం తగదని, ప్రత్యామ్నాయం చూడకుండా తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలను తరచూ ఇస్తున్నా, ప్రయోజనం లేకపోవడంతో నిరసన బాట పట్టామని వివరించారు. ప్రభుత్వ తీరు మారకపోవడంతో అఽధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగామని చెప్పారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలల అరియర్స్ను చెల్లించడంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేతలు చైతన్య, గోపాల్, మురళీకృష్ణ, రాజేశ్, శశి, సురేష్, బాలాజీనాయక్, ఫయాజ్, అబీద్, సుమన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
జగజ్జననీ.. కరుణించు
లోకమాతా కరుణించు అంటూ భక్తుల నామస్మరణతో అమ్మవారి ఆలయాలు మార్మోగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగజ్జనని వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్వర్క్ మూలాపేటలోని మూలస్థానేశ్వరాలయంలో.. జొన్నవాడలో.. -
హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వం
కోవూరు: కౌలు రైతులకు నూతన చట్టాన్ని తీసుకురావడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక విస్మరించిందని కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణయ్య ఆరోపించారు. పడుగుపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా నాలుగో మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల గురునాథం, కార్యదర్శిగా తుళ్లూరు గోపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 27 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీ, తొమ్మిది మంది ఆఫీస్ బేరర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాధాకృష్ణయ్య మాట్లాడారు. గుర్తింపు కార్డులను ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సమయానికి యూరియాను అందించాలని గురునాథం డిమాండ్ చేశారు. అనంతరం వివిధ అంశాలపై తీర్మానం చేశారు. రైతు సంఘ నేత చండ్ర రాజగోపాల్, సీఐటీయూ నేత ప్రసాద్, రెహనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
సోమశిలకు 34,200 క్యూసెక్కుల వరద
● పెన్నాకు 25,650 క్యూసెక్కుల విడుదల సోమశిల: సోమశిల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి 34,200 క్యూసెక్కుల ప్రవహం వస్తోందని చెప్పారు. 7, 8 క్రస్ట్ గేట్ల నుంచి పెన్నాకు 25,650.. కండలేరుకు 4000.. ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నామని వివరించారు. జలాశయంలో 73.246 టీఎంసీలు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. 99.932 మీటర్ల నీటిమట్టం నమోదైందన్నారు. వరద తగ్గేంత వరకు ఆప్రాన్ మీదుగా వాహనాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సోమవారం ఆవిష్కరించారు. చింతారెడ్డిపాళెంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్యాయానికి గురవుతున్న పార్టీ శ్రేణులకు అండగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారని వివరించారు. -
విన్నపాలు వినవలె..
● కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● 500కు పైగా వినతులు నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మండలాధికారుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చాం. ఇక్కడైనా మా బాధలు విని స్పందించండి’ అని పలువురు అర్జీదారులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి అర్జీలు సమర్పించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ అర్జీలు 500కిపైగా వచ్చాయి. కలెక్టర్, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, డ్వామా పీడీ గంగా భవాని తదితర అధికారులు వినతులు తీసుకున్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు పెరమన గ్రామం సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇద్దరు మంత్రులు పరామర్శకు రాలేదు. విధిలేని పరిస్థితిలో మృతదేహాలతో న్యాయం చేయాలని ధర్నా జరిపాం. దీంతో ఆర్డీఓ రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే ఇంకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దళిత కుటుంబాల్లో సర్వం కోల్పోయి వీధిన పడిన బిడ్డలకు ఇంటికొక ఉద్యోగం కల్పించాలి. అలాగే నష్టపరిహారం ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేసి ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం స్పందించాలి. – ధనలక్ష్మి, అశ్విని, సౌందర్య, వెంగమ్మ, వైష్ణవి (మృతుల కుటుంబ సభ్యులు), కాయంపు శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు (సీపీఎం నాయకులు) ఇంగ్లిష్ మీడియం దూరం గత ప్రభుత్వంలో పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం విద్యను కూటమి ప్రభుత్వం బలహీనపరిచిందని ఇంగ్లిష్ మీడియం విద్యాపరిరక్షణ వేదిక అధ్యక్ష, కార్యదర్శులు దాదినబోయిన ఏడుకొండలు, ఈదర గోపిచంద్ తెలిపారు. ప్రతి జిల్లా తిరుగుతూ గుంటూరు నుంచి వచ్చిన ఏడుకొండలు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ట్యాబ్, టోఫెల్ శిక్షణ, బైజుస్ కంటెంట్, సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు లాంటి చర్యలు చేపట్టిందన్నారు. పేదలకు ఇంగ్లిష్ విద్య అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తెలుగు మీడియంకు తాము వ్యతిరేకం కాదన్నారు. తెలుగును ఒక భాషగా ఇంటర్, డిగ్రీ వరకు కూడా ప్రవేశపెట్టవచ్చన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తే ప్రపంచ విషయాలు అర్థమవుతాయన్నారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. దారి లేకుండా కంచె వేశారు మేము వైఎస్సార్సీపీ మద్దతుదారులమని ఇంటికి దారి లేకుండా మున్సిపల్ కౌన్సిలర్ శివారెడ్డి, ఆయన అనుచరులు కంచె వేశారు. సర్వే నంబర్ 198లో ఉన్న గ్రామ పొరంబోకు స్థలాన్ని శివారెడ్డి ఆక్రమించాడు. దీంతో నాలుగు ఇళ్లకు దారి లేకుండాపోయింది. ప్ర శ్నిస్తే అధికార పార్టీ అండతో దౌర్జన్యం చేస్తున్నారు. ఆర్డీఓ ఒకసారి, కలెక్టర్కు రెండుసార్లు అర్జీలిచ్చాను. వీఆర్వో సర్వే చేయకుండానే చేసినట్టు చూపి అర్జీని ఆన్లైన్లో క్లోజ్ చేసి మాకు అన్యాయం చేశారు. – యనమల రాంబాబు, వెంకట్రావుపల్లి, ఆత్మకూరు మున్సిపాలిటీ -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పలు అంశాలపై సోమవారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలు పదేపదే వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు తాగునీరు, భోజన వసతి కల్పించడం, అదనంగా పందిళ్లు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబందించి ఈ – ఆఫీసులో ఫైళ్లను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని సూచించారు. ప్రతి ఫైలుకు ప్రత్యేక క్రమ సంఖ్యను కేటాయించి ఆ నంబర్ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ● జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రూపొందించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వేడుకోలు
నెల్లూరు(క్రైమ్): సమస్యలపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని పలువురు పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 78 మంది తమ సమస్యలను వినతుల రూపంలో నెల్లూరు రూరల్, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చెంచురామారావుకు అందజేశారు. వినతులను పరిశీలించిన వారు చట్టపరిధిలో సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● చిన్నకుమారుడు పెంచలకృష్ణ ఆస్తి కోసం నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తీవ్రంగా కొడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ● నాపేరుపై ఉన్న ఆస్తిని కుమారుడు తీసుకుని ఇంటి నుంచి గెంటేశాడు. తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుంటున్నాను. దీనిపై తగిన చర్యలు తీసుకోవాని జలదంకికి చెందిన ఓ వృద్ధురాలు విన్నవించారు. ● పొదలకూరుకు చెందిన శ్రీనివాసులు, హైదరాబాద్కు చెందిన రవికుమార్ క్రిప్టో కరెన్సీలో నగదు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.8 లక్షలు పెట్టించారు. విచారించగా అదంతా మోసమని తేలింది. నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● రామ్నారాయణ అనే వ్యక్తి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని బెదిరింపులకు దిగడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలని రామ్నారాయణ బెదిరిస్తున్నాడని కలువాయికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా పెద్ద కుమార్తె ఉదయగిరి ఆనకట్టలో పడిపోయిన ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయి. లోతుగా దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఉదయగిరికి చెందిన ఓ తండ్రి కోరారు. ● నాకు ఆరునెలల క్రితం వివాహమైంది. భర్త, అత్తింటివారు అదనపుకట్నం, బంగారు కోసం వేధిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే విడాకులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని బాలాజీనగర్కు చెందిన ఓ మహిళ కోరారు. రక్షణ కల్పించాలి : బీజేపీ నాయకురాలు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీజేపీ నాయకురాలు కె.రాజేశ్వరి కోరారు. ఆమె శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలోని తన పొలంలో వంద టేకుచెట్లను కొందరు గతనెల 26వ తేదీన నరికి తీసుకెళ్లారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనపై పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తమకే ఇలా ఉంటే సామాన్యు ప్రజల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. -
అగ్నిప్రమాద బాధితులకు అండగా..
● నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు(స్టోన్హౌస్పేట): నగరంలోని సంతపేట పాత వస్త్ర మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన 30 కుటుంబాలకు వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్చార్జి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి అండగా నిలిచారు. ఆయన సోమవారం బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వస్త్ర దుకాణాల్లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పేదలు ఎంతో నష్టపోయారన్నారు. 30 షాపులు కాలిపోయాయన్నారు. 8 షాపుల వారు సర్వం కోల్పోయారన్నారు. 22 దుకాణాలు దెబ్బతిని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులవుతున్నా ప్రభుత్వం ఇంత వరకు బాధితులను ఆదుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. నాడు ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకున్న సందర్భాలను వివరించారు. అధికార పార్టీ నేతలు కంటి తుడుపు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ఉండి కలెక్టర్కు జరిగిన నష్టాన్ని వివరించి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చమురు నిక్షేపాల కోసం అన్వేషణ
● ఆందోళన చెందుతున్న గ్రామస్తులు ● తహసీల్దార్కు వినతి పొదలకూరు: మండలంలోని తొమ్మిది గ్రామాల్లో ఓఎన్జీసీ సంస్థ చమురు నిక్షేపాల కోసం అన్వేషిస్తోంది. మూడురోజులుగా ఈ ప్రాంతంలో బోరు పాయింట్లు వేసి సర్వే నిర్వహిస్తున్నారు. పార్లపల్లి, పొదలకూరు, మరుపూరు, డేగపూడి, నేదురుమల్లి, తాటిపర్తి, వెలికంటిపాళెం, అమ్మవారిపాళెం, అయ్యగారిపాళెం తదితర గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వంద అడుగుల లోతు వరకు పాయింట్లు వేసి తర్వాత పేలుడు పదార్థాలు లోపలకు పంపి బ్లాస్ట్ చేస్తారని తెలుస్తోంది. బ్లాస్ట్ చేసిన తర్వాత శాటిలైట్ ద్వారా అన్వేషణకు సంబంధించిన నిపుణులకు అనుసంధానించి భూగర్భంలో చమురు నిక్షేపాలు ఉన్నది లేదని తెలుసుకుంటారు. పీఆర్వో సుధీర్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అంతేకాక సంబంధిత వీఆర్వోలకు ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళన పట్టా భూముల్లో అనుమతి లేకుండా తాము వినియోగిస్తున్న బోర్లకు సమీపంలో వారు బోర్లు వేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు అంటున్నారు. తన పొలంలో పది బోర్లు వేసినట్టు ప్రభాకర్ అనే రైతు తహసీల్దార్ బి.శివకృష్ణయ్యకు సోమవారం రాతపూర్వకంగా తెలిపారు. తమ సొంత పొలంలో అనుమతి లేకుండా బోర్లు వేయొద్దని రైతులు వెల్లడించారు. భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడితే తాము నష్టపోవాల్సి వస్తుందన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఇబ్బందులు తలెత్తకుండా తాను మాట్లాడతానని వెల్లడించారు. -
పీహెచ్సీల్లో ఓపీ సేవలు బంద్
అగచాట్లు నెల్లూరు(అర్బన్): రోగులతో పాటు డాక్టర్లపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో గతేడాది డాక్టర్లు ఇదే తరహాలో సమ్మెకు పిలుపునివ్వడంతో, చర్చలు జరిపింది. పలు హామీలిచ్చినా, అందులో ఏ ఒక్కటీ నేటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు సోమవారం నుంచి బంద్ అయ్యాయి. ఇదీ పరిస్థితి.. సాధారణంగా కొన్ని పీహెచ్సీల్లో 50 నుంచి 60.. మరికొన్ని చోట్ల 70 మంది వరకు రోగులకు ఓపీ సేవలందేవి. అయితే డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో పలు ప్రాంతాల్లో ఇది 20కి పడిపోయింది. తొలి రోజే ఇలా ఉంటే రెండో రోజు నుంచి ఆస్పత్రులు ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపేస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇవీ డిమాండ్లు.. ● 20 నుంచి 25 ఏళ్లుగా ఉద్యోగోన్నతుల్లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి. ● ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించేలా జీఓ నంబర్ 99ను రద్దు చేయాలి. ● నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలి. ● గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూల వేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలి ● చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.ఐదు వేల భత్యాన్ని ఇవ్వాలి. ● స్థానికత్వం, పట్టణ వైద్యాధికారుల సర్వీస్ అర్హత సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ అంశాలకు పరిష్కారం చూపాలి. వైద్యమందక రోగుల అవస్థలు పలు చోట్ల డాక్లర్ల అవతారమెత్తిన నర్సులు అవసరమైతే ఎమర్జెన్సీ సేవలనూ నిలిపేస్తామని ప్రకటన జిల్లాలోని 52 పీహెచ్సీల్లో ఓపీ సేవలను డాక్టర్లు నిలిపేశారు. కొన్ని చోట్ల డాక్టర్లు హాజరైనా, కుర్చీలు ఖాళీ చేసి పక్కకు వెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల అసలు వైద్యులే రాకపోగా.. పలు ప్రాంతాల్లో ఆస్పత్రిలో డాక్టర్లున్నా రోగుల వైపు చూడలేదు. విషయం తెలియక హాస్పిటళ్లకు వచ్చిన పలువురు నిరుపేద రోగులు వైద్యమందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి పరిస్థితిని చూసి కొన్ని చోట్ల నర్సులే డాక్టర్ల అవతారమెత్తారు. ఏదో తూతూమంత్రంగా నాలుగు మాత్రలిచ్చి పంపారు. -
తెలుగుదేశం అడ్రస్ గల్లంతు ఖాయం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మనుబోలు మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ వీరాభిమాని, విశ్రాంత ఉపాధ్యాయుడు బాలిరెడ్డి, పిడూరుపాళేనికి చెందిన నాయకుడు గోపిరెడ్డిను సోమవారం ఆయన పరామర్శించారు. ఇటీవల బద్దెవోలు గ్రామానికి చెందిన చల్లా రమణయ్య మరణించగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఆయా గ్రామాలకు చెందిన అభిమానులు, నాయకులు కాకాణికి ఘన స్వాగతం పలికారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అరకొరగా అమలు చేసి అంతా చేసేశానంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలను పెంచబోనని హామీ ఇచ్చి తొలి ఏడాదిలోనే రూ.19 వేల కోట్ల భారం మోపడంతోపాటు రూ.923 కోట్లు అక్రమంగా ప్రజల నుంచి వసూలు చేశాడన్నారు. ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఇచ్చే మనసు బాబుకు రాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వల్లూరు హర్షవర్ధన్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, చేడిమాల బుజ్జిరెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, వెంకటశేషయ్య, జానకిరామిరెడ్డి, రమేష్, గిరి, దయాకర్, నవకోటి తదితరులు పాల్గొన్నారు. -
పక్షపాత అధికారుల భరతం పడుతాం
● కార్యకర్తలకు అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ నెల్లూరు (స్టోన్హౌస్పేట): అధికార మదంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, వీరి అండ చూసుకుని పక్షపాతంతో వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టేందుకే డిజిటల్ బుక్ను ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యూఆర్ కోడ్తో కలిగిన డిజిటల్ బుక్ను ఆవిష్కరించారని తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీ, వెంకటగిరి సమన్వయకర్త నేదరుమల్లి రాంకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ ముఖ్య నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్ను ఆవిష్కరించారు. కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టిన, పెట్టే వారిపై ఫిర్యాదు చేసేందుకు డిజిటల్ బుక్ ఒక అస్త్రమన్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారిపై కార్యకర్తలు, ఈ బుక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఫిర్యాదు చేసిన వారిపై తప్పకుండా శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, నాయకులు బొబ్బల శ్రీనివాసులు యాదవ్, పేన్నేటి కోటేశ్వరరెడ్డి, మందల వెంకటశేషయ్య తదితరులు ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణంపై అబద్ధాల చంద్రబాబు అసత్యాలు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 15 ఏళ్లలో పేదల ఇళ్ల నిర్మాణం గురించి ఏమాత్రం ఆలోచన చేశాడో ప్రజలందరికీ తెలుసునని, తాజాగా అసెంబ్లీ వేదికగా ఇళ్ల నిర్మాణంపై పచ్చి అబద్ధాలు వల్లెవేశాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కాకాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం 6.15 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లు నిర్మించిందని, అందుకోసం రూ.2200 కోట్లు ఖర్చు చేశామని, దీపావళి కానుకగా మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని నిస్సిగ్గుగా మరో అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీలకు రూ.50 వేల, ఎస్టీలకు రూ.70వేల, ఆదివాసీలకు రూ.లక్ష వరకు పెంచి ఇస్తున్నామని మరో అబద్ధాన్ని కళ్లార్పకుండా చెప్పాడన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు లేదా మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తున్నామని, ప్రజలు ఛీదరించుకుంటారన్న సోయ లేకుండా 2029 నాటికి ఇళ్లు లేని వారు ఎవరూ ఉండరని అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి వైఎస్సార్సీపీ హయాంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఐదేళ్లలో 31.19 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. దాదాపు 22 లక్షల కు టుంబాలకు ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణాలు ప్రారంభించామని, తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో ఏరియాలో వందల ఎకరాల్లో 10 వేలకు పైగా లేఅవుట్లు వేసి ఊర్లను తలపించేలా కొత్తగా ఇల్లు నిర్మించామన్నారు. మొత్తం 71,811 ఎకరాలు సేకరించామని, ఎకరం ఐదారు కోట్ల విలువ చేసే భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కొని పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. ఒక్కో ప్లాటు విలువ రూ. 3.50 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ధర పలుకుతోందని, రూ.76 వేల కోట్ల విలువైన ప్లాట్లను పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటయ్యాయని, చాలా ఇళ్లు అనేక దశల్లో ఉన్నాయన్నారు. దాదాపు 2 లక్షల టిడ్కో ఇళ్లను ఒక్క రూపా యికే పేదలకు వైఎస్ జగన్ అందించారని, కానీ కూట మి ప్రభుత్వం వచ్చాక వాటికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే పేరును తీసేసి పీఎంఏవై ఎన్టీఆర్ నగర్లుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 2024 ఎన్నికల నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తయ్యే దశలో ఉంటే వాటిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది బాబే వైఎస్ జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే దాదాపు వెయ్యి కేసులేసి అడ్డుకోవాలని చూశాడని, ఆఖరుకు అమరావతి రాజధానిలో పేద ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల కు వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలిస్తే దాన్ని కూడా కేసులేసి చంద్రబాబు అడ్డుకున్నాడన్నారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ 50,793 ఇళ్లకు ఒకే చోట పట్టాలు పంచిన చరిత్ర జగన్కే దక్కుతుందన్నారు. సెంటు స్థలం సమాధి కట్టుకోవడానికి కూడా పనికిరాదని ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పేదల ఇళ్లపై విషప్రచారం చేశాడని, ఇంటి స్థలంపై పేద వాడికి సర్వ హక్కులు కలిగేలా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్వేయన్స్ డీడ్ పేదల పేరుతో ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు ఓర్చుకోలేకపోయాడన్నారు. కరోనా, కోర్టు కేసులు అధిగమించి రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ఇచ్చిందని, డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిని ఆదుకోవడానికి రూ.35 వేలు పావలా వడ్డీకే ఇచ్చారన్నారు. రూ.15 వేలు విలువ చేసే ఉచిత ఇసుకతో పాటు స్టీల్, సిమెంట్ వంటి 12 రకాల సామగ్రి కొనుగోళ్లలో రూ.40 వేల మేర లబ్ధి చేకూర్చారన్నారు. ఆ విధంగా ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 2.70 లక్షల మేర ఖర్చు చేశామని, వైఎస్సార్సీపీ హయాంలో ఇంటి నిర్మాణం కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.32,909 కోట్లు అని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో కాలక్షేపం అసెంబ్లీ సమావేశాలు కూటమి సభ్యుల కాలక్షేపానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని నిందించడానికి, చంద్రబాబు, లోకేశ్ గొప్పలు చెప్పి పొగిడించుకోవడానికే వాడుకున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చలు జరిగినట్టే కనిపించలేదన్నారు. సభ్యుల నోటి వెంట నోరు తెరిస్తే అబద్దాలు తప్ప మరోటి వినిపించలేదని, ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు చిరంజీవి ఇచ్చిన కౌంటరే ఉదాహరణ అన్నారు. 15 ఏళ్లలో పేదల గృహాలను పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వంలో 3 లక్షల ఇళ్లకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశామనడం నిస్సిగ్గు వేదిక ఏదైనా సరే కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గత ప్రభుత్వంలో చేసిన పనులు తన ఖాతాలో వేసుకుంటూ అసత్యాలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రూ.2,203 కోట్ల అవినీతి ఇళ్ల నిర్మాణం పేరుతో పేదవాడి మీద భారం మోపిన ఘనుడు చంద్రబాబు అని, 2016–17లో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 415 చదరపు అడుగుల్లో మూడు రకాల ఇళ్లను మూడు అంతస్తుల్లో నిర్మిస్తానని హామీ ఇచ్చాడన్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగే ప్లాటుకు రూ. 2.60 లక్షల ధర నిర్ణయించి వారికి బ్యాంకు రుణం ఇప్పించి వారు నెల నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు దాదాపు రూ. 7.20 లక్షలు చెల్లించేలా ప్రణాళిక రూపొందించాడన్నారు. ఆ విధంగా పేదవాడి మీద బాంబు వేశాడన్నారు. నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నాడని, ముడుపులు ఎక్కువగా ఇచ్చిన వారికి ఎక్కువ ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు కాంట్రాక్ట్లు కట్టబెట్టాడని, 2016–17 మధ్య కాలంలో ఇంటి నిర్మాణం చదరపు అడుగుకి రూ.900 నుంచి రూ. వెయ్యి వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రూ. 2,534.75 నుంచి రూ.2,034.50లకు ఇచ్చాడన్నారు. ఆ విధంగా రూ.2,203 కోట్లు దోచుకుతిన్నాడని, పేదవాడి ఇంటి నిర్మాణంలో కూడా చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డాడన్నారు. ఆ రోజు మార్కెట్ ధరతో పోల్చితే పేదల నుంచి రూ.1200 అదనంగా వసూలు చేశాడన్నారు. -
గుండెను కాపాడుకుందాం
నెల్లూరను(అర్బన్): గుండెపోటు.. ఒకప్పుడు 60 సంవత్సరాల వయసు దాటిన వారికి కనిపించేది. అయితే నేటి యాంత్రిక యుగంలో యువత హార్ట్ స్ట్రోక్కు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29వ తేదీని ప్రపంచ గుండె దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంవత్సరం థీమ్ డోంట్ మిస్ ఏ బీట్. సోమవారం జిల్లాలో డాక్టర్లు, వైద్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెరుగుతూ.. ఒత్తిడితో కూడుకున్న పని, మారిన జీవనశైలి, తగిన వ్యాయామం లేకపోవడంతో గుండెపోటు వస్తుంది. జంక్ ఫుడ్ తినడం, నిద్ర లేకపోవడం, బీపీ, షుగర్ కూడా కారణాలుగా ఉన్నాయి. శీతాకాలంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ తర్వాత రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించే సరికే మృత్యువాత పడ్డాడు. మరో చోట 20 ఏళ్ల యువతికి గుండెపోటు వచ్చింది. జిల్లాలో 15 శాతం మంది అనగా సుమారు 3.5 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన గుండె జబ్బులతో బాధపడుతున్నారు. రోజూ వెయ్యి మందికిపైగా హార్ట్ సమస్యలతో డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు తినాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తే 85 శాతం మరణాలను ఆపొచ్చు. 30 సంవత్సరాల వయసు దాటిన వారు సంవత్సరానికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ నొప్పిని కూడా గుండెపోటుగా పొరపడే అవకాశముంది. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి రోగికి తీసుకెళ్తే కాపాడొచ్చు.జిల్లాలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు నేడు వరల్డ్ హార్ట్ డే ఈ సంవత్సరం థీమ్ ‘డోన్ట్ మిస్ ఏ బీట్’ -
గ్రావెల్ దోపిడీకి అడ్డేది?
