breaking news
SPSR Nellore
-
వైఎస్సార్ జయంతి సందర్భంగా..
● నెల్లూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు నెల్లూరు(స్టోన్హౌస్పేట): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ పార్టీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నాయకులు, యువజన విభాగం నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడని చెప్పారు. -
స్వర్ణాల సంబరం
జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువునెల్లూరు(బారకాసు): నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బారాషహీద్లకు లేపనం చేసిన గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం వరాల రొట్టెలు అందుకునేందుకు వచ్చిన వారితో స్వర్ణాల ఘాట్ కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో మంగళవారం నెల్లూరులోని అన్ని రోడ్లు నిండిపోయాయి. స్వర్ణాల ఘాట్లు కిటకిట రొట్టెల పండగలో ముఖ్యమైన గంధ మహోత్సవం ముగియడంతో భక్తుల తాకిడి పెరిగింది. దర్గాలో బారాషహీద్లను దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. మూడోరోజు కూడా దర్గా ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్యశాఖతోపాటు పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు దర్గా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాయి. వరాల రొట్టెకు డిమాండ్ స్వర్ణాల తీరంలో పలు రొట్టెలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఉద్యోగం, వివాహం, సంతాన రొట్టెల కోసం గంటల కొద్దీ భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. అధిక మంది ఆయా రొట్టెలను పట్టుకునేందుకు ఘాట్ వద్ద పోటీ పడ్డారు. అలాగే ధన, ప్రమోషన్, చదువు, సౌభాగ్య, విదేశీయాన తదితర రొట్టెలకు కూడా డిమాండ్ ఉంది.ఆధ్యాత్మిక శోభ నెల్లూరు(బృందావనం): మతసామరస్యానికి ప్రతీకగా సింహపురి వేదికగా జరుగుతున్న రొట్టెల పండగ సందర్భంగా బారాషహీద్ దర్గా వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన బారాషహీద్ల గంధ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విద్యుద్దీప కాంతుల్లో దర్గా ప్రాంగణం శోభిల్లుతుంటే మరోవైపు బారాషహీద్ల దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. ప్రాంగణంలో ఏర్పాటైన వివిధ రకాల దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. ఐదురోజుల రొట్టెల పండగలో బుధవారం సంప్రదాయంగా బారాషహీద్లను స్మరిస్తూ ‘తహలీల్ ఫాతేహ’ (చదివింపులు) నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. గురువారం ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఐదురోజులు పండగను జయప్రదం చేసిన అధికార యంత్రాంగానికి అభినందన కార్యక్రమం జరగనుంది. రొట్టెల పండగకు మూడోరోజూ పోటెత్తిన భక్తులు దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షణ -
రేషన్ షాపుల్లో బినామీల బాగోతం
నెల్లూరు(పొగతోట): చౌకదుకాణాల డీలర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బినామీ పేర్లతో షాపులు నిర్వహిస్తూ పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో 1,513 చౌకదుకాణాలున్నాయి. ప్రతినెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు అందజేస్తున్నారు. 7.21 లక్షల మంది కార్డుదారులున్నారు. 338 చౌకదుకాణాలు స్వయం, సహాయక గ్రూపు మహిళల ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని బినామీ పేర్లతో మార్పులు చేసి సంవత్సరాల నుంచి డీలర్లు నిర్వహిస్తున్నారు. కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. చౌకదుకాణానికి సంబంధించి డీలర్ పేరు, ఐడీ మార్పు చేయాలంటే డీఎస్ఓ కార్యాలయం నుంచి ఫైల్ నిర్వహించాల్సి ఉంది. దీనికి సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. డీలర్ల మహత్యం, నిమిషాల వ్యవధిలో ఐడీ, ఫొటో మార్పులు జరిగిపోతున్నాయి. గతవారంలో నెల్లూరులోని 50వ నంబర్ దుకాణంలో ఫిర్యాదులు రావడంతో ఏఎస్ఓ అంకయ్య తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో డీలర్ యశోధ అనే మహిళకు బదులు పురుషుడి ఫొటో ఉంది. తనిఖీ అనంతరం యశోధ ఫొటో ప్రత్యక్షమైంది. మరుసటి రోజు డీఎస్ఓ విజయ్కుమార్ తనిఖీలకు వెళ్లగా మహిళ ఫొటో ఆన్లైన్లో దర్శనమిచ్చింది. అదే విధంగా నగరంలో పది దుకాణాలకు సంబంధించి ఫొటోల మార్పులు జరిగినట్లు సమాచారం. నిబంధనలతో పనిలేకుండా.. 6 ఏ కేసు, ఇతర అక్రమాలకు పాల్పడిన డీలర్లను సస్పెండ్ చేసి ఆ దుకాణాన్ని స్వయం సహాయక గ్రూపు మహిళకు నిర్వహించేందుకు అప్పగిస్తారు. మూడు నెలలు మాత్రమే వారి ఆధ్వర్యంలో నిర్వహణకు అవకాశం ఉంది. నిబంధనలకు పాతరేసిన డీలర్లు సంవత్సరాల తరబడి ఆయా దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో డీలర్ ఐడీ, ఫొటో మార్పునకు సంబంధించి డీఎస్ఓ కార్యాలయం నుంచి ఫైల్ నిర్వహించి వాటికి డీఎస్ఓ, జాయింట్ కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్ఐసీ అధికారులు ఆన్లైన్లో ఐడీ, ఫొటో మార్పు చేయాల్సి ఉంది. నెల్లూరు డీలర్ల మాయాజాలం, కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటంతో నిమిషాల వ్యవధిలో అవి మారిపోతున్నాయి. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో 338 దుకాణాల నిర్వహణ బినామీల పేర్లతో ఏళ్ల తరబడి కొనసాగింపు తనిఖీల తర్వాత మారిపోతున్న డీలర్ల ఫొటోలు పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకుంటాం చౌకదుకాణాల్లో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో డీలర్ల ఫొటో మార్పునకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికలు తెప్పించుకుంటాం. దానికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు ఆర్డీఓలు నోటిఫికేషన్ ఇచ్చి డీలర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – విజయ్కుమార్, డీఎస్ఓ -
ఆరోగ్య సమస్యలు తాళలేక..
● యువకుడి బలవన్మరణం నెల్లూరు(క్రైమ్): ఆరోగ్య సమస్యలు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. డ్రైవర్స్ కాలనీలో శైలజ, శివకోటాచారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మంజునాఽథ్ (25) కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను కొంతకాలంగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకుంటున్నా ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. రెండురోజుల క్రితం శైలజ, శివకోటాచారి చైన్నెలోని కుమార్తె ఇంటికెళ్లారు. మంజునాథ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సోమవారం జ్వరం కారణంగా అతను పనికి వెళ్లలేదు. శైలజ కుమారుడికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె పక్కింట్లో ఉంటున్న వినయ్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. అతను ఇంటికి వెళ్లిచూడగా మంజునాఽథ్ బెడ్రూమ్లోని ఫ్యాన్కు ఉరేసుకుని మృతిచెంది ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత తండ్రి శివకోటాచారి మంగళవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.చిన్నారులను సంరక్షించి.. నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా పోలీసు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం అర్ధరాత్రి భారీ బందోబస్తు నడుమ గంధ మహోత్సవం జరిగింది. కాగా తప్పిపోయిన 42 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్రైమ్ పార్టీ పోలీసులు ముగ్గురు జేబుదొంగల్ని అదుపులోకి తీసుకుని నగదు, బ్యాగ్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మంగళవారం ఏఎస్పీ సీహెచ్ సౌజన్య భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నెల్లూరు కాలువలో మృతదేహంనెల్లూరు సిటీ: నెల్లూరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండల పరిధిలోని జొన్నవాడ కూడలి వద్ద నెల్లూరు కాలువలో సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతను ఆరురోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 31.397 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 31.397 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,300, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం
కందుకూరు: కరేడు గ్రామ రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరేడు పరిధిలో 8,800 ఎకరాల భూములను తీసుకోవడంతోపాటు, 16 గ్రామాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించి 80 శాతం మంది గ్రామస్తులు ఆమోదిస్తేనే భూసేకరణ చేయాలనే నిబంధన ఉన్నా కనీసం రైతుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండో సోలార్ కంపెనీకి గతంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో భూములు కేటాయించారని, అయినా కూడా ఆ పరిశ్రమను ప్రస్తుతం కరేడు వైపు మార్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. దొనకొండ, పామూరు వద్ద నిమ్జ్కు కేటాయించిన భూములు అనేకం ఉన్నాయని వాటిల్లో ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు చెందిన వారికే ఉద్యోగాలా? పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారని, ఎటువంటి ఉద్యోగాలు రావడం లేదని శ్రీనివాసరావు అన్నారు. ఎక్కువ శాతం ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకు చెందిన వారికే దక్కుతున్నాయని, భూములు కోల్పోతున్న వారికి రావడం లేదన్నారు. ఇప్పటికే ఇండో సోలార్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,800 కోట్ల వరకు సబ్సిడీల రూపంలో వచ్చాయన్నారు. గతంలో కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నేడు దేశవ్యాప్త సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు బ్రోకర్లుగా మారి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని తీవ్రంగా శ్రీనివాసరావు విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు బుధవారం దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి, సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యుడు కె.అజయ్కుమార్, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ప్రాంతీయ కమిటీల కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, ఎస్ఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
విధ్వంసం వెనుక కుట్ర ఎవరిది
● మాజీమంత్రి ప్రసన్న ఇంట్లో టీడీపీ గూండాల విధ్వంసం దేనికి సంకేతం ● లోకేశ్ వచ్చి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన ● ఇటీవల కూటమి ప్రభుత్వంపై ప్రసన్న ఘాటైన విమర్శలు ● విమర్శలు చేశారని కిరాయి మూకల అరాచకం ● బూతులు మాట్లాడుతూ చంపేస్తామంటూ రౌడీమూకలు వీరంగం ● హుందా రాజకీయాల నుంచి గూండాయిజంపై సర్వత్రా విమర్శలు ● ప్రశ్నించినా.. విమర్శలు చేసినా భౌతిక దాడులు, అక్రమ కేసులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా.. సుదీర్ఘ రాజకీయ చరిత్రకు, హుందా సంస్కతికి పట్టం కట్టిన నేల. దశాబ్దాలుగా రాజకీయం అంటే హుందాతనానికి చిరునామాగా ఉండేది. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గూండాయిజం రాజకీయంగా మారిపోయింది. జిల్లాలో ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మేకపాటి వంటి కుటుంబాలు రాజకీయంగా విభిన్న అభిప్రాయాలతో ఉన్నా, వ్యక్తిగత విధ్వంసాలకు పాల్పడకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ముందుకు నడిచాయి. తమకంటూ వర్గాలను సొంతం చేసుకుని హుందా రాజకీయాలు నడిపించాయి. రాజకీయ క్షేత్రంలో ఎన్నెన్నో విమర్శలు చేసుకున్నప్పటికీ ప్రతి విమర్శలు కూడా అందుకునుగుణంగా సిద్ధాంత పరంగానే ఉండేవి. రాజకీయ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది గానీ, ఇళ్లపై దాడులు, గూండాయిజం ఎన్నడూ చోటు చేసుకోలేదు. కూటమి పాలనలో రాజకీయాల స్వభావమే మారిపోయింది. ఈ మార్పు తాజాగా మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాల దాడిలో స్పష్టంగా కనిపిస్తోంది. లోకేశ్ పర్యటన ముగిశాక కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం రాజకీయ కుట్రగా వైఎస్సార్సీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. హుందా రాజకీయాలపై గూండాయిజం ముసురు తాజాగా జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోయింది. రాజకీయంగా చేసిన విమర్శలపై అదే విధంగా తిప్పి కొట్టాల్సిన ప్రజాప్రతినిధులు సంయమనం కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి టీడీపీ కిరాయి గూండాలు సాగించిన విధ్వంస కాండ ఇందుకు అద్దం పడుతోంది. ప్రసన్నకుమార్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి పనులు చేశారు. అందులో ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వేను సైతం ప్రసన్నకుమార్రెడ్డి పట్టుబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ముదివర్తిపాళెం కాజ్వేను తమ ప్రభుత్వం నిర్మిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు సైతం ఈ ప్రాజెక్ట్ మంజూరుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో సహా మీడియాకు చూపించి ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అయితే.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అజ్ఞానంగా మాట్లాడాన్ని ఖండించారు. ఈ క్రమంలోనే సోమవారం కోవూరులోని ఓ కల్యాణ మండపంలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహాక కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసన్నకుమార్రెడ్డి తాను నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అవినీతికి పాల్పడలేదని, తనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. నిఖార్సు అయిన రాజకీయాలు చేయాలే కానీ, ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ చదవడం కాదంటూ ఘాటైన విమర్శలు చేశారు. చంపేస్తామంటూ రౌడీమూకలు వీరంగం ప్రసన్నకుమార్రెడ్డి, తన కుమారుడు రజత్కుమార్రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని ఆయన ఇంటికి సుమారు వంద మందికి పైగా రౌడీమూకలు మారణాయుధాలతో దౌర్జన్యంగా ప్రవేశించి విధ్వంసం సష్టించారు. ప్రసన్నకుమార్రెడ్డి.. మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మని విమర్శిస్తావా? నిన్ను చంపేస్తామంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఇళ్లంతా ధ్వంసం చేశారు. రౌడీమూకల ఆగడాలతో బెంబేలెత్తిన ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ బెడ్ రూమ్లో తలుపులు వేసుకోగా వాటిని సైతం పగుల గొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె బాత్ రూమ్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది. పోర్టికోలో ఉన్న బెంజ్ కారును దుండగులు ధ్వంసం చేశారు. ? ఇప్పటికే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో షాడో సీఎం లోకేశ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో సాగించిన పచ్చమూకల దాష్టీకం కుట్ర వెనుక కచ్చితంగా లోకేశ్ కుట్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రసన్నకుమార్రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న తీరుపై ఘాటుగానే విమర్శలు చేశారు. దీంతో ప్రసన్నకుమార్రెడ్డిని టార్గెట్ చేసిన లోకేశ్.. సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనలోనే విధ్వంస రచనకు ప్లాన్ గీశారని, ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలను అడ్డం పెట్టుకుని, ఆయన నెల్లూరు నుంచి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ రౌడీ మూకలు ఈ దాడులకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే విమర్శలకు బదులుగా వాదనలు గాకుండా, రౌడీ మూకల దాడులు చోటు చేసుకోవడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య భావనకు గండి పడుతోంది. విమర్శలు చేసిన నేతల ఇంటిపైనే దాడులు చేయడం దారుణమని, రాజకీయ విమర్శలను ఎదుర్కొనే సంస్కృతి క్రమంగా అంతరించిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మరణం లేని మహానేత వైఎస్సార్
ఘనంగా 76వ జయంతి నెల్లూరు (స్టోన్హౌస్పేట): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో మరణం లేని మహానేత అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకులు జిల్లా కేంద్రం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, కాకాణి పూజితతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, పూజిత, జంకె వెంకటరెడ్డి, మహిళా నేతలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆ మహానేత సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పక్కా ఇల్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖరరెడ్డి పేద బడుగు బలహీనవర్గ ప్రజలకు అందించారని తెలిపారు. రాజశేఖరరెడ్డి అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయన్ని దైవంగా కొలుస్తున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, జిల్లా అనుబంధ సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాకాణికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
నెల్లూరు (లీగల్): కనుపూరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరరించాలని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై వెంకటాచలం పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 4వ అదనపు మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని 9వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసికోవాలని తిరిగి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయనకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్తో కోర్టులో హాజరు పరచాలన్నారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్రెడ్డిని విచారణ జరపాలన్నారు. కాకాణిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వెంకటాచలం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై పోలీసులు తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఏడు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, మాలపాటి వెంకట విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో కేసు పెట్టారని, పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోవర్ధన్రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డీసీపల్లిలో 527 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం నాటికి 527 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 740 బేళ్లు రాగా 527 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. గరిష్టంగా కిలోకు రూ.280, కనిష్టంగా రూ.160 ధర లభించింది. సగటున రూ.202.37 ధర పలికింది. వేలంలో 10 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. నాణ్యతలేని పొగాకు తీసుకురావొద్దు మర్రిపాడు: ప్రస్తుతం మార్కెట్లో మొద్దు మచ్చలు, రెండో నంబరు, సైలెన్, బొగ్గులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని రకాల పొగాకు అమ్ముడు పోతుందని, నాణ్యత లేని పొగాకును తీసుకు రావొద్దని డీసీపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కసారి అమ్ముడుపోని బేళ్లను తిరిగి అవే బేళ్లను వేలానికి తీసుకురావొద్దని, వాటి స్థానంలో వేరొక బేళ్లు కట్టి వేలానికి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. పొగాకు బేళ్లు వేలానికి తీసుకుని వచ్చేటప్పుడు 1వ నంబరు పొగాకు సగం, రెండో నంబరు పొగాకు సగం ఉండేటట్లు తీసుకురావాలని సూచించారు. మొత్తం రెండో నంబరు తీసుకుని వస్తే పోటీ లేకుండా ఎక్కువ నోబిడ్స్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నేడు, రేపు రెవెన్యూ అసోసియేషన్ క్రీడలు నెల్లూరురూరల్: 10వ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ క్రీడా పోటీలు ఈ నెల 9, 10 తేదీల్లో బుజబుజ నెల్లూరులోని క్రికెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర స్టేడియంలో క్రికెట్ పోటీలు జరుగుతాయని మంగళవారం రెవెన్యూ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ ఓ ఆనంద్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. 18న జెడ్పీ సర్వసభ్య సమావేశం నెల్లూరు (పొగతోట): ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ మోహన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా విద్యాశాఖ, విద్యుత్ శాఖలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అధ్యక్షుల అనుమతితో ఇతర శాఖలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని కోరారు. -
దేవుడి దయతో బయట పడ్డా
నెల్లూరు (స్టోన్హౌస్పేట): దేవుడి దయతోనే బయట పడ్డానని, నన్ను అంతమొందించే కుట్ర చేశారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉందని, జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఇటువంటి సంప్రదాయం లేదన్నారు. సైద్ధాంతికంగానే తాము పోరాడామని గుర్తు చేశారు. మంగళవారం తన స్వగృహంలో ప్రసన్నకుమార్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తాను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కానీ, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని గాని వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారు. ఎన్నికల్లో విమర్శించుకున్నామని, విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవన్నారు. ప్రశాంతిరెడ్డి గురించి తాను ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదన్నారు. ఆమే తన గురించి చెడుగా మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. ఇటీవల ముదివర్తికి వెళ్లి నియోజకవర్గంలో ప్రసన్నకుమార్రెడ్డి ఒక తట్టకూడా మట్టి వేయలేదని, అన్ని తానే చేయించానని చెప్పి ప్రగల్భాలు పలికిందన్నారు. తాను ఏదో సంపాదించుకున్నానని, అవినీతి పరుడినని వ్యక్తిగతంగా దాడి చేశారన్నారు. ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చానే కానీ.. సోమవారం కోవూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో తాను ఇటీవల ఆమె మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చానే కానీ, ప్రత్యేకంగా విమర్శలు చేయలేదని ప్రసన్న స్పష్టం చేశారు. నేనన్న మాటలు వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికీ కూడా ఆ మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పింది నూటికి నూరు శాతం నిజమన్నారు. మీకు దమ్ము, ధైర్యముంటే నీవు, ప్రభాకర్రెడ్డి రండి ప్రెస్మీట్ పెట్టండి.. విమర్శలు చేయండి. మళ్లీ మేము కౌంటర్ ఇచ్చుకుంటామన్నారు. ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయి ఇలాంటి నీచ రాజకీయ సంస్కృతిని తీసుకురావడం గొప్పనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంట్లో తానుంటే చంపేసేవారని, ఆ దేవుడు తనను బయటకు పంపించాడన్నారు. ఈ రౌడీ మూకలు ఇల్లంతా ధ్వంసం చేశారని, 85 ఏళ్ల వయస్సులోని నా తల్లి ఇంట్లో ఉంటే ఆమెను బెదిరించారన్నారు. పనివాళ్లను ప్రాణభయానికి గురి చేశారన్నారు. ఇంటిని పగలగొట్టేశారు. బెడ్రూమ్, ఆఫీస్ సహా ధ్వంసం చేశారన్నారు. నన్ను అంతమొందించే కుట్ర ఇది 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి సంస్కృతి లేదు ఇలాంటి పరిణామాలు ప్రజాక్షేత్రంలో మంచిది కాదు రాజకీయంగా ఇలాంటివెప్పుడూ చూడలేదు రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శించడం సాధారణం. ఇలా ఇళ్లపై దాడులు జరగడం నేను ఇంత వరకు చూడలేదు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంట్లోకి చాలా మంది వచ్చారు. నన్ను మా వాచ్మెన్ రూమ్లో పెట్టాడు. అతన్ని బెదిరించారు. ఆమె ఎవరు అని అడిగితే పెద్దమ్మ అని చెప్పాడు. మా రూమ్లో కూడా వస్తువులు పగుల గొట్టారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలా చేస్తుందనుకోలేదు. – శ్రీలక్ష్మమ్మ, ప్రసన్నకుమార్రెడ్డి తల్లి -
తప్పుడు హామీలు.. బాబు మోసాలు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, చంద్రబాబు మోసాలపై ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్దామని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్లో మంగళవారం ఎంపీ మిఽథున్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తీరు మారలేదన్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెబుతూ ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు పెంచడం, కూటమి నేతలు సిండికేట్లుగా మారి ప్రజాధనాన్ని దోచుకుతినడం చూస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మోసపూరిత విధానాలను ఎండగడుతామన్నారు. 40 శాతం ఓటింగ్తో అత్యధిక జనాదరణ కలిగిన పార్టీగా వైఎస్సార్సీపీకి గుర్తింపు ఉందన్నారు. జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ క్యాడర్ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక కూటమి నేతలు జగన్మోహన్రెడ్డి పర్యటనలు అడ్డుకుంటున్నారన్నారు. ఇది ఎంతో కాలం చెల్లదని, కూటమి ప్రభుత్వానికి అర్థమయిందని, అందుకే జగన్మోహన్రెడ్డి పర్యటన అంటేనే భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీమంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకాణి పూజిత తదితరులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి -
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ హత్యకు పక్కా స్కెచ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ మూకలు బరి తెగించాయి. దాడి దృశ్యాలు, వ్యూహాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. నెల్లూరు నగరం నడిబొడ్డున గల నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి సోమవారం రాత్రి మారణాయుధాలతో టీడీపీ మూకలు, రౌడీలు, పాత నేరస్తులు అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ప్రసన్నకుమార్రెడ్డిని చంపేస్తామని కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు దాడి ఎంత భయంకరంగా జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ మూకలు, రౌడీలు ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పాల్పడ్డారు. అంతా కుట్ర ప్రకారమే ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి సమీపంలోపి బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ జరుగుతోంది. జనసందోహం భారీగా ఉండటంతో ఆ సమయంలో తాము ఏం చేసినా ఎవరూ గుర్తు పట్టే అవకాశం ఉండదని భావించిన టీడీపీ గూండాలు వాహనాల్లో పెద్దఎత్తున సుజాతమ్మ కాలనీకి చేరుకున్నారు. వాహనాలను దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి వచ్చారు. ఆయన ఇంట్లో లేరనే విషయం తెలిసి బీభత్సం సృష్టించారు. తొలుత దుండగులు ఇంటి ప్రధాన ద్వారంతోపాటు వెనుక వైపు ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించారు. కొందరు ఇంట్లోకి ప్రవేశించగా.. మిగిలిన వారు ఇంట్లోని వారిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు.దీనిని బట్టి చూస్తే ప్రసన్నకుమార్రెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు స్పష్టమవుతోంది. దాడి ఘటనపై ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం అర్ధరాత్రి అనుమానితుల పేర్లు ఉటంకిస్తూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని ఫిర్యాదు చేశారు. అనుమానితుల పేర్లు కూడా పోలీసులకు ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. పోలీసులొచ్చినా బెదరని మూకలు ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న దర్గామిట్ట పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిబయట ఉన్న దుండగులు పరుగులు తీయగా.. ఇంట్లో విధ్వంసం చేస్తున్న రౌడీమూకలు ఏ మాత్రం బెదరలేదు. దాడి పూర్తయ్యాక తాపీగా నడుచుకుంటూ బయటకు వెళ్లారు. పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉన్నా.. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. దాడిని ఆపేందుకు అవకాశం ఉన్నా ఆ పని కూడా చేయలేదు. పోలీసులు అక్కడే ఉన్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకే దాడి పూర్తయ్యే వరకూ కిమ్మనకుండా ఉండిపోయారు. ఘటనను తప్పుదోవ పట్టించేందుకు మరో కుట్ర దాడి ఘటనను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఆయన ఇంటిపై మహిళలు దాడి చేశారని, అభిమానులు దాడులు చేశారని, వారే దాడి చేసుకుని ఉండొచ్చనే ప్రచారానికి టీడీపీ నేతలు తెరతీశారు. తద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి.. అసలు వాస్తవాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికులు కొందరు దాడి దృశ్యాలను వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తమకేమీ తెలియదన్నట్టు, ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై అసలు దాడే జరగలేదు అన్నట్టు ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. ప్రసన్నకుమార్ హత్యకు టీడీపీ భారీ కుట్రటీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో బీభత్సం సృష్టించారు మాజీ మంత్రి అనిల్కుమార్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ రౌడీమూకలు భారీ కుట్ర పన్ని మారణాయుధాలతో ఆయన ఇంట్లోకి రాత్రివేళ చొరబడ్డారని మాజీ మంత్రి కె.అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో లేకపోవడంతో రెచ్చిపోయిన టీడీపీ మూకలు జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టించారన్నారు. సోమవారం రాత్రి ప్రసన్నకుమార్ ఇంటిపై జరిగిన దాడిపై ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన మాజీమంత్రులు అనిల్, ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయ్కుమార్రెడ్డి, పార్టీ నేత వీరి చలపతిరావు ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో పచ్చమూకలు దారుణ ఘటనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ మూకలు వెళ్లిన సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి తల్లి షాక్కు గురయ్యారని.. ఆమెకు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, దాడికి పాల్పడిన వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఎవరి ప్రోద్బలం ఉందో, ఎవరు పంపించారో అందరికీ తెలుసన్నారు. ప్రనన్నకుమార్ ద్వారా ఇంకేమి నిజాలు బయటకు వస్తాయోనని భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు. డబ్బుందన్న మదంతో డాన్లు కావాలని ఇలాంటి ఆగడాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల తీరుకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.నిజమే చెప్పాను.. వెనక్కి తగ్గను: ప్రసన్నకుమార్రెడ్డి మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అంతా నిజమే చెప్పానని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఏడాది కాలంలో ఇప్పటివరకు ఆమె చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆమె తనపై వ్యక్తిగత విమర్శ చేయడంతోనే నిజాన్ని ప్రజల ముందుంచానని చెప్పారు. మహిళలంటే తమకెంతో గౌరవం ఉందని, ఆమె తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే తాను ఆమె గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పానన్నారు. గంజాయి మత్తులో దాడి చేసిన వారిని, ఈ దాడులకు పురిగొల్పిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేశారు. -
‘విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా?’
నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిన ఎంపీ మిథున్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అప్రజాస్వామికమని మండిపడ్డారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు మిథున్రెడ్డి. ఈరోజు(మంగళవారం, జూలై 8వ తేదీ) ప్రసన్న కుమార్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు మిథున్రెడ్డి. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఏ వస్తువును వదిలిపెట్టలేదని,. ఈ విషయంలో పోలీస్ శాఖ స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. రెడ్ బుక్ ఇవాళ అమలైతే.. తాము కూడా ఓ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్రెడ్డికి తమ నాయకుడు వైఎస్ జగన్తో పాటు పార్టీ క్యాడర్ కూడా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
‘దాడిపై నిన్న నే ఫిర్యాదు చేశాం.. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు’
నెల్లూరు: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ ఇంటిపై నిన్న(సోమవారం, జూలై7) రాత్రి సమయంలో దాడి జరిగితే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దానిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు(మంగళవారం, జూలై8) పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ప్రసన్నకుమార్తో పాటు అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, ఆనం విజయ్ కుమార్రెడ్డిలు ఎస్పీకి ఆఫీస్కు వెళ్లారు. దీనిలో భాగంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ దాడిపై నిన్ననే పిర్యాదు చేశాం. ఇప్పటి వరకూ పోలీసుల నుండి ఎలాంటి స్పందనా లేదు. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. ఇది ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం. విమర్శలలో ఏదైనా అభ్యంతరం వుంటే చట్టపరంగా వెళ్ళాలి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమి మాట్లాడాడు...?, వేమిరెడ్డిని జాగ్రత్తగా వుండాలి అని సూచించారు. రోజా పై టిడిపీ చేసిన వ్యాఖ్యలు ఏమైయ్యాయి.. ఒక మహిళ నేత, మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను వాడు వీడు అని మాట్లాడొచ్చా?, డబ్బుంది కాబట్టి డబ్బున్నోళ్లు అన్నాం.. దాంట్లో తప్పేముంది?, దాడిలో పాల్గొన్న వారితో పాటు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు కట్టాలి’ అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్ -
నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో పచ్చ మూకల దాడిపై ప్రసన్నకుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయనను కచ్చితంగా హత్య చేసేవారిని అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న రాత్రి నా నివాసం పై జరిగిన దాడి నన్ను హతమార్చడానికే అని అర్థమవుతోంది. నేను ఇంట్లో ఉండి ఉంటే నన్ను ఖచ్చితంగా చంపేసేవారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నా తల్లిని బెదిరించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చరిత్ర నెల్లూరు వాసులు అందరికీ తెలిసిన విషయమే. నేను చేసిన ప్రతీ వ్యాఖ్యకి కట్టుబడి ఉన్నాను. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఈ దాడి విషయంలో పోలీస్ శాఖ న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు లేదు. ఇటువంటి దాడులపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చుని పోవటం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..‘200 మంది అరాచక వ్యక్తులు ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించారు. కంటికి కనపడిన వస్తువులు అన్నింటినీ ధ్వంసం చేశారు. నీ కుమారుడు ఎక్కడ అంటూ నన్ను బెదిరించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో భయాందోళనకు గురయ్యాను. ఇలాంటి దాడులు ఏనాడు చూడలేదు. నా కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే అతన్ని చంపేసేవారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మారణాయుధాలతో దాడి..ఇదిలా ఉండగా.. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు.అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. -
కనికరం చూపండయ్యా..
