SPSR Nellore
-
చావుకొస్తోంది..!
జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు బాధితులు నరకం చూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాటిని కేవలం వారం రోజుల్లోనే మంజూరు చేసేవారు. కూటమి ప్రభుత్వంలో అడ్డమైన నిబంధనలు చేర్చడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రిలో పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా నిరుపేదలు వస్తుంటారు. వారు ఆస్పత్రి అధికారులను ప్రశ్నించలేక తమకు ఎప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. నెల్లూరు(అర్బన్): పెద్దాస్పత్రిలో రోజూ అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య 1,500, ఇన్పేషెంట్ల సంఖ్య 450 నుంచి 500 వరకూ ఉంటోంది. రోజూ సుమారు 15 నుంచి 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. అలాగే చికిత్స పొందుతూ ముగ్గురు నుంచి ఐదుగురి వరకు చనిపోతున్నారు. కాన్పు జరిగాక తల్లిదండ్రులు సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటారు. తమ బిడ్డను స్కూల్లో చేర్చాలన్నా.. అంగన్వాడీ కేంద్రంలో చేర్పి ంచాలన్నా.. ఇతర అవసరాలకు బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా అవసరం. అలాగే ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటుంటారు. బీమా పరిహారం, ప్రభుత్వ సాయం, వితంతు పెన్షన్ తదితరాలు పొందాలంటే ఇది తప్పనిసరి. అందువల్లే బాధిత కుటుంబం వారు త్వరగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలని ఆరాటపడుతూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఒకరే ఉండటంతో.. జనన, మరణ ధ్రువపత్రాలిచ్చేందుకు అభ్యర్థులకు చెందిన ఆధార్కార్డు, ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన స్లిప్, కుటుంబ సభ్యుల సమాచారం తదితర వివరాలను ఆన్లైన్లో ముందుగా నమోదు చేయాలి. ఆధారాలతో కూడిన ఫొటో స్టాట్ కాపీలు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేయడానికి కేవలం ఒకే ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) మాత్రమే ఉన్నారు. ఆపరేటర్ సెలవు పెడితే పత్రాల మంజూరు జరగడం లేదు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండి రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేస్తేనే రద్దీ తగ్గుతుంది. అయితే సూపరింటెండెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పత్రాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శలున్నాయి. 400 వరకు పెండింగ్ పెద్దాస్పత్రిలో జనన, మరణ ధ్రువీకరణపత్రాలు 400 వరకు పెండింగ్లో ఉన్నాయి. సర్వర్ మెరాయిస్తుండటంతోపాటు ఒకే డీఈఓ ఉండటంతో పత్రాలను సకాలంలో ఇవ్వకుండా తిప్పుకొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి సకాలంలో పత్రాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెద్దాస్పత్రిలో జనన, మరణ పత్రాల మంజూరులో జాప్యం పెండింగ్లో 400 వరకు సర్టిఫికెట్లు సర్వర్ సమస్య అంటూ చేతులెత్తేసిన వైద్యశాఖ రోజుకు ఐదారుగురికి కూడా ఇవ్వలేకపోతున్న వైనం నెలల తరబడి తిరుగుతున్న బాధితులుసర్వర్ సమస్యపై ఈ–మెయిల్ పెట్టాం సర్వర్ మొరాయిస్తుండడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం జరుగుతోంది. సర్వర్ సమస్యను సూపరింటెండెంట్ మాధవి దృష్టికి తీసుకెళ్లి సరి చేయాలని వైద్యశాఖకు ఈ–మెయిల్ పెట్టించాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఆలస్యం కాకుండా పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ కళారాణి, అడ్మినిస్ట్రేటివ్ హెచ్ఓడీ -
పోక్సో కేసులో నిందితుల అరెస్ట్
కోట: విద్యానగర్లోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి ఈనెల 15వ తేదీన బాలిక అదృశ్యమైన ఘటనపై విచారణ జరిపి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్కుమార్ మంగళవారం తెలిపారు. బాలికను అపహరించిన నెల్లూరుకు చెందిన దావూద్తోపాటు అతడికి సహకరించిన సలీం, షమీర్, మునీర్, హర్షియాపై పోక్సో కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు. ట్రావెల్స్ బస్సు ఢీకొని..