breaking news
SPSR Nellore
-
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి షాక్?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ రాజకీయాల్లో కొందరు ఎప్పుడూ కరివేపాకులాంటి వాళ్లేనని మరోసారి రుజువైంది. మంత్రి లోకేశ్ పర్యటనతో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ఆ పార్టీలో వీసమెత్తు పలుకుబడి లేదని విస్పష్టమైంది. పార్టీలో జిల్లా నుంచి మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతుల మాటకే ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఇకపై నియోజకవర్గంలో పార్టీ క్యాడర్కు సైతం తన ముఖం చూపించుకోలేని ఘోర పరాభవాన్ని చవిచూశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేయాలనే తృష్ణతో లోకేశ్ బుధవారం నెల్లూరు, కోవూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ఆయన్ను తన నియోజకవర్గ పరిధి నుంచి మాగుంట లేఅవుట్ రోడ్డులోని కార్యాలయం మీదుగా పర్యటనకు తొలుత రూట్ మ్యాప్ సిద్ధం చేశా రు. సుమారు 10 వేల మందితో ఘన స్వాగతం పలికి, తన పలుకుబడిని పెంచుకోవాలని నాలుగు రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సమీక్షలు, సమావేశాలు పెట్టారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం దక్కించుకోవాలని కోటంరెడ్డి కంటున్న కలలు భగ్నమే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆఖరి క్షణంలో ఝలక్ అయితే లోకేశ్ పర్యటనలో నెల్లూరు రూరల్ ఊసేలేకుండా ఆఖరి క్షణంలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నేరుగా మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే సిటీ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో.. ఆ తర్వాత కోవూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటన షెడ్యూల్ను ఖరారు చేయడంతో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిని ఉద్దేశ పూర్వకంగానే పక్కకు తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్ చర్చ జరుగుతోంది. ఇది కోటంరెడ్డికి జరిగిన ఘోర పరాభవంగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు మేయర్ స్థానం విషయమై ఇటు మంత్రి నారాయణ, అటు వేమిరెడ్డి దంపతులతో విభేదించిన శ్రీధర్రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసి అణచివేసేందుకే అనే ప్రచారం కూడా లేకపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్రెడ్డి లోకేశ్ పర్యటనలో పాల్గొంటారా? ముఖం చాటేస్తారా? అనే విషయంపై చర్చ నడుస్తోంది. బోసిపోయిన ఎమ్మెల్యే కార్యాలయం లోకేశ్ పర్యటన పర్యటన నేపథ్యంలో హడావుడి చేసిన కోటంరెడ్డి క్యాడర్ ఆఖరి క్షణంలో మార్పు చేయడంపై భగ్గుమంటుంది. నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు రచ్చరచ్చ చేయడంతో వారిని నాయకులు సముదాయించే ప్రయత్నం చేశా రు. జరిగిన అవమానం, క్యాడర్ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీధర్రెడ్డి తన కార్యాలయం నుంచి నిష్క్రమించారు. హడావుడిగా కనిపించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతంలో క్యాడర్ సైతం ముఖం చాటేయడంతో బోసిపోయింది. కోటంరెడ్డి ఇక ఒంటరేనా? రాజకీయంగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒంటరి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ అండతో ఎదిగిన కోటంరెడ్డి తన బలంగా భ్రమించారు. అడ్డగోలుగా చెలరేగిపోతున్న ఆయన్ను కట్టడి చేసిన నేపథ్యంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని దూషిస్తూ పచ్చ కండువా కప్పుకొ న్నారు. అప్పటి నుంచి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై స్థాయిని మరిచి తరచూ ప్రేలాపణలతో చెలరేగిపోయారు. తాజాగా దగా డీఎస్సీపైనా లోకేశ్ను వెనకేసుకు వస్తూ ఇష్టారీతిన మాట్లాడారు. అప్పటి వరకు కోటంరెడ్డిని అభిమానించిన ఆ పార్టీ శ్రేణులు సైతం ఈ పరిణామాలతో ఛీదరించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సైతం బెదిరించి ఇదే తన బలమంటూ.. పేట్రేగిపోతున్నారు. తాజా పరిణామాలతో కోటంరెడ్డికి అధికార పార్టీలో కనీస స్థాయి పలుకుబడి లేదని స్పష్టం కావడంతో క్యాడర్ సైతం మౌనం.. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్-1బీ వీసాల పేరుతో.. -
మళ్లీ ఒక్కటయ్యారు..
నెల్లూరు (లీగల్): కక్షిదారులు రాజీపడొస్తే లోక్అదాలత్లో సత్వర న్యాయాన్ని అందిస్తామని.. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నరసింహమూర్తి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్అదాలత్ను శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసును రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ తీర్పునకు అప్పీల్ కూడా ఉండదని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మార్చి, జూలైల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 97,968 కేసులను పరిష్కరించామని చెప్పారు. తాజాగా జరిపిన జాతీయ లోక్ అదాలత్లో 31,560 కేసులను పరిష్కరించి.. లబి్ధదారులకు రూ.9,08,45,592 మేర చెల్లించారు. నెల్లూరులో పది ప్రత్యేక బెంచ్లు నెల్లూరులోని వివిధ కోర్టుల్లో పది ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా న్యాయమూర్తులు శరత్బాబు, సుధ, శుభవాణి, జానీబాషా, శ్రీనివాస్, శారదారెడ్డి, నిషాద్ నాజ్, సులోచన రాణి, సాయిరామ్ వ్యవహరించి 9347 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పర్యవేక్షించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శరత్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.మళ్లీ ఒక్కటయ్యారు.. నెల్లూరు (లీగల్): జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా ఫ్యామిలీ కోర్టులో పెండింగ్లో ఉన్న ఒక విడాకుల కేసుపై దృష్టి సారించారు. బీటెక్ చదువుతున్న భవిత నాయుడు, వీరనాయుడు గతంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసును దాఖలు చేశారు. ఈ తరుణంలో బంధువులను పిలిపించి రాజీ కుదిర్చి న్యాయమూర్తుల సమక్షంలో దండలు మారి్పంచి ఇద్దర్నీ కలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొని.. ముత్తుకూరు(పొదలకూరు): నడిచి వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొన్న ఘటన మండలంలోని పిడతాపోలూరు క్రాస్రోడ్డు వద్ద శనివారం జరిగింది. నేలటూరుపాళెం గ్రామానికి చెందిన ఏడుకొండలు పిడతాపోలూరులో రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొని ఆయన ఎడమ చేతికి గాయమై ఎముక విరిగింది. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బైక్ అదుపుతప్పి.. వెంకటాచలం: మోటార్ బైక్ అదుపుతప్పి వ్యక్తి గాయపడిన ఘటన మండలంలోని కసుమూరులో శనివారం జరిగింది. నెల్లూరు నగరం ఆటో నగర్ ప్రాంతానికి చెందిన షఫీ పనినిమిత్తం బైక్పై కసుమూరుకు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో ఎదురుగా ఆటో అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో షఫీకి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. కాలువలోకి దూసుకెళ్లిన కారు సంగం: కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని దువ్వూరు సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నుంచి జయరామిరెడ్డి అనే వ్యక్తి ఓ పేషెంట్ను తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నారు. దువ్వూరు సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని.. మర్రిపాడు: రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను కారు ఢీకొన్న ఘటన మర్రిపాడు సబ్స్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు వైపు వంశీ, బ్రహ్మయ్య, కంటే ప్రసాద్తో పాటు ఓ చిన్నారి, మహిళ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మర్రిపాడు సబ్స్టేషన్ సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉంచిన విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కృష్ణపట్నం పోర్టులో విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్కుమార్ శనివారం కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు రైల్వేస్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత పోర్టులో మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచే వ్యూహాలపై అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్తో సమీక్షించారు. ఒక్కొక్క నౌకలో లక్ష టన్నులకు పైగా సరుకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన అదనపు మెకనైజ్డ్ బెర్త్ను పరిశీలించారు. అనంతరం మనుబోలు, కృష్ణపట్నం, నిడుగుంటపాళెం, రావూరు రైల్వేస్టేషన్లతో పాటు గూడ్స్ షెడ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పీసీఓఎంతో పాటు సీనియర్ డీఓఎం ఎ.సురేష్రెడ్డి, డీసీఎం జి.మోహనకృష్ణ పాల్గొన్నారు. -
వైన్ షాపుల లైసెన్స్లు ఏడాది పునరుద్ధరణ
● జిల్లాలో 198 దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల ● 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● 22న లైసెన్స్ల జారీ నెల్లూరు(క్రైమ్): ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీటి లైసెన్స్లను మరో ఏడాది కాలపరిమితితో పునరుద్ధరిస్తూ నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఓపెన్ కేటగిరీ కింద 183.. గీత కులాలకు రిజర్వ్ చేసిన దుకాణాలు 15 ఉన్నాయి. జల్లా గెజిట్ నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణను ఎకై ్సజ్ అధికారులు ప్రారంభించారు. దర ఖాస్తులను ఆన్లైన్లో ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు వరకు స్వీకరించనున్నారు. పునరుద్ధరణ మంజూరు ప్రక్రియను 22న పూర్తి చేసి లైసెన్స్లను జారీ చేయనున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసులునాయుడు తెలిపారు. జిల్లాలో ఇలా.. ● జిల్లాలో 198 దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఓపెన్ కేటగిరీలో నెల్లూరు నగరపాలక సంస్థలో 30, రూరల్ మండలంలో మూడు.. వెంకటాచలంలో ఆరు, మనుబోలులో మూడు, కావలి మున్సిపాల్టీలో ఆరు, రూరల్లో నాలుగు, జలదంకిలో రెండు, బోగోలులో మూడు, అల్లూరు నగర పంచాయతీలో నాలుగు, రూరల్లో రెండు, కోవూరులో ఆరు, కొడవలూరులో ఐదు, విడవలూరులో నాలుగు, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఆరు, రూరల్లో మూడు, దగదర్తిలో రెండు, సంగం, ఉదయగిరిలో మూడు చొప్పున, దుత్తలూరులో రెండు, మర్రిపాడులో నాలుగు, సీతారామపురంలో రెండు, వింజమూరులో మూడు, కలిగిరి, వరికుంటపాడులో రెండు చొప్పున, కొండాపురంలో మూడు, ఇందుకూరుపేటలో నాలుగు, తోటపల్లిగూడూరులో ఐదు, ముత్తుకూరులో ఎనిమిది, ఆత్మకూరు మున్సిపాల్టీలో నాలుగు, రూరల్లో ఒకటి, అనుసముద్రంపేట, కలువాయి, అనంతసాగరంలో రెండు చొప్పున, పొదలకూరులో ఆరు, చేజర్లలో మూడు, రాపూరు, సైదాపురంలో నాలుగు చొప్పున, గూడూరు మున్సిపాల్టీలో పది, రూరల్లో రెండు, చిల్లకూరులో ఆరు, కోట మండలంలో ఏడు దుకాణాలున్నాయి. ● గీత కులాలకు సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ, కావలి మున్సిపాల్టీ, రూరల్ మండలం, జలదంకి, దగదర్తి, సంగం, దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, ఆత్మకూరు, రూరల్, అనుమసముద్రంపేట, కలువాయి, అనంతసాగరం, గూడూరులో ఒకటి చొప్పున 15 షాపులున్నాయి. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు మద్యం దుకాణాలకు జనాభాను బట్టి వార్షిక రుసుమును నిర్ణయించారు. ఓపెన్ కేటగిరీ దుకాణాలకు సంబంధించి 50 వేల జనాభా వరకు రూ.60.5 లక్షలు.. 50 వేల నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.71.5 లక్షలు.. ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.93.5 లక్షలు.. గీత కులాలకు సంబంధించిన వాటికి రూ.30.3 లక్షలు, రూ.35.8 లక్షలు, రూ.46.8 లక్షలుగా ఖరారు చేశారు. దీనికి అదనంగా పర్మిట్ రూమ్, ఇతర నిర్దేశిత రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక లైసెన్స్ ఫీజును ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాల్లో.. పర్మిట్ రూమ్ ఫీజును ఒకేసారి లేదా మూడు సమాన వాయిదాల్లో చెల్లించొచ్చని తెలిపారు. నూతన మద్యం పాలసీని పరిశీలించి నిర్ణీత గడువులోపు దరఖాస్తులను సమర్పించాలని శ్రీనివాసులునాయుడు కోరారు. -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలి
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర నేత రూత్ గ్రేస్ పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీఓ భవన్లో శనివారం నిర్వహించిన జేఏసీ జోన్ – 4 (ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల) ప్రథమ మహాసభలో ఆమె మాట్లాడారు. పిల్లల తిండి, సెలవులు, ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం 15 ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నామని చెప్పారు. చాలీచాలని జీతాలతో బతకలేకపోతున్నామని, తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాజకీయ నేతలు, రాష్ట్ర ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ కారణంలోనే జేఏసీని ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చారని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న వారికి అనారోగ్యమొస్తే సెలవులు.. రెగ్యులర్ చేసేంతవరకు 100 శాతం గ్రాస్ జీతం.. విధినిర్వహణలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.50 వేల ఎక్స్గ్రేషియాతో పాటు కారుణ్య నియామకాన్ని కల్పించాలని, అప్పటి వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. వీరి పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను జేఏసీ రాష్ట్ర చైర్మన్ విద్యాసాగర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. అసలు కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందే చంద్రబాబు అని సీఐటీయూ జిల్లా నేత నరమాల సతీష్ ఆరోపించారు. ఏపీ ఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ, మహిళా కన్వీనర్ లక్ష్మి, వైద్య ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ శరత్బాబు, రాష్ట్ర చైర్మన్ కోటేశ్వరరావు,, రాష్ట్ర కన్వీనర్ అజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పడిగాపులు.. ప్రయాసలు
రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పర్వదినం ఇలా వరుస సెలవులు రావడంతో నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చారు. అయితే అందుకు తగినట్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వచ్చిన అరకొర బస్సుల్లో సీట్ల కోసం ఫీట్లు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సుల్లో ప్రమాదపుటంచున ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ నెల్లూరు -
ఎరువులు దొరక్క అవస్థ
వరికుంటపాడు: బత్తాయి రైతులకు గడ్డుకాలం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటకు ఆశించిన ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు లభించకపోతుండడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 వేల ఎకరాల్లో సాగు ఉమ్మడి జిల్లాలో బత్తాయి తోటలను సుమారు 12 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, సీతారామపురం మండలాల్లో 1920 ఎకరాల్లో.. వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల్లో మరో 600 ఎకరాల్లో బత్తాయి తోటలు సాగులో ఉన్నాయి. అలాగే ఇతర మండలాల్లోనూ విస్తారంగా తోటలను సాగుచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆశాజనకంగా ధరలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బత్తాయికి మంచి ధరలు లభించడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. టన్ను సుమారు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలకడంతో రైతులు లాభాలను చవిచూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరలు పతనమయ్యాయి. దళారులు సిండికేట్గా మారి ధరలను తగ్గించడం.. ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించడంపై దృష్టి సారించకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు కాని ధరలు ప్రస్తుతం బత్తాయి ధరలు భారీగా పతనమయ్యాయి. టన్ను రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. ఎకరా బత్తాయి తోట నిర్వహణకు ఏడాదికి సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు సుమారు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడులు వచ్చినా మార్కెట్లో సరైన ధరలు లభించని కారణంగా పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బత్తాయి కాయల నాణ్యత సరిగా లేకపోతే టన్ను రూ.10 వేలకే ఇవ్వాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం బత్తాయి తోటలపైన పడింది. ఆగస్టు నెల ముగుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తోటల సాగుకు జంకుతున్నారు. పాత తోటలకు అవసరమైన నీరు అందడం కష్టంగా మారిందని వాపోతున్నారు. సాధారణంగా వర్షాలు సకాలంలో కురిస్తే బత్తాయి కాయలు పక్వానికి వచ్చే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి మట్టం తగ్గడంతో తోటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. దీంతో సాగు ఖర్చులు మరింత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టన్ను రూ.15 వేలకే పరిమితం గతంలో రూ.30 వేలకుపైగా పలికిన వైనం ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు పెట్టుబడులు దిగుబడి ఐదారు టన్నులే ఆదాయం అంతంతమాత్రమే ఎరువుల కోసం మండలాలు దాటుతున్న వైనం వర్షాభావంతో తగ్గుతున్న భూగర్భ జలాలు కొత్తగా తోటలేయాలంటేనే జంకుతున్న రైతులు బత్తాయి తోటలకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు సకాలంలో లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో ఆర్బీకేల్లో అవసరమైన మేరకు ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎరువులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి నాకు రెండెకరాల బత్తాయి తోట ఉంది. సుమారు ఆరు నుంచి ఏడు టన్నుల కాయలు కోతకు వచ్చి ఉన్నాయి. ప్రస్తుతం బత్తాయి ధరలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ధరలు మాత్రం ఉండక నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి బత్తాయికి గిట్టుబాటు ధర కల్పిస్తేనే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. – నూతలపాటి మాల్యాద్రి, వేంపాడు, వరికుంటపాడు మండలం గిట్టుబాటు ధరలు కల్పించాలి నాకు 12 ఎకరాల బత్తాయి తోట ఉంది. సుమారు 40 నుంచి 50 టన్నుల కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టన్ను కాయల ధర రూ.15 వేలు మాత్రమే ఉంది. ఈ ధరతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. – జక్కం శ్రీనివాసులురెడ్డి, తూర్పుకొండారెడ్డిపల్లి, వరికుంటపాడు మండలం -
ఉత్సాహంగా ఆర్చరీ జిల్లా జట్ల ఎంపికలు
గూడూరు: గూడూరు బైపాస్ సమీపంలోని ఎస్ఎస్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం సీనియర్, జూనియర్ విభాగాల జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పావురాల వేణు ఆధ్వర్యంలో అకాడమీ వ్యవస్థాపకుడు టి.శివశంకర్, టెక్నికల్ కమిటీ సభ్యుడు విజయ్ భరద్వాజ్ పర్యవేక్షణలో పోటీలు సాగాయి. ఈ సందర్భంగా కోచ్లు మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులకు సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు విజయనగరంలో జూనియర్ విభాగం, అక్టోబర్ 4 నుంచి 7 వరకు భీమవరంలో సీనియర్ విభాగం పోటీలు జరుగుతాయని తెలిపారు. -
అడవిలో తప్పిపోయి.. ఆహారం, నీరు దొరక్క
రాపూరు: అడవిలో తప్పిపోయి.. ఆహారం, నీరు దొరక్క ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని తెగచర్ల గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తెగచర్లకు చెందిన వీరపురెడ్డి నారాయణరెడ్డి (43) ఈనెల 8వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని తండ్రి లక్ష్మీనరసారెడ్డి ఫిర్యాదు చేయడంతో 10వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నారాయణరెడ్డికి మతిస్థిమితం సరిగా లేనందున తోటలో నుంచి ఇంటికి వచ్చే క్రమంలో దారి తప్పి అడవిలోకి వెళ్లి ఆహారం, నీరులేక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ హీటర్ తీసే క్రమంలో.. ● విద్యుత్షాక్తో వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): బకెట్లోని వాటర్ హీటర్ రాడ్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కొండాయపాళెంలోని కావేరి అవెన్యూలో సునీల్రెడ్డి(43), రీనా ప్రియదర్శిని దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో వెహికల్ ఇన్చార్జిగా, భార్య మరో స్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. రీనా ప్రియదర్శిని శనివారం స్కూల్కు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటి బెడ్రూమ్ కిటికీలో నుంచి పొగలు వస్తున్నాయని ఇంటి ఓనర్ ఆమెకు ఫోన్చేసి చెప్పారు. ఆ సమయంలో తన భర్త భోజనానికి వచ్చి ఉంటారని భావించిన ఆమె ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో ఆమె బంధువులకు, స్కూల్లో పనిచేసే సిబ్బందికి తెలియజేశారు. స్కూల్ సిబ్బంది ఇంటివద్దకు చేరుకుని విద్యుత్వైర్లు కట్చేసి, తలుపు స్క్రూలను తొలగించి లోనికి వెళ్లిచూడగా బెడ్రూమ్లోని మంచం వద్ద సునీల్రెడ్డి కాలిన గాయాలతో మృతిచెంది కనిపించారు. అక్కడి స్విచ్బోర్డు, బకెట్, దిండ్లు, సామగ్రి కాలిపోయి ఉన్నాయి. స్విచ్ బోర్డుకున్న వాటర్హీటర్ రాడ్ కొంతమేర కాలిపోయి, బకెట్ పూర్తిగా కరిగిపోయి బొగ్గు అయి ఉంది. స్నానం చేసేందుకు వేడినీటి కోసం బకెట్లో ఉంచిన వాటర్హీటర్ రాడ్ తీసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్తో తన భర్త మృతిచెందినట్లు భార్య వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నమ్మకంగా ఉంటూ దోచేసింది
● 40 లక్షలకుపైగా నగదు, బంగారంతో ఉడాయించిన మహిళ కొడవలూరు: ఓ మహిళ పదేళ్ల పాటు గ్రామస్తులతో నమ్మకంగా ఉంటూ డబ్బులివ్వడం, తీసుకోవడం చేసేది. ఇలా గ్రామస్తుల వద్ద రూ.40 లక్షలకు పైగా నగదు, బంగారం దండుకుని ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన కొత్తవంగల్లులో శనివారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. సునీత అనే మహిళ పదేళ్ల క్రితం తన కుమారుడు, కుమార్తెతో కొత్తవంగల్లు గ్రామానికి వచ్చి వేముల నారబాబు ఇంట్లో అద్దెకు దిగారు. భర్తతో విభేదాలున్నందున ఇద్దరు పిల్లలతో వచ్చేసినట్లు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఇలా ఆ ఇంటినే కొనుగోలు చేస్తానని చెప్పి ఆయనకు చెక్కులిచ్చి ఇంటిని రాయించుకున్నారు. ఆ కాగితాలను తనఖా పెట్టి రూ.4.10 లక్షల బ్యాంక్ నుంచి రుణం తీసుకుందని బాధితుడు తెలిపారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ఆడిగోవుల రమణయ్య వద్ద 13 సవర్ల బంగారం, రూ.3.50 లక్షల నగదు, మైపాటి ప్రభావతి వద్ద 12 సవర్ల బంగారం, లక్ష నగదు, చిరంజీవమ్మ వద్ద మూడు సవర్ల బంగారం, 25 వేల నగదు, నూర్జహాన్ వద్ద రూ.4.50 లక్షల నగదు, అనూరాధ వద్ద రూ.30 వేలు, రమణమ్మ రూ.10 వేల నగదు వంతున తీసుకున్నట్లు బాధితులు వాపోయారు. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణంతో కలుపుకుంటే రూ.13 లక్షలకు పైగా నగదు, 31 లక్షల విలువైన బంగారంతో ఉడాయించినట్లు ఆవేదన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు
● డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం చిట్టమూరు: ఆర్టీసీ బస్సు ఇంజిన్లో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వివరాలు.. నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి మండలంలోని మల్లానికి బస్సు శనివారం బయల్దేరింది. చిట్టమూరు మండలం సరిహద్దు ప్రాంతానికి వచ్చేసరికి ఇంజిన్లో పొగలు, మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించారు. దీంతో పక్కకు నిలిపేసి ప్రయాణికులను అప్రమత్తం చేసి బయటకు దింపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో మల్లానికి తరలించారు. 74 మందికి ఉద్యోగావకాశాలు నెల్లూరు రూరల్: కౌశల్ పోర్టల్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు గానూ నిర్వహించిన ఎంపికల్లో 74 మంది అర్హత సాధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ఎంపికలకు 114 మంది హాజరయ్యారు. వీరిలో ఎంపికై న 74 మందికి నియామక పత్రాలను అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థల ద్వారా ఎంపికలను నిర్వహించి ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని స్వర్ణ గ్రామం.. స్వర్ణ వార్డు జిల్లా అధికారి వసుమతి తెలిపారు. జిల్లా సమన్వయకర్త హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లిలో 741 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో శనివారం 741 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 799 బేళ్లు రాగా, 741 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.110, సగటున రూ.178.68 ధర పలికిందని వివరించారు. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. హెచ్ఎంకు మెమో జారీ మనుబోలు: స్థానిక జెడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పాడైపోయిన చిక్కీలిచ్చిన ఘటనపై ప్రధానోపాధ్యాయుడు నరేంద్రనాఽథ్చౌదరికి మెమోను డీఈఓ బాలాజీరావు శనివారం జారీ చేశారు. ఘటనపై వివరణివ్వాలని ఆదేశించారు. బాలికోన్నత పాఠశాలలో తనిఖీలను గూడూరు డిప్యూటీ డీఈఓ సనత్కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా కాలపరిమితి పూర్తయిన చిక్కీలను విద్యార్థులకు ఇస్తున్నారనే అంశాన్ని గుర్తించారు. ఈ తరుణంలో హెచ్ఎంపై చర్యలకు ఉపక్రమించారు. ఎగసిపడుతున్న అలలు వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మండలంలోని తూపిలిపాళెం తీరంలో అలలు ఉవ్వెత్తున శనివారం ఎగసిపడ్డాయి. బలమైన ఈదురుగాలులతో భారీ అలలు తీరంవైపు దూసుకొస్తుండటంతో మత్స్యకార గ్రామాల్లో భయాందోళన నెలకొంది. సాధారణ స్థాయికంటే సుమారు 30 నుంచి 40 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చిందని స్థానికులు చెప్పారు. అల్పపీడనం కారణంగా తీరప్రాంతంలో గాలుల తీవ్రత పెరగడంతో వేటకెళ్లేందుకు మత్స్యకారులు వెనుకడుగేస్తున్నారు. -
సీసీబీతో రోగులకు అత్యవసర వైద్యం
నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రిలో రోగులకు అత్యవసర వైద్యసేవలందించేందుకు రూ.23.75 కోట్ల అంచనాలతో క్రిటికల్ కేర్ బ్లాక్ను(సీసీబీ) ప్రారంభించారని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాకుల ప్రారంభోత్సవాన్ని విజయవాడలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ శనివారం వర్చువల్గా జరిపారు. నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో జేసీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, అర్ధరాత్రుల్లో జరిగే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు సమగ్ర క్రిటికల్ కేర్ వైద్యసేవలు అందించేందుకు ఈ బ్లాక్ ఉపయోగపడుతుందన్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డిలు మాట్లాడుతూ ఈ బ్లాకు వల్ల మరో 50 పడకలు అదనంగా ఆస్పత్రిలో చేరాయన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, సభ్యులు మొగరాల సురేష్, బ్రహ్మారెడ్డి, మల్లికార్జున, అబిదా, నేత్ర విభాగం హెచ్ఓడీ వసంతకుమారి, గైనకాలజీ హెచ్ఓడీ గీతాలక్ష్మి, క్యాజువాలిటీ(ఎమెర్జెన్సీ) హెచ్ఓడీ కిరణ్లతో పాటు పలువురు మెడికల్ ఆఫీసర్లు, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తాం
● నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం ● అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణలు పనిచేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాన్ని ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాకాణి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. బూటకపు హామీలతో అధికారంలోకి రావడం.. అనంతరం వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, దీనిపై తమ పార్టీ అధినేత ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. తప్పును అధికారులపై నెట్టేసే యత్నాలను చంద్రబాబు, లోకేశ్ ప్రారంభించారని చెప్పారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం మినహా ప్రజలకు ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. కార్యకర్తలకు అండగా ఉంటాం పార్టీ శ్రేణులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నెల్లూరు సిటీ పరిధిలోని 36 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సమష్టిగా పనిచేయాలని కోరారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యముంటుందని చెప్పారు. నెల్లూరు ప్రజలకు సేవ చేసిన నేత పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. అందర్నీ కలుపుకొని పనిచేద్దాం పార్టీలో నువ్వు.. నేననే భావనకు తావులేదని, అందరం జగనన్న సైనికులమేనని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. టీడీపీలో భయం మొదలైందని తెలిపారు. పాలనను మంత్రి నారాయణ గాలికొదిలి దోచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కొన్ని సిద్ధాంతాలతో పనిచేయాలని, కార్యకర్తల్లో ఒకడిగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. భేదాభిప్రాయాలను పక్కనబెట్టాలని పిలుపునిచ్చారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రజలతో కలిసి తాము పోరాడుతున్నామంటే అది జగనన్న ఇచ్చిన ధైర్యమేనన్నారు. ఐడీ కార్డుల పంపిణీ పార్టీ నేతలకు ఐడీ కార్డులను కాకాణి, పర్వతరెడ్డి అందజేశారు. మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీ ఖలీల్ అహ్మద్, నెల్లూరు నగర, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, పేర్నేటి కోటేశ్వర్రెడ్డి, నగర నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, కార్పొరేటర్లు శ్రీకాంత్రెడ్డి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితులే కడతేర్చారు
● యువకుడి దారుణ హత్య నెల్లూరు సిటీ: స్నేహితుల మధ్య చెలరేగిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని అశోక్నగర్ లండన్ లేఅవుట్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ మండలం దొరతోపు కాలనీలో చెన్నయ్య, బుజ్జమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు ప్రేమ్చంద్(24) ఐటీఐ చదవి ప్రస్తుతం చైన్నెలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. ఆయనకు దినేష్, జీషాన్లు స్నేహితులు. చందు నెల్లూరుకు వచ్చిన సమయంలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ సరదాగా గడిపేవారు. ఈనెల 10వ తేదీన చందు నెల్లూరుకు వచ్చారు. ఈ క్రమంలో జీషాన్తో ఆయనకు గొడవ జరిగింది. దీంతో దినేష్, జీషాన్, మరో వ్యక్తి హేమంత్లు ఒక్కటై ఎలాగైనా చందును కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరందరూ అశోక్నగర్లో మద్యం సేవించే సమయంలో మాటామాటా పెరిగింది. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో వారు చందును విచక్షణారహితంగా పొడిచి హత్యచేసి పరారయ్యారు. శనివారం తెల్లవారుజామున స్థానికులు మృతదేహాన్ని గమనించి నెల్లూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో పాటు నెల్లూరు రూరల్, కోవూరు, నవాబుపేట ఇన్స్పెక్టర్లు వెంకటరెడ్డి, సుధాకర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సెల్ఫోన్, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్టీమ్, డాగ్స్క్వాడ్ ఆధారాలు సేకరించింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే హత్యకు గంట ముందు నిందితులు స్థానికులతో గొడవకు దిగినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు బైక్పై వెళ్తూ వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు అతన్ని ప్రశ్నించగా గొడవ జరిగినట్లు తెలిసింది. -
లోక్అదాలత్తో సత్వర న్యాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి నెల్లూరు (లీగల్): కక్షిదారులు రాజీపడొస్తే లోక్అదాలత్లో సత్వర న్యాయాన్ని అందిస్తామని.. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నరసింహమూర్తి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్అదాలత్ను శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసును రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ తీర్పునకు అప్పీల్ కూడా ఉండదని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మార్చి, జూలైల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 97,968 కేసులను పరిష్కరించామని చెప్పారు. తాజాగా జరిపిన జాతీయ లోక్ అదాలత్లో 31,560 కేసులను పరిష్కరించి.. లబ్ధిదారులకు రూ.9,08,45,592 మేర చెల్లించారు. నెల్లూరులో పది ప్రత్యేక బెంచ్లు నెల్లూరులోని వివిధ కోర్టుల్లో పది ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారులుగా న్యాయమూర్తులు శరత్బాబు, సుధ, శుభవాణి, జానీబాషా, శ్రీనివాస్, శారదారెడ్డి, నిషాద్ నాజ్, సులోచన రాణి, సాయిరామ్ వ్యవహరించి 9347 కేసులను పరిష్కరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పర్యవేక్షించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శరత్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటు పార్టీ అంటేనే క్రెడిట్ చోరీ: కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పార్టీ క్రెడిట్ చోరీకి పాల్పడిందని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన మంచి పనులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు సర్వహక్కులు కల్పించేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. పేదవాడికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు 13 మంది ST, SC ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కమిటీ వేశారు. చుక్కల భూముల సమస్యను చంద్రబాబు పరిష్కరించలేక పోయారు. కాన్నీ, మేము దానికి శాశ్వత పరిష్కారం చూపాము. నిషేధిత జాబితా నుంచి అడ్డంకులు లేని భూములను తొలగించాం. మేము తీసుకొచ్చిన విధానంతో రైతులకు మేలు జరిగింది. వైఎస్ జగన్కి మంచి పేరు రాకూడదనే రీ వేరిఫికేషన్ పేరుతో 27 నెలలు కాలయాపన చేశారు అని మండిపడ్డారు. ఇదీ చదవండి: ఆ ఆటలేంటి చంద్రబాబు?: వైఎస్ జగన్ సీరియస్ -
ధరల నియంత్రణలో కేంద్రం విఫలం
● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నెల్లూరురూరల్: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. శుక్రవారం నెల్లూరు ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీ లిమిటేషన్ జరిగితే దేశం ఆరు ముక్కలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉత్తర భారతదేశానికి 500 లోక్సభ స్థానాలు, దక్షిణ భారతదేశానికి 300 లోపు స్థానాలు కేటాయించేలా డీ లిమిటేషన్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజ్యాంగంపై అవగాహన లేదని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కొరవడిందన్నారు. కార్పొరేట్లకు మాత్రం స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉందని విమర్శించారు. ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ, పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని కోరారు. -
ఆరోపణలకు ఆధారాలతోనే సమాధానం
● వేమిరెడ్డి కుటుంబంపై ధ్వజమెత్తిన అనిల్ నెల్లూరు రూరల్: తనపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలకు ఆధారాలతోనే సమాధానం చెప్తున్నానని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. మహిళలను అగౌరవపర్చేలా తానెన్నడూ మాట్లాడలేదని చెప్పారు. ప్రశాంతమ్మను తాను రాజమాత అని సంబోధించానని, అది తప్పుగా అనిపిస్తే పెద్దమ్మ అని పిలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వ్యాపార వ్యవహారాలపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. లక్ష్మీ క్వార్ట్జ్ కంపెనీ ద్వారా పలువురికి నష్టం జరిగిందని ఆరోపించారు. అనంతరం ఫినీ క్వార్ట్జ్ పేరుతో ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేసి, అందులో డైరెక్టర్లుగా వేమిరెడ్డి అనుచరులున్నారని పేర్కొన్నారు. డౌ కంపెనీకి లేఖ ఇచ్చిన వ్యవహారంపై ప్రశ్నించానని.. రమణకుమార్ ఎవరికి సంబంధించిన వ్యక్తో చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారానికి నిదర్శనం 2014లో అబ్దుల్ అజీజ్ను మేయర్ చేసే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో తాము కలిసి లేమని తెలిపారు. గోవాలో క్యాంపు పెట్టి టీడీపీ నేతలతో కలిసి జంపయ్యేందుకు యత్నించిన సమయంలో తాము శ్రీధర్రెడ్డితో కలిసి లాబీలో రాత్రంతా కూర్చున్నామని చెప్పారు. మైనార్టీలకు తమ అధినేత ఇచ్చిన హామీని నిలబెట్టేందుకే యత్నించామని వివరించారు. అజీజ్కు ఎవరైనా సాయం చేసి ఉంటే దాన్ని గౌరవంగా చెప్పొచ్చే గానీ, దానం చేశామనడం ద్వారా ఒక మైనార్టీని అవమానించారని విమర్శించారు. ఇది డబ్బు అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. 2018లో తనకు ఎంపీ టికెట్ను ఇప్పించాలని వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగారని గుర్తుచేశారు. 2019లో తనకు ఆర్థిక సాయం చేసింది జగన్మోహన్రెడ్డేనని, ఆదాల ప్రభాకర్రెడ్డి సైతం తనను ఇంటికి పిలిచి సాయం చేశారని గుర్తుచేశారు. తన జీవితంలో ఎవరి కాళ్లకు మొక్కలేదని.. తాను వేమిరెడ్డి దంపతులను శివపార్వతులు అన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. ఇస్కాన్ సిటీలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన స్థలం తమ కుటుంబానికి చెందిందేనని, దీనికి గానూ బ్యాంక్ ద్వారా నగదు సాయాన్ని తమ తాత చేశారని పేర్కొన్నారు. ఇస్కాన్ సిటీలోని స్థలాన్ని వేమిరెడ్డి కుటుంబసభ్యుల వద్ద తన తండ్రి కొనుగోలు చేశారని తెలిపారు. దొంతాలిలో తమ కుటుంబానికి చాలా కాలంగా వ్యవసాయ భూములున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపించానని చెప్పడం సరికాదని హితవు పలికారు. చైనాకు వెళ్లాననే ఆరోపణలు అబద్ధం తాను చైనా వెళ్లానంటూ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు. తన పాస్పోర్టును చూపిస్తూ.. తాను ఒక్కసారైనా అక్కడికెళ్లానని నిరూపిస్తే కాళ్లకు మొక్కుతానని చెప్పారు. తనపై చూపించిన 70 మంది జాబితా తాము విధించిన జరిమానాలకు సంబంధించిందని, కమీషన్ల వ్యవహారంతో ముడిపెట్టడం సరికాదన్నారు. జాబితాలో బద్రి పేరుందని, అతడ్ని అడిగితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. తనపై కేసులు పెట్టి ఆస్తులను జప్తు చేస్తారని చేస్తున్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని వివరించారు. 2029లో ఎక్కడ్నుంచైనా పోటీ చేస్తానని, వీలైతే అక్కడ నోట్ల కట్టలతో తనతో పోటీ పడాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. యువగళం పాదయాత్ర సమయంలోనే వేమిరెడ్డి టచ్లో ఉన్నారంటూ లోకేశ్ స్వయంగా చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు. మైనార్టీలంటే తనకు గౌరవమని, వారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యక్తిని కాదన్నారు. శాంతినికేతన్ విల్లా ల వ్యవహారంలో కొందరికి అడ్వాన్స్ డబ్బులింకా ఇవ్వాల్సి ఉందని, త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కోటారెడ్డి తనకు సాయం చేసిన మాట వాస్తవమేనని, దాన్ని తానెప్పుడూ ఖండించలేదని పేర్కొన్నారు. దెయ్యాలకే వేదా లు చెప్పే టాలెంట్ శ్రీధర్రెడ్డికి ఉందని విమర్శించారు. ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు కామాక్షీదేవి, నాగార్జున, శ్రీకాంత్రెడ్డి, రాఘవరావు, జయలక్ష్మి, నేతలు మీరామొహిద్దీన్, అబ్దుల్ మస్తాన్, శ్రీధ ర్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కుతంత్రాలకు భయపడేది లేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● కావలిలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం కావలి: కుట్రలు, కుతంత్రాలు చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని, వీటికి తాము భయపడే ప్రసక్తేలేదని.. మొక్కవోని దీక్షతో ముందుకెళ్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆరెస్సార్ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కావలి నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీనికి గానూ పటిష్టమైన ప్రణాళిక, పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించాల్సి ఉందని వివరించారు. సమరంలో ప్రత్యర్థుల్ని ఓడించి.. తమ పార్టీ విజేతలను అధినేత జగన్మోహన్రెడ్డి ముందు సగర్వంగా నిలబెట్టాలని కాంక్షించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి.. తన వారికి మేలు చేస్తున్న సీఎం చంద్రబాబు మోసపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బూటకపు వాగ్దానాలతో అందలమెక్కడం.. ఆ తర్వాత విస్మరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీ పేరుతో దగాకు పాల్పడి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. అక్రమాలను ఆధారాలతో సహా తమ పార్టీ అధినేత నిరూపిస్తే, ఏమి చేయాలో చంద్రబాబు, లోకేశ్కు పాలుపోవడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువుఛాయలు కమ్ముకొని.. రైతులు కన్నీరు పెడుతుంటే వారిని ఆదుకునేందుకు సైతం సర్కార్ ఎలాంటి చర్యలను చేపట్టడంలేదని చెప్పారు. చంద్రబాబుకు మించిన షోలతో ప్రజలను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక రోడ్డును నిర్మించానంటూ, దాని చుట్టే తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరి సంగతిని ప్రజలు తేల్చనున్నారన్నారు. పార్టీ కావలి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కానుందని వివరించారు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు తన అనుచరులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నాటకాలాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ శ్రేణలను బెదిరించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం రానున్న శాసనసభ ఎలక్షన్లలో గెలుపునకు తొలి మెట్టు అని చెప్పారు. ఏకగ్రీవాలకు తావివ్వొద్దని కోరారు. జగనన్న, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పింఛన్ల పేరుతో కొత్త నాటకం స్థానిక పోరు సమీపిస్తున్న తరుణంలో పింఛన్ల పేరుతో కొత్త నాటకానికి చంద్రబాబు తెరలేపారని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. బీసీ, ఎస్సీలకు 50 ఏళ్లకే పింఛన్లను ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు, దాన్ని విస్మరించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇస్తామంటూ.. ఎన్నికల కోడ్ కారణంగా అందించలేకపోయామంటూ తప్పించుకునేందుకు యత్నిస్తారని విమర్శించారు. ఐడీ కార్డుల అందజేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఐడీ కార్డులను కాకాణి గోవర్ధన్రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తదితరులు అందజేశారు. తొలుత సమావేశానికి విచ్చేసిన వీరికి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్, విజయ డెయిరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ స్థాయిలో చురుగ్గా కార్యక్రమాలు
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు బాధ్యతతో పనిచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సూచించారు. పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నెల్లూరులో జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు, మండలాల క న్వీనర్లు షేక్ షాహుల్, చెర్లో సతీష్రెడ్డి, కాటంరెడ్డి నవీన్రెడ్డి, చిమటా శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన
నెల్లూరు(అర్బన్): వైద్యారోగ్య శాఖలో దశాబ్దాల తరబడి పనిచేస్తున్న తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు శుక్రవారం నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి ఐపీ భవనం ఎదుట నల్లదుస్తులు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్గ్రేస్, చైర్మన్ శరత్బాబు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనలు విరమించేది లేదన్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో నిరసనలు చేపట్టి తమ బాధలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి త్వరితగతిన తమతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వేణు, శేషగిరి, లక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థులకు పాడైపోయిన చిక్కీలు
మనుబోలు: ‘విద్యార్థులకు పాడైపోయిన చిక్కీలు ఎందుకిస్తున్నారు?.. వీటిని తింటే వారి ఆరోగ్యం ఏమి కావాలి’ అంటూ టాస్క్ఫోర్స్ అధికారి గూడూరు డిప్యూటీ డీఈఓ సనత్కుమార్ బాలికల హైస్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను శుక్రవారం టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. చిక్కీలు ఈ ఏడాది జూలైతో కాలపరిమితి తీరిపోయినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యంపై మీకు అంత చిన్న చూపా అంటూ ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గడువు తేదీ దాటిపోయిన చిక్కీలు తిని విద్యార్థులు అనారోగ్యం పాలైతే ఎవరిది బాధ్యతని నిలదీశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు. -
గత ప్రభుత్వంలో సాఫీగా..