● అధికారులకు అర్జీదారుల వినతి నెల్లూరు(అర్బన్): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అర్జీలను ఇస్తున్నామని.. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతో విసిగివేసారిపోయామని.. మీరైనా పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. అర్జీలను జేసీ కార్తీక్, డీఆర్వో హుస్సేన్సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, జెడ్పీ సీఈఓ మోహన్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి తదితరులు స్వీకరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిపి సుమారు 400 అర్జీలు అందాయి. సమస్యలను సకాలంలో పరిష్కరించాలి అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలు అందజేసే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఒకవేళ అలా కాకపోతే అందుకు గల కారణాలను తెలియజేయాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అధికారుల తప్పిదానికి సంక్షేమ పథకాలు కట్ చేపలు పట్టుకొని నేను, నా భార్య పోలమ్మ జీవిస్తున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వం గతంలో నిర్వహించిన హౌస్ హోల్డ్ సర్వేలో నా రేషన్ కార్డులో పోలమ్మ పేరును పోలయ్యగా వెబ్సైట్లో అధికారులు చూపారు. పోలయ్యకు ప్రభుత్వోద్యోగం ఉందంటూ రేషన్ కార్డులో ఐడీ నంబర్ను ఇచ్చారు. దీంతో సంక్షేమ పథకాలు రద్దు కావడంతో పాటు ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అధికారుల తప్పిదానికి బలయ్యాం. సచివాలయాలు.. తహసీల్దార్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. కలెక్టరేట్కు మూడుసార్లు వచ్చినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. – కునాసి వెంకటేశ్వర్లు, రవీంద్రాపురం, విడవలూరు మండలం పొదుపులో దాచుకున్న డబ్బును కాజేశారు రాష్ట్రంలోనే తొలిసారిగా పొదుపు మహిళల కోసం లేగుంటపాడులో ఏర్పాటు చేసిన బ్యాంక్లో నెలకు రూ 2500 చొప్పున అక్టోబర్, 2018 నుంచి చెల్లించా. దీని మెచ్యూర్టీ కింద గతేడాది మార్చిలో రూ 2.35 లక్షలు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని బ్యాంక్ సీఈఓ ప్రసాద్రెడ్డి చెల్లించలేదు. కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా, డీఆర్డీఏ అధికారులు, డీసీఓ కార్యాలయాధికారి నిర్మల విచారణ జరిపారు. దీంతో చెక్కును ఇవ్వగా, బ్యాంక్లో జమచేయగా బౌన్సయింది. అధికారులకు మరోసారి ఫిర్యాదు చేయగా, కోవూరు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎస్డీఎల్సీఓ సుభాషిణి విచారణ జరిపారు. నగదును మూడు రోజుల్లో ఇస్తానని మీడియా సమక్షంలో గత నెల 23న ప్రసాద్రెడ్డి చెప్పినా, నేటికీ ఇవ్వలేదు. – ఏలూరు సుజాతమ్మ, లేగుంటపాడు, కోవూరు మండలం విచారణలో అభిప్రాయం చెప్పడమే తప్పా..? భర్త దూరమయ్యారు. ఇద్దరు ఆడబిడ్డలు. రూ.13 వేల వేతనంతో ఏఎస్పేట పీహెచ్సీలో ఎఫ్ఎన్వోగా పనిచేస్తున్నా. డాక్టర్లు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు లక్ష్మికి జరిగిన వివాదంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. లక్ష్మిపై నా అభిప్రాయాన్ని తెలిపా. అయితే అనుకూలంగా అభిప్రాయం చెప్పలేదనే ఉద్దేశంతో లక్ష్మి తీవ్ర వేధింపులకు గురిచేశారు. చదువుకోనీయకుండా కెరీర్ను దెబ్బతీశారు. ఎలాంటి తప్పు లేకపోయినా నర్సు, డాక్టర్లతో పాటు నన్ను జొన్నవాడ పీహెచ్సీకి బదిలీ చేశారు. దీన్ని రద్దు చేయాలి. – దొరసానమ్మ, ఎఫ్ఎన్వో, ఏఎస్పేట పీహెచ్సీ -
మంత్రుల మధ్య మంటలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: షోడో సీఎం లోకేశ్ సమక్షంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరో మంత్రి నారాయణపై బహిరంగంగా విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థయిన వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభోత్సవ వేదికపై నుంచి ఆ పాఠశాలను మున్సిపల్ హైస్కూల్గా మార్పు చేయడంపై వచ్చిన మంత్రి లోకేశ్ సమక్షంలో తీవ్ర స్వరంతో దుయ్యబట్టారు. ఇదే పాఠశాలను మంత్రి నారాయణ కృషి, పట్టుదలతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారని లోకేశ్ ప్రశంసించారు. వాస్తవానికి నెల్లూరులో శతాబ్దాల కాలం నాటి చరిత్ర ఉన్న వీఆర్సీ విద్యాసంస్థలపై మంత్రి నారాయణ ఆధిపత్యం చెలాయించడం మరో మంత్రి రామనారాయణరెడ్డికి కంటగింపుగా మారింది. ఎన్నో ఏళ్లగా వీఆర్సీ విద్యాసంస్థల మేనేజ్మెంట్ కమిటీని ఆనం కుటుంబం హస్తగతం చేసుకొని పెత్తనం చెలాయిస్తోంది. తమ నుంచి తాజాగా మంత్రి నారాయణ లాక్కోవడం వారికి రుచించడం లేదు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే వీఆర్సీ విద్యా సంస్థలపై మంత్రి నారాయణ కన్ను పడింది. అప్పట్లోనే వీఆర్ జూనియర్ కాలేజ్ అంటూ పెత్తనం లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో మేనేజ్మెంట్ కమిటీపై న్యాయ స్థానంలో వ్యాజ్యం వేయించి రద్దు చేసేలా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ఈ వ్యవహారం మరుగున పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకతోనే మళ్లీ నారాయణ వీఆర్ విద్యాసంస్థలపై పెత్తనం ప్రారంభించారు. నారాయణ సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే అమరావతి రాజధానితోపాటు అల్లూరుకు చెందిన బడా కాంట్రాక్టర్ల కంపెనీల నుంచి దాదాపు రూ.15 కోట్ల సీఎస్సార్ ఫండ్స్ సేకరించి హైస్కూల్ను పునద్ధరణ చేయించారు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. నగర వాసుల్లో ఏదో అభివృద్ధి చేస్తున్నట్లు చూపిస్తూ వెనుక నుంచి వీఆర్సీ విద్యా సంస్థలను గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వాస్తవంగా న్యాయ స్థానంలో పెండింగ్లో ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మున్సిపల్ పరిధిలోకి చేర్చడం పెద్ద వివాదమే. చట్టవిరుద్ధంగా మంత్రి నారాయణ వీఆర్సీ విద్యాసంస్థల్ని మున్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చారు. ఎలాంటి తీర్మానాలు లేకుండానే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని మంత్రి నారాయణ కార్పొరేట్ సంస్థలాగా మార్చేశారు. ఆ హైస్కూల్లో అడ్మిషన్ల నుంచి టీచర్స్ సెలక్షన్ వరకు అన్నింట్లోనూ మంత్రి పెత్తనం చేయడాన్ని మంత్రి ఆనం సహించలేకపోయారు. దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్న సంస్థలను బలవంతంగా నారాయణ లాక్కోవడం రుచించలేదు. మంత్రి లోకేష్ సమక్షంలోనే మంత్రి నారాయణ తీరును ఎండ గట్టడం పెద్ద దుమారమే రేపింది. రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్న మంత్రి నారాయణ తన సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్ట లేదని మంత్రి ఆనం బహిరంగంగానే విమర్శలు చేయడంతోపాటు ముందు నీ సంస్థ నుంచి ఖర్చు పెట్టమని సలహా ఇవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది. నారాయణపై ‘ఆనం’ ఆగ్రహం వీఆర్ విద్యాసంస్థలపై ఆయన పెత్తనమేమిటి..? కార్పొరేట్ కంపెనీల సీఎస్సార్ ఫండ్తో అభివృద్ధి చేసి తనఖాతాలో వేసుకోవడంపై మండిపాటు మంత్రి సంస్థ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటూ ఘాటైన విమర్శలు మంత్రి లోకేశ్ సాక్షిగా బట్టబయలైన విభేదాలు -
రీ కౌన్సెలింగ్ వద్దంటూ ఆందోళన
నెల్లూరు(అర్బన్): సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న తమకు బదిలీల విషయంలో రీ కౌన్సెలింగ్ను నిర్వహించొద్దని గ్రేడ్ – 3 ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నాను సోమవారం నిర్వహించిన అనంతరం జేసీ కార్తీక్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రేడ్ – 3 ఏఎన్ఎం అసోసియేషన్ జిల్లా నేతలు జయలక్ష్మి, వాణి మాట్లాడారు. గ్రేడ్ – 3 నుంచి గ్రేడ్ – 2కు ఉద్యోగోన్నతి పొందిన ఏఎన్ఎంలు వారికి కేటాయించిన సబ్ సెంటర్లకు వెళ్లకుండా సచివాలయాల పరిధిలోనే ఉన్నారని చెప్పారు. సచివాలయాల పరిధిలో ఖాళీలు చూపొద్దని అధికారులను ఒత్తిడి చేసే సరికి, తమకు రీ కౌన్సెలింగ్ను నిర్వహించి వేరే మండలానికి కేటాయిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. ఇదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిని సబ్ సెంటర్లకు బదిలీ చేయాలని, అలా కాని పక్షంలో కౌన్సెలింగ్ను రద్దు చేసి తాము ఇప్పుడు పని చేస్తున్న ప్రదేశంలోనే ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రక్రియను తాము అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. -
కార్లు ఢీకొని.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి
● బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిని కబళించి దుత్తలూరు: కార్లు ఢీకొని.. బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని నందిపాడు కూడలిలో గల జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బండిపై గోలీ సోడాను విక్రయిస్తూ నందిపాడుకు చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు (54) జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఉదయగిరి వెళ్లేందుకు గానూ బస్సు కోసం నందిపాడు సెంటర్లో రోడ్డు మార్జిన్లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తిరుపతి వెళ్తున్న కారు ఉదయగిరి నుంచి సంగానికి వెళ్తున్న కారును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్వర్లు.. ఆపై గృహాలపైకి దూసుకెళ్లాయి. ప్రమాదంలో గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని విలపించారు. సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పోస్ట్మార్టం నిమి త్తం ఉదయగిరి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కార్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని ధనలక్ష్మీపురంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగ గౌరవాధ్యక్షురాలిగా సరోజిని, గౌరవ సలహాదారుగా లీలాకృష్ణ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, జనరల్ సెక్రటరీలుగా వెంకటరమణ, చేజర్ల సుధాకర్రావు, కోశాధికారిగా హరిప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్గా జయప్రకాష్, ఉపాధ్యక్షులుగా శివరామకృష్ణ, సయ్యద్ బేగం, మహ్మద్ రఫీ, వెంకటేశ్వర్లు, రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, సాదు వెంకటేశ్వర్లు, రమణ, వెంకటగిరిబాబు, భాస్కర్, కృష్ణమోహన్, మంగమ్మను ఎన్నుకున్నారు. పబ్లిసిటీ సెక్రటరీగా టాటాబాయ్, జాయింట్ సెక్రటరీలుగా అనూరాధ, పద్మావతి, సుమతి, సుబ్బలక్ష్మి, సీతామహలక్ష్మి, లక్ష్మీకుమారి, ధనలక్ష్మి, సునీత, మంగ, విజయకుమార్, అనిల్ ప్రేమ్కుమార్, తులసీదేవి ఎన్నికయ్యారు. అనంతరం వీరు ప్రమాణం చేశారు. -
అస్తవ్యస్తంగా బదిలీలు
నెల్లూరు (అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో పశుసంవర్థక శాఖలో సహాయకులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్ను జరపకుండా అస్తవ్యస్తం చేశారని పలువురు ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రాన్ని సోమవారం అందజేసిన అనంతరం ఏహెచ్ఏ శ్రీనివాసులు మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల్లో ఏహెచ్ఏలుగా ఆరేళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెల్లో వచ్చిందని, అయితే తమ శాఖలో కనీసం కౌన్సెలింగ్ జరగలేదన్నారు. ప్లేస్మెంట్ ఆప్షన్లనూ అడగలేదన్నారు. జిల్లా అధికారులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే దగ్గరగా బదిలీ చేశారని తెలిపారు. కొంత మందిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు సుమారు 200 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయని వారిని కూడా బదిలీ చేసి సీనియార్టీ ఉన్న వారికి అన్యాయం చేశారని, ప్రక్రియను రద్దు చేసి విచారణ జరపాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడిపై దాడి దగదర్తి: కట్టుబడిపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అక్కడే పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు ప్రమీల, ఆమె భర్త ప్రసాద్ సోమవారం దాడి చేశారు. వివరాలు.. ధ్రువీకరణ పత్రాల కోసం పాఠశాలకు ఆమె వచ్చారు. ఎల్పీసీ పత్రాలను అందించి.. ఎస్సార్ను నాలుగు రోజుల తర్వాత ఇస్తానని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రసాద్ ఆయనపై దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సమగ్ర సోమశిల నెరవేర్చిన జలయాజ్ఞికుడు
వైఎస్సార్.. భవిష్యత్ స్వాప్నికుడు. వర్షపు నీటిని ఒడిసి పట్టి సాగుకు మళ్లించిన అపర భగీరథుడు. పుడమి తల్లిని పులకింప చేశారు. సింహపురి సిగలోని జలనిధి నుంచి గంగమ్మను ఉరకలెత్తించారు. బంజరు భూములకు జలసిరులు అందించి బంగరు భూములుగా మార్చిన జలయాజ్ఞికుడు. ఉమ్మడి జిల్లా తీరంలో మధ్య భాగంగా కృష్ణపట్నంలో పోర్టు నిర్మించి ప్రపంచ స్థాయి పటంలో నెల్లూరుకు స్థానం కల్పించిన భవిష్యత్ స్వాప్నికుడు. పవర్ ప్రాజెక్ట్లతో జిల్లాలో వెలుగులు నింపిన వెన్నెల రేడు. పారిశ్రామిక సెజ్లతో విదేశీ సంస్థలను స్థాపించి అభివృద్ధికి బీజాలు వేసిన పాలికుడు. నిరుద్యోగాన్ని రూపు మాపి లక్షల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వల్లభుడు. దశాబ్దన్నర కాలం గడిచినా జిల్లా అన్నదాతల మదిలో రాజన్న స్థానం పదిలం. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్లకు పునాదులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పాలక కర్షకుడు. 2004 ఎన్నికలకు ముందు 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకు వచ్చారు. సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు. వృథా నీటి ఒడిసి పట్టి.. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు గతంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా అభివృద్ధి చేశారు. పెన్నార్ డెల్టాతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్య శ్యామలం చేసేందుకు జలయజ్ఞం ద్వారా రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సంగం బ్యారేజ్ నిర్మాణంతో.. జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించి 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తదనంతర పాలకులు నిర్లక్ష్యం వహించడంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై దృష్టి సారించి ప్రజలకు అంకితం చేశారు. పెన్నా బ్యారేజ్తో.. 2008లో పెన్నాబ్యారేజ్ రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన పెన్నా బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించి పూర్తి చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్ని నిర్మించారు. మహానేత దూరదృష్టి.. అభివృద్ధి సృష్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దూరదృష్టితో అభివృద్ధి సృష్టించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 169 కి.మీ. పొడవైన సముద్ర తీరంలో మధ్య భాగం కృష్ణపట్నంలో పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులతో ప్రపంచ స్థాయిలో సింహపురి కీర్తిని నిలిపారు. ఈ పోర్టు ద్వారా జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు బీజాలు వేశారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు ఆదాయ వనరుగా మార్చారు. మరో వైపు అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో 2,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి.. జిల్లాలో వెలుగులు నింపారు. -
పచ్చ గూండాల అరాచకం
జిల్లాలో పచ్చ కిరాయి గూండాల అరాచకం సంచలనం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సుజాతమ్మకాలనీలో ఉన్న మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంలో సోమవారం రాత్రి బీభత్సం సృష్టించారు. రాజకీయ చైతన్యానికి, హుందా రాజకీయాలకు మారు పేరైన నెల్లూరులో రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలను జీర్ణించుకోలేని పచ్చమూకలు ఇంట్లో ప్రసన్న తల్లి శ్రీలక్ష్మమ్మ ఒకటే ఉన్న రాత్రి సమయంలో మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇంట్లోని ప్రతి గదిలో బీభత్సం చేశారు. -
పచ్చమూకల విధ్వంసకాండపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్ తలుపులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కింద గదితోపాటు పైభాగంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు. అరగంట పాటు నానా బీభత్సం సృష్టించారు. కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీæడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని దుండగులు హెచ్చరించారు. అయితే, పోలీసులు వస్తున్నారని తెలుసుకుని దుండగులు బైక్లపై పరారయ్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్శ్ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రసన్నకు వైఎస్ జగన్ ఫోన్..పచ్చమూకల దాడి సమాచారం తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసన్నను హత్య చేసేందుకేనా?దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణాయుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. విమర్శలు జీర్ణించుకోలేకే దాడి..జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తే.. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజకీయంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నియోజకవర్గ కేంద్రం కోవూరులో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండ్రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలను ప్రసన్నకుమార్రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. దీనిని టీడీపీ మూకలు జీర్ణించుకోలేక ఈ దాడికి బరితెగించినట్లు తెలుస్తోంది.ప్రశాంతిరెడ్డి అనుచరుల పనే?కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రశాంతిరెడ్డి అవినీతిని ప్రసన్నకుమార్రెడ్డి నిలదీస్తూ వచ్చారు. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. ఆమె ప్రోద్బలంతోనే టీడీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం..నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే ప్రప్రథమం. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాలో నేతలు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తుండేవారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అణిచివేత ధోరణులకు బరితెగిస్తున్నారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టాలివైఎస్సార్సీపీ నేతల డిమాండ్ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శించిన నెల్లూరు జిల్లా నేతలునెల్లూరు (స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంపై దాడి ఘటనకు సంబంధించి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అనిల్కుమార్ యాదవ్ పోలీసులను డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలుసుకున్న అనిల్కుమార్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె పూజిత పలువురు వైఎస్సార్సీపీ నేతలు పొదలకూరు రోడ్డులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనిల్కుమార్యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు బరి తెగిస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రోత్సాహంతోనే ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. డబ్బు ఉందన్న అహంకారంతో వేమిరెడ్డి దంపతులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ధీటుగా సమాధానం చెబుతామన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి దంపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్నకుమార్రెడ్డి తల్లిపై సైతం దౌర్జన్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో బిహార్ సంస్కృతిని తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. -
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడి
నెల్లూరు: జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. సోమవారం(జూలై 7) రాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రి నగర్లో ఉన్న ప్రసన్న కుమార్ ఇంటిపై ఎంపీ వేమిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ప్రసన్న కుమార్ ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న రెండు కార్లు ధ్వంసం చేశారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
● 34 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నమ్మకంగా ఉంటూ నగలు కాజేసిన ఘటనలో నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు వేదాయపాళెం పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. వెంగళరావ్నగర్ ఏ బ్లాక్లో విశ్రాంత రైల్వే ఉద్యోగులు వెంకటేశ్వర్లు, కొండమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. చిన్నకుమారుడు ప్రసన్నకుమార్కు వివాహం నిశ్చయమైంది. అతను గతనెల 29వ తేదీన బీరువాలోని తన బంగారు బ్రాస్లెట్, రెండు చైన్ల కోసం చూడగా అవి కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు ఈనెల 4వ తేదీన వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై డి.విజయకుమార్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. పనిచేసే గణపతి నిందితుడని తేలడంతో ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వెంగళరావునగర్ ప్రాంతానికి చెందిన గణపతి కొంతకాలంగా వెంకటేశ్వర్లు ఇంట్లో పనిచేస్తూ నమ్మకంగా ఉండేవాడు. గతనెల 28వ తేదీన యజమానులు ఇంటి బయట ఉండగా బీరువాలోని 34 గ్రాముల రెండు బంగారు గొలుసులు, బ్రాస్లెట్ను అపహరించాడు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపి సిబ్బందిని డీఎస్పీ సింధుప్రియ అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో..
● యువకుడి మృతిఅల్లూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన ఇరగాలదిన్నె నాని (21) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో బిట్రగుంట పోలీస్స్టేషన్లో తల్లి శరణ్య ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అల్లిమడుగు సంఘానికి చెందిన కొందరు తీసుకెళ్లినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నాని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం అల్లూరు చెరువులో మృతదేహం లభ్యమైంది. దానిని శవపరీక్ష నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి రూరల్ సీఐ పాపారావు తెలిపారు. -
అగ్రిగోల్డ్ బాధితుల మొర ఆలకించండి
ఆత్మకూరు: ‘మా సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మొర ఆలకించాలి’ అని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని బైపాస్రోడ్డులో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లతో ఆదివారం సాయంత్రం పీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో 10 లక్షల బాధిత కుటుంబాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.906 కోట్లు జమైనట్లు తెలిపారు. 143 ఏజెంట్ కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియో అందినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ సమస్యను పొందుపరిచిందని, ఆ మేరకు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సమస్య పరిష్కారంలో కాలయాపన చేస్తే మరోసారి ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చౌడయ్య, మునీర్, సురేష్, శివయ్య, సుధాకర్, అజయ్, నాగేశ్వరరావు, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు న్యాయవాదుల అండ
● కరేడులో ఐలు బృందం పర్యటన ● న్యాయ పోరాటం చేస్తాం ఉలవపాడు: భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరేడు రైతులకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) మద్దతు ఉంటుందని ఐలు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం న్యాయవాదుల బృందం కరేడు ప్రాంతంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అక్రమంగా రైతుల భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే యూనియన్ అండగా ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఉద్యమాన్ని అణచలేవన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. విజనరీకి ఆ మాత్రం తెలియదా అన్నారు. భూగర్భ సంపదను దోచుకోవడానికి ప్రయత్ని స్తున్నారనే అనుమానం కలుగుతుంది. న్యాయ సహాయం అందిస్తాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐలు అధ్యక్షులు నర్రాశ్రీనివాసరావు మాట్లాడుతూ 18 వేల మందికి జీవనాధారమైన భూములను తీసుకోవడం న్యాయం కాదన్నారు. కరేడు రైతులకు న్యాయ సహాయం అందిస్తామన్నారు. కుగ్రామాలన్నీ తిరిగి భూము లు పరిశీలించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కార్యదర్శి యన్. మాధవరావు, ఏపీ వైస్ ప్రసిడెంట్ వి కోటేశ్వరరావు, సెక్రటేరియట్ ప్రెసిడెంట్ రమేష్, ఐలు నాయకులు రాజారత్నం, కిరణ్బాబు, అహ్మద్, వినోద్కుమార్, చీరాల బార్ అసోసియేషన్ నాయకులు గొట్టి ప్రసాద్, నెల్లూరు బార్ అసోసియేషన్ నాయకులు రమేష్, సాయికుమార్, బండా శ్రీనివాసులు, ఐ శ్రీనివాసులుతోపాటు పౌర హక్కుల సంఘ నాయకులు, వామపక్షాలు, సీఐటీయూ నాయకులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గుడ్లూరు: లారీని బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన తెట్టు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. ఏలూరు జిల్లా కలిదిండి మూలలంక గ్రామానికి చెందిన కేతా సాయిబాబా (24), క్లీనర్ పుట్టా నాగరాజు (19) బొలెరో వాహనంలో చేపల లోడుతో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి లారీ కర్ణాటకకు వెళ్తోంది. తెట్టు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బొలెరో వాహనం తప్పించబోయి ఢీకొట్టింది. దీంతో సాయిబాబా, నాగరాజు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందుకూరు ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో..● వ్యక్తి ఆత్మహత్య ఆత్మకూరు: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెంలో చోటు చేసుకుంది. ఎస్సై బి.సాయిప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీసీకాలనీకి చెందిన జి.శ్రీకాంత్ (37) మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యతో తరచూ గొడవ లు జరుగుతుండేవి. ఆమె ఇటీవల అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఇన్చార్జి డీఆర్వోగా హుస్సేన్ సాహెబ్ నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూ ఇన్చార్జి అధికారిగా తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హుస్సేన్సాహెబ్ను నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్వోగా పనిచేస్తున్న ఉదయభాస్కర్రావును ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. రెగ్యులర్ డీఆర్వోను నియమించేంత వరకు హుస్సేన్ సాహెబ్ ఇన్చార్జిగా కొనసాగుతారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికనెల్లూరు రూరల్: ప్రతి సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిథిగా కొనసాగుతుందని కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై కలెక్టరేట్లో వినతిపత్రాలు అందించాలన్నారు. -
జగ్జీవన్రామ్కు ఘన నివాళి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి పూజిత జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. సంజీవయ్య మాట్లాడుతూ దేశంలో హరిత విప్లవానికి, కార్మిక విప్లవానికి ఆద్యులు జగ్జీవన్రామ్ అని, అణగారిన వర్గాలకు రాజ్యాంగఫలాలు అందించేందుకు జీవితకాలం శ్రమించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన ఎల్లకాలం సాగదని గుర్తుంచుకోవాలన్నారు. పూజిత మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం వర్థంతి సందర్భంగా ఆయన చేసిన గొప్ప విషయాలను దేశమంతా గుర్తు చేసుకుంటుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జగ్జీవన్రామ్ ఆశయాలు రాష్ట్రంలో అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వేమిరెడ్డి హంసకుమార్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ సత్తార్, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులు స్వర్ణ వెంకయ్య, రవీంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాకుటూరి లక్ష్మీసునంద, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు పాల లావణ్య, మహిళా రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, మండల కన్వీనర్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కనికరం లేకుండా..
పింఛన్ సొమ్ము.. ఇంటి పన్నుకు జమ ఆత్మకూరు: వృద్ధులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. గ్రామాల్లో ఇంటి పన్నులు చెల్లించలేదని పింఛన్లో కోత విధించి ఇస్తున్న వైనం ఆత్మకూరు మండలంలోని కనుపూరుపల్లి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నేలటూరి సుబ్బరాయుడు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. పక్షవాతానికి గురై మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పన్ను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల సచివాలయానికి చెందిన ఓ ఉద్యోగి పింఛన్లో రూ.1,000 తగ్గించి మిగిలింది చేతిలో పెట్టింది. ఇదేంటని అడిగితే పంచాయతీ కార్యదర్శి చెప్పాడని, అందుకే పింఛన్లో ఇంటి పన్ను మినహాయించుకుని మిగిలిన నగదు ఇచ్చినట్లు చెప్పారు. తమ వద్ద కూడా ఇదే విధంగా పింఛన్లో ఇంటి పన్ను నగదును జమ చేసుకుని మిగిలింది ఇచ్చారని కాలనీకి చెందిన వడిగ సుగుణమ్మ, బొడ్డు లక్ష్మమ్మ, దాసరి అయ్యన్న, నేలటూరి వెంకటయ్య, కటారి చిన్న పెంచలయ్య, గొర్రిపాటి శంకరయ్య తదితరులు వాపోయారు. మరుసటిరోజు ఇంటి పన్నుకు సంబంధించిన రశీదులు ఇచ్చారన్నారు. బలవంతంగా పన్నులు వసూలు చేయడం ఏమిటని, దానిని పింఛన్కు ముడిపెట్టడం దారుణమని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై సంబంధిత పంచాయతీ కార్యదర్శి, సచివాలయం ఉద్యోగిని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
తల్లిని కాపాడబోయి..
పొదలకూరు: తనకు ప్రాణం పోసిన తల్లిని విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడబోయిన ఓ తనయుడు తనువు చాలించాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని మరుపూరు ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన ఆర్.వంశీ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వివాహమై నెలల బాబు ఉన్నాడు. వంశీ తల్లి లక్ష్మమ్మ ఆదివారం ఉదయం ఇంట్లో పనులు చేసుకుంటూ వాషింగ్ మెషీన్కు ఉన్న విద్యుత్ తీగను గమనించకుండా తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఆమె కేకలు వేయడంతో నిద్రపోతున్న వంశీ వెంటనే లేచి అక్కడికి వెళ్లాడు. తల్లిని పట్టుకుని లాగేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు బాధితుడిని పొదలకూరు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే వంశీ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. లక్ష్మమ్మ విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయినా ప్రాణాపాయం నుంచి బయట పడింది. తన ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో బిడ్డ చనిపోవడంతో లక్ష్మమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మరుపూరు ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి గురై తనయుడి మృత్యువాత మరుపూరులో విషాదం -
సర్కారు బడి.. కార్పొరేట్ పెత్తనం
వీఆర్ హైస్కూల్ను మున్సిపల్ హైస్కూల్గా మార్పు చేసి పునః ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన సుమారు రూ.9 కోట్ల సీఎస్సార్ ఫండ్తో పాఠశాల భవనాలను, ప్రాంగణాన్ని ఆధునికీకరించారు. సర్కారు స్కూల్ను కార్పొరేట్ పెద్దలు తమ కబంధహస్తాల్లోకి తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఈ పాఠశాలపై అజమాయిషీ బాధ్యతలను తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే తన విద్యా సంస్థల్లో పని చేసే సిబ్బందిని, బోధకులను నియమించడంతోపాటు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. తన పాఠశాలల్లో కేటాయించాల్సిన ఫ్రీ సీట్లను ఈ పాఠశాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): సర్కారు బడిపై కార్పొరేట్ మంత్రి నారాయణ పెత్తనం, ఆయన సాగిస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజల కోసం వెంకటగిరి రాజా కుటుంబీకులు వీఆర్ విద్యా సంస్థలను ప్రారంభించారు. ప్రస్తుతం వీఆర్ విద్యా సంస్థల వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే మంత్రి నారాయణ కోర్టు వివాదంలో ఉన్న వీఆర్ ఎయిడెడ్ హైస్కూల్ను వీఆర్ మున్సిపల్ హైస్కూల్గా మార్పు చేస్తూ ప్రతిపాదనలు పంపించగా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల భవనాలతోపాటు ప్రాంగణాన్ని అధునాతనంగా తీర్చిదిద్దేందుకు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.9 కోట్ల మేర సీఎస్సార్ ఫండ్స్ను ఖర్చు చేసింది. గత నెల 30వ తేదీన వీఆర్ హైస్కూల్లో తరగతులను అనధికారికంగా ప్రారంభించారు. సోమవారం రాష్ట్ర విద్యాశాఖా మంత్రి లోకేశ్తో అధికారికంగా ప్రారంభించనున్నారు. సిటీ నియోజకవర్గానికే పరిమితం మంత్రి నారాయణ తన నియోజకవర్గం పరిధిలో ఉందన్న కారణంతో పాఠశాలలో కేవలం సిటీ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకే అడ్మిషన్లు పరిమితం చేశారనే విమర్శలు వినిస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీఆర్ హైస్కూల్ పక్కనే ఉన్న గడియారం స్తంభం వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధి ఉంది. అయితే ఆ నియోజకవర్గానికి చెందిన కేవలం 35 నుంచి 50 మంది విద్యార్థులకు మాత్రమే మొక్కుబడిగా అడ్మిషన్లు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా కల్పించాల్సి ఉన్నా కేవలం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయడంపై పలువురు విద్యావేత్తలు, ప్రజలు మండి పడుతున్నారు. వీఆర్లో నారాయణ సిబ్బంది నియామకం వీఆర్ హైస్కూల్లో ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు ఉండాలి. అయితే సచివాలయాల్లో పని చేస్తున్న క్వాలిఫైడ్ స్కూల్ అసిస్టెంట్లను 20 మంది వరకు నియమించారు. ప్రస్తుతం 8 మంది స్కూల్ అసిస్టెంట్లు, 10 ఎస్జీటీలను నియమించారు. మరో 15 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఐదుగురు ఎస్జీటీలు, ఇద్దరు హెడ్మాస్టర్లు కావాలని విద్యాశాఖకు లేఖ పంపించారు. వీరితోపాటు నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే మరో 25 మందికి పైగా సిబ్బందిని బోధన, బోధనేతర విభాగాల్లో నియమించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్ను నియమించాలన్న ప్రభుత్వ అనుమతి ఉండాల్సి ఉంది. అయితే ఇవేమి పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు మంత్రికి ఇష్టం వచ్చిన వారిని అనధికారికంగా నియమిస్తున్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ అయినా అనుభవం లేకపోతే బోధన ఏ విధంగా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ హైస్కూల్ను మున్సిపల్ హైస్కూల్గా మార్పు పునః ప్రారంభానికి ఎన్సీసీ కంపెనీ రూ.9 కోట్ల సీఎస్సార్ ఫండ్స్ అంతా నారాయణ సిబ్బందిదే అజమాయిషీ ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే నారాయణ పాఠశాల బోధకుల నియామకం నేడు విద్యాశాఖ మంత్రి లోకేశ్తో ప్రారంభం టీడీపీ నేతల సిఫార్సులకే అడ్మిషన్లు విద్యాహక్కు చట్టం 12/1సీ కింద జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏ కార్పొరేట్ పాఠశాలతోపాటు నారాయణ విద్యా సంస్థల్లో కూడా ఉచిత ప్రవేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల విద్యాహక్కు చట్ట ప్రకారం నారాయణ స్కూల్స్ల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదని చాలా మంది తల్లిదండ్రులు కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి కొంత మంది విద్యార్థులకు వీఆర్ పాఠశాలలో అడ్మిషన్లు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి సైతం అడ్మిషన్లు కల్పించారని తెలిసింది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల వ్యవహారాలను నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఆయా డివిజన్లల్లో ఉండే పార్టీ ఇన్చార్జిలకు అప్పగించినట్లు తెలిసింది. వీరితోపాటు పేరుకు ఒకరిద్దరు సచివాలయ సిబ్బందిని కూడా నియమించారు. మొత్తం మీద 1 నుంచి 9వ తరగతి వరకు 1,050 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. జిల్లాలో అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలి జిల్లాలోని నిరుపేదలకు వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లు ఇవ్వాలి, కేవలం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయడం సరికాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీఆర్ హైస్కూల్లో బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలి. ప్రైవేట్ స్కూల్స్ల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించడం లేదు. మంత్రి లోకేశ్ చర్యలు తీసుకోవాలి. – నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ అడ్మిషన్లతో మాకు సంబంధం లేదు వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల వ్యవహారం పూర్తిగా సచివాలయ సిబ్బంది చూసుకున్నారు. ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో నియమిస్తాం. సచివాలయాల్లో పని చేసే క్వాలిఫైడ్ అసిస్టెంట్లను కొంత మందిని తీసుకున్నాం. వీఆర్ హైస్కూల్ ఇన్చార్జిగా జాకీర్హుస్సేన్నగర్ హెచ్ఎం నారాయణకు బాధ్యతలు అప్పగించాం. – బాలాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి -
నెల్లూరు రొట్టెల పండగలో కల్తీ మద్యం విక్రయాలకు స్కెచ్
కందుకూరు: గుడ్లూరు కేంద్రంగా వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు వీరాంజనేయులు కూటమి పార్టీల నేతలు, పెద్దలతోపాటు ఎకై ్సజ్ అధికారుల అండదండలతోనే చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా తయారీ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీలో ఉన్న రేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీరాంజనేయులు నకిలీ మద్యం తయారీ గట్టును రట్టు చేయాల్సి వచ్చినట్లు సమాచారం. వ్యసనాలకు బానిసై.. నకిలీ మద్యం తయారు చేస్తూ ఎకై ్సజ్ శాఖ అధికారులకు పట్టుబడిన వీరాంజనేయులుది సొంత ఊరు గుడ్లూరు. అక్కడి స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడితో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. స్థానికంగా పేకాట శిబిరాలు నిర్వహించడంలో సదరు అధికార పార్టీ నేత సిద్ధహస్తుడు. ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఇద్దరూ కూడా పేకాట ఆడేవారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భారీగా డబ్బులు పొగొట్టుకున్నట్లు సమాచారం. అందులో నష్టపోయిన డబ్బును సంపాదించడానికి నకిలీ మద్యం తయారీ చేసే అడ్డ దారిని ఎంచుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం తయారీకి గుడ్లూరులోని మిట్టపాళెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మెషిన్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేశాడు. శనివారం చేసిన దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్ బాటిల్స్తో పాటు, 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ లేబుల్స్ బయట పడ్డాయి. ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతుందా? వీరాంజనేయులు గుడ్లూరులో చాలా కాలం నుంచి భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. బాహాటంగానే మద్యం షాపులతోపాటు, బెల్టు షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తుంటే.. ఎకై ్సజ్ అధికారులకు కానీ, అధికార పార్టీ నేతలకు కానీ తెలియదంటే నమ్మక శక్యంగా లేదని పలువురు అంటున్నారు. కూటమి పార్టీల పెద్దల అండదండలు లేకపోతే నకిలీ మద్యం తయారీ చేయలేడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతుందనే ప్రచారం ఉంది. అధికార పార్టీ నేతల సూచనలతోపాటు మామూళ్ల మత్తులో పడి వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కల్తీ మద్యం తయారీ నిందితుడు వీరాంజనేయులుకు అధికారులు దాడుల చేయనున్న సమాచారం ముందే అందడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని ఓ ఆటో ద్వారా తరలించినట్లు తెలుస్తోంది. ఇలా దొరికాడు ఇటీవల ఎకై ్సజ్ శాఖ అధికారులు బాపట్ల జిల్లా రేపల్లిలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి చేసి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాడు. అక్కడి కేసులో ఉన్న నిందితుడే వీరాంజనేయులకు కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్ సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు వీరాంజనేయులను అతని సెల్ఫోన్ డేటా ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరాంజనేయులు పేరుతో నెల్లూరుకు చెందిన మరో వ్యక్తి సిమ్ కార్డు ఉపయోగిస్తుండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వీరాంజనేయులు పట్టుబడినట్లు సమాచారం. చాలా కాలంగా వీరాంజనేయులు ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ పేరుతో కల్తీ మద్యాన్ని తయారు చేసి రూ.100లకే మద్యం, బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇదే మద్యాన్ని షాపులు, బెల్టు షాపుల్లో రూ.160లకు విక్రయిస్తున్నారు. ఇలా కొన్ని వేల బాటిల్స్ను వీరాంజనేయులు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే బెల్టు షాపులకు సరఫరా విషయంలో మద్యం షాపుల యజమానులకు, వీరాంజనేయులకు మధ్య తేడా రావడంతో కొంత కాలంగా మద్యం తయారీని నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నెల్లూరులో రొట్టెల పండగ జరుగుతున్న నేపథ్యంలో కల్తీ మద్యాన్ని భారీగా తయారు చేసి విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నాడు. దీని కోసం నెల్లూరుకు చెందిన మరో వ్యక్తితో కలిసి రొట్టెల పండగకు కేటాయించే దుకాణాల్లో ఒకటి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కార్గోలో 400 లీటర్ల స్పిరిట్ తెప్పించాడు. ఇందులో ప్రస్తుతం 300 లీటర్ల ఒరిజినల్ స్పిరిట్ను అధికారులు స్వాధీనం చేసుకోగా, మరో 100 లీటర్ల మిక్స్డ్ స్పిరిట్ ఉన్నట్లు గుర్తించారు. -
స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికై ంది. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మది నిండా భక్తి, విశ్వాసంతో కోరిన కోర్కెలు తీరి వదిలే రొట్టెలు, కోర్కెలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీరం జనసంద్రంగా మారింది. బారాషహీ
భక్త జనసంద్రమైన స్వర్ణాల ఘాట్నెల్లూరు (బారకాసు): విద్య, ఉద్యోగం, విదేశీయానం, వ్యాపారం, ధనం, సౌభాగ్యం, వివాహం, ఆరోగ్యం, ప్రమోషన్, స్వగృహం.. ప్రతి ఒక్కరి కల. జీవితాశయం. బారాషహీదులు ఆశీస్సులతో స్వర్ణాల సాక్షిగా తీరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. భక్తి ప్రపత్తులతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల మధ్య రొట్టెల పండగ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కోర్కెలు తీరిన భక్తులు వదిలే రొట్టెల కోసం కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. స్వర్ణాల చెరువు వరాల రొట్టెలు మార్చుకునే భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెల మార్పిడి చేసుకున్నారు. మత బోధకులైన యుద్ధ వీరుల త్యాగనిరతిని స్మరిస్తూ సమాధులను దర్శించుకున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న రొట్టెల పండగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్ స్వర్ణాల చెరువులో సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. ఇందుకోసం ఏ కోర్కె రొట్టె ఎక్కడ దొరుకుంతుందో వెతుకులాటతో భక్తులు ఇబ్బంది పడకూడదని అధికారులు ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. భక్తులు ఏ కోర్కెతో వచ్చారో ఆ ఘాట్లోకి వెళ్లి తమకు కావాల్సిన రొట్టెను అందుకుంటున్నారు. గతంలో తమ కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలను వదులుతున్నారు. ఆరోగ్యం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గృహ, సౌభాగ్యం, వివాహం, విదేశీయానం రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద పక్కాగా ఏర్పాట్లు బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు పట్టుకొనే భక్తుల కోసం నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువు లోతులోకి వెళ్లకుండా ఉండేందుకు చెరువులో కంచె, చెరువు ఘాట్ వద్ద నీటిని శుభ్రం చేసే యంత్రాలు ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో షహదత్ సందల్ మాలి నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు ఆదివారం సంప్రదాయంగా మత పెద్ద షబ్బీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అమరులైన 12 మంది యోధులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక పూజలు) నిర్వహించారు. 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో పరిశుభ్రం చేశారు. సంప్రదాయంగా గంధం లేపనం చేసిన అనంతరం గలేఫాలు, చద్దర్లు కప్పి ‘సందల్ మాలి’ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని భక్తజనం కనులారా భక్తి శ్రద్ధలతో వీక్షించి పరవశించిపోయారు. గంధ మహోత్సవం నేడు బారాషహీద్ దర్గా రొట్టెల పండగలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గంధ మహోత్సవం 2వ రోజు సోమవారం రాత్రి నిర్వహించనున్నారు. పవిత్రమైన గంధాన్ని 12 పవిత్ర కలశాలలో కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకు వచ్చి బారాషహీద్లకు లేపనం చేసి. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెట్టనున్నారు. ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండగ తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు కిటకిట కోర్కెల రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్న భక్తులు -
నిఘా నీడన రొట్టెల పండగ
నెల్లూరు(క్రైమ్): పోలీస్, సీసీ కెమెరాల నిఘా నీడన ఆదివారం బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. 1,700 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ నిమిత్తం స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మూడు పీటీజెడ్ కెమెరాలు, 67 సీసీ కెమెరాలు, పది డ్రోన్లను ఏర్పాటుచేసి పోలీసు అవుట్ పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశారు. పోలీసు అధికారులు అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. అవుట్ పోస్టు సిబ్బంది తప్పిపోయిన 28 మంది చిన్నారులను సంరక్షించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. క్రైమ్ పార్టీ సిబ్బంది ఓ జేబుదొంగను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం ఎస్పీ జి.కృష్ణకాంత్, కలెక్టర్ ఒ.ఆనంద్తో కలిసి దర్గా ఆవరణ, క్యూలైన్లు, రొట్టెల మార్పిడి తదితర ప్రాంతాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్రూమ్, సీసీ కెమెరాల పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. క్యూలైన్లలోని భక్తులు వీలైనంత త్వరగా దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. క్రైమ్ పార్టీలు నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణ చర్యలపై పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలని సూచించారు. దారి మూసేయడంతో.. రొట్టెల పండగ సందర్భంగా కొందరు పోలీసుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. దర్గా వైపు వెళ్లే రహదారులను అధికారులు బారికేడ్లతో మూసివేయడంతో పొదలకూరురోడ్డు సెంటర్, జేవీఆర్ కాలనీ, లక్ష్మీనరసింహపురం, అంబేడ్కర్ నగర్, బ్రహ్మానందపురం, బట్వాడిపాళెం సెంటర్ తదితర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ ఇళ్లు అక్కడేనని చెబుతున్నా వినిపించుకోకుండా వాహనాలు నిలిపివేశారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దర్గా ఆవరణలోనూ ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పోలీసుల తీరుపై స్థానికుల అసహనం -
అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ఇబ్బందులు
నెల్లూరు(బారకాసు): బారాషహీద్ దర్గా ప్రాంగణమంతా బ్లీచింగ్, సున్నం చల్లాల్సి ఉంది. అయితే కొన్నిచోట్ల మాత్రమే చల్లుతూ మమ అనిపిస్తున్నారు. దీంతో అంటురోగాలు ప్రబలుతాయోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని ప్రదేశాల్లో బ్లీచింగ్, సున్నం ఎప్పటికప్పుడు చల్లుతూ ఉండాలి. అయితే దర్గా ప్రధాన రహదారిలో బ్లీచింగ్, సున్నం చల్లిన దాఖలాల్లేవు. సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరముంది. క్వారీ డస్ట్ వల్ల.. దర్గా ప్రాంగణంలో ఎక్కడైతే సిమెంట్ రోడ్డు వేయలేదో ఆ ప్రాంతాల్లో క్వారీ డస్ట్ వేసి చదును చేశారు. అయితే డస్ట్పై నీరు చల్లడం మరిచిపోయారు. ఆదివారం ఉదయం నుంచి గాలి మొదలుకావడంతో డస్ట్ గాలికి ఎగిరి భక్తుల కళ్లలోకి చేరడంతో ఇబ్బంది పడ్డారు. స్టాల్స్లోనూ, దుకాణాల్లో తినుబండారాలపై డస్ట్ పడుతోంది. వాటిని కొనాలంటే భక్తులు వెనుకంజ వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులు నీళ్లు చల్లించాలన్న ఆలోచన కూడా చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అధికారులకు రాజకీయాలెందుకు?