● ట్రాక్టర్ డ్రైవర్ మృతి చిల్లకూరు: ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. చిల్లకూరు కథనం మేరకు.. మండలంలోని నెలబల్లిరెట్టపల్లికి చెందిన చిరమన వెంకటేశ్వర్లు (53)కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. గ్రామంలో ఉన్న ట్రాక్టర్ యజమాని వద్దకు వెళ్లి యాక్టింగ్ డ్రైవర్గా ఉంటానని చెప్పాడు. అతను బోరులో వేసేందుకు అవసరమైన రాయిని నెల్లూరులో డెలివరీ చేయాలని చెప్పాడు. దీంతో వెంకటేశ్వర్లు గ్రామం నుంచి ట్రాక్టర్లో బయలుదేరాడు. పది నిమిషాలకు జాతీయ రహదారి ఎక్కి కోట క్రాస్రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి మైసూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ కొంతదూరం వెళ్లి పడగా ట్రక్కు అక్కడే నిలిచిపోయింది. వెంకటేశ్వర్లు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కొంతమంది వేరే బస్సుల్లో వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సురేష్బాబు మాట్లాడుతూ బస్సును స్టేషన్కు తరలించి డ్రైవర్ను విచారిస్తున్నామన్నారు. కేసు నమోదు చేశారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య మనుబోలు: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలోని డౌన్లైన్లో 145/8 కిలోమీటర్ వద్ద ఓ వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. తల వేరుగా, మొండెం వేరుగా ఉంది. వయస్సు 70 సంవత్సరాలని భావిస్తున్నారు. ఐదున్నర అడుగుల ఎత్తు, చామనఛాయతో ఉన్నట్లు తెలిపారు. వైట్కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు, బ్లూ కలర్ గళ్లలుంగీ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
పేద కుటుంబానికి రూ.లక్ష సాయం
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలోని యర్రబల్లిపాళేనికి చెందిన మూలే జనార్ధన్రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంటర్, ఎనిమిదో తరగతి కుమార్తెల చదువు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి గురించి వింజమూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత కర్నాటి ప్రభాకర్రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారికి భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతుగా రూ.లక్ష నగదును బ్యాంక్ ద్వారా మృతుడి భార్య జ్యోతి అకౌంట్లో జమ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం మృతుడి భార్యాబిడ్డలు కలిసిన నేపథ్యంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులకు సంబంధించి భవిష్యత్లో కూడా తన వంతు సాయం కొనసాగుతుందన్నారు. కష్టకాలంలో పేద కుటుంబానికి అండగా నిలిచిన మేకపాటికి బాధిత కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. -
బ్రహ్మోత్సవం.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం
● పెంచలకోనకు పోటెత్తిన భక్తులు ● శేష వాహనంపై నృసింహుడురాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. దేవతలారా రారండి ఐదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండంటూ గరుత్మంతుడి ద్వారా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపారు. వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామిని తిరుచ్చిపై కొలువుదీర్చి నాలుగు తిరుమాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అక్కడ్నుంచి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని అర్చకులు గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభానికి అభిషే కాలు నిర్వహించారు. తొలుత అష్టదిగ్భంధనం చేసి వేద, దివ్య, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ గరుత్మంతుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీ జనార్దనరెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్నుతిరుపాల్రెడ్డి, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు రామానుజాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ● బ్రహ్మోత్సవాల్లో జరిగే ధ్వజారోహణానికి ఎంతో విశిష్టత ఉంది. గరుత్మంతుడికి పూజలు అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం లేని మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ● స్వామి, అమ్మవార్లకు క్రేన్ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పీఠంపై ఉంచి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పండ్లరసాలు, చందనం, పసుపు, కుంకుమ, కొబ్బరినీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ● లక్ష్మీనరసింహస్వామికి కాణిపాకంలోని వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి ఈఓ పెంచలకిషోర్ తమ సిబ్బందితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మి దేవేరులను తిరుచ్చిలో కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ఊంజల్సేవ నిర్వహించారు. ● రాత్రి 10 గంటలకు స్వామి, అమ్మవార్లను శేషవాహనంపై ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బుధవారం ఉదయం 5 గంటలకు పూలంగిసేవ, 8 గంటలకు హంస వాహనసేవ, 11:50 