● రామదాసుకండ్రిగ చెరువులో తవ్వకాలు ● పట్టించుకోని అఽధికారులువెంకటాచలం: మండలంలోని రామదాసుకండ్రిగ చెరువులో వారం రోజుల నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. రామదాసుకండ్రిగకు వెళ్లే మార్గంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డు ఆనుకుని ఉన్న చెరువులో జేసీబీతో అక్రమంగా గ్రావెల్ తవ్వి ట్రాక్టర్లలో సమీపంలోని ఖాళీ ప్లాట్లకు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పు గ్రావెల్ను రూ.1,500 లెక్కన అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. తవ్వకాల గురించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గ్రామస్తులు తమ ఇళ్ల అవసరాలు, పొలాల చదును కోసం చెరువు నుంచి మట్టి తరలించాలంటే అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుంటారు. కూటమి నేతలు రేయింబవళ్లు ఇష్టారాజ్యంగా చెరువులో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నా స్పందించకపోవడంపై విమర్శలున్నాయి. గ్రామానికి అతిసమీపాన ఉన్న చెరువులో గ్రావెల్ తవ్వకాల వల్ల భారీ గోతులు ఏర్పడి చిన్నపిల్లలు సరదాగా ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాల బారిన పడే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పట్టుకున్నారు.. వదిలేశారు
వెంకటాచలం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను వెంకటాచలం పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు.. ముత్తుకూరు మండలం కోళ్లమిట్ట గ్రామంలో ఇసుక అక్రమంగా తవ్వి వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళేనికి తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వారు గుడ్లూరువారిపాళెం వెళ్లి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని వెంకటాచలం పోలీస్స్టేషన్కు తరలించారు. కూటమి నేతలు నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. కాగా అయితే ఏం జరిగిందో గానీ ఆదివారం మధ్యాహ్నం ఆ ట్రాక్టర్లను పోలీసులు నిర్వాహకులకు అప్పగించేశారు. కేసులు నమోదు చేయకుండా వదిలేశారని విమర్శలున్నాయి. -
చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్ గుంతలు
గ్రావెల్ మాఫియా ధనదాహం కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. సరదాగా ఆడుతూ.. పాడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. గ్రామానికి చెందిన నూతేటి ప్రసాద్ లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూతేటి విష్ణుకుమార్ (11), మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఎక్కడికైనా ఇద్దరే వెళ్లి సరదాగా ఆడుకుంటూ కలిసి మెలిసి తిరిగేవారు. గ్రామానికి సమీపంలో డ్రాగన్ ప్రూట్ తోట ఉండడంతో ఇద్దరు స్నేహితులు కలిసి డ్రాగన్ ప్రూట్స్, కలేకాయల కోసం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఉయ్యాలపల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద గ్రావెల్ మాఫియా తవ్విన గుంతల్లో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండడంతో యంత్రాల సహాయంతో నీటిని మళ్లీంచారు. మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ● వెంకటాచలం మండలంలో ఊరూరా నాణ్యమైన గ్రావెల్ ఉండడంతో రాత్రి, పగలు తేడాలేకుండా చెరువుల్లోనూ తవ్వకాలు చేస్తుండటంతో పలు గ్రామాల్లో చెరువులు బావులను తలపిస్తున్నాయి. ఈ బావుల్లో అయాయక ప్రజలు పడి మృత్యువాతకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ నేతలు సాగించిన గ్రావెల్ అక్రమ తవ్వకాలకు ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్ పరిసరాల్లోనే 9 మంది పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిలింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు, అమానవీయ ఘటనలకు లెక్కే లేకుండా పోతోంది. ధనదాహంతో నరమేధ చరిత్ర సృష్టిస్తున్నారు. వీరు చేసే తప్పు వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఏమీ పట్టనట్లుగా అక్రమ సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక, గ్రావెల్ తవ్వకాల అక్రమాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న ఈ దోపిడీ దాష్టీకాలు అమాయక కుటుంబాలపై ఎన్నటికీ నయం కాని గాయాలు మిగులుస్తున్నారు. ఇటీవల ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం, గ్రావెల్ గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటం, సూరాయపాళెం వద్ద జరిగిన దుర్ఘటన, సర్వేపల్లిలో గతంలోనే తొమ్మిది మంది చిన్నారుల మరణాలు ఒకే వాస్తవాన్ని చాటుతున్నాయి. 13 మంది ప్రాణాలు తీసిన ఇసుక తవ్వకాలు జిల్లా పరిధిలో పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ఎక్కడా అధికారిక అనుమతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 నెలలుగా టీడీపీ నేతలు ఊరూరా అడుగడుగునా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. రూ.వందల కోట్లు విలువైన ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించారు. టీడీపీ నేతల ఇసుక తవ్వకాలకు ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు వద్ద ఇసుక తవ్వకాలకు రీచ్కు ఎలాంటి అనుమతే లేదు. కానీ అక్కడ రీచ్లోకి ఏకంగా పక్కాగా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అక్కడి నుంచి ఇసుక తవ్వి తీసుకు వస్తున్న టిప్పర్ డ్రైవర్ తప్పతాగిన మైకంలో రాంగ్ రూట్లో ఎదురుగా కారును ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. టీడీపీ నేతల పాపానికి ఈ దుర్ఘటనలో ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెండు కుటుంబాల్లో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. మరో కుటుంబంలో ఇప్పటికే తండ్రిపోయిన బిడ్డలు.. ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్నారు. మరో రెండు కుటుంబాల్లో ఇంటికి మగ దిక్కు లేకుండా చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుని ఉంటే.. ఆ కుటుంబాలు ఇలా రోడ్డునే పరిస్థితి వచ్చేది కాదు. ఈ దుర్ఘటన జరిగాక అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాల్లో సానుభూతి ప్రకటనలిచ్చి చేతులు దులుపుకున్నారే కానీ.. వారిని ఆదుకోవాలనే ఆలోచన ఎంత మాత్రం చేయకపోవడం దారుణం. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామనే భరోసా కల్పించలేకపోయిన రాతి గుండెలని మరోసారి రుజువు చేసుకున్నారు. సంగం మండలం పెరమన వద్ద ఇసుక టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో కారులోనే మృతదేహాలు (ఫైల్)ఇసుక, గ్రావెల్ మాఫియాల దాష్టీకాలకు అమాయకుల బలి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొని ఏడుగురి దుర్మరణం గ్రావెల్ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృత్యువాత సూరాయపాళెం వద్ద ఇద్దరు బలి సర్వేపల్లిలో గతంలోనూ గ్రావెల్ గోతుల్లో పడి 9 మంది పిల్లలు మృతి పెన్నా ఇసుక, గ్రావెల్ గుంతల్లో ప్రాణాలు కోల్పోయిన పలువురు ఈ పాపాలు ఎవరివి? అధికార మదం, ధనదాహంతో అనుమతులు తీసుకోకుండా మైనింగ్ శాఖ ప్రామాణికాలు పాటించకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన చేపడుతున్న ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు అమాయక పిల్లలు, ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతల దగ్గర మామూళ్లు దండుకుంటూ రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రాణాలు పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ పాపాలు అధికారులవా? టీడీపీ నేతలవా?. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీతోపాటు జిల్లా మైనింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ నేతల ధన దాహం.. అమాయక పిల్లలు, ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమాలకు ప్రజల ప్రాణాలు పోతున్నా.. కనీసం వీరిలో ఏ మాత్రం మానవత్వం కనిపించడం లేదు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి చూస్తుంటే కసాయితత్వం కనిపిస్తోంది. జిల్లాలో ఇసుక, గ్రావెల్ మాఫియాల దారుణాలకు అనేక కుటుంబాలకు ఎన్నటికీ తీర్చలేని కడుపు కోత, కన్నీటి వేదన మిగిలిపోతున్నాయి. ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా తవ్వి, భారీ వాహనాల్లో తరలిస్తూ ప్రజలను బలి తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు టీడీపీ నేతల స్వార్థపూరిత అరాచక పాలనకు చీకటి సాక్ష్యాలు. -
అప్రమత్తంగా ఉండాలి
వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన పెంచుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి. తగిన విశ్రాంతి ఉండాలి. సకాలంలో నిద్రపోవాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఛాతిలో నొప్పి, మంట, ఆయాసం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఒకవేళ గుండె సమస్య అయినా భయపడొద్దు. డాక్టర్లు వైద్యం ద్వారా నయం చేస్తారు. – డాక్టర్ శ్రీనివాసరాజు, గుండె వ్యాధుల స్పెషలిస్ట్, కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి ● -
పెద్దాస్పత్రికెళ్తే రోగాలు ఫ్రీ
●ఓపీ రాసే గది పక్కనే సీ్త్రలు, పురుషులు ఉపయోగించే మరుగుదొడ్డి ఓపీ చీటీల కోసం క్యూలో ఉన్న రోగులు నెల్లూరు (అర్బన్): జిల్లాకు రెఫరల్ ఆస్పత్రి అయిన జీజీహెచ్లో దారుణ పరిస్థితులున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యసేవల్లో నిర్లక్ష్యం పెరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ వైద్య స్థాయిలో సేవలందించిన జీజీహెచ్లో గైనకాలజీ, మెడిసిన్, ఐసీయూ, ఎమర్జెన్సీ, కంటి విభాగం, పల్మనాలజీ, చిన్నపిల్లల విభాగం ఇలా వివిధ వార్డుల్లో రోగులు సుమారు 500 మందికి పైగానే రోజూ ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఏ వార్డులో చూసినా మరుగుదొడ్లు దుర్గంధంతో నిండిపోయి ఉన్నాయి. శానిటేషన్ పట్టని అధికారులు ఆస్పత్రిలో 150 పారిశుద్ధ్య కార్మికులున్నారు. వీరిలో 20 మంది ఎఫ్ఎన్ఓలు ఉన్నారు. మిగిలిన వారు సక్రమంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. దుర్గంధం భరించలేకనే అనేకమంది అడ్మిట్ అయ్యేందుకు ఇష్టపడడం లేదు. సుమారు 40 శాతం మంది అడ్మిట్ కాకపోవడానికి బాత్రూంల కంపు కారణమని రోగులతోపాటు సిబ్బంది పేర్కొంటున్నారు. పేరుకే ముగ్గురు అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఎనిమిది మంది రెగ్యులర్ సూపర్వైజర్లు, 15 మంది అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్లున్నారు. వీరెవరూ రౌండ్స్ వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఒకటే దారి వైద్యం కోసం 1,200 నుంచి 1400 మంది క్యూలో నిలబడి రోజూ ఓపీ చీటీలు తీసుకుంటున్నారు. అయితే ఓపీ తీసుకునే పక్కనే మరుగుదొడ్డి ఉంది. అందులో రెండు గదులుండగా ఒకదానిని బ్లాక్ చేశారు. లోపలికి వెళ్లాలన్నా సీ్త్ర, పురుషులకు ఒకే దారి. బయట పెన్సిల్తో జెంట్స్ టాయిలెట్ అని రాసి ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.నెల్లూరులోని కొండాయపాళేనికి చెందిన బత్తల నారాయణమ్మకి బీపీ పెరిగిపోయింది. కాలు, చేయి చచ్చుబడ్డాయి (పెరాలసిస్). పేదరాలైన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పెద్దాస్పత్రి (సర్వజన ఆస్పత్రికి)కి వైద్యం కోసం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం వచ్చి జనరల్ మెడిసిన్ విభాగం కింద ఫిమేల్ మెడికల్ వార్డులో అడ్మిట్ అయ్యారు. వైద్యం బాగా చేస్తారని సంబంధిత డాక్టర్కు రాజకీయ నాయకులతో ఫోన్ చేయించుకున్నారు. పక్కరోజు డిశ్చార్జి చేయాలని రోగి డాక్టర్ను అడిగారు. వారు వైద్యం సక్రమంగా అందలేదా అని ప్రశ్నిస్తే అలాంటిదేమి కాదు.. ముందే నేను నడవలేను. టాయ్లెట్కు పోవాలంటే నరకం కనిపిస్తోంది. శుభ్రత లేదు. లైట్లు వెలగవు. కంపు భరించలేకున్నా. కొత్త జబ్బులు వచ్చేలా ఉన్నాయి. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్తా అని డిశ్చార్జి అయ్యింది. పారిశుద్ధ్యానికి నెలకు రూ.లక్షల్లో ఖర్చు ఓపీ చీటీలు రాసే చోట సీ్త్ర, పురుషులకు ఒకటే టాయ్లెట్ వార్డుల్లోని మరుగుదొడ్లు కంపు కంపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో క్లీనింగ్ కూటమి పాలనలో నిర్లక్ష్యం -
సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద
సోమశిల: జలాశయానికి వరద జలాలు పెరిగినట్లు ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. పైతట్టు ప్రాంతంలోని ఆదినిమ్మాయపల్లి రెగ్యులేటర్ నుంచి 24,833 క్యూసెక్కుల వరద జలాలు జలాశయానికి చేరుతున్నాయన్నారు. ఈ వరద జలాలను జలాశయంలో నిల్వ ఉంచకుండా దిగువ కు విడుదల చేస్తామన్నారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జలాశయం నుంచి పెన్నానదికి 2,650, కండలేరుకు 6000, ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జలాశయంలో 72.87 టీఎంసీలు ఉన్నాయి. -
కంపు భరించలేం
ఆస్పత్రిలో టాయిలెట్స్ కంపు కొడుతున్నాయి. ఇటీవల నా భార్యను వైద్యం కోసం అడ్మిట్ చేశాను. మరుగుదొడ్డికి వెళ్లే పరిస్థితి లేదని ఆమె బాధపడింది. దీంతో త్వరగా డిశ్చార్జి చేయించాను. – గంగాధర్, సుందరయ్య కాలనీ, నెల్లూరు పరిస్థితిని చక్కదిద్దుతున్నాం టాయ్లెట్స్ శుభ్రతపై సూపరింటెండెంట్తో చర్చించాం. కొంత ఆర్థిక ఇబ్బందులున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నాం. కొత్త టాప్లు ఏర్పాటు చేయబోతున్నాం. – డాక్టర్ శ్రావణ్కుమార్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, సర్వజన ఆస్పత్రి ● -
కనులారా వీక్షించి.. తరించి..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదివారం లోకమాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తారు. – సాక్షి నెట్వర్క్ దుర్గాలంకారంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు కన్యకాపరమేశ్వరి ఆలయంలో ధనలక్ష్మి అలంకరణ -
ఈఆర్సీ నిర్ణయం సర్కారుకు చెంపపెట్టు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనుమతించిన ధరకు మించి కొనుగోలు 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు. 2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు. -
ఓవర్లోడ్ వాహనాలపై రూ.3 కోట్లు వసూలు చేశాం
జిల్లాలో ఓవర్లోడ్ను ప్రోత్సహించం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు అధిక లోడుతో వెళుతున్న 770 వాహనాలపై కేసులు నమోదు చేశాం. వాటి నుంచి రూ. 3 కోట్లు అపరాధ రుసుం వసూలు చేశాం. ఇప్పటికే జిల్లాలోని అందరూ ఎంవీఐలు, ఏంవీఐలకు ఓవర్లోడ్పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏ ఒక్క ఓవర్లోడ్ వాహనాన్ని వదిలి పెట్టేది లేదు. రానున్న రోజుల్లో ఓవర్లోడ్పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్ ● -
పొగాకు పంట నియంత్రణ పాటించాలి
● పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్ కందుకూరు: అంతర్జాతీయ పొగాకు మార్కెట్లో అధిక నిల్వలు ఉన్నాయని, ఈ ఏడాది మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని, బోర్డు పరిమితి మేరకే పంట సాగు చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్ సూచించారు. కందుకూరులోని 1, 2వ పొగాకు వేలం కేంద్రాల్లో శనివారం ఆయన రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు పండించే దేశాల చైనా, బ్రెజిల్, జింబాంబ్వే, టాంజానియా వంటి దేశాల్లో వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల అధిక పొగాకు పండిందన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉండే అవకాశం లేదన్నారు. రైతులు అధిక ధరలకు పొలాలు, బ్యారన్లు కౌలుకు తీసుకుని నష్టపోవద్దని సూచించారు. బోర్డు సూచించిన విస్తీర్ణంలోనే పొగాకు పంటను సాగు చేయడం వల్ల మార్కెట్ బాగుంటుందని వివరించారు. వేలం నిర్వహణాధికారులు ఎం కిరణ్, చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్కెట్కు అనుగుణంగా రైతులు పొగాకు సాగులో నియంత్రణ పాటించాలన్నారు. నాణ్యమైన పొగాకు పండిస్తే మంచి ధరలు వస్తాయని చెప్పారు. పొగాకులో పొటా షియం వాడకం పెంచడం వల్ల కొంత హైగ్రేడ్ పొగాకు దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు మండెల మీద ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండే సామర్థ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్జీఓ రాజగోపాల్ బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
రవాణాశాఖ ఎన్ఫోర్స్మెంట్ అవినీతి ఎంవీఐ నిజాయితీ!!