పొదలకూరు: యాభై ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులు కొత్త పింఛన్ల కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే సర్కార్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు వీరి పాలిట కష్టంగా మారుతున్నాయి. వాస్తవానికి జిల్లాలో నూతన పెన్షన్ల కోసం సుమారు వెయ్యి మంది వరకు నిరీక్షిస్తున్నారని అంచనా. మరోవైపు వీటిని పొందుతున్న వారు దాదాపు 3500 మంది ఉన్నారు. అయితే దరఖాస్తు దాఖలులో కొర్రీలను విధించారు. ఇవేమి నిబంధనలో..? ● నేత పనిలో కనీసం 15 దినాలు పాల్గొని ఉండాలని.. మాస్టర్ వీవర్ వద్ద వర్కును ప్రారంభించిన తేదీని తెలియజేయాలని.. గత రెండేళ్లలో ఆన్లైన్లో వేతనాలు బదిలీ అయ్యాయని చూపాలని.. దీనికి సంబంధించి మాస్టర్ వీవర్ హామీ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుందని ప్రకటించారు. ● స్వతంత్రంగా పనిచేస్తున్న కార్మికులు మగ్గం తేదీని తెలియజేయాలి. రెండేళ్లుగా వీవర్.. లేదా జీఎస్టీ నంబర్ ఉన్న వ్యాపారి నుంచి నూలును కొనుగోలు చేసినట్లు చూపాలి. కొనుగోలు లేదా జీఎస్టీ నంబర్ ఉన్న బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది. ● వీవర్ నెలకు రూ.నాలుగు వేల విలువైన ఒక బండిల్ పత్తి నూలును కొనుగోలు చేసి ఉండాలి. సుమారు రూ.పది వేల విలువైన పట్టు నూలును వినియోగించి ఉండాలి. ● ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘం, మాస్టర్ వీవర్ వద్ద, స్వతంత్రంగా పనిచేసే వారు మూడు కేటగిరీలకు సంబంధించిన పత్రాలను అనుమతి పునరుద్ధరణ కోసం జిల్లా హ్యాండ్లూమ్ ఆఫీసర్ సిఫార్సు చేయాలి. ఈ రూల్స్ మేరకు చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. వినతిపత్రమిచ్చినా ప్రయోజనమేదీ..? పింఛన్లు ఎగ్గొట్టేందుకే ఇలాంటి రూల్స్ను తెరపైకి తీసుకొచ్చారని చేనేత సంఘ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మంగళగిరిలో చేనేత, వస్త్ర కమిషనర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. వీటిని సడలిస్తామని హామీ ఇచ్చినా, దీనికి సంబంధించిన ఉత్తర్వులను నేటికీ ఇవ్వలేదని పేర్కొంటున్నారు. అలివి కాని నిబంధనలతో చేనేతల అగచాట్లు 50 ఏళ్లు దాటిన అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులు మజూరీ, జీఎస్టీ, నూలు కొనుగోలు బిల్లులు సమర్పించాలంట..! గతంలో సులభంగా మంజూరు ఎగ్గొట్టేందుకే సరికొత్త రూల్స్ తెచ్చారంటున్న నేతలు చేనేతలకు నూతనంగా పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించినా, సర్కార్ విధించిన అలివికాని నిబంధనలు వీరి పాలిట గుదిబండలా మారుతున్నాయి. 50 ఏళ్లు నిండిన అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి, సరికొత్త రూల్స్ను తెరపైకి తెచ్చి వీరిని ఇక్కట్లకు సర్కార్ గురిచేస్తోంది. గతంలో మగ్గం ఉంటే మంజూరు చేసేవారు. అయితే తాజాగా మజూరీ, జీఎస్టీ, నూలు కొనుగోలు బిల్లులను సమర్పించాలంటూ కొర్రీలు పెట్టారు. ఈ పరిణామాల క్రమంలో ఏమి చేయాలో పాలుపోక వీరు అయోమయానికి గురవుతున్నారు. పేరుకు ఇస్తామంటున్నా, ఎగ్గొట్టేందుకే ఇలాంటి వాటిని అమలు చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. చేనేత కార్మికులకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ఆయన సజీవంగా ఉన్నంత వరకు ఇది సక్రమంగా అమలైంది. తదనంతరం వచ్చిన పాలకులు దీన్ని తూతూమంత్రంగా అమలు చేసే అనేక మంది అర్హులకు ఆవేదనను మిగిల్చారు. ఈ తరుణంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేశారు. దీని ద్వారా మగ్గం నేసే కార్మికులకు పింఛన్లు వచ్చేవి. దీనికి గానూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వలంటీర్లకు దరఖాస్తులను సమర్పిస్తే సరిపోయేవి. ఆపై మరుసటి నెల నుంచే ఇవి లభించేవి. అయితే తాజాగా సచివాలయాల్లో ఈ నెల ఏడు నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. -
కంటైనర్ ఢీకొని ఇటుకల ట్రాక్టర్ బోల్తా
● నలుగురికి గాయాలు ● జీజీహెచ్కు వెళ్తే రోగికి అడ్మిషన్ నిరాకరణనెల్లూరు(క్రైమ్): మితిమీరిన వేగంతో వచ్చిన కంటైనర్ ముందు వెళ్తున్న ఇటుకల ట్రాక్టర్ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తితోపాటు ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలానికి చెందిన వెంకటరమణమ్మ, విడవలూరు మండలానికి చెందిన రాజేష్, ఈదగాలికి చెందిన శ్యామ్, సౌత్రాజుపాళేనికి చెందిన గురవయ్య చింతారెడ్డిపాళెంలోని ఓ ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. సోమవారం వారు ట్రాక్టర్లో ఇటుకల లోడ్తో జాతీయ రహదారి మీదుగా గొలగమూడికి బయలుదేరారు. కావలి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన కంటైనర్ ట్రాక్టర్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గురవయ్యతోపాటు వెంకటరమణమ్మ, రాజేష్, శ్యామ్కు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై వెంకటరమణమ్మ సౌత్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి సాంకేతిక ఆధారాల ద్వారా ప్రమాదానికి కారణమైన కంటైనర్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుట్లు వేశాం.. అడ్మిషన్ చేయం నెల్లూరు(అర్బన్): పెద్దాస్పత్రికి వెళ్తే అరకొర వైద్యం మాత్రమే అందుతోంది. అందుకు ఉదాహరణగా సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి విషయంలో ఓ డాక్టర్ మాట్లాడిన మాటలు. రోడ్డు ప్రమాద బాధితులను జీజీహెచ్కు తరలించగా వారిలో ఇద్దరిని అడ్మిట్ చేసుకున్నారు. రాజేష్ తలకు గాయమైతే కుట్లు వేసి ఇంటికి వెళ్లి ఐదురోజుల తర్వాత రమ్మన్నారు. అతడి పాదాలకు కూడా గాయాలైతే శుభ్రం కూడా చేయలేదు. కనీసం ఆయింట్మెంట్ కూడా పూయలేదు. మట్టితో కూడిన గాయాలు అలాగే ఉన్నాయి. రోగి బంధువులు అడ్మిషన్ చేసుకోమని అక్కడి డాక్టర్ను అడిగారు. పది కుట్లు వేసిన వారిని కూడా ఇంటికి పంపిస్తున్నాం. అందరికీ అడ్మిషన్ ఇస్తే ఆస్పత్రి నిండిపోతుంది. ఈ రోగికి అడ్మిషన్ అవసరం లేదని సమాధానమిచ్చారు. అతను నడవలేడు. వేరే ఆస్పత్రికి తీసుకెళ్తాం. అప్పటి వరకై నా బెడ్ ఇవ్వాలని బంధువులు కోరితే ఇక్కడ ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో ఆ పేషెంట్ నడవలేక నేలపై పడుకుని లేవలేకపోయాడు. ఆ పరిస్థితి చూసిన వారు అయ్యో పాపం అన్నారు. కానీ డాక్టర్లకు మాత్రం ఉన్న కాసేపైనా బెడ్ ఇద్దామనే ఆలోచన లేదు. తర్వాత కొంతసేపటికి కుటుంబీకులు అతడిని నారాయణ ఆస్పత్రికి తరలించారు. -
అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. భూ ఆక్రమణలు
● యథేచ్ఛగా పశువుల మేత పోరంబోకు కబ్జా ● ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు వరికుంటపాడు: మండలంలోని డక్కునూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొందరు అధికార పార్టీ నాయకులు, భూ ఆక్రమణదారులు పాగా వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పశువుల మేతకు ఉపయోగపడే పోరంబోకు భూములను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డక్కునూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 240లో సుమారు మూడెకరాల భూమిలో ముళ్లచెట్లను యంత్రాలతో తొలగించి, భూమిని చదును చేసి బోరు వేశారు. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని వారు పేర్కొంటున్నారు. ఆదివారం కూడా జేసీబీతో సదరు భూమిలో చదును పనులు చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, మండలంలోని పలు ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారిపై ఆక్రమణల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణకు డిమాండ్ డక్కునూరు సర్వే నంబర్ 240లోని భూమిపై రెవెన్యూ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే భూమిని స్వాధీనం చేసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా పశువుల మేత పోరంబోకు భూమిలో ఎలాంటి లేఅవుట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
గంపెడాశతో వచ్చి.. అర్జీలిచ్చి..
● కలెక్టర్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన ఉన్నతాధికారులు ● పెన్షన్, ఆర్థిక సాయం కోసం వినతినెల్లూరురూరల్: ‘వారంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎన్నో ఆశలతో అధికారులకు వినతిపత్రాలు అందించి పరిష్కరించాలని వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ వినతులు స్వీకరించారు. వెలిగొండ జలాల కోసం.. ఉదయగిరి నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు వెలిగొండ జలాలను అందించాలని బీజేపీ నేత మిడతల రమేష్ కోరారు. జిల్లాలోని 8 మండలాల పరిధిలో సుమారు 120 గ్రామాల ప్రజలు తాగు, సాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. భూగర్భ జలాల్లో భార లోహాలు కలవడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఈ కారణంగా కిడ్నీ వ్యాధులతో ఇప్పటివరకు సుమారు 1,500 మంది మృతి చెందగా, మరో 155 మంది డయాలసిస్ చికిత్స పొందుతున్నారన్నారు. వెలిగొండ జలాలను పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కు తరలించి, అక్కడి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగు, సాగునీరు అందించాలని రమేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐనకోట రఘురామయ్య, సునీల్రెడ్డి, టి. శ్రీనివాసులు, అల్లూరి నాగేంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు. గుడి నిర్వహణకు సహకరించాలి చేజర్ల మండలం వావిలేరు గ్రామం దళితవాడకు చెందిన గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మాతమ్మ దేవాలయానికి సర్వే నంబర్ 175లో మూడు ఎకరాల భూమి ఉందని, సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని లీజుకు ఇచ్చి వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ, పూజారి జీతభత్యాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిలో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతున్నందున ప్రభుత్వం నుంచి పరిహారం అందనుందని, ఆ మొత్తాన్ని దేవాలయానికే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి హక్కుల విషయంలో వివాదం ఉన్నందున స్థానికులను విచారించి న్యాయం చేయాలని జేసీని విజ్ఞప్తి చేశారు. వెంకటరమణయ్య, పెంచలయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
భూ వివాదంపై అధికారుల నిర్లక్ష్యం
తన భార్య చింతం రత్నమ్మ పేరుతో ఉన్న వ్యవసాయ భూమిని తమకు తెలియకుండానే ఇతరుల పేర్లపై వన్బీ, అడంగళ్లో నమోదు చేశారని చింతం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. బ్రాహ్మణ క్రాక పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 2367, 2367/1/2లో ఉన్న 4.50 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోందని తెలిపారు. తమకు తెలియకుండా వేలమూరి అరుణకుమారి, మద్ది రెడ్డి రమాదేవి, మద్ది రెడ్డి వెంకటకృష్ణారెడ్డి పేర్లను రికార్డుల్లో నమోదు చేశారని, ఈ వ్యవహారంలో కొందరు టీడీపీ నాయకులు, సంబంధిత తహసీల్దార్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. భూ వివాదం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, ఎలాంటి అనుమతులు లేకుండా భూమిలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయానికి పెడుతున్నారన్నారు. సమస్య పరిష్కారం కోసం ఏడాదిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, గ్రీవెన్స్ కార్యక్రమానికి తాజాగా ఐదోసారి వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్థిక సాయం కోసం..
అనారోగ్యంతో గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన 14 ఏళ్ల కుమార్తె కర్రా తేజస్విని ప్రాణాలు కాపాడేందుకు ఆర్థిక సాయం అందించాలని నెల్లూరు వైఎస్సార్ నగర్కు చెందిన కర్రా ఆదినారాయణ జేసీకి వినతిపత్రం సమర్పించారు. తేజస్వినికి బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారని తెలిపారు. సీఎంఎఫ్ సాయం కాకుండా చికిత్సకు సుమారు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి వలస వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని చెప్పారు. తేజస్విని ప్రాణాలు కాపాడేందుకు దాతలు, ప్రజలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ జిల్లా యూనియన్ నాయకులు జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరీనా, ఉమా మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఆశా వర్కర్లకు సరైన గుర్తింపు, వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానం, నెలసరి సెలవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడంతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల పోస్టులను పెంచి ఖాళీలను భర్తీ చేయాలని, పని భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ధనమ్మ, ఏ. సుజాత, ఎస్. పెంచలమ్మ, సుజనా పాల్గొన్నారు. -
కోటలో గురుకులాన్ని పునరుద్ధరించండి
● సాంఘిక సంక్షేమ మంత్రికి తిరుపతి ఎంపీ లేఖ చిల్లకూరు: ‘ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు పేరుతో కోటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా ఎత్తివేయడం దారుణం. సుమారు 600 మంది విద్యార్థుల భవిష్యత్ కోసం ఆ పాఠశాలను వెంటనే పునరుద్ధరించాలి’ అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయలుకు సోమవారం లేఖ రాశారు. సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన పాఠశాలను ఎత్తి వేసి విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గురుకులాన్ని పునరుద్ధరిస్తూ ఎక్స్లెన్స్ సెంటర్ను కూడా కొనసాగించాలని ఆయన లేఖలో కోరారు. హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు గూడూరు: నాయుడుపేట మండలంలోని విన్నమాల గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ గూడూరులోని ఏడో అదనపు జిల్లా జడ్జి సోమవారం తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంతకుమార్ కథనం మేరకు.. విన్నమాలలోని అరవ శ్రీనివాసులుపై 2022వ సంవత్సరం నవంబర్ 17వ తేదీన నాయుడుపేట టౌన్కు చెందిన పేర్నాటి బెన్హర్, పేర్నాటి అనిల్, పేర్నాటి సాగర్ దాడి చేశారు. దీంతో అతను చనిపోయాడు. మృతుడి కుమారుడు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖాలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి జీవిత ఖైదు విధించడంతోపాటుగా ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానాను విధించారు. కేసు విచారించి దోషులకు శిక్ష పడేలా చేసిన పీపీ, నాయుడుపేట అర్బన్ సీపీ వెంకటేశ్వరరావు, సీఐ వైవీ సోమయ్య, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ మల్లికార్జున్, కోర్టు హెడ్కానిస్టేబుల్ పి.నరసింహులు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబును తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు. జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం ● ఎస్ఈ సుధాకర్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఆగస్టు నెలలో గత ఏడాదితో పోలిస్తే 36 శాతం అధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ సుధాకర్ తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలు డివిజన్ల నుంచి 16 మంది వినియోగదారులు తమ సమస్యలను తెలిపారు. వీటిలో లో ఓల్టేజీ, సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్కు మార్పు, సోలార్ విద్యుత్కు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఈ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. గతేడాది ఆగస్టులో 319.109 మిలియన్ యూనిట్ల వినియోగం కాగా, ఈ ఏడాది ఆగస్టులో 433.661 ఎంయూ వినియోగమైందన్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజలు అనవసర సమయాల్లో వినియోగాన్ని తగ్గించుకుని పొదుపు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ (టెక్నికల్) అల్తాఫ్, ఈఈ శ్రీధర్, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కండలేరులో 18.37 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 18.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వారంరోజుల గడువు ఇస్తున్నాం
● సమస్యలు పరిష్కరించాలి ● సచివాలయ ఉద్యోగుల డిమాండ్ నెల్లూరురూరల్: సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం వార్డు సెక్రటరీస్ అసోసియేషన్ సెక్రటరీ బాలార్జున్ తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైజాగ్ వేదికగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడు రోజులుగా కొనసాగినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆవేదన పెరిగిందన్నారు. దీంతో భారీ సంఖ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్ను ముట్టడించి ధర్నా నిర్వహించారని తెలిపారు. తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుత నిరసన కార్యక్రమాలను వారంరోజులపాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈలోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత భారీ స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం చేపట్టే ప్రతి కార్యాచరణకు నెల్లూరు జాయింట్ యాక్షన్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమావేశంలో ఆ సంఘం నేతలు పాండు, హరీష్, సతీష్, చైతన్య, పవన్కుమార్, పృథ్వీ, సహన్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల్లో అభద్రతాభావం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా రాజీపడొద్దని జగన్మోహన్రెడ్డి చెప్పారని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం మరింత గట్టిగా పోరాడతామని చెప్పారు. టీడీపీ నేతల్లో అభద్రతాభావం కనిపిస్తోందని విమర్శించారు. పోలీసులను ఉపయోగించి భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారన్నారు. మన ధైర్యమే విజయతీరాలకు చేరుస్తుందని చెప్పారు. కష్టపడి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధిస్తే మరింత గుర్తింపొస్తుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేద్దామని పిలుపునిచ్చారు. -
కేడర్ను సన్నద్ధం చేస్తాం
పార్టీ కేడర్ను సమాయత్తం చేయనున్నామని కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రకటించారు. పటిష్టమైన ప్రణాళికతో దిశ, నిర్దేశం చేసుకొని ముందుకెళ్లడమే సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆలోచనలు, విధానాలు, అభిప్రాయాలను పార్టీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగనన్న ఇచ్చిన ధైర్యంతో పోరాడి 2019లో అధికారంలోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. సమావేశానికి భారీగా తరలిరావడం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కొనే ఽధైర్యం లేక పోలీసులను అడ్డుపెట్టుకొని ఆటంకాలను సృష్టించేందుకు టీడీపీ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. కూటమి పాలనలో మౌలిక వసతులు, సంక్షేమం కుంటుపడిందని, రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రౌడీషీ ట్లు తెరవడం, అక్రమ కేసులు, నోటీసులతో వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి కేసుపై విచారణ జరిపించి, బాధ్యు లపై చట్టపరమైన చర్యలను చేపడతామని స్పష్టం చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మను సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే, కావలి ఇన్చార్జి రామి రెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు యల్లసిరి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరణించిన వ్యక్తి.. బతికే ఉన్నారంట..!
● శకునాలపల్లి సచివాలయ సిబ్బంది నిర్వాకం ● అవాకై ్కన కుటుంబసభ్యులు ● పింఛన్ దరఖాస్తుకు నోచుకోక ప్రదక్షిణలు ఉదయగిరి రూరల్: దాదాపు ఏడాదిన్నర క్రితం వ్యక్తి మృతి చెందగా, డెత్ సర్టిఫికెట్ను సైతం సచివాలయ సిబ్బంది జారీ చేశారు. అయితే ఆయన బతికే ఉన్నారని వారు ప్రకటించడంతో వితంతు పింఛన్ కోసం వెళ్లిన ఆయన భార్య అవాకై ్కన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో వితంతు పింఛన్ నిమిత్తం సచివాలయానికి ఆయన భార్య వెళ్లగా, నీ భర్త బతికే ఉన్నారని ఆన్లైన్లో చూపుతోందని, దరఖాస్తు దాఖలుకు అనర్హురాలని వారు సెలవిచ్చారు. నిజానికి ఉదయగిరి మండలం శకునాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దాసరి రాజశేఖర్, మణిచందన భార్యాభర్తలు. అనారోగ్యంతో గతేడాది జనవరి 26న ఆయన మృతి చెందారు. ఆ సమయంలో శకునాలపల్లి సచివాలయం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబసభ్యులు పొందారు. ఆపై మణిచందన, ఆమె కుమారుడు జయంత్ పేరుపై స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేసింది. ఆశలు.. అడియాసలు మరణ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని పింఛన్ దరఖాస్తు నిమిత్తం సచివాలయానికి మణిచందన వెళ్లారు. వీటిని పరిశీలించి, కుటుంబసభ్యుల వివరాలను ఆన్లైన్లో తనిఖీ చేయగా, రాజశేఖర్ బతికే ఉన్నారని నమోదైంది. విషయం తెలియడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబపోషణ భారంగా ఉన్న సమయంలో పింఛన్ మంజూరవుతుందని ఆశగా ఉన్న ఆమె సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆవేదనకు గురయ్యారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. -
కరోనా సమయంలోనూ మాట తప్పలేదు
ప్రజలకు ఇచ్చిన మాట ను కరోనా సమయంలోనూ అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి తప్పలేదని.. సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేశారని మాజీ ఎమ్మెల్యే, ఆత్మకూరు ఇన్చార్జి మేకపాటి విక్రమ్రెడ్డి పేర్కొన్నారు. హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిపై బురద జల్లాలనే ఉద్దేశంతో దేవుడ్ని సైతం వదల్లేదంటే టీడీపీ బుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు. మన సత్తాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే నిదర్శనం కావాలని పిలుపునిచ్చారు. అప్పులు తెస్తూ.. ఆ మొత్తాన్ని అమరావతికే తగలేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటును పంచడాన్నే నేర్పిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెప్తున్నారని విమర్శించారు. -
ఐసీడీఎస్ పీడీ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(పొగతోట): సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నాగశైలజను నెల్లూరు ఐసీడీఎస్ పీడీగా బదిలీ కాగా ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీడీపీఓలు పీడీని మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పీడీగా పనిచేసిన హేనాసుజన్ను రాష్ట్ర అధికారులు సస్పెండ్ చేశారు. ఆమె కాలంలో సొంత కారును అద్దెకు పెట్టారు. కార్యాలయంలోని చాంబర్లో ఏసీని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. సస్పెండ్ చేయడంతో వాహనాన్ని, ఏసీని తీసుకెళ్లారు. వాహనం సొంతదైనా ప్రభుత్వం ప్రతినెలా అద్దె చెల్లిస్తోంది. కొత్త పీడీ సమావేశానికి హాజరయ్యేందుకు వాహనం అందుబాటులో లేదు. సొంత కారులో వెళ్లారు.పాముకాటుకు వృద్ధురాలి బలి● చీకట్లో మరుగుదొడ్డికి వెళ్తుండగా ఘటన వరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లె పంచాయతీ కొండ్రాజుపల్లెలో పాముకాటుకు గురై మద్దినేని రత్తమ్మ (68) అనే వృద్ధురాలు మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు.. బుధవారం రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లో ఆమె మరుగుదొడ్డికి వెళ్తుండగా పాముకాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె భర్త ఏడాది క్రితం మృతిచెందాడు. తరచూ విద్యుత్ అంతరాయాలు గ్రామంలో రాత్రివేళల్లో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక చీకట్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇప్పటికై నా విద్యుత్ అంతరాయాలను తొలగించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని కోరారు. 28న జిల్లా స్థాయి పోటీలునెల్లూరు(టౌన్): ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో వచ్చేనెల 28న జిల్లా స్థాయి రోల్ ప్లే, ఫోక్ డ్యాన్స్ పోటీలు జరుగుతాయని డీఈఓ ఆర్.బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నోడల్ అధికారిగా డైట్ సీనియర్ సైన్స్ ఉపన్యాసకురాలు వి.రాధారాణి వ్యవహరిస్తారన్నారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 9వ తరగతి చదవుతున్న వారు పాల్గొంటారన్నారు. 23న పాఠశాల స్థాయి, 26న మండల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రథమ స్థానంలో నిలిచిన వారు జిల్లా స్థాయిలో పాల్గొంటారన్నారు. ఇక్కడ ప్రథమ స్థానంలో వచ్చిన వారు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారన్నారు. రోల్ ప్లేలో ఆరోగ్యంగా పెరగడం, భావోద్వేగ సంక్షేమం, మానసిక ఆరోగ్యం, విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం, జెండర్ సమానత్వం, పోషణ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ఆరోగ్యకర జీవనశైలి, హెచ్ఐవీ నివారణ, హింస, గాయాల నుంచి భద్రత, రక్షణ తదితర అంశాలు ఉంటాయన్నారు. వీటిల్లో ఏదో ఒక ధీమ్లో పాల్గొనాలన్నారు. ఫోక్ డ్యాన్స్లో 11 అంశాలతోపాటు అదనంగా పర్యావరణ పరిరక్షణ అంశం ఉంటుందన్నారు. వివరాలకు 90100 85001 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. పొదలకూరు నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.225 సన్నవి : రూ.150 పండ్లు : రూ.80 -
ఏఎస్పేటలో ముగిసిన గంధ మహోత్సవాలు
● పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు ● అలరించిన ఫకీరుల విన్యాసాలు అనుమసముద్రంపేట: మండల కేంద్రంలో ఉన్న హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ దొరసానమ్మల వార్షిక ఉరుసు గంధ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గురువారం నిర్వహించిన తహలీల్ ఫాతెహా ఉత్సవంతో ముగిశాయి. వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక మహాల్ నుంచి దర్గా పీఠాధిపతి హఫీజ్ పాషా ఆధ్వర్యంలో గంధాన్ని కలశంలో కలిపి, ముస్లిం పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫకీరుల డప్పు వాయిద్యాలు, గాయకుల కీర్తనల నడుమ గంధాన్ని హజరత్ వారి దర్గాకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రత్యేక వేదికపై హజరత్ వారి జపమాలను నాయబ్ సజ్జాదా జునైద్ పాషా భక్తులకు చూపించారు. అనంతరం తహలీల్ ఫాతెహా కార్యక్రమం నిర్వహించారు. గాయకులు నదీమ్ సందానీ తదితరులు ఆలపించిన హజరత్ వారి కీర్తనలు భక్తులను అలరించాయి. ఫకీరులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తగ్గిన భక్తుల సంఖ్య ఈ ఏడాది గంధోత్సవాలకు గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య తగ్గింది. ఉత్సవాలపై ముందస్తు ప్రచారం లేకపోవడంతోపాటు వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు కూడా భక్తుల రాక తగ్గడానికి కారణమయ్యాయని పేర్కొంటున్నారు.హాజరైన భక్తులు తహలీల్ ఫాతెహా నిర్వహిస్తూ.. -
మంచినీరుగా భావించి రసాయనం తాగి..