నెల్లూరు (పొగతోట): ‘ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారులు మాత్రం సర్వీసులోనే ఉంటారు. అధికారులకు రాజకీయాలెందుకంటూ’ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ పురోగతి సూచిక కార్యక్రమంపై ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడారు. అధికారులు నిబంధనలు ప్రొటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీలను, ఎంపీపీలను ఆహ్వానించాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో అంత ఇబ్బంది పడేటట్లు అయితే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ఇకపై ప్రొటోకాల్ విషయంలో ఘటన పునరావృతమైతే సహించేది లేదంటూ హెచ్చరించారు. ప్రస్తుత, భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించుకుని 2030 నాటికి వాటిని సాధించు కోవాలన్నారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించిందన్నారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య వంతమైన, స్వయం సమృద్ధిగల మౌలిక సదుపాయాలు, సామాజిక సురక్షితమైన, సుపరిపాలన, మహిళా స్నేహ పూర్వకమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రతి పంచాయతీలో 9 కార్యక్రమాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని, సంపూర్ణంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పంచాయతీలను ఏ–గ్రేడ్లోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు మండల సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రజా ప్రతినిధులకు విడుదల చేయాలన్నారు. ఆత్మకూరు ఘటనకు సంబంధించి ఇంత వరకు నివేదికలు అందలేదన్నారు. నివేదికలను త్వరగా ఇవ్వాలని ఆత్మకూరు ఎంపీడీఓకు సూచించారు. ● జెడ్పీ సీఈఓ మోహన్రావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 9వ తేదీన శిక్షణకు హాజరైన అధికారులు మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలని సూచించారు. లైన్ డిపార్ట్మెంట్లను కో ఆర్డినేషన్ చేసుకుని పంచాయతీలకు అవార్డులు వచ్చేలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జీపీడీపీ యాక్షన్ ప్లాన్లు పేపర్లలోనే జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 147 అంశాలను పొందుపరిచారన్నారు. జరిగిన అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, ట్రైనర్ ప్రసాద్, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఇబ్బందిగా ఉంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీ అండదండలు
కందుకూరు నియోజకవర్గంలో బెల్టు షాపులకు సరఫరా ● ఇందులో ఇద్దరు వ్యక్తుల పాత్ర ● గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల ఎకై ్సజ్ దాడులు ● ఈ దాడుల్లో పట్టుబడిన వారి సమాచారంతో సోదాలు ● అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు సమాచారం కందుకూరు: గుడ్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తున్న గుట్టు శనివారం ఎస్సైజ్ అధికారులు దాడుల్లో రట్టయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బరితెగించిన టీడీపీ నేత ఉప్పలపాటి వీరాంజనేయరాజు తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేసి బెల్టుషాపుల ద్వారా విక్రయాలు సాగించినట్లు తెలుస్తోంది. శనివారం ఎకై ్సజ్ అధికారులు చేసిన దాడుల్లోనే మద్యం తయారీకి ఉపయోగించే సుమారు 400 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, మద్యం సీసాలు, తయారీకి ఉపయోగించే మెషిన్లతోపాటు రూ.లక్షలు విలువ చేసే మందు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గోదావరి, నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఎకై ్సజ్ అధికారులు తయారీ దారులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇచ్చిన సమాచారంతో గుడ్లూరులో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మద్యం షాపులతోపాటు బెల్టు దుకాణాలకు సరఫరా తయారు చేసిన నకిలీ మద్యాన్ని పలు మద్యం షాపులతోపాటు బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా మద్యం సీసాలు, వాటిపై లేబుల్స్ పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. లేబుల్పై ఒరిజినల్ను తలపించే రీతిలో మద్యం బాటిళ్లపై ఉండే లేబుల్, బ్యాచ్ నంబర్లు, ఎమ్మార్పీ ధరలు కూడా తయారు చేసి వేస్తున్నారు. అంతా పక్కాగా వేసి గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. పేదల ఆరోగ్యంతో చెలగాటం ఎక్కువగా ఈ మద్యం తక్కువ ధరకు లభించి ఛీప్ లిక్కర్ను పోలిన బాటిళ్లు, పలు రకాల బ్రాండ్ల పేర్లతో నకిలీవి తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం ధర తక్కువగా ఉండడంతో ఎక్కువగా పేదలు మాత్రమే వీటిని తాగుతుంటారు. ఈ నకిలీ మద్యాన్ని కందుకూరు, లింగసముద్రం, వలేటివారిపాళెం, గుడ్లూరు మండలాలతోపాటు పక్క జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ మద్యం తయారు చేసి పేద ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. విచారణ పేరులో కాలయాపన ఎకై ్సజ్ అధికారులు నకిలీ మద్యం తయారీ దారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే మీడియాకు వివరాలు వెల్లడించేందుకు వెనుకంజ వేస్తున్నారు. విచారణ చేస్తున్నామని పూర్తి విచారణ తర్వాతే సమాచారం ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ నిర్వాహకులను తప్పించేందుకు అధికార పార్టీ పెద్దల నుంచి అధికారులకు ఒత్తిడి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి నియోజకవర్గంలో ఇలాంటి దందాలు నడుస్తున్న అధికారులు స్పందించింది లేదు. బెల్టు షాపుల నిర్వాహణలోనే అధికారులు కనసన్నలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం, బెల్టు షాపుల్లో తనిఖీ చేస్తే.. టీడీపీ నేత ఉప్పలపాటి వీరాంజనేయరాజు తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇప్పటికే మద్యం, బెల్టు షాపులకు అధిక మొత్తంలో సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దుకాణాలపాటు బెల్టు షాపుల్లో ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడుతుందని తెలుస్తోంది. ఏ దుకాణానికి ఎంత సరుకు సరఫరా చేశారో ఎకై ్సజ్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నకిలీ మద్యం తాగి అనారోగ్యపాలైన వారిని ఆరోగ్య సిబ్బందితో గుర్తించి అనుమానం వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం కూడా ఉందని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి పాలనలో కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు చేయని అక్రమ వ్యాపారాల్లేవు. ఇప్పటికే ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం, పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరారు. తాజాగా ఓ టీడీపీ నేత ఏకంగా తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తూ బెల్టు షాపులకు సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గుట్టును ఎకై ్సజ్ అధికారులు రట్టు చేశారు. సదరు నేత అధికార పార్టీ నేతల అండదండలతో కొంత కాలంగా ఈ అక్రమ వ్యాపారానికి తెర తీసినట్లు తెలుస్తోంది. ఇటీవల గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎకై ్సజ్ అధికారులు చేసిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ చేస్తూ పట్టుబడిన అధికార పార్టీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేయడంతో తెలుగు తమ్ముడి బాగోతం బయట పడినట్లు తెలుస్తోంది. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మద్యం షాపుల నిర్వాహకులు, అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన వీరాంజనేయులు మండలంలోని అధికార పార్టీకి చెందిన ప్రధాన నేతల అనుచరుడు. అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడు మండలంలో పేకాట శిబిరాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. -
ఐదు రోజుల పండగ
6వ తేదీ – షహదత్ 7వ తేదీ – గంధమహోత్సవం 8వ తేదీ – రొట్టెల పండగ 9వ తేదీ – తహలీల్ ఫాతెహా 10వ తేదీ – ముగింపు సభ ● నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం స్వర్ణాల చెరువులో భక్తుల సందడిమత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగకు సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు, కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజే భక్తులు పోటెత్తడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్తజనసంద్రంగా మారింది. బారాషహీద్ దర్గానెల్లూరు (బారకాసు): నెల్లూరుకు రొట్టెల పండగొచ్చింది. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగకు అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండగ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు ఎంతో విశిష్టత ఉంది. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. బారాషహీద్లను స్మరిస్తూ కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలను మార్చుకుంటారు. ఆ కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి రొట్టెను వదులుతారు. మరో కోర్కె రొట్టెను తీసుకెళ్తుంటారు. దర్గా ప్రాంగణంలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. స్వర్ణాల చెరువులో భక్తుల సందడి రొట్టెల మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో సందడి నెలకొంది. పండగ ప్రారంభానికి ముందే భక్తుల రాకతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. శనివారం ఉదయం నుంచి స్వర్ణాల చెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చు కున్నారు. రెండు రోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. నగర పాలక సంస్థ, పోలీసు, విద్యుత్, ఆరోగ్య, రెవెన్యూ శాఖలతోపాటు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో బారాషహీద్ దర్గాకు రూట్ మ్యాప్ సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాగునీటి కేంద్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్మించారు. భక్తులకు అందుబాటులో 108 వాహనాలు, ఆరోగ్య కేంద్రాలు కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా షామియానాలు, పందిళ్లపైనా భారీ జింక్ షీట్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రమాదాలకు గురికాకుండా కంచెను ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. చెరువులో నీరు మురుగు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో శుద్ధి చేస్తున్నారు. దర్గా ఆవరణలో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జైంట్వీల్స్ ఏర్పాటు చేశారు. అధికారుల సమన్వయంతో నగర పాలక సంస్థ, విద్యుత్, పోలీస్, వైద్య శాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్ ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బందికి రొట్టెల పండగ నిర్వహణపై సూచనలు చేశారు. వేలాది మంది భక్తుల హాజరు దర్గాకు శనివారం వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కోర్కెల రొట్టెలను మార్చుకుని భక్తి శ్రద్ధలతో దర్గాను సందర్శించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఆంధ్రరాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధికంగా హాజరయ్యారు. రొట్టెల పండగకు ముందుగానే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కళకళలాడుతున్న దర్గా ప్రాంగణం బారాషహీద్ దర్గాకు పోటెత్తుతున్న భక్తులు స్వర్ణాల చెరువులో కొర్కెల రొట్టెల మార్పిడి సందడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నాం. బారాషహీద్ దర్గా ప్రాంగణ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 24గంటలు పాటు పోలీసు నిఘా ఉంటుంది. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. – ఆనంద్, కలెక్టర్. -
వెయ్యి మొబైల్ ఫోన్ల రికవరీ
నెల్లూరు(క్రైమ్): వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న సుమారు రూ.2 కోట్ల విలువైన 1,000 మొబైల్ ఫోన్లను పోలీస్ అధికారులు రికవరీ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కృష్ణకాంత్ చేతుల మీదుగా ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొబైల్ హంట్ ద్వారా ఎనిమిది విడతల్లో రూ.4 కోట్ల విలువైన 3,900 ఫోన్లు, సీఈఐఆర్ ద్వారా రూ.6 లక్షల విలువైన 60 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించా మన్నారు. మొబైల్ హంట్ (91543 05600)తోపాటు సీఈఐఆర్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఎవరైనా తప్పుడు పద్ధతిలో వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్లను గుర్తించి అప్పగించిన ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు నగర డీఎస్పీ పి.సింధుప్రియ, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది విడతల్లో బాధితులకు 3,900 ఫోన్ల అందజేత ఎస్పీ కృష్ణకాంత్ -
గంజాయి అక్రమ రవాణాపై దాడులు
● 4 కేజీల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, రైల్వే సీఐ ఎ.సుధాకర్తో కలిసి తన కార్యాలయంలో తనిఖీల వివరాలను వెల్లడించారు. గురువారం సాయంత్రం సీఐ పర్యవేక్షణలో రైల్వే, ఆర్పీఎఫ్ అధికారులు తమ సిబ్బందితో కలిసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు దిగి నాలుగో నంబర్ ప్లాట్ఫారానికి వెళ్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బిష్షు షబ్బర్, పదహారేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి బ్యాగ్ల్లో ఉన్న రూ.80 వేల విలువైన 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా, ఏఓబీ సరిహద్దుల్లో గంజాయిని కొనుగోలు చేసి చైన్నె తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. కేసులో ప్రతిభ చూపిన సీఐతోపాటు ఎస్సై ఎన్.హరిచందన, సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, మణికంఠ తదితరులను డీఎస్పీ అభినందించారు. -
ఇష్టారాజ్యంగా బదిలీలు
మనోవేదనకు.. సాంఘిక సంక్షేమ శాఖలో ఇదీ పరిస్థితి ● కౌన్సెలింగ్ లేదు ● అయోమయంలో సంక్షేమ విద్యా సహాయకులు ● వివరాలు తెలుసుకోవడానికి కార్యాలయానికి రాక ● పట్టించుకోని ఉన్నతాధికారులునెల్లూరు(స్టోన్హౌస్పేట): సంక్షేమ విద్యా సహాయకుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 500 మందికి పైగా ఉన్న సహాయకుల్లో ఎవరిని ఎక్కడికి మార్చారో తెలియడం లేదు. బదిలీల ప్రక్రియ గత నెల 30వ తేదీకి పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆ శాఖలోని అధికారులు, సిబ్బంది ఆఫీస్లో లేకపోవడంతో వివరాలు తెలియక ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి కార్యాలయంలో వేచి చూడటం పరిపాటిగా మారింది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. సిఫార్సు లేఖల వల్లే.. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, సీనియర్ అసిస్టెంట్లు కార్యాలయంలో లేకపోవడంతో ఏం జరుగుతుందో ఉద్యోగులకు తెలియడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే వివిధ శాఖలకు అందించిన సీనియారిటీ జాబితా ప్రకారం బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఏఎస్డబ్ల్యూ పరిధిలో అందరి ఉద్యోగుల దగ్గర ఆప్షన్ ఫారం ఇచ్చి మూడు సచివాలయాలు ఎంపిక చేసుకోవాలని, దాని సీనియారిటీ ప్రకారం బదిలీ చేస్తామని చెప్పారని ఉద్యోగులు అంటున్నారు. అయితే కూటమికి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. లెటర్లు లేకపోతే ఎక్కడికై నా బదిలీలు చేస్తామని అధికారులు ఫోన్ చేసి తెలుపుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే చోటుకు వెళ్లండి బదిలీకి దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఉద్యోగులకు ఆ శాఖ సిబ్బంది ఫోన్లు చేసి మీరు పెట్టుకున్న ప్లేస్ ఖాళీగా లేదు. వేరే చోటుకు బదిలీ చేస్తామని చెబుతున్నారని ఆరోపణలున్నాయి. అసలు బదిలీల ప్రక్రియలో ఉద్యోగులను ఏమీ అడగకుండా సంబంధిత శాఖాధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం బదిలీల ప్రక్రియ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది గత నెల 30వ తేదీ నుంచి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారికి ఎవరూ వివరాలు అందించడం లేదు. అధికారులకు ఫోన్ చేస్తే సరైన సమాధానం ఉండటం లేదు.బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ శాఖలోని కొందరు అధికారుల చేష్టల వల్ల సంక్షేమ విద్యా సహాయకులు తీవ్ర మనోవేదనకు గురువుతన్నారు. ఎవరికి ఏ ప్రాంతానికి బదిలీ జరుగుతుందోనని తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా దివ్యాంగులు, అనారోగ్య కారణాలున్నవారు, ఒంటరి మహిళలు, స్పౌజ్ కేటగిరీ విషయంలో నిబంధనలను పాటించడం లేదని విమర్శలున్నాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే సొంత మండలాల్లో స్థానం కోల్పోయామని తెలిసిన వారు ఏ ప్రభుత్వ ఉద్యోగులకై నా ఇలా చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనల ప్రకారమే నిర్వహించాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బదిలీలు నిర్వహించాం. బదిలీలు అయిపోయినట్టే. ఆ జాబితాను కలెక్టర్కు అందజేశాం. ఆఫీసులో కరెంట్ లేకపోవడం వల్ల కొండాయపాళెం గేటు వద్ద అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో జాబితాను రూపొందించాం. మేము ఎవరికీ ఫోన్ చేయలేదు. – శోభారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ -
కాంట్రాక్టర్లకు స్వర్ణాల వర్షం
తాము కోరిన కోర్కెలను నెరవేర్చే రొట్టెల పండగ అంటే ఎంతో మందికి మహా ఇష్టం. ఏటా బారాషహీద్ దర్గాలోని స్వర్ణాల చెరువు వద్దకు పోటెత్తి రొట్టెలను మార్పిడి చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నా, కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా అవసరానికి మించి అంచనాలను రూపొందించారు. వివిధ రకాల తాత్కాలిక పనులకే కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న కథాకమామీషు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ● అవసరానికి మించి అంచనాలకు రూపకల్పన ● నగరపాలక సంస్థ సాధారణ నిధుల కేటాయింపు ● రొట్టెల పండగలో ఇదీ తంతు -
స్థల వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
ఆత్మకూరు: చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గ్రామంలో స్థల వివాదంలో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త కృష్ణవేణిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పంచేటి కృష్ణవేణికి ఆమె బంధువువైన టీడీపీ కార్యకర్త కృష్ణయ్యకు మధ్య స్థల వివాదం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్ బి.మురళి గ్రామానికి వెళ్లాడు. కృష్ణవేణి పొజిషన్ సర్టిఫికెట్ రద్దు చేస్తున్నామని, కృష్ణయ్యకు దారికి స్థలం ఇవ్వాలని చెప్పాడు. దీనిపై కృష్ణవేణి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో ఈ అంశం ఉందన్నారు. రెండు నెలల క్రితం కోర్టు కమిషనర్ వచ్చి స్థలం పరిశీలించారని, ఇంకా తీర్పు వెలువడలేదన్నారు. ఈ సమయంలో దారి ఎలా ఇవ్వమంటారంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు. అయితే తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్, వీఆర్వోలు స్థలం కొలతలు వేసి కర్రలు నాటాలని ప్రయత్నించగా కృష్ణవేణి, ఆమె బంధువులు ప్రశ్నించారు. కృష్ణయ్య, అతని బంధువులు కృష్ణవేణిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీస్స్టేషన్కు వెళ్లగా సిబ్బంది లేరని తొలుత ఫిర్యాదు తీసుకోలేదు. ఫోన్లో ఎస్సై తిరుమలేశ్వరరావును సంప్రదించిన అనంతరం ఫిర్యాదు అందజేసి బాధితురాలిని ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం బంధువులు తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ స్పందిస్తూ అప్పట్లో ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ సర్వే నంబర్ తప్పు అని, అందుకే దానిని రద్దు చేస్తానన్నారు. కాగా కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణవేణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకోలేదన్నారు. అప్పుల బాధ తాళలేక.. ● పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు సిటీ: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని కలివెలపాళెంలో నివాసముంటున్న చాంద్బాషా (43) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యలతో వాటిని తీర్చలేకపోయాడు. గురువారం రాత్రి మామిడితోటలో చాంద్బాషా పురుగు మందు తాగి ఇంటికెళ్లాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మాహుతికై నా సిద్ధమే.. భూములు మాత్రం ఇవ్వం
ఉలవపాడు: ఆత్మాహుతికై నా సిద్ధమే కానీ మా భూములు మాత్రం ఇవ్వమని మండలంలోని కరేడు రైతులు తేల్చి చెప్పారు. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ శుక్రవారం కరేడులోని 1వ సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వెల్లడించడానికి సుమారు 4 వేల మంది రైతులు తరలివచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అభివృద్ధి అంటే ఏమిటని రైతులు ప్రశ్నించారు. మెట్ట భూములు ఉపయోగంలోకి తేవడం అభివృద్ధి అంటారన్నారు. సస్యశ్యామలంగా ఉన్న భూములను తీసుకుంటే అభివృద్ధి ఎలా అవుతుందని, వ్యవసాయమే లేకుండా చేస్తారా అని నిలదీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మా భూములివ్వాలా అని అధికారులను ప్రశ్నించారు. తాము మాత్రం భూములివ్వడానికి అంగీకరించమని తేల్చి చెప్పారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా భూ సేకరణ చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలు 100 శాతం పరిష్కరించలేమని, కానీ వారికి అన్నీ అందించాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. సబ్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ రైతుల సహకారంతోనే భూ సేకరణ చేస్తామన్నారు. చివరకు ఎలాంటి తీర్మానం లేకుండానే సభను ముగించారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ తూమాటి కరేడు రైతులకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెచ్చరించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా ఒక్క ఎకరా కూడా తీసుకోలేరన్నారు. కరేడు రైతులందరూ చిన్న, సన్న కారు రైతులు వారు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్లు. వారికి అండగా ఉంటామన్నారు. కంపెనీలు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. కానీ ఎక్కడ ఇచ్చారో చూపాలన్నారు. రామాయపట్నం పోర్టు అరబిందో కంపెనీ కడుతుంటే ప్రభుత్వం మారగానే నవయుగకు అప్పగించారన్నారు. అక్కడి ఉద్యోగులను తొలగించారని, కంపెనీలు ఉద్యోగాల కల్పనను పాటించడం లేదన్నారు. భూ సేకరణ జరగాలంటే ప్రజలను సంతృప్తి పరచి చేయాలి. రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేశారని, వారికి అండగా ఉంటామన్నారు. రాస్తారోకోలో రైతులు తమ బాధను వెలిబుచ్చడానికి ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టారని, వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరేడు గ్రామ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా అర్జీ అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సురేష్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. తేల్చి చెప్పిన కరేడు గ్రామస్తులు బీడు భూములు కాకుండా.. పచ్చని భూములు తీసుకుంటారా? మూడు వేలకు పైగా అభ్యంతర అర్జీలు రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్సీ తూమాటి -
గ్రామసభలు పెట్టకుండా భూములెలా ఇస్తారు?
● ఇండోసోల్ కంపెనీకి చంద్రబాబు బినామీనా? ● భూ కబ్జాదారులకు అండగా కూటమి ప్రభుత్వం ● వామపక్ష నేతలునెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కంపెనీలకు కేటాయించాలంటే గ్రామసభలు నిర్వహించాలి. రైతుల అభిప్రాయాలు తీసుకుని వారి అనుమతితో భూములను కేటాయించాలి. కానీ కూట మి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతుల భూములు, గ్రామాలను ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేటాయించడం చట్ట విరుద్ధం’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) సీనియర్ నాయకులు రాంబాబు అన్నారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం కలెక్టర్ కరేడు గ్రామానికి వెళ్లనున్నారన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనతో ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో అభిప్రాయసేకరణ చేపట్టేందుకు సిద్ధపడిందన్నారు. గతంలో కూడా జిల్లాలోని ముత్తుకూరు, రాచర్లపాడు గ్రామాల్లో కంపెనీలకు వందలాది ఎకరాలు కట్టపెట్టారని అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి పరిశ్రమలు రాలేదని ఆరోపించారు. ఈ భూములను బ్యాంక్లో తాకట్టు పెట్టి రూ.వందల కోట్లు రుణాలు తీసుకుని ఎగనామం పెట్టే భూకబ్జాదారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోపించారు. 8,464 ఎకరాలు ఇవ్వడం చూస్తుంటే సదరు కంపెనీకి చంద్రబాబు బినామీగా ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఒక సంస్థకు భూములు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అందుకు భిన్నంగా తాము ఎంత ఇస్తే అంతే తీసుకుని భూములు, గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించి పోలీసు కేసులు పెట్టి భూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకొనేది లేదన్నారు. కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రైతులకు తన సొంత నగదుతోపాటు, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తానని చెబుతున్నాడని, ఆయనే నియోజకవర్గ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భూములు స్వాధీనం చేసుకునేందుకు పోలీసు కేసులు పెట్టి రైతులు, ప్రజలను బెదించడం సరికాదన్నారు. ప్రజలతో పెట్టుకుంటే ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగలేడని హెచ్చరించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాజ్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, ఎస్యూసీఐ నాయకుడు సురేష్ పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో చుక్కలదుప్పి మృతి
మర్రిపాడు: మండలంలోని పొంగూరుకండ్రికలో గురువారం జనారణ్యంలోకి చుక్కల దుప్పి వచ్చింది. కుక్కలు దానిని వెంటాడి గాయపరిచాయి. దీంతో దుప్పి మృతిచెందగా గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి ఆత్మహత్య ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని గోపాలపురం సమీపం ఉన్న ఉప్పునీటి దొరువులో దూకి మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు ఎస్సై శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన అనిల్ భద్ర (27), మరో ముగ్గురు వ్యక్తులు రెండురోజుల క్రితం గేట్వే కంపెనీలో చేరారు. వారంతా ముత్తుకూరులో ఓ హోటల్లో బసచేసి బుధవారం ఒక్కరోజే విధులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అనిల్భద్ర కనిపించకపోవడంతో మిగిలిన ముగ్గురు ఫోన్ చేశారు. అతను తన స్వస్థలానికి వెళ్లిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ నేపథ్యంలో గోపాలపురం వద్ద వాటర్ ట్యాంకర్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనిల్ ప్రయత్నించగా డ్రైవర్ చాకచక్యంగా తప్పించాడు. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఉప్పునీటి దొరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. అనుమతి లేకుండా దుంగలు తరలిస్తుండగా.. ● రెండు ట్రాక్టర్లను పట్టుకున్న అటవీ అధికారులు ● ఆ వాహనాలు టీడీపీ నేతవిగా గుర్తింపు సైదాపురం: అనుమతి లేకుండా రెండు ట్రాక్టర్లలో వేప దుంగలు తరలిస్తుండగా గురువారం అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మండలంలోని లింగసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. ప్రకృతి సంపదన నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నెల్లూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వారి ఆదేశాల మేరకు స్థానిక అధికారులు తనిఖీలు చేశారు. లింగసము ద్రం గ్రామం నుంచి గూడూరుకు రెండు ట్రాక్టర్లలో వేప దుంగల్ని తరలిస్తుండగా పట్టుకున్నా రు. ట్రాక్టర్లు స్థానిక టీడీపీ నేతవిగా గుర్తించారు. ఈ సందర్భంగా నెల్లూరు అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి మాట్లాడుతూ అనుమతి లేకుండా దుంగల్ని రవాణా చేసే వారిపై కఠినమైన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. రెండు ట్రాక్టర్ల విషయమై సమగ్రవిచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
భూసేకరణకు వ్యతిరేకంగా..