రవాణా శాఖలోని కొందరు అవినీతి అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారు!. ‘అధిక లోడు వాహనం పట్టుకుంటే కేసులు, కోర్టులు, జరిమానాలు వంటి రిస్క్లు ఉంటాయి.. అదే మాకు లంచమిస్తే ఐదు నిమిషాల్లో వదిలేస్తాం’ అంటూ నిజాయితీగా పాపభీతిని చూపిస్తున్నారు. ప్రభుత్వాదాయానికి గండికొట్టి, వాహన యజమానుల కడుపులు కొట్టి, తమ జేబులు నింపుకుంటున్నారు. ఒక పక్క గ్రానైట్, ఇసుక, గ్రావెల్, యాష్, క్వార్ట్ ్జ వంటి మెటల్ రవాణా చేసే అధిక టన్నేజీల లారీలకు నెలమామూళ్లు తీసుకుంటూ రైట్ రైట్ చెబుతూ.. అన్నం పెట్టే రైతులు పండించిన ధాన్యం రవాణా చేసే లారీలకు ముక్కు పిండి లంచం వసూలు చేస్తున్నారు. బహుశ వీరి అవినీతి దాష్టీకం వల్లనే కాబోలు కొనుగోలుదారులు ధాన్యం ధరలు తగ్గించడానికి కారణం అయి ఉంటుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
గంగమ్మ తిరునాళ్లకు కోర్టు అనుమతి
ఉలవపాడు: మండలంలోని బద్దిపూడిలో గంగమ్మ తిరునాళ్లకు పోలీసు శాఖ అనుమతి ఇవ్వలేదు. కొందరు టీడీపీ నాయకులు తమకు తెలియకుండా తిరునాళ్ల చేస్తున్నారని అడ్డుకోవడంతో పోలీసు శాఖ సైతం వారికే మద్దతు ఇస్తూ తిరునాళ్ల నిర్వహించవద్దని, అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ నేతల కుట్రలను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు కోర్టుకెళ్లడంతో తిరునాళ్ల నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది. శుక్రవారం రాత్రి కోర్టు ఆర్డర్ రావడంతో శనివారం నుంచి గ్రామస్తులు తిరుణాళ్ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జీఎస్టీ రాయితీలను వినియోగించుకోవాలి నెల్లూరు (టౌన్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఫలాలను ప్రజలు, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వల్ల కొన్ని నిత్యావసర సరుకులు, మందుల ధరలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరికి సేవింగ్స్ పెరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్లు లబ్ధి చేకూరుతుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా రకాల వస్తువులు ధరలు తగ్గుతాయన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,358 మంది స్వామి వారిని దర్శించుకోగా 29,166 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించబోరని స్పష్టం చేసింది. డీఎస్పీగా లింగసముద్రం వాసి లింగసముద్రం: లింగసముద్రం గ్రామానికి చెందిన పొలిమేర సుదర్శన్రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో 20వ ర్యాంక్ సాధించాడు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులు మీదుగా డీఎస్పీగా నియామక పత్రం అందుకున్నాడు. సుదర్శన్రెడ్డిని పలువురు అభినందించారు. -
అధికారుల తీరు మారాలి
నెల్లూరు (పొగతోట): ‘వివిధ శాఖల అధికారుల పని తీరు మారాల్సిన అవసరం ఉంది. గతంలోనే నిధులు కేటాయించి టెండర్లు ఖరారు చేసిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సబబు. మంజూరు చేసిన భవన నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది. భవనాలను పరిశీలించి మరమ్మతుల కోసం ఎస్టిమేషన్లు వేసింది మీరే కాదా? అదే పనులు చేయడానికి వీలుకాదంటున్నారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలు ఎందుకు నిర్మించడం లేదు’ అంటూ జెడ్పీ చైర్ పర్సన్ అధికారుల తీరుపై అసహసం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్లో హెల్పర్లు ఉండగా విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇకపై విద్యార్థులతో ఎక్కడైన పనులు చేసినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ‘విజయ దీపిక’ను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ గెస్ట్హోస్ టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరు చేసిన పనుల విషయం పట్టించుకోరు, నిలిచిపోయిన పనులపై ప్రతి సమావేశంలో చర్చిస్తారు.. ఇదేక్కడి పరిస్థితి అని నిలదీశారు. అనేక భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో గతంలోనే నిధులు మంజూరు చేసి ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, బల్క్మిల్క్ సెంటర్ భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా భవనాలను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం అయితే జెడ్పీ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించి మోటార్లు, బోర్ల మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ సమావేశాలకు తప్పని సరిగా జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. అనుమతి లేకుండా అధికారులు హాజరుకాకపోతే ఇకపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంగన్వాడీ భవన నిర్మాణాలు, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం జెడ్పీ నిధులు అడుగుతున్నారు. నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నాం.. ప్రారంభోత్సవాలకు మాత్రం ఆహ్వానించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల్లో కేంద్రం ఇస్తున్న నిధులతో గర్భిణులకు శ్రీమంతాలు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తప్పని సరిగా జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. అంతకముందు గృహ నిర్మాణం, డీఆర్డీఏ, డ్వామా, పరిశ్రమలు, ఏపీ సీడ్స్, ఐటీడీఏ తదితర శాఖలతో సమీక్షించారు. స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ మోహన్రావు, జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సభ్యులందరూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి ఏమిటి ఇబ్బందులు అంగన్వాడీ భవనాలు ఎందుకు నిర్మించడం లేదు ఆగిన భవన నిర్మాణాలకు పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీ నిధులు పదేపదే ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై సీరియస్ విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటి? సకాలంలో విజయదీపికను సిద్ధం చేయండి సమావేశాలకు జిల్లా అధికారులు కచ్చితంగా హాజరుకావాలి స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
మహిళల జీవనోపాధిని మెరుగుపర్చాలి
● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరు(పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలకు జీవనోపాధులను మెరుగుపర్చేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో పశుసంవర్థక శాఖ అధికారులు, ఏపీఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వయం సహాయక మహిళలకు ఏటా వందల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను మంజూరు చేస్తున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 47,890 యూనిట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాడి పశువులు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు, బీమా, టీకాలు తదితర అంశాలపై గ్రామీణ ప్రాంతాల మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని పేర్కొన్నా రు. అనంతరం పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రమేష్నాయక్ మాట్లాడారు. జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు చేపడతామని వివరించారు. -
మహిళల ఆరోగ్యానికి పెద్దపీట
నెల్లూరు రూరల్: దేశ మహిళల ఆరోగ్య భద్రత కోసం స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ను ప్రధాని మోదీ ఏర్పాటు చేశారని డీపీఎం రమేష్ పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్నగర్లో గల పీహెచ్సీలో వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేన్సర్, మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులను త్వరితగతిన గుర్తించి.. నివారించేందుకు వీలవుతుందని చెప్పారు. యూపీహెచ్సీ వైద్యాధికారి ఇమ్రాన్ఖాన్, నెల్లూరు అర్బన్ సీడీపీఓ అరుణ, కమ్యూనిటీ ఆర్గనైజర్ కొండాపురం వెంకటేశ్వర్లు, అంగన్వాడీ సూపర్వైజర్ స్వరూప, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
వన్నె తగ్గిన నిమ్మ
● పెరిగిన దిగుబడులు ● దిగజారిన ధరలు పొదలకూరు : నవరాత్రుల సమయంలోనూ నిమ్మకాయలకు డిమాండ్ కరువైంది. మార్కెట్లో కిలో ధరలు రూ.20 నుంచి రూ.35 వరకు ప్రస్తుతం పలుకుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఆఖరి వరకు ఇదే పరిస్థితని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరోవైపు చలికాలంలో నిమ్మ వాడకం గణనీయంగా తగ్గుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాంతంలో వర్షాలు తక్కువగా.. ఉత్తరాదిలో భారీగా కురుస్తున్నాయి. తోటల్లో కాయల దిగుబడి పెరిగినా.. ధరలు పతనమవుతుండటం రైతులకు ఇబ్బందిగా మారింది. మచ్చలు అధికంగా ఉండటంతో గిట్టుబాటు ధర లభించడం లేదు. కాయలు కోసిన అనంతరం ప్రాథమిక జాగ్రత్తలను పాటించకపోవడంతో నాణ్యత దెబ్బతింటోందని తెలుస్తోంది. తడిసిన కాయలను కోసి ఇళ్లకు తీసుకొచ్చి తొడిమెలు తొలగించడం సైతం దీనికి కారణమని తెలుస్తోంది. ఎగుమతులు పెరిగి.. డిమాండ్ తగ్గి పొదలకూరు, గూడూరు మార్కెట్ల నుంచే కాకుండా తెనాలి, బయటి రాష్ట్రాల నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. ఈ పరిణామంతో డిమాండ్ తగ్గిపోతోంది. దీనికి తోడు తోటల నుంచి కాయల దిగుబడి పెరిగింది. మార్కెట్లకు విపరీతంగా వస్తుండటంతో ఎగుమతులను వ్యాపారులు పెంచారు. వద్దంటున్న ఢిల్లీ వ్యాపారులు నిమ్మకాయల ఎగుమతులు, ధరల నిర్ణయంలో ఢిల్లీ మార్కెట్ కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే వర్షాలు, చలి ప్రభావం, ఎగుమతులు పెరగడంతో కాయలను పంపొద్దంటూ వారు ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగుమతయ్యే కాయలను అన్లోడ్ చేసుకునేందుకు సైతం విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. వర్షాలతో మార్కెట్కు సకాలంలో వెళ్లలేకపోవడంతో కాయలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు తెలిపారు. -
శ్రుతిమించుతున్న హిజ్రాల ఆగడాలు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో హిజ్రాల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రహదారులపై వెళ్లేవారిని అడ్డుకుని నగదు కోసం పీడిస్తున్నారు. దుకాణాల వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వని వారిపై దౌర్జన్యాలు, దాడి చేసి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. నడిరోడ్లపై బరితెగిస్తున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు.తాజాగా రెండుచోట్ల..కందుకూరు, నెల్లూరు మినీబైపాస్ రోడ్డులో చోటుచేసుకున్న ఘటనలు హిజ్రాల బరితెగింపు చర్యలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, బోసుబొమ్మ, గాంధీబొమ్మ సెంటర్, విజయమహాల్గేటు, ఆర్టీసీ ఇలా ప్రధాన కూడళ్లలో పదుల సంఖ్యలో హిజ్రాలు రోడ్లపైకి వచ్చి అటుగా వెళ్లే వాహనదారులను నగదు కోసం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నగదు ఇవ్వని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు నానా దుర్భాషలాడుతున్నారు. పండగల వేళ గుంపులుగా షాపుల వద్దకెళ్లి నగదు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారస్తులు ఎంతో కొంత ఇస్తే తీసుకోకుండా తాము అడిగినంత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇవ్వకపోతే దుకాణాల వద్దే బైఠాయించి వ్యాపారాలు జరగకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడున్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. వీరిచేష్టలకు బెదిరిపోతున్న కొనుగోలుదారులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు.తరచూ ఘటనలువిజయమహాల్ గేటు సమీప రైల్వేట్రాక్ వెంబడి రాత్రివేళల్లో చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో హాస్పిటళ్లు ఉన్నాయి. రాత్రి వేళల్లో అటుగా వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా పండగ వస్తే మామూళ్ల కోసం వీరు బరితెగిస్తున్నారు. తాజాగా మినీబైపాస్ రోడ్డులోని ఓ ఫ్యామిలీ ధాబాలో మామూళ్ల కోసం 13 మంది వీరంగం చేసిన ఘటనలో నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు నగరంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. బెదిరిపోయిన వ్యాపారులు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రస్తుత ఎమ్మెల్యే పర్యవేక్షణ శూన్యం
ప్రస్తుతం కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆలయ భూముల అన్యాక్రాంతం విషయమై ఎప్పుడూ చర్చించిన సందర్భమే లేదు. అమ్మవారి అపర భక్తురాలిగా ప్రచారం చేసుకునే ప్రశాంతిరెడ్డి ఆలయ భూములకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని భక్తులతోపాటు జొన్నవాడ వాసులు మండిపడుతున్నారు. ఆలయానికి రావడం, దర్శనం చేసుకొని వెళ్లిపోవడం తప్పిస్తే ఆలయానికి సంబంధించిన ఆస్తులు, భూములు ఎక్కెడెక్కడ ఉన్నాయి, వాటి స్థితిగతులేంటనే విషయాలపై పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలే కబ్జాలకు పాల్పడుతుండటంతో ఆమెకు తెలిసినా చర్యలు తీసుకోవడం అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ప్రస్తుతం దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. భక్తులు ప్రతి రోజు వేల సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఇదే సమయంలో ఆలయం ముందు భాగంలో స్థలం ఆక్రమణకు గురైన విషయాన్ని గుర్తించిన పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. -
విషాద ప్రయాణం
● నెత్తురోడుతున్న రహదారులు ● వేగం, రాంగ్రూట్, మద్యం మత్తు తదితరాలే కారణాలు ● బ్లాక్స్పాట్లలో కానరాని చర్యలు ● ఈ ఏడాది 390 మంది మృత్యువాతనెల్లూరు(క్రైమ్): జిల్లాలోని రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం, నిర్లక్ష్యంగా నడిపే వాహనచోదకులు, కనీస విశ్రాంతి ఇవ్వకుండా విధులకు వెళ్లమంటున్న యజమానులు, బ్లాక్స్పాట్లలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం.. ఇలా కారణాలతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆనందంగా సాగిపోతున్న ప్రయాణాల్లో అంతలోనే అంతులేని విషాదం కమ్మేస్తోంది. కన్నవారిని, కడుపున పుట్టిన వారిని, అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ప్రమాదాల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిసారించడం లేదు. ఫలితంగా జిల్లాలో తొమ్మిది నెలల వ్యవధిలో 670 ప్రమాదాలు జరగ్గా 390 మంది మృత్యువాత పడ్డారు. 645 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల తీవ్రత తక్షణం మేల్కోవాల్సిన అవసరాన్ని చాటిచెబుతోంది. కారణాలెన్నో.. మితిమీరిన వేగం, ఓవర్టేక్, అకస్మాత్తుగా వాహనాలు నిలపడం, నిద్ర, మద్యం మత్తులో నడపడం, పరిమితికి మించిన ప్రయాణం, అపసవ్యదిశలో రాకపోకలు సాగించడం, హెల్మెట్, సీట్బెల్టులు పెట్టుకోకపోవడం, సకాలంలో గమ్యస్థానాలకు వెళ్లాలన్న తొందరలో వేగంగా నడపడం, రహదారి భద్రత నిబంధనలపై అవగాహన లేమి, వాహనాల సామర్థ్యం సరిగా లేకపోవడం, దెబ్బతిన్న రహదారులు తదితరాలు ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. రెస్ట్ ఏరియాలున్నా.. నెల్లూరు – బద్వేల్ రహదారిలో రెండు, ఏర్పేడు – రాపూరు జాతీయ రహదారిపై రెండు, పోర్టుకు వెళ్లే రహదారిలో ఒకటి, వెంకటాచలం వద్ద, గౌరవరం ప్రాంతాల్లో రెస్ట్ ఏరియాలున్నాయి. అధికశాతం మంది వాటిల్లో కాకుండా రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం అప్రమత్తం చేసేలా ఇండికేటర్లు, స్టిక్కరింగ్తో కూడిన ట్రయాంగిల్ గుర్తులూ వాడకపోవవడంతో వెనుక వచ్చేవారికి వాహనాలు కనిపించక వేగంగా ఢీకొడుతున్నారు. కనీస చర్యలేవి? మూడు క్యాలెండర్ సంవత్సరాల్లో ముగ్గురు కంటే ఎక్కువగా ఒకే ప్రాంతంలో మరణించి ఉంటే దాన్ని బ్లాక్స్పాట్గా గుర్తిస్తారు. జిల్లాలో 65 బ్లాక్స్పాట్లున్నాయి. అందులో ఎన్హెచ్ 16పై 46, ఎన్హెచ్ 67పై ఎనిమిది, 565వ జాతీయ రహదారిపై 11 ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని రహదారుల్లోనూ బ్లాక్స్పాట్లున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు గానూ ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, ములుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్డు సేఫ్టీ సమావేశాల్లో అధికారులు తీర్మానించారు. అయితే అనేక ప్రాంతాల్లో ఇవి అమలుకు నోచుకోలేదు. బ్లాక్స్పాట్ల వద్ద నిర్ధిష్ట చర్యలు, కమిటీ నిర్ణయాల అమలుపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. గస్తీ ఏది? జిల్లాలో ఎన్హెచ్ 16 జాతీయ రహదారిపై ఆరు హైవే మొబైల్స్, ఎన్హెచ్ 67పై రెండు, రాపూరు వైపు ఒక హైవే మొబైల్ ఉంది. అందులో డ్రైవర్తో కలిసి ఇద్దరు నుంచి ముగ్గురు సిబ్బంది ఉంటారు. వీరు రోడ్డు ప్రమాదాలు, నేరాలు జరగకుండా గస్తీ నిర్వహించాల్సి ఉంది. ఇంటర్సెప్టర్ వాహనంతో నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలి. అయితే ఈ వ్యవస్థ మొక్కుబడి చర్యలకే పరిమితమైందనే విమర్శలున్నాయి. మొక్కుబడిగా.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో కొన్ని నిద్రమత్తులోనే జరుగుతున్నాయని గుర్తించిన పోలీస్ అధికారులు డ్రైవర్ను మేలుకొలిపేలా స్టాప్ – ఫేస్వాష్ పేరిట వినూత్న కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం చేపట్టారు. జాతీయ రహదారులపై అర్ధరాత్రి వేళల్లో పోలీసులు డ్రైవర్లచే ఫేస్వాష్ చేయించి వారితో మాటామంతి కలిపి జాగ్రత్తలను వివరించేవారు. దీంతో కొంత మేర ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. కాలక్రమేణా పోలీసు అధికారులకు బందోబస్తులు అధికమవడం, నిత్యం ఏదో ఒక కార్యక్రమం ఉండటంతో ఈ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. రెండేళ్లలో 840 మంది మృతి జిల్లాలో రోజురోజుకు రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో 840 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. 1,550 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. 2024లో 828 ప్రమాదాలు జరగ్గా 450 మంది చనిపోయాగా 905 మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల కట్టడిలో సంబంధిత అధికారులు విఫమలవుతున్నారనే విమర్శలున్నాయి.కొన్ని ఘటనలు ఏప్రిల్ 29వ తేదీన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ హదారిపై ఆగి ఉన్న లారీనీ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బోగోలు పంచాయతీకి చెందిన షేక్ మన్సూర్బాషా, విశ్వనాథరావుపేట రామస్వామిపాళేనికి చెందిన ప్రవీణ్కుమార్ మృతిచెందారు. ఏప్రిల్ 30వ తేదిన కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద మితిమీరిన వేగంతో కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఉలవపాడు మండలం చాగల్లు వద్ద గతనెల 8వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశునిపాడుకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సిద్ధీపురం పంచాయతీ అనసూయనగర్కు చెందిన వెంకటశేషయ్య, వెంకటవరలక్ష్మి దంపతులు సొంత ఆటోలో కూరగాయాలు విక్రయించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. వారిద్దరూ దుర్మణం చెందారు. ఇటీవల సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై రాంగ్రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొంది. దీంతో కారులోని ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. -
కర్షకుడి కంట కన్నీరు
ఉదయగిరి: జలదంకి మండలం లింగరాజుఅగ్రహారంలో ముగ్గురు టీడీపీ నేతల స్వార్థానికి కోత దశలో ఉన్న 120 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికందే పంట మొత్తం నీటి పాలై దెబ్బతినడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే వేలకు వేలు అప్పులు తెచ్చి బ్లాక్మార్కెట్లో ఎరువులు కొని పంట సాగు చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రస్తుతం ధాన్యం ధరలు సైతం పతనమైన నేపథ్యంలో కనీసం పెట్టుబడి అయినా దక్కితే మేలనుకుంటూ ఎదురుచూస్తున్న తరుణంలో టీడీపీ నేతల దుశ్చర్యతో రైతులకు పిడుగుపాటుగా మారింది. ఆయకట్టను నమ్ముకుని వరి సాగు లింగరాజుఅగ్రహారం చెరువు ఆయకట్టు కింద ఖరీఫ్లో సుమారు 270 ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో వారం.. పది రోజుల్లో కోత కోసే పరిస్థితికి పంట వచ్చింది. ఈ తరుణంలో చేపలు పట్టుకునేందుకు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గుర్రం ప్రవీణ్, గొట్టిపాటి శ్రీధర్, రాయపాటి మోహన్ రావు చెరువులో చేపలు పట్టుకునేందుకు వేలం ద్వారా అనుమతులు దక్కించుకున్నారు. అయితే నిండుకుండగా ఉన్న చెరువులో చేపలు పట్టడం సాధ్యం కాని పరిస్థితి. దీంతో టీడీపీ నేతలు రైతులను దృష్టిలో పెట్టుకోకుండా చెరువు తూము లు ఎత్తి నీటిని పొలాలకు మళ్లించారు. దీంతో గ్రామానికి చెందిన చెరువు ప్రెసిడెంట్ గుర్రం సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ గాలి మాల్యాద్రి రైతులతో కలిసి చెరువు తూము ద్వారా పొలాలకు నీరు వెళ్లకుండా నిలుపుదల చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు తిరిగి తూమును ఎత్తేశారు. ఫలితంగా సుమారు 120 ఎకరాల్లోని వరి పంటపొలాల్లో మోకాలి లోతు నీళ్లు నిలబడిపోయాయి. ఏఈ ఆదేశాలు పట్టించుకోకుండా.. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఏఈ మాల్యాద్రికి రైతులు వివరించడంతో ఆయన వచ్చి చెరువు తూము నుంచి నీరు పారకుండా చేయాలని చెప్పారు. ఆయన్ను సైతం ధిక్కరించి దిక్కున్నచోట చెప్పుకోండని అనడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారం రోజుల పాటు నీరు విడుదల చేయకుంటే తాము చేతి కొచ్చిన పంటను కోసుకుంటామని చెబుతున్నా వినకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు పొలాలకు ప్రవహించడంతో నీరు ఎక్కువై పంట మొత్తం నీటితో నాని నేతలకు పడిపోయింది. దీంతో రైతులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు.. జలదంకి సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు నీట మునిగిన పొలాలను పరిశీలించారు. పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు గడుస్తున్నా చెరువు తూము నీటిని నిలుపుదల చేయలేదని, తమ పంట మొత్తం నీటిలో నానుతూ మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువు చైర్మన్ గుర్రం సుబ్బారావు, వైస్ చైర్మన్ గాలి మాల్యాద్రి, గ్రామ రైతు నాయకుడు గాలి సురేష్ మాట్లాడుతూ చెరువులో చేపలు పట్టుకుని జేబులు నింపుకొనేందుకే తాము ఆరుగాలం పండించిన పంటను ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నీరు నిలిచి పంట నేలబడి మొలకలు వచ్చాయని చూపుతున్న రైతులు నీట మునిగిన కొతకొచ్చిన పంట టీడీపీ నేతల స్వార్థం.. రైతులకు కష్టం చెరువులో చేపలు పట్టుకునేందుకు నీటి విడుదల కోత దశలో ఉన్న 120 ఎకరాల వరి పంట నీట మునిగిన వైనం రైతులు, అధికారుల చెప్పినా వినకుండా చెరువు తూము నుంచి నీటి విడుదల టీడీపీ నేతలు తమ స్వార్థం కోసం ఏకంగా నిండు చెరువు నీటిని దిగువకు వృథాగా వదిలేయడం చూస్తే అధికార అహంకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. చెరువు నీటిని ఆధారంగా చేసుకుని ఆయకట్టు కింద వందల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ప్రస్తుతం వరి కోతల దశలో ఉండగా, చెరువు నీటిని దిగువకు వదలకుండా తూములు బిగించేశారు. అయితే చెరువులో చేపల పట్టుకునే హక్కులను వేలంలో దక్కించుకున్న టీడీపీ నేతలు రైతుల ప్రయోజనాలను తుంగలోతొక్కి చెరువులో నీటిని దిగువకు వదిలేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నీట మునిగిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
బాలకృష్ణ వ్యాఖ్యలు దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి మార్కాపురం: అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హిందుపూరం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, అత్యంత దుర్మార్గమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సభలో బాలకృష్ణ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అమర్యాదకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాలకృష్ణకు లేదన్నారు. చిరంజీవి, చంద్రబాబుతో విభేదాలుంటే వారితోనే తేల్చుకోవాలే తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. అసెంబ్లీలో సభ్యసమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడటం తగదన్నారు. సభా మర్యాదలు పాటించకుండా మాట్లాడి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చూశాక ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలేమో అనిపించేలా ఉందన్నారు. బాలకృష్ణ సొంత ఇంట్లో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని జంకె సూచించారు. భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నకిలీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
● అతని తండ్రిని కూడా... నెల్లూరు (క్రైమ్): క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పేరిట అటవీ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన నిందితుడితోపాటు అతని తండ్రిని సైతం వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం వేదాయపాళెం పోలీసుస్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. న్యూమిలటరీ కాలనీకి చెందిన వినోద్కుమార్ బీటెక్ పూర్తి చేసి తన మామ కేఫ్లో పనిచేస్తుండగా, శివాజీనగర్లో ఉంటున్న దేవళ్ల సాయికృష్ణ తరచూ కేఫ్కు వస్తూ తాను విజయవాడ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వినోద్కుమార్ను నమ్మించి రూ.6.51 లక్షల నగదు, ఆరు సవర్ల బంగారు ఆభరణాలు మొత్తంగా రూ.11 లక్షలు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోవడం, అడుగుదామని వెళ్లితే సాయికృష్ణ తప్పించుకుని వెళుతుండడంతో మోసపోయానని వినోద్కుమార్ గ్రహించాడు. తన మాదిరిగా ఉద్యోగాల పేరిట ఎన్సీసీకాలనీకి చెందిన పావని, భారతి, దగర్తికి చెందిన హేమంత్ వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసగించినట్లు వినోద్కుమార్కు తెలిసింది. ఉద్యోగాల పేరిట మోసగించిన సాయికృష్ణపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 24న వేదాయపాళెం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. స్థానిక ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి గురువారం రాత్రి తెలుగుగంగ కార్యాలయం సమీపంలో సాయికృష్ణను, అతని తండ్రి పోలయ్యను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. విచారణలో నిందితుడికి తండ్రి సహకరించాడని వెల్లడైంది. దీంతో నిందితులిద్దరిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ పోలీసు ఐడీ కార్డు, న్యూరో, ఆర్థో, సీనియర్ డాక్టర్ పేర్లతో నకిలీ ఐడీ కార్డులు, రెండు స్కూటీలు, బుల్లెట్, ఒక బైక్, బీఎండబ్ల్యూ కారు తదితరాలను స్వాధీనం చేసుకన్నారు. నిందితుడి వద్ద న్యూరో, ఆర్థో డాక్టర్ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు దొరకడంతో వాటిని ఉపయోగించి ఏమైనా నేరాలకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అభినందించారు. సమావేశంలో ఎస్ఐ ఎ. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నిమ్మకు గడ్డు కాలం
నిమ్మను అతిగా సాగు చేస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ తగ్గుతోంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే గడ్డు కాలం ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులతో పాటు రైతులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మెట్ట నియోజకవర్గాల్లో నిమ్మ సాగు నుంచి కర్షకులను విడదీయలేని పరిస్థితులున్నాయి. సుమారు ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో తోటలను సాగు చేస్తూ అందులోనే తమ జీవితం ఉందని వారు భావిస్తున్నారు. కొందరైతే ఇతర పంటలను పండించకుండా, తోటలను నాలుగైదు చోట్ల సాగు చేస్తున్నారు. ఫలితంగా దిగుబడి గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఇక్కడ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో నష్టమో, లాభమో కాయలు కోసి యార్డుల్లోనే విక్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. బయటి రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడం సైతం రైతుల ఇబ్బందులకు కారణమవుతోంది. పొదలకూరు: ఉద్యాన పంటల్లో నిమ్మ సాగు మేటిగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలోని పెట్లూరు వద్ద పరిశోధన స్థానాన్ని గతంలోనే ఏర్పాటు చేశారు. సర్వేపల్లి, వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో 28,437 ఎకరాలకుపైగా నిమ్మ సాగవుతోంది. ఒక్క పొదలకూరు మండలంలోనే నాలుగు వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ ప్రభుత్వ నిమ్మ మార్కెట్ యార్డును రెండు దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. ఎంతో మందికి జీవనోపాధి సీజన్లో ఇక్కడి నుంచి నిత్యం 15 లారీల్లో కాయలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి. ఇలా 300 టన్నుల కాయలు వెళ్తుంటాయి. వందలాది మందికి ఇది జీవనోపాధిగా మారింది. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులకు రెండు వేల నిమ్మ చెట్లున్నాయి. చాలా కాలం పాటు ఇక్కడ పండేదే నిమ్మగా చెలామణి అయింది. అయితే ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ సాగవుతోంది. కర్ణాటకలోని బిజాపూర్, తెలంగాణలోని నకిరేకల్.. మన రాష్ట్రానికి పోటీగా మారాయి. మార్కెట్ను శాసించే ఢిల్లీకి బయటి రాష్ట్రాల నుంచి కాయలు ఎగుమతవుతున్నాయి. దీంతో ఇక్కడి మార్కెట్ తరచూ తారుమారవుతోంది. పతనమవుతున్న ధరలు ఢిల్లీకి కాయలు అధికంగా ఎగుమతవుతున్న నేపథ్యంలో డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో రైతులకు గిట్టుబాటు ధరలూ లభించడం లేదు. ఇక్కడ దాదాపు మూడు నెలలుగా ధరలు ఆశాజనకంగా పెరిగిందీ లేదు. ఈ ఏడాది వేసవిలో కొద్ది రోజులు ధరలు పలికి ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తోటలను తగ్గించుకుంటేనే మేలనే భావన కర్షకుల్లో వ్యక్తమవుతోంది. కోల్డ్ స్టోరేజీ, సిట్రస్ ఫ్యాక్టరీ అవసరం పొదలకూరులో కోల్డ్ స్టోరేజీ, సిట్రస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా భావిస్తున్నా, కార్యరూపం దాల్చడం లేదు. ఇదే అంశమై రైతులు విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి ప్రయోజనం లభించడంలేదు. కోల్డ్ స్టోరేజీ ఉంటే కోసిన కాయలను రెండు, మూడు రోజుల వరకు నిల్వ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. నిమ్మను 80 శాతంఇంటి అవసరాలకు.. మిగిలిన 20 శాతాన్ని కాస్మొటిక్స్, ఆహారోత్పత్తులకు వినియోగిస్తున్నారు. నిమ్మకు అనుబంధంగా ఫ్యాక్టరీని స్థానికంగా ఏర్పాటు చేస్తే రైతులకు ఊరట లభిస్తుంది. ఇలాంటి ఫ్యాక్టరీని పొదలకూరు ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.జిల్లాలో సాగు ఇలా.. విస్తీర్ణం: 28,437 ఎకరాల్లో సీజన్లో యార్డు నుంచి ఎగుమతులు: 15 లారీల్లో.. ప్యాక్ చేసి ఎగుమతి చేసే కాయలు: 300 టన్నులు -
కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి..