● వ్యక్తి మృతి వెంకటాచలం: రొయ్యల గుంత వద్ద పొరపాటున ఓ రసాయనం తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ఇడిమేపల్లిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ పంచాయతీ ఆర్కట్పాళేనికి చెందిన కర్పంగారి తిరుపతయ్య (55) మరికొందరితో కలిసి రొయ్యలు పట్టేందుకు బుధవారం ఇడిమేపల్లికి వెళ్లాడు. అక్కడ పనిలో నిమగ్నమై ఉండగా రొయ్యల కోసం ఉపయోగించే ఓ రసాయనాన్ని పొరపాటున మంచినీరుగా భావించి తిరుపతయ్య తాగేశాడు. మేస్త్రి లేబూరు శ్రీనివాసులు గుర్తించి వెంటనే బాధితుడిని ఆటోలో ముత్తుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు. తిరుపతయ్య కుటుంబ సభ్యులు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.కండలేరులో 18.03 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 18.03 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 800, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 110, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
చిన్న మచ్చ.. పెద్ద ముప్పు
● సకాలంలో చికిత్సతో కుష్టు నయం ● జిల్లాలో 1,038 మంది వ్యాధిగ్రస్తులు ● నేటి నుంచి 14 రోజులపాటు సర్వే●నెల్లూరు(అర్బన్): కుష్టు.. ఈ పదం వినగానే బాధితుల్లో భయం మొదలవుతోంది. సమాజం చిన్నచూపు చూస్తుందేమోనని, బంధువులు దూరం పెడతారేమోనని ఆందోళన చెందుతారు. ఈ అపోహలు వ్యాధి కంటే ఎక్కువగా బాధిస్తున్నాయి. చేతిపై, ఛాతిపై తెలుపు, రాగి లేదా నలుపు రంగులో గుండ్రంగా మచ్చ ఏర్పడుతుంది. సాధారణంగా ఆ మచ్చపై నొప్పి ఉండదు. క్రమంగా స్పర్శ తగ్గుతుంది. మరోచోట కూడా స్పర్శ లేని మచ్చ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. పరీక్షల్లో కుష్టు వ్యాధిగా నిర్ధారణ అయితే సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేసి చికిత్స తీసుకోకపోతే నరాలపై ప్రభావం చూపి అంగవైకల్యానికి దారితీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇంటింటికీ వెళ్లి సర్వే జిల్లాలో కుష్టు వ్యాధి ప్రారంభ దశ లక్షణాలను గుర్తించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 14 రోజులపాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ ఖాదర్వలీఆధ్వర్యంలో 1,847 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులుంటారు. మహిళలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రతి బృందంలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సర్వేకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలో 1,038 మంది జిల్లాలో ప్రస్తుతం 1,038 మంది వ్యాధిగ్రస్తులున్నారు. వారి కోసం రాపూరు సమీపంలో ఒక కాలనీ, నెల్లూరు రూరల్ ఆమంచర్ల వద్ద రెండు కాలనీలను ఏర్పాటు చేశారు. గతేడాది నుంచి ఈ సంవత్సరం వరకు కొత్తగా 54 కేసులను గుర్తించారు. అర్హత ఉన్న 714 మందికి ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. మరో 149 మందికి ఏఏవై కార్డుల ద్వారా నెలకు 35 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందుకుటున్నారు. వైద్యశాఖ తరఫున ప్రతి కుష్టు వ్యాధిగ్రస్తుడికి ఏడాదికి రెండు జతల ఎంసీఆర్ చెప్పులు, ఒక టబ్, రెండు చిన్న టవల్స్, నీమ్ ఆయిల్, గరుకు రాయి అందిస్తున్నారు. అవసరమైన వారికి బ్యాండేజీలు, కాటన్ రోల్స్ కూడా ఇస్తున్నారు. ఎనిమిది మందికి వాకర్స్, 150 మందికి చేతి కర్రలు, నలుగురికి సంకలో వేసుకునే కర్రలు అందించారు. వ్యాధి కన్నా అపోహలే ఎక్కువ కుష్టు వ్యాధిపై సమాజంలో అనేక అపోహలున్నాయి. వ్యాధిగ్రస్తుడిని తాకితే తమకు వస్తుందని, జీవితాంతం అంటువ్యాధిగానే ఉంటుందని భావిస్తుంటారు. వాస్తవానికి మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. వ్యాధిగ్రస్తుడితో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల సంక్రమించే అవకాశం ఉంటుంది. తాకినంత మాత్రాన కుష్టు వ్యాధి రాదు. కలిసి భోజనం చేయడం, పక్కన కూర్చోవడం వల్ల కూడా సోకదు. అప్రమత్తత అవసరం చర్మంపై స్పర్శ తగ్గిన మచ్చలు, చేతులు, కాళ్లలో తిమ్మిరి, చర్మం దళసరిగా మారడం, నరాలు మందంగా అనిపించడం, గాయాలు ఏర్పడినా నొప్పి తెలియకపోవడం, కనుబొమ్మల వెంట్రుకలు రాలడం, చెవి దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను నివారించవచ్చు. -
బారికేడ్ల మధ్య.. వేలాడే వైర్లు
నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కలిసేందుకు నిత్యం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వస్తుంటారు. అయితే జైలు పరిసరాల్లో బారికేడ్ల మధ్య ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు వేలాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సందర్శకులు రాకపోకలు సాగించే ప్రాంతంలోనే ఇలా వైర్లు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాల్సి ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ఎన్నెమ్మెమ్మెస్కు దరఖాస్తు చేసుకోవాలి
నెల్లూరు (టౌన్): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో కోరారు. పరీక్షను నవంబర్ 11న నిర్వహించనున్నారని వెల్లడించారు. కుటుంబ వార్షికాదాయం రూ.3.5 లక్షల్లోపు ఉన్నా వారే అర్హులని చెప్పారు. పరీక్ష రుసుముగా రూ.100ను ఓసీ, బీసీ విద్యార్థులు.. రూ.50ను ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల పరీక్షల విభాగ అసిస్టెంట్ కమిషనర్ను సంప్రదించాలని సూచించారు. ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తల పరిశీలన ఆత్మకూరు రూరల్: మండలంలోని మహిమలూరులో పొలాన్ని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) శాస్త్రవేత్తలు గురువారం సందర్శించారు. సహజ వ్యవసాయం, రసాయన వ్యవసాయ పద్ధతుల మధ్య వ్యత్యాసాలను పరిశీలించడంతో పాటు పంటల వేరు వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు గానూ దీన్ని చేపట్టారు. రమణారెడ్డి పొలాన్ని ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు బండప్ప, సతీష్ ఆధ్వర్యంలోని బృందం సందర్శించి వివిధ అంశాలను పరిశీలించారు. భరత్, అరుణ్, శ్రీనివాసులు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. వీబీ – జీ రామ్ జీ పనుల తనిఖీ మనుబోలు: మండలంలోని కాగితాలపూరులో జరుగుతున్న వీబీ జీరామ్ జీ పనులను కేంద్ర బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. గ్రామంలోని సోప్ కిట్ను కేంద్ర బృంద సభ్యులు ప్రసాద్, గోవర్ధన్.. ఏపీడీ గాయత్రి ఆధ్వర్యంలో పరిశీలించారు. నగదు అందిందాననే విషయమై లబ్ధిదారుడు గోను వెంకటరమణయ్యను అడిగి తెలుసుకున్నారు. -
పొగాకు సాగుపై అవగాహన
ఆత్మకూరు రూరల్: ఎఫ్సీవీ పొగాకు పంట నియంత్రణపై రైతులకు అవగాహన సదస్సును మండలంలోని వెన్నవాడలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్ర నిర్వహణాధికారి సునీల్కుమార్ మాట్లాడారు. మార్కెట్లో ధరల పతనాన్ని నివారించేందుకు గానూ బోర్డు నిర్దేశించిన కోటా మేరకే పొగాకును సాగు చేయాలని సూచించారు. అనుమతుల్లేకుండా కొత్త బ్యారన్లను నిర్మించొద్దని కోరారు. దీనిపైనే ఆధారపడకుండా ఇతర లాభదాయక పంటలనూ సాగు చేయాలని సూచించారు. ఒక్కో బ్యారన్కు పొగాకు బోర్డు ద్వారా రూ.50 వేల వరకు వడ్డీలేని రుణం అందుబాటులో ఉందన్నారు. అధిక సాగు ఖర్చుల దృష్ట్యా కౌలు భూముల్లో పొగాకును సాగు చేయకుండా సొంత భూమి, లైసెన్స్ కలిగిన రిజిస్టర్డ్ రైతులే చేపట్టాలని పేర్కొన్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు ఆదర్శ్ జగన్నాథ్, విజయ్, ఫీల్డ్ సూపర్వైజర్లు వైష్ణవి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగుదేశం నేత ఇష్టారాజ్యం
● అక్రమంగా చెరువు మట్టి తరలింపు చేజర్ల: మండలంలోని పెల్లేరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఈ తంతు జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు సోదరుడు టీడీపీ మండల నేత కొమ్మి సిద్ధుల నాయుడు మట్టిన తన సొంత పొలాలకు అక్రమంగా తరలిస్తున్నాడని గ్రామస్తులు గురువారం ఆరోపించారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ భారీ స్థాయిలో మట్టిని లోడేయడంతో భూగర్భ జలాలు భారీ స్థాయిలో అడుగంటే ప్రమాదం ఉంది. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఈ తరుణంలో సామాన్య రైతు లోతట్టు మాగాణి భూములకు తోలుకునేందుకు ఒక ట్రక్కు మట్టికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అయితే వందలాది ట్రాక్టర్ల మట్టిని ప్రభుత్వ చెరువులు, భూములు నుంచి ఎత్తుకెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
రెగ్యులర్ చేయాలని.. కళ్లకు గంతలతో నిరసన
నెల్లూరు(అర్బన్): తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు గురువారం జేఏసీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలోని సర్వజన ఆస్పత్రి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ శరత్బాబు, రాష్ట్ర నాయకురాలు రూత్గ్రేస్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పదిరోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని చెప్పారు. తమతో సమానంగా విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ నర్సులతో పోలిస్తే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. వంద శాతం గ్రాస్ జీతం చెల్లించాలని, విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైతే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేణు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
కోట గురుకులం మూసివేతపై ఆందోళన
నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం ఇటీవల మూసివేసిన కోట గురుకుల పాఠశాలను వెంటనే పునఃప్రారంభించాలని ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు వీరంరెడ్డి సురేష్రెడ్డి డిమాండ్ చేశారు. గురుకులం మూసివేతకు నిరసనగా గురువారం నెల్లూరులోని సాంఘిక సంక్షేమశాఖ జిల్లా కో ఆర్డినేటర్ (డీసీఓ) కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సురేష్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. 600 మంది పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు చదువుకునే పాఠశాలను ఒక్కసారిగా మూసివేయడం దారుణమన్నారు. పలు విద్యార్థి సంఘాలతో కలిసి 40 రోజులుగా ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే ప్రాణత్యాగాలకు సైతం సిద్ధమన్నారు. మద్రాస్ బస్టాండ్ కూడలి నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, విద్యార్థులు భారీ ప్రదర్శనగా బయలుదేరి డీసీఓ కార్యాలయానికి చేరుకుని ముట్టడి చేపట్టారు. విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ వారు కార్యాలయ ముట్టడి నిర్వహించి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమంలో ఏఐఎం జిల్లా అధ్యక్షుడు శివకుమార్, బీవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఎస్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షఫీ తదితరులు పాల్గొన్నారు. సీఓఈ కోసం ప్రభుత్వ పెద్దల ఆరాటం కోట: దళిత సంఘాల ఉద్యమం తీవ్రమవుతుండడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. పోరాటాన్ని కట్టడి చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. గురువారం వందమంది వరకు అడ్మిషన్లు పొందిన ఇంటర్ విద్యార్థులను సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రానికి ఒక్కసారిగా తరలించారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఎస్సీ గురుకులాన్ని సీఓఈ కేంద్రంగా మార్చిన క్రమంలో మంత్రి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే రోజురోజుకూ దళిత, విద్యార్థి సంఘాల ఉద్యమం తీవ్రమవుతున్న క్రమంలో వారు అడ్డుకునే అవకాశం ఉంది. అధికారులు ఎటువంటి హడావుడి లేకుండా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులను తరలించినట్లు సమాచారం. ఈ విషయమై ప్రిన్సిపల్ ఆనందరావును వివరణ కోరగా నీట్, ఐఐటీ శిక్షణ కోసం విద్యార్థులు వస్తున్నారని, మిగిలిన విషయాలు ఉన్నతాధికారులే చూస్తారన్నారు. -
వేడుకగా చిన్న గంధం ఊరేగింపు
వెంకటాచలం: మండలంలోని కసుమూరులో మస్తాన్వలీ దర్గా చిన్న గంధం మహోత్సవాన్ని గురువారం వేడుకగా నిర్వహించారు. చందన్ మహాల్ నుంచి ఉదయం 9 గంటలకు ముజావర్లు గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. 11 గంటలకు గంధం దర్గా ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం మస్తాన్వలీ సమాధి వద్ద తహలీల్, ఫాతెహా నిర్వహించి గంధాన్ని సమాధికి పూశారు. తర్వాత దర్గా ముజావర్లు గంధం, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. దీంతో కసుమూరు మస్తాన్వలీ 249వ గంధ మహోత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మస్తాన్వలీ దర్గాను దర్శించుకున్నారు. -
క్వార్ట్జ్ అక్రమాలపై ప్రశ్నిస్తే బెదిరింపులు
● మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ నెల్లూరు రూరల్: క్వార్ట్జ్ అక్రమాలకు సంబంధించి తాను ఆధారాలను బయటపెట్టి ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా.. ఇతరులతో మాట్లాడించి పక్కదారి పట్టించడం.. అడ్డమైన కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రశాంతంగా ఉండకుండా, ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొచ్చారంటే కేవలం డబ్బు అహంకారమే కారణమని విమర్శించారు. తనను బెదిరించేందుకు తన అనుచరుడు శ్రావణ్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. టీడీపీకి చెందిన వ్యక్తిని బెదిరించారంటూ శ్రావణ్పై కేసు పెట్టారని, అయితే దీనికి సంబంధించిన ఆధారాల్లేవని స్పష్టం చేశారు. దొంగ కేసులకు తాము భయపడేదిలేదని తేల్చిచెప్పారు. జిల్లాలోని రాజకీయ నాయకుల మధ్య గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు జరిగినా, ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి లేదని, కొత్తగా ఈ తరహా పద్ధతిని తీసుకొచ్చింది వీరేనని మండిపడ్డారు. మీడియాలో వచ్చే కథనాలను హుందాగా తీసుకోవాలని, వాటిపై దాడులకు పాల్పడతామని హెచ్చరించడం సరికాదని హితవు పలికారు. తమపై దొంగ కేసులు పెట్టి వేధించడం కాకుండా శాంతిభద్రతలపై దృష్టి సారించాలని ఎస్పీకి సూచించారు. 2029లో వేమిరెడ్డి దంపతులు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని.. డబ్బుతో వచ్చిన అహంకారం, పొగరును తగ్గిస్తామన్నారు. తనను అంతం చేసేందుకు యత్నించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు శ్రావణ్ అత్యంత నమ్మకమైన వ్యక్తి అని చెప్పారు. డబ్బుతో టీడీపీని కొనుగోలు చేయగలరేమో గానీ తమనేమీ చేయలేరని వ్యాఖ్యానించారు. సామాజిక సేవ విషయంలోనూ వేమిరెడ్డి కుటుంబం డబ్బాలు కొట్టుకుంటోందని విమర్శించారు. -
దేవమ్మ చెరువులో భూచోళ్లు
● అసైన్డ్ భూములపై అక్రమార్కుల కన్ను ● రీ సర్వే తర్వాత వెలుగులోకి వస్తున్న బాగోతాలు ● రెవెన్యూ యంత్రాంగం పాత్రపై అనుమానాలు ● రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు సీతారామపురం: మారుమూల అటవీ ప్రాంతమైన దేవమ్మ చెరువు పంచాయతీలో గల అసైన్డ్ భూములపై అక్రమార్కుల కన్నుపడింది. స్థానికంగా ఉండే పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ ల్యాండ్స్ను రెవెన్యూ యంత్రాంగం పరులపరం చేసింది. ఇతర జిల్లాల్లోని వారి పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయడంతో గుట్టురట్టయింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ఎకరానికి రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాయాజాలం దేవమ్మ చెరువులో గతేడాది నవంబర్లో రీ సర్వేను చేపట్టారు. దీనికి ముందు సర్వే నెంబర్ 1 – 2లో 10.. 3 – 4లో మూడు.. 89 – 4లో 8.. 89 – 5లో ఐదు.. 91 – 1లో 15.. 92 – 1లో 8.. 93 – 1లో 8.. 82 – 1లో మూడెకరాల మేర 60 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉండింది. అయితే ఇందులో 20 ఎకరాలను స్థానికేతరుల పేర్లతో రీ సర్వే తర్వాత నమోదు చేశారు. దీంతో మాయాజాలం బయటపడింది. ఇదీ తంతు.. దేవమ్మ చెరువు రెవెన్యూ సర్వే నంబర్ 89 – 5, 82 – 1, 89 – 4, 1 – 2, 91 – 1, 92 – 1, 93 – 1లో స్థానికేతరులతో పాటు అనర్హులైన రాజమ్మ (0.70), రజని (1.25), సుజాత (1), రామలక్ష్మమ్మ (1.93), కవిత (1), వెంకటేశ్వర్లు (1), కొండమ్మ (0.54), గంగాభవాని (1), వెంకటలక్ష్మమ్మ (1), కవిత (1), పాపరాజు (1), మానస (1), దేవి (0.97), లక్ష్మీకుమారి (0.97), వెంకటసుబ్బమ్మ (1.12), మౌనిక (1.12), డేనియల్ (1.89), సుబ్బరతమ్మ (1.02), బ్రహ్మయ్య (3) వంటి వారి పేర్లపై సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమిని ఆన్లైన్లో ఎక్కించారు. మరోవైపు దీన్ని సెటిల్మెంట్ భూమిగా మార్చి రూ.లక్షలకు ఓ వ్యక్తి విక్రయించారని సమాచారం. సర్వే నంబర్ 8, 60 – 3, 18 – 4 – 47లో కాశయ్య, బాలయ్య, వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు పేర్లపై గల సుమారు ఏడెకరాలకు పైగా అసైన్డ్ భూమిని ఇతరుల పేరుపై సెటిల్మెంట్ భూములుగా మార్చారని తెలుస్తోంది. కొందరి పేర్లు మాయం 2005 – 08 మధ్య సర్వే నంబర్ 1లో 77 – 99 వరకు బ్లాకులుగా విభజించి కమిటీ తీర్మానంతో 31 మంది ఎస్టీలకు 62 ఎకరాలను పంపిణీ చేసి పాస్పుస్తకాలు, పట్టాలను అందజేశారు. 2010లో అప్పటి ప్రభుత్వం బోర్లు వేయించి సాగుకు సిద్ధం చేశారు. ప్రస్తుతం 19 మంది పేర్లే ఆన్లైన్లో కనిపిస్తుండగా, మిగిలిన 12 మందివి కానరావడంలేదు. సంబంధిత సర్వేయర్, వీఆర్వోలు ప్రత్యేక చొరవతో పట్టాలున్న వారి భూములను ఇతరుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారనే అంశమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది. 2025 నుంచి సర్వే నంబర్ 39, 84, 47, 85 తదితరాల్లో మిగులు భూమిని స్థానికేతరుల పేర్లపైకి ఎక్కించారనే ఆరోపణలూ ఉన్నాయి. కలెక్టర్ స్పందించి వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా భూమిని ఇతరుల పేర్లపైకెక్కించారు నా తండ్రి వెంకటసుబ్బయ్య పేరుపై ఇనాం భూమి 2.56 ఎకరాలను 1989లో దేవమ్మ చెరువు సర్వే నంబర్ 18 – 4లో ఇచ్చారు. నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూమిని 15 రోజుల క్రితం ఇతరుల పేర్లపై ఆన్లైన్లో నమోదు చేశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించినా, ప్రయోజనం కరువైంది. – కమతం సుబ్రహ్మణ్యం రీ సర్వేకు ముందున్న పేరు ఇప్పుడు లేదుదేవమ్మ చెరువు గ్రామ సర్వే నంబర్ 91 – 1లో రెండెకరాల అసైన్మెంట్ భూమిని 2005లో కేటాయించి నా పేరుపై పట్టా పాస్ పుస్తకాలను సైతం ఇచ్చారు. రీ సర్వే తర్వాత వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తిపై నా భూమిని మార్చి ఆన్లైన్లో అతని పేరుపై నమోదు చేసి ఉన్నారు. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే, ఏవేవో చెప్తున్నారు. – గాయపు నాగయ్య -
నైతిక విలువలను బోధించాలి
వెంకటాచలం: దేఽశంలో సాంస్కృతిక, నైతిక విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందని, నైతిక విలువలపై తరగతులను పాఠశాల విద్య నుంచే తప్పనిసరి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విధానాల ఆధారంగా విమర్శలుండాలే గానీ.. వ్యక్తులు, కుటుంబాలపై బురదజల్లే వ్యక్తిగత దూషణలు ఉండకూడదని పేర్కొన్నారు. సభలు, చట్టసభల్లో గౌరవప్రదమైన చర్చలు సాగాలని, నిరసనలకు హద్దులుండాలని, అభ్యంతరకర దూషణలు చేసే ధోరణి మారాలని సూచించారు. సమాజంలో విద్వేషాలు, వ్యక్తిగత దూషణలు, హింసను ప్రేరేపించే రీతిలో సోషల్ మీడియా దుర్వినియోగం కావడం సరైన విధానం కాదన్నారు. వివిధ దేశాల్లో అమలు చేస్తున్న తరహాలోనే ఇక్కడా 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్లు ఉండకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ – 2047 లక్ష్యం చేరాలంటే పల్లెలు, ఆకలి, అసమానతలు, అన్యాయం లేని రామరాజ్యంలా వికసించాలని కాంక్షించారు. మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ పాల్గొన్నారు. -
సర్వేపల్లిలో టీడీపీకి భారీ షాక్
● వైఎస్సార్సీపీలో కాకర్లవారిపాళేనికి చెందిన 70 కుటుంబాల చేరిక ● సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ దగా రాజకీయాలు, మోసాలను భరించలేకపోయిన మండలంలోని కాకర్లవారిపాళేనికి చెందిన 70 కుటుంబాలు టీడీపీని బుధవారం వీడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నేరెళ్ల నవీన్, దాసరి రమేష్, కుడుముల ఉపేంద్ర, నిక్కుదల శ్రీనివాసులు, నిక్కుదల నాగరాజు, ముక్కు వెంకటేశ్వర్లు, పేరం అనంత్, గుమ్మడి నాగేంద్ర, కుడుములు వెంకటసుబ్బయ్య, గుత్తికొండ రాధాకృష్ణయ్య, మాలికల చంద్రయ్య, పైనం శ్రీనివాసులు, జంగం శ్రీహరి, జంగం వెంకటసుబ్బయ్య తదితరులకు పార్టీ కండువాలను కాకాణి కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి.. జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమన్నారు. కాకర్లవారిపాళెంలో ఏకంగా 70 కుటుంబాలు టీడీపీని వీడి తమ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న శ్రేణులు.. సోమిరెడ్డి అవినీతి, అక్రమాలకు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తుచేసుకొని.. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీని వీడుతున్నారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న తమ పార్టీకి మద్దతు పెరుగుతోందని, రానున్న రోజుల్లో టీడీపీ నుంచి తమ పార్టీలోకి చేరికలు మరింతగా ఉంటాయని చెప్పారు. -
స్థానిక ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం
● ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. ఈ క్రమంలో ఎలక్షన్ల నిర్వహణకు సంబంధించిన చర్యలను రాష్ట్ర ఎన్నికల అధికారులు చేపట్టారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉపక్రమించారు. ఫొటోతో ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రచురించనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పోలింగ్ కేంద్రాలను ఈ నెల 14న గుర్తించాల్సి ఉంది. దీని వివరాలను 15న ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులను 15, 16న స్వీకరించాల్సి ఉంది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను 16న, జిల్లా ఎన్నికల అధికారి గుర్తించిన పోలింగ్ కేంద్రాలకు 18న అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆపై వివరాలను 19న వెల్లడించాలి. నూతన జెడ్పీ యాజమాన్య పరిధి మేరకు ఎన్నికల జరగనున్నాయి. జెడ్పీ పరిధిలోకి 35 మండలాలు రానుండటంతో ఆ మేరకు జరపనున్నారు. అక్రిడిటెడ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న అక్రిడిటేషన్ కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీని కల్పించాలనే ఉత్తర్వులను కలెక్టర్ హిమాన్షు శుక్లా జారీ చేశారని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి విరుద్ధంగా వ్యవహరించే పాఠశాలల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత అసోసియేషన్ల నుంచి పొందాలని కోరారు. ఫీజు రాయితీని పొందేందుకు గానూ 2025 – 26కు సంబంధించిన అక్రిడిటేషన్, తల్లిదండ్రుల ఆధార్కార్డులు, పేర్లు, విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, విద్యార్థి పేరు, చదువుతున్న పాఠశాల, చిరునామా, తరగతి, అడ్మిషన్ నంబర్ను దరఖాస్తుతో పాటు జత చేయాలని కోరారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు దరఖాస్తులపై ఎంఈఓ.. ఆరు నుంచి పదో తరగతి వరకు డిప్యూటీ డీఈఓలు కౌంటర్ సంతకాలు చేయాలని సూచించారు. బ్యాంక్ సేవలకు నాలుగు రోజులు బ్రేక్ నెల్లూరు(అర్బన్): జిల్లాలోని బ్యాంకులు శుక్రవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆలిండియా బ్యాంక్ యూనియన్ల పిలుపు మేరకు సమ్మెలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం పాల్గొననున్నారు. ఆపై రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా సోమవారం వరకు బ్యాంకులు పనిచేయవు. దీంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకునే ప్రమాదముంది. ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అవసరమైన నగదును సిద్ధంగా ఉంచుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 17న జెడ్పీ సర్వసభ్య సమావేశం నెల్లూరు(పొగతోట): నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 17వ తేదీ ఉదయం 10.30కు నిర్వహించనున్నామని సీఈఓ వసుమతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశంలో డ్వామా, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, గృహ నిర్మాణ తదితర శాఖలతో సమీక్షించనున్నారని చెప్పారు. జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 71,297 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,783 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.5.59 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
నెల్లూరు
7బంగారం ధరలు 24 క్యారెట్లు (10 గ్రా) రూ.1,58,240 22 క్యారెట్ల ఆర్నమెంట్ (గ్రా) రూ.14,229 3 శాతం జీఎస్టీతో రూ.14,656 సవర (8 గ్రా) రూ.1,17,248 వాతావరణం జిల్లాలో ఎండ తీవ్రత గురువారం సైతం కొనసాగే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. గాలిలో తేమ 43 శాతంగా బుధవారం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములుసోమశిలలో 16.58 టీఎంసీలు సోమశిల: సోమశిల జలాశయంలో బుధవారం సాయంత్రానికి 16.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3050 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
ఎలాంటి ఆదరవు లేని వారికి ప్రభుత్వమిచ్చే పింఛనే ఆధారం. కూటమి సర్కార్ కొలువుదీరాక నూతనంగా మంజూరు చేయక ఎంతో మంది అర్హులకు అంతులేని కష్టాన్ని మిగిల్చింది. తాజాగా వీటిని ఇస్తామని చెప్పి, అనేక మందిలో ఆశలను చిగురింపజేసి, ఆపై చుక్కలు చూపుతోంది. ఫలితంగా దరఖాస్తు
కలువాయికి చెందిన గంటా వాసు, కృష్ణవేణి దంపతుల కుమార్తె కీర్తన. పుట్టుకతోనే శారీరక లోపంతో ఈమె జన్మించారు. అంగవైకల్యంతో బాధపడుతున్నా, కొత్తగా పింఛన్ను మంజూరు చేయలేదు. దీని కోసం అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తల్లిదండ్రులు ప్రదక్షిణలు చేసినా కనికరం చూపే వారే కరువయ్యారు. ప్రజాదర్బార్లో ఎమ్మెల్యేకు వినతిపత్రమిచ్చి, నిరీక్షించినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. జిల్లా ఉన్నతాధికారులైనా కరుణిస్తారేమోనని వీరు ఆశిస్తున్నారు. నెల్లూరులోని జెండావీధికి చెందిన రెహనాబేగానికి రెండు కాళ్లు లేవు. ట్రైసైకిల్పై ఆధారపడి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పింఛన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా, దీనికి సంబంధించిన రసీదును ఇవ్వలేదు. మరోసారి చేసుకోవాలో.. లేదో తెలియక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య వీరి ఒక్కరిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఎందరో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నెల్లూరు(పొగతోట): టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ 27 నెలల్లో కొత్తగా ఒక్క పింఛన్ను సైతం మంజూరు చేయలేదు. ఫలితంగా అర్హతున్న ఎంతో మంది ఎప్పటికై నా ఈ సర్కార్ కనికరించదానని నిరీక్షించారు. చివరికి ఏదో ఇస్తున్నామని ప్రకటించడంతో వీరిలో ఆశలు చిగురించాయి. అయితే ఇక్కడే అసలు చిక్కులు మొదలయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక సచివాలయాల వద్ద కొందరు సొమ్మసిల్లి పోతుండగా, మరికొందరు పడరాని పాట్లు పడుతున్నారు. సాకులు చూపుతూ పంగనామం సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనను తాజాగా విధించారు. అయితే అక్కడ సర్వర్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు పనిచేస్తుందో తెలియక ఎంతో మంది మంది ఉదయం నుంచే నిరీక్షించాల్సి వస్తోంది. వాస్తవానికి ఇది పనిచేస్తే వివిధ రకాల సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, పదెకరాలకుపైగా భూములు, ఆదాయ పన్ను.. ఇలా వివిధ కొర్రీలను తెరపైకి తెచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాన్నే దూరం చేస్తున్నారు. అప్లయ్ చేసుకునేందుకు ఇచ్చిన సమయమే తక్కువని, ఈ తరుణంలో కొర్రీలు విధించి తమకు అంతులేని శోకాన్ని మిగిలిస్తున్నారనే ఆవేదన పలువురిలో వ్యక్తమవుతోంది. ఇంటి పన్ను కడితేనేనంట..! ఇంటి పన్నును చెల్లించామనే రసీదును అప్లోడ్ చేస్తేనే నూతనంగా మంజూరు చేస్తామనే నిబంధనను సర్కార్ తీసుకొచ్చింది. నిజానికి పింఛన్లు పొందే వారిలో అత్యధికులు పేదవారే. వీరిలో ఎక్కువ మంది పూరి గుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. పన్ను పరిధిలోకి రాని తాము వీటిని ఎక్కడ్నుంచి తీసుకురావాలని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇవ్వాలనే ఉద్దేశం లేకపోతే స్పష్టంగా చెప్పాలే గానీ, ఇలాంటి వాటితో తమనెందుకు కష్టాలకు గురిచేస్తున్నారని వీరు ప్రశ్నిస్తున్నారు. గడువు తక్కువ.. ఆ మధ్యలో సెలవులు పీజీఆర్ఎస్, ఎంపీడీఓల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం గతంలో ఉండేది. అయితే వీరు మరోసారి దరఖాస్తు చేయాలా.. వద్దాననే అంశమై అధికారుల నుంచి స్పష్టత కొరవడింది. మరోవైపు కొత్తగా కావాలనుకునే వారు దాఖలు చేసుకునేందుకు ఈ నెల ఏడు నుంచి 16 వరకు అవకాశం కల్పించారు. పేరుకు పది రోజుల సమయమిచ్చినా, ఇందులో రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులొస్తాయి. ఇక మిగిలిన ఏడు రోజుల్లో ఎంత మంది నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ఎంత మందికి ఇస్తారో దేవుడికే ఎరుక. అందుబాటులో ఉన్న బడ్జెట్ మేరకేనా..? అర్హులందరికీ ఇస్తామని ప్రభుత్వం పైకి చెప్తున్నా, అదంతా బూటకమేననే వాదనా లేకపోలేదు. అందుబాటులో ఉన్న బడ్జెట్ మేరకే కేటాయిపులుంటాయనే టాక్ అధికారుల్లోనే నడుస్తోంది. మరోవైపు పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. వీరిలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, కల్లుగీత, చేనేత కార్మికులు తదితరులున్నారు. ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు వీరు పెద్ద ఫీట్లే చేయాల్సి వస్తోంది. కొత్తగా మంజూరు చేస్తామంటూ ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం అయితే పట్టపగలే చుక్కలు చూపిస్తున్న వైనం సాంకేతిక సమస్యలతో సతమతం సచివాలయాల వద్ద తప్పని నిరీక్షణ దరఖాస్తు దాఖలుకు అర్హుల పాట్లు అందరికీ మంజూరు కష్టమే..పింఛన్లు పొందే విషయంలో అర్హులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకూడదని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఆయన ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఎంతో ఊరటనిచ్చింది. ఆ సమయంలో అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా.. అర్హుల ఇళ్ల నుంచే దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఫలితంగా అంతా సజావుగా జరిగి, మరుసటి నెల నుంచే పింఛన్లను అందుకునేవారు. దీంతో ఎంతో మంది సంతోషంగా ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సీఎం చంద్రబాబు తన మార్కు రాజకీయాలకు పదును పెట్టి వలంటీర్ వ్యవస్థనే ఎత్తేశారు. ఫలితంగా నాటి నుంచి దరఖాస్తు చేసుకోవాలంటే ఓ యుద్ధమే చేయాల్సిన పరిస్థితిని సర్కార్ తీసుకొచ్చింది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. -
గంధ మహోత్సవం.. భక్తి పారవశ్యం
● కసుమూరు, ఏఎస్పేటలో వైభవంగా కార్యక్రమాలు ● కసుమూరులో వసతుల్లేక భక్తుల అవస్థలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న కడప పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేనీవెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గా 249వ గంధ మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. దర్గాకు కిలోమీటర్ దూరంలోని చందన్మహాల్ నుంచి మంగళవారం అర్ధరాత్రి గుర్రంపై గంధాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. కాగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తలదాచుకునేందుకు సరైన వసతుల్లేక అవస్థలు ఎదుర్కొన్నారు. గంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో ఊరేగింపు తిరిగి కొనసాగింది. ఉదయం 7 గంటలకు గంధాన్ని దర్గా వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కసుమూరు వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. దర్గా వద్ద కడప పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేనీ మస్తాన్వలీ సమాధిపై చద్దర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గంధం బిందెను దర్గా ముజావర్లకు అందజేయగా, వారు భక్తులకు పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య తగ్గింది. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్గాను సందర్శించిన ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఇంకా శివమణి కసుమూరు దర్గాను సందర్శించారు. వసతుల కల్పనలో వక్ఫ్ బోర్డు వైఫల్యం భక్తులకు వసతులు కల్పించడంలో వక్ఫ్ బోర్డు అధికారులు విఫలమయ్యారు. ఈ ఏడాది గంధ మహోత్సవంపై సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.19 లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా ఈవో షరీఫ్ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చందన్మహాల్ ప్రాంగణం, మస్తాన్వలీ దర్గా పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించింది. వర్షం కారణంగా కసుమూరు ప్రధాన వీధిలోని సైడ్ కాలువల మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో దుర్వాసనతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మొబైల్ టాయిలెట్లు కూడా పరిమిత సంఖ్యలోనే ఏర్పాటు చేయడంతో మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామంలో సరైన లైటింగ్ లేక వీధులు చీకటిమయంగా మారాయి. రూ.19 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్న నేపథ్యంలో వాటిని ఏయే ఏర్పాట్లకు ఎంత ఖర్చు చేశారో అధికారులు వివరించాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేశారు. తహలీల్ ఫాతెహా నేడు గంధ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం తహలీల్ ఫాతెహా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్లు తెలిపారు. -
మార్కెట్లోకి మారుతి న్యూ బాలెనో కారు
నెల్లూరు(టౌన్): ది స్టన్నింగ్ మారుతి న్యూ బాలెనో కారును నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలోని భార్గవి ఆటోమొబైల్స్ నెక్సా షోరూమ్లో బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ దాస్యం శ్రీనివాస్, భార్గవి ఆటోమొబైల్ చైర్మన్ కొండా బలరామిరెడ్డి, మారుతి సుజుకి టీఎస్ఎం సందీప్, మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు. పెట్రోల్కు సంబంధించి మైలేజీ మాన్యువల్ 23.08, ఏజీఎస్ ట్రాన్స్మిషన్ 24.77 కిలోమీటర్లు వస్తుందన్నారు. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్ – సీఎన్జీ మైలేజీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 33.61, సీఎన్జీ ఏజీఎస్ ట్రాన్స్మిషన్ 34.47 కి.మీ వస్తుందన్నారు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, యాక్టింగ్ కూలింగ్తో వైర్లెస్ చార్జర్, హెడ్ అప్ డిస్ప్లే 360 డిగ్రీల వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్లు ఉన్నాయన్నారు. కారు ప్రారంభ ధర రూ.6.09,900లు ఉందన్నారు. ఇది ఏడు రంగుల్లో లభ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో భార్గవి ఆటోమొబైల్ సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమి పాలనలో కోవూరులో అవినీతి తాండవం
● మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ● బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం బుచ్చిరెడ్డిపాళెం/కోవూరు: ‘కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం లేదు. అవినీతి, అక్రమాలకే పెద్దపీట వేస్తున్నారు. కోవూరులో అవినీతి తాండవం చేస్తోంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు. మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. అనిల్ మాట్లాడుతూ కొందరు నాయకులు సేవ చేసింది గోరంత.. ప్రచారం చేసుకుంటున్నది కొండంత అంటూ ఎద్దేవా చేశారు. కోవూరు నుంచి చైన్నె వైపు ఇసుక తరలింపు వెనుక అధికార పార్టీ నాయకుల అండ ఉందని ఆరోపించారు. సహజ వనరులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటి దోపిడీని అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి కంటే రాజకీయ కక్షపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసే ముందు ప్రజలకు చేసిన సేవ చూపించాలన్నారు. ప్రజలను మోసం చేసి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరన్నారు. పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప ప్రత్యేకంగా వీపీఆర్ దంపతులు ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదన్నారు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇతర ప్రాంతాల నాయకులను ఇక్కడికి తీసుకొచ్చి పెత్తనం చేయిస్తున్నట్లు చెప్పారు. కాలభైరవుడు మీ అంతు చూస్తాడు ప్రసన్న మాట్లాడుతూ అనిల్కుమార్ యాదవ్ ఆధారాలతో వీపీఆర్ దంపతుల అవినీతిని బయటపెట్టారన్నారు. వాటికి సమాధానం చెప్పే ధైర్యం, దమ్ము వారికి లేదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తమను ప్రశాంతిరెడ్డి కుక్కలతో పోల్చారని, అవి విశ్వాసానికి ప్రతీక అన్నారు. తాము పదవులు పొంది పార్టీకి నమ్మకద్రోహం చేసిన వారు కాదన్నారు. కుక్కలు సాక్షాత్తు కాలభైరవ స్వరూపాలని ప్రజలకు, తమను నమ్మిన వారికి విశ్వాసంగా ఉంటాయన్నారు. అలాంటి కాలభైరవుడే మీలాంటి రాక్షసుల అంతు చూస్తాడని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేసే వీపీఆర్ దంపతులు తమను ఏనుగులతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీగా మారడం, అభివృద్ధి పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లుగా గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డబ్బులకు అమ్ముడుపోయే వారిని కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే నమ్మకమైన వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. మాట ఇస్తే తప్పని నాయకుడు జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, నగర పంచాయతీ అధ్యక్షుడు ఎస్కే షాహుల్, రూరల్ అధ్యక్షుడు సతీష్రెడ్డి, కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినికి తేలుకాటు
కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని తేలుకాటుకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జిర్రావారిపాళెం గ్రామానికి చెందిన పర్రే మంజుల ఉదయం పాఠశాలలో ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి పుస్తకాల కోసం డెస్క్లో చేయి పెట్టగా అక్కడున్న తేలు కుట్టింది. నొప్పితో వెంటనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు బాలికను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స చేయించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఎంపీ పేరు లేకుండానే ఆహ్వానపత్రికలు
● ఆలయ అధికారుల ప్రోటోకాల్ ఉల్లంఘన చిట్టమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో దేవదాయ శాఖ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంలో అధికారులు ముందున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలతో పాలకమండళ్లు ఏర్పాటైన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధిని విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల గూడూరు, చిల్లకూరు మండలాల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన కుంభాభిషేక వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, వాల్పోస్టర్లలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చిట్టమూరు మండలం మల్లాంలోని ప్రసిద్ధ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్పోస్టర్లలోనూ ఎంపీ పేరును ప్రస్తావించలేదు. ఆలయంలో బుధవారం వాటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పేరు ఎందుకు ముద్రించలేదని ఈఓ కుడారి పెంచల వరప్రసాద్ను ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆహ్వాన పత్రికలు ముద్రించారని సమాధానం ఇచ్చారు. -
ఏఎస్పేట దర్గాలో..
అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి 253వ గంధ మహోత్సవం మంగళవారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది. మాజీ పీఠాధిపతి షా గులాం నక్ష్బంద్ హఫీజ్ పాషా స్థానిక మహల్లో తొలుత గంధం ఎత్తారు. దర్గా కార్యాలయం నుంచి ఈఓ మహమ్మద్ హుస్సేన్ గంధానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలను అందజేశారు. ఫకీరుల డప్పు వాయిద్యాలు, నవరంగ్ మేళాలు, బ్యాండ్ మేళాలు, బాణసంచా పేలుళ్ల మధ్య పూల పల్లకితో గంధం, పూల చద్దర్లు, గలేఫులను ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు. హజరత్ వారి సమాధికి గంధం పట్టించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంపిణీ చేశారు. రెండోసారి.. కోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్ ఇంటి వద్ద కూడా దర్గా నుంచి తీసుకొచ్చిన గంధాన్ని హజరత్ వారి సమాధికి పట్టించి భక్తులకు పంపిణీ చేశారు. ఒకేరోజు రెండు వేర్వేరు మహళ్ల నుంచి గంధం దర్గాకు చేరుకోవడంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. ప్రశాంతంగా.. గంధ మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సంగం, ఆత్మకూరు సీఐలతోపాటు పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
బాబు, లోకేష్కు తెలియకుండా జీవోలు వచ్చాయా?: డీఎస్సీపై కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఏపీలో డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచీ తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. అక్రమాలు లేవని చెప్పిన ప్రభుత్వం, ఆధారాలు బయటకు వచ్చి ప్రజల్లో చర్చ మొదలయ్యాక విచారణకు సిద్ధమంటూ మాట మార్చడం సరికాదని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన.. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డీఎస్సీ అక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాత్ర ప్రత్యక్షంగా ఉంది. కర్నూలుకి చెందిన ప్రభాకర్ ఉదంతంపై కమిటీ వేశారు.. ఉద్యోగం ఇచ్చాక కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? వ్యక్తిగత అర్హత గురించి విద్యార్హత గురించి పట్టించుకోకుండా నియామకాలు జరిపి మేము అక్రమాలు బయటకు వచ్చాక సంబంధం లేని వాదనలు వినిపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా విషయంలో అక్రమాలు జరిగినట్టు తేటతెల్లం కాగా అసోసియేషన్లపై నెపం నెడుతున్నారు. స్పోర్ట్స్ పత్రాల్లో అసలైన సంతకాలు ఉన్నాయా లేదా చెప్పాలి? క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు తెలిసే ఇదంతా జరిగింది. కాబట్టి తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తున్నారు. అందుకే క్లీన్ చిట్ ఇవ్వలేకపోతున్నారు. అసలు టోర్నమెంట్లు నిర్వహించకుండానే క్రీడాకారులకు సర్టిఫికెట్ ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాద్ధాంతం అయ్యాక ఇప్పుడు అసోసియేషన్లను అడుగుతామంటున్నారు. ఇది ముమ్మాటికీ మీరు చేసిన పాపం.. ఫలితంగా నిరుద్యోగులు బాధపడే స్థాయికి తెచ్చారు. తప్పు జరగలేదు అంటే ఇన్ని రకాల ఎంక్వయిరీలు ఎందుకు చేస్తున్నారు?.డీఎస్సీపై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లారు.. బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు?. సీఎంకు తెలియకుండానే జీవోలు వచ్చాయా? ఆయన సంతకం చేయకుండానే ఫైల్స్ కదిలాయా? కాబట్టి ఇందులో ప్రత్యక్ష నిందితులు చంద్రబాబు, లోకేష్ అని ఖచ్చితంగా చెప్తున్నాం. న్యాయం అడుగుతుంటే మా గొంతు నొక్కుతున్నారు.. దమ్ముంటే రాజకీయంగా మాట్లాడండి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పనికిరాదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా లోపాలను ఒప్పుకోండి. స్పష్టమైన ప్రకటన చేయండి. విచారణ చేసి నిజాలపై వివరణ ఇవ్వండి. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా డీఎస్సీ అక్రమాలపై పోరాటం ఆపేది లేదు. శాఖాపరంగా, ప్రభుత్వం పరంగా అనేక రకాలుగా పొరపాట్లు జరిగాయి. ఇవన్నీ ప్రజలకు తెలియాలి అంటే సీబీఐ విచారణ జరిపించాలి. అంతులేని అక్రమాలకు కారకుడైన మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: మెగా డీఎస్సీల్లో అక్రమాలు ‘ఖోఖో’ల్లలు -
వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు, భద్రత, నిమజ్జన కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. గణేష్ ఘాట్, రంగనాథస్వామి దేవస్థాన సమీపంలోని పెన్నా బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గణేష్ మండపాలకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో పూడిక తొలగించి, నీటి లోతును గుర్తించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఊరేగింపు మార్గాల్లో గుంతలు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులను ముందుగానే తొలగించాలన్నారు. డీజేలు, మైక్లు, ఊరేగింపు సమయాలకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో విజయ్కుమార్, ఏఎస్పీ సౌజన్య, ఆర్డీఓ అనూష, వివిధ శాఖల అధికారులు, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జగన్ను కలిసిన పర్వతరెడ్డి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మంగళవారం కలిశారు. నగర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న చర్యలను వివరించారు. సోమశిలలో 16.85 టీఎంసీలు సోమశిల: సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 16.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎండ తీవ్రతకు 133 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. పెన్నా డెల్టాకు 2700, కండలేరు కాలువకు 350 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయంలో 87.066 మీటర్ల నీటిమట్టం నమోదైంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 69,440 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించండి నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్లకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులను ఈ నెల 16 నుంచి స్వీకరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా నెల్లూరు బ్యారే జీ సందర్శన నిమిత్తం వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, నెల్లూరు రూరల్, గూడూరు సమన్వయకర్తలు ఆనం విజయకమార్రెడ్డి, గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, మరికొందరిపై కేసులను సంతపేట పోలీసులు నమోదు చేశారు. -
భక్తిశ్రద్ధలతో గంధ మహోత్సవాలు
● కసుమూరు, ఏఎస్పేటకు పోటెత్తిన భక్తులు వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గా 249వ గంధ మహోత్సవాలు మంగళవారం రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సందడి మొదలైంది. భక్తులు తొలుత దర్గాను సందర్శించి, గంధ మహోత్సవం ప్రారంభమయ్యే చందన్మహల్ వద్ద సేదతీరారు. కాగా ఏర్పాట్లకు వక్ఫ్ బోర్డు రూ.19 లక్షలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. దర్గా ప్రాంగణంతోపాటు పలుచోట్ల విద్యుద్దీపాలు, దర్గాకు పెయింటింగ్, పారిశుద్ధ్య పనులు చేపట్టామంటున్నారు. గంధ మహోత్సవం సందర్భంగా తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా గంధం దంచిన మహిళలు అనుమసముద్రంపేట: హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో 253వ గంధ మహోత్సవం సందర్భంగా మహిళలు గంధం దంచేందుకు పోటీ పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు మంగళవారం దర్గాకు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దర్శనం అనంతరం మహిళలు గంధం దంచేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. మహల్ వద్ద ముతవల్లీ హఫీజ్పాషా గంధం దంచేందుకు ఏర్పాటు చేయగా మరో వర్గం ఫయాజ్ అహ్మద్ తన ఇంటి వద్ద చర్యలు తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటీవలే ఇద్దరు గంధం దంచేందుకు అధికారం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇరువర్గాలకు అనుమతి ఇచ్చింది. -
బుల్లెట్ తగిలి వ్యక్తికి గాయాలు
నెల్లూరు సిటీ: బుల్లెట్ తగిలి వ్యక్తి గాయపడిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్లలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల వద్ద పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకుని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. దీనికి సమీపంలో నిమ్మతోట ఉంది. అందులో రూరల్ పరిధిలోని కొల్లంపూడికి చెందిన సీతారామయ్య పనిచేస్తున్నాడు. మంగళవారం అతను తోటలో ఉండగా బుల్లెట్ తగిలింది. యజమానికి సమాచారం తెలియడంతో 108 అంబులెన్స్లో బాధితుడిని హాస్పిటల్కు తరలించాడు. ఫైరింగ్ సమయంలో బుల్లెట్ సీతారామయ్య ఛాతిలో లేదా తలకు తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రెడ్క్రాస్ సభ్యులు వివరాలు సరిచూసుకోవాలి నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖలో జీవితకాల సభ్యులుగా నమోదైన వారు తమ పేరు, ఇతర వివరాలను నగరంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో సరిచూసుకోవాలని సొసైటీ సెక్రటరీ మస్తానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యుల ఫొటోలు నమోదు కాకపోయినా, ఇప్పటికే ఉన్న వివరాల్లో మార్పులు, సవరణలు చేయాల్సి ఉన్నా వెంటనే కార్యాలయానికి వచ్చి సరిచేసుకోవాలని కోరారు.ఇంట్లో విద్యుత్ పనులు చేస్తూ.. ● షాక్తో వ్యక్తి మృతి చిల్లకూరు: విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కలవకొండ గ్రామంలో బూదూరు రమేష్ (35) అనే వ్యక్తి తన అన్న ఇంట్లో విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. చిల్లకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశారు. రమేష్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కండలేరులో 18.22 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 18.22 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వాహనాలు.. యమదూతలు
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి ఆత్మకూరు: ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్న యువతి ఆటోలో ప్రయాణిస్తూ అది బోల్తాపడి మృతిచెందిన ఘటన ఆత్మకూరులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై జంపానికుమార్ కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి దళిత కాలనీకి చెందిన బొగ్గవరపు మహాలక్ష్మి (23), నాగేంద్రబాబు దంపతులు. ఆమె పట్టణంలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబ పోషణకు తనవంతుగా కష్టపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరింది. డ్రైవర్ ప్రభు వాహనాన్ని అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మహాలక్ష్మి రోడ్డుపై పడిపోయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని వారు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. దగదర్తి: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అల్లూరు రోడ్డు జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెన వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన దీపంకర్ బర్మన్ అనే యువకుడు సోమవారం రాత్రి అల్లూరు రోడ్డు రైల్వే వంతెనపై నెల్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో బర్మన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్, దగదర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పశ్చిమ బెంగాల్ వాసిగా గుర్తించారు. అక్కడి పోలీస్స్టేషన్లో తెలియజేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేంద్ర తెలిపారు. -
నిమ్మ ధరలు అదుర్స్
● బస్తా కాయలు రూ.18 వేలు పొదలకూరు: నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తా (లూజు) కాయల ధర రూ.18 వేలు పలుకుతోంది. దిగుబడి లేకపోవడంతో రేట్లు ౖపైపెకెళ్తున్నాయని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్ పరిధిలోని నాలుగైదు మండలాల్లో గల తోటల్లో కాయల్లేకపోవడంతో ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. పది కిలోల కాయలున్నా రూ.రెండు వేలకుపైగా తీసుకెళ్తున్నారు. పొదలకూరులోని యార్డులో బస్తాలకు బస్తాలను తోలుకొచ్చే రైతులు ఇప్పుడు స్వల్పంగా తీసుకొస్తున్నారు. కొందరైతే పది కిలోలను సైతం కవర్లలో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోల్లెక్కన చూస్తే రూ.150 నుంచి రూ.225 వరకు ధరలు లభిస్తున్నాయి. ఆటోల్లో ఎగుమతులు సీజన్లో నిత్యం పది నుంచి 15 లారీల్లో నిమ్మకాయలను వివిధ రాష్ట్రాలకు తరలించే వ్యాపారుల్లో కొందరు ప్రస్తుతం ఆటోల్లో సైతం చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటల నుంచి బస్తా కాయలను తెచ్చే రైతు లేకుండాపోయారని పేర్కొంటున్నారు. -
అధికారాన్ని అడ్డుపెట్టుకుని..భూ ఆక్రమణలు
వరికుంటపాడు: మండలంలోని డక్కునూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొందరు అధికార పార్టీ నాయకులు, భూ ఆక్రమణదారులు పాగా వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పశువుల మేతకు ఉపయోగపడే పోరంబోకు భూములను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డక్కునూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 240లో సుమారు మూడెకరాల భూమిలో ముళ్లచెట్లను యంత్రాలతో తొలగించి, భూమిని చదును చేసి బోరు వేశారు. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని వారు పేర్కొంటున్నారు. ఆదివారం కూడా జేసీబీతో సదరు భూమిలో చదును పనులు చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, మండలంలోని పలు ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారిపై ఆక్రమణల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.యథేచ్ఛగా పశువుల మేత పోరంబోకు కబ్జా ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణకు డిమాండ్ డక్కునూరు సర్వే నంబర్ 240లోని భూమిపై రెవెన్యూ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే భూమిని స్వాధీనం చేసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా పశువుల మేత పోరంబోకు భూమిలో ఎలాంటి లేఅవుట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
రాజీ చేస్తానని పిలిచి.. వ్యక్తిపై కత్తిపోట్లు
● పేకాట క్లబ్ నిర్వాహకుడి దారుణం ● భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం కావలి: భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తానంటూ మధ్యవర్తిత్వానికి పిలిచి.. చివరకు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం మద్దూరుపాడులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మద్దూరుపాడులో నివాసముంటున్న బొమ్మిరెడ్డి శ్రీనివాసులు, అతని భార్య శేషమ్మ మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే అదే గ్రామంలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న కొండేటి సుబ్రహ్మణ్యం ఇటీవల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని.. రాజీ కుదురుస్తానని చెప్పినట్లు బాధితుడు ఆరోపించాడు. రాజీ కుదరకపోగా.. విభేదాలు మరింత పెరిగాయని చెబుతున్నాడు. ఈ క్రమంలో మరోసారి రాజీ చేస్తానంటూ సుబ్రహ్మణ్యం మంగళవారం తనను పిలిచాడని, ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమోనని భావించి మద్దూరుపాడుకు వెళ్లానని శ్రీనివాసులు తెలిపాడు. అయితే సుబ్రహ్మణ్యం వాదనకు దిగి.. ఉన్నట్టుండి కత్తితో దాడి చేసినట్లు ఆరోపించాడు. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అసలు వివాదానికి కారణాలేంటి?, కత్తితో దాడి చేసే పరిస్థితి ఎందుకొచ్చింది?, దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడికి న్యాయం చేయడంతోపాటు దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మద్యానికి బానిసై భార్యకు వేధింపులు
● ఆత్మహత్య చేసుకున్న వివాహిత ● తల్లిని కోల్పోయిన ఐదు నెలల చిన్నారి మర్రిపాడు: ఆ చిన్నారికి లోకం ఇంకా తెలియదు.. అమ్మే తన ప్రపంచం. ఐదునెలల వయసులోనే తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటంతో మండలంలోని డీసీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన చాంద్ బాషాకు చీరాలకు చెందిన షేక్ హనీ (22)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఐదునెలల బాబు ఉన్నాడు. హనీ తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నారు. చాంద్ బాషా డీసీపల్లిలో దుకాణాన్ని అద్దెకు తీసుకుని పవర్ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్నాడు. అదే ఊరిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. హనీ భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి యజమాని తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి హనీ మృతిచెందినట్లు గుర్తించారు. ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సైలు జంపాని కుమార్, శ్రీనివాసులురెడ్డి, మర్రిపాడు ఏఎస్సై శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృతి విషయం తెలియగానే చాంద్ బాషా పరారయ్యాడు. అతడిని నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
చీకటి ఒప్పందాలతో దగా
● శ్రీశైలం జలాలను సోమశిలకు వెంటనే విడుదల చేయాలి ● ఏ ప్రయోజనాలను ఆశించి తెలంగాణకు తాకట్టు పెట్టారు..? ● రైతులను సర్కార్ ఆదుకోకపోతే పంటలు ఎండిపోవడం ఖాయం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● అన్నదాతలతో కలిసి నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ నిరసన ● సాగునీటి కోసం కదంతొక్కిన రైతాంగం నెల్లూరు రూరల్: శ్రీశైలంలో జలాలు పుష్కలంగా ఉన్నా.. దిగువ ప్రాజెక్టులకు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కరువును సీఎం చంద్రబాబు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు నీటిని వెంటనే విడుదల చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్తో నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ నిరసన ప్రదర్శనను కాకాణి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పార్టీ నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. నిత్యం ఐదు టీఎంసీలను తెలంగాణ తరలించుకెళ్తున్నా, ఇక్కడి ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ ప్రయోజనాలను ఆశించి శ్రీశైలం జలాలను తాకట్టు పెట్టారని నిలదీశారు. మీనమేషాలను లెక్కిస్తున్న సర్కార్ శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నా, సోమశిలకు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకో మీనమేషాలను లెక్కిస్తోందన్నారు. నిత్యం ఒక టీఎంసీ చొప్పున తరలించే అవకాశమున్నా, స్పందించడంలేదని మండిపడ్డారు. ఇరిగేషన్ నిపుణులమని చెప్పుకొనే అధికార పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు..! చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలని, రైతుల కష్టాలకు ఇవే ప్రతీకలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు, తాగునీటి సమస్యలు చుట్టుముట్టాయని ఆరోపించారు. నెల్లూరు డెల్టా పరిధిలోని రైతులకు నీటి యాజమాన్య హక్కులున్నాయని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, సాగు, తాగునీటి సరఫరాపై ఎలాంటి సమీక్షలను నిర్వహించడంలేదని విమర్శించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగానికి కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. అన్నదాతల పేరిట నిధులు, బిల్లుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. బ్యారేజీలకు పేర్లు మారుస్తారా..? నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్ పునాది వేయగా, జగన్మోహన్రెడ్డి హయాంలో వీటిని పూర్తి చేసి జాతికి అంకితం చేశారని చెప్పారు. వీటికి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి పేర్లు పెట్టగా, వాటిని తొలగించి పెయింట్లు వేయించడం దారుణమన్నారు. కొత్త ప్రాజెక్టులను నిర్మించే ధైర్యం సర్కార్కు లేదని, మహనీయుల పేర్లు తొలగించేందుకు మాత్రం జీఓలను జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టలేరు ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి అణిచేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కోవూరులో ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సీఈఓ శ్రావణ్పై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టారనే అంశం భవిష్యత్తులో జరపబోయే విచారణలో తేలితే ఇలాంటి వారిని చంద్రబాబు, లోకేశ్ సైతం కాపాడలేరని హెచ్చరించారు. ఆధారాలతో సహా అనిల్కుమార్యాదవ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి తమ పార్టీ శ్రేణులను నిలువరించలేరన్నారు. ఎమర్జెన్సీ, బ్రిటిష్ కాలం నాటి పాలనను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తలపిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నామని ప్రకటించారు. కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఖలీల్ అహ్మద్, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వర్రెడ్డి, సిటీ నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, కిషన్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న కాకాణి, శైలజానాథ్, విజయకుమార్రెడ్డి, గురవయ్య, చలపతిరావు తదితరులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందాన్ని చేసుకొని రాష్ట్ర రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారని వీరి చలపతి ధ్వజమెత్తారు. రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా మేలు చేసిందానని ప్రశ్నించారు. పోలీసులెన్ని ఆంక్షలను విధించినా ఆగేది లేదన్నారు. ప్రభుత్వానికి భయం పట్టుకుంది ప్రజా సమస్యలపై తమ పార్టీ శ్రేణులు బయటకొస్తుంటే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే పోలీసులను ఉపయోగించి అరాచకానికి పాల్పడుతోందని శైలజానాథ్ ఆరోపించారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో పంటలెండిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులు నష్టపోతుంటే.. అధికారులు, పాలకులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని డబ్బులు లెక్కబెట్టుకోవడం సరికాదని విమర్శించారు. అమరావతిలో టీడీపీ నేతలకు నిధులు కేటాయిస్తున్న మంత్రి నారాయణ.. జిల్లా రైతాంగానికి నీరివ్వలేరానని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును గుర్తుచేసుకొని ఆయనలా పనిచేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, అయితే వంద జన్మలెత్తినా అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమంలో వైఎస్సార్ తర్వాత జగన్మోహన్రెడ్డి మాత్రమే ముందున్నారని చెప్పారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న రీతిలో చంద్రబాబు తీరు ఉందని, చివరికి వాతలే మిగులుతాయని విమర్శించారు. -
ఎస్సీ నేతపై రెడ్బుక్ రాజ్యాంగం
● టీడీపీలో ఉండి ప్రశ్నించడంతో మౌనం ● వైఎస్సార్సీపీలో చేరడమే నేరం ● గంటల వ్యవధిలో వరుస కేసులతో భయభ్రాంతులు ● పల్లి కోటేశ్వరరావును అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ● అయినా అరెస్ట్ చేస్తే.. గూడూరు కోర్టు బెయిల్ ● మళ్లీ అదుపులోకి తీసుకుని మరో రెండు కేసులు నమోదు బెయిల్ మంజూరు గూడూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పల్లి కోటేశ్వరరావుపై పోలీసుల ద్వారా అక్రమ కేసులను అధికార పార్టీ నేతలు బనాయించి రిమాండ్కు పంపాలని చూసినా, ఆయనపై పెట్టిన కేసులను పరిశీలించిన కోర్టు బెయిల్ను మంజూరు చేసిందని పార్టీ లీగల్ సెల్ న్యాయవాది రాఘవరెడ్డి తెలిపారు. ఈ మేరకు వివరాలను పట్టణంలో మంగళవారం ఆయన వెల్లడించారు. తమ వద్ద పల్లి కోటేశ్వరరావు బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడ్డారంటూ అధికార పార్టీకి చెందిన వారు కేసు పెట్టారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఊరట లభించిందని చెప్పారు. అయినా గూడూరు ఒకటో పట్టణ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో హాజరుపర్చారని, వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ను మంజూరు చేసిందని వివరించారు. మరో కేసు నమోదైందంటూ వెంటనే ఆయన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో మంగళవారం హాజరుపర్చారని, అక్కడ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకీభవించి బెయిల్ను మంజూరు చేశారని చెప్పారు. కోటేశ్వరరావుపై మోపిన అన్ని కేసుల్లో ఊరట లభించిందన్నారు. గూడూరు: ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఓ ఎస్సీ నేతపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాక్షసం ప్రదర్శిస్తున్నారు. గూడూరులో అధికార పార్టీ అండదండలతో సాగుతున్న భూకబ్జాలు, అక్రమాలు, దందాలను అదే పార్టీలో గూడూరు పట్టణ ఎస్సీ సెల్ నాయకుడు పల్లి కోటేశ్వరరావు గత నెల 21న ధర్మరాజుల స్వామి ఆలయంలో జరిగిన భూముల లీజు వేలంపై ప్రశ్నించాడు. అంతకు ముందూ అక్రమాలను ప్రశ్నించాడు. అయితే ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరడమే నేరంగా భావించి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పోలీసులను అడ్డు పెట్టుకుని వరుసగా అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక కేసులో కోర్టు నుంచి ఊరట లభించిన వెంటనే మరో అక్రమ కేసు నమోదు చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసి గూడూరు నియోజకవర్గంలో అంబేడ్కర్ రాజ్యాంగం ఉందా? ఎమ్మెల్యే పాశం సునీల్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అని పలువురు దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసులు.. అరెస్ట్ నుంచి గూడూరులోని ధర్మరాజుల స్వామి దేవస్థానంలో గత నెల 21న ఆలయ భూముల లీజు వేలం సరైన పద్ధతిలో జరగడం లేదని గూడూరు పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ నేతగా పల్లి కోటేశ్వరరావు దేవదాయశాఖ అధికారులను ప్రశ్నించాడు. అప్పుడు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత పల్లి కోటేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ మరుసటి రోజు 28వ తేదీన ఆలయ ఈఓ రవికృష్ణపై ఒత్తిడి తెచ్చి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారు. ఎమ్మెల్యే పాశం సునీల్ ఇలా తనపై అక్రమ కేసు పెట్టి సాటి దళితుడిని ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఓ హోటల్లో కోటేశ్వరరావు ప్రెస్మీట్ పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే ఆ హోటల్ యజమానిని హోటల్లో ఎలా ప్రెస్మీట్లు పెట్టనిస్తారంటూ బెదిరించడం, వెంటనే రూం ఖాళీ చేయించాలని ఆదేశించడంతో యాజమాన్యం హోటల్ గదులను ఖాళీ చేయించారు. ఆ తరువాత పల్లి కోటేశ్వరరావు తనను బెదిరింపులకు గురి చేసి నగదు డిమాండ్ చేశాడని ఓ పారిశ్రామికవేత్తతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో వారం తిరగక ముందే నాన్ బెయిల్ రెండో కేసుగా నమోదు చేయించారు. ఈ కేసులో బెయిల్ కోసం కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేయడంతో విచారణ సమయంలో అరెస్టులు చేయకూడదని ఆదేశించింది. సోమవారం కోటేశ్వరరావుకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నేరుగా గూడూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి తనపై జరుగుతున్న కుట్రలను, ఎమ్మెల్యే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి విలేకరుల సమావేశం జరిగే ప్రాంతానికి పంపించి నానా హంగామా సృష్టించారు. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించిన పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా, అధికార పార్టీ వర్గీయులతో పల్లి కోటేశ్వరరావుపై కొంత మంది రౌడీషీటర్స్తో భౌతిక దాడికి యత్నాలు చేసేందుకు చేసిన ప్రయత్నాలతో పోలీసుస్టేషన్ వద్ద గత రాత్రి హైడ్రామా నడిచింది. ఆ తర్వాత ఎట్టకేలకు రాత్రి 11 గంటల సమయంలో పల్లిని రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి రిమాండ్ను తిరస్కరించినా విడిచి పెట్టకుండా గూడూరు టు టౌన్ పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అప్పటికే పథకం ప్రకారం రెండో పట్టణానికి చెందిన బెజవాడ రమేష్ అనే వ్యక్తి కోటేశ్వరరావు తనను నగదు ఇవ్వాలని బెరించాడని అందుకు తాను రూ.10 వేలు ఇచ్చినట్లు పోలీసులకు పిర్యాదు చేయగా కోటేశ్వరరావుపై మరో కేసును బనాయించి మంగళవారం గూడూరు కోర్టుకు హాజరు పరిచారు. అలాగే మరో కేసును ఒకటో పట్టణం పోలీస్స్టేషన్లో నమోదు చేయించేందుకు ఉద్యోగులను పురమాయిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించడమే నేరమా? స్థానిక ఎమ్మెల్యే సునీల్కుమార్ అవినీతిని, అక్రమాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలిచిన గొంతును నొక్కేందుకే ఈ కుట్రలు సాగుతున్నాయని గూడూరు నియోజకవర్గం దళితులు భావిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న భూముల వేలం ప్రక్రియలో పాల్గొని వాస్తవాలు వెలుగులోకి తెస్తాడనే భయంతోనే ముందస్తుగా ఈ అరెస్ట్ల పర్వానికి తెరలేపారని చర్చ సాగుతోంది. ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీ కార్యకర్తలతో వరుస ఫిర్యాదులు చేయిస్తూ, ఒక్కో కేసు తర్వాత మరొక కేసు పెడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వైఎస్సార్సీపీ నేత కోటేశ్వరరావును బయటకు రాకుండా చక్రబంధం పన్నారని ఆరోపణలు వస్తున్నాయి. -
లోక్అదాలత్ను జయప్రదం చేయండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి నెల్లూరు (లీగల్): ఈ నెల 12న జరిగే జాతీయ లోక్అదాలత్ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ నరసింహమూర్తి కోరారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లోని న్యాయమూర్తులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష సమావేశాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయమూర్తులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కక్షిదారులు రాజీ చేసుకునేలా చూసి అధిక కేసులను పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేయాలని కోరారు. పీఎం విశ్వకర్మ రుణాల మంజూరుకు ప్రత్యేక శిబిరాలు నెల్లూరు(అర్బన్): పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు కెనరా బ్యాంకు, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయం, ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటలకు వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న చేతివృత్తిదారులు, కళాకారులు అవసరమైన ధ్రువీకరణపత్రాలతో శిబిరాలకు హాజరై రుణ మంజూరు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సోమవారం తెలిపారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, ఏఆర్టీ, డయాలసిస్, ట్రాన్స్ జెండర్, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేస్తామ ని చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోపు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎంవీఐ గోపీనాయక్ సస్పెన్షన్ నెల్లూరు (టౌన్): కావలి సమీపంలోని టోల్గేట్ వద్ద చెకింగ్ చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన రవాణాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంవీఐ గోపీనాయక్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం రవాణా శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు చేసిన సర్ప్రైజ్ తనిఖీల్లో ఎంవీఐ గోపినాయక్ వద్ద రూ.2.48 లక్షలు అనధికార నగదును గుర్తించారు. ఆదివారం ఏసీబీ అధికారులు రేడియో మెసేజ్ ద్వారా రవాణాశాఖ ఉన్నతాధికారులకు వివరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో గోపినాయక్ను సస్పెండ్ చేశారు. ఎంవీఐతో పాటు పట్టుబడిన మరో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను ఆ ఆ శాఖకు సరెండర్ చేశారు. రెండో సారి సస్పెండ్ ఎంవీఐగా పనిచేస్తున్న గోపీనాయక్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. ఆయన సూళ్లూరుపేటలో ఎంవీఐగా పనిచేస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు ఫిజికల్గా లేకుండానే రీ రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం 70కు పైగా ట్యాంకర్లకు రీ రిజిస్ట్రేషన్ చేసి భారీ మొత్తంలో లంచం రూపంలో నగదును తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను 2022లో రవాణా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయన మళ్లీ 2023 జనవరిలో జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఏసీబీ అధికారుల విచారణ చెకింగ్ చేస్తూ పట్టబడిన ఎంవీఐ గోపీనాయక్ను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు విచారించారు. రవాణాశాఖ డీటీసీ బి.చందర్తోపాటు ఎంవీఐ గోిపీనాయక్, ఎంవీఐ సంధ్య ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఎంవీఐ గోిపీనాయక్ నుంచి అనధికార నగదు, చెకింగ్, విధులు, గతంలో సస్పెండ్ వివరాలు తదితరాలు అడిగినట్లు సమాచారం. ఎంవీఐ సంధ్య నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. రవాణాశాఖ వివరాలను కూడా డీటీసీని అడిగినట్లు సమాచారం. -
చంద్రబాబు అధికారంలో ఉంటే.. కరువే..
శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 871 అడుగులు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గ్రావిటీ 841 అడుగులు రాయలసీమ ఎత్తిపోతల గ్రావిటీ 800 అడుగులు రోజుకు నీటి తరలింపు అవకాశం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా – 4 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా – 3 టీఎంసీలు కరువు.. చంద్రబాబు కవలలని అప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. జిల్లాను కరువు వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో గతేడాది అంతంత మాత్రంగా వర్షాలు కురిస్తే.. ఈ ఏడాది పూర్తిగా ముఖం చాటేశాయి. జిల్లాలోని జలాశయాలు అడుగంటుతున్నాయి. ఈ తరుణంలో శ్రీశైలం జలాశయంలో తగింత స్థాయి నీటి మట్టం ఉన్నప్పటికీ కనీసం సాగు, తాగునీటి అవసరాలకు కూడా జిల్లా జలాశయాలకు నీటిని విడుదల చేయడంలో చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో మంగళవారం రైతులతో చలో నెల్లూరు బ్యారేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో తీవ్ర వర్షాభావం తో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిలలో 78, కండలేరులో 69 టీఎంపీలు, ప్రధాన రిజర్వాయర్లు, మేజర్, మైనర్ చెరువుల్లో కలిసి మొత్తంగా 200 టీఎంసీల నీటి నిల్వలకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సోమశిలలో 17.1, కండలేరులో 18.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక మేజర్, మైనర్ చెరువులు సైతం పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలో సమీప భవిష్యత్లో తాగునీటి ఎద్దడి సైతం నెలకొనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అవకాశాలు ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు లెక్కిస్తే.. దాదాపు 38 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ సాగు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో సుమారు 6 టీఎంసీల నీటి అవసరం ఉందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. మిగిలిన 32 టీఎంసీల్లో సోమశిల డెడ్ స్టోరేజీ 8, కండలేరు డెడ్ స్టోరేజీ 6 టీఎంసీలతోపాటు చైన్నె తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుత వాతావరణం మండు వేసవిని తలపిస్తుండడంతో జలాశయాల్లో ఆవిరి శాతం కూడా అత్యధికంగా ఉంది. అధికారుల అంచనా ప్రకారం 6 టీఎంసీలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన 25 టీఎంసీలు పోను 7 టీఎంసీలు కూడా నిల్వ ఉండే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదలలో నిర్లక్ష్యం రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల జలనిధి అయిన శ్రీశైలం (గరిష్ట నీటి మట్టం 885 అడుగులు)లో కూడా నీటి మట్టం పడిపోయింది. అదృష్టవశాత్తు కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద నీరు రావడంతో 871 అడుగుల (149 టీఎంసీలు) నీటి మట్టానికి చేరింది. ఈ తరుణంలో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులర్ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలను కాపాడడంతోపాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా శ్రీశైలం జలాలను విడుదల చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా.. చంద్రబాబు కనీసం స్పందించడం లేదు. శ్రీశైలంలో 841 అడుగుల కంటే నీటి మట్టం పెరిగితే.. రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన రోజుకు కనీసం 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గ్రావిటీ ద్వారా జిల్లాలోని జలాశయాలను నింపే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ సర్కారు 800 అడుగుల నీటి మట్టానికి పడిపోయినా.. శ్రీశైలం జలాలను తరలించుకుని పోతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయడం లేదు. శ్రీశైలంలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నప్పుడైనా జిల్లా జలాశయాలు నింపే ఆలోచన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేయకపోవడం జిల్లా రైతాంగం, ప్రజలు చేసుకున్న దురదృష్టం. ప్రస్తుత పరిణామాలతో జిల్లా రైతాంగం కన్నీరు పెడుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయినా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినా.. తెలంగాణతో సమానంగా కాకపోయినా.. కొంత మేరకైనా నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించి కరువు వేళ సైతం సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించుకోవచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రోజుకు 4 టీఎంసీలు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871 అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలోని ప్రాజెక్ట్లకు రోజుకు 7 టీఎంసీలు తరలించుకుంటే.. కరువును తరిమి కొట్టే అవకాశం ఉంది. దాదాపు 85 శాతానికి పైగా పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు సర్కారు ఆపేయడంతో శ్రీశైలంలో జల హక్కులు ఉన్నా.. వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్.. జలయజ్ఞంతో సస్యశ్యామలం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలోనే దశాబ్దాలుగా కల్లలుగా మిగిలిపోయిన జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను జలయజ్ఞం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేవలం 1,500 క్యూసెక్కుల కెపాసిటి కలిగి ఉండేది. దీన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా హెడ్ రెగ్యులేటర్తోపాటు, కాలువలను ఆధునికీకరించారు. ముంపు గ్రామాలకు పరిహారం చెల్లించడం, అటవీశాఖ అనుమతులు చకచకా తీసుకుని 2007–08 నాటికి జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచి సింహపురి రైతుల్లో హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్ కేవలం రెండేళ్లల్లోనే రెట్టింపు స్థాయిలో నీటి నిల్వలను పెంచగలిగారు. చంద్రబాబు తొలుత తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండీ సోమశిలలో నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక్క టీఎంసీ కూడా పెంచలేకపోయారు. జిల్లాలో నీటి నిల్వల సామర్థ్యం (టీఎంసీలు) జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు సోమశిలలో 17.1, కండలేరులో 18.3 టీఎంసీలే ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్కు 10 టీఎంసీలు అవసరం చైన్నె తాగునీటికి, డెడ్ స్టోరేజీ, ఆవిరి కింద 25 టీఎంసీలు సమీప భవిష్యత్లో వర్షపు జాడలే లేవు కమ్ముకుంటున్న కరువు పరిస్థితులు శ్రీశైలంలో తగినంత నీటి మట్టం ఉన్నా.. చుక్క నీటిని వదలని వైనం సీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినా.. జిల్లా సస్యశ్యామలం చివరికి వచ్చిన ఖరీఫ్ సాగుకు సాగునీటి సమస్య సాగు, తాగునీటికి గడ్డు పరిస్థితులు నేడు కాకాణి ఆధ్వర్యంలో చలో నెల్లూరు బ్యారేజీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. వైఎస్సార్ హయాంలో 72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెరిగిన సోమశిలను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. వైస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక.. సోమశిల ప్రాజెక్ట్లకు సంబంధించి పెండింగ్ అటవీభూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టిన సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటిని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.కరువు సీమలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల ప్రాజెక్ట్లతో సస్యశ్యామలం చేస్తే.. చంద్రబాబు పదిహేడేళ్ల్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్లను నిర్వీర్యం చేశాడు. ఫలితంగా ముక్కారు పంటలతో అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరు జిల్లాలో కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. 1996–2004 మధ్య అధికారంలో ఉండి జిల్లాలో ఇది తాను నిర్మించి ప్రజలకు అంకింత చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. జిల్లా జలనిధి సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు అయితే.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ప్రజలు, రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్ట్ పనులు నిలిపివేయడంతో ఆయన హయాంలో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. చంద్రబాబు ఆది నుంచి జల ప్రాజెక్ట్లకు వ్యతిరేకి. జిల్లాలోని సోమశిల, నెల్లూరు, సంగం, స్వర్ణముఖి బ్యారేజ్లతోపాటు సోమశిల ఉత్తర కాలువ ప్రాజెక్ట్లు ఆయన పాలనకు దృష్టాంతంగా నిలుస్తాయి. -
టీడీపీ వర్గీయుల బరితెగింపు
గూడూరు: టీడీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన మాజీ టీడీపీ నేత, ప్రస్తుత వైఎస్సార్సీపీ నాయకుడు పల్లె కోటేశ్వరరావుపై భౌతిక దాడులకు బరితెగించారు. గూడూరులోని ధర్మరాజుస్వామి ఆలయానికి సంబంధించి భూములు, దుకాణాల వేలంలో టీడీపీ నేతలు, ఆలయ అధికారుల అక్రమాలపై ఆ పార్టీ ఎస్సీ నేతగా ఉన్న పల్లె కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతో జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు కక్షపూరితంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోటేశ్వరరావు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ బయట ఉండి సోమవారం గూడూరుకు వచ్చారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి టీడీపీ నాయకుల అరాచకాలపై ప్రెస్మీట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు మండల పరిషత్ కార్యాలయంలో కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ స్టేషన్కు తరలించేందుకు జీప్లో ఎక్కిస్తుండగా టీడీపీకి చెందిన కొందరు తమ నాయకుడిపైన ఇష్టానుసరంగా మాట్లాడతావా అంటూ పోలీసుల ఎదుటే కోటేశ్వరరావుపై భౌతికదాడికి యత్నించారు. ఆ తర్వాత అతన్ని పోలీస్స్టేషన్ వద్దకు తీసుకుని వెళ్లిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులు, గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం ఉండే ప్రాంతానికి చెందిన మహిళలు, స్థానికులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులు నేరుగా స్టేషన్ ఆవరణలోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న పోలీసులతో కోటేశ్వరరావును బయటకు వదలాలని పట్టుబట్టారు. పట్టణ, రూరల్ సీఐలు శేఖర్బాబు, కిషోర్బాబు వాగ్వాదానికి దిగిన వారిని సముదాస్తూ.. పేరు పేరునా పిలుస్తూ బయటకు వెళ్లాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారికి అరెస్టు చేసిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించాలనే విషయం తెలియజేయడం చూస్తుంటే అక్కడకు వెళ్లి దాడులకు పాల్పడండని ప్రేరేపించేలా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నాయకులు సుమారుగా గంటకు పైగా స్టేషన్ ఆవరణలో ఉండడం, అధికార పార్టీకి చెందిన వారు కావడం, స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో టీడీపీ నాయకులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా పల్లి కోటేశ్వరరావు అరెస్ట్ ● పోలీసుల వీరంగం గూడూరురూరల్ : గూడూరు ఎంపీపీ ఛాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేత పల్లి కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకునేందుకు ఒకటో పట్టణ సీఐ, ఎస్సై. పోలీసులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో గూడూరు సమన్వయకర్త గురవయ్య, న్యాయవాది రాఘవరెడ్డి, నాయకులు చెబుతున్నా పోలీసులు లెక్కచేయకుండా ఈడ్చుకెళ్లి జీపు ఎక్కించుకుని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. ధర్మరాజుస్వామి ఆలయంలో అక్రమాలపై ప్రశ్నించిన మాజీ టీడీపీ నేత ఆ మరుసటి రోజే వైఎస్సార్సీపీలో చేరిక వెంటనే అతనిపై కేసులు నమోదు చేసిన వైనం తాజాగా అరెస్ట్ చేస్తే పోలీసుల ఎదుటే పల్లె కోటేశ్వరరావుపై భౌతిక దాడికి టీడీపీ శ్రేణుల యత్నం బయటకు వదలాలని పోలీసులతో వాగ్వాదం -
సాగునీటి నిర్వహణ లేకనే రైతులకు కష్టాలు
పొదలకూరు : సాగునీటి నిర్వహణ సక్రమంగా లేకనే పంటలు ఎండిపోతూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పొదలకూరు, మరుపూరులో కాకాణి సోమవా రం పర్యటించారు. ఈ సందర్భంగాపొదలకూరులో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కలువాయి మండలంలో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనుపూరుపల్లి, నూకనపల్లి, వెదనపర్తి, వెరుబొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4వేల ఎకరాల్లో పంటలు సాగునీరందక ఎండిపోతున్నాయన్నారు. అక్కడి రైతులు పురుగుమందు డబ్బాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగునీటి పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సెంటు భూమి కూడా ఎండనివ్వమన్న మంత్రుల మాటలు నీటి మూటలుగా మిగిలాయని విమ ర్శించారు. సోమశిల–కండలేరు ఫ్లడ్ఫ్లో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుందని, రైతులు పంటలు పండించుకుంటారని తెలిపారు. శ్రీశైలం నుంచి సోమశిలకు నీరు విడుదల చేయాలని గత పదిరోజులుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నేడు రైతుల కోసం ఆందోళన జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం నట్టేట ముంచిందని కాకాణి ధ్వజమెత్తారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయమంటే పట్టించుకోవడం లేదన్నారు. రెండు జలాశయాల్లో 8 టీఎంసీల వంతున నిల్వలు ఉండే అవకాశం ఉందన్నారు. సాగునీటి సంగతి అటుంచి తాగేందుకు కూడా జిల్లా ప్రజలకు నీరందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రైతుల హక్కులు కాపాడేందుకు వారితో కలిసి వైఎస్సార్సీపీ మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు బ్యారేజీ వద్ద శ్రీశైలం నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఒక పక్క జిల్లాలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని అడ్డగోలుగా తోడేస్తున్నా కూడా స్పందించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 27 నెలలుగా కొత్త పింఛన్లను మంజూరు చేయలేదని, ఇప్పుడు స్థానిక ఎన్నికల స్టంట్లో భాగంగానే దరఖాస్తులు స్వీకరిస్తోందని ఆరోపించారు. కాకాణి వెంట నాయకులు పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, తెనాలి నిర్మలమ్మ, జీ.వేణుగోపాల్రెడ్డి, ఎస్కే అంజాద్, ఎం సతీష్రెడ్డి, ప్రసాద్, వెంకీ ఉన్నారు. కలువాయిలో నీరందక ఎండుతున్న పంటలు రైతు సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం -
బాలకోటిరెడ్డి రిమాండ్కు తరలింపు
నెల్లూరు (అర్బన్): బాపట్ల జిల్లా చుండూరు పోలీసుస్టేషన్పై దాడికి పాల్పడి సీఐను కులం పేరుతో దూషించిన కేసులో రిమాండ్ ఖైదీ బాలకోటిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు రిమాండ్ తరలించారు. గత నెల 23న రిమాండ్కు తరలించిన బాలకోటిరెడ్డి అధికార పార్టీ నేత కావడంతో మూడు రోజులకే సాధారణ చర్మవ్యాధి పేరుతో తన రాజకీయ పలుకుబడితో ఏకంగా పెద్దాస్పత్రిలో పెయిడ్ రూమ్లో పెట్టి రాజభోగాలు కల్పించారు. ఈ నేపథ్యంలో శనివారం ‘తమ్ముడు రిమాండ్ ఖైదీ అయితే..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం కలవరపడింది. రిమాండ్ ఖైదీ బాలకోటిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా న్యాయమూర్తి ఆదేశాలు, అనుమతులు లేకుండా సాధారణ చర్మ వాధి పేరుతో పెయిడ్ రూమ్ కల్పించి, ఆయనకు పోలీసులు, డాక్టర్లు రాచమర్యాదలు చేయసాగారు. రిసార్ట్స్ వసతులు కల్పించారు. అదేదో నిషేధిత ప్రాంతమన్నట్లు ఆ క్యారిడార్లోకి కూడా రెండో వ్యక్తిని రాకుండా నర్సులు సైతం పొరబాటున అటు వైపు వెళ్లిన వారిని బెదిరించారు. ఖైదీలకే కాదు రోగులకు సైతం ఇలాంటి పే రూంలు ఇప్పటి వరకు పెద్దాస్పత్రిలో కేటాయించలేదు. ఇదే విషయాన్ని సాక్షి వెలుగులోకి తేవడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారడంతో ఆగమేఘాల మీద నిందితుడిని రిమాండ్కు తరలించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
గోపినాయక్ చరిత్ర అవినీతిమయం
● గూడూరు రవాణా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఏఎంవీఐ రెండు నెలల క్రితం పరిమితికి మించి అధిక లోడు ఉందన్న కారణంగా ధాన్యం లారీకి సంబంధించిన వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు లంచం రూపంలో తీసుకున్నారు. ఈ విషయం లారీ అసోసియేషన్ నాయకులు దృష్టికి వెళ్లడంతో సదరు అధికారితో వాగ్వాదానికి దిగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక తీసుకున్న నగదును తిరిగి వెనక్కి ఇచ్చారు. సదరు అధికారితోపాటు మరో అధికారి కూడా గూడూరు సమీపంలో ఉన్న సంత రోడ్డుపైనే తనిఖీలు నిర్వహించి అక్కడి నుంచి వచ్చే వాహన యజమానుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఎంవీఐకి డీటీసీ గతంలో మెమో కూడా జారీ చేశారు. గూడూరు ఆర్టీఓ కూడా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు అధికారుల వ్యవహార శైలిపై డీటీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. నెల్లూరు (టౌన్): జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు అధిక లోడు వాహనాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధానంగా ఇసుక, గ్రావెల్, మట్టి, గ్రానైట్, క్వార్ట్ ్జ, ఫ్లైయాష్, ధాన్యం లారీలు అత్యధిక లోడుతో రవాణా చేస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఎంవీఐలు, ఏఎంవీఐలు జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో నిత్యం తనిఖీల పేరిట అవినీతికి పాల్పడుతున్నారు. ప్రధానంగా గూడూరులో పనిచేసే ఇద్దరు అధికారులు, నెల్లూరులో పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులు, స్క్వాడ్లో ఉండే అధికారులు ఈ తరహా తనిఖీలతో భారీగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల సమయంలో రవాణా అధికారి రోడ్డుపైన ఉండి ప్రభుత్వం కేటాయించిన హోంగార్డు లేదా అటెండర్ సహాయంతో వాహనాన్ని ఆపి రవాణా అవుతున్న సరుకుకు సంబంధించి వే బిల్లులు, ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్ తదితర వాటిని పరిశీలించాల్సి ఉంది. అయితే కొంత మంది రవాణా అధికారులు హోంగార్డు లేదా అటెండర్లను తనిఖీలకు తీసుకెళ్లకుండా ప్రైవేట్ వ్యక్తులను కారులో ఎక్కించుకుని తీసుకెళుతున్నారు. సదరు అధికారి కారులోనే కూర్చొని ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలను ఆపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో అధికారి అయితే నలుగురైదుగురు ప్రైవేట్ వ్యక్తులను తీసుకెళ్లి లారీ యజమానులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వసూలు వాహన పరిమితికి మించి ఒక టన్ను అధికంగా ఉంటే తొలుత ఓనర్ ఫెనాల్టీ రూ.20 వేలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి టన్నుకు అదనంగా రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10 టన్నులు ఓవర్లోడ్ ఉంటే ఓనర్ ఫెనాల్టీ రూ.20 వేలు, 10 టన్నులకు రూ.20 వేలు కలిపి మొత్తం రూ.40 వేలు చెల్లించాలి. దీంతో పాటు డ్రైవరు లైసెన్స్, ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్ లేకుంటే అదనంగా చెల్లించాలి. ఈ నిబంధనలు కొంత మంది రవాణా అధికారులకు వరంగా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తూ.. చిలక్కొట్టుడు కొడుతున్నారు. అధిక లోడు వాహనానికి లోడును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత మంది అధికారులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్కు ఫోన్పే చేయిస్తుండగా, మరికొంత మంది నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ రీతిలో కొందరు రవాణా అధికారులు ప్రతి రోజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు కలెక్షన్ రానిదే ఇంటికి వెళ్లరని ఆ శాఖలో పనిచేసే కొంత మంది రవాణా అఽధికారులే చెబుతున్నారు. ధాన్యం లారీలను తనిఖీ చేయొద్దని ఆదేశించినా.. జిల్లాలో తిరుగుతున్న ధాన్యం లారీలను ఆపి కేసులు నమోదు చేయొద్దని సాక్షాత్తు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కొంత మంది రవాణా అధికారులు పెడ చెవిన పెట్టి ఆ లారీలనే టార్గెట్ చేస్తున్నారు. ధాన్యం లారీల్లో ఒకట్రెండు టన్నులు అధిక లోడు ఉన్నా రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ధాన్యం లారీల నుంచి ప్రతి రోజూ రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విషయంపై లారీ అసోసియేషన్ నాయకులు జిల్లా రవాణా అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొంత మంది లారీ యజమానులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఏఎంవీఐలు కొంతమంది వివాదాస్పదంగా మారుతున్నారు. ప్రతి రోజు ఎక్కడోక ప్రాంతంలో లారీ యజమానులతో గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి.అర్ధరాత్రి వేళ ఎంవీఐ గోపినాయక్ తనిఖీలపై ఏసీబీ దాడులు రవాణా శాఖలో కొందరు అధికారులు 24/7 తనిఖీలతో కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వానికి పైసా పెనాల్టీ జమ కావడం లేదు. సదరు అధికారులు జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ప్రాంతాలు విభజించుకుని డ్యూటీలు చేస్తూ.. జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి తిమింగళాల దోపిడీ అప్రతిహతంగా జరుగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క రవాణా వాహనానికి రేట్ ఫిక్స్ చేసి.. రైట్ రైట్ అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక లోడుతో వెళ్లే వాహనాలను గుర్తించి ప్రభుత్వానికి జరిమానా రూపంలో ఆదాయం సమకూర్చాల్సిన కొంతమంది రవాణా అధికారులు.. అదే నిబంధనలను తమకు ‘కాసుల పంట’గా మార్చుకున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి, క్వార్ట్ ్జ, ఫ్లైయాష్, గ్రానైట్, ధాన్యం లారీలను టార్గెట్గా చేసుకుని పగలు, రాత్రి తేడా లేకుండా తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా కావలి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీఐ గోపినాయక్ వద్ద భారీ మొత్తంలో అనధికారిక నగదు ఏసీబీకి పట్టుబడడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి రవాణా కార్యాలయంలో పని చేసే ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏఓలతోపాటు ప్రతి ఉద్యోగి వినియోదారుడికి జవాబుదారీగా ఉండాలి. తనిఖీల సమయంలో అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా 9281607030 నంబరుకు ఫిర్యాదు చేయండి. రవాణా అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సర్ప్రైజ్ చెకింగ్లు నిర్వహిస్తాను. అక్కడ వారు డబ్బులు తీసుకోవడం.. అనధికార సిబ్బంది ఉన్నట్లయితే అక్కడే చర్యలు తీసుకుంటాను. ఇటీవల కాలంలో జిల్లాలోని ఎంవీఐలు, ఏఎంవీఐలతో సమావేశం నిర్వహించి కమిషనర్ ఆదేశాలను వివరించాం. – చందర్, డీటీసీ రూ.2.48 లక్షల అనధికారిక నగదు పట్టుబడిన వైనం పగలు, రాత్రి తేడా లేకుండా తనిఖీలు ఇసుక, గ్రావెల్, క్వార్ట్ ్జ, మట్టి, ధాన్యం ఫ్లైయాష్, గ్రానైట్ లారీలే టార్గెట్ ఒక్కో వాహనానికి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వసూలు అడిగినంత డబ్బులిస్తే రైట్రైట్, లేకుంటే కేసు నమోదు ఒక్కో అధికారి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వసూళ్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి వాహనాల తనిఖీలు ఫిర్యాదులు వస్తున్నా.. పట్టించుకోని రవాణా ఉన్నతాధికారులు రవాణాశాఖ స్క్వాడ్లో మోటారు వాహనాల అధికారిగా పనిచేస్తున్న గోపినాయక్ చరిత్ర అవినీతి మయం. తాజాగా శనివారం అర్ధరాత్రి తర్వాత కావలి సమీపంలోని టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో భారీ మొత్తంలో అవినీతి సొమ్ముతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సదరు ఎంవీఐ కారు, జేబులను తనిఖీ చేయగా రూ.2.48 లక్షలు దొరికింది. గోపినాయక్ గతంలో సూళ్లూరుపేట ఎంవీఐగా పనిచేస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ట్యాంకర్లను ఫిజికల్గా చెకింగ్ చేయకుండానే రీ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా నగదు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేసి నిజమని తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను రవాణా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏడాది తిరగక ముందే నెల్లూరు స్క్వాడ్లో పోస్టింగ్ తెచ్చుకున్నారు. -
సినిమాకు తీసుకెళ్లి భార్య గొంతు కోసిన భర్త
నెల్లూరు జిల్లా: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్పై శనివారం సినిమాకి వెళ్లి ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి! -
హెచ్ఐవీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
నెల్లూరు(అర్బన్): హెచ్ఐవీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. నగరంలోని బీవీనగర్ డీఎఫ్ఐటీ కార్యాలయం నందు హెచ్ఐవీ, ఎయిడ్స్ జబ్బులపై సమీక్షా సమావేశం శనివారం జరిగింది. జిల్లాలో హెచ్ఐవీ నిర్మూలనకు జరుగుతున్న ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఎయిడ్స్, టీబీ, లెప్రసీ నియంత్రణాధికారి డాక్టర్ ఖాదర్వలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐసీటీసీ కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ● నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని డీఎంహెచ్ఓ సుజాత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. లోపాలున్న చిన్న పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. చిన్నపిల్లల డాక్టర్ సురేష్, ఇతర డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్
● ఇద్దరికి తీవ్రగాయాలు పొదలకూరు: మోటార్ బైక్ను ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణానికి సమీపంలో నెల్లూరు–పొదలకూరు మార్గం కేఆర్ఆర్ లేఅవుట్ వద్ద శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లకు చెందిన గిరి మరో వృద్ధుడిని తన బైక్పై ఎక్కించుకుని పొదలకూరుకు వస్తుండగా నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ తిరుపాల్, పైలెట్ శరత్లు క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. -
సమస్యలను గుర్తించేది జర్నలిస్టులే
నెల్లూరు(పొగతోట): సమాజంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని కథనాల రూపంలో ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే వారే జర్నలిస్టులని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. తాను జిల్లాకు వచ్చి ఏడాది దాటిందన్నారు. నా దృష్టికి రాని అనేక సమస్యలను పత్రికల ద్వారా చూసి తెలుసుకున్నానన్నారు. ప్రస్తుతం సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, దీనిపై జర్నలిస్టులకు నిరంతర శిక్షణ, మార్గదర్శకత్వం అవసరమన్నారు. ఈ మధ్యకాలంలో పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా వినియోగంలోకిరాని ప్రభుత్వ ఆస్తులు, క్రీడా సదుపాయాల అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామీణ విలేకరుల వ్యవస్థ ఉందన్నారు. ఈ క్రమంలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. సమాచార శాఖ డీడీ వేణుగోపాల్రెడ్డి, సీఆర్ మీడియా అకాడమీ ఓఎస్డీ జీవన్ పాల్గొన్నారు. -
సీఎం యోగి స్వర్ణభారత్ ట్రస్ట్కు రాక రేపు
వెంకటాచలం: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు రానున్నారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఐ.దీపావెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకుని, 11.30 గంటలకు సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయం ప్రాంగణంలోని సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారని తెలిపారు. 12 గంటలకు అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తారన్నారు. అనంతరం 2 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ చేరుకుని ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొంటారని తెలిపారు. జిల్లా పరిషత్ విభజన ప్రక్రియ పూర్తి నెల్లూరు (పొగతోట): రాష్ట్రంలో పాత 13 జెడ్పీలను రద్దు చేసి వాటి స్థానంలో 28 జిల్లా పరిషత్లను పునర్వ్యవస్థీకరిస్తూ పీఆర్, రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా పరిషత్లో 46 మండలాలు ఉన్నాయి. నూతనంగా 35 మండలాలతో జిల్లా పరిషత్ ఉంటుంది. మిగిలిన 11 మండలాలు తిరుపతి జిల్లా పరిషత్లో విలీనం ఆయ్యాయి. జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. ఈ నెల 15 వరకే సాగునీటి విడుదల ● ఇరిగేషన్ ఈఈ ఆనంద్బాబు సంగం: కనిగిరి రిజర్వాయర్, కనుపూరు కెనాల్తోపాటు డెల్టా పరిధిలో సాగునీటిని ఈ నెల 15వ తేదీ వరకు విడుదల చేస్తామని ఇరిగేషన్ ఈఈ ఆనంద్బాబు తెలిపారు. సంగం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం, లభ్యత, విడుదల ప్రక్రియను పరిశీలించారు. ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత లేకుండా, నీటి వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సాగునీటి పంపిణీని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు సంబంధిత ఏఈలు, డీఈలకు తగిన సూచనలు జారీ చేశామన్నారు. ఒక్క ఎకరా పంట కూడా నీరు లేక ఎండిపోకుండా, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంటలను కాపాడుతామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యతలో లాసెస్ అధికంగా ఏర్పడినట్లు గుర్తించామని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నట్లు చెప్పారు. పంటలను కాపాడేందుకు అదనపు నీటి విడుదలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మండల కన్వీనర్పై కేసు నమోదు ● రెండు గ్రూపులుగా చీలిన తమ్ముళ్లు వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గూడ నర్సారెడ్డితోపాటు మరో పది మంది ఆయన ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వింజమూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాషా మండల కన్వీనర్కు వ్యతిరేకంగా పలు అక్రమాలకు పాల్పడుతున్నా డంటూ గత నెల 27న సోషల్ మీడియాలో వాయిస్ మెసేజ్ పెట్టారు. దీంతో అదే రోజు రాత్రి తనపై మండల కన్వీనర్ వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదులో జాప్యం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై మరో వర్గం ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మండల టీడీపీలో రెండు వర్గాలు ఎమ్మెల్యేతో పంచాయితీ పెట్టడంతో టీడీపీలో ఉన్న వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. ఇరువర్గాలను సర్దుబాటు చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆ పార్టీ నేతలే చర్చించుకోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ మండల కన్వీనర్ నర్సారెడ్డి, ఆయన ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,374 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,241 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
నవ వధువుపై భర్త హత్యాయత్నం
ఆత్మకూరు: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్పై శనివారం ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
● నిద్రిస్తున్న సమయంలో రాడ్డుతో కొట్టి మహిళ దారుణ హత్యకోట: స్థానిక కోటమ్మగుడి కాలనీలో శుక్రవారం రాత్రి నాగభూషణమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురికాగా, శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, ఎస్సై పవన్కుమార్ వివరాల మేరకు.. కోటమ్మగుడి కాలనీలో ఆవుల నాగరాజు, యశోదమ్మ దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. పందులు మేపుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి సమీప బంధువు అయిన ఏఎస్పేటకు చెందిన నాగభూషణమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో నాగరాజుకు నాగభూషణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెను నాగరాజు చిల్లకూరు మండలం రామిరెడ్డిపాళెంలో ఉంచి అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేవాడు. దీనిని యశోదమ్మ జీర్ణించుకోలేకపోయింది. భర్త నాగరాజు పనిమీద ఓజిలికి వెళ్లిన క్రమంలో శుక్రవారం నాగభూషణమ్మను పని ఉందని చెప్పి యశోదమ్మ ఇంటికి పిలిపించుకుంది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత రాడ్డుతో నాగభూషణమ్మ తలపై బలంగా కొట్టి హత్య చేసి పరారైనట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని గూడూరు సీఐ మాలకొండయ్య, ఎస్సై పవన్కుమార్ పరిశీలించారు. క్లూస్టీమ్ ఆధారాలు సేకరించాయి. హత్యకు వాడిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగభూషణమ్మ తల్లి రోశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
జీతాల కోసం ఎదురుచూపులే..
● పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో 800 మంది ● ప్రభుత్వం వద్ద ఫండ్స్ లేకపోవడమే కారణమా?నెల్లూరు(అర్బన్): ఐదో తేదీ దాటింది. అనేకచోట్ల ఇంకా ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఎదురు చూపులే మిగిలాయి. నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 800 మందికి పైగా జీతాలు ఇవ్వలేదు. మెడికల్ కళాశాల పరిధిలోని పెద్దాస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్ నర్సులు, కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, ఇతర సీనియర్ డాక్టర్లతో సహా సుమారు 800 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ కలిపి 8 బిల్లులను ఆగస్టు 24వ తేదీనే ట్రెజరీకి మెడికల్ కళాశాల అధికారులు పంపారు. ఏమైనా లోపాలుంటే వెంటనే ట్రెజరీ అధికారులు తెలపాలి. అయితే గతానికి భిన్నంగా షెడ్యూల్స్ పంపలేదంటూ జిల్లా ట్రెజరీ అధికారి తొలిసారిగా బిల్లులను రిటర్న్ చేశారు. దీంతో మెడికల్ కళాశాల అధికారులు సకాలంలోనే ట్రెజరీ అధికారి కోరిన విధంగా షెడ్యూల్స్ను కూడా పంపారు. అటు తర్వాత బిల్లుల్లో ఎలాంటి లోపాలు లేవంటూ కూడా పాస్ చేశారు. దీంతో ఒకటో తేదీన జీతాలు వస్తాయని ఉద్యోగులంతా ఎదురు చూశారు. అయినా ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమేనని తెలుస్తోంది. దీంతో చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోన్లు తీసుకున్న వారు తమ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు తమను డిఫాల్టర్లుగా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఠంచన్గా ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఉద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు.మెడికల్ కాలేజీ (ఫైల్)ఇది ప్రభుత్వ వైఫల్యమే.. కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఒకటో తేదీన జీతాలిస్తామని నమ్మబలికారు. మంచి పీఆర్సీ ఇస్తామని, డీఏలు విడుదల చేస్తామని హామీలిచ్చి ఇప్పుడు వాటిని మరిచిపోయారు. ఉద్యోగులకు ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వద్ద ఫండ్స్ లేకపోవడం వల్లనే జీతాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరిగింది. – నరమాల సతీష్కుమార్, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ జిల్లా గౌరవాధ్యక్షుడు -
ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కోవూరు: కోవూరుతో పాటు కొడవలూరు మండలం నార్తురాజుపాళెం పరిధిలోని హోటళ్లు, దాబాలు, బేకరీలు, జ్యూస్ షాపులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. అలాగే నాలుగు ఫుడ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. 150 కేజీల నాసిరకం ఐస్తో పాటు నాలుగు కేజీల రంగులు కలిపిన చెకోడీలు, ఐదు కిలోల గవ్వలు, నాలుగు కేజీల వేరుశనగ పప్పులు, పది కేజీల కుళ్లిన అరటిపండ్లను ధ్వంసం చేశారు. అదేవిధంగా కృత్రిమ రంగులు కలిపిన చికెన్, చికెన్ బిర్యానీ, హాఫ్ బాయిల్ చపాతీలు, పరోటాలు, పాడైన కూరగాయలు, రంగులు కలిపిన గోబీ వంటి ఆహార పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలని, వంట గదులు, హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, అధికారులు డాక్టర్ డి.నీరజ, ఎం.ప్రణతి ఫ్లోరా పాల్గొన్నారు. -
ఫీడ్ ధరలతో ఆక్వా రైతులు కుదేలు
తోటపల్లిగూడూరు (పొదలకూరు) : రాష్ట్రంలో ఫీడ్ ధరలను కంపెనీలు ఇష్టానుసారం పెంచుతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనలో ఆక్వా రైతులు కుదేలై పోయారని విచారం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలతో కుమ్మకై ్క దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాళెం గ్రామంలో కాకాణి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్నెళ్లల్లో మూడు దఫాలుగా ధరలు పెంచుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 40 రోజుల క్రితమే ధరలు పెంచిన ఆక్వా ఫీడ్ కంపెనీలు వెంటనే మరోసారి కిలో రూ.17 నుంచి రూ.22లకు పెంచారన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆక్వా సాగుకు హాలిడే ప్రకటించాల్సి వస్తుందన్నారు. ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం లాలూచీ పడి డ్రామాలకు తెర లేపిందని, ఆక్వా రైతుల నడ్డి విరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలను ముంచుతున్న పాలకులు జిల్లా చీఫ్ ఇంజినీర్ల కంటే నాయకులు అంతా తమకు తెలిసినట్టు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు ధ్వజమెత్తారు. సాగునీటి విడుదల అస్తవ్యస్తం రెండో పంటకు ప్రణాళికాబద్ధంగా కాకుండా నీరు విడుదల చేసి ప్రస్తుత జలాశయాలను ఖాళీ చేశారని కాకాణి విమర్శించారు. 600 ఎకరాల ఆయకట్టు ఉన్న గ్రామంలో కేవలం 30 నుంచి 40 ఎకరాల అవసరాల కోసం నీటిని విడుదల చేసి మిగిలిన 500 ఎకరాల సరిపడా నీటిని వృథా చేసినట్లు ఆరోపించారు. తొలి పంటపై అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రస్తుతం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మొదటి పంటకు నీరు అందజేసేందుకు వీల్లేకుండా ఉందన్నారు. ముందస్తు ఆలోచన, ప్రణాళికలు లేకపోవడం వల్లనే జిల్లాలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించకున్నా, కృష్ణా నదికి నీళ్లు వచ్చాయని, నారాయణ్పూర్, జూరాల నిండి, శ్రీశైలం ప్రాజెక్ట్కు నీరు చేరినట్టు కాకాణి వెల్లడించారు. మళ్లీ వరదలు రావొచ్చు, రాకపోవచ్చునన్నారు. సోమశిలకు శ్రీశైలం నీటిని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఈ రోజుకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవకాశం ఉందని, అయితే నీళ్లు తరలించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విమర్శించారు. 17 టీఎంసీలు సోమశిల, 18 టీఎంసీలు కండలేరు జలాశయాల్లో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని, డెడ్ స్టోరేజీ తీసివేస్తే 10 టీఎంసీలు ఉంటాయని ప్రస్తుత పంటకు మరో 3 నుంచి 4 టీఎంసీలు అవసరం అవుతాయన్నారు. ఈ నెల 8వ తేదీన రైతులతో కలిసి బ్యారేజీలు బావురుమంటున్నాయని శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడు దల చేయాలని ధర్నాను తలపెట్టినట్టు స్పష్టం చేశారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సానుభూతి పరులు కోటమ్మ, శ్రీరాములు, వర్షిత్ కుటుంబ సభ్యులను కాకాణి పరామర్శించారు. కాకాణి వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కంపెనీలను కట్టడి చేయని అసమర్థ కూటమి సర్కారు ఆరు నెలల్లో మూడుసార్లు ధరల పెంపు 40 రోజుల్లోనే మరో సారి.. సాగునీటి విడుదల అస్తవ్యస్తం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
గణేష్ ఉత్సవాలకు ‘సింగిల్ విండో’ అనుమతులు
● ఇప్పటి వరకు 489 దరఖాస్తులు నెల్లూరు(క్రైమ్): వినాయక చవితి పండగ సందర్భంగా మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వం సింగిల్ విండో ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ శాఖల అనుమతుల ప్రక్రియను ఒకే వేదిక ద్వారా పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతేడాది జిల్లాలో 4,578 గణేష్ మండపాల ఏర్పాటుకు దరఖాస్తులొచ్చాయి. ఈ ఏడాది మండపాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 489 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఇలా.. గణేష్ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా కమిటీగా ఏర్పడాలి. అనంతరం గణేష్ఉత్సవ్.నెట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్వాహకుని పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, చిరునామా, కమిటీ సభ్యుల వివరాలు, మండప ఏర్పాటు ప్రదేశం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, సంబంధిత పోలీస్స్టేషన్, సబ్డివిజన్ తదితర వివరాలను నమోదు చేయాలి. అదే విధంగా విగ్రహ నిమజ్జనం తేదీ, సమయం, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలు, ఏమార్గం గుండా వెళ్తారు.. తదితర వివరాలు దరఖాస్తులో పొందుపరిచి సబ్మిట్ చేయాలి. ఇది సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్తుంది. పోలీసు అధికారులు మండపం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించి అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తారు క్యూఆర్ కోడ్ ఉంచుకోవాలి అనుమతి పొందిన ఉత్సవ నిర్వాహకులు వెబ్సైట్లోని అప్లికేషన్ స్టేటస్లో మొబైల్ నంబర్ నమోదు చేసి ఎన్ఓసీతో పాటు పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూ ఆర్కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని ప్రింట్ తీసి మండపంలో అందుబాటులో ఉంచాలి. తనిఖీలకు వచ్చే పోలీస్, ఇతర శాఖల అధికారులకు చూపించే విధంగా భద్రపరుచుకోవాలి. అనుమతులు తీసుకోవాలి గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలి. పోలీసుశాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. – అజిత వేజెండ్ల, ఎస్పీ -
మెప్మా రుణ మోసాలపై కలెక్టర్కు ఫిర్యాదు
కోవూరు: మెప్మా పేరుతో పేద ప్రజలకు రు ణాల పేరుతో జరుగుతున్న మోసాల ఫిర్యా దులపై కలెక్టర్కు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. దళిత, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎవరైనా రుణాల పేరుతో మోసాలకు పాల్పడితే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మెప్మా పేరుతో జరిగే అక్రమ రుణ వ్యవహారాలపై ప్రజలను అప్రమత్తం చేస్తామని చెప్పారు. ‘మెప్మా రుణ మాఫియా’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి స్పందించారు. కోవూరు మండలంలోని సంఘమిత్ర కార్యాలయంలో శనివారం సంఘమిత్ర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మెప్మా పేరుతో రుణాల వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఆదేశించారు. ప్రతి పొదుపు సంఘ సభ్యురాలికి ప్రత్యేక ఎన్ఆర్ఎల్ఎం నంబర్ ఉంటుందని, ఆ నంబర్ ఆధారంగానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కావాల్సి ఉంటుందని తెలిపారు. రుణాల మంజూరులో ఆన్లైన్ ప్రక్రియ, సభ్యుల థంబ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్ఆర్ఎల్ఎం నంబర్, అవసరమైన ధ్రువీకరణలు లేకుండా రుణాలు మంజూరైతే సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ప్రక్రియ లేకుండానే లక్షల రూపాయల రుణాలు మంజూరవుతున్నట్లు ఫిర్యాదు లు వస్తున్నాయని, అలాంటి రుణాలు ఏ విధంగా మంజూరయ్యాయన్న దానిపై సంబంధిత బ్యాంకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మెప్మా పేరుతో మోసాలను అడ్డుకోవాలి నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని రుణాల పేరుతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించాలని నాగరాజకుమారి సూచించారు. మెప్మా లేదా ప్రభుత్వ పథకాల పేరుతో రుణాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగినా, అనుమానాస్పద పద్ధతుల్లో పత్రాలపై సంతకాలు తీసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అవసరమైతే దళిత, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, రుణాల మంజూరు ప్రక్రియపై ప్రజలకు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. దళిత, గిరిజన ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పిస్తాం ఇటువంటి వ్యవహారాలపై సంఘమిత్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి -
ఉపాధ్యాయ వృత్తి గొప్ప బాధ్యత
నెల్లూరురూరల్: ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని, గొప్ప బాధ్యతతో కూడిన సేవ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఒక మంచి ఉపా ధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాదు.. ఒక కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్ను మార్చగలడన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు మంచి మనిషిగా ఎలా ఎదగాలనే విషయాలను కూడా ఉపాధ్యాయులు నేర్పాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని, వారి వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. విలువలతో కూడిన విద్య అందించాలి – ఆనం అరుణమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యున్నత స్థానం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ గురువుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు. 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 58 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వీరిలో 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఆర్. బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్కు ఉపాధ్యాయులే మార్గదర్శకులు కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా వ్యాప్తంగా 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం -
ట్రావెల్స్ బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి
వెంకటాచలం: రోడ్డు దాటుతున్న లారీ క్లీనర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన వెంకటాచలం టోల్ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్ అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, క్లీనర్ గోపిరెడ్డి లారీలోని సరుకులను నెల్లూరులో అన్లోడ్ చేశారు. అనంతరం లారీని వెంకటాచలం టోల్ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నిలిపారు. 10.20 గంటల సమయంలో క్లీనర్ గోపిరెడ్డి(33) రోడ్డు దాటుతుండగా నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు వేగంగా దూసుకొచ్చిన జబ్బార్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపిరెడ్డిని చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయంపై మృతుని బంధువు వెంకటరామిరెడ్డి శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తు ● ముగ్గురికి గాయాలు వెంకటాచలం: కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు– గొలగమూడి గ్రామాల మధ్య శనివారం జరిగింది. గొలగమూడిలో నివాసం ఉంటున్న దంపతులు తమ కుమార్తెతో కలిసి కారులో శుభ కార్యానికి శుక్రవారం కోట మండలం గూడలి గ్రామానికి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున తిరిగి గొలగమూడి వెళ్తుండగా తిక్కవరప్పాడు గ్రామం దాటగానే కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో కాలినడకన వెళ్తున్న పట్రా సిద్ధయ్య, జయసుధ దంపతులను కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో పట్రా సిద్ధయ్య, జయసుధలకు గాయాలవ్వగా, కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న యువతికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నెల్లూరు(క్రైమ్): శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకా బందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు జరిపారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 14 మందిపై, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై ఎంవీయాక్ట్ కింద 237 కేసులు నమోదు చేసి రూ.1,34,775ల జరిమానా విధించారు. బహిరంగ మద్య సేవనంపై 19 కేసులు నమోదు చేశారు. లాడ్జీలను తనిఖీ చేసి అందులో బసచేసిన వారి వివరాలను సేకరించారు. లిఫ్ట్ నిర్వహణాలోపంతో వృద్ధుడి మృత్యువాత కావలి: అపార్ట్మెంట్లో లిఫ్ట్ నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఓ వృద్ధుడు మరణించిన ఘటన కావలిలోని శాంతినగర్ కాలనీలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మల్లికార్జున అనే వ్యక్తి కావలిలోని శాంతినగర్లో ఉన్న సాయి అపార్ట్మెంట్లో గృహ ప్రవేశానికి పలువురిని పిలిచారు. జలదంకి మండలం హనుమకొండపాళేనికి చెందిన యానం రవీంద్ర(62)కు ఆహ్వానం అందింది. ఆయన శనివారం కావలిలోని అపార్ట్మెంట్లోకి వచ్చారు. లిఫ్ట్ను ఆన్ చేయగా అది వచ్చి వెళ్లిపోయింది. వాస్తవానికి లిఫ్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాటి గ్రిల్స్కు ఉండే లాక్ తెరుచుకోవాలి. అయితే లిఫ్ట్ వచ్చి వెళ్లిన తర్వాత గ్రిల్స్ లాక్ కాకపోవడంతో వృద్ధుడికి తెలియకుండా ఓపెన్ చేసి వెళ్లిపోయారు. లిఫ్ట్ షాఫ్ట్లోకి జారిపడిన వృద్ధుడికి కింద ఉన్న ఇనుప రాడ్లు, స్ప్రింగ్స్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన ఆయన్ను తొలుత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతరిక్షంలో భారత్ ‘ఆకాశ నేత్రం’
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించగల అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్–05 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. 2,367 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ–17 రాకెట్ ద్వారా నిర్దేశిత సబ్–జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్డౌన్ అనంతరం ఈ ప్రయోగం చేపట్టారు. రాకెట్ నింగిలోకి ఎగిసిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. శుక్రవారం ప్రయోగంతో దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రోకు విజయం లభించింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ62 రాకెట్.. మూడో దశలో ఏర్పడిన సమస్య కారణంగా వాటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయింది. వ్యూహాత్మక సమాచారం మన సొంతం ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన దాదాపు రియల్టైమ్ చిత్రాలను పొందవచ్చు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా దేశ అవసరాలకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా దేశానికి అవసరమైన ‘వ్యూహాత్మక సమాచారం’ అందించడంలో ఈఓఎస్–05 కీలకంగా వ్యవహరించనుంది. ఈ ఉపగ్రహాన్ని మిషన్లో భాగమైన ఓ సీనియర్ శాస్త్రవేత్త ‘ఆకాశ నేత్రం’గా అభివర్ణించారు. ప్రయోగ వివరాలు వెల్లడిస్తున్న మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్, ఇస్రో చైర్మన్ నారాయణన్ తదితరులు ఇప్పటివరకు అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ భూ కక్ష్య (ఎల్ఈఓ) నుంచి పనిచేస్తున్నాయి. అయితే ఈఓఎస్–05 సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో పనిచేయనుంది. ఈ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానమైన వేగంతో పరిభ్రమిస్తుంది. 2,367 కిలోల బరువున్న ఈఓఎస్–05 జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లోనే అత్యంత బరువైనది. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు విజయవంతంగా తెరుచుకున్నాయని ఇస్రో తెలిపింది. చాలా సంతోషంగా ఉంది జీఎస్ఎల్వీ–ఎఫ్17 రాకెట్ అధునాతన ఈఓఎస్–05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా, కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టిన 107వ ప్రయోగం. జీఎస్ఎల్వీకి ఇది 19వ మిషన్. జీఎస్ఎల్వీ తొలి ప్రయోగం (డీ1)లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. అప్పటి నుంచి నిర్మాణ బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా జీఎస్ఎల్వీ సామర్థ్యాన్ని ఇస్రో క్రమంగా పెంచింది. ఇప్పుడు 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియను చేపట్టి ఉపగ్రహాన్ని అవసరమైన ఎత్తుకు చేర్చి జియో ప్లాట్ఫామ్లో ప్రవేశపెడతాం. ఈ విజయం ఇస్రోతో పాటు ఇందులో భాగస్వాముల సమష్టి కృషి ఫలితం. ఈఓఎస్–05 జీవితకాలం తొమ్మిదేళ్లు. ఇది ‘గూఢచారి ఉపగ్రహం’ అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. దేశ అవసరాల కోసం భూ పరిశీలన, ఇమేజింగ్ సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. 2027 మార్చి నాటికి ప్రధాని మోదీ నిర్దేశాల మేరకు ఆరు ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ రియల్టైమ్లో చిత్రాలను అందిస్తుంది ప్రత్యేకంగా రూపొందించిన ఈఓఎస్–05 ఉపగ్రహం దాదాపు రియల్టైమ్లో చిత్రాలను అందించగలదు. జీఎస్ఎల్వీ ద్వారా జీటీఓ లేదా సబ్–జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనది. – మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ మోదీ అభినందనలు ఈఓఎస్–05 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది దేశానికి గర్వకారణమైన సందర్భమని పేర్కొన్నారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం భారత అంతరిక్ష రంగం సాధించిన అద్భుత విజయమని తెలిపారు. జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీఎఫ్17 రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి, సాధిస్తున్న విజయాలు దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. 2021 ప్రయోగానికి ప్రత్యామ్నాయం! కాగా, జీఎస్ఎల్వీ–ఎఫ్17/ఈఓఎస్–05 మిషన్... 2021లో విఫలమైన జీఎస్ఎల్వీ–ఎఫ్10/ఈఓఎస్–03 మిషన్కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో రాకెట్ ప్రయాణం ప్రారంభమైన 307 సెకన్ల వద్ద ఆన్బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం జరిపిన పరిశీలనలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్లో ఏర్పడిన లోపం కారణంగానే ఆ మిషన్ విఫలమైనట్లు ఇస్రో గుర్తించింది. -
నీటి ప్రవాహం మృత్యుపాశమై..