● అర్జీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రైతులు●● నేడు కరేడులో గ్రామసభ ఉలవపాడు: భూ సేకరణ కోసం ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేస్తున్న గ్రామసభలో భారీగా అర్జీలు అందించి నిరసన తెలియజేయాలని రైతులు సిద్ధమవుతున్నారు. గురువారం కరేడు గ్రామంలో పెద్ద సంఖ్యలో అర్జీలు రాశారు. ప్రభుత్వం రైతులకు భూ సేకరణ గ్రామసభ ఉందని సమాచారం ఇవ్వకపోయినా.. వారు మాత్రం తెలుసుకుని మరీ తమ అభ్యంతరాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడంపై రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ భూములు ఇవ్వమని రోడ్డెక్కడంతోనే ప్రభుత్వం దిగొచ్చి గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో సభను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రైతులున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే అభ్యంతరం తెలియజేయడానికి అర్జీలను రూపొందించుకుంటున్నారు. భూమి లేకపోతే తాము బతకలేమని, భూములు, ఇళ్లు ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కూటమి ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందాకై నా పోరాడేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు రైతులకు మద్దతు తెలుపుతున్నాయి. గోడు వినిపించనున్న రైతులు శుక్రవారం కరేడులో జరిగే గ్రామసభకు కలెక్టర్ ఆనంద్, సబ్ కలెక్టర్ శ్రీపూజ, తహసీల్దార్ శ్రీనివాసరావు వస్తున్నట్లు సమాచారం. ఇందులో రైతులు తమ బాధలను అర్జీల రూపంలో తెలియజేయనున్నారు. కరేడు రైతులకు అండగా వైఎస్సార్సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్తోపాటు పలు పా ర్టీలు మద్దతు ఇస్తున్నాయి. కూటమి పార్టీలు తప్ప మిగిలినవి భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆయా పార్టీలు కూడా అర్జీలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం రైతులతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాన్ని పార్టీ తరఫున అందజేయనున్నారు. వైఎస్సార్సీపీ కరేడు రైతుల కోసం ఎంత వరకై నా పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సభకు పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. -
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
వరికుంటపాడు: మండలంలోని తూర్పు బోయమడుగు ప్రాథమికోన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు వెంగయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను డీఈఓ బాలాజీరావు గురువారం జారీ చేశారు. దీన్ని ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓలు రమేష్, రమణయ్య అందజేశారు. పాఠశాలలో బాలికలతో వెంగయ్య అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ గ్రామస్తులు రెండు రోజుల క్రితం దేహశుద్ధి చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి నివేదిక పంపారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. రొట్టెల పండగకు పటిష్ట బందోబస్తు నెల్లూరు సిటీ: రొట్టెల పండగకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. పరిసరాలు, కంట్రోల్ రూమ్, వాహన పార్కింగ్ ప్రదేశాల్లో చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా మార్గంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఘాట్ ఏరియా, రొట్టెల మార్పిడి చేసే ప్రదేశాలను సందర్శించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. -
కాకాణిపై ఆగని కక్షసాధింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. రిమాండ్లో ఉన్న ఆయన్ను మరికొన్ని రోజుల పాటు బయటకు రానీయకుండా మరిన్ని అక్రమ కేసులను నమోదు చేయాలని పోలీస్ అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎకై ్సజ్ శాఖ సైతం తలదూర్చి అక్రమ కేసులు బనాయించి ముప్పుతిప్పలు పెడుతోంది. కాకాణిపై సర్కార్ పాల్పడుతున్న కుట్రలతో టీడీపీ శ్రేణులు భవిష్యత్తును తలుచుకొని బెంబేలెత్తుతున్నారు. వైఫల్యాలను ప్రశ్నించడాన్ని తట్టుకోలేక.. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి వారి వైఫల్యాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, అక్రమాలను నిరంతరం ఎండగడుతూ వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన సమయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ తీరును తప్పుబట్టేవారు. ఈ పరిణామాలు రుచించని ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు ఆయన్ను టార్గెట్ చేశారు. సర్కారు ఏర్పాటైన ఐదు నెలల్లో ఏడు కేసులు నమోదు చేయించారు. అక్రమ మైనింగ్ చేశారంటూ.. ఇవన్నీ బెయిలబుల్ కిందికొచ్చేవి కావడంతో పొదలకూరు మండలం రుస్తుం మైన్లో అక్రమంగా మైనింగ్ జరిపారంటూ మరో కేసును నమోదు చేశారు. ఇందులో ముగ్గురికి హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. ఏ – 4గా ఉన్న కాకాణికి బెయిల్ను అడ్డుకోవడమే లక్ష్యంగా మరో కొత్త కుట్రను తెరపైకి తెచ్చారు. మైన్లో జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలను ఉపయోగించారని.. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని.. అట్రాసిటీ కేసును బనాయించి జైలుకు పంపారు. కాగా ఇదే కేసులో ఏ – 5గా ఉన్న టీడీపీ నేతను మాత్రం విచారణకు ఇప్పటికీ పిలవలేదు. గ్రావెల్ తవ్వకాలకు జీఓ ఇచ్చినా.. వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో మట్టి తవ్వకాలకు గత టీడీపీ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. దీనికి అనుబంధంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల అవసరాల నిమిత్తం జీఓలను రెండుసార్లు విడుదల చేసింది. అందులో నిబంధనల మేరకే మట్టి తవ్వకాలు జరిగాయి. అయితే కేసులో ఏ – 2గా చూపి రిమాండ్ పొడిగించేలా చేశారు. ప్రస్తుతం ఆ కేసులో పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడంతో సోమవారానికి వాయిదా వేశారు. ఎంపీ శ్రీనివాసులురెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ తవ్వకాలు చేశారని మరో అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్ పొడిగించారు. ఇందులోనూ కాకాణిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ పూర్తి చేశారు. లేనిపోనివి తెరపైకి.. ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు వద్ద లారీ ఓనర్స్, కంటైనర్, కృష్ణపట్నం లాజిస్టిక్ అసోసియేషన్లను గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ వాహనాల నుంచి వసూలు చేశారని మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులోనూ విచారణను పూర్తి చేశారు. మద్యం కేసును తిరగదోడి.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాళెం, పొదలకూరు మండలం విరువూరులో మద్యం కేసులు పట్టుబడ్డాయి. అప్పట్లో వీటిని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈసీ నిబంధనల మేరకు వీటిపై అధికారులు చార్జీషీట్ను దాఖలు చేయడంతో కేసులు ముగిశాయి. తాజాగా ఈ రెండింటినీ తిరగదోడి కాకాణిపై పీటీ వారెంట్ను జారీ చేయడం వేధింపుల పర్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ధైర్యంగా ఎదుర్కొంటున్న కాకాణి ఈ కేసులు ఎకై ్సజ్ శాఖ పరిధిలో ఉన్నాయి. అయితే రికార్డులను పోలీస్ శాఖ బిగించి ఎకై ్సజ్ అధికారుల ద్వారా సంతకాలు చేయించి.. కాకాణి పేరును నమోదు చేసి కోర్టులో గురువారం హాజరుపర్చారు. ఈ కేసులో ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు. విరువూరు మద్యం కేసులో కాకాణిపై పీటీ వారెంట్ను సిద్ధం చేశారు. కస్టడీ పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఎన్ని అక్రమ కేసులను నమోదు చేసినా, కాకాణి మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ నెల్లూరు (లీగల్): మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఇందుకూరుపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జూలై 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ను విధిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులిచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్పై నెల్లూరు స్పెషల్ ఎకై ్సజ్ (ఇన్చార్జి) కోర్టులో ఎకై ్సజ్ పోలీసులు హాజరుపర్చారు. ఎకై ్సజ్ తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ.. కాకాణి తరఫున రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, సిద్ధన సుబ్బారెడ్డి, విజయలక్ష్మి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఇన్చార్జి న్యాయమూర్తి నిషాద్ నాజ్షేక్ జూలై 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్కు ఉత్తర్వులిచ్చారు. కాకాణి తరఫున బెయిల్ పిటిషన్ను న్యాయవాదులు దాఖలు చేశారు. తాజాగా మద్యం కేసులో పీటీ వారెంట్ ఈ నెల 17 వరకు రిమాండ్ ఆయనపై ఆరు అక్రమ కేసులు రెండు నెలల పాటు బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నం రెండు నెలల పాటు రాకూడదని.. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న కాకాణిని మరో రెండు నెలల పాటు బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసులు మరో ఆరు అక్రమ కేసులు బనాయించారు. సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యంగ్య చిత్రాలను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఎమ్మెల్యే అనుచరుడు మేకల సురేంద్ర ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గుంటూరు కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించారు. అయితే తప్పుడు కేసు కావడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. -
మహిళా సమస్యలపై ఉద్యమాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహిళా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు సంబంధించిన కార్యాచరణ నిమిత్తం ఐద్వా మహాసభలను నిర్వహిస్తున్నామని జిల్లా, నగర కార్యదర్శులు మస్తాన్బీ, కత్తి పద్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఐద్వా నగర 16వ మహాసభలను గుర్రాలమడుగు సంఘంలోని జక్కా పార్వతమ్మ, బీబీజాన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఐద్వా పతాకాన్ని ఆవిష్కరించి.. వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఐద్వా జిల్లా, నగరాధ్యక్షులు సుబ్బమ్మ, శివకుమారి, రూరల్ అధ్యక్షురాలు వరలక్ష్మి, నేతలు భాగ్యమ్మ, నాజున్నీ, ఆదిలక్ష్మి, మహ్మదా, షాహిన్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రజిని, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మా బిడ్డ మరణంపై అనుమానాలు నిగ్గు తేల్చాలి
విద్యార్థులకు మంచి సర్వీస్ ఇస్తున్నాం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. పిల్లలకు డాక్టర్స్తో తరచూ కౌన్సెలింగ్ క్లాసెస్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య కూడా చిన్న చిన్న విషయాలు కూడా పరిష్కరిస్తున్నాం. ఆ రాత్రి కూడా తండ్రితో మాట్లాడాడు. ఒక్కడివే ఎందుకు స్నేహితులతో ఉండమని తండ్రి చెప్పాడు. అయినా పర్లేదు నాకు అలవాటే నాన్న అని చెప్పాడు. అయితే ఉదయానికి ఇలా ఉరేసుకున్నాడు. – మల్లికార్జున, ప్రిన్సిపల్ నెల్లూరు సిటీ: తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించేందుకు కుమారుడిని విడిచి దూరంగా ఉండలేకపోయినా తల్లిదండ్రులు హాస్టల్లో చదివిస్తున్నారు. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం నేపథ్యంలో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని రామచంద్రాపురం మూడో వీధిలో నివాసం ఉంటున్న ఎన్.సాయిరామ్, కవిత దంపతుల కుమారుడు రేవంత్ (17)తోపాటు కుమార్తె ఉన్నారు. తండ్రి సాయిరామ్ చేజర్లలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరురూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఆ రోజు హాస్టల్ గదిలో ఒక్కడే నిద్ర తెల్లారే సరికి బాత్రూమ్లో ఉరేసుకుని విగతజీవిగా వేలాడిన వైనం హాస్టల్ నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం సెటిల్మెంట్ చేసుకుందామని తల్లిదండ్రులతో బేరసారాలు -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే మా కుమారుడి మృతి
మంగళవారం రాత్రి నా కుమారుడు రేవంత్ ఫోన్ చేసి ఎదురు రూమ్లో ఐదుగురు విద్యార్థులు రూమ్ మారుదామని చెబుతున్నారని, బూతులు కూడా తిడుతున్నారని, భయంగా ఉందన్నాడు. ప్రిన్సిపల్కు ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఇన్చార్జికి చెప్పలేదా అని అడిగితే చెప్పాను పట్టించుకోవట్లేదని రేవంత్ చెప్పాడు. వెంటనే నేను ప్రిన్సిపల్కు ఫోన్ చెప్పాను. అయినప్పటికీ ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపటికే రెండో సారి కూడా రేవంత్ ఫోన్ చేసి ప్రిన్సిపల్కు చెప్పావా నాన్న అని అడిగితే చెప్పాను.. ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడుతానని చెప్పారని బదులిచ్చాను. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు కళాశాల నిర్వాహకులు ఫోన్ చేసి రేవంత్ ఉరేసుకున్నాడని, కొన ఊపిరితో ఉన్నాడని ఫోన్ చేశారు. అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లామని చెప్పాం. మా కుమారుడు కళాశాల నిర్వాహకుల వల్లే మృతి చెందారని ఆరోపించారు. ఈ విషయవం మీడియాకు చెప్పొద్దని, సెటిల్మెంట్ చేసుకుందామని కళాశాల నిర్వాహకులు మా బంధువులతో బేరసారాలు చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మా కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయి. తోటి పిల్లలే చేశారో.. యాజమాన్యం చేశారో పోలీసులే విచారించి న్యాయం చేయాలని కోరారు. – రేవంత్ తండ్రి సాయిరామ్ -
ప్రశాంతమ్మా.. ఇదేనా అవినీతి రహిత పాలన
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అవినీతి రహిత పాలన అంటూ నిత్యం నీతులు వల్లిస్తోంది. కానీ తన నియోజకవర్గంలోనే అన్ని రంగాల్లో అవినీతే జరుగుతోంది. పోతిరెడ్డిపాళెంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. జొన్నవాడ, మినగల్లు నుంచి పోతిరెడ్డిపాళెం, పల్లిపాళెం వరకు నిత్యం భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరగుతూనే ఉంది. కానీ ఎక్కడా అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. గతంలో మినగల్లులో 12 వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాయం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆ మాయమైన ఇసుక నగదు రికవరీ ఏమైందో ఇప్పటికీ చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది. -
జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం
కోవూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు దుర్భిక్షంలో కొట్టు మిట్టాడుతున్నారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. ఏ ఊరికి వెళ్లినా ప్రజలు మా దగ్గరకు వచ్చి మా ఓట్లు వైఎస్సార్సీపీకే వేశామని, అయినా కూటమి ప్రభుత్వం వచ్చి, మా జీవితాలు దుర్భరంగా మారాయని కన్నీరు పెట్టుకుంటున్నారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మనస్సాక్షిగా ఇచ్చిన పథకం ఏ ఒక్కటీ లేదన్నారు. వైఎస్సార్సీపీ చేసిన నిరసనల ఫలితంగానే తల్లికి వందనం (అమ్మ ఒడి) డబ్బులు వేశారన్నారు. ఈ పథకం కూడా చాలా మందికి అందలేదన్నారు. చంద్రబాబు ఈవీఎంల ద్వారా సీఎం అయ్యారే కాని ప్రజలు ఇచ్చే తీర్పునకు కాదన్నారు. మా ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు నిధులు సమీకరించి అభివృద్ధి చేశామన్నారు. అదే ఈవీఎంల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం, ఎవరో తెల్ల కాగితంపైన రాసి ఇచ్చిన దానిని చదవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే దాదాపు 17 మంది ఎంపీలతోపాటు ఇతర రాష్ట్రాల ఎంపీల వద్ద నుంచి కూడా నిధులు తీసుకువచ్చి నియోకవర్గంలో అభివృద్ది పనులు చేశామని గుర్తు చేశారు. అప్పటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు చేశారన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వే ప్రసన్నన్న కృషి ఫలితమే ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వే నిర్మాణం మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రన్నకుమార్రెడ్డి కృషి ఫలితమేని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఘనత అని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతిరావు అన్నారు. ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వే నిర్మాణం ఆవశ్యకతను అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నన్న ఆ నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మొదటి విడతగా రూ.92.32 కోట్ల నిధులతో కాజ్వే నిర్మాణానికి పనులు చేపట్టడం జరిగిందన్నారు.మా ప్రభుత్వంలో మేము చేపట్టిన ఈ పనిని కూటమి ఖాతాలో వేసుకోవడం సిగ్గు చేటన్నారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి పాలనలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేపట్టిన శాశ్వత ప్రయోజనకరమైన ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశామని నిరూపిస్తే తాము రాజకీయాల నుంచే తప్పుకుంటామన్నారు. ● నెల్లూరు– మైపాడు రోడ్డుకు రూ.48 కోట్ల అంచనాతో నిధులు మంజూరు చేయించారన్నారు. బుచ్చిరెడ్డిపాళెం ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం కింద రూ.85 కోట్లు నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మరో రూ.45 కోట్లతోబుచ్చిరెడ్డిపాళెంలో సీసీ రోడ్డు, బీటీ రోడ్డుతోపాటు పార్కుల అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత మా ప్రభుత్వం, మా ప్రసన్నదేనని చెప్పారు. బుచ్చిరెడ్డిపాళెం–దగదర్తి రోడ్డు నిర్మాణ ఘటనత కూడా తమదే అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లప్రోలు విజయ్కుమార్, మండల కన్వీనర్లు శ్రీనివాసులురెడ్డి, అనూప్రెడ్డి, సతీష్రెడ్డి, నాయకులు దినేష్రెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, షాహుల్, రఫీ, జెడ్పీటీసీ శ్రీలత, ఉమ తదితరులు ఉన్నారు. కూటమి పాలనలో దుర్భిక్షంలో ప్రజలు మాజీమంత్రి ప్రసన్నకుమార్రెడ్డి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు -
‘సుపరిపాలన’కు ఎమ్మెల్యేల డుమ్మా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం ఏడాది ‘సుపరిపాలనకు తొలిఅడుగు’ కార్యక్రమానికి తొలిరోజు బుధవారం జిల్లాలో మొక్కుబడిగా జరిగింది. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ నియోజకవర్గాల్లో, కావలిలో దగుమాటి కృష్ణారెడ్డి పట్టుమని పది ఇళ్లు కూడా తిరగకుండానే మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించారు. ఉదయగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు విదేశాలకు చెక్కేశారు. స్థానికంగా ఉన్నప్పటికీ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అసలు కార్యక్రమాన్నే ప్రారంభించలేదు. అర్ధరాత్రి దర్గా కూల్చేశారు నెల్లూరు రూరల్: నెల్లూరు వెంకటేశ్వరపురంలోని మస్తానీ అమ్మవారి దర్గాను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంజినీరింగ్ అధికారులు గత నెల 30వ తేదీ రాత్రికి రాత్రే కూల్చి వేశారని కమిటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మస్తానీ అమ్మవారి దర్గాలో గత 40 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు చేస్తూ సేవ చేసుకునే వారమని తెలిపారు. ఈ దర్గా 15 అంకణాల స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముక్తియార్, సాజిదా, దస్తగిరి యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ మాధవి నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి) సూపరింటెండెంట్గా (ఎఫ్ఎసీ) బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ కె.మాధవిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియమించింది. ఆమె బుధవారం ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్గాను, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె కళాశాలలో సౌమ్యురాలిగా, నిజాయితీ గల అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్బాషా, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రైతుల పోరాటానికి అండగా ఉంటాం ● కరేడులో వామపక్ష నేతల పర్యటన ఉలవపాడు: భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమి స్తున్న కరేడు గ్రామ రైతులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ ప్రసాద్ అన్నారు. వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజాసంఘాల నాయకులు కరేడు పంచాయితీ పరిధిలోని రామకృష్ణపురం, ఉప్పరపాళెం, అలగాయపాళెం, కరేడు, పొట్టేళ్లగుంటలో బుధవారం వారు పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వ కుండా, గ్రామసభ నిర్వహించకుండా భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. మూడు పంటలు పండే పచ్చని భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. గతంలో ఇదే కంపెనీకి భూములు ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అదే కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. గత నెల 29న జరిగిన రాస్తారోకోలో పోలీసులను తోసివేసి రోడ్డెక్కిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా కరేడు రైతుల పోరాట పటిమను తెలియ చేసిందన్నారు. వరి, మామిడి, సపోట, వేరుశనగ, కూరగాయలు పండించే రైతుల భూమిని తీసుకోవడానికి ఒప్పుకోమన్నారు. సీపీఎం నెల్లూరుజిల్లా కార్యదర్శి మూలం రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్రామాల్యాద్రి, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, రైతు సంఘం ప్రకాశంజిల్లా కార్యదర్శి హనుమారెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, పీఓడబ్ల్యూ నాయకురాలు పద్మ, ఈసీసీఐ నాయకులు ఆనంద్, ఆర్యస్పీ నాయకులు సురేష్, సీపీయం నాయకులు కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి
నెల్లూరు (టౌన్): స్థానిక ధనలక్ష్మీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యసాయి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వీఆర్సీ సెంటర్లో ధర్నా నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఫీజులు, పుస్తకాల విక్రయాలపై ఉన్న శ్రద్ధ వారి భద్రతపై లేదని మండి పడ్డారు. ఇప్పటికై నా విద్యార్థి మృతిపై విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్, బాలు, సాయి, మురళి, జనార్దన్, అబు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులను అరెస్ట్ చేయడం దుర్మార్గం
నెల్లూరు (అర్బన్): విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ అన్నారు. యువ వైద్యుల అరెస్ట్ను నిరసిస్తూ బుధవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరికి ఆ సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి విదేశాల్లో చదివి పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అయిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ను పర్మినెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వమని కోరారన్నారు. గత 13 నెలలుగా రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వచ్చిన యువ వైద్యులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర అధ్యక్షుడు ఆశిర్, నాయకులు చరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
అత్తమామల హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కావలి(జలదంకి): ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో అత్తమామలను హత్య చేసిన ఏలూరు వెంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పి.శ్రీధర్ వివరాలు వెల్లడించారు. వెంగయ్యకు వెంకాయమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. చేపల వేట, చిల్లకర్ర కొట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వెంగయ్య అత్తమామలు చలంచర్ల కల్లయ్య (62), చలంచర్ల జయమ్మ (59)లు వారింటి సమీపంలోనే ఉంటూ మేకలు కాస్తున్నారు. వెంగయ్య నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం వెంగయ్య భార్యను పిట్టల వేటకు రమ్మని పిలవగా రాలేనని చెప్పింది. వేటకు వెళ్లి వచ్చిన అతడికి భార్య వేరేవారితో చేపల వేటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో వెంగయ్య భార్యపై మరింత అనుమానం పెంచుకుని ఫూటుగా మద్యం తాగాడు. అనంతరం భార్య తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉండగా అక్కడికి వెళ్లాడు. మచ్చు కత్తితో వెంకాయమ్మ వీపుపై నరికాడు. కుమార్తెను కాపాడాలని కల్లయ్య, జయమ్మ అడ్డు వెళ్లారు. వెంగయ్య భార్యను వదిలేసి అత్తమామలను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెంగయ్య కోసం గాలించారు. అతడిని లక్ష్మీపురం శివారులోని మిద్దెలబోడు కొండ – రామస్వామికుంట వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కలిగిరి సీఐ వెంకట్రావ్, దుత్తలూరు, ఉదయగిరి ఎస్సైలు ఆదిలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి, సిబ్బందిని అభినందించారు. -
రొట్టెల పండగకు ఏర్పాట్లు
● ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు.. ● రూ.3.5 కోట్లతో వసతులు ● మూడు షిఫ్ట్ల్లో 5 వేల మంది పారిశుధ్య కార్మికులు ● 14 పార్కింగ్ స్థలాల గుర్తింపునెల్లూరు(బారకాసు): నెల్లూరులో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు రొట్టెల పండగను నిర్వహించనున్నారు. రూ.3.5 కోట్లతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పండగకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో 12 తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు పెట్టారు. వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండేందుకు షెడ్లపైన వాటర్ ప్రూఫ్ జింక్షీట్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు దాదాపు 14 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. నగరంలోని పాత టీబీ హాస్పిటల్, సైన్స్ పార్కు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణం (బాలుర వసతి గృహం వెనుక), వైఎంసీఏ క్రీడా మైదానం, ఎన్టీఆర్ నగర్ సమీపంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణం, పాత సీవీ రామన్ స్కూల్ ప్రాంగణం, జొన్నవాడకు వెళ్లే దారిలోని డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ ముందు వైపు, డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రాంగణం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెనుక వైపు (కస్తూరిదేవి స్కూల్ ఎదురుగా) ఉన్న ఎగ్జిబిషన్ స్థలం, పొదలకూరురోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, వీఆర్సీ క్రీడా మైదానం, డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణం, కస్తూర్బా గార్డెన్ వెనుకవైపు ఉన్న ప్రాంగణం, ప్రసార భారతి (ఆకాశవాణి) రేడియో కేంద్ర సమీపంలోని ప్రాంగణంతోపాటు అవసరం మేరకు పోలీసు అధికారులు సూచించే మరికొన్నిచోట్ల పార్కింగ్ స్థలాలు కేటాయించడం జరుగుతుంది. వాటి వద్ద కార్పొరేషన్ అధికారులు మొబైల్ టాయిలెట్స్, స్నానపు గదులు, తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా విద్యుత్ దీపాలు పెడుతున్నారు. సీసీ కెమెరాలు అమర్చనున్నారు. దర్గా ప్రాంగణంలో 40 సీసీ కెమెరాలతోపాటు మరో 5 పీటీజెడ్ కెమెరాలు, 2 డ్రోన్ల నిత్యం పరిశీలించనున్నారు. వాటిని పోలీస్ కంట్రోల్రూంకు అనుసంధానం చేయడం జరుగుతుంది.ఏర్పాట్లు ఇలా.. బారాషహీద్ దర్గా ప్రాంగణంతోపాటు సమీప ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు 5 వేల మంది కార్మికులను నియమించడం జరుగుతుంది. స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద మోటార్లతో వాటర్ ప్యూరిఫై చేసే పనులు చేపట్టనున్నారు. దర్గా ప్రాంగణంతోపాటు కేవీఆర్ పెట్రోల్ బంక్, బట్వాడిపాళెం సెంటర్, పొదలకూరోడ్డు కూడలి వరకు రోడ్డుకిరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వీఐపీ రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా టెంట్ వేస్తున్నారు. అన్నదానం చేసేందుకు మరో రెండు టెంట్లు వేయనున్నారు. ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. నిత్యం సమీక్షిస్తున్నాం రొట్టెల పండగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాం. దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాం. నిత్యం అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నాం. – వైఓ నందన్, కమిషనర్, నెల్లూరు నగరపాలక సంస్థ -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: నగర పంచాయతీ పరిధిలోని జొన్నవాడ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించి స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని 108 అంబులెన్స్లో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలినెల్లూరు(అర్బన్): మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నెల్లూరు అబ్స్టెట్రిక్, గైనకాలజికల్ సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సుప్రజ, డాక్టర్ లలితా షిర్ధీశా అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నెల్లూరు అబ్స్టెట్రిక్ సంఘానికి చెందిన మహిళా డాక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె తన పిల్లలను, భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందన్నారు. మారిన ఆధునిక జీవనంలో రుతుక్రమంలో మార్పులు రావడం, ఊబకాయం సమస్యలు వస్తున్నాయన్నారు. ఆలస్యపు వివాహాల వల్ల సంతాన సాఫల్యత లేకపోవడం కూడా జరుగుతుందన్నారు. హైరిస్క్తో కూడిన గర్భిణులు ఎక్కువవుతున్నారన్నారు. ఇందువల్ల కాన్పులో సమస్యలు వస్తున్నాయన్నారు. అందువల్ల ఆరోగ్యానికి మహిళలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు డాక్టర్ వాణి, డాక్టర్ అహల్య, డాక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలపై రైతులకు అవగాహన
● దిశ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ● అంగన్వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ నిధులు ● చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ● హాజరుకాని మంత్రులు, ఎమ్మెల్యేలునెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నెల్లూరు ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో–ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ)ను మంగళవారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో 732 అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, శాశ్వత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 కోట్లతో 24 ప్రాజెక్ట్లు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ద్వారా 89,577 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 25,640 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. జిల్లా అభివృద్ధి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ● జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ అడిగిన వెంటనే రోడ్లు మంజూరు చేసిన ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్లో పాఠశాలకు జెడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ పాటించలేదని, ఆహ్వానాన్ని పంపించలేదన్నారు. ఇందుకు సంబంధించి ఏఈని ఎక్కడ దాచి పెట్టారని ప్రశ్నించారు. ఏఈపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ నిధులు మంజూరు చేశామని తెలిపారు. తిరుపతి జిల్లాలో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని తెలిపారు. ● కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి గత సమావేశంలోనూ పీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ప్రగతి చూపలేదని, ఇదే విధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, జెడ్పీ సీఈఓ మోహన్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మరికొంతమంది అర్హులను చేర్చేందుకు అవకాశం ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దాని కోసం తహసీల్దార్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ● సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లాలో ఉన్నా హాజరుకాలేదు. -
డెంగీ రహిత సమాజం కోసం కృషి
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): డెంగీ వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. డెంగీ అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా నివారణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయం నుంచి ములుముడి బస్టాండ్, గుప్తా పార్కు మీదుగా ర్యాలీ జరిగింది. దీనిని జెండా ఊపి ప్రారంభించిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, జ్వరం, చర్మంపై ఎర్రటి మచ్చలు, వాంతులు తదితర లక్షణాలుంటే డెంగీగా అనుమానించి రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా చూసుకోవడం ద్వారా డెంగీతోపాటు మలేరియా తదితర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ, మలేరియా నివారణ సహాయ అధికారి నాగార్జునరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. పీజీఆర్ఎస్ అర్జీలు, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్ల పంపిణీ మొదలైన అంశాలపై మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో అశ్రద్ధగా ఉంటే చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లాలో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల్లో పురోగతి మెరుగుపడాల్సి ఉందన్నారు. హౌసింగ్లో ఉపాధిని అనుసంధానిస్తూ 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. జిల్లాలో పాఠశాలలన్ని ప్రారంభమయ్యాయని, ఇంకా ఒకటో తరగతిలో చేరాల్సిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అత్యంత నిరుపేదలకు మంజూరైన అంత్యోదయ కార్డులకు ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతినెలా ఒకటో తేదీన 95 శాతానికి పైగా పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. పంపిణీలో అశ్రద్ధగా ఉంటే సస్పెండ్ చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్, హౌసింగ్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వేణుగోపాల్, గంగాభవాని, నాగరాజకుమారి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్రావు, విద్యుత్శాఖ ఎస్ఈ విజయన్, సీపీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
93.83 శాతం పింఛన్ల పంపిణీ
నెల్లూరు (పొగతోట): జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 3,04,034 మందికి పింఛన్ల నగదు అందజేయాల్సి ఉండగా 2,85,261 మందికి పంపిణీ చేశారు. నగరంలోని పొదలకూరు రోడ్డు లోని గౌతమీనగర్లో దివ్యాంగురాలు భానుశ్రీకి కలెక్టర్ ఓ ఆనంద్ నగదు అందజేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ అరుణ నియామకం ● తిరస్కరించిన డాక్టర్ నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ సిద్ధానాయక్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) సూపరింటెండెంట్గా పెద్దాస్పత్రిలోని పల్మనాలజీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ అరుణను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను ఆమె తిరస్కరించారు. తాను ఆ బాధ్యతలు చేపట్టలేనని డీఎంఈకు విన్నవించారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం నెల్లూరు రూరల్: రొట్టెల పండగ ఏర్పాట్లలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో రొట్టెల పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే రొట్టెల పండగకు గతంలో కంటే ఎక్కువగా భక్తులు విచ్చేస్తారని, అందుకనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాల చెరువులో సరిపోయే నీటిని ఉంచాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాల వద్ద, ఇతర అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. మెడికల్ టీంలను, అంబులెన్స్లను సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లలో భాగమయ్యే వివిధ శాఖల సిబ్బందికి ఆయా రోజుల్లో ఎటువంటి సెలవులు మంజూరు చేయొద్దని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ కార్తీక్, ఏఎస్పీ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్డీఓ అనూష, విద్యుత్, ఇరిగేషన్ ఎస్ఈలు విజయన్, దేశ్నాయక్, డీఎంహెచ్ఓ సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధుల ఆచూకీ కోసం గాలింపు
సోమశిల: మల్లెంకొండ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధులు కోటపాటి రత్నయ్య, కోటపాటి సుబ్బయ్య నాయుడుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మంగళవారం సోమశిల ఎస్సై అనూష, అనంతసాగరం ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి, పొదలకూరు ఎస్సై హనీఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యులు ఇతర వ్యక్తులతో చిలకలమర్రి మల్లెంకొండ శిలల వద్దకు వెళ్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 40 మంది వెళ్లారు. అయినా అన్నదమ్ముల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్మగ్లర్ల చేతిలో చిక్కుకున్నారా అనే అనుమానంతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఎస్సై అనూష మాట్లాడుతూ వృద్ధుల ఆచూకీ తెలిపితే రూ.10 వేల పారితోషికం అందిస్తామన్నారు. -
జగన్ పర్యటనపై కూటమి కుట్రలు
కోవూరు: రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నెల్లూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్ను కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అర చేతితో సూర్యకాంతిని ఎలా ఆపలేరో.. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, కుట్రలు సృష్టించినా జగన్ పర్యటనను ఆపలేరని తెలుసుకోవాలన్నారు. జగన్ హెలికాప్టర్ దిగడానికి కూడా వీలులేకుండా చేయడం దుర్మార్గమని, నెల్లూరేమన్నా.. చంద్రబాబు నాయన ఖర్జూరపునాయుడు జాగీరా అని ప్రసన్నకుమార్రెడ్డి మండిపడ్డారు. జగన్ ప్రజల మధ్య ఉండే నాయకుడని, ఆయన పర్యటనల్లో ప్రజలు తండోపతండాలుగా పాల్గొంటారని చెప్పారు. ‘బాబు, లోకేశ్, పవన్ పర్యటనలకు సెక్యూరిటీ సిబ్బంది తప్ప.. జనం కానరాని, అదే జగన్ వస్తే వేలాదిగా జన ప్రభంజనమవుతుందన్నారు. గతంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ నిర్వహించిన సభలను వైఎస్సార్సీపీ ఎప్పుడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. కాకాణి గోవర్ధన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. కాకాణితో ములాఖత్ అయ్యాక, ఆ కుటుంబాన్ని పరామర్శించే ఈ పర్యటనను అడ్డుకోవడం ప్రభుత్వం దుర్మార్గమన్నారు. ఇది రాజకీయ పర్యటన కాదని, మానవతా పరమైన పరామర్శ మాత్రమే అన్నారు. కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ బాబు ఇటీవల ఐదారు సర్వేలు చేయించారు. 97 స్థానాల్లో టీడీపీ ఎమ్యెల్యేలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని నివేదికలు రావడంతో చంద్రబాబులో టెన్షన్ ప్రారంభమైందన్నారు. ఇటీవల జరిగి టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి 15 ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. వీటన్నంటిని చూసి భయంతో జగన్ పర్యటనలకు అనుమతులు నిరాకరణ చేస్తున్నాడని ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. అక్రమ అరెస్టులకు ప్రజల తీర్పు సిద్ధం వైఎస్సార్సీపీ నేత వీరి చలపతిరావు మాట్లాడుతూ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్రలకు కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు సిద్ధంగా ఉందన్నారు. కాలువ గట్లు, పొలాలు గట్లపై జనం పరుగులు తీస్తున్న తీరు చూసి కూటమి నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. కూటమి నాయకులూ కళ్లు తెరిచి ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ చేసిన పోరాట ఫలితంగానే తల్లికి వందనం (అమ్మఒడి ) పథకం వచ్చిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి దినేష్రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, విజయకుమార్రెడ్డి, సతీష్రెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, షాహుల్, బాలశంకర్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శ్రీలత, రఫీ, రూప్కుమార్రెడ్డి తదితరులున్నారు. నెల్లూరు ఏమన్నా.. ఖర్జూరపునాయుడి జాగీరా? జగన్ బయటకు వస్తే బాబుకు భయం మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి -
ఇది ముమ్మాటికీ అక్రమ కేసే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను స్పష్టంగా పోలీసులను అడిగేది ఒకటే. నా పాత్రపై ఏమైనా ఉంటే రుజువు చేయగలరా? ఇది అక్రమ కేసని తెలియకుండా కప్పిపుచ్చడానికి పోలీస్ కస్టడీ పేరుతో దొంక తిరుగుడు ప్రశ్నలు సంధించడం తప్ప మరోకటి లేదు. రెండు రోజులుగా పోలీస్ కస్టడీలో నా పాత్ర గురించి కానీ, నాకు ఒనగూరిన లబ్ధి గురించి ఏ చిన్న ఆధారాన్ని పోలీసులు చూపించలేకపోయారంటే ఇది ముమ్మాటికీ అక్రమ కేసు బనాయించడమేని అర్థమవుతోంది.’ అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీసులను నిలదీసినట్లు సమాచారం. కృష్ణపట్నం లాజిస్టిక్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేశారని నమోదైన అక్రమ కేసులో సెంట్రల్ జైల్లో జ్యుడిషి యల్ రిమాండ్లో ఉన్న కాకాణిని రెండు రోజులపాటు ముత్తుకూరు పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. మొదటి రోజు 52 ప్రశ్నలు, రెండో రోజు మంగళవారం ఆరు ప్రశ్నలు అడగడంతో కాకాణి దీటుగా సమాధాన మివ్వడంతో పోలీసులు సైతం నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనం మీరు అక్రమ కేసులు బనాయించడం, సాక్షులు, సహ నిందితులను భయపెట్టి బెదిరించి ఇష్టారీతిన స్టేట్మెంట్ల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తెల్ల కాగితాల మీద ముందుగానే సంతకాలు తీసుకుంటున్నారు. న్యాయస్థానంలో నిలబడని స్టేట్మెంట్లపై నేను వ్యాఖ్యానించ దలుచుకోలేదు. నేను తప్పు చేసి ఉంటే సాంకేతిక పరంగా విచారణ చేసి నా పాత్ర ఉందని రుజువు చేస్తే నేను ఏ శిక్షకై నా సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సవాల్ విసిరారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ అక్రమ కేసుల్లో వైఎస్సార్సీపీ చెందిన వారినే నిందితులుగా చూపిస్తూ డాక్యుమెంట్లో ఉన్న మిగిలిన వారిని వదిలి వేయడం పోలీసుల పక్షపాతి వైఖరికి నిదర్శనమని విమర్శించారని సమాచారం. ఎవరో చేసే వ్యాపారాలకు నన్ను జవాబుదారి చేయడం పోలీసులకు భావ్యం కాదన్నారు. నాకు అసోసియేషన్ గొడవలతో ఏంటి సంబంధం, పత్రికల్లో వచ్చిన వార్తలను నేను పట్టించుకోను. ఇటీవల పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు ‘ఓ ఎల్లో పత్రికలో నాకు గుర్తులేదు. మా న్యాయవాదులను అడగండి’ అని చెప్పినట్లు నేను మాట దాటవేసినట్లు రాశారు. ఇవన్ని అసత్యాలే. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెపుతున్నాను. నాకు తెలియని విషయాలు మాత్రం తెలిదయనే చెప్పుతున్నాను. నాపై బురద చల్లేందుకు కక్ష కట్టి తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. నాకు సంబంధం లేని ఈ కేసులో పోలీసులు ఏ–1గా చేర్చారు. ఇది కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసిందనేందుకు ఇదే నిదర్శనంగా చూపవచ్చు. సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలపై కేసులా? సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు నాతో పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నా మీద, వైఎస్సార్సీపీ నాయకులు మీద నిత్యం అసత్య ఆరోపణలు చేశారు. యూనియన్ గొడవల్లోకి రాజకీయ జోక్యం అవసరం లేదు. ఏ యూనియన్లతో కానీ, ప్రెస్మీట్లతో కానీ నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు నాపై అక్రమ కేసు బనాయించినట్లే అవుతోంది. రెండు రోజుల పాటు నన్ను కస్టడీకి తీసుకున్నారు కదా నా సమక్షంలోనే సాక్షులను విచారిస్తే నాకు వారితో సంబంధం లేదని తెలుస్తోంది. అలా చేయకుండా కస్టడీ పేరుతో ఏదో జరుగుతుందంటూ ప్రచారం చేయడానికి కాకపోతే దేనికి ఇదంతా అని కాకాణి సంధించిన పలు ప్రశ్నలకు పోలీసులు సైతం నీళ్లు నమలాల్సి వచ్చింది. కృష్ణపట్నం కేసులో తన పాత్రపై స్పష్టత ఇవ్వగలరానని కాకాణి డిమాండ్ పలు ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానం తిరిగి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పోలీసులు -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా
వెంకటాచలం: ప్రతిపాదిత హెలిప్యాడ్ ప్రాంతం అనువైనది కాకపోవడంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే... వాటిని పోలీసులు, అధికారులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు సూచించిన హెలిప్యాడ్ స్థలాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయ్కుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి కుమార్తె పూజిత తదితరులు మంగళవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల్లో.. కాకాణి గోవర్థన్రెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ములాఖత్ కోసం వైఎస్ జగన్ పర్యటనను ఖరారు చేస్తే పది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం, పోలీసులు అంగీకరించడం లేదని తెలిపారు. చివరగా సెంట్రల్ జైలు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ విద్యుత్తు వైర్లు ఉన్న ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సరికాదన్నారు. అక్కడ రోడ్లు వేయాలన్నా, రెండు, మూడు రోజులు పడుతుందని, హెలికాప్టర్కు తిరిగి ఇంధనం నింపాలన్నా రేణిగుంట వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వేలాదిగా తరలివచ్చే వైఎస్ జగన్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత కల్పించడం లేదని తెలిపారు. ప్రాంతం, సాంకేతికంగా సమస్యలు ఉన్నట్లు పార్టీ నాయకత్వానికి తెలియజేశామని చెప్పారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన తేదీని మళ్లీ నిర్ణయిస్తామని తెలిపారు. -
నెల్లూరులో అత్తమామలను నరికి చంపిన అల్లుడు
భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.25 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8 వెట్టిచాకిరి నుంచి కాపాడండినెల్లూరు రూరల్: యానాది వర్గానికి చెందిన నిరుపేద పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి హోటళ్లు, వివిధ గృహాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వారిని కాపాడాలని యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చౌటూరు శీనయ్య కోరారు. నెల్లూరులోని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారన్నారు. సదరు కిడ్నాపర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారన్నారు. బాధితులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా తరిమేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. సమావేశంలో శీనమ్మ, ఎం.మస్తానమ్మ, శేషమ్మ, మౌనిక, సుబ్బరత్న, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలలను ఎత్తేయడం అన్యాయం
యానాది కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలను ఎత్తేయడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి అన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మల్లి మాట్లాడుతూ బోగోలు మండలంలోని కొండబిట్రగుంట యానాది కాలనీలో 46 మంది విద్యార్థులున్న పాఠశాలను పక్క గ్రామంలోని స్కూల్లో విలీనం చేయడం దారుణమన్నారు. దళిత, గిరిజనులకు విద్య లేకుండా చేయడం అన్యాయమన్నారు. 80 మంది యానాది పిల్లలకు తల్లికి వందనం రాలేదన్నారు. కార్యక్రమంలో ఎస్.లక్ష్మయ్య, అశోక్, రాచగిరి మురళి, పి.హరిబాబు, 150 మంది మహిళలు పాల్గొన్నారు. -
లారీలో నుంచి పడి క్లీనర్ మృతి
కోవూరు: జాతీయ రహదారిపై వినాయక స్వామి గుడి సమీపంలో సోమవారం విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీలో నుంచి నారాయణ (37) అనే క్లీనర్ నిద్రమత్తులో అదుపుతప్పి కింద పడిపోయాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు నారాయణ మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై రంగనాథ్ గౌడ్ పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
డాక్టర్ల సేవలకు సలాం
● కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు ● నేడు డాక్టర్స్ డేనెల్లూరు(అర్బన్): అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆపదలో ఉండే రోగులకు డాక్టర్లు ప్రాణాలు పోస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్నా, ఒళ్లంతా కాలినా, పాము కరిచినా.. కొట్లాటలో కత్తులు దిగబడినా డాక్టర్లు వృత్తినే దైవంగా భావించి విసుగు, విరామం లేకుండా వైద్యం చేసి కాపాడుతున్నారు. తెల్లని చొక్కా ధరించి, చిరునవ్వుతో, నిబద్ధతతో, అంకితభావంతో వైద్యం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ను దేవుడితో సమానంగా చూస్తారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులను కాపాడారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని డాక్టర్స్ డేగా జరుపుకొంటున్నారు. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు నిర్వహిస్తారు. రోగులకు సేవలందిస్తూ.. జిల్లాలో సుమారు 1,300 వరకు ఆస్పత్రులు, క్లినిక్లున్నాయి. వీటిలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆస్పత్రులు (సీహెచ్సీలు), ఆత్మకూరులో జిల్లా ఆస్పత్రి, కందుకూరు, కావలిలో ఏరియా ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 2 వేల మంది డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యం అందరి హక్కు ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా అందాలని డాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లను మినహాయిస్తే ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వ డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీరికి వైద్యం అందించడంలో విశేష కృషి చేస్తున్నారు. డెంగీ, డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నారు. వైద్యం చేసి.. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు తమ గేట్లు మూసేసుకున్నాయి. పలు హాస్పిటళ్లు వైద్యం చేసినా రోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారి నాడి పట్టిన పాపాన కూడా పోలేదు. అలాంటి తరుణంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యసేవలందించిన ఘనత ప్రభుత్వ వైద్యులకే దక్కుతుంది. జిల్లాలో 2 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడగా వారికి వైద్యం చేస్తూ ఐదుగురు వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయారు. -
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ..
బోగోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అబ్దుల్ జహీర్ అక్రమాలకు పాల్పడ్డాడని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బోగోలు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మద్దిబోయిన వీర రఘు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా జమ ఖర్చులు అడిగామన్నారు. దీనికి కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిసిందన్నారు. తాగునీటి వసతి కోసం సుమారు రూ.7 లక్షలు, పారిశుధ్య సామగ్రి కొనుగోలుకు రూ.4 లక్షలు, ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం రూ.4,47,300, ట్రాక్టర్ డీజిల్ కోసం రూ.2,27,752, గ్రామసభలు స్వర్ణ పంచాయతీ, షామియానాల పేరుతో రూ.1.60 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పారన్నారు. ప్రైవేట్గా పనిచేస్తున్న దేవరపల్లి మనోహర్ ద్వారా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అతడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అదేవిధంగా సర్పంచ్ వద్ద ప్రతి పనికీ లంచం తీసుకుంటున్నారని తెలిపారు. సర్పంచ్ భర్త పందిపాటి ఉదయ్కుమార్, కార్యదర్శి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించాలని కోరారు. -
అందుబాటులో వైద్యం
ఆరోగ్యం అనేది ప్రజల హక్కు. ప్రజారోగ్యాన్ని పేద, ధనిక తేడా లేకుండా అందరూ సమానంగా పొందగలగాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. వైద్యాన్ని ప్రైవేట్పరం చేయకూడదు. వైద్యకళాశాలలను ప్రభుత్వం నిర్వహించాలి. బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలి. మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ తొలగించాలి. అప్పుడే ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు -
‘ఉపాధి’ బకాయిల విడుదలకు డిమాండ్
● ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం బీజేపీకి వంత పాడుతూ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలి’ అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి క సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పిస్తామని చెప్పి 60 శాతం పనులను యంత్రాలతో చేయించడానికి తీర్మానాలు చేశారన్నారు. ప్రస్తుతం కూలీలతో కేవలం 40 శాతం పనులు కూడా గ్రామాల్లో చేయించడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. పని ప్రదేశాల్లో నిబంధనలను పాటించడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం మెడికల్ కిట్ కూడా ఉంచడం లేదన్నారు. జిల్లాలో 12 వారాలకు సంబంధించి బకాయిలున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు, ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, నాపాల వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సిలిండర్ల చోరీ కేసులో దొంగల అరెస్ట్
నెల్లూరు సిటీ: డెలివరీ బాయ్స్ను ఏమార్చి 23 సిలిండర్లను అపహరించిన కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సంతపేట సీఐ దశరథరామారావు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది గత నెల 28, 29 తేదీల్లో సిలిండర్లను డెలివరీకి తీసుకెళ్లగా దొంగలు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4వ మైలుకు చెందిన పి.కార్తీక్, విడవలూరు మండలంలోని చవటపాళేనికి చెందిన పి.అనూష్కుమార్లను అరెస్ట్ చేసి రూ.1.15 లక్షల విలువైన 23 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఏకలవ్య భవన నిర్మాణం కోసం..
నగరంలో ఏకలవ్య భవనం నిర్మించాలని ఏపీ గురుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ శివ కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు, సమావేశాలు చేపట్టాలంటే ఇబ్బందిగా ఉందని, అందుకోసం ప్రత్యేకమైన ఏకలవ్య భవనాన్ని నిర్మించాలని కోరారు. స్థలాన్ని కేటాయించినా భవన నిర్మాణాన్ని తామే చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి బుజ్జయ్య, చైర్మన్ కట్టా రామారావు, సలహాదారులు కట్టా రమణయ్య, ఉపాధ్యక్షులు నల్లగొండ్ల వెంకయ్య, దేవరకొండ చిన్నోడయ్య, కట్టా కాటయ్య ఉన్నారు. -
అవగాహన కల్పించాలి
ఆరోగ్యమంటే మందులు, చికిత్సతోనే రాదు. పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, పరిసరాల పరిశుభ్రత, మంచి ఆరోగ్య అలవాట్లతో నూటికి 80 శాతం జబ్బులు రాకుండా అరికట్టవచ్చు. రోగం వచ్చిన తర్వాత కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జబ్బులకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం వైద్యశాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు కలిసి ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలను ప్రైవేట్ వైద్యశాలలు కూడా తక్కువ ఖర్చుతోనే రోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, పీపీ యూనిట్ ● -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సైదాపురం: బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాపురం దళితవాడలో సోమవారం జరిగింది. ఎస్సై క్రాంతి కుమార్ కథనం మేరకు.. దళితవాడకు చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఓ కుమారుడు గతంలో మృతిచెందాడు. దంపతులు మూడేళ్ల క్రితం అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. అప్పులు తీర్చేందుకు వెంకటరమణయ్య కువైట్ వెళ్లాడు. మూడేళ్లపాటు అక్కడే ఉండి గత వారం స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూ డూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నం లాజిస్టిక్స్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేసినట్లు ఏ ఒక్క ఆధారం చూపించినా ఏ శిక్షకై నా తాను సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీస్ అధికారులకు సవాల్ విసిరారు. ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఫరీద్బాబు జూన్ 7వ తేదీ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ–1గా కాకాణి గోవర్ధన్రెడ్డి, ఏ–2గా మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, ఏ–3గా తూపిలి శ్రీధర్రెడ్డి, ఏ–4గా స్వామి బాలాజీ ట్రాన్స్పోర్టు, ఏ–5గా టాటా వెంకట శేషయ్య, ఏ–6గా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు ప్రసాద్, ఏ–7గా రాగా వెంకటేశ్వర్లు, ఏ–8గా పొట్టి రాజా, ఏ–9గా సాయికిరణ్తోపాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. అప్పటికే జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్ కింద తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీకి కావాలని పోలీసులు కోరగా, రెండు రోజులకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కృష్ణపట్నంపోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై విశ్వనాథరెడ్డి జిల్లా సెంట్రలో జైల్లో ఉన్న కాకాణిని తమ కస్టడీకి తీసుకుని జిల్లా జైలు పక్కనే నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారణ చేపట్టారు. తొలిరోజు పోలీసులు 52 ప్రశ్నలు సంధించారు. పోలీస్ అధికారులు అడిగిన ప్రశ్నలకు న్యాయవాది శ్రావణ్కుమార్ సమక్షంలో కాకాణి సమాధానాలు ఇచ్చారు. పోలీసులు: కృష్ణపట్నం లాజిస్టిక్స్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన మెట్టా విష్ణువర్ధన్రెడ్డి ద్వారా మీకు చేరినట్లుగా మా దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులను మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా? ఎక్కడైనా డిపాజిట్ చేశారా? మీకు ఎంత మొత్తం వచ్చిందో తెలిపాలి? కాకాణి: నాకు ఏ ఒక్క పైసా చేరినట్లు మీ దగ్గర సాక్షాధారాలు ఉంటే చూపించండి. నేను ధైర్యంగా చెబుతున్నాను. ఏ రూపంగా అయినా ఎవరి దగ్గర నుంచి అయినా ఒక్క నయాపైసా అయినా ముట్టినట్లు రుజువులు చూపిస్తే.. నేనే న్యాయాధికారి దగ్గరకెళ్లి ఎటువంటి విచారణ అవసరం లేకుండా నేను శిక్షార్హుడనని ఏ శిక్ష విధిస్తారో విధించమని వారికి విజ్ఞప్తి చేస్తాను. పోలీస్ : కృష్ణపట్నం కంటైనర్స్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ గురించి మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి. కాకాణి : నాకు ఎలాంటి సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన తప్పుడు కేసు తప్ప మరొకటి కాదు. కేవలం తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు కట్టడం తప్ప ఇంకోటి కాదు. పోలీసుల విచారణ జరిపి ఆధారాలు బయట పెడితే ఎలాంటి శిక్షకై నా నేను సిద్ధమే. పోలీస్ : ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ గోపాలనగరానికి చెందిన ద్వారం రామిరెడ్డితో మీకున్న పరిచయం చెప్పండి. కాకాణి : ఎలాంటి పరిచయం లేదు. పేరు కూడా వినలేదు. మీరు చెప్పిన వారందరిని రెండు రోజుల కస్టడీ సమయంలో నా ఎదురుగా ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తొలిరోజు పోలీసుల కస్టడీ విచారణలో కాకాణి సవాల్ మొదటి రోజు విచారణ పూర్తినెల్లూరు (లీగల్): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ముత్తుకూరు పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొదటిరోజు విచారణ పూర్తయింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కాకాణిని న్యాయవాది నందగమ శ్రావణ్కుమార్, మధ్యవర్తులుగా ముత్తుకూరు మండలం పంటపాళెం వీఆర్వో గండవరం భక్తవత్సలరెడ్డి, ముత్తుకూరు వీఆర్వో బాలు వెంకటరమణయ్య సమక్షంలో విచారించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కాకాణిని కేంద్ర కారాగారానికి తరలించారు. -
జగనన్న పర్యటనను ఆపలేరు
● కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వస్తాడు ● తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీమంత్రి అనిల్, వైఎస్సార్సీపీ నేతలు నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా జైల్లో ఉన్న మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు 3న నెల్లూరుకు వచ్చే జగనన్న పర్యటనను అడ్డుకునేందుకు అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వచ్చి తీరుతాడని చెప్పారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయ్కుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, కాకాణి కుమార్తె కాకాణి పూజితలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. హెలిప్యాడ్ కోసం 3, 4 స్థలాలను నాయకులు పరిశీలించారని, అడ్డంకులు, సాకులు చెబుతూ ఆ స్థలాలను అనుమతించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడూ ఈ ప్రభుత్వమే ఉండదని, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. జగనన్న మీద రాజకీయ కక్షతో హైడ్రామాలు చేయాల్సిన అవసరం లేదని, ఇలా పర్యటనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. సంవత్సరంలోనే ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని, ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎక్కువ రోజులు ఉండవన్నారు. ● మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ 10 రోజుల నుంచి జగనన్న పర్యటనకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికి హెలిప్యాడ్ అనుమతి విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. జగనన్న పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయయో అర్థం కావడం లేదన్నారు. రెండున్నర కి.మీ. సెక్యూరిటీ ఉండే విధంగా గుర్తించిన హెలిప్యాడ్పై అధికారులకు క్లారిటీ లేకపోవడం వారి భయాందోళలను తెలియజేస్తుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతాన్ని ఎంచుకున్నప్పటికీ అధికారు లు మరో ప్రాంతాన్ని చూపించడం, మూడు రోజుల నుంచి కాలయాపన చేయడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 3వ తేదీ జగనన్న నెల్లూరుకు రావడం తథ్యమన్నారు. ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కొత్తూరులోని సెయింట్యాన్స్ స్కూల్, కాకుటూరు లో మరో స్థలాన్ని హెలిప్యాడ్కు కేటాయించాలని అధికారులను కోరినప్పటికి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. సెయింట్యాన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అధికార పార్టీ నేతలు బెదిరించి జగనన్న పర్యటనకు అడ్డంకులు సృష్టించారన్నారు. జైలుకు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లు ఉండి అప్రోచ్ రోడ్డు లేని స్థలాన్ని చూపిస్తూ అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. షరతులతో సెంట్రల్ జైలు వద్ద స్థలం చూపడం సరైన పద్ధతి కాదన్నారు. జగనన్న వస్తుంటే ముందుగానే కాకాణిపై పీటీ వారెంట్ పెట్టి కోర్టుకు తరలిస్తారనే అనుమానం కూడా కలుగుతుందన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎంకే స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. జగనన్న పర్యటనను అడ్డుకునే ఆలోచనతో కూటమి నేతలు ఉన్నారన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతల్లో భయం కనిపిస్తుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజాక్షేత్రంలోకి రావాలంటే భయం పుడుతుందన్నారు. -
కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కొండలరావు, చైతన్య ప్రకాష్లకు సోమవారం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్రావు నియామాక ఉత్తర్వులు అందజేశారు. డీఆర్వో బదిలీ నెల్లూరు (అర్బన్): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా పనిచేస్తున్న ఉదయభాస్కర్రావును బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆయన్ను అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్లోని రెవెన్యూ శాఖలో ప్రభుత్వ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించింది. రెగ్యులర్ డీఆర్వోను నియమించేంత వరకు ఎఫ్ఏసీ డీఆర్వోగా అర్హత గల వారిని కలెక్టర్ నియమించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీపీటీఓగా ఎస్కే షమీమ్ నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా ప్రజా రవాణా శాఖ (డీపీటీఓ) అధికారిగా ఎస్కే షమీమ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీపీటీఓగా విధులు నిర్వహిస్తున్న మురళీబాబు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరులోని డిప్యూటీ సీటీఎంగా విధులు నిర్వహిస్తున్న షమీమ్కు బాధ్యతలు అప్పగించారు. ఆమె స్థానంలో శృంగవరపుకోట డిపో మేనేజర్ రమేష్ను ఉద్యోగోన్నతిపై నెల్లూరు డిప్యూటీ సీటీఎంగా బదిలీ చేశారు. వాకాటి సోదరులకు నోటీసులు పొదలకూరు: పట్టణానికి చెందిన వాకాటి సోదరులు, వైఎస్సార్సీపీ నేతలు శ్రీనివాసులురెడ్డి, శివప్రసాద్రెడ్డిలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం నోటీసులను జారీ చేసినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు. రుస్తుం మైన్ కేసులో నిందితులుగా చేర్చిన క్రమంలో అక్రమ కేసుల ఒత్తిడితో కొంతకాలంగా అజ్ఞానంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. సోమవారం సాయంత్రం లోగా విచారణ హాజరు కావాలని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. సర్వేయర్లకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీ నెల్లూరు (అర్బన్): సచివాలయాల పరిధిలోని 291 మంది సర్వేయర్లకు సోమవారం నగరంలోని ఆ శాఖా కార్యాలయంలో ఏడీ నాగశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టారు. బదిలీలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంక్ ప్రకారం కాకుండా సిఫార్సు లేఖలపై బదిలీ చేయడంతో తమకు అన్యాయం జరిగిందని పలువురు సర్వేయర్లు విచారం వ్యక్తం చేశారు. -
కెరటమై ఎగిసిన కర్షకాగ్రహం
ఉలవపాడు: ‘మండలంలోని తీర ప్రాంతం కరేడు కర్షకుల ఆగ్రహం కడలి కెరటమై ఎగిసి పడింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్ట్లు, రహదారుల నిర్బంధాలు రైతులను ఆపలేకపోయాయి. పోలీసులు ఎక్కు పెట్టిన తుపాకులకు, ఝుళిపించిన లాఠీలకు ఒక్కొక్కరు.. ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజులై గర్జించారు. వేలాది మంది రైతు కుటుంబాలతో తరతరాలుగా వ్యవసాయ భూములతో ముడిపడిన బంధాలను, భావోద్వేగాలను కాదని కంపెనీలకు కట్టబెట్టే ప్రభుత్వ నిరంకుశత్వాన్ని దునుమాడుతూ మండలంలోని కరేడు రైతులు సాగించిన తొలి ఉద్యమాన్ని విజయవంతం చేసి పాలకులకు వణుకు పుట్టించారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే పంట భూములే తమ జీవనాధారమని, అటువంటి భూములను తమ నుంచి తీసుకోవాలంటే, ముందుగా ప్రాణాలు తీసి శవాలపై వచ్చి తీసుకెళ్లాంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోసోల్ కంపెనీ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివారం మండలంలోని కరేడు కర్షకుల పోరు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. వందల మంది పోలీసులు భారీగా మోహరించి అడ్డంకులు పెట్టినా చేధించుకుని సాగించిన రైతులు తమ భూముల కోసం ఎందాకై నా పోరాడతారని చాటారు. ఊహించని రీతిలో.. జాతీయ రహదారిపై కరేడు రైతులు పార్టీలకు అతీతంగా ఏకమై చేపట్టిన రాస్తారోకో విజయవంతం కావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఏకంగా 8,348 ఎకరాలు కేటాయించడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమి లేకపోతే తమకు జీవనాధారం లేదనే పరిస్థితికి రైతులు రావడంతోనే రాస్తారోకో భారీగా జరిగింది. సుమారు 2 వేల మంది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 800 మందికి పైగా మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొనడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తమ శవాల మీద వెళ్లి భూములు తీసుకోవాలని మహిళా రైతులు నినాదాలు చేయడం విశేషం. దాదాపు 20 నిమిషాల పాటు రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సబ్కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తాత్కాలికంగా భూసేకరణ వాయిదా వేసి రైతులు సమస్యలు పరిష్కరిస్తామని హామీతో విరమించారు. భూసేకరణపై ఇంత మంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. రైతులకు పెరుగుతున్న మద్దతు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు బయట నుంచి మద్దతు పెరుగుతోంది. పోలీసులు తమ గోడును చెప్పకుండా అడ్డుకోవడంతో వారు చేసిన పోరాటం పలువురిని కదిలించింది. వామపక్షాలు, రైతుకూలీ సంఘాలు మరింతగా ఈ పోరాటానికి సహకరించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కరేడులో పర్యటించనున్నారు. ఆమ్ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీసీవై పార్టీలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. కరేడులో మాత్రం పార్టీకతీతంగా రైతులే నాయకత్వం వహిస్తూ అన్ని పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషకులు సైతం కరేడు రైతుల ఉద్యమం గురించి మాట్లాడడం విశేషం. ఈ కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం పై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత... కరేడు భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తొలుత బీపీసీఎల్కు ఇస్తారని ప్రచారం జరిగింది. తర్వాత మార్చి 25 న ఇండోసోల్కు కేటాయిస్తున్నట్లు జీఓ ప్రకటించారు. జూన్ 19న భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చి తీసుకునే భూముల రైతుల వివరాలు ప్రచురించారు. అందులో 4 వేల ఎకరాలకు వివరాలు ప్రకటించారు. నోటిఫికేషన్ వెలువడడంవతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యమ బాట పట్టారు. తమ భూములు కోల్పోకుండా ఉండడం కోసం ‘సేవ్ కరేడు’ పేరుతో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ రైతు ఉద్యమంతో ప్రభుత్వంపై కరేడు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది. భూ సేకరణ ఆగేనా కరేడు రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఎగసిపడి విజయవంతమైంది. భూ సేకరణను నిలుపుదల చేయగలమనే విశ్వాసం ఏర్పడింది. పచ్చని పంట పొలాలు సుమారు 3 వేల ఎకరాలు, మామిడి తోటలు 1000 ఎకరాలు, సపోట తోటలు, 2 వేల ఎకరాలు, వేరుశనగ 2 వేల ఎకరాలు మిగిలిన భూములు జామాయిల్, కూరగాయల సాగు కలిసి ఉన్నాయి. ఇంత సారవంతమైన భూములను, అన్నం పెట్టే భూములను తీసుకోవడం దారుణమని రైతులు అంటున్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అంచనాలకు మించి రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి భూసేకరణ ఆపుతుందా.. మొండిగా ముందుకు సాగుతుందా తదుపరి పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో వేచి చూడాల్సి వస్తుంది. పోలీసుల అణచివేత కుట్ర రైతుల పోరును అణచివేయడానికి పోలీసులు శతధా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో తోపులాట జరిగిన తరువాత కూడా రైతులు పోలీసు బంధనాలు అధిగమించి రాస్తారోకో చేయడంతో రైతులపై పోలీసులు భారీ చర్యలకు సన్నద్ధమయ్యారు. రాస్తారోకోలో పాల్గొన్న రైతులు 26 మందితోపాటు సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమీకరణకు సహకరించేలా చేశారని మరో 13 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాస్తారోకో సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
అనుమానమే పెనుభూతమై..