● అదృశ్యమైన బాలురు.. అనంతలోకాలకు.. ● మరణంలోనూ వీడని స్నేహ బంధం ● ఉయ్యాలపల్లిలో విషాదం ● పొట్టన బెట్టుకున్న గ్రావెల్ మాఫియాకలువాయి(సైదాపురం): మట్టి మాఫియా ఇద్దరు బాలుర ప్రాణాలను బలిగొంది. ఆడుతూ పాడుతూ.. కలేకాయల కోసం వెళ్లిన వారు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. పోలీసుల బృందం శ్రమించి బురద గుంతల్లో నుంచి మృతదేహాలను వెలికితీసింది. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన నూతేటి ప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూతేటి విష్ణుకుమార్ (11) స్థానిక నవభారత్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్ (12) స్థానిక ఎంపీయూపీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదుపుతున్నాడు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. గ్రామానికి సమీపంలో డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది. ఇద్దరూ కలిసి బుధవారం సాయంత్రం డ్రాగన్ ఫ్రూట్స్, కలేకాయల కోసం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా తిరిగి రాకపోవడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు సంగం సీఐ వేమారెడ్డి, రాపూరు, కలువాయి, మర్రిపాడు, చేజర్ల ఎస్సైలు ఉయ్యాలపల్లి రాత్రి గ్రామానికి చేరుకున్నారు. బాలుర ఆచూకీ కోసం గ్రామస్తులతో కలిసి ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. డ్రోన్లను తీసుకొచ్చి వెతికారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆచూకీ దొరకలేదు. అతికష్టం మీద.. ఉయ్యాలపల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద మట్టి మాఫియా తవ్విన గుంతల్లో మృతదేహాలు ఉన్నాయంటూ స్థానికులు పోలీసులు, బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండటంతో యంత్రాలతో నీటిని మళ్లించారు. మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. విగతజీవలుగా మారిన విష్ణు, శ్రావణ్ను చూసి అక్కడున్న వారంతా కన్నీరుమున్నీరుగా రోదించారు. మట్టి గుంతలు తమ పిల్లల ప్రాణాలను బలిగొన్నాయని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అంటూ రోదించారు. శోకసంద్రంలో.. బాలుర మృతితో ఉయ్యాలపల్లె కన్నీటి సంద్రమైంది. ఇంటి నుంచి బుధవారం సాయంత్రం వెళ్లిన ఇద్దరి ఆచూకీ కోసం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గ్రామస్తులతోపాటు పోలీసులు వెతికారు. ఎక్కడో ఒకచోట ఉంటారు. ఇంటికొచ్చేస్తారని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో చెరువు వద్ద ఉన్న గుంతల్లో చనిపోయి కనిపించడంతో బాధిత తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలిసి తిరుగుతూ.. విష్ణుకుమార్, నవశ్రావణ్ చదివేది వేర్వేరు పాఠశాలలు, తరగతులైనా కలిసి తిరిగేవారు. ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. గ్రామంలో సందడి చేసేవారు. ఆడుతూ.. పాడుతూ తిరిగే చిన్నారులను విధి చిన్నచూపు చూసింది. మరణంలోనూ స్నేహిబంధం వీడలేదు. నవ్వుతూ కనిపించే మీరు చనిపోయారా నాయనా అంటూ గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు. ఆశలు సమాధి ఉయ్యాలపల్లికి చెందిన నూతేటి ప్రసాద్, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. కుటుంబ పోషణ భారం కావడంతో బతుకుదెరువు కోసం ప్రసాద్ కువైట్కు వెళ్లాడు. విష్ణుకుమార్ చివరివాడు కావడంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించేందుకు ప్రసాద్ రూపాయి రూపాయి కూడబెడుతున్నాడు. అతను ఇటీవల కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మళ్లీ తిరిగెళ్లే సమయంలో ఈ విషాదం జరగడంతో తన ఆశలు ఆడియాశలు అయ్యాయంటూ రోదించడం అందరినీ కలిచివేసింది. ఇక మనుబోటి నరసింహులు టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ భార్య సునీత, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. రెండో కుమారుడైన శ్రావణ్ నీటి గుంతలో పడి చనిపోవడంతో ఆ కుటంబం కన్నీరుమున్నీరవుతోంది. -
తప్పుడు కేసులకు భయపడేదిలేదు
● మనీ స్కామ్లో డబ్బులు కొట్టేశారు ● కావలిలో కక్ష రాజకీయాలకు ఊతం ● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి(అల్లూరు): తప్పుడు కేసులకు భయపడేదిలేదని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి గురువారం చేరుకున్న ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తన కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులకు కృతజ్ఞతలను తెలియజేశారు. అక్రమ కేసులు మోపి పోలీస్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని కూటమి ప్రభుత్వం సైకో పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. ప్రశాంతతకు మారుపేరైన కావలిని ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఆయన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. మనీ స్కామ్లో డబ్బులు దోచుకోవడం.. ఇసుక దందా.. గ్రావెల్.. మైన్స్.. రేషన్ మాఫియాను ప్రశ్నిస్తున్న తనపై కక్షగట్టి తప్పుడు కేసులు మోపారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే వాస్తవాలను ప్రజలు చెప్తారన్నారు. అభివృద్ధిని గాలికొదిలారని చెప్పారు. డిజిటల్ బుక్ను తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని వివరించారు. తమ పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించినా.. కక్షసాధింపు చర్యలకు పాల్పడినా.. అరాచకాలు చేసినా వెంటనే యాప్లో పొందుపర్చాలని కోరారు. తాము అధికారంలో వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ మాజీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడి వర్గంపై సైతం తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర కృష్ణారెడ్డిదని విమర్శించారు. విలేకరులను సైతం వదలకుండా కేసులు పెట్టి జైల్లో పెట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇలాంటి కక్షసాధింపు చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదని తెలిపారు. -
సాగు తగ్గించడమే మేలు
నిమ్మ సాగును కొంత వరకు తగ్గించడమే మేలు. బోర్ల ద్వారా నీటి సౌకర్యం ఉన్న ప్రతి రైతు దీనిపై మక్కువ చూపుతున్నారు. దిగుబడి పెరిగితే డిమాండ్ తగ్గుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. మూడు నెలలే అంతో ఇంతో డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత కష్టాలు పడాల్సి వస్తుంది. కూలిలు సైతం గిట్టుబాటు కాక ఇబ్బందులు పడ్డాం. – శంకర్రెడ్డి, రైతు, ముదిగేడు కష్టంగా ఉంది నిమ్మ సాగు కష్టంతో కూడుకున్న పని. కంపోస్ట్ ఎరువులను ఏటా తోలి యాజమాన్య పద్ధతులను చేపట్టాల్సి ఉంటుంది. పెట్టుబడులు బాగా అవుతున్నా, అందుకు తగిన విధంగా రాబడి ఉండటం లేదు. వేసవిలోనే ధరలు పతనమైతే రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సాగు తగ్గించుకోవడమే మంచిదనిపిస్తోంది. – దయాకర్రెడ్డి, రైతు, కల్యాణపురం భవిష్యత్తులో ఇబ్బందులు నిమ్మకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందుల్లేకపోయినా, భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బయటి రాష్ట్రాల్లో నిమ్మ సాగు పెరుగుతోంది. బిహార్లో సైతం దీన్ని పండిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మన ప్రాంతంలో డిమాండ్ తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా భావించాల్సి వస్తోంది. – బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మ మార్కెట్ యార్డు, పొదలకూరు ● -
ప్రొఫెసర్ సతీష్ ధవన్కు ఘన నివాళి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పితామహుల్లో ముఖ్యులైన ప్రొఫెసర్ సతీష్ ధవన్ 104వ జయంతిని గురువారం షార్ కేంద్రంలోని గగన్యాన్ మిషన్ కంట్రోల్ రూంలో ఘనంగా నిర్వహించారు. షార్ రెండో గేట్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద సతీష్ ధవన్ మెమోరియల్ను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆయన విగ్రహానికి, మిషన్ కంట్రోల్ రూంలో చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా షార్ అసోసియేట్ డైరెక్టర్ ముత్తు చైళియన్ మాట్లాడుతూ భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రొఫెసర్ సతీష్ ధవన్ అత్యంత సాంకేతికపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన మొదటి తరం శాస్త్రవేత్తగా చరిత్రకెక్కారని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలను తొలితరం శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్ బుడి బుడి అడుగులతో నడిపిస్తే, సతీష్ ధవన్ దానికి నడక నేర్పించడంతో ప్రస్తుతం ప్రపంచంలోనే ఇస్రో బలీయమైన సంస్థగా ఆవిర్భవించిదన్నారు. సతీష ధవన్ ఆధ్వర్యంలో అంతరిక్ష ప్రయోగాల పరంపర ప్రారంభమైందన్నారు. ఇస్రో తొలినాళ్లలో చిన్న తరహా రాకెట్ ప్రయోగాలు మొదలు ప్రస్తుతం చంద్రయాన్ – 3, ఆదిత్య ఎల్1 వరకు, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రస్థానం, సౌండింగ్ రాకెట్లు, 40 కిలోల బరువు కలిగిన చిన్నపాటి ఉపగ్రహాలను పంపించే స్థాయి నుంచి నేడు ఆరు టన్నుల బరువు కలిగిన అన్ని రకాల ఉపగ్రహాలను సొంతంగా తయారు చేసుకుని ప్రయోగించే వరకు ఎదిగిన వైనం, సాధిస్తున్న విజయాల వెనుక అప్పట్లో ఆయన వేసిన పునాదుల గురించి వివరించారు. కార్యక్రమంలో షార్ కంట్రోలర్ రమేష్ కుమార్, షార్ అధికారులు పి.గోపీకృష్ణ, అన్ని విభాగాల అసోసియేట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. కండలేరులో 54.350 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 54.350 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 10.100 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 590, పిన్నేరు కాలువకు 90, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
తొలిసారిగా రాక్ ఫాస్పేట్ రవాణా
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్న ం పోర్టు లిమిటెడ్ రెండు మైలురాళ్లను నెలకొ ల్పినట్టు పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ గురువారం తెలిపారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ కోసం 1,84,649 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్తున్న ఎంవీ యూరిబియా నౌక బెర్త్ నంబర్ 5 వద్ద ఈనెల 22న 24 గంటల్లో 61,500 మెట్రిక్ టన్నుల అత్యధిక డిశ్చార్జ్ రేట్ను సాధించినట్టు వెల్లడించారు. తొలిసారిగా రాక్ ఫాస్పెట్ను విజయవంతంగా రవాణా చేసినట్టు తెలిపారు. బ్లూ ఫాస్పెట్ లిమిటెడ్ కడప జిల్లాలోని తన ప్లాంట్ కోసం ఎంవీ గ్లామర్ నౌకలో 13,100 మెట్రిక్ టన్నులను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. భవిష్యత్లో రాక్ ఫాస్పేట్ను తమ పోర్టు ద్వారా రవాణా చేయనున్నట్టు చెప్పారు. అదానీ కృష్ణపట్నం పోర్టు మార్కెటింగ్ బృందం సాధించిన విజయంగా సీఈఓ చెప్పుకొచ్చారు. ఆర్థికంగా దెబ్బతిని.. ● వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): ఆర్థికంగా చితికిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. వనంతోపులో నివాసముంటున్న రవికుమార్రెడ్డి (40)కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను ఓ కంపెనీకి చెందిన ఫ్యాన్లు, కూలర్ల డిస్ట్రిబ్యూటర్. వ్యాపారంలో నష్టాలు రావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఇంటి వద్దనే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 23వ తేదీ రాత్రి మద్యంలో గడ్డిమందు కలిపి తాగాడు. అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గురించి వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు అతడిని బుధవారం తెల్లవారుజామున జీజీహెచ్లో చేర్పించారు. రవికుమార్రెడ్డి అక్కడ చికిత్స పొందుతూ రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య నిర్మల గురువారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
పోలీస్స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వెంకటాచలం: తనపై పలుమార్లు దాడి జరిగినా పోలీసులు సరైన న్యాయం చేయడంలేదంటూ వెంకటాచలం పోలీస్స్టేషన్లో పురుగు మందు తాగి మండలంలోని పూడిపర్తికి చెందిన ఆటో డ్రైవర్ తుంగా మస్తానయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుడి సోదరుడు శ్రీనాఽథ్ వివరాల మేరకు.. పూడిపర్తికి చెందిన మస్తాన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చుట్టుపక్కల ఉండేవారు మస్తాన్తో తరచూ గొడవపడేవారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల్లో మస్తాన్తో గొడవపడి మాకుమ్ముడిగా దాడి చేశారు. ఘటనపై వెంకటాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఇరువర్గాలను పోలీసులు పిలిచి రాజీ చేసి పంపారు. తాజాగా గ్రామానికి చెందిన కావలి పెద్ద వెంకటరమణయ్య, కార్తీక్ మరికొందరు తన నివాసంలో ఉన్న మస్తాన్పై గురువారం ఉదయం మరోసారి దాడి చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, గ్రామానికి వారొచ్చి మస్తాన్తో పాటు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. తనపై దాడికి పాల్పడినా, న్యాయం జరగడంలేదనే మనస్తాపంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును మస్తాన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు గమనించి వెంకటాచలంలోని సీహెచ్సీకి.. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎంత శాతం పనులు చేశారో చెప్పండి
● కాకాణి, బుర్రాపై విమర్శలు మానాలి ● వైఎస్సార్సీపీ నాయకులు కందుకూరు: ‘మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్, పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, నేతలను రామాయపట్నం పోర్టు వద్దకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో 51 శాతం పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఎంత శాతం పనులు చేశారో ప్రజలకు చెప్పాలి’ అని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఉలవపాడు మండలాధ్యక్షుడు నన్నం పోతురాజు మాట్లాడుతూ పోర్టు పనులను పరిశీలిస్తే వాస్తవాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో పోలీసుల ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు స్థాయిని మరిచి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీపీసీఎల్కు ఎందుకు భూములు కట్టబెడుతున్నారని, దీని వెనుక ఏ స్థాయి ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు. కందుకూరు పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ మాట్లాడుతూ పట్టణంలో రోడ్ల విస్తరణ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు తాను నడిపే బియ్యం మాఫియా గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గుడ్లూరు మండల ఎంపీపీ రమేష్ మాట్లాడుతూ గతంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఉద్యోగాల నుంచి తొలగించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మద్దసాని నవీన్ మాట్లాడుతూ గుడ్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు తమ నాయకుడు మధుసూదన్ యాదవ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో ఇసుక, గ్రావెల్, మద్యం వంటి మాఫియాను నాగరాజు ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నారు. జిల్లా నాయకులు చీమల రాజా, ముప్పవరపు కిశోర్ మాట్లాడారు. సమావేశంలో లింగసముద్రం, కందుకూరు మండలాల కన్వీనర్లు నోటి వెంకటేశ్వరరెడ్డి, ఈదర రమేష్, నాయకులు తోకల కొండయ్య, గణేశం గంగిరెడ్డి, అప్పనబోయిన రాజేష్, పీవీ రమణయ్య, కాట్రగడ్డ వెంకట్రావ్, రావులకొల్లు బ్రహ్మానందం, గేరా మనోహర్, ఆదిలక్ష్మి, రహీమ్, తల్లపనేని గోపి పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి పది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో ఏడు కంపార్ట్మెంట్లు నిండాయి. స్వామివారిని 58,628 మంది భక్తులు బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,551 మంది సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. పక్కాగా స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ నెల్లూరు(అర్బన్): జిల్లాలోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో అమలు చేస్తున్న స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ఎస్సెన్సీపీఏ ప్రోగ్రామ్ అధికారి స్టెఫీ పేర్కొన్నారు. నెల్లూరు పర్యటనకు గురువారం వచ్చిన ఆమె జిల్లాలోని వరిగొండ, దామరమడుగు తదితర పీహెచ్సీల్లో మహిళలకు నిర్వహిస్తున్న పరీక్షలను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో 490 క్యాంపులను నిర్వహించి.. 42,192 మందికి స్క్రీనింగ్ పరీక్షలను చేశారని వివరించారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని పెద్దాస్పత్రికి పంపి వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రోగ్రామ్ నోడల్ అధికారి బ్రహ్మేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఫారం – 6లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. వీటిని సంపూర్ణంగా పూర్తి చేసేలా నూతన ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని పేర్కొన్నారు. డీఆర్వో విజయ్కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వారాహి సిల్క్స్ ప్రారంభం
● సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి నెల్లూరు(బృందావనం): నగరంలోని మినీబైపాస్లో వారాహి సిల్క్స్ షోరూమ్ను సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సంప్రదాయ, ఫ్యాషన్ వస్త్రాలకు పెట్టింది పేరైన వారాహి సిల్క్స్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. షోరూమ్ను యాంకర్ సుమ కనకాల, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్ ఏచూరి, డాక్టర్ స్పందన మద్దుతో కలిసి అభిమానుల సమక్షంలో ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ తాను నటించిన చిత్రాల్లోని డైలాగులు చెప్తూ సందడి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్లు మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి షోరూమ్ను నెల్లూరులో ప్రారంభించామని చెప్పారు. హైదరాబాద్లోని ప్యాట్నీ సెంటర్, విజయవాడలో షోరూమ్లను త్వరలో ప్రారంభించనున్నామని వెల్లడించారు. రూ.500 నుంచి రూ.10 లక్షల వరకు చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. రూ.పది వేల వస్త్రాల కొనుగోలుపై 22 క్యారెట్ల బంగారు నాణేన్ని అందిస్తున్నామని, ఈ ఆఫర్ అక్టోబర్ ఐదు వరకు ఉంటుందని తెలిపారు. -
మెంటల్ బాలకృష్ణా.. నోరు అదుపులో ఉంచుకో
● అభిమానులను కొట్టే సంస్కృతి నీదే.. ● పిచ్చి పీక్స్కు పోయిందా.. రాత్రి తాగింది దిగలేదా..? ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షిప్రతినిధి, నెల్లూరు: సినీ నటుడు బాలకృష్ణకు మెంటల్ ఉందని.. ఈ విషయమై తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. తనకు మతిస్థిమితం లేదని డాక్టర్ల వద్ద ఆయన సర్టిఫికెట్ను తెచ్చుకున్నారని.. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఖండించారు. ఈ మేరకు నెల్లూరులో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించడంతో పాటు చిరంజీవిని అవమానించారని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. నటులను జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ అవమానించలేదన్నారు. ఆయన్ను కలిసేందుకు చిరంజీవి గతంలో వెళ్లినప్పుడు సాదరంగా ఆహ్వానించారని, అంతేకాకుండా కలిసి భోజనం చేశారని గుర్తుచేశారు. వాస్తవాలను వక్రీకరించి బాలకృష్ణ మాట్లాడటం దారుణమన్నారు. దగ్గరికొచ్చిన అభిమానులను కొట్టడం, ఫోన్లో తిట్టడం లాంటి ఛండాలమైన సంస్కృతి బాలకృష్ణదేనని విమర్శించారు.. బాలకృష్ణకు పిచ్చి పీక్స్కు చేరి.. రాత్రి తాగింది ఇంకా దిగక ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా నోటిని అదుపులో ఉంచుకోవాలని, లేని పక్షంలో జరగబోయే తీవ్ర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. హక్కుల కోసం రానున్న రోజుల్లో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపడతాం’ అని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముజాఫర్ అహ్మద్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, పలు సంఘాల నాయకులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అహ్మద్ మాట్లాడుతూ డిస్కం, ట్రాన్స్కో, జెన్కోల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలతో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5వ తేదీన కలిసి వచ్చే కార్మిక సంఘాలతో విజయవాడలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం, 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిస్కంల వద్ద ధర్నాలు, నవంబర్ 10వ తేదీన ‘చలో విద్యుత్ సౌధ’ కార్యక్రమాలను తలపెట్టామన్నారు. అంతే కాకుండా పలు పోరాటాలు చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించామన్నారు. సమావేశంలో నాయకులు బొజ్జా సుమన్, టీవీవీ ప్రసాద్, రాజా, హజరత్తయ్య, పెంచలప్రసాద్, బాబు, నాగయ్య, దయాకర్, ప్రసన్నకుమార్రెడ్డి, సునీల్, నాగరాజు, తదితరులు పాల్గొ న్నారు. -
పసిడికి పన్నుపోటు .. జీఎస్టీకి వెన్నుపోటు