● కావలి కాలువలో యువకుడి గల్లంతు ● కొద్దిసేపటికే మృతదేహం లభ్యంసంగం: ఆ యువకుడు పొట్టకూటి కోసం వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా కాలువలో స్నానానికి దిగాడు. కానీ నీటి ప్రవాహం రూపంలో మృత్యువు కబళించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన మోహన్ (30), ఇబ్రహీం నేమ్బోర్డులు బిగించే పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగెళ్తూ శుక్రవారం సంగం కావలి కాలువ వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికే మోహన్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన ఇబ్రహీం ఈత కొట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మోహన్ మాత్రం నీటిలో కొట్టుకుపోయి కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మోహన్ ఆచూకీ లభించలేదు. చివరకు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. -
పొట్టకూటి కోసం వెళ్లి..
● లారీ, బైక్ ఢీ ● నెల్లూరు జిల్లా వాసి దుర్మరణంనెక్కొండ: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా నెక్కొండ – వరంగల్ ప్రధాన రహదారిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్సై రవి కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (50) వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. మస్తాన్ నెక్కొండ నుంచి బైక్పై వస్తుండగా మార్గమధ్యలోని క్రషర్ మిల్లు వద్ద లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఏఎస్సై తెలిపారు. కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఇద్దరు కుమారులున్నారు. -
గురువులు..సమాజ శిల్పులు
ఉత్తమ బోధనతో.. ● నేడు జిల్లా స్థాయి గురుపూజోత్సవం ● 58 మందికి జిల్లా స్థాయి ● నలుగురికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు నెల్లూరులోని దర్గామిట్ట డీఎస్సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్న ఎం.ధనుంజయరావు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల పెంపు, బోధనలో ఉత్తమ పద్ధతుల ఆచరణ, పాఠశాల అభివృద్ధికి కృషి చేసినందుకు ఈయనను అవార్డుకు ఎంపిక చేశారు.నెల్లూరు (టౌన్): భారతీయ సంస్కృతిలో గురువుల స్థానం ఎంతో విశిష్టమైంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారిదే. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే వారు గురువులు. శిష్యుల ఎదుగుదలను తనివితీరా అస్వాదించే నిస్వార్థ జీవి. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసే గురువులను గౌరవించడం అందరి బాధ్యత. ఎందరికో విద్యా బుద్ధులు నేర్పి భరత మాతకు ముద్దు బిడ్డలు అందించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురుపూజోత్సవంగా జరుపుకోవడం జాతికి గర్వకారణం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధన, సమాజం, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. 58 మంది ఎంపిక జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 58 మందిని ఎంపిక చేశారు. వీరిలో 18 మంది గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో వరిగొండ జెడ్పీ హెచ్ఎస్కు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు యర్రగుంటి శ్రీనివాసులు, అల్లీపురంలోని ఎస్ఎస్సార్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఫిజిక్స్ ఉపాధ్యాయిని ఎస్ రాజేశ్వరి, నెల్లూరులోని కర్ణాలమిట్ట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ఆరుముళ్ల మాల్యాద్రి, కంటేపల్లి ఎంపీపీఎస్కు చెందిన ఉపాధ్యాయుడు జగన్నాఽథం రామ్మోహన్ ఉన్నారు. ● కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను శనివారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకు రిపోర్టు చేయాలి. -
6న జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపికలు
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 6వ తేదీన జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.విజయలక్ష్మీరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు 30 ఏళ్ల వయస్సు పైబడిన పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 8 గంటల్లోపు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు వచ్చేనెల 10, 11 తేదీల్లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.కుటుంబ సభ్యులకు మహిళల అప్పగింత నెల్లూరు(క్రైమ్): వివిధ కారాణాలతో బాలాజీ నగర్, సైదాపురం, వింజమూరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఐదుగురు మహిళలు తప్పిపోయారు. మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ) సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం, వివిధ విభాగాల సమన్వయంతో వారి ఆచూకీని గుర్తించి ఆయా ప్రాంత పోలీసుల ద్వారా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. శుక్రవారం డీఎస్పీ వేమారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఎవరైనా తప్పిపోతే ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి చేరకుండానే.. ● బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి ● నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అనుమసముద్రంపేట: పని నుంచి ఇంటికి బయలుదేరిన వృద్ధురాలిని మోటార్బైక్ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన మండలంలోని దుబగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దుబగుంట గ్రామానికి చెందిన కొండపరెడ్డి మహాలక్ష్మమ్మ (69), తన స్నేహితురాలు ఎడ్ల రమతో కలిసి ముత్తురాలు గ్రామ పరిధిలోని తోటకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లింది. పనులు ముగించుకుని ఇద్దరూ నడుచుకుంటూ దుబాగుంటకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో అవినాష్రెడ్డి అనే వ్యక్తి నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ మహాలక్ష్మమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమ, స్థానికుల చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ చించివేతపై ఫిర్యాదు జలదంకి(కలిగిరి): జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి దేవరపల్లి రఘురామిరెడ్డి శుక్రవారం జలదంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ మండల కన్వీనర్ ఇస్కా మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించి వేయడం మంచి సంస్కృతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు, వివాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. పోలీసులు ఫ్లెక్సీ చించి వేసిన వారిని పట్టుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కండలేరులో 18.82 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 18.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
మెడికల్ సంఘాన్ని విస్మరించడం బాధాకరం
● ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు నెల్లూరు(అర్బన్): ‘ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు వివిధ సంఘాల నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలవడం స్వాగతించదగిన పరిణామం. అయితే అత్యధికంగా అధికారులు, వైద్య ఉద్యోగులు ఉండే సంఘాన్ని పిలవకపోవడం బాధాకరం’ అని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల సుధాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని హరనాథపురంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంతో జరిగే సమావేశానికి ఉపాధ్యాయులు, రెవెన్యూ, రవాణా తదితర రంగాలకు చెందిన అసోసియేషన్ల నాయకులనే ఆ హ్వానించారన్నారు. రాష్ట్ర వైద్యశాఖలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బందితో కూడిన లక్షలాది మంది ఉద్యోగులున్నారన్నారు. వీరి సమస్యలపై పోరాడుతున్న మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన గుర్తింపు పొందిన హంస లాంటి సంఘాలను ఎందుకు పిలవలేదనే ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో ఉత్పన్నమైందన్నారు. మెడికల్, హెల్త్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టుల సర్దుబాటు, కేడర్ సమస్యలు, పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ సమస్యలు, సిబ్బంది కొరత, పనిభారం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే వైద్య సంఘానికి కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేసి తక్షణమే ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా సెక్రటరీ కమల్కిరణ్, గౌరవ సలహాదారు అరవ పరిమళ, జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ కార్యదర్శి గౌస్బాషా, వాకాడు తాలూకా ప్రెసిడెంట్ నాగయ్య, ఉపాధ్యక్షులు జయలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
నెల్లూరు (లీగల్): ఈనెల 12న ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.నరసింహమూర్తి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు హాల్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం సాయంత్రం సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులు లోక్ అదాలత్లో వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని స్టేషన్ల పరిధిలో లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో సుమారు 54,590 సివిల్, క్రిమినల్ కేసులను గుర్తించామని, రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారులు ఫోరమ్ చైర్మన్ జి.రవిశంకర్, డీఆర్వో విజయకుమార్, అడిషనల్ ఎస్పీ సౌజన్య, తిరుపతి డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, కమిషనర్ వై.నందన్, జిల్లా జైలు సూపరింటెండెంట్ సన్యాసిరావు, డీఎంహెచ్ఓ సుజాత, ఆర్టీఓ మొదాని మహమ్మద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ షమీమ్, ఎకై ్సజ్, విద్య, ఆరోగ్య, బ్యాంక్ ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్ల నుంచి చెబుతున్నా ఫలితం లేదు
నెల్లూరు(పొగతోట): సచివాలయాలు, ఆర్బీకేలు తదితర భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి.. భవనాలు పూర్తయి ప్రారంభోత్సవాలు చేసిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంపై రెండేళ్ల నుంచి అధికారులకు తెలుపుతున్నా ఫలితం లేదని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం నిర్వహించారు. మొత్తం ఏడింటిలో 2, 3 స్థాయీ సంఘాల సమావేశాలు కోరం లేని కారణంగా వాయిదా వేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని జెడ్పీటీసీ సభ్యులు సమావేశంలో వాదనకు దిగారు. జెడ్పీ సీఈఓ వసుమతికి ఇన్చార్జి మాత్రమే ఇచ్చారని, పూర్తి బాధ్యతలు ఇవ్వని కారణంగా జాప్యం జరిగిందని చైర్పర్సన్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సీఈఓకు ఎఫ్ఏసీ ఇచ్చారు కనుక బిల్లుల చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుంటామని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సమాధానమిచ్చారు. సచివాలయాలు, ఆర్బీకేల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభించామని, వాటికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని సభ్యులు పీఆర్ అధికారులను నిలదీశారు. ఈ విషయంపై సమావేశాల్లో పదే పదే చెబుతున్నా ఫలితం లేదని వాపోయారు. దీనిపై పీఆర్ అధికారులు సమాధానమిస్తూ రాష్ట్ర అధికారులకు తెలియజేశామని, ముఖ్యమైన భవనాలు పూర్తయిన తరువాత మిగిలిన వాటి విషయంపై చర్చిద్దామని చెప్పారన్నారు. బోరు వేయడానికి అనుమతించడం లేదు ఒకటిన్నర సంవత్సరం నుంచి బోరు వేయడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు సమావేశంలో చర్చించారు. పనులపై అధికారులను సంప్రదిస్తే ఫలితం ఉండడం లేదని కలెక్టర్కు పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పిస్తే సాయంత్రంలోపు పనులు జరుగుతున్నాయంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేసిన వ్యక్తులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. త్వరగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఆర్జీఎస్ఏ నిధులు రూ.1,952 లక్షలతో 61 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేశామన్నారు. వాటిలో 11 భవన నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించామని, నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలకు సంబంధించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు లేవనేత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎందుకీ జాప్యం సమస్యలను త్వరగా పరిష్కరించండి కోరం లేక 2, 3 స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక మనుబోలు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు చెందులూరు శ్రీనివాసులు, గుర్రం ప్రభాకర్ల ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాల వారు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరులోని తన నివాసంలో వారికి కాకాణి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో అధికార పక్షాన్ని వీడి వైఎస్సార్సీపీలో చేరడం అభినందనీయమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అసలైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు కూలి జనాన్ని తీసుకొచ్చి చేరికల పేరుతో డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఆవుల తుసీరామ్ యాదవ్ పాల్గొన్నారు. -
చి‘వరి’కి నీరేదీ?
● అధికారులను నిలదీసిన రైతులు ● తెలుగు గంగ కార్యాలయ ముట్టడి కలువాయి(సైదాపురం): రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పండించిన పంట చివరి దశలో సాగు నీరందక ఎండిపోతున్నాయని, తమ పొలాలకు నీరందించకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ మండలంలోని కనుపూరుపల్లి రైతులు అధికారులను నిలదీశారు. ఈ మేరకు వారు గురువారం తెలుగు గంగ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెయ్యి ఎకరాల్లో సాగు సోమశిల దక్షిణ కాలువ 8ఎల్ కింద సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంటను కనుపూరుపల్లి రైతులు సాగు చేస్తున్నారు. వరి వెన్ను దశలో ఉండగా ప్రస్తుతం చుక్కనీరు అందకపోవడంతో వరి పైరు తమ కళ్లెదుటే ఎండిపోతుండటంతో ఆవేదన చెందిన అన్నదాతలు తమ గోడును అధికారులకు విన్నవించుకునేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. నెల్లూరులో ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో చివరి పంట వరకు సాగునీరందిస్తామని చెప్పిన కూటమి నేతలు నిలువునా మోసం చేశారని వాపోయారు. అప్పులు చేసి పంటలను సాగు చేసుకుని పంట చేతికొచ్చే సమయంలో నష్టపోయే పరిస్థితులు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్పందించికపోతే రానున్న రోజుల్లో తాము కూడా బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు.చర్యలు తీసుకుంటాం సోమశిల జలాశయం నుంచి పంట కాలువ ద్వారా సాగునీరందిస్తున్నాం. ఎల్నినో ప్రభావం కారణంగా నీటి విడుదల తగ్గింది. ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. దీనిని 500 క్యూసెక్కులకు పెంచేలా ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. – మస్తానయ్య, డీఈ -
డివైడర్ వైపు దూసుకెళ్లిన కారు
● వ్యక్తి మృతి మర్రిపాడు: కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కండ్రిక– నందవరం మధ్య గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మర్రిపాడు మండలం తిమ్మాయపాళేనికి చెందిన వెంగయ్య(48) నెల్లూరులో నివాసం ఉంటూ కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో ఆయన డబ్బుల విషయమై సొంతూరికి వచ్చి తిరిగి వెళ్తుండగా కండ్రిక– నందవరం మధ్య కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో కారులోనే వెంగయ్య మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై బలరాంరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు బీడీ కార్మికుల సంక్షేమ నిధి వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవీ భాస్కర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బీడీ, మైకా, డోలమైట్ తదితర గనుల కార్మికుల పిల్లలు ప్రీ మెట్రిక్ విభాగంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పెంచారన్నారు. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ విభాగంలో చదువుతున్న పిల్లలు అక్టోబర్ 31వ తేదీలోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు నగరంలోని జెడ్పీ కాలనీలోని బీడీ కార్మికుల సంక్షేమనిధి వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ను సంప్రదించాలని కోరారు. కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ సైదాపురం: రటాఫిక్కు అంతరాయం కలిగించొద్దని, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆటోను తీయమని చెప్పిన కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన వ్యక్తిని సైదాపురం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాళహస్తిలో ఇటీవల ఓ కానిస్టేబుల్పై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మరువకముందే సైదాపురంలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కానిస్టేబుల్ ప్రేమ్కుమార్పై దాడికి పాల్పడిన మచ్చా వెంకటేశ్వర్లును సైదాపురం పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాపూరు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్ నుంచి దాడి జరిగిన ఘటనా స్థలం వద్దకు, అక్కడి నుంచి మళ్లీ సైదాపురం పోలీస్స్టేషన్ వరకు నిందితుడు వెంకటేశ్వర్లును నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దాడికి సంబంధించి స్థానికులను అడిగి క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఆంజనేయపురంలో పడవ దగ్ధం ● పరిహారం కోసం జేడీకి వినతి విడవలూరు: పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన మండలంలోని ఆంజనేయపురం గ్రామంలో బుధవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని రామతీర్థం పంచాయతీ ఆంజనేయపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పామంజి నరసింహ బుధవారం తన పడవలో చేపల వేటకు వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. పడవలో వంటకోసం పెట్టిన గ్యాస్ లీకై , పక్కన ఉన్న డీజిల్ క్యాన్కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పడవతో పాటు అందులో ఉన్న రూ.లక్షల విలువైన వేట వలలు, సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న మత్స్యకార నాయకులు ఆవుల వాసు, కొండూరు పోలిశెట్టి బాధితులతో కలిసి గురువారం నెలూరులోని మత్స్యకార జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావును ఆయన కార్యాలయంలో కలిసి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. -
ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా సంగం: గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని.. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను గుర్తించి.. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడమే పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని మక్తాపురంలో గురువారం నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడంతో పాటు రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు పది మంది లబ్ధిదారులకు పింఛన్లను మంజూరు చేశారు. మక్తాపురంలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోడౌన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలియజేయగా, ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపాల్సిందిగా ఆర్డీఓ పావనిని ఆదేశించారు. గ్రామంలో శ్మశాన వాటిక.. సంగంలో బస్టాండ్ ఏర్పాటు తదితరాలను చేపట్టనున్నామని వెల్లడించారు. గ్రామంలో జరుగుతున్న వీబీ – జీరామ్జీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలోని చిక్కుడు తోటలు.. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్, సీడీపీఓ సునీలత తదితరులు పాల్గొన్నారు. -
గణనాథుడి ఆలయంలో అపచారం
● జనసేన నేత బరితెగింపు ● వినాయకుడి ఆలయం వద్ద పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి గుమ్మడి కాయతో దిష్టి ● దెబ్బతిన్న భక్తుల మనోభావాలునెల్లూరు(బృందావనం): అధికార అహంకారం తలకెక్కిన కూటమి నేతల్లో భయం.. భక్తి లేకుండాపోతోంది. సనాతన ధర్మం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిత్యం వల్లె వేస్తున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దైవం అంటే డోంట్ కేర్ అనే భావన వారిలో నరనరాన జీర్ణించుకుపోతోంది. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ఆ పార్టీ నేత గునుకుల కిశోర్ అనుసరించిన వైఖరి తీవ్ర వివాదాస్పదమైంది. జరిగిందిదీ.. పాదరక్షలను పవన్ కల్యాణ్ ధరించి ఉన్న నిలువెత్తు ఫ్లెక్సీని నగరంలోని చిల్డ్రన్స్పార్కు రోడ్డులో గల వినాయకస్వామి ఆలయం వద్ద ఆనించారు. ఆపై కర్పూరాన్ని వెలిగించి.. టెంకాయలు, గుమ్మడికాయ కొడుతూ దిష్టి తీసి నినాదాలు చేస్తూ ఆలయ ప్రశాంతతకు భంగం వాటిల్లేలా వ్యవహరించారు. భక్తుల మనోభావాలు గాయపడేలా నినాదాలతో హోరెత్తించారు. ఆలయంలో కొలువైన వినాయకుడికి మాత్రం వీరెలాంటి పూజలను చేయకుండా తమ పార్టీ అధినేత ప్రాపకం కోసం పాకులాడారు. ఈ తంతును గమనిస్తున్న భక్తులు.. వారిస్తే ఏ సమస్య వస్తుందోననే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ తతంగాన్ని కొందరు తమ మొబైల్ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చివరికి విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేతలు మూడు గంటల తర్వాత ఫ్లెక్సీని తొలగించారు. పార్టీలకతీతంగా స్పందిస్తాం.. ఘటనపై హిందూ చైతన్య వేదిక నేత, జనసేన కార్యక ర్త కాకు మురళీరెడ్డి స్పందించారు. నేత నిర్వాకాన్ని తప్పుబట్టారు. హైందవ ధర్మానికి భంగం కలిగిస్తే పా ర్టీలకతీతంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ కార్యకర్తే ఖండించడం ఆ పార్టీలో సాగుతున్న పోరును స్పష్టం చేస్తోంది. -
వివరాలివ్వడంలో జాప్యం
దొంగే.. దొంగా.. దొంగా అని అరిచిన తరహాలో మారింది జిల్లాలోని నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగుల పరిస్థితి. ఉపాధి పనుల్లో అడుగడుగునా అవినీతి విలయతాండవం చేస్తుందనే అపవాదు ఉంది. దీన్ని నిజం చేస్తూ వర్కులు చేయకుండానే బిల్లులు చెల్లించడం.. ఐదుగురు కూలీలు పనిచేస్తే పది మందికి మస్లర్లేసి డబ్బులు కాజేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఇదే తరహాలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నిధులతో చేపట్టిన ప్రహరీల్లో చోటుచేసుకున్న అవినీతి బాగోతాలు ఇటీవలి కాలంలో బట్టబయలయ్యాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో డ్వామా పనితీరు.. అంతా డ్రామాగా మారింది. ఆ శాఖలో వెలుగుచూస్తున్న అవినీతి పర్వాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2018 – 23 మధ్యలో ఉపాధి నిధులతో జిల్లాలోని 389 పాఠశాలల్లో ప్రహరీలను దశలవారీగా చేపట్టారు. కలెక్టర్ అనుమతితో నిర్మాణ బాధ్యతలను సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీ శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించారు. అయితే ఇక్కడే భారీ అవినీతి జరిగింది. బిల్లులు.. పదేపదే చెల్లింపు కొన్ని పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులను రెండు సార్లు చెల్లించారు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న పనుల్లో కొంత మేరే ఇవ్వాల్సి ఉన్నా, అవేవీ పట్టించుకోకుండానే మొత్తం చెల్లించిన విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో జరిగిన అవినీతి బాగోతాలు మీడియాలో రావడంతో వాటిని సరిదిద్దుకునే యత్నాల్లో డ్వామా అధికారులున్నారని తెలిసింది. ఇదీ తంతు.. 2018లో అప్పటి టీడీపీ హయాంలో ఉపాధి నిధులతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలను చేపట్టారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక నాడు – నేడు మొదటి దశలో భాగంగా మరికొన్ని పాఠశాలల్లో నిర్మించారు. అప్పటి కలెక్టర్ల అనుమతితో బాధ్యతలను ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగంలోని సైట్ ఇంజినీర్లకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఎంపిక చేసిన సుమారు 115 పాఠశాలల నిర్మాణ బాధ్యతలను కేటాయించారు. మిగిలిన మండలాల్లోని స్కూళ్లను పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీలోని సైట్ ఇంజినీర్లకు అప్పగించారు. ఇలా మొత్తం 389 స్కూళ్లలో ప్రహరీల నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల విస్తీర్ణాన్ని బట్టి ప్రహరీకి రూ.ఐదు లక్షల నుంచి రూ.12 లక్షల్లోపు ఖర్చవుతుందని ఆయా శాఖ ఇంజినీర్లు చెప్తున్నారు. జిల్లాలో ఇంకేమైనా నాలుగైదు స్కూళ్లుంటే వాటికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవుతుంది. ఇవీ ఉదాహరణలు.. లొసుగులతో.. ఉపాధి పనుల బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) సాఫ్ట్వేర్ను టీసీఎస్ సంస్థ గతంలో నిర్వహించేది. అయితే దీన్ని తొలగించి ఎన్ఐసీని తీసుకొచ్చారు. అయితే టీసీఎస్ ఉన్న సమయంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎన్ఐసీ సాఫ్ట్వేర్ జీరో అని చూపింది. దీన్ని ఆసరాగా చేసుకొని పెండింగ్ పనులకు సైతం మొత్తం బిల్లులిచ్చారని తెలుస్తోంది. విజిలెన్స్.. సోషల్ ఆడిట్ నిధుల దుర్వినియోగ విషయం వెలుగులోకి రావడంతో విజిలెన్స్ విచారణకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ప్రస్తుతం ఇది జరుగుతోంది. మరోవైపు సోషల్ ఆడిట్ను నిర్వహించి సమగ్ర నివేదికను అందజేయాలని డ్వామా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. దీంతో శంఖవరం, నల్లగొండ్ల పాఠశాలల్లో ప్రహరీలకు రెండోసారి తీసుకున్న బిల్లుల నగదును తిరిగి డ్వామా శాఖకు చెల్లించారని తెలిసింది. ఇదే దారిలో నందిపాడు, ఏపీ మోడల్ స్కూళ్ల కాంట్రాక్టర్ ఉన్నారని సమాచారం. మొత్తమ్మీద రూ.ఐదు కోట్లకుపైగా నిధులు స్వాహా అయ్యాయని తెలుస్తోంది. డ్వామాలోని కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులు, ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన సైట్ ఇంజినీర్లు వాటాలు పంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయమై సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్యను సంప్రదించగా, విజిలెన్స్ అందించే నివేదిక ఆధారంగా చర్యలను కలెక్టర్ చేపట్టనున్నారని, ఎంకై ్వరీ జరుగుతున్న సమయంలో తానేమీ మాట్లాడకూడదని బదులిచ్చారు. ఉపాధి నిధులతో జిల్లాలోని 389 పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు సమగ్రశిక్ష, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఏపీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగాలకు బాధ్యతలు భారీగా నిధుల దుర్వినియోగం కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతివాటం రూ.ఐదు కోట్లకుపైగా అవినీతి వాస్తవాలు వెలుగులోకి రావడంతో సరిదిద్దుకునే యత్నం పర్యవేక్షణ మొత్తం వారిదే.. ఉపాధి నిధులతో నిర్మాణాలు జరుగుతుండటంతో పర్యవేక్షణ మొదలుకొని బిల్లులు చెల్లించేంత వరకు డ్వామా అధికారులే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. తొలుత ఎస్టిమేషన్, ఇసుక, ఇటుక, సిమెంట్, మెటీరియల్ తదితర ఖర్చుల వివరాలను ఎంబుక్లో ఆయా శాఖ సైట్ ఇంజినీర్ పొందుపరుస్తారు. అనంతరం దీన్ని ఆయా మండలంలో ఉండే డ్వామా ఏపీఓకు అందజేస్తారు. ఆపై వివరాలను స్కాన్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా అప్లోడ్ చేయిస్తారు. పాఠశాలకు డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్లి ప్రహరీని జియోట్యాగ్ ద్వారా ఫొటో తీసి వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పరిశీలించాక బయోమెట్రిక్ వేసి బిల్లుల చెల్లింపునకు ఎంపీడీఓ గ్రీన్ సిగ్నలిస్తారు. ఇవన్నీ జరిగాకే సదరు కాంట్రాక్టర్కు బిల్లులను చెల్లించాల్సి ఉంది. నెల్లూరు (పొగతోట): పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలను అందజేయడంలో సమగ్ర శిక్ష అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన స్టేట్ రిసోర్స్ పర్సన్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వర్కులకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర శిక్షకు సంబంధించిన మండలాధికారులు చేపట్టారు. ఉపాధి సిబ్బంది మాత్రం చివర్లో ఎంబుక్స్కు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేశారు. అయితే తాము అప్లోడే చేశామని, అవినీతి, అక్రమాల్లో తమకెలాంటి సంబంధంలేదని సమగ్ర శిక్ష అధికారులు పేర్కొంటున్నారు. అవినీతిపై నిగ్గుతేల్చేందుకు గానూ జిల్లాకు 15 మంది ఎస్సార్పీలను పీఆర్ కమిషనర్ పంపారు. అయితే ఎంబుక్స్, ఇతర వివరాలను సమగ్ర శిక్షకు సంబంధించిన మండలాధికారులు తీసుకురావడంలేదని సమాచారం. తమ వద్ద సమాచారం లేదని కొందరు బదులిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకపోతే బ్యాంక్ ఖాతాల్లో జమైన నగదును ఎందుకు తిరిగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్మాణాలు పూర్తయిన చోట రెండోసారి బిల్లులేశారు. కీలకమైన అధికారుల సహాయ, సహకారాల్లేనిదే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ ప్రక్రియను చేపట్టడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. కొంత మంది అధికారులు వారి బంధువులను కాంట్రాక్టర్లుగా ఎంపిక చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యేలా చేశారు. బిల్లులు చెల్లించే సమయంలో వీరిలో ఎవరైనా మరణిస్తే కాంట్రాక్టర్ను మార్చి మరొకరికి క్రెడిట్ అయ్యేలా చేశారు. ఇన్ని లొసుగులు చోటుచేసుకున్న తరుణంలో విచారణకు సహకరించకపోతే ఏసీబీ ఎంకై ్వరీకి ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు కుట్ర
వెంకటాచలం: సర్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో గురువారం సాయంత్రం పర్యటించిన ఆయన మాట్లాడారు. ఈ విషయంలో అధికారులపై టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా కూటమి ఎమ్మెల్యేలే వీరికి ఫోన్లు చేసి ఇలా వ్యవహరించాలని హుకుం జారీ చేస్తూ.. అధికార దుర్వినియోగంతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని అర్హతలున్నా తమ పార్టీ మద్దతుదారులకు నోటీసులిస్తూ.. అర్హత లేకపోయినా టీడీపీ వారికి జారీ చేయడంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబు.. చివరికి నమ్మకం లేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తమ పార్టీ మద్దతుదారులకు కేటాయించిన ప్లాట్లు, అసైన్మెంట్ భూములను రద్దు చేసేందుకు కుట్రలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు అన్ని రకాల విచారణలు జరిపి అసైన్మెంట్ భూములను అర్హులకు చట్టబద్ధంగా ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తెచ్చి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులను రద్దు చేయించడం దారుణమన్నారు. ఇందులో తప్పులుంటే ముందుగా అధికారులపై చర్యలు చేపట్టాలే గానీ, కేవలం తమ పార్టీకి చెందిన వారి భూములను రద్దు చేయడం సరికాదని హితవు పలికారు. సర్వేపల్లిలో సర్వం దోపిడీ కూటమి ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యమేలుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శివాలయ భూములను ఆక్రమించి లేఅవుట్ వేసిన యజమానుల వద్ద ఎలాంటి లబ్ధి పొందలేదంటూ ప్రమాణం చేయగలరానిని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయంలో ఆయన కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో తన నాయకత్వంలో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేశారు. వెంకటాచలం పంచాయతీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి మాజీ సర్పంచ్ మందల రాజేశ్వరి, ఆమె భర్త మందల వెంకటశేషయ్య ఎంతో కృషి చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వెంకటాచలం పంచాయతీలో టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులను సృష్టించినా, అన్నింటినీ దీటుగా ఎదుర్కొని సమర్థంగా పాలించారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పారిశుధ్య లోపం పెరిగిపోయిందని, అపరిశుభత్ర రాజ్యమేలుతున్నా, పట్టించుకునే వారే కరువయ్యార ని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేత సండ్రా రవి సజీవంగా ఉన్న సమయంలో ఆయన దుకాణం వద్ద గుంతలను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తవ్వించి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలు, కక్షసాధింపు చర్య లను లెక్కగడుతున్నామని వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కాకాణి స్పష్టం చేశారు. సండ్రా రవి మృతిపై దిగ్భ్రాంతి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సండ్రా రవి నివాసానికి కాకాణి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కాంక్షించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, నేతలు కొణిదెన విజయభాస్కర్నాయుడు, మందల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో అధికారులపై కూటమి ఎమ్మెల్యేల ఒత్తిడి అధికార దుర్వినియోగంతో రాజ్యాంగం అపహాస్యం ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
ఉద్యోగుల సత్తా చూపిస్తాం
● అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన నెల్లూరు(అర్బన్): కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు ఏదో చేస్తుందని భావించామని, రెండున్నరేళ్లు అయినా తమను పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల ఉద్యమ సత్తా చూపించి ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, అంతవరకు న్యాయమైన ఐఆర్ ఇవ్వాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. అలాగే నగరంలోని ఆర్డీఓ, ఆర్అండ్బీ, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ శాఖ ఇలా పలు కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన జరిగింది. ఈ సందర్భంగా పెంచలరెడ్డి నెల్లూరులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు 30 వేల కోట్లకు పైగా బకాయిలు ఉందన్నారు. తమకు పీఆర్సీ ఇవ్వనందున ప్రతి ఉద్యోగి రూ.లక్షల్లోనే నష్టపోతున్నారన్నారు. తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. ఎన్నో వినతి పత్రాలిచ్చామన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుండా నాన్చుడి ధోరణితో కాలం వెళ్ల బుచ్చుతోందన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే దశల వారీగా ఉద్యమించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుని పోరుబాట పట్టామన్నారు. కార్యక్రమాల్లో జేఏసీ జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్, మహిళా విభాగం చైర్పర్సన్ బాలకోటమ్మ, కో చైర్పర్సన్ శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై మొదలైన ఉద్యమం
నెల్లూరు(అర్బన్): దాదాపు రెండున్నరేళ్లుగా నిరీక్షించినా.. ఎన్నో వినతిపత్రాలిచ్చినా.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం, నాన్చుడు ధోరణిని అవలంబించడంతో ఉద్యమాన్ని ప్రారంభించామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు మంగళవారం హాజరై నిరసన తెలిపారు. ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, కలెక్టరేట్, వైద్య, ఆరోగ్య శాఖ ఇలా అన్ని విభాగాల ఉద్యోగులు ఇలా విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని దశలవారీగా విస్తరిస్తూ.. దీర్ఘకాలిక పోరుబాటగా మారుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని వెల్లడించారు. తొలి రోజు భోజన విరామ సమయంలో ధర్నాలను చేపట్టామన్నారు. సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అనే నినాదం ప్రతి ఉద్యోగి తమ వాట్సాప్ డీపీగా పెడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా తమకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు పీఆర్సీని వేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు -
సమయపాలనను పాటించాల్సిందే
పొదలకూరు: సచివాలయ ఉద్యోగులు సమయపాలనను పాటించి సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పొదలకూరు బిట్ – 3, 4 సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. బిట్ – 4 సచివాలయంలో విధులకు డిజిటల్ అసిస్టెంట్ సక్ర మంగా హాజరుకావడం లేదనే ఫిర్యాదులందాయని, షోకాజ్ నోటీస్ను జారీ చేయాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. నెలకెన్ని సర్టిఫికెట్లను అందజేస్తున్నారనే వివరాలను ఆరాతీశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికెళ్లి అక్కడి సిబ్బందితో మా ట్లాడారు. రీ సర్వే తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ నరసింహరావు, తహసీల్దార్ శివకృష్ణయ్య పాల్గొన్నారు. -
విద్యుత్ లైన్ల మార్పిడి పనికెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో 17 మందికి గాయాలు ● క్షతగాత్రులు జార్ఖండ్కు చెందిన కూలీలు ● పరామర్శించిన కలెక్టర్ హిమాన్షు శుక్లావెంకటాచలం: దోస్త్ వాహనం బోల్తా పడి 17 మంది జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు గాయపడిన ఘటన వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 21 మంది కూలీలు తిరుపతి జిల్లా బాలాయపల్లి సమీపంలోని దగ్గవోలు వద్ద విద్యుత్ లైన్ల మార్పిడికి సంబంధించిన పనుల నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. వీరంతా దోస్త్ వాహనంలో నెల్లూరు నుంచి బాలాయపల్లికి వెళ్తుండగా చెముడుగుంట సమీపానికి చేరుకోగానే ముందుగా వెళ్తున్న లారీ నెమ్మదించడంతో దోస్త్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పర్యవేక్షించిన కలెక్టర్ నెల్లూరు(అర్బన్): క్షతగాత్రుల్లో ఒకరిని పెద్దాస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆస్పత్రికి చేరుకుని రోగులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను విచారణ జరిపి నివేదిక అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ అనూష, కార్మికశాఖ అధికారి విజయకుమార్రెడ్డిని ఆదేశించారు. రోగులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓ కాంట్రాక్టర్ 21 మంది కూలీలను జార్ఖండ్ నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు, ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్కు రూ.లక్ష అందించాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపి ఫోన్ పే ద్వారా నగదు అందించాలని పేర్కొన్నారు. బాధితులంతా కోలుకునే వారికి వారి యోగక్షేమాలు చూసుకోవాలని, వేతనాన్ని కూడా పూర్తిగా చెల్లించాలన్నారు. నర్సులపై ఆగ్రహం కలెక్టర్ క్షతగాత్రులను పరిశీలించేందుకు ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా వారికందుతున్న వైద్యం పరిశీలించి నర్సులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పేషెంట్కు శరీరంపై మట్టి కూడా క్లీన్ చేయలేదని, మీ అన్న, తమ్ముడికో ప్రమాదం జరిగితే ఇలాగే వైద్యం చేస్తారా అని ప్రశ్నించారు. హక్కులంటూ సమ్మెలు చేయడమే కాదు.. సేవలు కూడా సక్రమంగా నిర్వర్తించాలంటూ హితవు పలికారు. ఇదే సందర్భంలో సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఉద్దేశించి మాట్లాడుతూ కనీసం మీరు రౌండ్స్ వేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. లిఫ్ట్ ఎందుకు పని చేయలేదని ప్రశ్నించారు. దీంతో సూపరింటెండెంట్ ఇప్పుడే ఆగిపోయిందని బదులిచ్చారు. దీంతో కలెక్టర్ చిరాకు పడ్డారు. ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతారా అంటూ ప్రశ్నించారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు తదితరులు రోగులను పరామర్శించారు. -
కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్ల మోసం
● ఆలస్యంగా వెలుగులోకి నెల్లూరు (క్రైమ్): కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్లు మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు సరస్వతీనగర్కు చెందిన పి.అనూష ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అవినాష్ మరి కొందరు కలిసి కన్సల్టెన్సీ కార్యాలయం నిర్వహిస్తున్నారని, విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు, నారాయణ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని, డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని, దుబాయి నుంచి తక్కువ ధరకే బంగారు నాణేలు తెప్పిస్తామని నమ్మించి తన భర్త, తన స్నేహితుల బ్యాంకు ఖాతాల నుంచి వివిధ ఖాతాలకు రూ. 6,32,71,497 నగదు బదిలీ చేయించుకుని మోసగించారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మారణాయుధాలతో బెదిరించరాని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమార్తెను చంపేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. తనను మోసగించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతోపాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 77,042 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 36,698 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు గల వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సమయానికంటే ముందెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కూటమి పాలనతో అంధకారంలోకి రాష్ట్రం
● ఉద్యోగాల కోసం పోరాటాలు తప్పవు ● డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు జాక్ సి.థామస్నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాటిని నెరవేర్చలేక రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది’ అని డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. నెల్లూరు నగరంలో మూడురోజులపాటు జరిగే డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వీఆర్సీౖ మెదానం నుంచి నర్తకీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసి బహిరంగ సభలో డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు జాక్ సి.థామస్ మాట్లాడారు. దేశంలో పోరాటాలు చేస్తున్న యువతకు డీవైఎఫ్ఐ అండగా నిలుస్తుందన్నారు. సాధారణ ప్రజలు, రైతులు, యువత, విద్యార్థులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ఒక సంవత్సరంలో 750 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రధాని మోదీ 13 ఏళ్ల పాలనలో ఆకలిచావులు, నిరుద్యోగం, నీట్ పేపర్ లీక్లు, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ శాఖల్లో 8 లక్షలు, రాష్ట్రంలో 2.14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను వెంటనే భర్తీల చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించాలన్నారు. రాజకీయ జవాబుదారీతనంపై యువత ప్రశ్నించాలని కోరారు. నేడు రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గంజాయిని అరికట్టడంతో కూటమి నాయకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామన్న, రాము, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ, రాజు, శివ, బాబు, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంక్లో నగదు చోరీ
సీతారామపురం: మండలంలోని బసినేనిపల్లిలోని వెంకటదుర్గా ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్లో రూ.60 వేల నగదు చోరీకి గురైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. బంక్ యజమాని కథనం మేరకు.. సోమవారం వేకువజామున 3:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై పెట్రోల్ బంక్కు వచ్చాడు. అక్కడ వాచ్మెన్, పంప్ బాయ్ నిద్రపోతున్నారు. అతను పరిసరాలను గమనించాడు. ఆఫీస్ గది తాళం చెవి తలుపుకే ఉండటంతో లోపలికి ప్రవేశించి డెస్కులో ఉన్న రూ.60 వేల నగదును అపహరించాడు. అనంతరం తలుపు వేసి, తాళం చెవిని యథావిధిగా అక్కడే ఉంచి స్కూటీపై సీతారామపురం మార్గంలో వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు నిద్రలేచిన సిబ్బందికి నగదు కనిపించకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని యజమానికి సమాచారం అందించారు. దీంతో ఆయన సీసీ ఫుటేజీలో నమోదైన దొంగ ఫొటో ఆధారంగా పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అదేరోజు మార్కాపురం జిల్లా కొత్తపల్లి టోల్ప్లాజాను నిందితుడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. యజమాని సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్క్రాస్ సొసైటీకి అరుదైన గుర్తింపు నెల్లూరురూరల్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ అందిస్తున్న విశేష సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. ఐఆర్సీఎస్ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు రక్తదాన కార్యక్రమాల విస్తరణ, లైఫ్ మెంబర్ల నమోదులో సాధించిన ప్రగతిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. 15,747 యూనిట్ల రక్తం సేకరణ జిల్లా ఐఆర్సీఎస్ శాఖలో ఇప్పటి వరకు 2,097 మంది లైఫ్ మెంబర్లు నమోదు చేసుకున్నారు. వివిధ రక్తదాన శిబిరాల ద్వారా 15,747 యూనిట్ల రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి అందుబాటులో ఉంచడంలో జిల్లా శాఖ కీలకపాత్ర పోషించింది. గోల్డ్మెడల్ దక్కడంపై అధికారులు, ఐఆర్సీఎస్ సభ్యులు, వలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.150 సన్నవి : రూ.85 పండ్లు : రూ.40 -
పొదుపు సంఘాలకు రూ.600 కోట్ల రుణాలు
● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సంగం: ‘2026 – 27 ఆర్థిక సంవత్సరానికి పొదుపు సంఘాలకు బ్యాంక్ల ద్వారా రూ.1,600 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల మేర రుణాలు అందించాం’ అని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. సంగం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో పొదుపు సంఘాల పనితీరు, రుణాల మంజూరు, రికవరీ తదితర అంశాలపై వీఓఏలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ్త్రనిధి కింద రూ.11 కోట్ల లక్ష్యానికి గానూ ఇప్పటికే రూ.6 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జీవనోపాధుల కల్పన కోసం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.2 కోట్ల మేర అందించినట్లు పేర్కొన్నారు. సీఐఎఫ్ కింద రూ.17 కోట్ల లక్ష్యానికి గానూ రూ.16 కోట్లను సభ్యులకు అందించినట్లు వివరించారు. జిల్లాలో అన్ని పథకాల కింద పొదుపు సంఘాల సభ్యులకు అందించిన రుణాల రికవరీ 96 శాతానికి పైగా ఉందని తెలిపారు. వివిధ యాప్ల వినియోగంలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాగే పొదుపు సంఘాల సభ్యులు జీవనోపాధి కోసం వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అవసరమైన శిక్షణను మండల కేంద్రాల్లోనే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మధుసూదన్రావు, ఏపీఎం రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశాన్నంటిన నిమ్మ ధరలు
● బస్తా కాయలు రూ.16 వేలు పొదలకూరు: నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తా కాయల ధర రూ.16 వేలు పలుకుతోంది. మార్కెట్లో అధిక ధరలున్నా, కాపు లేకపోవడంతో రైతులకు వింత పరిస్థితి ఎదురైంది. దీంతో కర్షకులతో నిత్యం కళకళలాడే పొదలకూరు నిమ్మ మార్కెట్ వెలవెలబోతోంది. పొదలకూరు మార్కెట్ పరిధిలోని నాలుగైదు మండలాల్లో చెట్లకు కాయల్లేకపోవడంతో నిమ్మకాయలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. గత మంగళవారం 80 కిలోల బస్తా ధర సుమారు రూ.12 వేల వరకు పలకగా, ప్రస్తుతం రూ.16 వేల వరకు చేరుకుంది. కాయల నాణ్యత, పరిమాణాన్ని బట్టి బస్తా రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతోందని మార్కెట్ వ్యాపారులు వెల్లడించారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నెల్లూరు(పొగతోట): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీ కార్యాలయంలో గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహించనున్నామని సీఈఓ వసుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు హాజరుకావాలని కోరారు. 93 శాతం మందికి పింఛన్ల పంపిణీ నెల్లూరు(పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 93 శాతం మంది లబ్ధిదారులకు నగదును మంగళవారం అందజేశారు. 2,85,316 మందికి గానూ 2,65,344 మందికి పంపిణీ చేశారు. రానున్న రెండు రోజుల్లో మిగిలిన వారికి అందజేయనున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. శ్రామికుల సంఖ్యను పెంచండి నెల్లూరు(పొగతోట): వీబీ జీరామ్ జీ ద్వారా పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి.. శ్రామికులతో చేయించి వారికి ఉపాధిని కల్పించాలని సూచించారు. కూలీలకు 15 రోజులకోసారి పేమెంట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నారని వెల్లడించారు. జాప్యం జరిగితే వడ్డీతో సహా వేయనున్నారని తెలిపారు. హార్టికల్చర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎస్పీడీసీఎల్ ఎస్ఈ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈగా బాధ్యతలను సుధాకర్ నగరంలోని విద్యుత్ భవన్లో మంగళవారం స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా ఉన్న రాఘవేంద్రం ఉద్యోగ విరమణ పొందారు. ఈ తరుణంలో విద్యుత్ విజిలెన్స్ విభాగంలో ఈఈగా పనిచేస్తున్న సుధాకర్ను ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులను సీఎండీ శివశంకర్ జారీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ను అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కాగా ఆయనకు శుభాకాంక్షలను పలువురు తెలియజేశారు. డీపీఓగా.. నెల్లూరు(పొగతోట): జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలను వెంకటరామన్ స్వీకరించారు. నరసాపురం డీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన్ను డీపీఓగా నియమిస్తూ ఉత్తర్వులను అధికారులు జారీ చేసిన విషయం విదితమే. -
డీసీపల్లిలో 616 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 616 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 824 బేళ్లు రాగా వాటిలో 616 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలియజేశారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.250 కాగా కనిష్ట ధర రూ.110 లభించింది. మొత్తమ్మీద సగటు ధర రూ.187.90 గా నమోదైంది. వేలంలో పది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. కిలో పొగాకు ధర రూ.161 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు సరాసరి ధర రూ.161.36 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 1,012 పొగాకు బేళ్లను తీసుకురాగా 798 బేళ్లను కొనుగోలు చేయగా 214 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 పలకగా, కనిష్ట ధర రూ.110 వచ్చిందన్నారు. వేలంలో 11 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. -
నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసన
నెల్లూరు(అర్బన్): ఆర్అండ్బీ శాఖలో వాచ్మెన్గా పనిచేస్తూ ఓ వ్యక్తి మరణించగా, అతని భార్య తుపాకుల వెంకటరమణమ్మకు ఒకటిన్నర సంవత్సరంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగ ఇవ్వనందున నష్టపరిహారం చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ చైర్మన్ ఈవీఎం శరత్బాబు డిమాండ్ చేశారు. వెంకటరమణమ్మకు నష్టపరిహారంతోపాటు జియావుల్ హక్ అనే వ్యక్తికి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంగళవారం నెల్లూరు దర్గామిట్టలోని ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శరత్బాబు మాట్లాడుతూ ఆర్అండ్బీ శాఖలో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. వెంకటరమణమ్మ తన భర్త మృతిచెందిన తర్వాత బతికేందుకు చాలా అవస్థలు పడుతోందన్నారు. ఇంటిపై రుణం తీసుకుని ఉన్నందున బ్యాంక్ వారు తాళాలు తీసుకుని ఆమెను బయటకు నెట్టేశారన్నారు. సకాలంలో ఉద్యోగం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మరో గిరిజన మహిళకు ఇలా జరగకుండా ఉండాలన్నారు. ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. జియావుల్ హక్కు ఇంకా ఉద్యోగం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అలాగే మినిస్టీరియల్ ఉద్యోగులకు, వర్క్ చార్జెడ్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన ఉధృతం
● రెగ్యులర్ చేయాలంటూ సంతకాల సేకరణ ● ఆన్లైన్ సేవలు ఆపడంతో రోగులకు ఇక్కట్లు నెల్లూరు(అర్బన్): డిమాండ్లు తీర్చాలంటూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలు, సీహెచ్సీలు, బోధనాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. నర్సులు, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతూ భోజన విరామ సమయంలో ధర్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తమ ఆందోళనకు మద్దతుగా సంతకాలు సేకరణ చేపట్టారు. డాక్టర్లు, రెగ్యులర్ నర్సులు, ఉద్యోగులు, ఆస్పత్రికి వచ్చేవారికి తమ న్యాయమైన డిమాండ్లు వివరిస్తూ తమ ఆందోళనలకు మద్దతుగా సంతకాలు సేకరించారు. 20 సంవత్సరాల క్రితమే.. మధ్యాహ్నం ఐపీ భవనం వద్ద ధర్నా జరిగింది. వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సందాని బాషా మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు. ఈ విధానం సమాజానికి మంచిది కాదన్నారు. సెలవులు, పెన్షన్ లాంటి ఎలాంటి సౌకర్యాల్లేకుండా కేవలం జీతంపైనే ఆధారపడి కాంట్రాక్ట్ పద్ధతిలో 15 నుంచి 20 ఏళ్లకు పైగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు పని చేస్తున్నారన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్గ్రేస్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలన్నారు. అప్పటి వరకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధినిర్వహణలో మరణించిన కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషి యా ఇవ్వాలన్నారు. ఈపీఎఫ్తోపాటు అనారోగ్యానికి గురైతే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మ్యూచ్వల్, రిక్వెస్ట్ బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈనెల 8 నుంచి అన్ని రకాల సేవలు ఆపేసి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. రోగులకు తప్పని తిప్పలు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న నర్సులు ఆన్లైన్ సేవలు ఆపేయడంతో రెండోరోజు కూడా రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ఓపీలు ఇవ్వడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం 8 గంటలకు రోగులకు ఓపీలు రాయాల్సి ఉండగా 9:30 గంటల వరకు కూడా ఇవ్వలేదు. న్యూరోఫిజీషియన్ పక్కనే ఉండే ఓపీ రూమ్లో అయితే ఏకంగా 10 గంటల వరకు కూడా సిబ్బంది రాకపోవడంతో రోగులు గంటలపాటు నిలబడిపోయారు. పదిగంటలకు ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు వచ్చిన తర్వాతే ఓపీలు రాయడం మొదలు పెట్టారు. దీంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. -
వేమిరెడ్డే మైనింగ్ డాన్
● చైనాకు చెందిన డౌతో సంబంధాలపై సమాధానమివ్వాలి ● కేంద్ర మంత్రి జైశంకర్కు లేఖ రాసింది నిజం కాదా..? ● కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నాం ● మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ నెల్లూరు రూరల్: జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. డబ్బున్న కొందరు వైట్కాలర్ నేరాలకు పాల్పడిన తరహాలో ఆయనా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను సంధించిన ప్రశ్నలకు గానూ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని విమర్శించారు. డౌతో సంబంధమేమిటి..? కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి లేఖ రాశారని, చైనాకు చెందిన ఐదుగురికి ఇక్కడ మైనింగ్ వ్యాపారానికి అనుమతులివ్వాలని అందులో కోరారనే ఆధారాలను అనిల్ చూపారు. వీరిలో డౌ సైతం ఉన్నారని, ఆయనతో వేమిరెడ్డికి ఉన్న సంబంధమేమిటో తెలియజేయాలని డి మాండ్ చేశారు. ఇందులో వేమిరెడ్డికి సంబంధం లేదంటూ రవిచంద్ర మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. వేమిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయని, దీనిపై ఆయన ఆన్సరివ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను మైనింగ్ యజమానులు తన దృష్టికి తీసుకొచ్చారని, వీరి బాధలపైనే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. గనులుంటేనే మైనింగ్పై మాట్లాడాలానని ప్రశ్నించారు. మేయర్నని చైనాలో పరిచయం చేసుకున్నారు..! నవంబర్ ఐదు, 2024 మేయర్గా గిరిజన మహిళ ఉన్న సమయంలో, మరో వ్యక్తి చైనాలో తనను తాను మేయర్గా పరిచయం చేసుకోవడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. వేమిరెడ్డికి చెందిన వ్యక్తిగా పేర్కొంటున్న రమణకుమార్తో కలిసి చైనాలోని సినోమా అనే కంపెనీ వద్దకెళ్లి, ఇలా చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే తీవ్రమైన అంశమన్నారు. ఈ వ్యవహారం వేమిరెడ్డికి తెలిసే జరిగిందానని ప్రశ్నించారు. ఎందుకు వెనుకేసుకొస్తున్నారు..? మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ను ప్రశ్నించారు. ఫేక్ మేయర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ఇంకా ఎన్ని స్కాములు జరిగాయో వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం వెనుక వేమిరెడ్డితో ఏమైనా లోపాయికారీ ఒప్పందం ఉందాననే అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. రవిచంద్ర, నారాయణ, శ్రీధర్రెడ్డికి అనిల్ పలు ప్రశ్నలను సంధించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని డిప్యూటీ మేయర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని కోరారు. దీనంతటికీ బాస్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉదంతంపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. పూర్తి వివరాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము కూడా రాజకీయాల్లో సేవ చేశామని, అయితే ఇలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు. చట్టానికెవరూ అతీతులు కారు డబ్బున్నంత మాత్రాన చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మైనింగ్, చైనా లింకులు, ఫేక్ మేయర్ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. -
పసిబిడ్డతో అత్తింటి ఎదుట గర్భిణి కన్నీటి పోరాటం
నెల్లూరు జిల్లా: మూడేళ్ల పాప.. కడుపులో మరో బిడ్డ.. అయినా మెట్టింటి గడప దాటనివ్వని పరిస్థితి. భర్త, అత్తమామలు తనను విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారంటూ ఐదో నెల గర్భిణి అత్తింటి ఎదుట బైఠాయించింది. తరచూ వేధించి పుట్టింటికి పంపిస్తున్నారని ఆరోపించింది. భర్త మరో వివాహం చేసుకునేందుకే తనను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మండలంలోని కొడవలూరు రైల్వేగేట్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. కొడవలూరు రైల్వే గేట్ కాలనీకి చెందిన చిత్తూరు జయకుమార్ వరికోత యంత్రం డ్రైవర్గా పనిచేస్తున్నారు. వరి కోతల సీజన్లో వృత్తిరీత్యా వివిధ జిల్లాలకు వెళుతుంటారు. మూడేళ్ల క్రితం ఒంగోలు వెళ్లిన సమయంలో అక్కడి పూజల చెంగమ్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో 2023 ఆగస్టు 30న కొడవలూరు విష్ణు ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ప్రస్తుతం చెంగమ్మ ఐదో నెల గర్భిణి. విడాకులివ్వాలంటూ వేధిస్తున్నారు గత ఐదు నెలలుగా భర్త తనను వేధిస్తున్నారని, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ తరచూ పుట్టింటికి పంపిస్తున్నారని చెంగమ్మ ఆరోపించారు. వృత్తిరీత్యా మచిలీపట్నం వెళ్లిన జయకుమార్కు మరో యువతితో పరిచయం ఏర్పడిందని, ఆమెను వివాహం చేసుకునేందుకే తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని వాపోయారు. భర్తకు అత్తమామలు కూడా మద్దతుగా నిలిచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం తన తల్లి, పిన్నమ్మతో కలిసి మూడేళ్ల కుమార్తెను వెంట బెట్టుకుని జయకుమార్ ఇంటి ఎదుట బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు భర్త వేధింపులపై గతంలో ఒంగోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెంగమ్మ తెలిపారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారని చెప్పారు. అనంతరం కొద్దిరోజులు సజావుగా ఉన్నప్పటికీ మళ్లీ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. పోలీసుల రంగప్రవేశం చెంగమ్మ అత్తింటి ఎదుట బైఠాయించిన విషయం తెలియడంతో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక సీఐ, ఎస్సైలు విధుల్లో భాగంగా బయటకు వెళ్లడంతో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు, అత్తింటి వారిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. జయకుమార్ వరి కోతల నిమిత్తం నాయుడుపేట వెళ్లి ఉండటంతో ఆయన్ను కూడా కొడవలూరు పోలీస్స్టేషన్కు రావా లని సమాచారం ఇచ్చారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించి, దంపతులు కలిసి ఉండేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 154 మంది హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వినతులను పరిశీలించిన ఎస్పీ.. చట్టపరిధిలో విచారించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, మహిళా పోలీస్స్టేషన్, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి, బి.పాపారావు, దశరథరామారావు, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● కెమికల్స్, మెటీరియల్స్ సరఫరా చేస్తానని హైదరాబాద్కు చెందిన ప్రశాంత్రెడ్డి తమ వద్ద రూ.51.85 లక్షలు తీసుకుని మోసం చేశాడని చిల్లకూరు ప్రాంతంలోని ఎంఓ మినరల్స్ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేశాడు. ● సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన యదువీర్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశాడని కోవూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు. ● కార్తీక్తేజ్ అనే వ్యక్తి వెంటబడి వేధిస్తున్నాడని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. ● భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రం అందజేశారు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన ఉధృతం
● జీజీహెచ్లో ఆన్లైన్ సేవలు బంద్ ● ఓపీ కోసం బారులు తీరిన రోగులు నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలను కాంట్రాక్ట్ నర్సులు ఉధృతం చేశారు. గత వారం రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన వారు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సోమవారం ఆన్లైన్ సేవలను నిలిపేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టు నర్సులు ఆన్లైన్ సేవలందిస్తుండటంతో ఓపీ సాఫీగా జరిగి పోయేది. అయితే ఇప్పుడు వారి ఆందోళనల నేపథ్యంలో ఆన్లైన్ చేసి ఓపీ రాసిచ్చే వారు లేకపోవడంతో ఓపీ రూముతో పాటు వరండాలో వందల సంఖ్యలో రోగులు బారులు తీరి నిలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జీజీహెచ్ సూపరింటెండెంట్, తదితరులు హడావుడిగా ఆరోగ్యశ్రీ, ఇతర విభాగాల వద్ద ఉండే డేటాఎంట్రీ ఆపరేటర్లను పిలిపించి ఆన్లైన్ ద్వారా ఓపీలు రోగులకు అందజేయాలని కోరారు. అంతలోనే సర్వర్ కూడా కొంతసేపు పని చేయలేదు. ఉదయం 8 గంటల నుంచే ఓపీ చీటీలు రాయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మందికి 11.30 గంటల వరకు కూడా ఇవ్వలేదు. రోగులు ఓపీలు తీసుకుని డాక్టర్ను కలిసే సమయానికి మధ్యాహ్నమైంది. దీంతో వైద్యులు నామమాత్రంగా పరీక్షలు రాసేసి వెళ్లిపోయారు. రోగులు పరీక్షలు చేయింకుని వచ్చేసరికి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులే దిక్కయ్యారు. కాంట్రాక్ట్ నర్సుల ఆందోళనతో రోగుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. నల్లరిబ్బన్లు ధరించి నిరసన భోజన విరామసమయంలో నర్సులు నల్లరిబ్బన్లు ధరించి ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు సతీష్, సందానిబాషా మద్దతు తెలిపారు. జేఏసీ కన్వీనర్ శరత్బాబు మాట్లాడుతూ తమను రెగ్యులర్ చేయాలని అంతవరకు 100 శాతం గ్రాస్ శాలరీతో కూడిన వేతనం మంజూరు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి ఈపీఎఫ్ చెల్లించాలని, జబ్బుచేస్తే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న తమకు రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము సేవలు బంద్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సులు మేరి, మాధురి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
గోడు వినండి.. న్యాయం చేయండి
● మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ● కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులునెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై మండలస్థాయి అధికారులకు ఎన్నోసార్లు అర్జీలిచ్చాం. అయినా పరిష్కారం కాలేదు. అందుకే వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చాం. మీరైనా ఆలకించి పరిష్కరించండి’ అంటూ పలువురు అర్జీదారులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్, డీఆర్వో విజయకుమార్, డీసీఓ గుర్రప్ప, మెప్మా, డీఆర్డీఏ, డ్వామా పీడీలు కిరణ్కుమార్, నాగరాజకుమారి, శ్రీనివాసప్రసాద్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
పొలం ఆక్రమిస్తున్నారు
చేజర్ల మండలం వావిలేరు గ్రామంలోని సర్వే నంబర్ 188/6లో మునగాల లక్ష్మీశైలజ వద్ద 0.62 సెంట్ల పట్టా పొలం కొనుగోలు చేసి కుమార్తె అజీజున్నీసా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. అయితే ఆమె 2011లో మృతి చెందింది. అప్పటి నుంచి పొలంలో జామాయిల్ చెట్లు పెంచుతున్నారు. గ్రామానికి చెందిన చిల్లంకూరు నాగార్జున, స్వాతి, సులోచనలు నా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారిని హెచ్చరించినా.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. జామాయిల్ చెట్లను విక్రయించగా.. వాటిని కూలీలతో కొట్టించేందుకు ప్రయత్నించిన సమయంలో అడ్డుకున్నారు. – షేక్ అమీర్బాషా, అక్కంపేట, మనుబోలు మండలం -
క్రషర్ మైన్తో మా జీవితాలు గుల్ల
మా గ్రామానికి ఆనుకుని స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. పెద్ద బండరాళ్లను పేలుడు పదార్థాలతో పగులగొడుతుండటంతో భారీ శబ్దాలకు ఇళ్లలోని వస్తువులు కిందపడిపోతున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కంకర పొడి కారణంగా పంటలు బూడిదమయం అవుతున్నాయి. సంబంధిత ఏఎంఆర్ మైన్స్ను మూసివేయించి గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడాలి. – చిన్న, యజ్దాని బాషా, సుబ్బరాయుడు, హజరత్తయ్య, అమీర్, ఆమనిచిరువెళ్ల, అనంతసాగరం మండలం -
ఇక సమరమే.. సమ్మెకు సైరన్
● ఏపీజేఏసీ అమరావతి నాయకులు ● కలెక్టర్కు ఉద్యోగ సంఘాల నోటీసునెల్లూరు (అర్బన్): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, అవుట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ బకాయిలు సాధించుకునేందుకు సమరానికి సన్నద్ధంగా ఉన్నామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం చైర్పర్సన్ బాలకోటమ్మ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్కు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో దశల వారి ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని, తాము దాచుకున్న డబ్బులను చెల్లించాలని కోరుతూ పోరాటం ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా పీఆర్సీ పెండింగ్లో ఉందన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం, మధ్యంతర భృతి, ెపెండింగ్లో ఉన్న 5 డీఏల విడుదల, పింఛన్దారులకు అదనపు క్వాంటమ్ పింఛన్ పునరుద్ధరణ తదితర 29 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్లో తీవ్ర జాప్యం వల్ల వృద్ధాప్యంలో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. మంగళవారం నుంచి ఉద్యమ కార్యాచరణ పూర్తయ్యే వరకు సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అంటూ ఉద్యోగులు డీపీలో ఫొటో ప్రదర్శిస్తారన్నారు. 5వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధుల్లోకి వచ్చి నిరసన, 9వ తేదీ వరకు తమకు జరుగుతున్న నష్టాలపై కరపత్రాల పంపిణీ, 11న ట్రేడ్ యూనియన్లతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 నుంచి 26వ తేదీ వరకు పని గంటల సమయంలో మాత్రమే పని చేస్తామని మిగిలిన సమయంలో అధికారులకు సహకరించేది లేదన్నారు. అనంతరం ధర్నాలు, ఆందోళనలు చేస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె బాట పడుతామన్నారు. సంఘ నాయకులు చెన్నమ్మ, పరంధామయ్య, శ్రీనివాసులు, ధారా రమణయ్య, సతీస్, కొండలరావు, జమీర్బాషా, తదితరులు పాల్గొన్నారు. -
పాతకక్షలతోనే రౌడీషీటర్ హత్య
● ఎనిమిది మంది అరెస్ట్ ● పరారీలో మరికొందరు నెల్లూరు(క్రైమ్): నెల్లూరులో సంచలనం రేకెత్తించిన రౌడీషీటర్ కమ్మసాయి హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. సోమవారం వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ వివరాలు వెల్లడించారు. చంద్రమౌళినగర్కు చెందిన్ లక్ష్మీశెట్టి సాయితేజ అలియాస్ కమ్మసాయిపై గతేడాది ఏప్రిల్లో వేదాయపాళెం పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి కడప కేంద్రకారగారానికి తరలించారు. ఇటీవలే అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. సాయికి పలువురితో పాతకక్షలు, వ్యక్తిగత విభేదాలున్నాయి. ఆదివారం అతను వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. అనంతరం కె.హనుక్, ప్రేమ్కుమార్, వంశీకృష్ణ అలియాస్ నిప్పో వంశీ, సాయికుమార్, రాహుల్, ప్రదీప్, హరి, జగదీష్, మరికొందరితో కలిసి మద్యం తాగాడు. పాతకక్షలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో మద్యం మత్తులో చెలరేగిన వివాదంతో వారు సాయిని హత్య చేశారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వంశీకృష్ణ, సాయికుమార్, జగదీష్పై రౌడీషీట్లు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్నవారిని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య పాల్గొన్నారు. -
ఇళ్లు చేరని జీవితాలు
జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.లారీని ఢీకొని ఆటో బోల్తావెంకటాచలం: లారీని వెనుక నుంచి ఆటో ఢీకొని ఒకరు మృతిచెందగా, మరో 9 మందికి గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి పంచాయతీ నాగంబోట్లకండ్రిగ సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన బత్తల పోలయ్య (58), మరో 9 మంది మత్స్యకారులు మనుబోలు సమీపంలోని గుంతల వద్దకు రొయ్యలు పట్టేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరారు. నాగంబోట్లకండ్రిగ సమీపంలో కృష్ణపట్నం రోడ్డుపై లారీ అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బత్తల పోలయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇంటి సామగ్రి కొనుగోలుకు వెళ్తూ.. సంగం: ఇంటి సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మండలంలోని తరుణవాయి వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నీలాయపాళెం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (57) బేల్దారి పనులు చేస్తుంటాడు. వివాహమై పిల్లలున్నారు. ఇంటికి సంబంధిచిన సామగ్రి కొనుగోలు చేసేందుకు బుచ్చిరెడ్డిపాళేనికి మోటార్బైక్పై వెళ్తుండగా అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. తీవ్రగాయాలతో పడి ఉన్న వెంకటరమణయ్యను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్లో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో అదుపుతప్పి.. మనుబోలు: ఆటో బోల్తా పడటంతో వాకా రమేష్ (45) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్రోడ్డు వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ గ్రామానికి చెందిన రమేష్ ఓ ఛానల్లో మనుబోలు మండల విలేకరిగా పనిచేస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు. ఈ క్రమంలో సొంత ఆటోలో మనుబోలుకు వచ్చి సిమెంట్ బస్తాలు తదితరాలు తీసుకెళ్తున్నాడు. కొమ్మలపూడి క్రాస్రోడ్డు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. హైవే మొబైల్ సిబ్బంది మస్తాన్, మహేష్ అతడికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం రమేష్ను హైవే అంబులెన్స్లో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. -
12న జాతీయ లోక్ అదాలత్
నెల్లూరు (లీగల్): ఈ నెల 12న జాతీయ లోక్అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కోర్టు హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నెల్లూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లో జాతీయ లోక్అదాలత్ను నిర్వహించనున్నామని తెలిపారు. ఆయా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, వివాహ, మోటార్ వాహన ప్రమాద, రాజీ పడదగిన ఇతర కేసుల్లోని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు గూడూరు: చిన్నపాటి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన వింగవాసం జోగేంద్ర అలియాస్ జోగి, అలియాస్ బొగ్గు ఇంజన్, అదే ప్రాంతానికి చెందిన కామేష్ రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారు. వారి ఇద్దరి మధ్యన మనస్పర్థలు రావడంతో అప్పుడప్పుడు ఘర్షణ పడే వారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 23న గూడూరు రైల్వే స్టేషన్ వద్ద ఇరువురి మధ్యన వివాదం నెలకొని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఆ తరువాత కామేష్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఎం ఆఫీస్ వద్ద నిద్రిస్తున్న సమయంలో తలపై నిందితుడు జోగేంద్ర సిమెంట్ కాంక్రీట్ దిమ్మెతో రెండుసార్లు కొట్టడంతో మృతి చెందాడు. రైల్వే స్టేషన్ సిబ్బంది ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సీఐ హజరత్బాబు కేసు నమోదు చేసి నిందితుడు జోగేంద్రను కోర్టులో హాజరుపరచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్తపల్లి వంసతకుమార్ నేర నిరూపణ చేయడంతో నిందితుడు జోగేంద్రకు జీవిత ఖైదు, రూ5వేలు జరిమానా విఽధిస్తూ కోర్టు తీర్చునిచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. ఈ కేసును పర్యవేక్షణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ డీ మల్లికార్జున, హెడ్కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యేశ్వరరావును ఎస్పీ అజిత్ వేజెండ్ల అభినందించారు. 2.87 లక్షల మందికి పింఛన్లు నెల్లూరు(పొగతోట): జిల్లాలో మంగళవారం సామాజిక పింఛన్ల నగదు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,87,970 మంది లబ్ధిదారులకు రూ.126 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 13,265 క్లస్టర్లల్లో 6,593 మంది ఉద్యోగుల ద్వారా నగదు అందజేయనున్నట్లు చెప్పారు. పింఛన్ లబ్ధిదారులు అందుబాటులో ఉండి నగదు తీసుకోవాలని సూచించారు. 150 కేజీలకు మించిన పొగాకు బేళ్ల తిరస్కరణ మర్రిపాడు : పొగాకు రైతులు 150 కేజీలకు మించిన బేళ్లను వేలానికి తీసుకొస్తే తిరస్కరించడం జరగుతుందని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు వేలం ప్రక్రియలో నిబంధనలు పాటించాలని సూచించారు. ఉదయం కాటాలు వేసే సమయంలో రైతులు స్వయంగా దగ్గర ఉండి టీబీజీఆర్ నంబర్లు వేయించుకోవాలని తెలిపారు. వేలానికి ముందు రోజు వచ్చి మార్కెట్ పరిస్థితిని పరిశీలించి కొనుగోలు చేసే బేళ్లను మాత్రమే తీసుకురావాలని సూచించారు. సెప్టెంబర్ 2న గుండెమడకల క్లస్టర్–5, ఆదురుపల్లి క్లస్టర్–8, 3న డీసీపల్లి క్లస్టర్–6, 4న నెల్లూరుపాళెం క్లస్టర్–7కు సంబంధించిన రైతుల బేళ్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. బ్యారెన్కు నాలుగు బేళ్లు, అర బ్యారెన్కు రెండు బేళ్ల చొప్పున వేలానికి తీసుకురావాలని సూచించారు. -
పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి
● జేఏసీ జిల్లా చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు నెల్లూరు(అర్బన్): ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని జిల్లా జేఏసీ చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో వివిధ సంఘాలతో కలిసి జేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 5 డీఏలను, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలను విడుదల చేసి పీఆర్సీ కమిషన్ను నియమించాలన్నారు. ఉద్యోగులకు న్యాయం జరగకపోతే ఈనెల 5న జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశంలో తీసుకునే ఉద్యమ నిర్ణయాలకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ సురేంద్రరెడ్డి, చలపతి శర్మ (యూటీఎఫ్), మురళీకృష్ణారెడ్డి (ఆర్టీసీ – ఎన్ఎంయూ), సుదర్శన్ (ఎస్టీయూ) తదితర పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం
● డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది’ అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న అన్నారు. నెల్లూరులోని డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న 2.14 లక్షల ఖాళీ పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడుకునేందుకు కనీస సౌకర్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం ప్రజలు, రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నేటి నుంచి మూడురోజులపాటు జరిగే డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం వీఆర్సీ మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నర్తకీ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రమణ, నాయకులు చైతన్య, నరేంద్ర, సురేంద్ర పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం
సంగం: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. సోమవారం ఆమె తండ్రి సుధాకర్రెడ్డి సంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి కథనం మేరకు.. బద్వేల్లోని మడగలవారెపల్లికి చెందిన ఓ యువతిని సంగంలో ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఆదివారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకలకు మడగలవారెపల్లి గ్రామానికి చెందిన సుధాకర్రెడ్డి కుమార్తె వచ్చింది. భోజన అనంతరం బంధుమిత్రులతో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. సోమవారం కుమార్తె ఇంటికి రాకపోవడంతో సుధాకర్రెడ్డి సంగం వచ్చి బంధువుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. భార్యాభర్తలపై దాడి ● మహిళ మెడలోని బంగారు సరుడు దోపిడీ సంగం: వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి సొంతూరికి వెళ్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి వారిని కొట్టి మహిళ మెడలోని బంగారు సరుడును దోపిడీ చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు సోమవారం సంగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. జెండాదిబ్బ పంచాయతీ మజారా అరవపాళెం గ్రామానికి చెందిన కరేటి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు మోటార్బైక్పై ఆదివారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం వెళ్లారు. అక్కడ వివాహ వేడుకలకు హాజరయ్యారు. అర్ధరాత్రి పంచేడు రోడ్డు మీదుగా జెండాదిబ్బకు వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని శ్మశానం వద్ద గుర్తుతెలియని ముగ్గురు యువకులు బైక్ను అడ్డగించి భార్యాభర్తలను కొట్టారు. భాగ్యలక్ష్మి మెడలో ఉన్న 2.5 సవర్ల తాళిబొట్టు సరుడును లాక్కెళ్లారు. లక్ష్మీనారాయణ 112కు ఫోన్ చేయడంతో సంగం పోలీసులు వచ్చే సరికి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.దెబ్బతిన్న కండలేరు హెడ్రెగ్యులేటర్ గేట్లు రాపూరు: మండలంలోని కండలేరు ప్రాజెక్ట్కు సంబంధించి హెడ్రెగ్యులేటర్ గేట్లు, సాఫ్ట్లాక్ గేట్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. జలాశయాల భద్రత కమిటీ బృందం డ్యామ్ను సందర్శించింది. నీటినిల్వలు, గేట్ల పనితీరు, ఇతర అంశాలకు సంబంధించి స్థితిగతులను సభ్యులు తెలుసుకున్నారు. సోమవారం డ్యామ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గోపాల్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ మాట్లాడుతూ జలాశయం భద్రతకు సంబంధించిన అంశాలను రెండురోజులపాటు పరిశీలించామన్నారు. లీకేజీలు కూడా ఉన్నాయన్నారు. భవిష్యత్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల్ని గుర్తించామన్నారు. పూర్తి నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరావు, కండలేరు ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
మైనింగ్పై చైనా పెత్తనం
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను చైనా జాతీయుడు శాసిస్తున్నారని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అండదండలతోనే మైనింగ్ సిండికేట్ దందా కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు స్థానిక మైనింగ్ సిండికేట్ను తన గుప్పెట్లో పెట్టుకొని గనుల యజమానులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కంపెనీకే క్వార్ట్జ్ మెటీరియల్ను ఇవ్వాలని, లేని పక్షంలో అధికారుల ద్వారా గనులను బ్లాక్ చేయిస్తానంటూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డౌతో వీపీఆర్కు ఉన్న సంబంధంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.55 కోట్ల ఆదాయం.. రూ.11.99 కోట్లకు క్వార్ట్జ్ మైనింగ్ ద్వారా తమ హయాంలో ప్రభుత్వానికి రూ.55 కోట్ల ఆదాయమొచ్చిందని, అయితే ప్రస్తుతం ఇది రూ.11.99 కోట్లకు పడిపోయిందని చెప్పారు. ఆర్టీఐ ద్వారా తన వద్దకొచ్చిన సమాచారంతోనే ఈ అంశాలను వెల్లడిస్తున్నానని స్పష్టం చేశారు. చైనాలో క్వార్ట్జ్ డిమాండ్తో ఎగుమతులు ఆగిపోలేదని, సిండికేట్ దోపిడీ కారణంగానే మైనింగ్ రంగం కుదేలైందని విమర్శించారు. లీగల్గా మైనింగ్ చేస్తున్న గనుల యజమానుల నుంచి టన్నుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.15 వేల వరకు సిండికేట్ అక్రమంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ రకంగా గత రెండేళ్లలో రూ.200 కోట్లకుపైగా అక్రమంగా కొల్లగొట్టారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 147 క్వార్ట్జ్ లీజులుండగా, 98 గనులనే తెరిచారని, సిండికేట్కు కప్పం కట్టలేదనే కారణంతో మిగిలిన వాటిని మూయించారని ధ్వజమెత్తారు. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసించే స్థాయికెలా వచ్చారు..? రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను శాసించే స్థాయికి మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఇది తీవ్రమైన అంశమని, దేశ భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని తెలిపారు. వీపీఆర్ అండదండలతోనే సిండికేట్ నడుస్తోందని.. డౌ చెప్తున్నట్లే మైన్ ఓనర్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై ఎంపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫినీ క్వార్ట్జ్ పేరుతో విజయ్కుమార్రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో సిండికేట్ కార్యకలాపాలు సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ దందాలతో ఒక్కో మండలంలో సుమారు మూడు వేల మంది వరకు కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. మైనింగ్ కోసం జేసీబీలు, వాహనాలను కొనుగోలు చేసిన వారు ఈఎంఐలను చెల్లించలేక ఆర్థికంగా నష్టపోయారని చెప్పారు. దేవదాయ శాఖకు సంబంధించిన భూముల్లోనూ పల్స్ఫర్ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. పురాతన సిద్ధలయ్యకోన ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని దేవాదాయ శాఖ మంత్రికి లేఖ రాసినా, స్పందించడంలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల టన్నుల పల్స్ఫర్ మైనింగ్ జరిగితే, ప్రస్తుతం ఇది 1.48 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునే సుమారు 352 ఎమ్డీఎల్లను ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లోనే సిండికేట్ దోపిడీ టన్నుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమ వసూళ్లు మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి తాను చేస్తున్న ఆరోపణలు తప్పని తేలితే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. చైనా జాతీయుడి వ్యవహారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయనున్నానని వెల్లడించారు. మైనింగ్ దందాలను ఆపకపోతే తన వద్ద ఉన్న వాట్సాప్ చాట్లు, చైనా పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్లను బయటపెడతానని హెచ్చరించారు. -
మాట వినరు.. రవాణా ఆగదు
● ఆగని చికెన్ వ్యర్థాల తరలింపు ● పొదలకూరు మీదుగా సంగం, బుచ్చి, నెల్లూరుకు.. ● చేపలు, రొయ్యల మేతకు వినియోగం ● కేసులు పెడుతున్నా మారని తీరుపొదలకూరు: పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా చికెన్ వ్యర్థాల రవాణా మాత్రం ఆగడం లేదు. పగటి వేళల్లో వ్యర్థాలను తరలించకుండా రాత్రి, తెల్లవారుజామున మినీ లారీలు, వ్యాన్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. గతంలో పగటి వేళ పొదలకూరు పట్టణం మీదుగా వ్యర్థాలు తరలించడంతో దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుస ఫిర్యా దులు రావడంతో ప్రస్తుతం రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. తిరుపతి, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో పొదలకూరు మీదుగానే అధికంగా రవాణా చేస్తున్నట్టు సమాచారం. మేతగా వినియోగం సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, పొదలకూరు మండలం కొనగలూరులో చేపల గుంతలున్నాయి. ఆయా ప్రాంతాల్లో చేపలు, రొయ్యలకు మేతగా చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వ్యర్థాలు పొదలకూరు పట్టణం మీదుగానే తరలివెళ్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు నాలుగైదు పర్యాయాలు వ్యర్థాలను తరలిస్తున్న మినీ లారీలు, ఆటోలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. గత వారంలో కూడా డ్రమ్ముల్లో తీసుకెళ్తున్న మినీ లారీని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులు వ్యర్థాలను తవ్వి పాతిపెట్టారు. అలాగే మండలంలోని బిరదవోలు గ్రామ సమీపంలో రాత్రివేళ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను గ్రామస్తుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చేపలు, రొయ్యలకు చికెన్ వ్యర్థాలను మేతగా ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. మండలంలోని కొనగలూరు చేపల గుంతల నిర్వాహకులు సైతం వాటిని వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. హైవే మీదుగా.. చైన్నె, తిరుపతి, బెంగళూరు నుంచి మనుబోలు వరకు హైవే మీదుగా వచ్చిన తర్వాత వీరంపల్లి మీదుగా పొదలకూరుకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి సంగం, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు పొదలకూరు పోలీస్స్టేషన్లో నాలుగు కేసుల వరకు నమోదయ్యాయి. డ్రైవర్లు, వాహన యజమానులపై కేసులు పెట్టారు. అయినా వ్యర్థాల రవాణా కొనసాగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. సంగం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు పొదలకూరు మార్గం అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. -
నిన్న రహదారి.. తాజాగా చెట్లకు..!
● మంత్రి వ్యవసాయ క్షేత్రానికి యథేచ్ఛగా మట్టి తరలింపు ● నిత్యం వందలాది టిప్పర్లలో రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు చేజర్ల: అమాత్యుడు ఆనం రామనారాయణరెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో రహదారుల నిర్మాణం కోసం ఉలవపల్లిలోని ప్రభుత్వ భూమిలో గ్రావెల్ గుట్టను ఇటీవల పది రోజుల పాటు గుల్ల చేశారు. తాజాగా అక్కడి చెట్లకు ప్రభుత్వ భూముల్లో ఉన్న సారవంతమైన మట్టిని వందలాది టిప్పర్లలో రోజూ తరలిస్తున్నారు. తూర్పుకంభంపాడు నుండి పెరుమాళ్లపాడులోని క్షేత్రానికి పగలూ, రాత్రనే తేడా లేకుండా రవాణా చేస్తున్నారు. మంత్రి విషయం కావడంతో అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని అధికారులు చేయలేకపోతున్నారు. గుట్టను మాయం చేసి.. మండలంలోని ఉలవపల్లిలో కోర్టు పరిధిలో వివాదాస్పదంగా ఉన్న సర్వే నంబర్ 124లో గ్రావెల్ గుట్టను సగం మేర మాయం చేశారు. ఇదే విషయమై పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధికారం నాది.. ప్రభుత్వం మాది.. తనను ఎవరేమి చేస్తారనే ధీమాతో వ్యవసాయ క్షేత్రంలో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడి చెట్లకు సారవంతమైన మట్టిని తూర్పు కంభంపాడులోని ప్రభుత్వ భూముల నుంచి మూడు రోజులుగా తరలిస్తున్నారు. ఫలితంగా అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే ఇక్కడ నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది. కూటమి ప్రభుత్వమొచ్చాక తమ అగచాట్లు వర్ణనాతీతమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు
● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు కలిగిరి: కలిగిరి పెద్ద చెరువు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ తంతు జరుగుతున్నా, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదివారం హిటాచీ, నాలుగు టిప్పర్లలో జోరుగా తరలించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు ఉండటంతో అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించడంలేదు. వ్యవసాయ పనులకంటూ కొంత మేర అనుమతులు పొంది, ప్రైవేట్ స్థలాలకు మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలిగిరి పెద్ద చెరువులో భారీ యంత్రాలు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో పెద్ద గుంతులు ఏర్పడ్డాయి. చెరువు కట్ట సమీపంలోనే అక్రమంగా తరలిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలిగిరిలోని ఇరిగేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ వ్యవహారం సాగుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి తరలింపునకు అడ్డుకట్టేసి పెద్ద చెరువును కాపాడాలని ఆయకట్ట రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. గ్రావెల్ను తరలిస్తున్న వాహనాలు టిప్పర్లో మట్టిని పోస్తున్న యంత్రం -
ఎండైనా.. బరువైనా.. బతుకు కోసం
కడుపు నింపుకోవడానికి ఎండను లెక్కచేయకుండా.. బరువును భుజాన మోస్తూ.. చెమటను చిందిస్తూ.. ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా శ్రమిస్తుంటారు కార్మికులు. జీవితం సాఫీగా సాగేందుకు ఒక్కొక్కరిదీ ఒక్కో పోరాటం. పనిలో కష్టం ఎంత ఉన్నా.. ఆ శ్రమ వెనుక ఉన్నది మాత్రం కుటుంబాన్ని నడిపించాలనే తపనే. పాత వస్తువులను సేకరించి వాటిని అమ్ముకోవడం నుంచి.. బరువైన సామగ్రిని మోసే వరకు.. నిర్మాణ పనుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం నుంచి.. మండుటెండలో ధాన్యాన్ని ఆరబెట్టడం వరకు.. ఇలా పనులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. బతుకు బండి ఆగకూడదు. శ్రమను నమ్ముకున్న వారి జీవితాల్లో రోజూ ఓ పోరాటమే. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
అదుపుతప్పి కారు బోల్తా
● నలుగురికి గాయాలు మర్రిపాడు: నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై అల్లంపాడు క్రాస్రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి కోవెలకుంట్లకు ఆదివారం ఏడుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. అల్లంపాడు క్రాస్రోడ్డు సమీపంలో కారు అదుపుప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన నలుగురిని 108 అంబులెన్స్లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ఆత్మకూరు ఎంవీఐ రాములు పరిశీలించారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. స్వగ్రామానికి వెళ్తుండగా..● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిసీతారామపురం: అతను కుమార్తెను బడిలో వదిలాడు. పనికి అవసరమైన సామగ్రి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూడటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మండలంలోని సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం నల్లమడగల ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుంట్ల నారాయణ (45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నారాయణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన కుమార్తెను మోటార్బైక్పై వైఎస్సార్ కడప జిల్లాకు తీసుకెళ్లి ఓ పాఠశాలలో వదిలిపెట్టాడు. తిరుగు ప్రయాణంలో అత్తగారి గ్రామమైన సాయిశెట్టిపల్లెకు వెళ్లి అక్కడున్న బేల్దారి సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. దారిలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందాడు. అటుగా వెళ్లే ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
రిటైనింగ్ వాల్ పరిశీలన
సోమశిల: సోమశిల జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు గోపాల్రెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ గ్యాలరీ, రిటైనింగ్ వాల్తో పాటు ప్రధానమైన జలాశయ ప్రాంతాలను పర్యవేక్షించారు. భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చేపటాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను త్వరలోనే అందజేయనున్నామని వెల్లడించారు. సేఫ్టీ కమిటీ సభ్యులను ఈఈ శ్రీనివాస్కుమార్ సత్కరించారు. డీఈఈలు రవీంద్రప్రసాద్, విజయ్కుమార్, జేఈలు పెద్దిరాజు, పాపిశెట్టి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. 4 నుంచి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ అల్లూరు: రాష్ట్ర సీనియర్స్ పురుషులు, సీ్త్రల బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలను సెప్టెంబర్ నాలుగు నుంచి ఆరు వరకు నిర్వహించనున్నారు. స్థానిక రామకృష్ణ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో మురళీకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం జరపనున్న పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ విజయ్శంకర్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు, న్యాయనిర్ణేతలకు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నామని వెల్లడించారు. విజేతలకు బహుమతులను అందజేయనున్నారని చెప్పారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మేడా రామసుబ్బారెడ్డి, ప్రసాద్రెడ్డి, అసోసియేషన్ సభ్యులు రమేష్ బాబు, క్రాంతికుమార్, మురళి, మోహన్, సుబ్బన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష నెల్లూరు(అర్బన్): ఎంబీబీఎస్ను పూర్తి చేసి స్పెషలిస్ట్ కోర్సులో చేరేందుకు అవసరమైన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్.. కావలిలోని విశ్వోదయ కళాశాలలు.. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం వద్ద గల డిజిటల్ అయాన్ సెంటర్, జైశ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్స్ సెంటర్లో పరీక్షలను నిర్వహించారు. 950 మందికి గానూ 34 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 85,246 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,085 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.3 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. ఉదయగిరి దుర్గం సందర్శన ఉదయగిరి: ఉదయగిరి దుర్గాన్ని విశాఖపట్నానికి చెందిన నేవీ బృందం ఆదివారం సందర్శించింది. దుర్గంపై ఉన్న పెద్ద, చిన్న మసీదులు, గుర్రపుశాల, కోనకాలువ తదితరాలను పరిశీలించారు. ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌక ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నౌక పేరుతో ఉన్న ఉదయగిరిని సందర్శించామని తెలిపారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 2026 – 27 విద్యా సంవత్సరంలో పాఠశాలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.పది వేలు, రూ.ఐదు వేల చొప్పున అందించాలని కోరుతూ ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుకు ఇచ్చారు. -
తక్షణమే తగ్గించాలి
నెల్లూరు (పొగతోట): నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల పాలిట గుదిబండలా మారుతున్నాయి. జీతాలు పెరగకపోవడం.. నూతనంగా కొలువులు లభించకపోవడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆదాయాలు పెరగకపోగా, ఖర్చులు మాత్రం ఎక్కువవుతున్నాయి. యుద్ధం సాకుతో రేట్లను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. నెల్లూరులో స్టోన్హౌస్పేట కేంద్రంగా నిత్యావసర సరుకులు జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇక్కడే దాదాపు వెయ్యికిపైగా హోల్సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. కందిపప్పు కిలోను రూ.130 నుంచి రూ.140 వరకు.. మినపప్పు కిలో రూ.120 నుంచి రూ.130కు, వేరుశనగ పప్పు కిలో రూ.180కు.. చింతపండు కిలో రూ.240.. చక్కెర కిలోను రూ.80 నుంచి రూ.90కు విక్రయిస్తున్నారు. చక్కెర ధరలు రెండు నెలల్లో విపరీతంగా పెరగడంతో కేఫ్ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. వీటి రేట్లను పెంచితే ప్రజలు రావడంలేదని పేర్కొంటున్నారు. ప్రతి దానికీ యుద్ధమే కారణమంట..! పెట్రోల్, డీజిల్ ధరలు.. నిత్యావసర సరుకుల రేట్లు.. ఇలా ప్రతి దానికీ యుద్ధాన్ని కారణంగా చూపుతున్నారు. రవాణా చార్జీలు పెరిగాయని, ఈ ప్రభావం దీనిపై పడిందనే సమాధానం యజమానుల నుంచి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుల నుంచి రూ.పదికి కొనుగోలు చేసిన వస్తువు వినియోగదారుడికి చేరేసరికి రూ.45 నుంచి రూ.50 అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని దళారులు, మధ్యవర్తులు, వ్యాపారులు స్వాహా చేస్తున్నారు. సరుకుల రేట్లు చూసి మహిళలకు కన్నీళ్లొస్తున్నాయి. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ఏం కొనాలన్నా.. తినాలన్నా, భయమేస్తోంది. రోజువారి కూలిలతో బతికే పేదలు ఎలా బతకగలరు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అదుపు చేయాల్సిన ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతోంది. ఇప్పటికై నా పాలకులు స్పందించి వీటిని నియంత్రించాలి. – రాసాల కుమారి, బెడుసుపల్లి, సీతారామపురం మండలం జిల్లాలో ఇలా.. మండుతున్న నిత్యావసర సరుకుల రేట్లు యుద్ధం సాకు చూపి భారీగా పెంపు మధ్య తరగతి అగచాట్లు నియంత్రించడంలో సర్కార్ వైఫల్యం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు కూటమి పాలనలో పేద, మధ్య తరగతి వర్గాలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ వేగంతో ౖపైపెకి దూసుకెళ్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వీరున్నారు. యుద్ధాన్ని సాకుగా చూపి రేట్లను పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సరుకుల కోసం రెండేళ్ల క్రితం వరకు ఓ చిన్న కుటుంబం నెలకు రూ.ఐదు వేల వరకు ఖర్చు చేసేది. అయితే ప్రస్తుతం ఇది రూ.ఎనిమిది వేలు దాటుతుండటంతో వారు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా, నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఈ తీరుపై ప్రజానీకం భగ్గుమంటోంది. రెవెన్యూ డివిజన్లు – 4 మండలాలు – 36 జనాభా – 24.16 లక్షలు కుటుంబాలు 6.29 లక్షలు -
రౌడీషీటర్ దారుణ హత్య
● నెల్లూరులో ఘటన ● పాతకక్షలే కారణమా? నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ను కొందరు బండరాయితో తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరులోని ఆర్టీఓ కా ర్యాలయ సమీపంలోని ఖాళీ స్థలంలో ఆదివా రం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చంద్రమౌళి నగర్కు చెందిన లక్ష్మీశెట్టి సా యితేజ అలియాస్ కమ్మసాయి (24)పై వేదాయపాళెం పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతేడాది పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటున్నట్లు తెలిసింది. ఆదివారం సాయితేజ వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. రాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వెంబడించారు. ఆర్టీఓ కార్యాలయ సమీప ఖాళీ స్థలంలో సిమెంట్ రాయితో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర ఇన్చార్జి, నెల్లూరు రూరల్ డీఎస్పీలు గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, వేదాయపాళెం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. హత్య వెనుక బీవీ నగర్కు ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్తోపాటు మరికొందరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. పాతకక్షలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవాలయాలకు భద్రత కరువు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఆలయాలకు భద్రత కొరవడటంతో దొంగలు విజృంభిస్తున్నారు. గ్రామాలకు దూరంగా, ప్రధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నవాటిని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. గేట్లు, తలుపులు పగులగొట్టి విగ్రహాలపై ఉన్న బంగారు ఆభరణాలు, హుండీల్లోని కానుకలను ఎత్తుకెళ్తున్నారు. కొన్నిచోట్ల హుండీలను ఆలయాలకు దూరంగా పడేసి నగదును అపహరిస్తున్నారు. చోరీల నివారణలో పోలీసు యంత్రాంగం, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంలో ఆలయ కమిటీలు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాలు, దర్గాలు, మసీదులు, చర్చిల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ గతంలోనే సూచించినా.. అనేకచోట్ల ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు, దాడులు జరిగినప్పుడు వాటికి సంబంధించిన దృశ్యాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఆలయ కమిటీలు అప్రమత్తమై సూచనలు పాటించి భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వరుస ఘటనలు తప్పనిసరిగా భద్రతా చర్యలు వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలతో ఆలయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎలాంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం దొంగలకు అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చేయాలంటే.. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. రాత్రివేళల్లో సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలి. ఆలయం మూసే ముందు తలుపులు, గేట్లకు తాళాలు సక్రమంగా వేశారో లేదో తనిఖీ చేసుకోవాలి. హుండీల్లోని కానుకలను తరచూ ఖాళీ చేయడంతోపాటు.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి. ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.కలిగిరి మండలంలో చోరీ జరిగిన కోదండరామస్వామి ఆలయం బంగారు ఆభరణాలు, నగదు తస్కరణ నిర్మానుష్య ప్రాంతాల్లోని ఆలయాలే టార్గెట్ కనీస జాగ్రత్తలు తీసుకోని కొందరు నిర్వాహకులు వరుస ఘటనలతో భక్తుల్లో ఆందోళనరెండు ఆలయాల్లో.. కలిగిరి: మండలంలోని చిన్నఅన్నలూరులోని కోదండరామస్వామి, అంకమ్మతల్లి ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. కోదండరామస్వామి ఆలయంలో అమ్మవారి మెడలోని మంగళసూత్రం దొంగతనం చేశారు. అంకమ్మ ఆలయంలో అమ్మవారి ముక్కుపుడక, హుండీని ఎత్తుకెళ్లారు. ఆదివారం గ్రామస్తుల సమాచారం మేరకు కలిగిరి పోలీసులు పరిశీలించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్టీమ్ వేలిముద్రలను సేకరించింది. -
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
● మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు(టౌన్): ‘కూటమి ప్రభుత్వం నూతన పోకడలతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తోంది. ఇదే రీతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ టెట్ పేరుతో టీచర్ల ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. టెట్పై వచ్చేనెల 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించడంతోపాటు పీఆర్సీని నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. బకాయిలు పడిన ఐదు డీఏలను మంజూరు చేయాలన్నారు. కార్పొషన్ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. అనంతరం బద్దలైన నిశబ్దం పుస్కకాన్ని బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శేషు, చలపతిశర్మ, నాయకులు అచ్చయ్య, ఖాజావలీ, మురళీధర్, శ్రీదేవి, రమాదేవి, మధుసూదన్, నాగిరెడ్డి, బాలరాగయ్య, భారతి, శైలజ, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ వేమిరెడ్డిపై మాజీ మంత్రి అనిల్ సంచలన ఆరోపణలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా మైనింగ్ అక్రమాలు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మైనింగ్ యజమానులను బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ ఎంపీకి సవాల్ విసిరారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పర్మిట్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.55 కోట్ల ఆదాయం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.7 కోట్లు, రూ.12 కోట్లకు పరిమితమైందని ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో మైనింగ్ యజమానులను బెదిరించి టన్నుకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని అన్నారు.ఎగుమతులు చేయాలంటే కూటమి ఎంపీ అనుచరులకు తప్పనిసరిగా ‘శిస్తు’ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో మైనింగ్ యజమాని నుంచి రూ.10 కోట్ల చొప్పున వసూలు చేసి దాదాపు రూ.200 కోట్లు సమీకరించారు. ఈ వ్యవహారం ‘ఫినీ క్వార్ట్జ్’ అనే కంపెనీ పేరుతో ఎంపీ అనుచరుడు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతోందని పేర్కొన్నారు. చైనాకు చెందిన ‘డౌ’ అనే వ్యక్తిని తీసుకొచ్చి, అతనికే మైనింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక చైనా వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ తరహా వ్యవహారాలు నడపడం దేశ భద్రతకు ముప్పుగా మారే అంశమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు.చదవండి: పార్టీ పదవుల భర్తీ అన్నారు.. ఎప్పుడు?తమకు ఎదురు తిరిగిన మైనింగ్ సంస్థలపై డీఎంజీ శాఖ ద్వారా చర్యలు తీసుకుని మైన్స్ మూసివేయిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో కొన్ని గనులు మూతపడే పరిస్థితి వచ్చిందని, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్లోనూ అక్రమ మైనింగ్ జరుగుతోంది. సైదాపురం మండలంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మైనింగ్ చేసి సహజ వనరులను దోచేస్తున్నారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి విచారణకు ఆదేశించినా అది ముందుకు సాగకుండా అడ్డుకునే స్థాయి ఒక్క ఎంపీ వేమిరెడ్డికే ఉందని ఆరోపించారు.తన ఆరోపణలకు మరిన్ని లోతైన ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని అన్నారు. మైనింగ్ అక్రమాల్లో వేమిరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. -
158 మందికి ఉద్యోగాలు
నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్మేళాలో 158 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 19 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గిరి, వైస్ ప్రిన్సిపల్ రమణారావు, జేకేసీ కోఆర్డినేటర్ గీత, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వినయ్కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ఖయ్యూం, సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు, లలిత, ఏడుకొండలు, వేణు తదితరులు పాల్గొన్నారు. ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’కి ఏడాది ● నేవీ బృందం బైక్ ర్యాలీ ఉదయగిరి: ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ యుద్ధ నౌక ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ నుంచి నేవీ బృందం చేపట్టిన బైక్ ర్యాలీ శనివారం ఉదయగిరికి చేరింది. ముందుగా వీరు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ గణేశ్, లెఫ్టినెంట్ భారత్ అనుక మాట్లాడుతూ 2025 ఆగస్టు 26న ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ నౌక ప్రారంభమైందన్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఉదయగిరి పట్టణాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, రక్షణ రంగంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఈ ఏడాది నుంచి నేవీ తరఫున ఉపకార వేతనాలు అందిస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల తరఫున హెచ్ఎం, ఉపాధ్యాయులు వారికి జ్ఞాపిక అందజేశారు. నేవీ సిబ్బంది రామునివాస్, సుమిత్, పి.విశ్వేశ్వరరావు, అర్నాకులేరియా, లోకేశ్, పాఠశాల హెచ్ఎం జి.శ్రీనివాసులు, ఇండియన్ నేవీ సిబ్బంది పాల్గొన్నారు. -
‘కారుణ్యం’ చూపని ఆర్అండ్బీ
● భర్తను కోల్పోయిన భార్య ● కారుణ్య నియామకం కోసం ఏడాదిన్నరగా ఎదురుచూపులు ● మరోవ్యక్తికి అదే పరిస్థితి ● రెండు రోజులు ఆగితే ఉద్యోగం కష్టమే నెల్లూరు(అర్బన్): కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త ఆర్అండ్బీ శాఖలో వాచ్మెన్గా చిరుద్యోగం చేస్తూ మృతిచెందడంతో ఆమెకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. నిబంధనల మేరకు కనీసం కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని గిరిజన మహిళ భావించింది. అయితే ఏడాదిన్నరగా ఆ ఆశ నెరవేరలేదు. దరఖాస్తులతో ఆర్అండ్బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు పట్టించుకోకుండా మరో అధికారి వద్దకు వెళ్లాలని తిప్పుకుంటున్నారు. గూడూరులోని మరో వ్యక్తి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కాగా కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఈనెలాఖరుతో కారుణ్య నియామకాలకు బ్రేక్ పడనుంది. దీంతో వారు శనివారం నగరంలోని ఆర్అండ్బీ సర్కిల్ కార్యాలయంలో నేల మీద కూర్చొని నిరాహార దీక్ష చేపట్టారు. వాచ్మెన్గా పనిచేస్తూ మృతి కోవూరుకు చెందిన గిరిజనుడు తుపాకుల శేషయ్య నెల్లూరు ఆర్అండ్బీ డివిజన్ కార్యాలయంలో వాచ్మెన్గా పనిచేస్తూ ఒకటిన్నర సంవత్సరం క్రితం మృతి చెందాడు. దీంతో భార్య ఒంటరిదైంది. బతికేందుకు భర్త ఉద్యోగం తనకు ఇప్పించాలని ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆమె గిరిజనురాలు కావడంతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేకుండాపోయింది. దీనిని సాకుగా పెట్టుకుని ఉద్యోగం ఇవ్వలేమని.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో ఆమె కలెక్టర్కు అర్జీ ఇచ్చింది. ఆయన సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, డెంటల్, ఫోరెన్సిక్, రేడియోలజీ విభాగాలకు చెందిన డాక్టర్ల కమిటీని ఏర్పాటు చేసి పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. వారు పరిశీలించి ఆమె వయస్సును 36 ఏళ్లుగా నిర్ధారించారు. సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అది కూడా చెల్లదని ఆర్అండ్బీ అధికారులు కొర్రీ వేసి ఆర్డీఓ ద్వారా తెచ్చుకోవాలని కోరారు. కాగా ఆర్డీఓ పెద్దాస్పత్రి డాక్టర్ల సర్టిఫికెట్ పరిశీలించి విచారణ జరిపి సచివాలయం ద్వారా 1990 సంవత్సరం అక్టోబర్ నెలలో పుట్టినట్టు సర్టిఫికెట్ను ఇచ్చారు. ఫైనాన్స్ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన నేపథ్యంలో పోస్టింగ్లు, ప్రమోషన్లు లాంటి వాటిని నిలిపేశారు. అయితే అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ప్రభుత్వాదేశాల మేరకు ఫైనాన్స్ శాఖ ఈనెల 22న ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యోగాలిచ్చి తర్వాత ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ రెండు రోజులు ఆగితే ఇక బాధితులకు ఇప్పట్లో ఉద్యోగాలు రావు. జియావుల్ హక్కు తప్పని ఇబ్బందులు గూడూరు ఆర్అండ్బీ డివిజన్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తూ షేక్ మెహతాబ్ అనే మహిళ జూన్ నెలలో మృతి చెందింది. ఆమె కుమారుడు జియావుల్ హక్ కూడా కారుణ్యనియామకం కింద తనకు వాచ్మెన్ పోస్టు కల్పించాలని ఆర్అండ్బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. లంచాలు ఇవ్వనందునే.. నానా కష్టాలు పడి అధికారులు అడిగిన సర్టిఫికెట్లను తెచ్చి కారుణ్య నియామకాల కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆశాఖ సూపరింటెండెంట్, క్లర్క్ తదితర వారికి లంచాలు ముట్టలేదనే ప్రచారం జరుగుతోంది. పూట గడవని వారు లంచాలు ఇవ్వకపోవడంతో అసలు ఇప్పట్లో ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
జిల్లా జైలులో ఖైదీ మృతి
వెంకటాచలం: అనారోగ్యం కారణంగా మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా జైలులో ఖైదీ మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ సుందరయ్య కాలనీకి చెందిన షేక్ చిన మౌలాలి(48) కొంతకాలంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శనివారం ఉదయం మౌలాలి తన సెల్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో మరో ఖైదీ గమనించి వార్డెన్కు సమాచారం అందించాడు. వెంటనే చికిత్స నిమిత్తం జైలు అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని నిర్ధారించారు. ఈ విషయాన్ని వెంకటాచలం పోలీసులకు తెలియజేశారు. జైలు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయపడిన మహిళ మృతి ఆత్మకూరురూరల్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఈనెల 11న జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో షేక్ జమీల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను మెరుగైన వైద్యం కోసం చైన్నెలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని శనివారం స్వగ్రామమైన మహిమలూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నిమ్మధరలు (కిలో) పెద్దవి : రూ.150 సన్నవి : రూ.85 పండ్లు : రూ.40 -
రంగులు కలిపిన చికెన్, పాడైపోయిన కాలీఫ్లవర్
● బుచ్చిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు బుచ్చిరెడ్డిపాళెం: ఫుడ్ సేఫ్టీ అధికారులు బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గిరిజాహాల్ సెంటర్, మలిదేవి సెంటర్, బస్టాండ్ ప్రాంతంలోని కొన్ని హోటళ్లలో కృత్రిమ రంగులు కలిపిన, పాడైపోయిన చికెన్, సరిగా ఉడకని చపాతీలు, పరోటాలు, వినియోగానికి అనర్హమైన కాలీఫ్లవర్ తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. సుమారు ఐదు కేజీల పాడైన కాలీఫ్లవర్తో పాటు ఇతర నాణ్యత లేని ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. అలాగే పలుచటి పాలిథిన్ కవర్లలో వేడి పదార్థాలను ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి, వాటిని నిలిపివేయాలని వ్యాపారులను హెచ్చరించారు. సుమారు 15 కేజీల పాడైపోయిన చికెన్ను ధ్వంసం చేశారు. పరిశుభ్రత పాటించని ఏడు హోటల్స్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఆహార తయారీ ప్రదేశాల్లో అపరిశుభ్రత, నిబంధనలు ఉల్లంఘించిన ఐదు హోటల్స్పై కేసులు నమోదు చేశారు.