దుత్తలూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. భార్యపై అనుమానంతో హత్యాయత్నం మద్యం మత్తులో విచక్షణారహితంగా కత్తితో దాడి అడ్డుకోబోయిన అత్త, మామలు హతం భార్య పరిస్థితి విషమం హత్యలతో ఉలికి పడిన దుత్తలూరు భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు. -
సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ఎన్నికలకు ముందు కూటమి నేతల హామీ మేరకు భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని భవన నిర్మాణ కా ర్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు డిమాండ్ చేశారు. మినీ బైపాస్లోని పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘ నగర మహాసభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డును 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేశారని, దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం 34 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా పెంచలయ్య, శ్రీనివాసులు, ట్రెజరర్గా సంపూర్ణమ్మ ఎన్నికయ్యారు. సీఐటీయూ నెల్లూరు నగరాధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చాన్బాషా, అల్లాడి గోపాల్, సీఐటీయూ నేతలు కొండా ప్రసాద్, మూలం ప్రసాద్, కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): పొగతోటలోని రాయ్ చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న అండర్ – 15 సబ్ జూనియర్స్ బాలుర, బాలికల జిల్లా స్థాయి చెస్ చాంపియన్షిప్ ఆదివారంతో ముగిసింది. యడవల్లి సాయిచక్రధర్, సంజన గెలుపొందారు. బాలుర విభాగంలో యజ్ఞేశ్వర్రెడ్డి, శ్రీచైతన్య, మిథిలేష్.. బాలికల విభాగంలో నేహా, సుదీక్ష, కీర్తన తర్వాతి స్థానాల్లో నిలిచారు. విశాఖపట్నంలో వచ్చే నెల 12, 13న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్లో జిల్లా తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. బహుమతులను కళాలయ డైరెక్టర్ గూడూరు లక్ష్మి, ఆనం పద్మనాభరెడ్డి అందజేశారు. ఆర్బిటర్ మౌనిక, విష్ణు, సుబ్బారెడ్డి, ఫిడే ఇన్స్ట్రక్టర్ అజీజ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు
ఉదయగిరి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని గాయపడిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక మేకపాటి గౌతమ్రెడ్డి వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్యప్రియ తన స్నేహితురాలతో కలిసి పట్టణంలోకి వెళ్లి తిరిగి కళాశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో పోలేరమ్మ చెట్టు అరుగు వద్ద వెనుక నుంచి వేగంగా బైక్పై వస్తున్న నల్లిపోగు దాస్ ఢీకొన్నారు. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. కాగా యువకుడు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 33.54 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారానికి 33.54 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2150, పిన్నేరుకు 10, లోలెవల్కు 70, హైలెవల్ కు 40, మొదటి బ్రాంచ్ కాలువలకు 85 క్యూసెక్కులను విడుదల చేస్తున్నా మని వివరించారు. -
ఉన్నత పాఠశాలల్లో వసతుల పరిశీలన
ఉదయగిరి రూరల్: ఉదయగిరి, వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులను రాష్ట్ర వి ద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య అదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరగతులను నూతనంగా నిర్మించిన భవనాలకు మార్చాలని, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన నిధులను వారంలో విడుదల చేస్తామని చెప్పారు. వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్బాషా, ఉదయగిరి ఎంఈఓలు మస్తాన్వలీ, తోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగని దందా.. ఆపే దమ్ముందా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో అధికార మదంతో టీడీపీ నేతలు సహజ వనరుల దోపిడీని అవిశ్రాంతంగా సాగిస్తున్నారు. గనులను తలపించే రీతిలో గ్రావెల్, మట్టిని విచ్చలవిడిగా తవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నా.. అడిగే ధైర్యం, ఆపే దమ్ము అధికార యంత్రాంగానికి లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల రెడ్బుక్ రాజ్యాంగానికి ఎక్కడ బలి కావాల్సి వస్తుందోనని తమ్ముళ్ల దందాలో వాటా లు తీసుకుంటూ ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు దారితీస్తున్నాయని భూగర్భ, వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి ధన దాహానికి రహదారులు, కల్వర్టులు, వంతెనలతోపాటు చెరువు కట్టపై కలుజులు దెబ్బతింటున్నాయి. భవిష్యత్లో భారీ వానలు వస్తే చెరువు కట్టలు తెగి ఊర్లకు ఊర్లనే ముంచే ప్రమాదఘంటికలు పొంచి ఉన్నాయి. గుట్టలు కరిగి.. గుంతలేర్పడి.. జిల్లాలో అత్యంత నాణ్యత కలిగిన గ్రావెల్ గనులు దగదర్తి మండలంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఉలవపాళ్ల, కొత్తపల్లి కౌరుగుంట, అనంతవరం ప్రాంతాల్లోని గ్రావెల్ను మైనింగ్ శాఖ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా తవ్వేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ మండలంలోని టీడీపీ నేతలు ఈ ఏడాది కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారంటే ఏ స్థాయిలో అక్రమ దందా జరుగుతుందో అర్థమవుతోంది. చెరువులు, ప్రభుత్వ భూము లు, కొండలు, తిప్పలు తేడా లేకుండా తవ్వేసి రూ.కోట్లలో గ్రావెల్ దందా సాగిస్తున్నారు. అటు బోగోలు, కావలి, కొడవలూరు నుంచి నెల్లూరు వరకు కొత్తగా ఏర్పాటవుతున్న లేఅవుట్లకు, రహదారులకు అవసరమైన గ్రావెల్కు మంచి డిమాండ్ ఉంది. దీంతో అధికార దమ్ము, ధైర్యంతో బహిరంగంగానే గ్రావెల్ తరలించి జేబులు నింపుకుంటున్నారు. రేయింబవళ్లు విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు మాత్రం తమ్ముళ్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి కిమ్మనడం లేదు. ● దగదర్తి మండలంలోని అనంతవరం, ఉలవపాళ్ల నుంచే అత్యధికంగా నెల్లూరువైపు గ్రావెల్ తరలివెళ్తోంది. దగదర్తిలో స్థిరపడిన అధికార పార్టీ నేత మట్టి దందాకు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల ఇఫ్కో భూముల్లో పాగా వేసి గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా అనంతవరం చెరువును చెరపడుతున్నారు. చెరువులో నీరు తగ్గడంతో గ్రావెల్ తవ్వకాలు చేస్తూ చెరువు స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఉలవపాళ్లలో జాతీయ రహదారి వెంబడే ఉన్న భూములను కబ్జా చేసి గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. హైవే పక్కనే బరితెగించి దోపిడీ చేస్తున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రహదారులు విధ్వంసమా! అల్లూరు రోడ్డు నుంచి అనంతవరం మీదుగా నారాయణపురం వెళ్లే రోడ్డు గ్రావెల్ వాహనాలతో పూర్తిగా విధ్వంసమైంది. గ్రావెల్ మాఫియా స్వార్థానికి ప్రధాన రహదారులు చిధ్రమైపోతున్నాయి. రెండేళ్ల కిందటే వేసిన రోడ్డులు సైతం ధ్వంసమవుతున్నాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ రాయల్టీలు ఫీజులు చెల్లించకపోవడంతో ఆదాయానికి గండిపడుతున్నా.. అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. అనంతవరం చెరువు కలుజు కూడా దెబ్బతింది. ఆ కలుజు నుంచే తూము ద్వారా నీరు సరఫరా జరుగుతోంది. దాదాపు 150 ఎకరాలు ఆయుకట్టుకు నీరందించే ఆ తూము ధ్వంసం అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం దగదర్తి మండలంలోని అనంతవరంలో జరిగే అక్రమ గ్రావెల్ రవాణాతో రహదారులు చిధ్రమై పోతున్నాయిని, కల్వర్టులు, తూములు దెబ్బతిని సాగునీటి పారుదల వ్యవస్థ నిలిచిపోతుందని అనంతవరం గ్రామ రైతులు ఇటీవల కావలి ఆర్డీఓ, దగదర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వీరికి వామపక్ష పార్టీ నేతలు మద్దతు ఇచ్చారు. కానీ వారు చర్యలు చేపట్టకపోవడంతో మట్టి మాఫియా లెక్క చేయలేదు. వాహనాల రణ ధ్వనులతోపాటు రోడ్లపై దుమ్ముధూళితో స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. గ్రావెల్ మాఫియా ధనార్జన కోసం ఇష్టానుసారంగా చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. అనంతవరం, ఉలవపాళ్ల, కేకేగుంట గ్రావెల్ గనులు విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు, రవాణా మీడియా ఘోషిస్తున్నా.. చెవికెక్కించుకోని అధికార యంత్రాంగం భారీ వాహనాల బరువుకు దెబ్బతింటున్న రహదారులు, వంతెనలు, చెరువు కలుజులు -
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఏఎస్పేటలోని ప్రాథమిక వైద్యశాలలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి ఆదివారం సాయంత్రం పాల్పడ్డారు. ఆస్పత్రి డాక్టర్లతో పాటు 35 మంది సిబ్బంది, డీఎంహెచ్ఓ వేధింపులకు గురిచేస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. విధులకు హాజరుకాకుండానే పలువురు సిబ్బంది పూర్తి జీతాలు తీసుకున్నారని.. తాను సెలవడిగితే డ్యూటీ డాక్టర్ మంజూరు చేయకుండా వేధించారని పేర్కొన్నారు. వీటిపై అర్జీలను అందించేందుకు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని వాపోయారు. కాగా ఈమె, భర్త.. ఏబీఎన్ చానల్ రిపోర్టర్ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో అదే పీహెచ్సీలో ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్న దొరసానమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి శుక్రవారం పాల్పడి న విషయం తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాఫ్ నర్సు లక్ష్మి సైతం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు తరలించనున్నామని బంధువులు తెలిపారు. కాగా ఈ విషయమై డీఎంహెచ్ఓ సుజాతను సంప్రదించగా, తనకు ఇప్పుడే విషయం తెలిసిందని, పూర్తి స్థాయి విచారణను సోమవారం జరుపుతానని చెప్పారు. -
వెంగళరావునగర్లో కార్డన్ సెర్చ్
నెల్లూరు సిటీ: వేదాయపాళెంలోని వెంగళరావునగర్ ఏ బ్లాక్లో కార్డన్ సెర్చ్ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఏఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు, స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు 45 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాల్లేని 45 బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితుల నుంచి వేలిముద్రలను సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని వివరించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
గ్రావెల్ రవాణా అడ్డగింత
● దాడిలో ఇద్దరికి గాయాలు జలదంకి: మండలంలోని జమ్మలపాళెం చెరువులో జేసీబీ సాయంతో గ్రావెల్ను అక్రమంగా తరలిస్తుండగా, గ్రామానికి చెందిన టీడీపీ నేత సింగమనేని మనోజ్, జనసేన నేత శెట్టిపల్లి మధు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా చెరువు నుంచి ఎలా తరలిస్తారని ప్రశ్నించగా, గ్రామానికి చెందిన నక్కా మాధవ, మహేంద్ర, బాబు, జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ను సర్పంచ్ అనుమతితో తోలుతుండగా, వారొచ్చి దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ సర్పంచ్ నక్కా మాధవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయాల్లో బదిలీలలు
ఉదయగిరి: గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా సచివాలయ వ్యవస్థకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించి.. వారికి సొంత మండలాల్లోనే పోస్టింగ్లిచ్చారు. ఈ తరుణంలో గతేడాది కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను గందరగోళంగా మార్చింది. తాజాగా వీరిలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేసేందుకు జీఓను జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు తమ ప్రాధాన్యాన్ని ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. బదిలీలు పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. విచిత్ర వైఖరి వాస్తవానికి కౌన్సెలింగ్ను నిర్వహించి.. మెరిట్ అధారంగా బదిలీలు చేపట్టాలి. అయితే దీనికి భిన్నమైన వైఖరిని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా బదిలీలు జరపనున్నారు. ఈ తరుణంలో ఇవి ఉంటేనే కోరుకున్న చోట నియమిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామాల క్రమంలో వీటి కోసం అధికార పార్టీ నేతల ఇంటి చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి దయ లేకపోతే జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుందోనని పలువురు కంగారు పడుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 769 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 8,239 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 78 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల గ్రేడ్ – 4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించి పోస్టింగ్లను ఇచ్చారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన, ఆరోగ్య శాఖల్లో పనిచేసే కొందరికీ పదోన్నతులు లభించాయి. ప్రక్షాళన పేరిట ప్రతి సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను ఇప్పటికే కుదించారు. దీంతో అనేక మంది ఉద్యోగులు మిగిలిపోనున్నారు. వీరికి ఎక్కడ పోస్టింగ్లు ఇస్తారో అంతుచిక్కడంలేదు. మరోవైపు వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానికత (సొంత మండలం)ను తొలగించలేదు. అదే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి సొంత మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వకుండా జీఓ జారీ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తప్పుబడుతున్నారు. అయినా సర్కార్ పట్టించుకోకపోవడం వీరి ఆగ్రహానికి కారణమవుతోంది. ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట లేఖల కోసం ఉద్యోగుల పరుగులు అధికార అండ ఉంటే అనుకున్న చోట.. లేకపోతే మరెక్కడో పారదర్శకతకు పాతర బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేలిచ్చిన సిఫార్సు లేఖలను ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాబితాను పంపారు. ఇవి లేని వారు తమను మెరిట్ ప్రాతిపదికన బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంలో పారదర్శకతకు ప్రభుత్వం పాతరేస్తోందని ఆరోపిస్తున్నారు. -
మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు అవకాశం
నెల్లూరు సిటీ: జిల్లాలో ఐదేళ్ల సర్వీస్ను పూర్తి చేసిన గ్రామ / వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ప్రత్యేక కేటగిరీలో ఉన్న వారు.. రిక్వెస్ట్ నిమిత్తం బదిలీలు కోరేందుకు అవసరమైన వివరాలతో కూడిన ఆప్షన్ ఫారాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సమర్పించాలని పోలీస్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సొంత మండలం లేదా ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయంలో స్థానాన్ని ఇవ్వబోమని చెప్పారు. ఫారాల్లో తప్పుడు సమాచారమిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.గుర్తుతెలియని వ్యక్తి మృతిఅనుమసముద్రంపేట: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన అనుమసముద్రంలోని హజరత్ సయ్యద్షా ఖాదరీ బాబా దర్గా వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ సొమ్మసిల్లారు. దీంతో 108లో ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. -
మానసిక వేదనతోనే రాజీనామా చేశా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదన్రావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయనను సాక్షి పలుకరించగా తన రాజీనామాకు దారితీసిన ఆవేదనా భరిత అంశాలను విశదీకరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా... రాజీనామా చేసేందుకు కారణం ఏమిటి? విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు ఉత్తమ పౌరులను అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం చదువుకు సంబంధంలేని పలు రకాల యాప్లు ఉపాధ్యాయులపై రుద్ది వాటికి సమాధానాలు సకాలంలో ఇవ్వకపోతే మెమోలు ఇస్తోంది. దీంతో వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి రాజీనామా ఇచ్చేశా. తదుపరి ఏమి చేయనున్నారు? యాప్లతో విసిగి వేసారిన ఎందరో ఉపాధ్యాయులు వారి కష్టాలను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరో ఒకరు ఈ విషయాన్ని ఎదిరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో రాజీనామా సమర్పించాను. సమస్యలపై ప్రజలను, ఉపాధ్యాయులను చైతన్య పరిచేందుకు ఉద్యమం చేస్తా. అందరిదీ ఇదే పరిస్థితా? యాప్లతో చదువుకు సంబంధంలేని ఇతర పనులకు సమయం కేటాయించలేక అంకితభావంతో వృత్తి బాధ్యతలు నిర్వర్తించలేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇవ్వండి. నాణ్యమైన విద్యను రాబట్టండి అని మేము చెప్పేందుకు స్వేచ్ఛలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 90 శాతానికిపైగా ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి. ప్ర: వృత్తి పట్ల సంతృప్తి ఎలా ఉంది? నేను గత మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. గతంలో ఎన్నడూలేనంత ఒత్తిడి ఈ ప్రభుత్వంలోనే అనుభవించా. విసిగి వేసారి రాజీనామా చేశా. చేస్తున్న వృత్తికి న్యాయం చేయలేకపోవడం, ఉద్యోగిగా సంతృప్తి లేని పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో నాలాంటి వారిని తోడు చేసుకొని ఉపాధ్యాయులను మేలుకొలుకొలిపేందుకు ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నా. పాఠశాలలు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వ కాలంలో పట్టణాలతో పాటు మారుమూల పల్లెల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల భవనాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. రెండు దశల్లో చేసిన ఈ అభివృద్ధి పనుల్లో పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు ఏర్పడి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయి. ఆధునిక చదువు పల్లెలకు వచి్చందని గట్టిగా చెప్పవచ్చు. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా ఉపాధ్యాయులను మాత్రం బొమ్మల్లా ఆడుకుంటున్నారు. ఎవరైనా చెబితే విరమించుకుంటారా? ప్రభుత్వ విధానాలపై విసిగివేసారి వృత్తికి న్యాయం చేయలేకపోతున్నానన్న మానసిక క్షోభతో రాజీనామా చేశా. ఎట్టి పరిస్థితిలోనూ రాజీనామాకు కట్టుబడి ఉన్నా. ఉద్యమం చేపట్టి ఉపాధ్యాయులను చైతన్య పరిచేందుకు కృషి చేస్తా. యాప్లతో వచి్చన ఇబ్బంది ఏమిటి? వృత్తికి న్యాయం చేయలేక ఓవైపు ఇబ్బందులు పడుతున్నాం. యాప్లు పనిచేయక, హాజరు సరైన సమయానికి ఆన్లైన్లో నమోదు చేయలేక తీవ్ర వేదనకు గురవుతున్నాం. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫోన్లు చేస్తూ పాఠశాలకు హాజరయ్యారా లేదా అంటూ అనుమానంతో ప్రశి్నస్తున్నారు. దీనితో ఏ తప్పు చేయక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. నెట్వర్క్ సరిగాలేక యాప్లు పనిచేయకపోతే మేమెందుకు శిక్ష అనుభవించాలి? సంబంధిత నెట్వర్క్ ఉద్యోగులను ప్రశి్నంచాలి? లేదా దాని కెపాసిటీని పెంచాలి. మాపై ఒత్తి చేస్తే మేమేమి చేస్తాం? యాప్లు పెట్టడం తప్పుకాదు. వాటిని సక్రమంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తప్పు. బదిలీలు ఎలా జరిగాయి? ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ ఉన్న క్రమంలో బదిలీల్లో చాలా అన్యాయాలు జరిగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఉపాధ్యాయ కౌన్సెలింగ్ రాత్రిళ్లు జరగడం బాధాకరం. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి విఫలం అయ్యారు. బదిలీలలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బదిలీలు అయిన వారికి రిలీవ్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణం. బదిలీల్లోనూ వివాదాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. బాత్రూముల ఫొటోల విషయం ఏమిటి? మూడు నెలల క్రితం పాఠశాలల్లోని బాత్రూముల ఫొటోలు వెంటనే అప్లోడ్ చేయాలని ఓ యాప్ను సృష్టించారు. దానిని కొందరు ఉపాధ్యాయులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఆలస్యమైనందుకు మెమోలు ఇచ్చారు. ఉపాధ్యాయులకు బాత్రూముల ఫొటోలు తీయమని పనులు అప్పగించడమేమిటి? యోగాపై మీ అభ్యంతరాలు ఏమిటి? యోగాపై నాకెలాంటి అభ్యంతరాలు లేవు.యోగా మంచిదే. కేవలం ఉపాధ్యాయులు, విద్యార్థుల ద్వారా యోగాను ప్రమోట్ చేసి ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం సరికాదు. 6, 7 సంవత్సరాల చిన్నారులను, పాఠశాలలకు ఎంతో దూరంలో నివసిస్తూ ఉండే మహిళా ఉపాధ్యాయులను ఉదయం 6 గంటలకే పాఠశాలలకు వచ్చి యోగాలో పాల్గొనాలని ఒత్తిడి చేయడం దారుణం. ఇది నచ్చక రాజీనామా పత్రంలో విమర్శలు చేశా. -
వైఎస్ జగన్ హెలికాప్టర్ను దిగనివ్వం.. కోటంరెడ్డి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి జైల్లో ఉంచిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డితో ములాఖత్కు వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు స్థలాన్ని పరిశీలిస్తుండగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులు అడ్డుపడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్సార్సీపీ నాయకులు మూడు వేర్వేరు ప్రైవేటు స్థలాలను చూడగా.. కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఉన్న నిర్మాణాలతో పాటు భూములపై వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్సీపీ నేతలు శనివారం కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారు. స్కూల్ యాజమాన్యం అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ హడావుడి చేశారు. భవనాలను కూల్చేస్తామంటూ రాద్ధాంతానికి దిగారు. దీంతో స్కూల్ సంబం«దీకులు భయాందోళనకు గురై హెలిప్యాడ్కు స్థలం ఇవ్వబోమని చెప్పాల్సి వచ్చింది. వైఎస్ జగన్ జనాదరణ చూసి భయపడి..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి ఆ హామీలు నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. దీనిని నిలదీస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడంతో రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాదిమంది తరలివస్తారని టీడీపీ నేతల్లో భయం పుట్టింది. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అవరోధాలు సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్కు స్థలాలు ఇవ్వకుండా యజమానులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు సిటీ: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్స్ కాలనీలోని బిట్ – 2లో నివాసం ఉంటున్న ఖతీముద్దీన్ (40), నూర్జ్హాన్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉడ్ కాంప్లెక్స్లో కొయ్య పని చేసేవారు. మూడు నెలలుగా పనిలేకపోవడంతో కుటుంబపోషణకు అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలని రోజూ వేదనకు గురయ్యేవారు. కుమార్తె వివాహానికి సరిపడా డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో భార్య తన పిల్లలతో కలిసి బెడ్రూమ్లో శుక్రవారం రాత్రి నిద్రించారు. హాల్లోకి శనివారం వచ్చి చూడగా, సీలింగ్ ప్యాన్కు చీరతో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. భార్య కేకలేయడంతో చుట్టుపక్కలు వారు వచ్చి హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేదాయపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీతాల్లేవు.. క్రీడల్లో శిక్షణెలా..?
రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తామని సీఎం చంద్రబాబు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే విస్మయం కలగకమానదు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే వారికి నెలల తరబడి జీతాలను చెల్లించకపోవడంతో వారి ఆకలికేకలు తీవ్రమవుతున్నాయి. వీటిని సక్రమంగా అందించకపోవడంతో స్టేడియాల్లో క్రీడాకారులకు ఎలా తర్ఫీదునిస్తారో అంతుచిక్కడంలేదు. సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖలు పంపినా, ఏ మాత్రం చలనం ఉండటంలేదు. నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో దాదాపు 26 మంది కోచ్లు, గ్రౌండ్స్మెన్, స్వీపర్లు, సెక్రటరీలు, వాచ్మెన్లకు ఏడాదిగా జీతాలు రావడంలేదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వీరు తమ వెతలపై రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు విన్నవించినా ప్రయోజనం కరువవుతోంది. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడినా ఇటీవలి కాలంలో వీరు పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా ఇంటి బాడుగలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక నానా అగచాట్లు పడుతున్నారు. లేఖ రాసినా స్పందనేదీ..? వీరికి జీతాలు రావడంలేదనే అంశాన్ని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్కు కలెక్టర్ ఆనంద్ మార్చిలో లేఖ రాసినా, స్పందన నేటికీ కొరవడింది. నెల్లూరుతో పాటు ఆరు జిల్లాల మినహా మిగిలిన అన్ని చోట్ల వేతనాలు సక్రమంగానే అందుతున్నాయి. ఇక్కడే ఈ పరిస్థితి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే, సరైన సమాధానం కరువవుతోంది. వాస్తవానికి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న కోచ్లకు రూ.21,500.. జూనియర్ అసిస్టెంట్కు రూ.20 వేలు.. ఆఫీస్లో పనిచేస్తున్న వారికి రూ.18,500.. స్వీపర్లు, గ్రౌండ్ మార్కర్లకు రూ.15 వేల మేర జీతాలు రావాల్సి ఉంది. అనారోగ్యానికి గురైనా అదే తీరు.. జీవరత్నం అనే ఉద్యోగి నెల కింద బ్రెయిన్ ట్యూమర్కు గురై కాళ్లు, చేతులతో పాటు మాట పడిపోయింది. సాయం చేయాలని మేలో లేఖలు పంపినా, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ పట్టించుకోవడంలేదు. అతని పరిస్థితిని గమనించి ఆర్థిక సాయాన్ని సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడాకారులతో పాటు నెల్లూరు డీఎస్డీఓ అందజేశారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించి తమకు జీతాలను చెల్లించాలని వీరు కోరుతున్నారు. వేతనాలు రాక స్టేడియంలో సిబ్బంది ఆకలికేకలు లేఖలు రాసినా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ నుంచి స్పందన కరువు అనారోగ్యానికి గురైనా కనికరం చూపని సర్కార్ ఏడాదిగా ఇదే దుస్థితి ఉన్నతాధికారులకు తెలియజేశాం జీతాలు రాని విషయాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశాం. కలెక్టర్ ద్వారా లేఖలు పంపాం. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. – యతిరాజ్, డీఎస్డీఓ -
లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయండయ్యా..
కందుకూరు: పొగాకు మార్కెట్లో ఈ ఏడాది నెలకొన్న సంక్షోభంతో పూర్తిగా నష్టపోతున్నామని.. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ మేరకు పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్ర పరిధిలో పొగాకు వేలాన్ని అడ్డుకొని రైతులు ఆందోళనకు శనివారం దిగారు. వేలాన్ని నిలిపేసి.. రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని నిరసన చేపట్టారు. ఈ తరుణంలో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఆపై రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. బోర్డు కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీపూజకు వినతిపత్రాన్ని అందజేశారు. వేలం చివరి దశకు చేరుకుందని, అయినా బోర్డులో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని ఆరోపించారు. అదనపు భారం రైతుల వద్ద లో గ్రేడ్ రకం పొగాకు ఉత్పత్తులే ప్రస్తుతం ఉన్నాయి. కిలోను ఇప్పటి వరకు రూ.160కు కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ధరకూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధరలు తగ్గించిచ్చేందుకు సిద్ధమైనా, కొనుగోలు చేయడంలేదని వాపోయారు. వేలం కేంద్రానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఇళ్లకు చేర్చుకోవాల్సి వస్తోందని, ఫలితంగా రవాణా చార్జీల రూపంలో అదనపు భారం పడుతోందని చెప్పారు. ఒకసారి వేలానికి తీసుకొచ్చి, తిరిగి ఇంటికి తీసుకెళ్లిన బేలులో దాదాపు 10 కిలోల పొగాకు వ్యత్యాసం కనిపిస్తోందని ఆరోపించారు. కొనుగోలు చేయకుండా తిప్పి పంపితే, తామేమీ చేసుకోవాలని, ఎక్కడ విక్రయించాలని నిలదీశారు. అధికారులు జోక్యం చేసుకొని లో గ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ లో గ్రేడ్ రకం పొగాకును రూ.32 వేలకు గతేడాది కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది రూ 15 వేలకు కూడా కొనుగోలు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. ఇరువర్గాలను ఒప్పించి.. వేలం కేంద్రానికి వచ్చిన బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు.. అటు రైతులు, ఇటు వ్యాపారులతో చర్చలు జరిపారు. వేలం సాగేందుకు ఇరువర్గాలను ఒప్పించారు. అయినా లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు చాలా మంది వ్యాపారులు ముందుకు రాకపోవడం గమనార్హం. పొగాకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వేలం కేంద్రంలో రైతుల ఆందోళన అర్ధనగ్న ప్రదర్శన సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో గల వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే పలు విభాగాల ఉద్యోగులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్ను కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఉదయం తొమ్మిదింటికే ఆయా సచివాలయాల ఉద్యోగులు 1266 మంది హాజరయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం.. అందులో నియామక తేదీల్లో మార్పులుండటంతో గందరగోళం నెలకొంది. ఇవి తప్పులతడకగా ఉండటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ కంటే వెనుక చేరిన వారి పేర్లు కౌన్సెలింగ్లో ముందు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కౌన్సెలింగ్కు ఉద్యోగులు సహకరించారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడారు. వార్డు సచివాలయ విభాగం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశామని, ఉద్యోగులకు వార్డుల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని వెల్లడించారు. హాజరైన 1266 మంది సచివాలయ ఉద్యోగులు నియామక తేదీల్లో తప్పులతో గందరగోళం -
వైభవంగా కల్యాణం
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం శ్రీపెనుశిలలక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలకు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోకి వేంచేపు చేసి అక్కడ తిర్చుపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.ఉదయం నిత్య కల్యాణ మండలపంలో స్వామి అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. -
పంచాయతీ కార్యదర్శుల ఆందోళన బాట
నెల్లూరు (పొగతోట) : సమస్యల సాధన కోసం పంచాయతీ కార్యదర్శులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం డీపీఓ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో హాజరైన పంచాయతీ కార్యదర్శులు, మండుటెండను సైతం లెక్క చేయకుండా డీపీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డీపీఓ, కలెక్టరేట్ అధికారులకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య నాయకులు చల్లా ప్రసాద్రెడ్డి, ఓ లెనిన్, శ్రీనివాసులురెడ్డి, శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శులను అవహేళన చేస్తూ మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే ఇంటింటి చెత్త సేకరణ చేసేటప్పుడు ఫొటోలు పెట్టి అప్లోడ్ చేయాలంటూ కార్యదర్శుల స్థాయిని తగ్గిస్తూ మాట్లాడారని వాపోయారు. ఇప్పటికే తమపై పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ కాల్స్ పంచాయతీశాఖకు వద్దంటూ విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యదర్శుల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్సిస్ రికార్డు నమోదు అయిందన్నారు. యోగాంధ్ర విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులు రాత్రి, పగలు శ్రమించారని గుర్తు చేశారు. కార్యదర్శులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పంచాయతీల్లో అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ 1 యాప్, గ్రామ సచివాలయాల సర్వేలు, పీజీఆర్ఎస్ పనులు, గ్రామ సభలు, పంచాయతీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు తదితర పనులతో పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. దీంతోపాటు నిత్యం వెబ్ కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్లు, టెలీకాన్ఫరెన్స్లతో ఒత్తిడితో నలిగిపోతున్నామన్నారు. ప్రతిది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై కార్యదర్శులు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కుటుంబ సంక్షేమాన్ని కూడా పట్టించుకోకుండా పనులపై 24 గంటలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు పురిణి శ్రీనివాసులు, ఆర్.శివకుమార్, ఎస్కే ఇంతియాజ్, వహీదా అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడి తగ్గించాలి పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలు, సర్వేలు, ప్రతిదీ పంచాయతీ సెక్రటరీలకే అప్పగిస్తున్నారు. పండ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పంచాయతీ కార్యదర్శులకే ప్రతి పనిని అప్పగిస్తున్నారు. పంచాయతీ రాష్ట్ర ఉన్నతాధికారులు కార్యదర్శులను కించపరిచేలా మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతినేలా అధికారుల మాట తీరు ఉంది. పని ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – చల్లా ప్రసాద్రెడ్డి, కార్యదర్శుల జిల్లా నాయకుడు అనారోగ్యాల పాలవుతున్నాం పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. పని ఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ కాల్స్ దూరంగా ఉంచాలి. కార్యదర్శుల సంక్షేమం కోసం అధికారులు, ప్రభుత్వం కృషి చేయాలి. – ఓ లెనిన్, కార్యదర్శుల జిల్లా నాయకుడు డీపీఓ, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు పని ఒత్తిడి తగ్గించకుంటే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిక సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు -
వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి
● ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పొదలకూరు : వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ అభయమిచ్చారు. పొదలకూరులోని జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ నివాసంలో శనివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయ పరుచుకుని సమస్యలు ఎదురైతే పోరాడాల్సిందిగా సూచించారు. వెన్నుదన్నుగా తాము నిలబడతామన్నారు. మాజీమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత మాట్లాడుతూ తన తండ్రి త్వరలోనే కేసుల నుంచి బయటకు వస్తారని, నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో పార్టీ స్టేట్ సెక్రటరీ శివశంకర్రెడ్డి, మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు, వెంకటాచలం వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, కోదండరామిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, ఎంపీటీసీలు జీ లక్ష్మీకల్యాణి, ఎస్కే అంజాద్, జీ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు
నెల్లూరు (లీగల్): జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులకు కోర్టు హాల్లో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమన్ని ఏపీ హైకోర్టు జడ్జి, నెల్లూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసులురెడ్డి శనివారం ప్రారభించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి. శ్రీనివాస్ నోడల్ అధికారిగా మాజీ హైకోర్టు జడ్జిలు బి. శ్యామసుందర్, ఎం.సీతారామమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వర్క్ షాప్లో సెక్షన్ 9 సీపీసీ న్యాయపరిధి, చట్టంలో కేసులను విచారించి నిర్ణయించడానికి కోర్టు అధికారం, లోక్ అదాలత్పై సమీక్షా, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కోర్టుకు వచ్చే విభిన్న ప్రతిభా వంతులైన కక్షిదారుల సౌకర్యార్థం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అందజేసిన 18 ట్రైసైకిళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, మునిసిపల్ కమిషనర్ వైఓ నందన్, బ్యాంక్ అధికారులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ జెన్కోలో ప్రమాదం ● కార్మికుడికి తీవ్రగాయాలు ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో అవుట్సోర్సింగ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మచిలీపట్నంకు చెందిన శివప్రసాద్ పదేళ్లుగా ఇక్కడ అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా పని చేస్తుండగా ఈహెచ్పీ బ్రేకర్ పేలిపోవడంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని తోటికార్మికులు హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. నీకు చదువు రాదు.. టీసీ తీసుకెళ్లిపో ● ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడి నిర్వాకం దుత్తలూరు: విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి, తదనుగుణంగా తర్ఫీదు ఇచ్చి ఎదిగేందుకు కృషి చేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే నీకు చదువురాదు.. టీసీ తీసుకుని వెళ్లిపో అంటూ ఓ విద్యార్థిని అవమానించిన ఘటన దుత్తలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పాఠశాలలో హర్షవర్ధన్రెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు. అయితే సైన్న్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజశేఖర్ శుక్రవారం విద్యార్థిని పిలిచి టీసీ తీసుకుని వెళ్లమన్నాను కదా మళ్లీ ఎందుకు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని తల్లికి ఫోన్ చేసి పాఠశాలకు వచ్చి మీ అబ్బాయి టీసీ తీసుకెళ్లాలంటూ హెచ్చరించారు. దీంతో విద్యార్థి మేనమామ శనివారం ప్రిన్సిపల్ సైమన్రావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన విద్యార్థిని పిలిచి వివరాలు సేకరించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ని వివరణ కోరగా ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడని విచారించి చర్యలు చేపడతామని తెలిపారు. -
జాయింట్ ఎల్పీఎం పూర్తికి ప్రత్యేక డ్రైవ్
3,680 కొత్త పింఛన్లు మంజూరు నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలు 3,680 మందికి కొత్త పింఛన్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబరు నుంచి పింఛన్ తీసుకుంటూ మరణించిన వ్యక్తుల భార్యలకు కొత్తగా పింఛన్ మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 1వ తేదీ పాత పెన్షన్తోపాటు కొత్తగా మంజూరైన వారికి కూడా పింఛన్ నగదు అందిస్తామని తెలిపారు. అనంతరం డీఆర్డీఏలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని అందించారు. దానికి సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ● జేసీ కార్తీక్ నెల్లూరు రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి అవసరమయ్యే జాయింట్ ఎల్పీఎం (జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్) పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జేసీ కె. కార్తీక్ రెవిన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కావలి, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లతో రీసర్వే, డిజిటలైజేషన్, హౌసింగ్, సీసీఆర్డీ కార్డులు, సిటిజన్ సర్వీసెస్ తదితర రెవెన్యూ సంబంధిత విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రెండో విడత ఎంపికై న గ్రామాల్లో రీసర్వే సక్రమంగా పూర్తి చేయాలని, ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తలెత్తిన సమస్యలను పరిగణలోకి తీసుకుని మరింత జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. రీసర్వేలో 22ఏ, పీజీఆర్ఎస్లో ఉన్నటు వంటి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. రెవెన్యూ సంబంధిత చట్టపరమైన విషయాల నిర్వహణను క్రమబద్ధీకరించడానికి, వాటిని పారదర్శకంగా చేయడానికి రూపొందించబడిన వెబ్ ఆధారిత వ్యవస్థ ఓఆర్సీఎంఎస్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్హత ఉన్న కౌలు రైతులకు సీసీఆర్కార్డులు అందజేయాలన్నారు. సీసీఆర్సీ కార్డులు మంజూరులో ఆలస్యమైతే వివిధ ప్రయోజనాలను, ముఖ్యంగా పంట రుణాలను పొందే అవకాశం కోల్పోతారన్నారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్కలెక్టర్ టి. శ్రీపూజ, డీఆర్ఓ ఉదయభాస్కరరావు, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
ఆవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులు
● జరిమానా విధించి వదిలేసిన ఎస్సై ● ఎస్పీకి ఫిర్యాదు ఉలవపాడు: అక్రమంగా గోవులను లారీలో తరలిస్తుండగా గోరక్షకులు, బీజేపీ నేతలు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చీమకుర్తి నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న బీజేపీ నేతలు గుండా శ్రీనివాసరావు, శివారెడ్డి, నరేష్కుమార్, సుబ్బారావులకు మన్నేటికోట అడ్డరోడ్డు సమీపంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం కంటపడింది. దీంతో అడ్డుకుని పరిశీలించారు. గోవులతో సహా వాహనాన్ని, తరలిస్తున్న వారిని ఉలవపాడు పోలీస్స్టేషన్లో అప్పగించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే గోవులను సరంక్షించడంతోపాటు అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్సై అంకమ్మ ఆ వాహనానికి రూ.2,200 జరిమానా వేసి ఆవులను తరలించే వాహనాన్ని వదిలేశారు. దీంతో వారు జరిమానా కట్టి వెంటనే గోవులను తీసుకుని వెళ్లిపోయారు. ఎస్సై వ్యవహరించిన తీరుపై సదరు బీజేపీ నేతలు ఎస్పీ కృష్ణకాంత్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. గోవులను గోశాలకు తరలించకుండా, ఇరుకుగా ఉన్న వాహనంలో తిరిగి పంపించడంతో పోలీసులపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
కండలేరులో 33.986 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 33.986 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,040, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్లో నుంచి పడి..● వ్యక్తి మృతిమనుబోలు: విజయవాడ నుంచి చైన్నె వెళ్తున్న రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మనుబోలు – కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య 147/7–5 కిలోమీటర్ వద్ద శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. పింక్ కలర్ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు. -
మోడల్ ప్రైమరీ స్కూళ్లలో తాత్కాలిక మరమ్మతులు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని 470 మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఆగస్టు చివరి నాటికి తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయా స్కూళ్లలో 1,270 గదులు అవసరమని గుర్తించినట్లు చెప్పారు. పెద్ద రూమ్లను రెండు తరగతి గదులుగా ఏర్పాటు చేయడం, లేదా వరండాను రెండు తరగతి గదులుగా, మేజర్, మైనర్ రిపేర్లు, ఎలక్ట్రికల్ వర్క్స్, గ్రీన్ చాక్బోర్డు, డ్యూయల్ డెస్క్ తదితర పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ మెయింటెనెన్స్కు 2,571 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2.88 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం రూ.54.77 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. మిగిలిన నిధులు డిసెంబర్లో విడుదల కానున్నట్లు చెప్పారు. గతంలో 42 స్కూల్స్ పీఎంశ్రీకు ఎంపికయ్యాయన్నారు. తాజాగా తోటపల్లిగూడూరు మండలం కోడూరులోని ఏపీఎస్డబ్ల్యూఆర్, సంగంలోని ఏపీఎస్ఆర్డబ్ల్యూఆర్, ఉలవపాడులోని ఏపీ మోడల్ స్కూల్, అల్లూరు మండలంలోని అల్లూరుపేటలోని జెడ్పీహెచ్ఎస్లు ఎంపికై నట్లు తెలిపారు. జిల్లాలోని 10 కేజీబీవీల్లో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈనెల 12 నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామన్నారు. సీఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పాల్గొంటారని చెప్పారు. డ్రాప్బాక్స్లో 14,232 మంది ఉన్నారని, వారిని ఆయా పాఠశాలల్లో చేర్పించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
● రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శిరీష సైదాపురం: అక్రమ మైనింగ్దారుల వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ జిల్లా పోలీస్ ఉన్నత అధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మైనింగ్ అధికారులతోపాటు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రాణహాని తలపెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసిందన్నారు. నిరంతరం ఖనిజ సంపదను కొల్లకొడుతూ ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతున్న అక్రమార్కులపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టార్గెట్ చేశారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని విన్నవించారు. జిల్లా పరిషత్, కలెక్టరేట్ వాహనాల వేలంనెల్లూరు రూరల్: నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్లో వాడుకలో లేని మారుతి సుజుకి, స్కార్పియో, ఇన్నోవా వాహనాలను వేలం వేయనున్నట్లు డీఆర్వో ఉదయభాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయములో వేలంపాట జరుగుతుందన్నారు. ధరావత్తు సొమ్ము రూ.10 వేలు చెల్లించాలన్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్ధారించిన ధరలకు వాహనాలను వేలం వేస్తామని తెలియజేశారు.కసుమూరు దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలువెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలు వచ్చినట్లు ఈఓ షేక్ షరీఫ్ శుక్రవారం తెలిపారు. దర్గాలో మొత్తం 8 హుండీలు ఏర్పాటు చేశామన్నారు. రెండు ప్రధాన హుండీల్లో కానుకలను గురు, శుక్రవారాల్లో లెక్కించగా రూ.44.17 లక్షలు వచ్చాయన్నారు. మిగిలిన ఆరు హుండీల్లోని కానుకలను 15 రోజుల తర్వాత లెక్కిస్తామన్నారు.ఉచితంగా నట్టల నివారణ మందునెల్లూరు(పొగతోట): గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో నాలుగుసార్లు మందు పంపిణీ చేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంవరికుంటపాడు: మండలంలోని రామాపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని ఆండ్రవారిపల్లికి చెందిన గాడి మాధవరెడ్డి (45) మోటార్బైక్పై తిమ్మారెడ్డిపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి రాజమండ్రికి కూరగాయల లోడుతో బొలెరో వాహనం వెళ్తోంది. రెండు వాహనాలు రామాపురం సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్ కాలువ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాధవరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
● ఆవేదనలో వెలుగు ఉద్యోగులు సీతారామపురం: వెలుగు విభాగంలో ప్రభుత్వం చేపట్టిన సాధారణ, సర్దుబాటు పేరిట బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపుతో బదిలీలు చేశారంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయినవారికి జిల్లాలో, కాని వారికి ఇతర జిల్లాలకు స్థానచలనం ఎలా చేస్తారని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని పలువురు విమర్శిస్తుండగా, కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బదిలీలకు సంబంధించి సెర్ప్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయగా అందుకు విరుద్ధంగా జిల్లాలో బదిలీలు జరిగాయన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 23 ప్రకారం ఒకచోట ఐదేళ్లు సర్వీస్ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని సైతం ఇతర జిల్లాకు బదిలీ చేసినట్లు తెలిసింది. సర్ప్లస్ కాకపోయినా రాజకీయాలు చేసి ఐదుగురు ఏపీఎంలను పల్నాడు జిల్లాకు బదిలీ చేశారు. అంతంతమాత్రపు జీతాలతో అంత దూరం వెళ్లి విధులు ఎలా నిర్వహించాలంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టును పక్కనపెట్టి చేపట్టిన బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డబ్బులిచ్చిన వారిని మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుష ఏపీఎంలను పల్నాడు జిల్లాకు పంపారు. వీరంతా సెర్ప్ గైడ్లైన్స్ ప్రకారం బదిలీలకు అనర్హులు. వారు ముందస్తు దరఖాస్తు చేసుకోలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాకు బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర మండల స్థాయి అధికారులకు సైతం జిల్లా స్థాయిలో బదిలీలు జరుగుతుండగా ఏపీఎంలకు మాత్రం జోనల్ స్థాయిలో స్థాన చలనం కలిగించడం గమనార్హం. -
మద్యానికి బానిసై దోపిడీలు
● నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): వారంతా మద్యం, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలను తీర్చుకునేందుకు ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకెళుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం ఇన్స్పెక్టర్ వేణుగోపాల్రెడ్డి వివరాలను వెల్లడించారు. ఓ బ్యాంకు ఉద్యోగి ఈనెల 25వ తేదీన తన కుటుంబంతో కలిసి బైక్పై వెళుతుండగా రైల్వేస్టేషన్ వద్ద ముగ్గురు నిందితులు అడ్డగించారు. కత్తులతో చంపుతామని బెదిరించి నగదు దోచుకెళ్లారు. అదేరోజు రాత్రి ఇద్దరు బాలలు మద్యం తాగేందుకు తడికల బజారు సెంటర్ దళితవాడలో ఒంటరిగా ఇంటిముందు నిద్రిస్తున్న మహిళను కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు నవాబుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతికత ఆధారంగా బ్యాంకు ఉద్యోగిని బెదిరించి నగదు దోచుకెళ్లింది ఉడ్హౌస్ సంఘానికి చెందిన మునితేజ, సీహెచ్ మహేష్, బాలాజీనగర్కు చెందిన బి.దేవకుమార్లుగా గుర్తించారు. దళితవాడ దోపిడీ కేసులో ఇద్దరు బాలల్ని గుర్తించారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ఇద్దరు బాలలను తిరుపతిలోని జువైనెల్ హోంకు తరలించి మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై రెహమాన్, సిబ్బంది నరసయ్య, ప్రసాద్, మస్తాన్రావు, సుధాకర్, వేణు, మస్తానయ్య, గౌస్బాషాలను ఎస్పీ అభినందించారు. -
పిల్లాపేరును చెరిపేస్తున్నారు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. సహజ వనరులను కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్నారు. పిల్లాపేరులోని ఇసుకను రేయింబవళ్లూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ఊడ్చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో పడి కళ్ల ముందే జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపును పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లాపేరు పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా సాగు కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం మండలాల పరిధిలో పిల్లాపేరు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహంతో ఇసుక మేట పడుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీప ప్రాంతాల్లోని రైతులు వివిధ పంటలను సాగు చేస్తారు. అయితే ఏడాది కాలంగా పచ్చ నేతలు ఇక్కడ నిత్యం యంత్రాలను ఉపయోగించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా కొల్లగొడుతూ.. ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, పామూరు ప్రాంతాలకు పిల్లాపేరు నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. దూరం బట్టి ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 నుంచి రూ.3500 వరకు బాడుగ వసూలు చేస్తున్నారు. మరోవైపు పేదలు తమ ఇళ్ల నిర్మాణం కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఆటోలను ఉపయోగించి కూలీల ద్వారా ఇసుకను లోడ్ చేయించి అవసరాలను తీర్చుకోవచ్చనే జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అయితే అధికార పార్టీ నేతలు తమ ట్రాక్టర్లను ఉపయోగించి ఇసుకను రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలా.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇసుక అవసరమైతే సచివాలయం వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని పర్మిట్ పొంది రవాణా చేసుకునే అవకాశం ఉండేది. దీంతో అక్రమ రవాణాకు అవకాశం లేదు. అయితే ఇప్పడా విధానాన్ని తొలగించడంతో రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఇసుక వెళ్తోంది. పేదలు అఽధిక ధరలను చెల్లించాల్సి వస్తోంది. ఇసుక ఉచితమని పేరుకు చెప్తున్నా, ఎక్కడా అది అమలుకు నోచుకోవడంలేదు. నిబంధనలను ఉల్లంఘించి యంత్రాలతో ఇసుక తవ్వకాలు అడుగంటుతున్న భూగర్భ జలాలు పట్టించుకోని అధికార యంత్రాంగం -
డ్రగ్స్ వాడకంతో అనర్థాలు
నెల్లూరు(అర్బన్): మాదకద్రవ్యాలను వినియోగిస్తే అనర్థాలు సంభవిస్తాయని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. ప్రపంచ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, సర్వజన ఆస్పత్రి ఆవరణలో పలువురు వైద్య సిబ్బంది, డాక్టర్లతో ప్రదర్శనను నవజీవన్ ఐడీయూ ఎన్జీఓ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా మాయాజాలంలో పడి యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాదరణను ఓర్వలేకే కేసులు
● ఆనం విజయకుమార్రెడ్డి నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పర్యటనలకు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలేక అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం బనాయిస్తోందని పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఏడాది పాలనలోనే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. వీరికి అండగా ఉంటూ.. భరోసా కలిస్తున్న తమ నేతను ఇబ్బంది పెట్టేందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కిందపడి వ్యక్తి మరణించారంటూ తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. ఆ రోజున ఎస్పీ మాటలకు.. ప్రభుత్వం పెట్టిన కేసుకు సంబంధం లేదన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోను చూపిస్తూ కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎంతో మంది మరణానికి కారణమయ్యారని, ఆయనపై ఎలాంటి కేసును ఎందుకు పెట్టలేదన్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డిపై బనాయిస్తున్న అక్రమ కేసుల విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా జూలై మూడున జగనన్న పర్యటన నెల్లూరులో ఉంటుందని, ప్రజాభిమానాన్ని ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. -
విచారణ పేరిట వేధింపులు
అనుమసముద్రంపేట: విచారణ పేరిట పోలీసులు వేధించడంతో మహిళ కుప్పకూలిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని కావలియడవల్లికి చెందిన మానికొండ ఇందిరమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివాసముంటున్నారు. వారం క్రితం తమ సమీప బంధువుల ఇంటికొచ్చారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీలక్ష్మి ఇంట్లో ఇందిరమ్మ ఉంటున్నారు. ఈ క్రమంలో తన బంగారం పోయిందంటూ శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులపై పోలీసులకు ఇందిరమ్మ ఆదివారం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి శ్రీలక్ష్మిని రోజూ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారణ పేరుతో సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ఈ తరుణంలో పోలీస్స్టేషన్లో గురువారం ఆమె కుప్పకూలారు. ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో కక్షగట్టి తమను దెబ్బతీసేందుకు కొందరు టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని భర్త వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను మానుకోవాలని, మహిళ అని చూడకుండా పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీస్స్టేషన్లో కుప్పకూలిన మహిళ టీడీపీ నేతల ప్రోద్బలంతోనేనని భర్త ఆరోపణ -
‘ఆక్వా’ ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 973 దరఖాస్తులు రాగా, 856ను ఆమోదించామని చెప్పారు. పెండింగ్లో ఉన్న మిగిలిన వాటిని రానున్న సమావేశంలోపు ఆమోదించాలని సూచించారు. వాణిజ్య పన్నులు, కార్మిక, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల వద్ద ఉన్న కేసులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కంపెనీలకు అవసరమైన మానవ వనరులకు అవసరమైన శిక్షణను ఇప్పించేలా.. సీఎస్సార్ నిధులను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మారుతిప్రసాద్, ఏపీఐఐసీ అధికారి శివకుమార్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయాలి జిల్లాలో మత్స్యకారులు, పాడి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గానూ కిసాన్ క్రెడిట్ కార్డులను విరివిగా అందజేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లను సమన్వయం చేసుకొని ఐదు వేలకుపైగా కిసాన్ క్రెడిట్ కార్డులను వారంలోపు అందజేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు రుణాలను అందజేయాలని కోరారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమ క్రమబద్ధీకరణ ద్వారా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళిక బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎల్డీఎం మణిశేఖర్, నాబార్డు డీడీఎం బాబు, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మెప్మా పీడీ లీలారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. -
బెడిసి కొట్టిన టీడీపీ దొంగల కట్టు కథ
కోవూరు: కోవూరు మండలం జమ్మిపాళెంలో మోటార్ చోరీ, రోడ్డు ప్రమాదానికి సంబంధించి టీడీపీ దొంగల కట్టు కథలు బెడిసి కొట్టాయి. ఆదివారం రాత్రి పడుగుపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, మణి, శ్రీహరి, శ్రీనివాసులు కలిసి టాటా ఏస్ వాహనంలో జమ్మిపాళెంలోని జగనన్న కాలనీలో తాగునీటి పథకానికి ఏర్పాటు చేసిన మోటార్లను చోరీ చేసి పరారయ్యే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి కారణమై ఓ యువకుడి దుర్మరణానికి బాధ్యులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితులను కాపాడేందుకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఇందుకూరుపేటకు చెందిన ఓ ముఖ్య నేత సూచనలతో కోవూరుకు చెందిన టీడీపీ నేతలు పోలీస్స్టేషన్ ముందు వాలిపోయారు. నిందితులపై ఏ కేసు కట్టకుండా ఒక రోజంతా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.ప్రమాద ఘటనపై బంధువుల విమర్శలతో..ఈ ప్రమాదంలో నెల్లూరులోని ఓ షాపింగ్ మాల్లో క్యాషియర్గా పనిచేస్తున్న జమ్మిపాళెంకు చెందిన సుధీర్బాబు దుర్మరణం చెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన నిందితులు ఘటనా స్థలంలోనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. సుధీర్బాబు డ్యూటీ ముగించుకుని స్వగ్రామం జమ్మిపాళెం వెళ్తున్న సమయంలో అతని బంధువులు ఓ ఫంక్షన్కు వెళ్లి వెళ్తున్నారు. వీరిని క్రాస్ చేసి సుధీర్బాబు ముందుగా వెళ్లిపోయాడు. అయితే నిందితులు అదే గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలో తాగునీటి మోటార్లు చోరీ చేసి స్థానికుల కంట పడడంతో వాహనంతో సహా పారిపోయే ప్రయత్నంలో మితిమీరిన వేగంతో వస్తూ ఎదురుగా బైక్పై వస్తున్న సుధీర్బాబును ఢీకొన్నారు. దీంతో సుధీర్బాబు రోడ్డుపై పడిపోవడంతో నిందితులు ఆగి అతన్ని పరిశీలిస్తున్నారు. ఇంతలోనే వెనుకనే వచ్చిన అతని బంధువులు వచ్చి చూసి అడగడంతో ముందు వెళ్లిన ఏదో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని, తాము ఆగి చూస్తున్నామంటూ బుకాయించారు. దీంతో వారి బంధువులు సుధీర్బాబు మమ్మల్ని క్రాస్ చేసి కొన్ని క్షణాలు ముందే వచ్చాడు. మాకు ఎదురుగా ఏ వాహనం రాలేదు. మీరే ఢీకొట్టి నాటకాలు ఆడుతున్నారంటూ నిలదీయడంతో వారి నుంచి తప్పించుకుని పరారయ్యారు.ఈ ఘటన తర్వాత కోవూరుకు చెందిన టీడీపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకుని కేసు నమోదు కాకుండా ప్రైవేట్ పంచాయితీ నడిపారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తామని బేరం పెట్టారు. అయితే బాధిత కుటుంబ బంధువులు రూ.30 లక్షల డిమాండ్ చేశారు. చివరకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకు ఇపిస్తామని బేరసారాలు చేశారు. అయితే ఈ పంచాయితీ తెగకపోవడంతో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. దొంగతనం కేసు అయితే నమోదు చేయలేదు. నిందితులు మొదట చోరీ చేసి, ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు మీడియాల్లో కథనాలు రావడంతో పోలీసులు చోరీ కేసు కట్టడం గమనార్హం.ఎవరికి వారు టీడీపీ నేతలు సైలెంట్రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి దుర్మరణానికి కారణమైన నిందితులు టీడీపీ వర్గీయులు కావడంతో షాడో ఎమ్మెల్యే ప్రోద్బలంతో కోవూరుకు చెందిన టీడీపీ నేతలు నిమిషాల వ్యవధిలోనే పోలీస్స్టేషన్ ముందు వాలిపోయారు. అయితే టీడీపీ నేతలు దొంగల ముఠాకు, రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులకు కొమ్మ కాస్తున్నారని ప్రచారం జరగడంతో ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు.తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఆదుకోవాలిటీడీపీకి చెందిన దొంగల ముఠా చేసిన రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన సుధీర్బాబు బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. తల్లి గృహిణిగా ఉండగా, నాన్నమ్మ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుండగా అరకొర వేతనం వస్తోంది. ఆమె కూడా మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం బతుకుదెరువు పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.రైతు పొలంలో మోటార్లు అంటూ..రోడ్డు ప్రమాదానికి కారణమై పట్టుబడిన వాహనంలో చోరీ చేసిన మోటారు ఉండడంతో మరో కట్టుకథ అల్లారు. జమ్మిపాళెం సమీపంలో ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేస్తున్నామని, మోటారు రిపేరు కావడంతో తీసుకెళ్తున్నామంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సదరు రైతును అదే విషయాన్ని చెప్పాలని ఒత్తిడి చేశారు. వాస్తవానికి నిందితులు జగనన్న కాలనీలోని తాగునీటి పథకం మోటారు చోరీ చేయడం, దీనికి సంబంధించి సమాచారం ఉండడంతో టీడీపీ నేతలు చెప్పినట్లు చెబితే చివరకు తన మెడకు చుట్టుకుంటుందని భావించిన సదరు రైతు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు. ఈ క్రమంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ ఏఈ ఏకాంబరం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై మంగళవారం రాత్రి ఎట్టకేలకు చోరీ కేసు కూడా నమోదు చేశారు. -
సర్వేపల్లి మాఫియాల అడ్డా
సర్వేపల్లి.. సహజ వనరుల సంపద దోపిడీ మాఫియాలకు అడ్డాగా మారింది. అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ఏడాది కాలంగా విరామం లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలతో జిల్లాలోనే చరిత్ర సృష్టిస్తున్న ముఖ్య నేత కనుసన్నల్లో తాజాగా వైట్ క్వార్ట్ ్జ తవ్వకాలను గిన్నిస్ రికార్డు స్థాయిలో చేపడుతున్నారు.పొదలకూరు, వెంకటాచలంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నా.. అధికారయంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అక్రమంగా మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు చేశారంటూ చేయని నేరాలకు మాజీమంత్రి కాకాణిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెట్టించి పైశాచికానందం పొందుతున్న టీడీపీ నేతలు వీరు సాగిస్తున్న ప్రకృతి సంపద దోపిడీకి ఎంత కాలం జైల్లో పెట్టాలని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.సాక్షి టాస్క్ఫార్స్: సర్వేపల్లి ముఖ్యనేత నిత్యం మాట్లాడేవి నీతులు.. చేసేవి అవినీతి పనులు అన్నట్లుగా ఉంది. నియోజకవర్గాన్ని ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయా సహజ వనరుల దోపిడీలో అధికార పార్టీ నేతలు ఒక ఉద్యమంగా సాగిస్తున్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా గ్రావెల్, మట్టిని తవ్వేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క గ్రావెల్ మాఫియా రూ.కోట్ల గ్రావెల్ దందా సాగిస్తోందంటే ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యనేత కనుసన్నల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై అక్రమ కేసుల పేరుతో భయపెడుతుండడంతో కనీసం ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు.నిత్యం వందల ట్రిప్పుల తరలింపుసర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, వెంకటాచలంలో నిత్యం నిరంతరాయంగా వందల ట్రిప్పుల గ్రావెల్ను తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు డిమాండ్ను బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ముత్తుకూరు మండలంలో చేపడుతున్న సాగరమాల ప్రాజెక్ట్కు గ్రావెల్ అవసరం కావడంతో కొన్ని నెలలుగా వెంకటాచలం, పొదలకూరు మండలాల నుంచి నిత్యం సుమారు 200 ట్రిప్పులకుపైగానే గ్రావెల్ను తరలిస్తున్నారు. జోరు వర్షం కురిస్తే తప్పించి మిగిలిన రోజుల్లో పట్టపగలే యంత్రాలతో టిప్పర్లు పెట్టి గ్రావెల్, మట్టిని దోచుకుంటున్నారు. ప్రధానంగా వెంకటాచలం మండలం నాగబొట్లకండ్రిక గ్రామం నుంచి గ్రావెల్ తరలిస్తున్నారు.తాటిపర్తిలో 130 ఎకరాల్లో..పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ బత్తులపల్లిపాటు గ్రామంలో సర్వే నంబరు 26లో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ, మేతపొరంబోకు భూములు ఉన్నాయి. తాటిపర్తికు చెందిన టీడీపీ నేతలు ఆ భూముల్లో రేయింబవళ్లు గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా యంత్రాలను ఉపయోగించి పెద్ద గోతులను చేసి గ్రావెల్ను నెల్లూరుతోపాటు చుట్టు పక్కల లేఅవుట్లకు తరలిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తే అధికారం పార్టీలో ఉన్నాము.. చూసీచూడనట్లు పోవాల్సిందేనని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి నిత్యం 100 ట్రిప్పుల వరకు తరలిస్తున్నట్లు సమాచారం. గ్రావెల్ దోపిడీపై అడిగే వారిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ పంచాయతీలో ఇంటి అవసరాల కోసం సామాన్యులు రెండు ట్రాక్టర్లు గ్రావెల్ తోలుకుంటే పోలీసులకు పట్టించి కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో ఏ తప్పు లేకపోయినా..గతంలో వైఎస్సార్సీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ నేత కూడా సహజ వనరుల అక్రమ దందాలకు పాల్పడలేదు. అయినా తాటిపర్తి పంచాయతీలో రుస్తుం మైన్లో అక్రమంగా మైనింగ్ చేయించారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు తాజాగా సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తవ్వారని మరో కేసు నమోదు చేయించారు. ఆ కేసుకు సంబంధించి కాకాణిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వాస్తవంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్, మట్టి, మైనింగ్ జరిగి ఉంటే అధికార పార్టీ సదరు ముఖ్య నేత వీరంగం చేసేవారు. ట్రాక్టర్ గ్రావెల్ తరలించినా.. తట్టెడు మట్టి తవ్వినా మైనింగ్ శాఖ అనుమతుల మేరకే తవ్వడంతో ఎక్కడా అక్రమ దందాలు చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అధికారం రాగానే అక్రమాలు జరగకపోయినా.. అక్రమాలు చేశారంటూ ఊదరగొట్టుతున్నారు.చెప్పేవి నీతులు.. చేసేవి అవినీతి పనులుగతంలో ప్రతిపక్షంలో ఉండీ అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండడంతో పోలీసులు అడ్డుకుని వాహనాలను స్టేషన్కు తరలిస్తే.. సదరు ముఖ్య నేత సాగించిన హడావుడి అంతాఇంతా కాదు. నిత్యం మీడియా ముందుకు వచ్చి తానేదో సత్యహరిశ్చంద్రుడు వారసుడైనట్లు.. నీతులు మాట్లాడుతుంటారు. కానీ చేసేవన్నీ అవినీతి పనులే. సదరు నేత అధికారం దక్కిన ఏడాది కాలంగా ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, మద్యం, పేకాట, డైమండ్ డబ్బా వంటి మాఫియాలను బహిరంగంగా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యనేత మండలానికొక నేతను పెట్టుకుని ఏడాది కాలంలో రూ.వందల కోట్లు కొల్లగొట్టినట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆ ముఖ్య నేత అక్రమాలను ఏడాది కాలంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పక్కా ఆధారాలతో మీడియా సమావేశాల్లో బట్టబయలు చేస్తూ వచ్చారు. దీన్ని జీర్ణించుకోలేక కాకాణిపై తప్పుడు కేసులు పెట్టించి జైల్లో కూర్చొబెట్టి తన అవినీతి, అక్రమాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జిల్లా నేతలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తూమాటి మాధవరావు, మేరిగ మురళి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, బుర్రా మధుసూదన్రావు, మేకపాటి విక్రమ్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పదవులు నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తున్నట్లు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా దువ్వూరు మధుసూదన్రెడ్డి (గూడూరు నియోజకవర్గం), కార్యదర్శులుగా పూనూరు మనోహర్రెడ్డి (ఆత్మకూరు నియోజకవర్గం), ముమ్మారెడ్డి రవీంద్రరెడ్డి (సూళ్లూరుపేట నియోజకవర్గం), పి.సదానందరెడ్డి (వెంకటగిరి నియోజకవర్గం), రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా ఎండీ మగ్దుమ్ మొహిద్దీన్ (గూడూరు నియోజకవర్గం)లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పెన్నా కాలుష్యంపై అధికారుల పరిశీలన
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ వద్ద పవిత్ర నది జలాలు కలుషితమవుతున్న విషయమై స్థానికుడు మధు ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్జీటీ బృందం, ఏపీ పొల్యూషన్ బోర్డు అధికారులు, స్థానిక అధికారులు బుధవారం పరిశీలన చేశారు. నెల్లూరు ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఎన్జీటీ బృందం నదిలో మురుగునీరు కలుస్తున్న మూడు ప్రదేశాలను గుర్తించి వాటర్ శాంపిల్స్ సేకరించామని, వాటిని ల్యాబ్కు పంపించడం జరుగుతుందన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామనిన్నారు. ఎన్జీటీ చైన్నె రీజినల్ డైరెక్టర్ వరలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.29న చెస్ ఓపెన్ టోర్నమెంట్నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు జిల్లా అండర్–15 చెస్ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 29వ తేదీ రాంజీనగర్లోని రోయ చెస్ అకాడమీలో ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని, 2010 జనవరిలో జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఈ నెల 27గా నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9603345326 నంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు.జాతీయ లోక్అదాలత్, విచారణ ఖైదీలపై సమీక్షనెల్లూరు (లీగల్): జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్, విక్టిమ్ కాంపెన్జేషన్ స్కీం అమలు, విచారణ ఖైదీల సమస్యలు తదితర సమస్యలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం బుధవారం జిల్లా కోర్టులో జరిగింది. జిల్లా అధికారుల సూచనలు, సలహాలపై కో ఆర్డినేషన్ కమిటీలో చర్చించారు. కలెక్టర్ ఆనంద్, ఏఎస్పీ సౌజన్య, కార్పొరేషన్ కమిషనర్ నందన్, తిరుపతి డీఆర్ఓ నరసింహులు, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ మస్తానయ్య, ఫారెస్ట్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జడ్జిలు, ప్యానల్ లాయర్స్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనే ఐటీడీఏ ప్రథమ కర్తవ్యం
నెల్లూరు రూరల్: జిల్లాలో ఆధార్, రేషన్ కార్డులు లేని గిరిజనులకు వచ్చే ఆగస్టు 15 లోపు వాటిని అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. మారుమూల పల్లెల్లో తాగు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజనాభివృద్ధికి గతే డాది రూ.1,300 కోట్ల నిధులు వ్యయం చేశామన్నారు.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా 206 రోడ్లకు రూ.550 కోట్ల నిధులు వ్యయం చేశామన్నారు. కావలి, తిరుపతి జిల్లా కేవీపల్లి గురుకుల పాఠశాలల అభివృద్ధికి దాదాపు రూ.18 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.లక్ష నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని 6,800 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో ప్రత్యేక టీచర్, ఆయాలను నియమిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి కలెక్టర్తో కలిసి గిరిజన సంక్షేమ విద్యార్థులకు కాస్మోటిక్ కిట్లు, అంగన్వాడీ సిబ్బందికి స్టడీ మెటీరియల్, సామగ్రిని అందజేశారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలిక చెంచమ్మను పరామర్శించి, రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
ఆగిన నిధులు..నత్తనడకన పనులు
ఉదయగిరి: గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘గ్రామ కొలను’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ ఉపాధి హామీ నిధులతో మండలానికి ఒకటి చొప్పున చెరువును ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. మొత్తం 37 మండలాల్లో 37 చెరువులతోపాటు కొన్ని మండలాల్లో అదనంగా మరో 10 చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దీంతో వేగంగా పనులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పథకం పేరును ‘గ్రామ పుష్కరిణి’గా మార్చింది. కానీ జరిగిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. కొత్తగా పనులు చేపట్టలేదు. నేపథ్యం ఇదీ 2022లో అప్పుటి వైఎస్పార్సీపీ ప్రభుత్వం గ్రామ కొలనుకు శ్రీకారం చుట్టింది. అప్పటి కలెక్టర్ చక్రధర్బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాలో 45 చెరువులను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి కోసం రూ.64.37 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారు. సుమారు 50 శాతం చెరువుల పనులు ప్రారంభించారు. కొన్నిచోట్ల తుదిదశకు చేరుకున్నాయి. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి ఏడాది అయినా చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర నష్టపోయారు. మొదలు కానీ పనులను రద్దు చేశారు. గత ప్రభుత్వంలో ‘గ్రామ కొలను’కు శ్రీకారం వేగంగా జరిగిన పనులు బిల్లులు నిలిపి వేసిన కూటమి ప్రభుత్వం గ్రామ పుష్కరిణిగా పేరు మార్చి చేతులు దులుపుకొన్న వైనం ఆగిపోయిన చెరువుల అభివృద్ధినిధుల సమస్య ఉంది జిల్లాలో 45 చెరువులను ఆధునికీకరించేందుకు గుర్తించాం. వీటిలో గత ప్రభుత్వంలో కొన్ని పనులు చేశారు. వాటికి కూడా ఇంత వరకు బిల్లులు రాలేదు. ప్రస్తుతం నిధుల సమస్య ఉంది. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. – దేశ్ నాయక్, ఎస్ఈ, ఇరిగేషన్ -
సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం గ్రామ రెవెన్యూ సహాయకులు, సచివాలయ సర్వేయర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశారు. నెల్లూరు(అర్బన్): గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు వీఆర్ఏలు ఽఆందోళన నిర్వహించారు. బుధవారం నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజయ్కుమార్ మాట్లాడుతూ వీఆర్ఏలు రెవెన్యూ శాఖలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నట్లు చెప్పారు. సెలవులు లేకుండా ఫుల్టైమ్ పనిచేస్తున్నా పార్ట్టైమ్ పేరుతో గౌరవ వేతనం ఇచ్చి సరిపెట్టడం దుర్మార్గమన్నారు. వీఆర్ఏల్లో దాదాపు 90 శాతానికి పైగా దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వారేనన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఒక్క డీఏను కూడా ఆపేయడం సిగ్గు చేటన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా టైమ్ స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఇంటర్వ్యూ చేసి ఆపేసిన 32 మందికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ విజయకుమార్కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లచ్చయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గయ్య, భాస్కర్, సుబ్బయ్య, అంకయ్య, అమీర్, ఓబులేసు, షమీం, శీను, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్వేయర్ల పెన్డౌన్నెల్లూరు రూరల్: సమస్యలపై వినతిపత్రాలు సమర్పించినా పరిష్కారం చూపకపోవడంతో పెన్డౌన్ చేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని సచివాలయ సర్వే ఉద్యోగులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు రాష్ట్రాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బీద లక్ష్మణానంద, వర్కింగ్ ప్రెసిడెంట్ అంకయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియను సీనియారిటీ ప్రతిపాదికన చేయాలన్నారు. ఫారెస్ట్లో, ముళ్లపొదల్లోకి వెళ్లి సర్వే చేస్తే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొబెషనరీ డిక్లేర్ కాకుండా ఇప్పటి వరకు రూ.15 వేల జీతంతో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణం రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు సర్వేయర్లందరూ 27వ తేదీ వరకు మాస్ క్యాజువల్ సెలవు పెట్టారన్నారు. మిగిలిన రెండు రోజులు విజయవాడలో జరిగే రిలే నిరాహారదీక్షలకు హాజరవుతామని తెలియజేశారు. -
భర్త తీరు వల్లే భార్య ఆత్మహత్య
ఆత్మకూరు: పట్టణానికి చెందిన గొట్ల ప్రణవి (24) అనే వివాహిత భర్త తీరు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కాగా ప్రణవి భర్త, టీడీపీ నాయకుడు, దేవరాయపల్లి గ్రామ ఉప సర్పంచ్ అయిన గొట్ల మస్తానయ్య, అతడితో అక్రమ సంబంధం కొనసాగించిన మహిళను అరెస్ట్ చేయాలంటూ మృతురాలి సోదరుడు, సమీప బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి గేటు వద్ద నిలిపి వారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్సైలు, పోలీసులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మస్తానయ్య తన ప్రియురాలితో కలిసి ఉండగా వీడియో కాల్ ద్వారా భార్య ప్రణవికి చూపుతూ మానసికంగా హింసించాడని బంధువులు ఆరోపించారు. ఆ సమయంలో భర్త చూస్తుండగానే ప్రణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే మస్తానయ్య ఏమీ తెలియనట్టు తన నివాసం పక్కనున్న వారికి ఫోన్లు చేశాడని, ప్రణవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, చూసి చెప్పాలంటూ నటించాడన్నారు. కేసు నమోదు విషయంలో ఎలాంటి సంబంధం లేని మృతురాలి అత్త, ఆడపడచుల పేర్లను నమోదు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ప్రమేయంతో మస్తానయ్యను అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు వారికి సర్దిచెప్పి పంపారు. బలవన్మరణం కేసులో బంధువుల ఆరోపణ భర్త వీడియోకాల్లో ఉండగానే ఉరేసుకున్నట్లు వెల్లడి అతను టీడీపీ నేత, ఉప సర్పంచ్ -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు(పొగతోట): మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలానికి చెందిన బాలికను చైర్పర్సన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెల్ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానంతో బాలికను చిత్రహింసలకు గురి చేయడం హేయమైన చర్య అన్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు. అధునాతన టెక్నాలజీతో ముందుకెళ్తుంటే కొందరు మూఢనమ్మకాలు పాటిస్తున్నారన్నారు. ప్రజల్లో పూర్తిస్థాయిలో చైతన్యం రావాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, సీడీపీఓలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం నెల్లూరు ప్రాంత కార్యకర్తల వర్క్షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు సంబరాలు చేసుకునే బదులు ఆత్మ పరిశీలన చేసుకుంటే భవిష్యత్కు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గతంలో స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేయాలని చెప్పిన చంద్రబాబు, లోకేశ్లు నేడు రాష్ట్రంలో అదానీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సర్వేసల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలు గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు కూడా వేశారని గుర్తు చేశారు. అమరావతి పేరుతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపి వేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు మూలం రమేష్, మోహన్రావు, మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అక్కా.. నేను చనిపోతున్నా..