ప్రభుత్వాదాయానికి చిల్లుపెడుతూ జిల్లాలో జీరో దందా జోరుగా కొనసాగుతోంది. వాస్తవానికి బంగారు కొనుగోళ్లు, విక్రయాలపై మూడు శాతం జీఎస్టీని చెల్లించాలనే నిబంధన ఉన్నా, అదెక్కడా అమలుకావడంలేదు. చైన్నె, ముంబై నుంచి అనధికారికంగా కొందరు తీసుకొచ్చి తమ బిజినెస్ను మూడు గ్రాములు.. ఆరు కాసులు అన్నట్లుగా సాగిస్తున్నారు. బిల్లును చెల్లించాలనే రూల్నూ పాటించడంలేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, తెల్లకాగితంపై రాసి అంటగడుతున్నారు. ఈ తంతుపై అధికారులకు తెలిసినా, మామూళ్ల మత్తులో మునిగి పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇలా.. బంగారు దుకాణాలు – వెయ్యికిపైగా రోజు వారీ వ్యాపారం – రూ.150 కోట్లకుపైగా నెల్లూరు (టౌన్): జీరో దందా.. దోపిడీకి అండగా నిలుస్తోంది. జిల్లాలో బంగారంపై ఈ తంతు నిత్యం జరుగుతూనే ఉంది. ఎలాంటి పన్ను చెల్లించకుండా చైన్నె, ముంబై ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో అక్రమంగా జిల్లాకు తీసుకొచ్చారనే అంశంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ నెల 17న విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని డీపీ, జేటీ హోల్సేల్ దుకాణాల్లో రికార్డులను ఢిల్లీ నుంచి వచ్చిన ఆ శాఖ ప్రత్యేక బృందం పరిశీలించింది. భారీగా తేడాల గుర్తింపు బంగారానికి సంబంధించిన కొనుగోళ్లు, విక్రయాల్లో భారీగా తేడాలను వారు గుర్తించారు. 500 నుంచి 600 కిలోలకు సంబంధించి ఆదాయ పన్నును ఆర్నెల్ల క్రితం చెల్లించకుండా కొద్ది రోజుల్లోనే విక్రయించారనే అంశాన్ని కనుగొన్నారు. జిల్లాలో ఈ రెండు దుకాణాలే కాకుండా అధిక శాతం షాపులు ఇదే తీరును అవలంబిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా పెద్ద మొత్తంలో విక్రయిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. అందరి చూపు పసిడివైపే.. బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇతరులకు అప్పివ్వడం, స్థిర, చరాస్తులపై పెట్టుబడుల కంటే దీనిపై ఇన్వెస్ట్ చేస్తే ఉన్నతంగా ఉంటామనే ఆలోచన ఎక్కువ మందిలో నెలకొంది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగితే కొనుగోలు చేయడం కష్టంగా మారుతుందేమోననే భావన మధ్యతరగతి ప్రజల్లో సైతం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో డబ్బెక్కువగా ఉన్నవారు.. అవసరం నిమిత్తం మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నిత్యం.. భారీగా జిల్లా వ్యాప్తంగా పెద్ద, చిన్న బంగారు దుకాణాలు వెయ్యికిపైగా ఉన్నాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే 600కుపైగా ఉన్నాయి. నగరంలో ఒకప్పుడు ఒకే ప్రాంతంలో ఉండే ఇవి, ప్రస్తుతం ప్రతి కూడలిలో కొలువుదీరాయి. నిత్యం ఇక్కడ రూ.150 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోంది. చైన్నె, ముంబైతో పాటు మధ్య ప్రాచ్య దేశాల నుంచి అనధికారికంగా భారీ మొత్తంలో పెద్ద షాపుల వారు తీసుకొస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు పసిడి విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి మూడు శాతం జీఎస్టీని వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు వినియోగదారులకు బిల్లివ్వాల్సి ఉంది. పెద్ద ఎత్తున గండి జిల్లాలో నిత్యం రూ.150 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతున్న తరుణంలో మూడు శాతం జీఎస్టీ కింద రూ.4.5 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. సెలవులు, అన్ సీజన్ రోజులను తీస్తే సగటున 20 రోజులకు రూ.90 కోట్లు ప్రభుత్వానికి జమకావాలి. అయితే ఏడాదికి రూ.వంద కోట్లు సైతం అందడంలేదని తెలుస్తోంది. తరుగు, తూకాల్లోనూ మోసం మరోవైపు తూకాలు, తరుగు రూపాల్లోనూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. జీఎస్టీ, తూనికలు, కొలతలు అధికారులు ఏ రోజూ తనిఖీ చేసిన సందర్భాల్లేవు. దీంతో విక్రేతలు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. .. ష్..గప్చుప్ మామూళ్ల మత్తులో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జోగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా, అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి గానూ ప్రతిఫలంగా వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో స్వీకరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నెల్లూరు నగరంలో నెలవారీగా.. అదే మున్సిపాల్టీలు, చిన్న పట్టణాల్లో ఏడాదికోసారి పుచ్చుకుంటున్నారని సమాచారం. నగరంలో ఇలా నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులకు సైతం ఇదే తరహాలో అందుతున్నాయి. తనిఖీలు చేస్తాం ఎలాంటి పన్నులు చెల్లించకుండా విక్రయాలు సాగిస్తున్న బంగారు దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తాం. దీనికి గానూ ఎలాంటి వే బిల్లుల్లేవు. ఫిర్యాదొస్తే తప్ప తనిఖీ చేసే పరిస్థితి లేదు. ట్యాక్స్ చెల్లించకుండా అనధికారికంగా బంగారాన్ని విక్రయిస్తున్న విషయాన్ని మా దృష్టికి తీసుకురావాలి. బాధ్యతలను ఇటీవలే స్వీకరించా. పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపడతా. – కిరణ్, జేసీ, వాణిజ్య పన్నుల శాఖ బంగారంపై జిల్లాలో భారీగా పన్ను ఎగవేత చైన్నె, ముంబై నుంచి అనధికారికంగా తీసుకొస్తూ.. కొనుగోలు, విక్రయాలపై మూడు శాతం జీఎస్టీ బిల్లులన్నీ తెల్ల కాగితాలపైనే అందజేత ఒరిజినల్ అడిగితే అదనంగా చెల్లించాల్సిందే అధికారులకు మామూళ్లు -
రైతు సమస్యలపై సోమిరెడ్డికి శ్రద్ధ లేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: ఇరిగేషన్లో దొంగ బిల్లులు చేసుకోవడంపై సోమిరెడ్డికి ఉన్న శ్రద్ధ, రైతుల సమస్యలపై లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. మండలంలోని కురిచెర్లపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే సోమిరెడ్డి అసెంబ్లీ వేదికగా నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న చంద్రమోహన్రెడ్డి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి రైతుల సమస్యలను వివరించి గిట్టుబాటు ధర కల్పించకుండా అసెంబ్లీలో మొక్కుబడిగా మాట్లాడి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటన్నారు. ఇరిగేషన్ దొంగ బిల్లుల కోసం అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిన వ్యక్తి, రైతుల గిట్టుబాటు ధర గురించి ఎందుకు గట్టిగా అడగడం లేదని ప్రశ్నించారు. పనులు చేయకుండా దొంగ బిల్లులు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న సోమిరెడ్డితోపాటు ఇరిగేషన్ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇసుక, గ్రావెల్, మట్టి, బూడిదను దోపిడీ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని చంద్రమోహన్రెడ్డి అమ్మకానికి పెట్టాడని ఆరోపించారు. -
ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈగా రాఘవేంద్రం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈగా జిల్లాకు చెందిన కొండూరు రాఘవేంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు విద్యుత్ భవన్లోని తన చాంబర్లో బాధ్యతలను బుధవారం చేపట్టారు. సత్యసాయి జిల్లాలో ఈఈగా పనిచేస్తున్న ఈయన ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఎస్ఈగా పనిచేసిన విజయన్.. తిరుపతి కార్పొరేట్ కార్యాలయంలో జీఎం (సోలార్ కార్పొరేషన్)గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రం మాట్లాడారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ను అందిస్తామని వివరించారు. కాగా ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు. వెంకటాచలం సర్పంచ్ చెక్ పవర్ రద్దు నెల్లూరు(పొగతోట): నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలపై వెంకటాచలం సర్పంచ్ రాజేశ్వరి చెక్ పవర్ను ఆర్నెల్ల పాటు రద్దు చేస్తూ ఉత్తర్వులను డీపీఓ శ్రీధర్రెడ్డి బుధవారం జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై కావలి డివిజనల్ పంచాయతీ అధికారి విచారణ జరిపి నివేదికలను సమర్పించారని వివరించారు. సర్పంచ్ సమర్పించిన సంజాయషీ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
టీడీపీ నేతకు వైఎస్సార్సీపీ నేత ఆర్థిక సాయం
నెల్లూరు సిటీ: నగరంలోని 13వ డివిజన్కు చెందిన టీడీపీ నేత, నారా లోకేశ్ సేవా సమితి అధ్యక్షుడు కంచి మల్లికార్జునరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న 13వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆర్థిక సాయం చేశారు. రూ.25 వేలు అందించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న మల్లికార్జున్రెడ్డి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఆపద సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదని, మానవత్వంతో స్పందించి తమవంతు సహాయంగా అండగా నిలిచామన్నారు. -
సంక్షోభంలో సజ్జ సాగు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి వివిధ పంటలకు కనీస మద్దతు కరువై అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. ఇప్పటికే వరి, పత్తి, వేరుశనగ, బత్తాయి, టమాటో, ఉల్లి సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర కరువైంది. చిరుధాన్యాల పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. సజ్జ, రాగికే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి.. కొర్ర, అండుకొర్ర, సామలు, వరుగు పంటలను వదిలేసింది. దీంతో చిరుధాన్యాలను సాగు చేసే రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ పది నాటికి 55,471 ఎకరాల్లో సజ్జను సాగు చేశారు. సాధారణ సాగు 61,775 ఎకరాలు కాగా, ఈ ఏడాది వివిధ కారణాల రీత్యా విస్తీర్ణాన్ని తగ్గించారు. కర్నూలులో 14,258, నంద్యాలలో 12,066, అనంతపురంలో 8,389, ప్రకాశంలో 7,210, తిరుపతిలో 5,045, నెల్లూరులో 2,292, కడప జిల్లాల్లో 2,008 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సజ్జ తర్వాత రాగి 44,478, కొర్ర, సామ, వరుగు తదితర చిరు ధాన్యాలను రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. రైతు కుదేలు సజ్జ సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,775 కాగా, ఇంతకంటే తక్కువ ధరకు మార్కెట్లో కొనుగోలు చేయకూడదు. అయితే ప్రస్తుతం రూ.1,800 నుంచి రూ.రెండు వేల్లోపే చెల్లిస్తుండటంతో రైతులు రూ.800 నుంచి రూ.1000 వరకు నష్టపోతున్నారు. రాగులకు కనీస ధరను రూ.4,886గా ప్రకటించగా, మార్కెట్లో మాత్రం రూ.మూడు వేలకే కొంటున్నారు. చిరుధాన్యాల్లో సామలు, వరుగు, కొర్రకు కనీస మద్దతు ధర ప్రకటించనే లేదు. దీంతో వీటి ధర ఎంతుంటుందో చెప్పలేని పరిస్థితి. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులు, లభించని మద్దతు ధరలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సజ్జలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ ఉదయగిరిలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. వ్యాపారులు సజ్జల ధరలు తగ్గించి కొంటున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అది అమలుకు నోచుకోవడం లేదు. రైతులకు గిట్టుబాటు కావడం లేదు సజ్జ పంటకు కనీస మద్దతు ధరను రూ.ఐదు వేలకు పెంచాలి. ప్రస్తుత మిస్తున్న మద్దతు ధర రూ.2,775 రైతుకు గిట్టుబాటు కాదు. ఈ ధరకు మార్కెట్లో కొనుగోలు చేయడం లేదు. – వెంకటసుబ్బారెడ్డి, రైతు, సీతారామపురం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ప్రస్తుతం మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయని రైతులు చెప్తున్నారు. మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. త్వరలో మద్దత ధరకు కొనుగోలు చేస్తాం. – సత్యవాణి, జేడీ, వ్యవసాయ శాఖ, నెల్లూరు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,775 తగ్గించి కొంటున్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న రైతు ఈ రేటుకే కొనుగోలు చేయాలంటూ అన్నదాతల ఆందోళన -
పారిశ్రామికవాడ.. పశువులకు మేతగా..!
● గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాశయంతో ఎమ్మెస్సెమ్ఈ పార్కు ● శీతకన్నేసిన కూటమి సర్కార్ ఆత్మకూరు రూరల్: మండలంలోని నారంపేటలో ఏర్పాటు చేసిన ఎమ్మెస్సెమ్ఈ పార్కు పశువుల మేతకు ఆవాసంగా మారింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పార్కుకు భూసేకరణతో పాటు సుమారు రూ.40 కోట్లకుపైగా వ్యయంతో మౌలిక వసతులను అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కల్పించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇదే ప్రాంతంలో పెద్ద సభను ఈ ఏడాది మేలో నిర్వహించి, పరిశ్రమలను త్వరలో స్థాపించనున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలనూ ప్రదర్శించారు. అయితే ఆపై మిన్నకుండిపోవడంతో నారంపేటలోని పారిశ్రామికవాడ పచ్చికబయిళ్లు, పశువుల మేతకు చక్కగా ఉపయోగపడుతోంది. పరిశ్రమలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
దాడి కేసులో నలుగురు హిజ్రాల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ అన్వర్బాషా కందుకూరు: పట్టణంలోని కోవూరు రోడ్డులో ఉన్న హరిణి ప్రజా వైద్యశాల సిబ్బందిపై దాడికి పాల్పడిన నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేసినట్లు సీఐ అన్వర్బాషా తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆస్పత్రి వద్దకు మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో నలుగురు హిజ్రాలు డబ్బు కోసం వెళ్లారు. రిసెప్షన్లో ఉన్న ఆదిలక్ష్మి అనే నర్సు ‘డాక్టర్ భోజనానికి వెళ్లారు. మీరు తర్వాత రండి’ అని వారికి సూచించింది. దీంతో ఆగ్రహించిన హిజ్రాలు తాము అడిగితే డబ్బులు ఇవ్వవా అంటూ పెద్దగా కేకలు వేశారు. బూతులు తిడుడూ అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఆదిలక్ష్మిని ఆస్పత్రి బయటకు ఈడ్చుకొచ్చి కాళ్లతో కొట్టి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా ఇష్టారీతిగా ప్రవర్తించారు. దీంతో తనను చంపేస్తారని భయపడిన ఆదిలక్ష్మి తన వద్దనున్న రూ.2 వేల నగదు హిజ్రాలకు ఇచ్చేసింది. ఇంతలో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను రక్షించారు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ హిజ్రాలు అసభ్యకర ప్రవర్తనతో చుట్టుపక్కల వారిని హడలెత్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన హిజ్రాలు వలేటి లావణ్య, బత్తుల పింకీ, బుదురు సౌజన్య, కందిపాటి విజయలక్ష్మిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వీరంతా ప్రస్తుతం పట్టణంలోని ఉప్పుచెరువులో ఓ ఇంట్లో నివాసముంటున్నట్లు గుర్తించామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా హిజ్రాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
గంగమ్మ తిరునాళ్లపై పచ్చనేతల కుతంత్రం
● నిలిపేయాలని నలుగురు నేతల మంకుపట్టు ● నిర్వాహకుల్ని పోలీస్స్టేషన్కు పిలిచి పంచాయితీఉలవపాడు: ‘మమ్మల్ని సంప్రదించకుండా తిరునాళ్లను చేస్తారా.. ఎలా జరుగుతుందో చూస్తాం’ అంటూ బద్దిపూడి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు బహిరంగంగా అనడమే కాకుండా పోలీసులను, పంచాయతీ అధికారులను ఉసిగొల్పి పంచాయితీలు చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని బద్దిపూడి గ్రామంలో గంగమ్మ తల్లి తిరునాళ్లను ఈనెల 27వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించాలని గ్రామస్తులు ఉమ్మడిగా నిర్ణయించారు. చందాలు కూడా వసూలు చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన నలుగురు నాయకులు అడ్డుపుల్లలు వేయడం ప్రారంభించారు. తమను ప్రత్యేకంగా సంప్రదించలేదని చెబుతూ.. గ్రామంలో కొందరిని చందాలు ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. తిరునాళ్లను నిలిపేయాలని నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో పరిస్థితిపై ఆరా తీయకుండానే ఆ నాయకుడు పోలీసులు, పంచాయతీ అధికారులకు తిరునాళ్లను ఆపాలని మౌఖికంగా ఆదేశాలివ్వడం చర్చనీయాంశమైంది. మరో తేదీన పెట్టుకోండి నిర్వాహక కమిటీలో సభ్యులుగా ఉన్న 14 మందిని స్టేషన్కు పిలిపించిన పోలీసులు ‘గ్రామంలో వారికి చెప్పకుండా తిరునాళ్లను ఎందుకు చేస్తున్నారు. మరో తేదీ పెట్టుకోండి’ అని సూచించడంతో అందుకు అంగీకరించారు. అయినా టీడీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఆపేయాల్సిందేనని మంకుపట్టు పట్టడంతో సభ్యులను పోలీసులు మూడు పర్యాయాలు స్టేషన్కు పిలిపించారు. తాత్కాలికంగా నిలుపుదల చేయాలని బుధవారం పోలీసులు సూచించగా ‘మా 14 మంది వల్ల సమస్య వస్తుందని టీడీపీ నాయకులు తెలియజేశారు కాబట్టి తిరునాళ్ల సమయంలో పోలీస్స్టేషన్లోనే ఉంటాం. గ్రామస్తులు కార్యక్రమాలు చేసుకుంటారు. వాటిని ఆపొద్దు’ అని స్పష్టం చేశారు. పోలీసులు అందుకు ససేమిరా అనడంతో తిరునాళ్లను చేసి తీరతామని నిర్వాహకులు తెగేసి చెప్పారు. నిర్వాహక కమిటీలో సగం మంది టీడీపీ సానుభూతిపరులున్నా నలుగురు వ్యక్తులు తమ పలుకుబడిని ఉపయోగించి ఆపేందుకు యత్నించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా కమిటీలో సభ్యులు తమ ఇంటి ముందు డ్రెయినేజీపై రాకపోకల కోసం నిర్మించిన చప్టా తొలగించాలని పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. -
జీఎస్టీ తగ్గింపుతో ఎంతో ఉపయోగం
● పాత రేట్ల మేరకు విక్రయిస్తే చర్యలు ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో అన్ని వర్గాలకు ఎంతో ఊరట లభించనుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్లో జీఎస్టీ, నెల్లూరు డివిజన్ జాయింట్ కమిషనర్ కిరణ్తో కలిసి విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో చిరువ్యాపారాలు పెరుగుతాయని, ఎమ్మెస్సెమ్ఈ పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనుందని వెల్లడించారు. ఫలితంగా రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారు జీఎస్టీ పరిధిలోకి వస్తారని, ప్రభుత్వానికి ఆదాయం భారీగా లభించనుందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు.. ఆరోగ్య రంగానికి సంబంధించిన మందులు, ఇన్సురెన్స్ ప్రీమియం.. రైతులకు వ్యవసాయాధారిత ట్రాక్టర్, ఇతర పరికరాల ధరలు దిగొస్తాయని చెప్పారు. జీఎస్టీ అమలు తీరు పరిశీలనకు గానూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వ్యాపార సంస్థల్లో తనిఖీలను చేపట్టామని, అక్కడ రేట్లు తగ్గించారన్నారు. పాత ధరల మేరకు ఎక్కడైనా విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ట్యాక్స్ రిటర్న్స్ను ఆఫీసర్తో సంబంధంలేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ను సైతం మూణ్ణాలుగు రోజుల్లో చేసుకోవచ్చన్నారు. గ్రామస్థాయిలో పొదుపు సంఘాలు, ఇతరులకు ఈ నెల 30 వరకు అవగాహన కల్పించనున్నామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి ఎలా లబ్ధి చేకూరుతుందో 30 నుంచి వచ్చే నెల ఆరు వరకు వివరించనున్నామని.. ఇలా 19 వరకు కార్యక్రమాలను నిర్వహించి దీపావళి రోజున మెగా ఈవెంట్తో ముగించనున్నామని వివరించారు. ప్రధాని పిలుపు మేరకు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేద్దామని పేర్కొన్నారు. -
పంచాయతీల ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీలు ఆర్థిక ప్రగతి సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. బుధవారం నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీలు స్థానిక పాలనలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఆదాయవనరుల్లేక అనేక పంచాయతీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. కేంద్రం విడుదల చేసే నిధులపై ఆధారపడకుండా సొంతగా ఆదాయవనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. నిధుల కోసం ఎదురు చూడకుండా అవసరమైన సమయంలో సొంత నగదును ఖర్చు చేసుకునే స్థాయికి గ్రామ పంచాయతీలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మోహన్రావు, మాస్టర్ ట్రెయినర్లు పాల్గొన్నారు. -
మోటార్బైక్ దొంగల అరెస్ట్
● రూ.9 లక్షల విలువైన 10 వాహనాల స్వాధీనం కోవూరు: కోవూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో వరుసగా జరిగిన మోటార్బైక్ దొంగతనాల కేసులో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ హైవేపై స్టంట్స్ చేస్తూ పట్టుబడిన కావలి యువకుడు సాగర్ విచారణలో వివరాలు వెల్లడించడంతో ముఠాను పట్టుకున్నట్లుగా నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. కోవూరు పోలీస్స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. సాగర్ను విచారించగా తన స్నేహితులు సుహాన్బాబు, ఆదర్శ గోవింద్తో కలిసి బైకులను చోరీ చేస్తున్నట్లు వెల్లడించాడు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.9 లక్షల విలువైన 10 బైక్లను స్వాధీ నం చేసుకున్నారు. ఇవి ఎక్కువ భాగం కోవూరు, కావలి ప్రాంతాల్లో చోరీ చేసినవే. నిందితులను రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు. -
ప్రసన్నకుమార్రెడ్డి పరామర్శ
ఇందుకూరుపేట: ఇటీవల సంగం మండలంలో పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లగుండ్ల శ్రీనివాసులు, లక్ష్మి మృతిచెందిన విషయం తెలిసిందే. వారి పిల్లలు చందుప్రియ, విశ్వంత్, ఇంకా బంధువులను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన ఇందుకూరుపేటలోని దళితవాడలో ఉన్న వారి నివాసానికి వెళ్లి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ గుణుపాటి సురేష్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, నాయకులు గురజాల బుజ్జిబాబు, భాను చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నపేగు విలవిల
నెల్లూరు(క్రైమ్): పిల్లల్ని ప్రయోజకులను చేయాలని నిరంతరం వారు శ్రమిస్తారు. రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల భవిష్యత్కు బాటలు వేస్తారు. వారు ఎదుగుతున్నప్పుడు చూసి వీరు మురిసిపోతారు. పెద్దయ్యాక కొందరు తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. బిడ్డల ఆకలి తీరితే తమ కడుపు నిండిందని సంబరపడిన వారికి జీవిత చరమాంకంలో గుప్పెడు మెతుకులు దొరక్క కడుపులు మాడుతున్నాయి. ఆకాశమంత ఆత్మీయతను పంచిన కన్నవారిని అక్కున చేర్చుకోవాల్సిన సమయంలో ఆస్తుల కోసం నరకం చూపిస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటామని నమ్మించి ఇళ్లు, స్థలాలు, పొలాలు రాయించుకుని ఆపై కనికరం లేకుండా నడిరోడ్డులో వదిలేస్తున్నారు. ఆస్తుల కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డల చేష్టలతో బెదిరిపోయిన పండుటాకులు ఇతరుల పంచన చేరి కాలం వెళ్లదీస్తున్నారు. అనేకమంది తమ కన్నీటి గాధలను ప్రతి సోమవారం నెల్లూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. తల్లిదండ్రులను చిత్రహింసలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు అందిన వెంటనే విచారించి కేసులు నమోదు చేస్తున్నారు.ఇలా చేస్తే..తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ చట్టం – 2007 పండుటాకుల పాలిట వరం. తల్లిదండ్రులు, వృద్ధులు ఈ చట్టం కింద రక్షణ, మెయింటెనెన్స్ పొందవచ్చు. నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రులు, వృద్ధులు నేరుగా సబ్ కలెక్టర్/ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్లో కేసు వేయొచ్చు. నిస్సహాయ స్థితిలో ఉంటే మరో వ్యక్తి లేదా ఏదైనా రిజిస్ట్రరైన స్వచ్ఛంద సంస్థ సాయంతో ఫిర్యాదు చేయొచ్చు. కేసును విచారించిన ట్రిబ్యునల్ వారి జీవనానికి ఇబ్బంది లేకుండా, సంరక్షణను పిల్లలు చూసుకునేలా చేస్తుంది. నెలవారీ మెయింటెనెన్స్ సొమ్ము చెల్లించడంలో విఫలమైతే నెలరోజుల వరకు జైలుశిక్ష విధిస్తుంది. సంతానం లేని దంపతులు వారి తదనంతరం ఆస్తి ఎవరికి దక్కుతుందో ఆ బంధువుల నుంచి నిర్వహణ సొమ్మును పొందొచ్చు. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్ను 60 రోజుల్లోపు ఆశ్రయించవచ్చు. అక్కడ నెలలోగా సమస్యను పరిష్కరిస్తారు. తమ బాగోగులు చూసుకోకపోతే బిడ్డల పేరున రాసిచ్చిన ఆస్తి దస్తావేజులను రద్దు చేసుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలు బలవంతంగా ఆస్తులు రాయించుకుంటే చట్టంలోని సెక్షన్ 23 కింద ఆ రిజిస్ట్రేషన్ (సేల్ డీడ్ మినహా) రద్దు చేసే అవకాశం ఉంది. సెక్షన్ 24 ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, హింసించినా, దాడి చేసినా మూడు నెలలు జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా లేదా రెండు విధిస్తారు.● నెల్లూరు రూరల్ మండలం శ్రామికనగర్కు చెందిన మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్న కుమారుడు, కుమార్తైపె వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు.● వెంకటాచలం మండలానికి చెందిన ఓ వృద్ధుడు తన ఆస్తిని పిల్లలకు సమంగా పంచాడు. మలివయసులో తన అవసరాల నిమిత్తం రూ.3 లక్షలు దాచి పెట్టుకున్నాడు. పెద్ద కుమార్తె, ఆమె భర్త వృద్ధుడి వద్దనున్న నగదు, వృద్ధాప్య పింఛన్ను బలవంతంగా తీసుకుంటున్నారు. దీంతో ఆయనకు పూట గడవడమే కష్టంగా మారింది. విచారించి న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.● వేదాయపాళేనికి చెందిన ఓ వృద్ధుడు తన ఆస్తిని పిల్లలందరికీ సమానంగా పంచాడు. ఆయన బాగోగులను పిల్లలు పట్టించుకోలేదు. దీంతో తనపేరుపైనున్న ఆస్తిని అమ్ముకునేందుకు యత్నిచంగా పిల్లలు అడ్డుకున్నారు. విచారించి న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరారు. -
నెల్లూరు చిన్నారుల అదృశ్యం విషాదాంతం
సాక్షి, నెల్లూరు: ఉయ్యాలపల్లి చిన్నారుల అదృశ్యం ఘటన.. విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతదేహాలుగా కనిపించడంతో ఆ తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ పరిణామంతో.. మిస్సింగ్ కేసును మిస్టరీ డెత్ కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉయ్యాలపల్లి(Uyyalapalli) గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష్ణువర్దన్, శ్రవణ్లు బుధవారం మధ్యాహ్నాం ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేపట్టారు. ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి ఉంటారనే స్థానికులు చెప్పడంతో డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..గురువారం విష్ణువర్దన్ మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. దీంతో అధికారులు ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. ఆపై అనుమానంతో కొంత నీటిని బయటకు తోడేయడంతో శ్రవణ్ మృతదేహాం కూడా బయటపడింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వాళ్లు మనోళ్లే.. చూసుకోండి..!