● ఆత్మహత్యకు ముందు వీడియోకాల్ చేసిన తమ్ముడు నెల్లూరు సిటీ: చనిపోతున్నానంటూ అక్కకు తమ్ముడు వీడియోకాల్ చేసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు కథనం మేరకు.. రూరల్లోని కొండ్లపూడి టిడ్కో గృహంలో వి.శ్రీహరి (25) నివాసముంటున్నాడు. ప్లంబిగ్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో కొంత కాలంగా శ్రీహరి కారు డ్రైవర్గా వెళ్తున్నాడు. అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం తన అక్కకు వీడియోకాల్ చేసి బతకాలని లేదని, చనిపోతానని చెప్పాడు. ఆందోళనకు గురైన ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అతను ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా శ్రీహరి అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి చూడగా చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కారును తప్పించబోయి..● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దుత్తలూరు : ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పక్కనే ఉన్న రాళ్లగుట్టపై పడటంతో తీవ్ర గాయాలై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వెంగనపాళెం – తిమ్మాపురం రోడ్డు మార్గంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు బుధవారం వివరాలు వెల్లడించారు. వెంగనపాళేనికి చెందిన పోలుబోయిన శ్రీనివాసులు (55) మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గొర్రెల మంద వద్దకు మోటార్బైక్పై బయలుదేరాడు. తిమ్మాపురం వైపు పొలాల్లోకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న రాళ్లగుట్టపై పడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని హుటాహుటిన వింజమూరు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. కండలేరులో 34.433 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 34.433 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,580, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని వేధించొద్దు
● కక్ష తీరకుంటే నాపై కేసులు పెట్టండి ● కాకాణి పూజితపొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు తమను అధికార పార్టీ వారు వేధింపులకు గురిచేయడంతోపాటు అక్రమ కేసులు పెడుతున్నట్టు వెల్లడిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత అన్నారు. బుధవారం ఆమె పొదలకూరు విఘ్నేశ్వరాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సంగంరోడ్డు సెంటర్లో ఉన్న తన తాత రమణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోవర్ధన్రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పీటీ వారెంట్లు పెట్టి జైల్లోనే ఉంచాలని చూస్తున్నారని, ఇందుకోసం అమాయకులైన పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా విడవకుండా కేసులు బనాయిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలుంటే తనపై కేసులు పెట్టుకోవాలని ఎలాంటి సంబంధం లేని కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు. తమను నమ్ముకున్న వారిని వేధింపులకు గురిచేస్తే అండగా నిలబడి ఎంత దూరమైన వెళతామన్నారు. గోవర్ధన్రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మీరు చేస్తే ప్రజలు ఆదరిస్తారని కేసులు పెట్టుకుంటూ పోతే అధికారం శాశ్వతంగా కాదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ, ఐటీ వింగ్ అధ్యక్షుడు రావుల ఇంద్రసేన్గౌడ్, ఎంపీటీసీలు జి.లక్ష్మీకల్యాణీ, జి.శ్రీనివాసులు, ఎస్కే అంజాద్, కేతు రామిరెడ్డి, నాయకులు బొడ్డు మాలకొండారెడ్డి, పి.అశోక్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేర నియంత్రణే లక్ష్యం
● ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు సిటీ: నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం ఎస్పీ నిర్వహించారు. దీనిని ఏపీ ఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధనను వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పురోగతి సాధించిందని అభినందించారు. పోలీస్స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులు తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు కృషి చేయాలన్నారు. స్టేషన్ పరిధిల్లో మిస్సింగ్ కేసులు ఛేదనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ, రూరల్, కావలి, ఆత్మకూరు, కందుకూరు, మహిళా పీఎస్, ఏఆర్ డీస్పీలు, అన్ని సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
దొరికినంత దోచెయ్.. నా ‘సోమి’రంగా!
సాక్షి, టాస్క్పోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఖనిజ సంపద దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. పొదలకూరు మండలం డేగపూడిలోని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఖరీదైన మైకా క్వార్ట్జ్, ఫల్సపర్ మెటల్ను తవ్వకాలు చేస్తూ అక్రమంగా తరిలిస్తున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సహకారంతో ఆయన అనుచరులు అక్రమ దందా సాగిస్తున్నారు. సైదాపురంతోపాటు పొదలకూరు మండలం డేగపూడిలో లభించే క్వార్ట్జ్ ఖనిజానికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో సైదాపురానికి చెందిన ఓ వ్యాపారి ద్వారా డేగపూడి క్వార్ట్జ్ను సోమిరెడ్డి అనుచరులు అక్రమ తవ్వకాలు చేసి సైదాపురంలో అనుమతులు ఉన్న మైన్స్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడును బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. రెండు నెలల్లో డేగపూడి నుంచి దాదాపు 5 వేల టన్నుల క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది. సైదాపురంతోపాటు పొదలకూరు మండలం డేగపూడిలో లభించే క్వార్ట్జ్ ఖనిజానికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో సైదాపురానికి చెందిన ఓ వ్యాపారి ద్వారా డేగపూడి క్వార్ట్జ్ను సోమిరెడ్డి అనుచరులు అక్రమ తవ్వకాలు చేసి సైదాపురంలో అనుమతులు ఉన్న మైన్స్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఖనిజానికి చైనా మార్కెట్లో గ్రేడును బట్టి టన్ను రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. రెండు నెలల్లో డేగపూడి నుంచి దాదాపు 5 వేల టన్నుల క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది. కాకాణిని అక్రమ కేసులతో జైల్లో పెట్టి.. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్రెడ్డి కూటమి ప్రభుత్వ ఏర్పాటైన రోజు నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీని జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వెలుగులోకి తెచ్చేవారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతం నుంచి లైవ్ ఫొటోలు తెప్పించి మీడియా ద్వారా బయటపెట్టేవారు. అటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు, దోపిడీలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు.తాటిపర్తిలో రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్లో కాకాణి పాత్ర ఉందని, అక్కడ జిలెటిన్ స్టిక్స్ పేల్చి మైనింగ్ చేశారని, గిరిజనులను బెదిరించారంటూ తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అంతేకాదు మరో ఏడు అక్రమ కేసులు బనాయించి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ సర్వేపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మూడు మైన్స్లో అక్రమ తవ్వకాలుడేగపూడిలో కండ్లేరు ఏటి కాలువను ఆనుకుని ప్రభుత్వ పోరంబోకు భూముల్లోని మూడు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. భారీ యంత్రాలతో రెండు నెలలుగా తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం యంత్రాలతో ఖనిజాన్ని వెలికితీసి రాత్రి వేళ సైదాపురానికి రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగే దోపిడీ కావడంతో స్థానికులు మిన్నకుండిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తుండడంతో గ్రామస్తులు ఎదురు చెప్పలేక పోతున్నారు. పట్టించుకోని అధికారులు డేగపూడిలో కొంతకాలంగా మైకా క్వార్ట్జ్, ఫల్సపర్ ఖనిజాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. -
ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు చెప్పండి
● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో తాను పాదయాత్ర చేయడం ముఖ్యం కాదని, ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ఆమె మంగళవారం నగరానికి విచ్చేశారు. నగరంలోని పీఎస్ఆర్ కల్యాణ మండపం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆమె గాంధీబొమ్మ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాభవన్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలువురు నాయకులు ఆమెను రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోరారు. దీంతో ఆమె తన పాదయాత్ర ముఖ్యం కాదని, రాష్ట్రంలో సూపర్సిక్స్ పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, రానున్న కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజల నమ్మకాన్ని సంపాదించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి గోపాల్రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, కమాలాకర్, డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్రెడ్డి, నగర అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, డాక్టర్ యశోధర, సంజయ్, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు తదితరులు పాల్గాన్నారు. -
40 బ్యాచ్లతో ఇసుక లోడింగ్
ఇక్కడి ఇసుక రీచ్లో ఒక్కో బ్యాచ్కు 8 నుంచి 10 మంది చొప్పున లోడర్లు ఉన్నారు. మొత్తం 40 బ్యాచ్లు ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఈ ఇసుక లోడ్ చేసే బ్యాచ్ల వద్ద స్థానిక టీడీపీ నాయకుల ఆదేశాలతో ఓ కుటుంబం ఒక్కో బ్యాచ్ వద్ద రూ.50 వసూలు చేస్తున్నారు. ఇందుకు ట్రాక్టర్లకు చీటీలు ఇచ్చి ఆ మేరకు బ్యాచ్లకు లోడింగ్ పనులు కల్పిస్తున్నారు. పట్టించుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్లను ప్రభుత్వ ఆదేశాలతో మూసి వేసినా అప్పారావుపాళెంలో ఇసుక రీచ్ రెండు రోజుల పాటు నిలిపివేసినా తిరిగి కొనసాగించడంపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిత్యం పదుల కొద్ది వాహనాలకు ఇసుకను లోడ్ చేసి రెండు, మూడు మండలాలకు తరలిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ పద్మజాకుమారిని సంప్రదించగా గత వారంలో ఆర్డీఓ ఆదేశాల మేరకు రీచ్ను క్లోజ్ చేయించాం. అక్కడ వీఆర్ఓను కాపలా ఉంచాం. రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా లోతుగా గాడి తీయిస్తాం. ఈ విషయాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని తెలిపారు. -
ఉపాధి పనులు వద్దని..
ఆత్మకూరు: పెన్నానదిలో ఇసుక రీచ్లను జూన్ 1వ తేదీ నుంచి రెండు నెలల పాటు మూసివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయినా ఎక్కడా ఈ ఆదేశాలు అమలు చేయడం లేదు. మిగతా చోట్ల పగలు ఇసుక తవ్వకాలు ఆపేసి రాత్రి పూట చాటుమాటుగా చేపడుతుంటే.. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం వద్ద పెన్నానది ఇసుక రీచ్ రాత్రింబవళ్లు విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రీచ్లను మూసివేయకపోవడంతో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్డీఓ బి.పావని ఆదేశాలతో తహసీల్దారు రీచ్ని మూయించి వేశారు. కేవలం రెండు రోజులు మాత్రమే మూసేసిన ఈ రీచ్లో శనివారం నుంచి యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా ఆత్మకూరు, పొదలకూరు, చేజర్ల మండలాలకు తరలిస్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఓ వీఆర్ఓను అక్కడ కాపలా ఉంచి రీచ్లోకి వెళ్లకుండా తాళం సైతం వేశారు. అయితే టీడీపీ నాయకుల ప్రమేయంతో స్థానికులు తాళాలు పగులగొట్టి వీఆర్ఓను అక్కడి నుంచి పంపివేసి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తున్నారు. రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా జేసీబీతో లోతుగా గాడి తీయాలని అధికారులు పంపగా స్థానికులు అడ్డుకొని రీచ్లోకి దారికి గండి కొట్టకుండా ఆ వాహనాన్ని వెనక్కి పంపివేశారు. విలేకరులకు బెదిరింపులు ప్రభుత్వం మాదే.. ఇసుక రీచ్లో పెత్తనమంతా మాదేనంటూ స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను చేరదీసి ఇసుక రీచ్లో హవా కొనసాగిస్తున్నారు. గ్రామంలో యంత్రాల ద్వారా ఇసుక లోడ్ చేయడం లేదని కేవలం మనుషులే ఉపాధి కోసం ఇసుక లోడ్ చేస్తున్నారని చెబుతూ, తమకు ప్రత్యేకమైన అనుమతి ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరులను సైతం ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే సహించేది లేదని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండ చూసుకుని యువకులు సైతం కథనాలు రాసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. గ్రామంలోకి వస్తే విలేకరుల అంతు చూస్తామని వారు బాహాటంగానే అంటున్నారంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. శనివారం నుంచి పూర్తిస్థాయిలో ఇసుకను తరలిస్తున్న ఈ రీచ్లో సుమారు 50 నుంచి 70కిపైగా ట్రాక్టర్లు లోడ్ చేసుకొని యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుక లోడింగ్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు అధికారులను మూడు రోజుల క్రితం గ్రామానికి పంపించారు. అందరికీ జాబ్కార్డులు ఇచ్చి పనులను కల్పించాలని ఉపాధి కోల్పోకుండా చూడాలని ఆదేశించారు. దీంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ ఓ వర్గం ఉపాధి పనులు మాకు వద్దని ఇన్నాళ్లు గ్రామానికి ఎందుకు రాలేదని ఇప్పుడెందుకు వచ్చారని వారిని దుర్భాషలాడి తరిమేశారు. గతంలోనూ ఉపాధి పనులు చేసుకోవాలని తాము సూచించామని, ఇసుక రీచ్ ఉందని ఎప్పుడు ఈ పనులు ఉంటాయని, ఉపాధి పనులు అవసరం లేదని గ్రామస్తులు చెప్పడాన్ని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది గుర్తు చేశారు. కాలనీలోని కొందరు టీడీపీ నాయకుల అండతో ఇసుక రీచ్నే పరమావధిగా చేసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. -
పెన్నా కలుషితంపై నేడు కలెక్టర్ విచారణ
● ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన జొన్నవాడ వాసి బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షితాయి ఆలయ పరిసరాల్లోని పవిత్ర పినాకిని నది మురుగు జలాలతో కలుషితం కావడంపై కలెక్టర్ ఆనంద్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. పెన్నానది కలుషితమవుతోందని జొన్నవాడకు చెందిన సింగిరి మధు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు గత నెలలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జొన్నవాడలోని మలికార్జున సమేత కామాక్షితాయి ఆలయానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెన్నానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారని, అలాంటి పవిత్ర తీరంలో గ్రామానికి చెందిన మురుగునీరు నదిలోకి వదిలేయడంతో కలుషితమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్జీటీ చైన్నెలోని సౌత్జోన్ బెంచ్కు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్కు చెందిన జస్టిస్ అరుణ్కుమార్ త్యాగి, డాక్టర్ అప్రోజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల విభాగం కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శితోపాటు కలెక్టర్ను బాధ్యులుగా చేస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు బుధవారం జొన్నవాడ ఆలయ పరిసరాల్లో విచారణ చేపట్టనున్నారు. నదీ జలాలు కాలుష్యం, చెత్త తదితర వస్తువులు నదిలో కలవడంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఎన్జీటి చైన్నె బెంచ్కు అందించనున్నారు. ఆగస్టు 8న ఎన్జీటీ బాధ్యులుగా గుర్తించిన సభ్యులందరూ బెంచ్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. -
15.5 కిలోల గంజాయి స్వాధీనం
కావలి (జలదంకి): నెల్లూరు, కావలి, గూడూరు రైల్వేస్టేషన్ల పరిధిలో సోమవారం మధ్యాహ్నం చేపట్టిన తనిఖీల్లో 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ మంగళవారం తెలిపారు. తమిళనాడు తిరుచ్చిరాపల్లికి చెందిన తవామణి, బిహార్కు చెందిన సూరజ్కుమార్ గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి పట్టుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి రవాణాదారులను పట్టుకున్న నెల్లూరు రైల్వే సీఐ హరిచందన, నెల్లూరు డీఎస్ఆర్పీ మురళీధర్, కావలి జీఆర్ప్పీ సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవిని అభినందించారు. -
పురావస్తుశాఖ అధికారుల పరిశీలన
ఉదయగిరి: ఉదయగిరిలోని రాయల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పలు కట్టడాలను మంగళవారం పురావస్తు, ఆర్కియాలజీ శాఖల అధికారులు పరిశీలించారు. శిథిలమవుతున్న పలు కట్టడాలకు ఏ విధంగా రక్షణ కల్పించాలనే అంశంపై స్థానికులతో చర్చించారు. ప్రాముఖ్యత ఉన్న దేవాలయాలను పురావస్తు శాఖ నుంచి దేవదాయశాఖకు మార్పు చేయాలని కోరారు. ఇందుకు అధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఇన్స్పెక్టర్ పీఎన్ భాయి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.సాంబశివకుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రవీణ్కుమార్, ఒంగోలు పురావస్తు శాఖ అధికారి యశ్వంత్రెడ్డి, తదితరులున్నారు. కూలీల సంఖ్య పెంచండి నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను రోజుకు లక్షకు తగ్గకుండా పెంచాలని డ్వామా పీడీ గంగాభవాని అధికారులను ఆదేశించారు. మంగళవారం డ్వామా కార్యాలయం ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పీడీ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి కూలీలకు పనిదినాలు కల్పించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి నిధులతో గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణాలు చేపట్టారన్నారు. అందుకు సంబంధించి పాత బకాయిలు రూ.50 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన బిల్లులు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. పంట కుంటల లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. నేడు మంత్రి సంధ్యారాణి పర్యటన నెల్లూరు రూరల్: రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం నెల్లూరులో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఓ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నెల్లూరుకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2 గంటల నుంచి 2:30 వరకు అధికారులో మాట్లాడుతారు. 2:30 గంటలకు విలేకరుల సమావేశం అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో విజయవాడకు వెళ్తారని పేర్కొన్నారు. సాగునీటి కాలువల ఆక్రమణల పరిశీలన ● లోకాయుక్త ఆదేశాలతో ఆత్మకూరు: ఆత్మకూరు చెరువు పరిధిలో పలు సాగునీటి కాలువల ఆక్రమణలను మంగళవారం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్, తిరుపతి, నెల్లూరు ఎస్ఈ దేశ్నాయక్, ఆత్మకూరు ఈఈ ఎం.రవి, ఏఈ రవికుమార్రెడ్డి, తహసీల్దారు పద్మజాకుమారి తదితరుల బృందం పరిశీలించింది. సాగునీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లాయి. లోకాయుక్త ఆదేశాల మేరకు పట్టణంలోని స్పార్క్ సిటీ ప్రాంతం నుంచి చెరువు వరకు ఉన్న కాలువలను, అలుగులను, సోమశిల రోడ్డు మలుపు వద్ద కాలువను ఆక్రమించి నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీరు వరప్రసాద్ మాట్లాడుతూ చెరువు నుంచి పొలాలకు వెళ్లే సాగునీటి కాలువలు పలుచోట్ల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. దీంతో పైర్లకు సాగు నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులపై పూర్తి వివరాలను లోకాయుక్తకు నివేదిక అందజేస్తామన్నారు. వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది కొండయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
క్రస్ట్గేట్ల మరమ్మతుల్లో తీవ్ర జాప్యం
సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయం క్రస్ట్గేట్ల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జలాశయ 11, 12 క్రస్ట్ గేట్ల రోప్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో వాటికి మరమ్మతుల కోసం దాదాపు 20 రోజుల క్రితం నూతన రోప్లను ప్రాజెక్టు వద్దకు చేర్చారు. అయితే వాటిని అక్కడ నిరుపయోగంగా పడేశారు. ఈ క్రమంలో 4, 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని డెల్టాకు విడుదల చేయడంతో ఆప్రాన్ మీదుగా వాహనాలు అనుమతించకపోవడంతో సోమశిల, రాజుపాళెం, కమ్మవారిపల్లి, కలువాయి, పీకేపాడు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సుదూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంబంధిత జలాశయం అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే క్రస్ట్ గేట్లకు కొత్త రోప్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
తనువు చాలించి.. కన్నీళ్లు మిగిల్చి..
● వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య నెల్లూరు సిటీ: యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల పంచాయతీ మట్టెంపాడుకు చెందిన వి.మణికంఠ (20) పెయింటింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు లేరు. ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఎవరూ లేకపోవడం, అప్పుల పాలుకావడంతో కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమీప బంధువు వెళ్లి చూసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒంటరితనం వేధించడంతో ఒకరు, వివిధ కారణాలతో మరొకరు మద్యానికి బానిసయ్యారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు నెల్లూరు రూరల్ మండలంలో జరిగాయి. ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.అల్లీపురంలో.. అల్లీపురంలోని టిడ్కో ఇంట్లో ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొండాపురం మండలంలోని వరికుంట గ్రామానికి చెందిన దార్ల వెంకటేష్ (34)కు కొన్నినెలల క్రితం వివాహమైంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వెంకటేష్ తల్లిదండ్రులతో ఉంటూ వ్యసనాలకు బానిసయ్యాడు. స్థానికంగా గొడవలకు వెళ్తుండేవాడు. రెండో పెళ్లి కోసం కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. నెల్లూరు నగరంలోని బంధువుల ఇంట్లో ఉంటూ బేల్దారి పనులకు వెళ్లాలని తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపారు. ఈ క్రమంలో బంధువులు తమకు అల్లీపురంలో టిడ్కో ఇల్లు ఉందని అక్కడికి వెళ్లి ఉండాలని అతడిని పంపారు. కొంత కాలంగా అక్కడే ఉంటున్న వెంకటేష్ భార్య వదిలేయడం, ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేయకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువులు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో టిడ్కో ఇంటికి వెళ్లారు. తలుపులు తట్టినా తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. వెంకటేష్ చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే బంధువులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి తలుపులు పగులకొట్టి మృతదేహాన్ని దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8 కుటుంబ కలహాలతో.. ● వివాహిత బలవన్మరణం ఆత్మకూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు హిల్రోడ్డులో మంగళవారం జరిగింది. ఎస్సైలు ఎస్కే జిలానీ, బి.సాయిప్రసాద్ల కథనం మేరకు.. గొట్ల హజరత్తయ్య, ప్రణవి (24) దంపతులకు ఇద్దరు సంతానం. మరో మహిళతో హజరత్తయ్య సన్నిహితంగా ఉంటూ భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణవి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సైలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పంట కాలువలో పడి.. యువకుడి మృతి
తోటపల్లిగూడూరు: పంట కాలువలో పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని కొత్తపాళెం గ్రామంలో జరిగింది. ఎస్సై వీరేంద్రబాబు కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడు గ్రామానికి చెందిన పాటి అశోక్ (29) మోటార్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. చెన్నకేశవ స్వామి తిరునాళ్ల సందర్భంగా కొత్తపాళెంలోని తన చెల్లెలు ఈదూరు అమూల్య ఇంటికి రెండు రోజుల క్రితం అశోక్ వచ్చాడు. సోమవారం రాత్రి ఆలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం అశోక్ బహిర్భూమి కోసం స్థానిక పంట కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో పంట కాలువలో పడి ఊపిరాడక మృతిచెందినట్లు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గుర్తించిన స్థానికులు జరిగిన విషయం అశోక్ సోదరి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు. -
మహిళలపై అఘాయిత్యాలు సహించం
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ నెల్లూరు(పొగతోట): మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎటువంటి వారైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హెచ్చరించారు. మంగళవారం ఆమె నెల్లూరుకు వచ్చారు. పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలంలో సెల్ఫోన్ చోరీ అనుమానంతో ఓ బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఐదుగురిలో నలుగురిని గుర్తించి అరెస్ట్ చేశారన్నారు. కనుపర్తిపాడు ఘటనకు సంబంధించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో వన్స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, ఇందుకూరుపేట సీడీపీఓ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమ హాస్టళ్లు పెంచాం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్లను పెంచామని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ తెలిపారు. దుత్తలూరులో హాస్టల్ మూసివేతపై మంగళవారం ఆమె వివరాలు వెల్లడించారు. దుత్తలూరు, వరికుంటపాడుల్లో హాస్టల్ భవనాలు పిల్లలు ఉండేందుకు అనుకూలంగా లేవని, అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో తాత్కాలికంగా ఆపేశామన్నారు. ప్రైవేట్ భవనాలను వెతుకుతున్నామని, దొరికిన వెంటనే హాస్టళ్లను పునఃప్రారంభిస్తామన్నారు. అలా కానీ పక్షంలో విద్యార్థులకు అనువైన చోట్ల ఈ ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గతేడాది విద్యార్థుల సంఖ్య తగ్గడంతో 14 హాస్టళ్లను మూసివేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆత్మకూరు, సంగం, బుచ్చి, అక్కంపేట, వింజమూరు, కావలి, ఉదయగిరిలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 230 మంది విద్యార్థులు కొత్తగా చేరారని, జూలై 15వ తేదీ వరకు అడ్మిషన్లు ఉంటాయన్నారు. -
డీసీపల్లిలో 584 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి వేలం కేంద్రంలో మంగళవారం 584 పొగాకు బేళ్లను విక్రయించినట్లు నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 1,007 బేళ్లు రాగా వాటిలో 584 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలియజేశారు. వేలంలో 73,783.2 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,56,49,598ల వ్యాపారం జరిగింది. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280 కాగా కనిష్ట ధర రూ.160 లభించింది. మొత్తం మీద సగటు ధర రూ.212.10గా నమోదైంది. వేలంలో తొమ్మిది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 509 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 394 పొగాకు బేళ్ల కొనుగోలు జరిగింది. వివిధ కారణాలతో 115 బేళ్లను తిరస్కరించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160 పలుకగా, సరా సరి రూ.242.91 లభించిందన్నారు. వేలంలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. -
ఉచితంగా ప్రవేశాలు
సంవత్సరం విద్యార్థులు 2022 – 23 48 2023 – 24 598 2024 – 25 902 2025 – 26 688నెల్లూరు(టౌన్): ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం మంది పేద విద్యార్థులకు ఒకటో తరగతి ఉచిత ప్రవేశం కల్పించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిని గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేసిన దాఖలాల్లేవు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలతో 2022 – 23 విద్యా సంవత్సరం నుంచి ఉచిత ప్రవేశాల అవకాశం దక్కింది. పేద విద్యార్థులకు సొంత గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ అయితే రూ.6,500, పట్ణణ ప్రాంతాల్లో అయితే రూ.8,500 ప్రభుత్వమే చెల్లిస్తుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియ ఇబ్బందుల్లేకుండా జరిగింది. అడ్మిషన్లు ఇవ్వం కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు లేనట్లే అనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా ఉచిత ప్రవేశాలకు ఫీజులను చెల్లించలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత విద్యా సంవత్సరం ఉచిత ప్రవేశాలు పొందిన పిల్లలను పాత ఫీజులు చెల్లిస్తేనే చేరండని లేకుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. పైగా బుక్స్, యూనిఫాం, అడ్మిషన్ తదితర ఫీజుల కింద రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత విద్యతోపాటు పుస్తకాలు, యూనిఫాం కూడా యాజమాన్యాలే ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఉచిత ప్రవేశం పొందిన విద్యార్థుల్లో సగం మందికి పైగానే ఆయా పాఠశాలల్లో లేదా ఇతర వాటిల్లో సొంత ఫీజులు చెల్లించి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల నుంచి విద్యాశాఖాధికారుల వరకూ అందరికీ తెలిసినా జిల్లాలో మంత్రి నారాయణకు చెందిన పాఠశాలలు ఎక్కువగా ఉండటంతో మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలున్నాయి. సాక్షాత్తు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.చర్యలు లేకపోవడంతో...చింతారెడ్డిపాళెం పంచాయతీ సౌత్రాజుపాళేనికి చెందిన ఎంబీటీ వినయ్కుమార్ కుమారుడు యువ యశ్వంత్కు 2024 – 25 విద్యా సంవత్సరంలో నెల్లూరులోని రామలింగాపురంలోని నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం లభించింది. అయితే సదరు యాజమాన్యం ఆ ఏడాది బుక్స్, యూనిఫాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో రూ.11 వేలు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం రెండో తరగతిలో చేరాలంటే నిబంధనలు పెట్టింది. 1వ తరగతి ఫీజు కింద రూ.13 వేలు, అలాగే రెండో తరగతికి బుక్స్, యూనిఫాంకు రూ.10 వేలు, అడ్మిషన్ ఫీజు కింద రూ.3,800 కలిపి మొత్తం రూ.26,800లు చెల్లిస్తేనే స్కూల్లో ఉంచుతామని ఖరాఖండిగా చెప్పింది. దీంతో చేసేదేమి లేక పాఠశాల ప్రారంభమైనా ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ విషయంపై యశ్వంత్ తండ్రి వినయ్కుమార్ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగుసార్లు ఫిర్యాదు చేశారు. ఇంకా మరో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు కూడా అదే నారాయణ పాఠశాల యాజమాన్యంపై వినతిపత్రం ఇచ్చారు. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించి చట్టాలను అమలు చేయాల్సిన నారాయణ వాటిని తుంగలో తొక్కి పైసా వసూళ్లే పరమావధిగా వ్యవహరించడమేమిటని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ స్కూల్స్ యాజమాన్య దారిలోనే మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టానికి తూట్లు పేరుకే ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు ఫీజులు చెల్లించకుంటే పిల్లలు రావొద్దని ఆదేశాలు సాక్షాత్తు మంత్రి నారాయణ స్కూల్లోనే ఘటన ఆ స్కూల్పై చర్యలు తీసుకునేందుకు అధికారుల వెనుకంజ స్కూల్ నిర్వాకంపై గ్రీవెన్స్లో నాలుగుసార్లు ఫిర్యాదుశిక్షకు అర్హులు విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలే గానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉచిత సీట్ల విషయంలో సుప్రీంకోర్టు, పార్లమెంట్ కూడా ఆదేశాలు జారీ చేశాయి. ఫీజు చెల్లించలేదని విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకుంటే గుర్తింపు రద్దు, జైలు శిక్షకు అర్హులని చెప్పింది. – నరహరి, రాష్ట్రాధ్యక్షుడు, ది పేరెంట్స్ అసోసియేషన్ ఇబ్బంది పెట్టడం వాస్తవమే విద్యాహక్కు చట్టం ద్వారా ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల విషయంలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెండింగ్ ఫీజుల చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాం. – బాలాజీరావు, డీఈఓ -
గిరిజన బాలికకు పరామర్శ
నెల్లూరు(అర్బన్): చిత్రహింసలకు గురై శరీరం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం కుడితిపాళేనికి చెందిన గిరిజన బాలిక చెంచమ్మను మంగళవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు పడిత్యా శంకర్నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలిచి రక్షణ కల్పించడంతోపాటు ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇస్లావత్ హనుమంతనాయక్, దుర్గానాయక్, ప్రసన్నకుమార్, యాటగిరి సునీల్, శివ పాల్గొన్నారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత
● ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ తదితర హామీలపై కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత గర్జించింది. హామీలను తుంగలో తొక్కిందంటూ యువతీ, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. గత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను ఊడగొట్టిందంటూ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. నెల్లూరు (అర్బన్)/ నెల్లూరు (స్టోన్హౌస్పేట): నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం యువత కలెక్టరేట్ వద్దకు కదలి వచ్చింది. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరుతో కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పాత జెడ్పీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వినూత్నంగా రిక్షా తొక్కుతూ యువత పడుతున్న కష్టాలపై ప్రభుత్వ తీరును ఎత్తి చూపారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కూటమి హామీలు అమలు చేయాలంటూ డీఆర్వో ఉదయభాస్కర్రావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చారని, అధికారం చేపట్టాక వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కల్పించలేదన్నారు. తనకు ఓటేస్తే వలంటీర్లకు ఇస్తున్న జీతాన్ని రూ.10 వేలకు పెంచుతానని నమ్మబలికి అధికారం రాగానే రాష్ట్రంలోని 2.50 లక్షల మంది వలంటీర్లను వీధుల పాల్జేశారన్నారు. గతంలో తమ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో వివిధ రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. మద్యం షాపులను ప్రభుత్వ పరం చేసి నిరుద్యోగ యువతకు అక్కడ అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించారన్నారు. దేశమే గర్వించే రీతిలో సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పౌర సేవలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం పురోగమన దిశ నుంచి తిరోగమనం వైపు పరుగులు తీస్తుందన్నారు. కూటమి దాష్టీకాలు చూసి పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన పరిశ్రమల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ఏడాది కాలంలో చదువుకున్న ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలేదన్నారు. పారిశ్రామిక రంగం కుప్పకూలిపోతే, ప్రధానమైన వ్యవసాయం రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు లేదన్నారు. మద్యాన్ని ఏరులై పారించడంతో శాంతిభద్రతలు పాతాళానికి దిగజారిపోయాయన్నారు. జిల్లాలోనే 100 మందికి పైగా అభాగ్య మహిళలు, చిన్నారులు అత్యాచారాలకు గురయ్యారన్నారు. అంగన్వాడీలకు, ఆశ కార్యకర్తలకు రేషన్కార్డులు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఏడాది కాలంలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబును నమ్మి నిలువునా మోసపోయామని ప్రజలు గ్రహించారన్నారు. మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారన్నారు. ● యువజన విభాగం నాయకుడు, కార్పొరేటర్ వేలూరు మహేష్ మాట్లాడుతూ అలవి గాని హామీలివ్వడం వాటిని నీరుగార్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన సీఎంగా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్ పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. ఇప్పుడు పలువురు అర్హులకు కూడా పింఛన్ కోత పెట్టేందుకు శ్రీకారం చుడుతున్నాడని విమర్శించారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ మాట్లాడుతూ ప్రశ్నించే యువతపై రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు. అయినా తమ పోరాటం ద్వారా ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయించగలిగామన్నారు. సంవత్సరానికి ఒక్కొక్క నిరుద్యోగికి నిరుద్యోగభృతి కింద రూ.36 వేలు బాకీ ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని లోకేశ్ చెప్పారని, ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. ● రాష్ట్ర యువజవన విభాగం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం, జగన్అంటేనే నమ్మకం అన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం హామీలు గురించి ప్రశ్నించే వారి గొంతుకలను కూటమి ప్రభుత్వం నొక్కుతుందన్నారు. అయినా భయపడేది లేదన్నారు. మోసపోయిన విద్యార్థులు, యువత అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక అల్లాడుతున్నారన్నారు. ● కావలి నియోజకవర్గ యువజన విభాగం నేత చైతన్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టగానే 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. 2.50 లక్షల మందికి ఉపాధి చూపారన్నారు. చంద్రబాబు రాగానే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నాడని విమర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అని చంద్రబాబు నిరూపించారన్నారు. ● వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో 140కి పైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఏడాది 5 లక్షలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే 4 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు తొలగించిందని విమర్శించారు. ● కోవూరు వైఎస్సార్సీపీ నేత వీరి చలపతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో రూ.1.40 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఆ డబ్బుతో ఒక్క చోట కూడా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2 వేల కోట్ల బకాయిలున్నాయన్నారు. యువజన, విద్యార్థి నాయకులు అన్వేష్, మల్లి, యోగి మాట్లాడారు. యువత పోరు ఉద్యమానికి తరలివచ్చిన యువతీ, యువకులకు వైఎస్సార్సీపీ మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఖలీల్ తదితరులు సంఘీ భావం తెలిపారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలెక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీత గత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఊడగొడుతోందని మండిపాటు పాత జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, ధర్నా డీఆర్వో ఉదయభాస్కర్కు వినతి పత్రం అందజేత