సాక్షిప్రతినిధి నెల్లూరు: ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో కారును ఢీకొనడంతో ఏడుగురు దళితులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగి వారమైనా కనీసం డ్రైవర్ను కూడా అరెస్ట్ చేయలేక పోయారంటే ఏ మేరకు ఒత్తిడి ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు–ముంబయి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని అదే రోజు రాత్రి ఎస్పీ డాక్టర్ అజిత ప్రకటించారు. సరిగ్గా అప్పటి నుంచే అసలు నాటకం మొదలైంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమాని ఏఎస్పేట మండలం చిరమనకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, ఇసుక అక్రమ రవాణాదారుడు బుజ్జయ్యనాయుడులు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్య అనుచరులు. దీంతో వారిని రక్షించేందుకు మంత్రే స్వయంగా రంగంలోకి దిగి పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచి్చనట్లు తెలుస్తోంది. తాను చెప్పినట్లే కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన డ్రైవర్కు లైసెన్స్ లేదు.. పైగా తప్పతాగాడు.. దీంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇన్సూ్యరెన్స్ కూడా రాదని అతన్ని తప్పించేలా వ్యూహం పన్నారు. ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్ను అరెస్ట్ చూపలేదు. అతన్ని వదిలేసి.. తెల్లారేసరికే డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో వివరాలను సైతం తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ–1గా టిప్పర్ డ్రైవర్ను చూపించారు. ఇసుక టిప్పర్ నంబర్కు బదులుగా ప్రమాదానికి గురైన కారు నంబర్ను నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్ యజమాని అని రాసి అక్కడ సైతం టిప్పర్ నంబర్కు బదులుగా బాధితుల కారు నంబర్ను నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ నంబర్ను ఎఫ్ఐఆర్లో ఎక్కడా చూపలేదు. ఈ విషయం బాధితులు నిలదీయడంతో తప్పులు సరిదిద్దారని తెలిసింది. డ్రైవర్ మార్పులో హైడ్రామా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను వదిలేసి తొలుత ఏఎస్పేట మండలం కావలియడవల్లికి చెందిన ప్రతాప్రెడ్డిని డ్రైవర్గా చూపించేందుకు నాలుగు రోజులుగా యత్నించారు. అయితే ఈ విషయమై అతని భార్య, పిల్లలు తీవ్రంగా అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. ప్రతాప్రెడ్డిని కేసులో ఇరికిస్తే వాస్తవ విషయాలను మీడియా ముందు వెల్లడిస్తామని వారు హెచ్చరించడంతో మంగళవారం రాత్రి హడావుడిగా మదరాబాద్కు చెందిన సు«దీర్ అనే వ్యక్తిని డ్రైవర్గా చూపించి అరెస్ట్ చేశారు. టిప్పర్ యజమాని, ఇసుక అక్రమ రవాణాదారుపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇసుక రీచ్లకు అనుమతులు లేవు. అయితే చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో అనధికార ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న విషయం మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖలకు తెలిసినా మౌనంగా ఉన్నారు. అసలు ఇక్కడ ఇసుక రీచ్కు అనుమతి ఎవరిచ్చారు? రీచ్లోకి వెళ్లడానికి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులు ఎవరు? వీటిపై ఆయా శాఖల ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా చేయలేదు. ఈ ఘటనకు పూర్తిగా మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులే బాధ్యులని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలకు పచ్చ జెండా ఊపి..మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంది. -
అయ్యా లోకేశ్.. నా గోడు పట్టదా!
సాక్షి, నెల్లూరు సిటీ: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా వాడుకుని వదిలేస్తారని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి జీవితం కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. టీడీపీని నమ్ముకుని ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డానని నెల్లూరు బాలాజీనగర్కు చెందిన కంచి మల్లికార్జునరెడ్డి తెలిపారు.‘1983లో పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశాను. పార్టీ కోసం నా జీవితాన్ని, ఆస్తులను త్యాగం చేశాను. ఈ రోజు బతుకుదెరువు కోసం పార్టీ నేతలను, స్థానికులను యాచించాల్సిన దుస్థితి వచ్చింది’ అని మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ పేరుతో సేవా కార్యక్రమాలకు రూ.కోట్లు ఖర్చు..‘నేను 2014లో నారా లోకేశ్ సేవా సమితిని ఏర్పాటు చేశాను. రూ.కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాను. అప్పట్లో పవర్ ప్రాజెక్ట్లకు ఐస్ సరఫరా కాంట్రాక్ట్ చేసేవాడిని. నేను సంపాదించిన డబ్బులతోపాటు 2 ఇళ్లు, ఇంటి స్థలం అమ్మేసి లోకేశ్ సేవా సమితి కార్యక్రమాలకు ఖర్చు చేశాను. రూ.1.50లక్షలు ఖర్చు చేసి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు, తల్లి అమ్మణ్ణమ్మల పెయింట్ ఫొటో వేయించాను. ఆ ఫొటోను చంద్రబాబుకు బహూకరించాను. గతేడాది డిసెంబర్లో షుగర్ పెరిగి నాకు ఒక కాలు తొలగించారు. తల నరాలు బలహీనపడి నా భార్య అనార్యోగంతో బాధపడుతోంది. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు.’ అని చెప్పారు. ‘ఇటీవల నెల్లూరు వచి్చన లోకేశ్ను కలిశాను. నా పరిస్థితిని వివరించడంతో అధైర్య పడొద్దు.. మంత్రి నారాయణకు చెప్పాను. ఆయన చూసుకుంటారని లోకేశ్ హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరూ సాయం చేయలేదు. నా జీవితాన్ని పారీ్టకి అంకితం చేశాను. నన్ను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం’ అని అన్నారు. -
25న కొత్త ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు
నెల్లూరు (టౌన్): డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులకు ఈ నెల 25న అమరావతిలో సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేయనున్నట్లు డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థులు వారి సహచరులతో ఈ నెల 24న వెంకటాచలం మండలం గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటల్లోపు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయులు వారి సహచరులకు అవసరమైన దుప్పట్లు, గొడుగులు, వాటర్ బాటిళ్లు వారే తెచ్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు గొలగమూడి ఆశ్రమం వద్ద అందజేయనున్నట్లు తెలిపారు. ఐడీ కార్డులు ఉంటేనే ఉపాధ్యాయులు, వారి సహచరులను ముఖ్యమంత్రి కార్యాక్రమానికి అనుమతిస్తారన్నారు. వీఎస్యూ వీసీకి విశిష్ట గౌరవం వెంకటాచలం: విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) వీసీ అల్లం శ్రీనివాసరావుకు మరో విశిష్ట గౌరవం లభించింది. ప్రపంచంలో అగ్ర శాస్త్రవేత్తల జాబితాలో రెండో విభాగం శాస్త్రవేత్తలు ఉన్న జాబితాలో ఆయనకు స్థానం లభించింది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ జాబితాలో చోటు లభించడం విశేషం. భౌతికశాస్త్రం, పొటానిక్స్ విభాగాల్లో అల్లం శ్రీనివాసరావు చేసిన పరిశోధనలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు ఆయన 270కు పైగా పరిశోధనా పత్రాలు, పుస్తక అధ్యయాలు ప్రచురించగా, 25 మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకం వహించారు. ఈ విశిష్ట గౌరవం పొందిన వీసీ అల్లం శ్రీనివాసరావును మంగళవారం వీఎస్యూలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు. -
అనుమతిచ్చిన ఇసుక మాఫియా డాన్ ఎవరు
● పెరమన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం ● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక తవ్వకాలకు ఆత్మకూరు నియోజకవర్గంలో అసలు ఏ అనుమతే లేదని, పెరుమాళ్లపాడులోని ఇసుక రీచ్ అనుమతి ఇచ్చిన ఇసుక మాఫియా డాన్ ఎవరని, రీచ్లోకి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ ఏ విధంగా అనుమతిచ్చారని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విక్రమ్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. విక్రమ్రెడ్డి మాట్లాడుతూ సంగం మండలం పెరమన సమీపంలో ఇటీవల అక్రమంగా అధిక టన్నేజీతో వెళ్తున్న ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఐదు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందడం విచారకరమన్నారు. ఆ రోజు అక్రమ ఇసుక తవ్వకాలు చేయకుండా ఉండి ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదన్నారు. ఇసుక మాఫియా దుర్మార్గానికి ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో ఇసుక మాఫియా డాన్ వివిధ ఇసుక రీచ్ల ద్వారా రోజుకు 150 టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తూ రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా వాహనాలను నడిపే డ్రైవర్లు మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి ఓ కారణమన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారని, నిందితుడు తమ అదుపులో ఉన్నట్లుగా తెలిపారని, ఈ ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అయితే ఇంత వరకు తీసుకున్న చర్యలేమిటో తెలియడం లేదన్నారు. ఆ రోజు సాయంత్రమే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం తప్పులు నమోదు చేశారని, టిప్పర్ నంబరు కాకుండా కారు నంబరు వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఏ–1గా డ్రైవర్, ఏ–2గా వాహన యజమాని, ఏ–3గా ఇసుక అక్రమ రవాణాదారుడు బుజ్జయ్యనాయుడు అని నమోదు చేశారని, అయితే తప్పు తెలుసుకున్న తర్వాత టిప్పర్ నంబరు పెట్టి ఎఫ్ఆర్ఐ నమోదు చేశారన్నారు. దీన్ని బట్టి పోలీసులపై ఎంతటి ఒత్తిడి ఉందో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్న మాఫియాలపై దృష్టి సారించితే మంచిదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఒక్కరికి రూ.50 లక్షల వంతున ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు వంతున ప్రకటించిందని, అయితే ఇప్పటి వరకు అది వారికి అందిందో లేదో కూడా తెలియలేదన్నారు. ప్రమాదం తర్వాత బాధ్యత వహించాల్సిన మంత్రి ఆ కుటుంబాలను ఆదుకోపోగా, /నాలుగు లేన్ల రోడ్లు మంజూరు చేయాలని కోరడం ఏమిటో అర్థం కాలేదని విక్రమ్రెడ్డి విమర్శించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పూర్తిగా నిలుపుదల చేయాలని, బెల్ట్ షాపులన్నింటిని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర్రెడ్డి, జోనల్ మహిళా అధ్యక్షురాలు మహిళ గౌరీ, ఆత్మకూరు జెడ్పీటీసీ లక్ష్మీప్రసన్న, జిల్లా బూత్ కమిటీ విభాగం అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు రఘునాథరెడ్డి, శ్రీనివాసనాయుడు, మండల కన్వీనర్లు శంకర్రెడ్డి, పిచ్చిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
ఉదయగిరి సీహెచ్సీలో విచారణ
ఉదయగిరి రూరల్: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన మంజుల ప్రసవ సమయంలో పురిటిబిడ్డ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం వైద్యులు సీహెచ్ కిరణ్, ఎం.బెట్టి జనాల్, ఆర్వీ హరిత విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. డీసీహెచ్ఎస్ పరిమళ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు. వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, బాధిత కుటుంబంతో మాట్లాడామన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మా ఇష్టం.. ఇలాగే అమ్ముతాం
● జీఎస్టీ తగ్గింపుతో మారిన మందుల ధరలు ● ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం పాత రేట్లకే విక్రయం ● కొన్ని మెడికల్ షాపుల్లోనూ అంతే నెల్లూరు(అర్బన్): కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే పలు రకాల మందులపై కేంద్రం ఽజీఎస్టీ తగ్గించడంతో ధరలు తగ్గాయి. కేన్సర్, గుండె, జన్యుపరమైన తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారిని దృష్టిలో ఉంచుకుని గతంలో 5 శాతం జీఎస్టీ ఉన్న 36 రకాల ప్రాణాంతక మందులపై పూర్తిగా తొలగించింది. గతంలో 12 శాతం ఉన్న ఇతర 33 రకాల ఔషధాలను 0 శాతానికి మార్చింది. సాధారణ జబ్బులకు వినియోగించే మందులపై గతంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు 5 శాతమైంది. కొన్నిరకాల మెడికేటెడ్ పేస్టులపై ఉన్న 18 శాతాన్ని కూడా 5 శాతంలోకి కేంద్రం తీసుకొచ్చింది. పలు రకాల వైద్య పరిరాలపై ఉన్న 18 శాతం నేడు 5 శాతమైంది. ఈ విధానం ఈనెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఉపయోగం కలిగేనా.. జిల్లాలో హోల్సేల్, రిటైల్ మెడికల్ షాపులు 1,850 వరకు ఉన్నాయి. జీఎస్టీ తగ్గడంతో మందుల స్ట్రిప్పై ఉండే ఎమ్మార్పీ కన్నా తక్కువకే అమ్మాలి. అయితే నెల్లూరులోని కార్పొరేట్, పేరున్న పెద్ద ఆస్పత్రుల్లో ఎమ్మార్పీకే అమ్ముతున్నాయి. దీంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్ షాపుల్లో ఇదే పరిస్థితి ఉంది. నెల్లూరు నగరంలో పోటీ వల్ల గతం నుంచే ఎమ్మార్పీ కన్నా తక్కువకే (రిబేట్) ఇచ్చి స్వతంత్ర వ్యాపారులు మందులు అమ్ముతున్నారు. వీరిప్పుడు పాత పద్ధతిలోనే రిబేట్ ఇచ్చినప్పటికీ గతం కన్నా ప్రయోజనం చేకూరడం లేదు. తగ్గిన జీఎస్టీ ఫలాలు రోగులకు అందడం లేదు. అంతిమంగా వ్యాపారులే లాభపడుతున్నారు. జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం మందులపై జీఎస్టీ తగ్గించడంతో ఆ మేరకు ఎమ్మార్పీ కన్నా తగ్గించి రోగులకు అమ్మాలని మెడికల్ షాపుల యజమానులకు సూచించాం. ప్రతి షాపులో రేట్లు తగ్గినట్టు వాల్పోస్టర్లు కూడా ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నాం. తగ్గించిన జీఎస్టీ మేరకు కాకుండా అదనపు రేట్లకు అమ్మితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. రోగులు నేరుగా మాకు ఫిర్యాదు చేయొచ్చు. – రమేష్రెడ్డి, ఏడీ, జిల్లా ఔషధ నియంత్రణ శాఖ -
ఉరేసుకుని యువతి ఆత్మహత్యాయత్నం
● సీహెచ్సీలో వైద్యులు లేక పోయిన ప్రాణం వెంకటాచలం: ఉరేసుకుని యువతి మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం వెంకటాచలం క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రాత్రి 7.30 నుంచి 8.40 గంటల వరకు వైద్యులు రాకపోవడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మండలంలోని కసుమూరు గ్రామానికి చెందిన మల్లి పూర్ణ (23)కు వచ్చే నెల 8వ తేదీన వివాహం జరగనుంది. అయితే ఏమైందో తెలియదు కానీ తన నివాసంలో ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వైద్యులు అందుబాటులో ఉండుంటే తమ బిడ్డ బతికి ఉండేదని పూర్ణ తండ్రి మల్లి శీనయ్య తన ఆవేదన వ్యక్తం చేశాడు. క్లస్టర్ ఆరోగ్య కేంద్రం వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పూర్ణ కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి పంపేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోర్టు సందర్శనేమైనా దేశ ద్రోహమా
కందుకూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గోవర్ధన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు సందర్శించడం ఏమైనా దేశద్రోహ చర్యా లేక ఉగ్రవాద కార్యకలాపాలా అంటూ మండిపడ్డారు. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతోనే తమను అడ్డుకుంటున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లాలో పోలీస్లు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది సరైన విధానం కాదని, రేపు ప్రభుత్వం మారితే ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రామాయపట్నం పోర్టు వద్ద మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కందుకూరు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు సందర్శించేందుకు ముందుగానే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని, అయితే కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోర్టు సందర్శనకు వెళ్లకుండా తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. పోర్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి బయట పడుతుందనో లేకపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుస్తుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు తమను పోర్టు పరిసరాల్లోకి కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి దశలో రూ.4,924 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వివరించారు. 2020లోనే పోర్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి, 2022లో భూమిపూజ చేసి వెంటనే పనులు ప్రారంభించారని తెలిపారు. అనంతరం 794 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 34 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా నాలుగు బెర్తుల నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు రూ.985 కోట్లు ప్రభుత్వం తరఫున, రూ.3,938 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు కూడా మంజూరు చేశారన్నారు. ఇలా అన్ని అనుమతులతో పాటు భూమి, నిధులు సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం వల్ల జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 51 శాతం పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఒక బెర్తు నిర్మాణం కూడా పూర్తి చేశారని, కస్టమ్స్ అనుమతలు రాకపోవడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆలస్యమైందన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల పోర్టు నిర్మాణం పూర్తిగా అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కక్కుర్తితోనే పోర్టు పనుల నిలిపివేత తమ ప్రభుత్వ హయాంలో 51 శాతం పోర్టు పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వ ఏడాదిన్నర పాలనా కాలంలో కనీసం 10 శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లను ఎవరిని తరిమేద్దాం, ఎవడు కమీషన్లు ఇస్తాడనే ఆలోచన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ చేస్తున్నారని, దీనికి అనుగుణంగా తనకు ఎవరు డబ్బులిస్తే ఆ కాంట్రాక్టర్కు పనులు ఇవ్వాలనే స్థానిక ఎమ్మెల్యే కక్కుర్తి వల్ల పోర్టు నిర్మాణం అటకెక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉండే బడా నాయకులు ప్రజల అవసరాలు, ఉపాధి అవకాశాలు పక్కన పెట్టి తమకు కమీషన్లు వస్తే చాలు అన్న ధోరణి వల్లే 15 నెలలుగా పనులు నిలిపేశారని విమర్శించారు. డీల్ కుదిరిన తరువాత ప్రస్తుతం ఓ కంపెనీకి పనులు అప్పగించినా నేటికి 10 శాతం పనులు కూడా చేయని దుస్థితి ఉందన్నారు. అభివృద్ధిని చూపించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అసలు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క జగన్మోహన్రెడ్డి మాత్రమేనని కాకాణి వివరించారు. రూ.5,550 కోట్లతో 35 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మచిలీపట్నం పోర్టు, 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ.5 వేల కోట్ల ఖర్చుతో మూలపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. దాదాపు రూ.15 వేల కోట్ల ఖర్చుతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపట్నం పోర్టుల్లో 30 వేల మందికి ఉపాధి కల్పించేలా మారిటైమ్ బోర్డు ద్వారా నిధులు సమీకరించి పనులు ప్రారంభించిన ఘనత జగన్మోహన్రెడ్డిదన్నారు. కానీ నేటి ప్రభుత్వం కాసులకు పోర్టులను అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. రామాయపట్నం పోర్టు పనులను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలిస్తే తప్పేంటి పోర్టు నిర్మాణంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమాలు బయటకు వస్తాయనే అడ్డగింత మా ప్రభుత్వం 15 నెలల్లోనే 51 శాతం పనులు పూర్తి చేస్తే, కూటమి 5 శాతం కూడా పూర్తి చేయలేదు జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలకు తెలియకూడదనే కుట్ర ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కక్కుర్తి వల్లే పోర్టు నిర్మాణం అటకెక్కింది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
అధికార పార్టీ అండతో..
● ప్రార్థనా మందిరం ఆవరణలో బెల్టుషాపు ఏర్పాటుకు యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు ● మడమనూరులో ఉద్రిక్తతమనుబోలు: మండలంలోని మడమనూరు గ్రామంలో ఓ ప్రార్థనా మందిరం ఆవరణలో అధికార పార్టీ నాయకుల అండతో కొందరు వ్యక్తులు మంగళవారం బెల్టుషాపు ఏర్పాటుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు బీసీ భాస్కర్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా మడమనూరులోని ప్రధాన రహదారి పక్కన ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం ఉందన్నారు. ఆవరణలో పూల మొక్కలు, కానుగ, తాటిచెట్లతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటుందన్నారు. అయితే ఇటీవల దానిపై కన్నేసిన టీడీపీ నాయకులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సాయంతో చెట్లను కొట్టేయడమే కాకుండా ఆ స్థలాన్ని ఆక్రమించుకుని బెల్టుషాపు పెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు బెల్టుషాపులను రద్దు చేస్తామని, మత ప్రార్థనా స్థలాలను కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. స్థలాన్ని ఆక్రమించుకునేందుకు యత్నంచిన నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. -
విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధిత అధికారులు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల శాఖలకు చెందిన అధికారులతో సమీక్షించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. క్రమం తప్పకుండా కంటి, దంత వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేయించాలని, కిటికీలకు మెస్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి మల్లికార్జునరెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతుల శాఖ అఽధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార మదంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఓ దళిత మహిళను అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువుపాళెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మను స్థానిక టీడీపీ నేతలు విక్రమ్రెడ్డి, మోహన్రెడ్డి, శ్రీనివాసులు దుర్భాషలాడడంతోపాటు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగక ఆమెపై పోలీసు కేసు పెట్టించారు. పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్సై ద్వారా కూడా మందలించారు. దీంతో ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. ‘ఏ తప్పు చేయని నన్ను తోటపల్లిగూడూరు వెలుగు సీసీ కోసం ఇబ్బంది పెడుతున్నారు. దొరువుపాళెం గ్రామానికి చెందిన సునీత అనే వీఓఏ.. మహిళల పొదుపు సొమ్ము సుమారు రూ.18 లక్షలు దుర్వినియోగం చేసింది. దీంతో ఆమెను తొలగించి, మా బంధువు దారా కోటేశ్వరమ్మను నియమించారు. అయితే కూటమి పార్టీకి చెందిన స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ఒత్తిడి తెచ్చి కోటేశ్వరమ్మను తొలగించారు. తిరిగి సునీతనే వీఓఏగా నియమించారు. ఈ అన్యాయాన్ని నేను పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై టీడీపీ నాయకులు కక్ష కట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నా చావుకు అధికార టీడీపీ నాయకులే కారణం’ అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో వివరిస్తూ నిద్ర మాత్రలు మింగారు. అనంతరం ఆమె కుప్పకూలిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరులోని జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అర్జీలిచ్చి.. మొర పెట్టుకుని..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 524 వినతుల అందజేతనెల్లూరు రూరల్: ‘మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ ఎం.వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖవి 180, పోలీస్ శాఖవి 120, పంచాయతీరాజ్ శాఖవి 46, నగరపాలక సంస్థవి 46, ఇతర శాఖలు కలిపి మొత్తం 524 వినతులందాయి. ● తొలుత కలెక్టర్ అర్జీదారులకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి ఆరాతీశారు. ● ఐటీడీఏ తరఫున తోపుడు బండ్లు అందించాలని ఎం.రంగయ్య, సీహెచ్ ఉష, సతీష్ చంద్ర తదితరులు కోరారు. ● ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి తమను హేళనగా మాట్లాడుతున్నారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శివయ్య, జిల్లా అధ్యక్షుడు మురళి విన్నవించారు. ● దసరా సెలవుల్లోనూ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయని కలెక్టర్కు పీడీఎస్యూ నేతలు వినతిపత్రం అందజేశారు. షేక్ షారుక్, కె.ఆశిర్, ఎస్కే అన్వర్ మస్తాన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాకపోకలు ఆపేశారు శెట్టిపల్లి సురేష్ అనే వ్యక్తి మా పొలాలకు దారి ఇవ్వకుండా జేసీబీతో తవ్వించేశాడని కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ పంటలు కోతకు వచ్చాయన్నారు. రాకపోకలకు వీలు లేకుండా చేశారని, న్యాయం చేయాలని కోరారు. మమ్మల్ని రిలీవ్ చేయండి తమను పాఠశాలల నుంచి రిలీవ్ చేయాలని పలువురు ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ బదిలీ అయినా ఉపాధ్యాయులు లేకపోవడంతో అదే పాఠశాలలో కొనసాగుతున్నామన్నారు. తక్షణం రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట విద్యుత్ ఉద్యోగుల నిరసన నెల్లూరు రూరల్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో అనుసరించిన విధంగా నేరుగా యాజమాన్యం వేతనాలు చెల్లించాలన్నారు. 2019లో నియమించబడిన ఎనర్జీ అసిస్టెంట్లను రెగ్యులర్ చేసి జేఎల్ఎంలుగా పరిగణించి వేతనాలు తదితర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజినీర్లకు ఏఈఈలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వీనర్ ఎన్వీ రాఘవరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. ● సీహెచ్సీ ఎదుట ఆందోళనఉదయగిరి: పురిటిబిడ్డకు పోస్టుమార్టం చేయొద్దంటూ ఉదయగిరి సామాజిక ఆరోగ్యం కేంద్రం వద్ద సోమవారం ఆందోళన జరిగింది. సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన మంజుల ప్రసవ సమయంలో పురిటిబిడ్డ మృతిచెందిన విషయం తెలిసిందే. నెల్లూరు నుంచి వచ్చిన వైద్యులు నవజాత శిశువుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నించగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. దీంతో సీహెచ్సీలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోస్టుమార్టం నిర్వహించేందుకు వీల్లేదని, బిడ్డను ఇవ్వాలని ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి వారికి నచ్చజెప్పి పోస్టుమార్టం నిర్వహించి పురిటిబిడ్డను అప్పగించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రవీంద్రనాఽథ్ ఠాగూర్పై సోమవారం స్థానికంగా ఎలాంటి విచారణ జరగకపోవడంతో బాధితులు ఉన్నతాధికారుల తీరుపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని చెప్పారు. -
రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్ ఎం.పృథ్వీరాజ్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యాడు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో సోమవారం వీసీ అల్లం శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ సమష్టి కృషి కారణంగా వీఎస్యూ అభివృద్ధి చెందుతోందన్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పృథ్వీరాజ్ ప్రతిభ చూపాడని, ఈనెల 29 తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటారని తెలియజేశారు. 2020 – 21 విద్యా సంవత్సరంలో చుక్కల పార్థసారథి, 2021 – 22లో సాత్విక, 2022 – 23 సంవత్సరానికి పృథ్వీరాజ్ ఎంపికవడం గొప్ప విషయమన్నారు. సమావేశంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ లీకై అగ్నిప్రమాదంనెల్లూరు(క్రైమ్): వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆర్పారు. వివరాలు.. పొగతోటలోని అలీస్ స్పెషాల్టీ ఆస్పత్రి నాలుగో అంతస్తులో సిబ్బంది ఉంటున్నారు. సోమవారం అక్కడ వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. డీఎఫ్ఓ వాకా శ్రీనివాసులురెడ్డి ఆదేశాల మేరకు లీడింగ్ ఫైర్మెన్ సీహెచ్ నారాయణ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముంది. అతికష్టంపై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్ష మేర ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
కన్నబిడ్డే తరిమేశాడయ్యా..
● కలెక్టర్కు కన్నీరు తెప్పించిన రమాజ్యోతి ● ఆమె బాధకు చలించిన హిమాన్షు శుక్లానెల్లూరు రూరల్: ‘అయ్యా.. నేను నడవలేను. ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. కాటికి కాళ్లు చాచిన స్థితిలో ఉన్న నన్ను పెద్ద కొడుకు మోసం చేశాడు. బాగా చూసుకుంటానని మభ్యపెట్టి ఉన్న ఇంటిని అతని పేరు మీద రాయించుకున్నాడు. ఇప్పుడు ఇంటి నుంచి తరిమేశాడు. నిలువ నీడ లేకుండా పోయింది. కూడు, గుడ్డ, గూడు కోసం ఇబ్బంది పడుతున్నాను. నాకు న్యాయం చేయండి’ అని కావలి పట్టణానికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు తన బాధను తెలిపి బోరున విలపించింది. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జ్యోతి మరో మహిళను తోడుగా తీసుకుని వచ్చింది. లోనికెళ్లి అర్జీ ఇచ్చేందుకు నేలమీదే కూర్చొని వేచి చూడసాగింది. హిమాన్షు శుక్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తొలిసారిగా వస్తూ రమాజ్యోతిని చూశారు. ఆమె వద్దకెళ్లి కష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. కుమారుడు ఎం.శ్రీనివాస్ నన్ను మభ్యపెట్టి రాయించుకున్న ఇంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి కాస్తంతా నీడ కల్పించాలని కలెక్టర్కు చెప్పుకొని ఏడ్చింది. ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. చలించిపోయి అధికారులను పిలిచి ఆమెకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. -
మా ఇష్టం.. ఎప్పుడైనా వస్తాం
నెల్లూరు రూరల్: కలెక్టరేట్లోని పలు సెక్షన్ల ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10:30 గంటలైనా ఒకరిద్దరు కనిపిస్తారంతే. సాయంత్రం మాత్రం గంట కొట్టగానే వెళ్లిపోతున్నారు. మమ్మల్ని అడిగేదెవరులే అన్నట్టుగా నచ్చిన సమయంలో వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చిన కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.రోడ్డుపై కుప్పకూలి..● వృద్ధుడి మృతి నెల్లూరు(క్రైమ్): ఓ వృద్ధుడు రోడ్డుపై కుప్పకూలి మృతిచెందిన ఘటన నెల్లూరులోని సుబేదార్పేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పి.నరసింహ (74) తన సమీప బంధువైన సౌత్రాజుపాళేనికి చెందిన రాహేలు ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం నరసింహ అదే గ్రామానికి చెందిన వృద్ధురాలితో కలిసి సామగ్రి కొనుగోలు చేసేందుకు సుబేదార్పేటకు వచ్చాడు. ఈక్రమంలో ఆయన రోడ్డుపై కుప్పకూలి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రాహేలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతికావలి(అల్లూరు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కావలి మండలం ముసునూరు గ్రామం బ్ర హ్మంగారి గుడి వీధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కొల్లిబోయిన దేవమణి (32) స్టిక్కరింగ్ పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి తుమ్మలపెంట బీచ్ వద్ద ఫూటుగా మద్యం తాగాడు. తిరిగి బైక్పై వస్తుండగా పడిపోయాడు. స్నేహితులు దేవమణిని ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున అతడికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేశారు. -
కన్నీటి గాథలు చెప్పి.. సాయం కోరి..
● అర్జీలు స్వీకరించిన ఎస్పీ అజిత వేజెండ్ల ● అండగా ఉంటానని భరోసా ● చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలునెల్లూరు(క్రైమ్): ‘ఉద్యోగం పేరిట మోసగించారు. పెళ్లి చేసుకుంటానని వంచించాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని మోసగించారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. మోసగాళ్లపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 122 మంది వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్, కావలి డీఎస్పీలు జి.శ్రీనివాసరావు, పి.శ్రీధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా ఆస్తిని పిల్లలకు పంచేశాను. నా జీవనోపాధి నిమిత్తం రూ.3 లక్షల నగదును దాచిపెట్టుకున్నాను. పెద్ద కుమార్తె ప్రమీల, ఆమె భర్త బలవంతంగా ఆ నగదును తీసుకున్నారు. నాకు వచ్చే వృద్ధాప్య పింఛన్ను సైతం లాక్కొంటున్నారు. నాకు పూటగడవడమే కష్టంగా ఉంది. విచారించి న్యాయం చేయాలని వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● బుచ్చికి చెందిన కాలేషా నాతో సన్నిహితంగా ఉండేవాడు. చెప్పినట్ల వినకపోతే వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● వింజమూరుకు చెందిన హరేంద్ర నన్ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. విచారించి న్యాయం చేయాలని ఉదయగిరికి చెందిన ఓ యువతి విజ్ఞప్తి చేశారు. ● నా కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. హైదరాబాద్కు చెందిన అమీర్మియా, రేష్మ దంపతులు అతడికి హైదరాబాద్లోని ఎయిమ్స్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.13.60 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వడంలేదు. ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని నవాబుపేటకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● చిత్తూరుకు చెందిన మంజునాథ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓనని నమ్మించాడు. తన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.26.68 లక్షల తీసుకుని మోసగించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని దగదర్తికి చెందిన ఓ యువకుడు కోరారు. ● భర్త, అత్తింటివారు అదనపుకట్నం కోసం వేధిస్తున్నారు. ప్రతి విషయానికి గొడవ పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. -
సైబర్ మోసగాళ్ల వలలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్
● ఏసీబీ డీఎస్పీ పేరుతో రూ.2 లక్షలు కాజేసిన వైనం వింజమూరు (ఉదయగిరి): వింజమూరు విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రామ్మూర్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాఽధితుడు తెలిపిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన డి.రామ్మూర్తి ఏడాది నుంచి వింజమూరులో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న రామ్మూర్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలిపారు. మీరు విద్యుత్ పనుల్లో అవినీతికి పాల్పడినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయని, అవి బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే రామ్మూర్తి తన వద్ద ఏమీ లేవని ఫోన్ కట్ చేశాడు. దీంతో వింజమూరు విద్యుత్ ఏఈ నాగూర్వలికి సైబర్ నేరగాళ్లు ఏసీబీ డీఎస్పీ పేరుతో ఫోన్ చేసి రామ్మూర్తికి కాన్ఫరెన్స్ కాల్ కనెక్ట్ చేయించారు. ఈ క్రమంలో ఏఈ రామ్మూర్తికి వారు చెప్పినట్లు చేయమని ఆదేశించాడు. దీంతో వెంటనే తన భార్య మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆమె ఖాతా నుంచి రూ.లక్ష, రామ్మూర్తి ఖాతా నుంచి మరో రూ.98 వేలు వారు తెలిపిన ఖాతాలకు ఫోన్ పే ద్వారా పంపారు. తర్వాత ఈ విషయం స్నేహితులకు చెప్పడంతో ఇది సైబర్ మోసంగా గుర్తించారు. వెంటనే అదే రోజు నెల్లూరులో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకు కావలి ఏఈకి ఫోన్ చేసి అక్కడ పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబరు అడిగారు. వింజమూరు ఘటన వారికి తెలియడంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రామ్మూర్తి రూ.24 లక్షలు బ్యాంకులో అప్పు తెచ్చి గతంలో కావలి జరిగిన మనీ స్కీమ్ మోసపోవడం గమనార్హం. -
చంద్రబాబు పాలన రైతులకు శాపం
వెంకటాచలం: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా.. రైతులకు శాపంగా పరిణమిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి అండగా ఉండాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. మండలంలోని తాటిపర్తిపాళెంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై పోసిన ధాన్యం రాసులను సోమవారం కాకాణి పరిశీలించారు. పంట కోతకు వచ్చిన దశలో వర్షాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధర గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకాణి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్ప, రైతులను పట్టించుకునే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యూరి యా కొరత తీర్చలేక చంద్రబాబు యూరియా ఎక్కువగా వాడితే కేన్సర్ వస్తుందని, ఒకసారి, అవసరానికి మించి అధికంగా యూరియాను సరఫరా చేశామని మరోసారి చెప్పడం రెండు నాల్కుల ధోరణికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా యూరియాను ప్రైవేట్ డీలర్లకు ఇచ్చారని ఆరోపించారు. కష్టపడి పండించిన పంట వర్షానికి తడవడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు దిక్కతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.20,187 కల్పించాల్సి ఉంటే, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు రూ.13 వేలకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. వరికోతలన్నీ పూర్తయ్యే సమయంలో చంద్రబాబు రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తానని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఏడుస్తుంటే, సోమిరెడ్డి ఇరిగేషన్ పనులకు సంబంధించి బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని అసెంబ్లీలో మాట్లాడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తాను వ్యవసాయశాఖ మంత్రిగా రైతులు పండించిన ప్రతి పంటకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రైతు లు నష్టపోకుండా చేశామని గుర్తు చేశారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, ఎంపీటీసీలు వేమారెడ్డి రఘునందన్రెడ్డి, శివకుమార్ రెడ్డి, నేతలు ఆరుగుంట ప్రభాకర్రెడ్డి, కొణిదెన విజయభాస్కర్నాయుడు, గుమ్మా మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి అండగా ఉండాలనే ఆలోచనే చేయడు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేవు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
జేసీగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ
నెల్లూరురూరల్: జాయింట్ కలెక్టర్గా మొగిలి వెంకటేశ్వర్లు కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లేందుకు, అందుకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఏ సమస్య అయినా తనను ప్రజలు నేరుగా వచ్చి కలుసుకోవచ్చు అన్నారు. కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు నెల్లూరు (లీగల్): ఏపీ హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 10/2025కు నిరసనగా నెల్లూ రు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయ్యపరెడ్డి, జల్లి పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం నెల్లూరు (క్రైమ్): వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటనలపై సోమవారం చిన్నబజారు పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. కలువాయికి చెందిన ఓ బాలిక నెల్లూరు నగరంలోని రావూస్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 21వ తేదీ హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న బాధిత తల్లి హుటాహుటిన నెల్లూరుకు చేరుకుని కుమార్తె అదృశ్యంపై చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఫోన్ వచ్చాక.. బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఓ యువతి నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 20వ తేదీన హాస్టల్ వార్డెన్కు విద్యార్థిని కుటుంబ సభ్యుల పేరిట ఫోన్ వచ్చింది. విద్యార్థినిని ఇంటికి పంపాలని కోరారు. దీంతో విద్యార్థిని హాస్టల్ నుంచి బయ టకు వెళ్లింది. కుమార్తెతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు హాస్టల్కు ఫోన్ చేయగా వార్డెన్ జరిగిన విషయాన్ని చెప్పాడు. తాము ఫోన్ చేయలేదని బాధిత తల్లిదండ్రులు హాస్టల్ వార్డెన్కు చెప్పారు. కుమార్తె అదృశ్యంపై బాధిత తండ్రి సోమవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీకేడబ్ల్యూలో జాబ్మేళా నేడు నెల్లూరు (పొగతోట): నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు డీకే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ఖయ్యూం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో 15 పరిశ్రమలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రైతులకు కష్టాలే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతంచంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ను ఆనాడు పీఎం వాజపేయ్కు చెప్పి, వన్మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.1987లో ఎన్సీపీఏ డ్రిప్ ఇరిగేషన్ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది. - కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి. - మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి. - పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి. - సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి. - మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది. - ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు. - వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలివరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. యూరియాపై రెండు నాలుకల ధోరణియూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి. పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్ను దక్కుతుంది. ల్యాబ్లు, రీజనల్ కోడింగ్ సెంటర్లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేకౌలురైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
అక్రమ కేసులెన్ని పెట్టినా ఎదుర్కొంటాం
● కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. జిల్లాలో టీడీపీ నేతలు కొత్త సంస్కృతిని పరవళ్లు తొక్కిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అనేక మంది తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ వీరి చలపతిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడంతో కాకాణి ఆదివారం నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని పరామర్శించారు. కాకాణి మాట్లాడుతూ వీరి చలపతి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగిన దళిత నాయకుడని, కూటమి ప్రభుత్వాన్ని, స్థానిక నాయకులను ప్రశ్నించడం జీర్ణించుకోలేక ఆయనపై 16 సెక్షన్లతో కేసు నమోదు చేశారన్నారు. 2023లో జరిగిన దాడికి సంబంధించి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత వీరి చలపతిని ఇబ్బంది పెట్టాలని హత్యాయత్నంతోపాటు, మరో 15 సెక్షన్లతో కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందని, ఎటువంటి కేసులు పెట్టాలో, వారిని ఎన్ని రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టాలో అనుకూల మీడియాతో వారిపై దుష్ప్రచారం చేయిస్తుందన్నారు. కొత్తగా వచ్చిన మహిళ ఎస్పీపై జిల్లా ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారన్నారు. శాంతి భద్రతలు మెరుగు పడతాయని పక్షపాత వైఖరి లేకుండా పని చేస్తారని జిల్లా ప్రజలందరూ భావించారన్నారు. పాత ఎస్పీ బాటలోనే, కొత్త ఎస్పీ నడవడం బాధాకరమన్నారు. తప్పుడు కేసుపై స్పందించిన పోలీసులు, పోలీసుల ‘సాక్షి’గా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై జరిగిన దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదో ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అధికారం ఎల్లకాలం ఒకరి చేతుల్లోనే ఉందని, తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మీరు పెట్టే అక్రమ కేసులు, వేధింపులతో బాధపడిన, నష్టపోయిన మా నాయకులు, కార్యకర్తల కోసం మేము ఇదే పంథాలో పయనిస్తే, మీ పరిస్థితి ఏంటో గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులపై అధికార పార్టీ నాయకులు దాడి చేసినా సర్దుకుపోతున్నారన్నారు. మేము పోలీసులు చేసే అన్యాయాన్ని ప్రశ్నించినా పోలీసు అసోసియేషన్ మాపై మాట్లాడుతుందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి ప్రభుత్వ తెర తీసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. డీసీఎమ్మెఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు అక్రమ అరెస్టు దారుణమన్నారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే జగన్మోహన్రెడ్డి చివరి మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కళాశాలను తీసుకువచ్చి వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువు చేయాలని సంకల్పించారని తెలిపారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క కొత్త మెడికల్ కళాశాలను కూడా తీసుకురాక పోగా జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను చంద్రబాబు వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తుందనే నెపంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ లిక్కర్ కేసు, మైనింగ్ కేసు అంటూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి వెంట ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.అక్రమ కేసులో ఐదుగురి అరెస్ట్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు (క్రైమ్) : కొడవలూరు పోలీసుస్టేషన్లో నమోదైన అక్రమ కేసులో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతితోపాటు మరో నలుగురిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంకు చెందిన టీడీపీ నేత మల్లికార్జునపై 2023లో దాడి చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం వీరి చలపతితోపాటు 19 మందిపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి వీరి చలపతిని పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఉంచారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అనపల్లి ఉదయ్భాస్కర్, పి. శ్రీకాంత్, బొచ్చు దాసు, వీరి సురేష్ ఆదివారం కొడవలూరు పోలీసుల వద్ద లొంగిపోయారు. దీంతో ఐదుగురికి జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించి న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో నిందితులను జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. -
రూ.100 కోట్లతో రిటైనింగ్ వాల్కు శ్రీకారం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): టీడీపీ.. అంటేనే ‘టెండర్ వేయ్.. దోచుకో.. పంచుకో’ అనే అర్థమని ‘పెన్నానది రిటైనింగ్ వాల్’ టెండర్తో రుజువైంది. అభివృద్ధి పేరుతో అడ్డంగా దోచుకునేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి స్కెచ్ వేశారు. గతంలోనూ పేద ప్రజల ఇళ్ల నిర్మాణం పేరుతో సదరు మంత్రి రూ.వేల కోట్లు కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన ప్రజాధనాన్ని కాజేసేందుకు వేసిన టెండర్ చూస్తే జిల్లా ప్రజలే కాదు.. రాష్ట్ర ప్రజలూ నివ్వెర పోవాల్సిందే. 14 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉన్నా.. సోమశిల జలాశయం నుంచి వరద నీటిని పెన్నాకు విడుదల చేసిన ప్రతిసారి నది పక్కనే ఉన్న లోతట్టు ప్రాంతాలైన భగసింగ్ కాలనీ, జనార్దన్రెడ్డి కాలనీ, గాంధీగిరిజన కాలనీ ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగి ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. రెండున్నర దశాబ్దాల కాలంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏనాడు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆలోచించలేదు. వరద ముంపు వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకు సహాయం అందించిన పాపాన పోలేదు. రిటైనింగ్ వాల్కు శాపం.. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు రూ.100 కోట్ల రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ప్రయోజనంలేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైనింగ్ వాల్ పనులను నిలిపివేశారు. రిటైనింగ్ వాల్ పనులు పూర్తికాకపోవడంతో తాజాగా వరదలు రావడంతో నీరు భగత్సింగ్్ కాలనీలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా ఇసుక బస్తాలు, మట్టి కట్టలు కట్టుతూ ఆ మేరకు నిధులు మెక్కుతున్నారు. 170 శాతం అంచనాలు పెంచి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రిటైనింగ్వాల్ నిర్మాణాన్ని విమర్శించిన టీడీపీ నేతలు అదే పనులకు గతంలో ఖరారైన రూ.100 కోట్ల మొత్తంపై 170 శాతం మేర అంచనాలు పెంచి రూ.270 కోట్లకు టెండర్ ఖరారు చేసేందుకు జలవనరుల శాఖాధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపారని విశ్వసనీయ సమాచారం. గత ప్రభుత్వం రూ.100 కోట్లతో పూర్తి చేసేందుకు టెండర్లు ఖరారు చేస్తే.. రూ.270 కోట్లకు అంచనాలను పెంచడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెల్లుతున్నాయి. ఆగిపోయిన రిటైనింగ్వాల్ పనులు పెన్నానదికి వరదలు వచ్చిన ప్రతీసారి నదికి ఆనుకుని ఉన్న భగత్సింగ్కాలనీ జలమయమయ్యేది. ఇళ్లు, సామగ్రి అంతా నీటిలో కొట్టుకుపోయేవి. కానీ గతంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల వరదనీరు భగత్సింగ్కాలనీకు వచ్చే ప్రమాదం తప్పింది. దీంతో ని శ్చింతంగా ఉన్నాం. ఆ గోడే లేకపోతే మళ్లీ భగత్సింగ్కాలనీ జలమయమయ్యేది. వరద ఇంతకంటే పెరిగితే నీరొచ్చే అవకాశం ఉంది. – సుజాత, స్థానికురాలు మరలా జలమయమయ్యేది -
వీరి చలపతికి జ్యుడీషియల్ రిమాండ్
నెల్లూరు (లీగల్): అక్రమ కేసులో నిందితులుగా ఉన్న డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతితోపాటు బొచ్చు దాసు, అనపల్లి ఉదయభాస్కర్, వీరి సురేష్, పానేటి శ్రీకాంత్లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కొడవలూరు మండలం రాజుపాళెంకు చెందిన కరకటి మల్లికార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్బెయిలబుల్ సెక్షన్లతో నమోదు చేశారు. ఆదివారం నెల్లూరులోని ఇన్చార్జి కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. పోలీసుల తరఫున ఏపీపీలు లీలావతి, సుకన్య వాదనలు వినిపించారు. చలపతిరావు తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి. ఉమామహేశ్వర్రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, 2023లో ఫిర్యాదు ఇచ్చాడని, అయితే 20.09.2025లో పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తే ఇది పూర్తిగా రాజకీయ కక్షతో బనాయించారంటూ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి పోలీసులు నమోదు చేసిన సెక్షన్లలో 120(బీ) ఐపీసీని తొలగించి ఐదుగురికి అక్టోబర్ 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాలని ఉత్తర్వులిచ్చారు. -
సోమశిలకు 37,750 క్యూసెక్కుల వరద
సోమశిల: జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 37,750 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. పెన్నానదికి 34,978 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 280, కండలేరుకు 10,450 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 72.574 టీయంసీల నీరు నిల్వ ఉంది. 55వేల క్యూసెక్కుల విడుదల సంగం: సోమశిల నుంచి సంగం బ్యారేజ్కు భారీగా వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు సంగం బ్యారేజ్ 50 గేట్లు ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నాలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా జలకళను సంతరించుకున్న సంగం బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది. నేటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన పాఠశాలలకు సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అన్ని యాజమాన్యాలు పాటించాలన్నారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు రామాయపట్నం పోర్టుకు కాకాణి కందుకూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్ మంగళవారం పరిశీలించనున్నారు. గత ప్రభుత్వ హయంలో ప్రారంభమైన రామాయపట్నం పోర్టు పనులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది. గతేడాది కాలంగా రామాయపట్నం పోర్టు పనులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో పనుల పురోగతిని పరిశీలించేందుకు కాకాణి పోర్టు నిర్మాణ ప్రాంతానికి రానున్నారు. -
మహిళ మెడలో చైన్ అపహరణ
పొదలకూరు: మహిళ మెడలో చైన్ను ఆగంతకులు లాక్కెళ్లిన ఘటన మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నరసింహకండ్రికలోని మెయిన్ రోడ్డు వద్ద ప్రొవిజన్స్ షాపును గ్రామానికి చెందిన బొగ్గల వెంగమ్మ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమశిల – పొదలకూరు మార్గంలోని దుకాణం వద్దకు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇద్దరు వచ్చి బైక్ను నిలిపారు. వీరిలో ఒకరు దుకాణం వద్దకెళ్లి చిప్స్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును తెంపుకెళ్లాడు. పెనుగులాటలో కొంత తెగిపోయి ఆమె చేతికొచ్చింది. ఆపై అక్కడే సిద్ధంగా ఉన్న బైక్పై పొదలకూరు వైపు ఉడాయించారు. సరుడు విలువ రూ.మూడు లక్షలుంటుంది. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొరుటూరులో చోరీ ● రూ.ఐదు లక్షల అపహరణ ఇందుకూరుపేట: ఇంట్లోని వస్తువులను దహనం చేయడంతో పాటు నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన మండలంలోని కొరుటూరులో చోటుచేసుకుంది. ఎస్సై నాగార్జునరెడ్డి వివరాల మేరకు.. ఏలూరుకు చెందిన రామకృష్ణ కొరుటూరులో చేపల గుంతలను తీసుకొని చేప పిల్లల వ్యాపారాన్ని సాగిస్తూ ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో పని నిమిత్తం నెల్లూరుకు శనివారం ఉదయం వెళ్లారు. తిరిగి రాత్రొచ్చేసరికి ఇంట్లోని వస్తువులు దహనమవుతుండటాన్ని గమనించారు. హుటాహుటిన లోపలికెళ్లి చూడగా, బియ్యం డ్రమ్ములో దాచి ఉంచిన రూ.ఐదు లక్షలు అపహరణకు గురై ఉన్నాయి. నగదును చోరీ చేసి ఇంట్లోని వస్తువులకు నిప్పు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి ఎస్సై చేరుకొని వివరాలను ఆరాతీశారు. ఆధారాలను క్లూస్టీమ్ సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శవమై తేలిన ఇంజినీర్ ● కర్నూలు జిల్లాలో ఘటన ● మృతుడు ఆత్మకూరు వాసి కోడుమూరు రూరల్: కర్నూలు జిల్లా గూడూ రు మండలంలోని సుంకేసుల డ్యామ్ వద్ద సైట్ ఇంజినీర్గా పనిచేస్తూ కనిపించకుండాపోయిన విజయ్కుమార్ (27) మృతదేహం ఆదివారం లభ్యమైంది. కర్నూలు నగరంలోని స్టాంటన్పురం కొట్టాల వద్ద ఉన్న కేసీ కెనాల్లో ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో తాలుకా అర్బన్ పోలీసులు ఒడ్డుకు చేర్చి పరిశీలించారు. గూడూరు పీఎస్లో ఆచూకీ లేకుండా పోయిన సైట్ ఇంజినీర్గా గుర్తించారు. ఆత్మకూరు మండలం గండ్లవేడుకు చెందిన విజయకుమార్ సుంకేసుల డ్యామ్ వద్ద కేఎల్ఎస్సార్ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్లో సైట్ ఇంజినీర్గా పనిచేస్తూ ఈ నెల 17 నుంచి కనిపించడంలేదంటూ పోలీసులకు మేనమామ నాగేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలిస్తున్న వేళ మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు. వ్యక్తిపై దాడి నెల్లూరు(క్రైమ్): తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఓ వ్యక్తిపై కొందరు దాడి చేసి గాయపర్చారు. పోలీసుల సమాచారం మేరకు.. కొత్తూరులో నివాసం ఉంటున్న రాజేంద్ర సంతోష్కుమార్ ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రామకోటయ్యనగర్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో స్నేహితుడు మీరాతో ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి మాట్లాడుతుండగా.. నిప్పో సెంటర్కు చెందిన కిట్టు, స్నేహితులు టింకూ, చందు, మహేష్, నవీన్ అక్కడికొచ్చి గొడవకు దిగారు. దీంతో పోలీసులకు రాజేంద్ర ఫోన్ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీన్ని మనస్సులో పెట్టుకొని రాజేంద్ర ఇంటి వద్దకు కిట్టు, టింకూ, చందు మహేష్, నవీన్ ఈ నెల 12న వెళ్లి.. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ దాడి చేశారు. చుట్టుపక్కల వారు రావడంతో నిందితులు పరారయ్యారు. ఈ మేరకు వేదాయపాళెం పోలీసులకు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో టింకూ రౌడీషీ టరని పోలీసులు చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రిలో గర్భశోకం
ఉదయగిరి: తొలి ప్రసవం కోసం పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళకు గర్భశోకమే మిగిలింది. వైద్యంలో నిర్లక్ష్యమే నవజాత శిశువు మృతికి కారణమంటూ బాధితురాలి బంధువులు ఉదయగిరి సీహెచ్సీ ఎదుట ఆందోళనను చేపట్టారు. పోలీసులు, బాధిత మహిళ బంధువుల వివరాల మేరకు.. సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన మంజుల పురిటి నొప్పులతో ఉదయగిరిలోని ప్రభుత్వాస్పత్రికి 108లో శనివారం ఉదయం వచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ప్రశాంత్ ఆమె పరిస్థితిని గమనించి.. ఇక్కడ సరైన వసతుల్లేని కారణంగా ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి పంపుతామని చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు గానూ 108 కోసం నిరీక్షించసాగారు. ఈ తరుణంలో గైనకాలజిస్ట్ ఠాగూర్ తాను కాన్పు చేస్తానని.. ఎక్కడికీ వెళ్లొద్దని సూచించారు. ఆపై వైద్యాన్ని ప్రారంభించి నర్సుకు సూచనలు చేశారు. ఈ తరుణంలో డీసీహెచ్ మృదులతో సమావేశ ఏర్పాటు, ఇతర కార్యక్రమాలతో ఆయన పట్టించుకోలేదు. పరిస్థితిని నర్సులు గమనిస్తూ వైద్యుడికి సమాచారమిచ్చినా, పెద్దగా స్పందించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమెను వైద్యుడు పరీక్షించి మరో ఐదు గంటల్లో ప్రసవమవుతుందని చెప్పి వెళ్లిపోయారు. అప్పటికే ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నా, పట్టించుకోలేదు. నొప్పులు తీవ్రం కావడంతో ఆస్పత్రిలోని ఓ గదిలో పడుకున్న వైద్యుడు ఠాగూర్ను సిబ్బంది లేపేందుకు యత్నించినా, తలుపును తీయలేదు. పరిస్థితి విషమంగా మారడంతో డ్యూటీ నర్సు అతికష్టంపై అర్ధరాత్రి 12.16 సమయంలో కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించినా, చలనం లేకపోవడంతో తీవ్రతను గమనించారు. ఠాగూర్ ఉన్న గది వద్దకెళ్లి తలుపు తట్టినా లేవకపోవడంతో కేకలేయడంతో ఎట్టకేలకు వచ్చారు. బిడ్డకు సీపీఆర్ చేసినా ఫలితం కానరాలేదు. దీంతో బంధువులను పిలిచి వెంటనే నెల్లూరు తీసుకెళ్లాలని సూచించారు. 108లో పంపేందుకు యత్నిస్తుండగా, బిడ్డలో చలనం లేదని, శ్వాస పూర్తిగా ఆగిపోయిందనే అంశాన్ని నిర్ధారించారు. దీంతో తల్లి రోదనకు అంతులేకుండా పోయింది. ఠాగూర్ నిర్లక్ష్యంతోనే బిడ్డను కోల్పోయామంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటన స్థలానికి ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకొని బంధువులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. వైద్యుడిపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైద్యుడు ఠాగూర్ మాట్లాడుతూ.. సాధారణ కాన్పు కోసం యత్నించానని, ఇలాంటి పరిస్థితి అరుదుగా ఉంటుందని.. బాధితులు అర్థం చేసుకోవాలని కోరారు. కాగా సదరు వైద్యుడిపై గతంలోనూ పలు వివాదాలున్నాయి. కన్నీరుమున్నీరైన తల్లి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన ఉదయగిరి సీహెచ్సీలో ఘటన -
యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
● ప్రైవేట్ పాఠశాల, ఇతర స్థలాలకు తరలింపు ● సెలవు దినాల్లో రెచ్చిపోతున్న మాఫియా కలిగిరి: మండలంలోని నాగిరెడ్డిపాళెం చెరువు, వాగు నుంచి గ్రావెల్ తవ్వకాలను జోరుగా ఆదివారం చేపట్టారు. సెలవు దినం కావడంతో మాఫియా రెచ్చిపోయింది. తవ్వకాలు జరుపుతున్న సమయంలో సంబంఽధిత అధికారులకు సమాచారమివ్వడంలేదు. కొందరి అండ చూసుకొని తమ పనిని కానిచ్చి జేబులు నింపుకొంటున్నారు. నాగిరెడ్డిపాళెం నుంచి కలిగిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాల, ఇతర స్థలాలకు జేసీబీ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని భారీగా తరలించారు. మీడియా ద్వారా విషయం బయటకు పొక్కడంతో పోలీసులు, ఇరిగేషన్ అధికారులు నిలిపేయించారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ శ్రీనాథ్ మాట్లాడారు. చెరువు, వాగు నుంచి మట్టిని తరలించిన వారిపై కేసును సోమవారం పెడతామని చెప్పారు. సూత్రధారులు, వాహనాలపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కాగా ఎలాంటి అనుమతుల్లేకుండా జాతీయ రహదారిపై ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ను తరలిస్తున్నారంటే మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. సెలవు దినాల్లో అధికారులు స్థానికంగా ఉండకపోవడాన్ని అదునుగా భావించి తమ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. -
ఘనంగా చిన్న గంధ మహోత్సవం
వెంకటాచలం: మండలంలోని కసుమూరులో మస్తాన్వలీ దర్గా చిన్న గంధ మహోత్సవాన్ని శనివారం నిర్వహించారు. చందన్ మహల్ నుంచి గంధాన్ని ఉదయం తొమ్మిదింటికి మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. దర్గా ప్రాంగణానికి 11 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా మస్తాన్వలీ సమాధి వద్ద తహలీల్ ఫాతేహాను కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ నిర్వహించారు. తదుపరి సమాధికి గంధాన్ని పూశారు. భక్తులకు పంపిణీ చేశారు. దీంతో గంధ మహోత్సవాలు ముగిశాయి. భక్తిశ్రద్ధలతో తహలీల్ ఫాతేహా అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గంధ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా తహలీల్ ఫాతేహాను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తస్బీని ప్రదర్శించారు. అనంతరం కానుకలను భక్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలను దర్గా సజ్జదా హఫీజ్ పాషా నిర్వహించారు. తస్బీని చూసేందుకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గంధ మహోత్సవం ముగిసింది. వక్ఫ్బోర్డు ఈఓ మహమ్మద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఆలయ తొలగింపునకు యత్నం ● స్థానికులు.. అధికారుల మధ్య వాగ్వాదం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఆక్రమణల తొలగింపులో భాగంగా పట్టణంలోని ముంబై రహదారిపై కేఎం హాస్పిటల్ వద్ద చెంగాళమ్మ ఆలయాన్ని తొలగించే విషయమై స్థానికులు, నగర పంచాయతీ అధికారుల మధ్య వివాదం చెలరేగింది. ఆలయాన్ని తొలగించేందుకు వీల్లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బాలకృష్ణ, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై సంతోష్రెడ్డి చేరుకొని వీరితో చర్చించారు. 20 ఏళ్లుగా ఉన్న ఆలయాన్ని తొలగించడం తగదని చెప్పారు. కాగా మరో ప్రదేశంలో ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
సోమిరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరురూరల్: మరుపూరు గ్రామంలోని మా సొంత తోటలో పెరిగిన వంద టేకు చెట్లను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరులు అక్రమంగా నరికి తీసుకెళ్లారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి కోరారు. 45వ డివిజన్ పొగతోటలో శనివారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. టేకుచెట్ల నరికివేతపై సోమిరెడ్డితో మాట్లాడితే పోలీస్స్టేషన్కు వెళ్లి కేసు పెట్టమని చెప్పారన్నారు. కానీ పొదలకూరు పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ఎస్పీ కూడా వినతి పత్రం అందచేసినట్లు తెలిపారు. ఎస్పీ విచారించాలని సీఐకి రెఫర్ చేస్తే, ఎస్సై మాటలు విని మా భూమి పత్రాన్ని తీసుకొని రిజర్వు ఫారెస్ట్గా చూపిస్తానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించారని వాపోయారు. ఓ క్రిమినల్ కేసును సివిల్ కేసుగా చూపించారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అసలు దొంగలను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. -
శాస్త్రోక్తంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ఊంజల్సేవ, ఉదయం శ్రీవారి కల్యాణం నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలోకి తీసుకొచ్చి తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నిత్యకల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. -
ఉపాధి సిబ్బంది తీరే వేరయా..
● మొన్న పరస్పర దూషణలు ● తాజాగా కార్యాలయాన్ని తెరిచే వెళ్లిన వైనం దుత్తలూరు: దుత్తలూరులో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది తీరు వివాదాస్పదమవుతోంది. వరుస వివాదాల్లో చిక్కుకున్నా, వీరి ప్రవర్తనలో మార్పు రాకపోగా, శ్రుతి మరింత తప్పుతోంది. రెండు రోజుల క్రితం ఇద్దరు సిబ్బంది పరస్పరం దూషించుకొని రచ్చకెక్కగా, తాజాగా వీరి నిర్లక్ష్యం మరొకటి బయపటడింది. ఆఫీస్కు శుక్రవారం వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది.. కార్యాలయ తెలుపులు తెరిచారు. అనంతరం ఏపీడీ మృదుల విచారణ నిమిత్తం వీరందరూ కావలి వెళ్లారు. అయితే తిరిగి వీరు కార్యాలయానికి రాలేదు. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కార్యాలయ తలుపులు తెరిచే దర్శనమిచ్చాయి. విలువైన కంప్యూటర్లు, పలు రకాల ఫైళ్లు, సామగ్రి ఉందనే కనీస స్పృహ వీరికి కరువైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అనే చందంగా పరిస్థితి మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయమై ఏపీడీని సంప్రదించగా, తనకు విషయం తెలియదని, కార్యాలయంలో ఎలాంటి సామగ్రి, రికార్డులు పోయినా ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
అంతా నా ఇష్టం
కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు అధికారులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా దేవదాయశాఖలో అధికారులు వారు చెప్పిందే వేదంగా అమలవుతోంది. భక్తులను నిలువుదోపిడీ చేయడమే కాకుండా వారి మనోభావాలను సైతం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. కానుకల లెక్కింపులోనూ అవకతవకలు పూర్వం నుంచి హుండీ కానుకల లెక్కింపు ప్రత్యేకాధికారి సమక్షంలో ఆలయ సిబ్బంది ద్వారా లెక్కించి వచ్చిన ఆదాయాన్ని మీడియాకు తెలిపేవారు. అలాగే వచ్చిన విదేశీ కరెన్సీ, బంగారం, వెండి, నగదు బ్యాంక్లో జమ చేసేవారు. ఆగస్టు 3వ తేదీన జరిగిన హుండీ లెక్కింపులో భాగంగా మీడియాకు విదేశీ కరెన్సీ గురించి ఎలాంటి సమాచారం లేకుండా గోప్యంగా లెక్కింపు చేయడంపై అనేక అనుమానాలు తెరతీశాయి. వలేటివారిపాలెం: మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ పనితీరు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ప్రతి శనివారం ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాలకొండ దేవస్థానంలో భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది. కాగా ప్రత్యేక దర్శనానికి గతంలో రూ.100 టికెట్ ఉండేది. అలాగే భక్తులకు గర్భగుడిలో పూజలు చేసేవారు. ప్రస్తుతం ఉన్న డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక దర్శనం టికెట్ ఎప్పుడూ లేనివిధంగా రూ.500కు పెంచేశారు. అంతేకాకుండా గర్భగుడిలో ఎలాంటి పూజలు చేయకుండా కేవలం శఠగోపం పెట్టి పంపిస్తున్నారు. భక్తులు ఎక్కవగా ఉండటం వల్ల ఇలా చేయాల్సి వస్తోందనే సమాధానాలు ఇస్తున్నారు. దీనిపై హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు డిప్యూటీ కమిషనర్ను ప్రశ్నించగా.. మా దేవాలయంలో దర్శనాలు ఇలాగే ఉంటాయని చెప్పి పంపించారు. బహిరంగ ప్రదేశాల్లో టెంకాయలు కొట్టాలట పూర్వం నుంచి దర్శనానికి వచ్చిన భక్తులు గర్భగుడి ప్రవేశంలో ఉన్న మొదటి ద్వారం దగ్గర టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకునేవారు. ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ గర్భగుడిలో టెంకాయలు కొట్టనివ్వకుండా గుడి బయట ప్రదేశాల్లో కొట్టమని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా టెంకాయ చిప్పలు పొగు చేసుకునే వ్యక్తి తాను టెండర్ వేసుకున్నానని, ఇలా బహిరంగ ప్రదేశాల్లో టెంకాయలు కొట్టనివ్వడం వల్ల తనకు నష్టం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ను అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ నీకు ఇష్టం ఉంటే చిప్పలు పొగు చేసుకో.. లేకుంటే మానేసేయ్ అని సమాధానం ఇవ్వడంతో అతను నివ్వెరపోయాడు. కొందరికే జరిమానా ఆలయంలో తొమ్మిది షాపులు ఉండగా నిబంధనల మేరకు వ్యాపారం చేసుకోవాలి. ధరలు పెంచితే ఆ షాపు మీద జరిమానాలు వేయాలి. అయితే ఆలయంలో ఉన్న ప్రతి షాపులో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. అదే విధంగా చెప్పులు స్టాండ్ వారు అధికంగా వసూలు చేస్తున్నారని డిప్యూటీ కమిషనర్ కేవలం ఆయా షాపు వారి మీద రూ.10 వేల జరిమానా వేసి మిగతా షాపులకు జరిమానా వేయకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఆలయ సిబ్బంది అవస్థలు గత మూడు నెలల నుంచి ఆలయంలో పనిచేసే అర్చకులు, శాశ్వత, ఒప్పంద సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. దీని గురించి డిప్యూటీ కమిషనర్ను అడిగితే సిబ్బంది భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంప్రదిస్తే వెటకారంగా సమాధానం ఈ విషయాలపై డిప్యూటీ కమిషనర్ను సాక్షి సంప్రదించగా దీనిపై మీకు వచ్చిన ఇబ్బందులు ఏమిటని ఎదురు ప్రశ్నలు వేశారు. నీకు అంతగా వివరణ కావాలంటే దేవస్థానం సమయం అయ్యాక తన ఆఫిస్కు వస్తే వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని వెటకారంగా సమాధానమిచ్చారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీ కమిషనర్ తీరు ప్రత్యేక దర్శన టికెట్ రూ.100 నుంచి రూ.500 పెంపు మూడు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవ్ మాలకొండ దేవస్థానంలో ఇదీ పరిస్థితి -
ఏ సమయంలోనైనా 40 వేల క్యూసెక్కుల విడుదల
సోమశిల: సోమశిల జలాశయం నుంచి ఏ సమయంలోనైనా పెన్నాకు 40 వేల క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయనున్నామని ఈఈ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఎగువ ప్రాంతంలోని ఆదినిమ్మాయిపల్లి రెగ్యులేటర్ నుంచి సుమారు 60 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందని చెప్పారు. ఈ క్రమంలో నీటిని విడుదల చేయనున్నామన్నారు. 73.689 టీఎంసీల నీరు జలాశయంలో శనివారం సాయంత్రానికి 73.689 టీయంసీల నీరు నిల్వ ఉంది. పెన్నాకు 38,950, ఉత్తర కాలువకు 350, కండలేరు కాలువకు 10,450 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయంలో 99.993 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తంగా ఉండాలి నెల్లూరు సిటీ: పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ అనూష ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయమై డివిజన్లోని తహసీల్దార్లను అప్రమత్తం చేశామని వివరించారు. ఆటోల్లో మైక్ల ద్వారా ప్రజలకు సమాచారమిచ్చామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
నూతన జేసీగా వెంకటేశ్వర్లు
నెల్లూరు(అర్బన్): నూతన జేసీగా మొగిలి వెంకటేశ్వర్లును నియమిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం జారీ చేసింది. ఇప్పటి వరకు పనిచేస్తున్న కొల్లాబత్తుల కార్తీక్ను బదిలీ చేసింది. 13 నెలల పాటు జిల్లాలో పనిచేసిన ఆయన పాలనలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఆయనకు ఇంకా ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు సెలవులో ఉండి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వెంకటేశ్వర్లు జేసీగా నియమితులయ్యారు. 2014 – 15లో బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్గా, రాష్ట్ర సచివాలయ అధికారిగా, కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఈయన పనిచేశారు. -
కూటమి వైఫల్యాలను ఎండగట్టాలి
● వైఎస్సార్సీపీ నేతలతో ప్రసన్న ఆత్మీయ సమావేశం కొడవలూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నార్తురాజుపాళెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావుతో కలిసి ఆయన పార్టీ నేతలతో శనివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధి విధానాలు, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బట్టేపాటి నరేంద్రరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్లు బి.సుప్రియ, ఎన్.కామాక్షి, ఎం.రంగారెడ్డి, నాయకులు ఎ.మోహనకృష్ణ, కొట్టే మల్లికార్జున, పి.సుభాష్రెడ్డి, బాలశంకర్రెడ్డి, ఎం.మల్లికార్జున, కె.మోహన్రావు, జి.జనార్ధన్రెడ్డి, బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ దొంగల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): సెల్ఫోన్ చోరీ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో ఓ బాలుడిని జువైనల్ హోమ్కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు లక్ష్మీపురంలో సురేంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆయన శుక్రవారం తన భార్యను బసెక్కించేందుకు ఆత్మకూరు బస్టాండ్కు వచ్చారు. ఈ క్రమంలో అతని జేబులోని రూ.40 వేలు విలువ చేసే సెల్ఫోన్ను గుర్తుతెలియని దుండగులు అపహరించుకుని వెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి సాంకేతికత ఆధారంగా శనివారం నిందితులు అనకాపల్లి పట్టణానికి చెందిన బి.సతీష్, మరో పదిహేనేళ్ల బాలుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సతీష్ను అరెస్ట్ చేయగా, బాలుడిని తిరుపతిలోని జువైనల్ హోమ్కు తరలించారు.