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకారసేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు హనుమంత వాహనంపై శ్రీవారి క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కూటమి ప్రభుత్వానికి పట్టని సమస్యలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెట్రోల్, డీజిల్ కొతర కారణంగా రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడురోజుల నుంచి ఇంధనం లేకపోవడంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా వరికోతల సమయం కావడంతో పెట్రోల్ బంకులకు వెళ్తున్న రైతులకు డీజిల్ పట్టడం లేదని ఆరోపించారు. అధికార యంత్రాగం మాత్రం పెట్రోల్, డీజిల్ సమస్య లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా బంకులు మూసివేశారని, కొన్నింట్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామరాజు, మాలకొండయ్య, సిరాజ్, షాన్వాజ్, ఆదినారాయణ, లీలామోహన్, సాయిలత, వనజ, హేమలత, అజీజ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
మొరాయిస్తున్న సర్వర్
జనన, మరణాల వివరాలను వైద్యశాఖకు చెందిన వెబ్సైట్లో నమోదు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసివ్వాలి. ఇందుకోసం కేవలం ఒకే ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించారు. కంప్యూటర్ కూడా ఒకటే ఉంది. దీనికితోడు సర్వర్ మొరాయిస్తూ వెబ్సైట్ పనిచేయకపోవడంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితం నిబంధనల్లో మార్పులు చేశారు. అప్పట్నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా పట్టుమని పదిమందికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు. ఒక్కోరోజు ముగ్గురికి, నలుగురికి మాత్రమే ఇస్తున్నారు. మరోరోజు ఎనిమిది మందికి మాత్రమే దక్కుతుంది. దీంతో బాధితులు సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి పెద్దాస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. -
తమ్ముళ్ల బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రకృతి వనరులను దోచుకోవడంలో తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. రాత్రీ.. పగలనే తేడా లేకుండా గ్రావెల్, ఇసుకను కొల్లగొడుతున్నారు. మైనింగ్కు అనుమతుల్లేకపోయినా.. ప్రభుత్వానికి రాయల్టీలు చెల్లించకుండానే గ్రావెల్ దోపిడీ మూడు లోడ్లు.. ఆరు ట్రిప్పులు అనే తీరున సాగుతోంది. అడ్డుకోగా.. రెచ్చిపోయి ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం పల్లిపాళెం సమీపంలో గ్రావెల్ అక్రమ రవాణా రాత్రి వేళ జరిగింది. ఈ క్రమంలో రాయల్టీని చెల్లించాలని ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులు అడ్డుకోగా, తమ్ముళ్లు రెచ్చిపోయారు. అధికారం తమదని.. మీకెందుకు చెల్లించాలంటూ బూతులతో హడలెత్తించారు. మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ బృందాన్నీ లెక్కచేయలేదు. చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి సర్దుకోవాలని సలహా ఇచ్చి పంపిన ఘటన విస్మయానికి గురిచేసింది. వెంచర్లకు యథేచ్ఛగా.. ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ దందాను సాగిస్తున్నారు. అనుమతుల్లేకపోయినా, తవ్వి వెంచర్లకు రవాణా చేస్తున్నారు. సంగంలోని కొండను తవ్వేసిన వీరి కన్ను తాజాగా పల్లిపాళెం సమీపంలోని ప్రభుత్వ భూములపై పడింది. జేసీబీని పెట్టి కొల్లగొడుతున్నారు. నాలుగు రోజులుగా ఇది జరుగుతోందని తెలుసుకున్న ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులు తరలింపును సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ప్రతి వాహనానికి రాయల్టీని చెల్లించి రవాణా చేసుకోవాలని సూచించగా, మాఫియా రెచ్చిపోయింది. ఈలోపు మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్, వారి బృందం సైతం అక్కడికి చేరుకుంది. అయితే మాఫియా మరింతగా రెచ్చిపోయి స్థానికంగా కొందరు యువతను పిలిపించి నానా హంగామా చేశారు. అఽధికార పార్టీ అండ ఉన్న తమపై మీ రుబాబు ఏమిటంటూ రెచ్చిపోయారు. ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులపై బండబూతులతో చెలరేగిపోయారు. ఓ దశలో దాడులకు పాల్పడే పరిస్థితి నెలకొనడంతో పోలీసులకు ఫోన్లో సంస్థ ప్రతినిధులు సమాచారమిచ్చారు. ఆపై చేరుకున్న ఖాకీలు, గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోకపోగా, మాఫియాకు వెన్నుదన్నుగా నిలిచి సర్దుబాటు చేశారు. అర్ధరాత్రి తవ్వకాలు, పోలీసుల సమక్షంలోనే ఏమ్మార్ సంస్థ ప్రతినిధులపై టీడీపీ నేతల దౌర్జన్యంఅధికారికంగా అనుమతులు జిల్లాలో మైనింగ్ రాయల్టీ అధికారిక అనుమతులను ఏఎమ్మార్ సంస్థ పొందింది. దీనికి గానూ దాదాపు రూ.14 కోట్లను ప్రభుత్వానికి ప్రతి నెలా చెల్లిస్తోందని సమాచారం. దీంతో జిల్లాలోని నలుమూలలా తమ ఏజెంట్లను వీరు నియమించి, ఎక్కడ మైనింగ్ జరుగుతున్నా అక్కడ వాలిపోతున్నారు. మరోవైపు జిల్లాలో అనధికారికంగానే మైనింగ్ జరుగుతోంది. అయితే సదరు సంస్థ మాత్రం అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ వాహనానికి రూ, వందల్లో వసూలు చేస్తోంది. అధికారిక అనుమతులున్న చోటే వసూలు చేయాల్సి ఉన్నా, మిగిలిన చోట్ల సంస్థ దండుకుంటోంది. జిల్లాలో ఈ సంస్థకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గ్రావెల్ మాఫియాతో గొడవలు జరగడం, పోలీస్ శాఖ సర్దుబాటు చేయడం పరిపాటిగా మారుతోంది. గ్రావెల్, మైనింగ్ రవాణాలో ఏఎమ్మార్ సంస్థకు అధికారిక అనుమతులు రాయల్టీగా ప్రతి నెలా రూ.14 కోట్లను సర్కార్కు చెల్లించేలా ఒప్పందం అక్రమంగా తరలిస్తూ దోచుకుంటున్న టీడీపీ నేతలు సంగం మండలంలో అడ్డుకున్న ప్రతినిధులు బూతులతో రెచ్చిపోయిన వైనం అధికారులు ఫిర్యాదు చేశారు పల్లిపాళెంలో గ్రావెల్ను తరలిస్తున్న విషయం మా దృష్టికొచ్చింది. మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత నరేష్కు ఏఎమ్మార్ సంస్థ సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుందనే ఫిర్యాదు అందింది. పరిశీలిస్తున్నాం. – రాజేష్, ఎస్సై, సంగం -
రాజ్యాంగ విలువలను పరిరక్షించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ఎంతో అవసరమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విలువలను కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించినప్పుడే అంబేడ్కర్కు ఘన నివాళులర్పించిన వారవుతామని తెలిపారు. వేసవిలో రోజూ అత్యధికంగా 14,586 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారని చెప్పారు. అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ మాట్లాడారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి డిస్కమ్ అభివృద్ధి పథంలో పయనించేలా ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య, జేసీ వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్ పవన్కుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్నాయడు, జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నేతలు కిరణ్, శివశంకర్, రమేష్బాబు, జయరామయ్య, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న చలువతోనే సొంతింటి కల సాకారం
● పేదలకు ఒక్క గృహాన్నైనా చంద్రబాబు కట్టారా..? ● క్రెడిట్ చోరీలో సిద్ధహస్తుడు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: గత సీఎం జగన్మోహన్రెడ్డి చలువతోనే పేదలకు సొంతింటి కల సాకారమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జగనన్న కాలనీని మంగళవారం సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తమకు ఇళ్ల స్థలాలను జగనన్న ఇవ్వడమే కాకుండా గృహాలను నిర్మించిచ్చారని వారు తెలియజేశారు. జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని లబ్ధిదారులు నిర్వహించారు. అనంతరం కాకాణి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇళ్లను కాదు.. ఊళ్లనే తమ ప్రభుత్వం అప్పట్లో నిర్మించిందని గుర్తుచేశారు. మనుబోలులోని జగనన్న కాలనీలో 300 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించగా, ఇందులో 120 మంది నిర్మాణాలను ప్రారంభించారని తెలిపారు. 40 గృహాలు పూర్తవ్వగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జగనన్న దయతోనే తమ సొంతింటి కల సాకారమైందని లబ్ధిదారులు అంటున్నారని, నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదేననిపిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 22 నెలలైనా, కనీసం ఒక్క ఇంటినైనా నిర్మించారానని ప్రశ్నించారు. 2.5 లక్షల ఇళ్లను కట్టామంటూ నాయుడుపేటలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో అవాస్తవాలను సీఎం చంద్రబాబు మాట్లాడారని విమర్శించారు. గతంలో తాము కేటాయించి పూర్తి చేసిన ఇళ్లను ఇప్పుడు చంద్రబాబు ప్రారంభిస్తూ, తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తులని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. నాలుగుసార్లు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి నిర్మించిచ్చిన దాఖలాలు ఉన్నాయానని ప్రశ్నించారు. నోరు మెదపడంలేదు.. ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీ, నెల్లూరులో ఆరోపణలు చేసిన సోమిరెడ్డికి ఇప్పుడు కాంట్రాక్టర్లతో డీల్ కుదరడంతో నోరు మెదపడంలేదని విమర్శించారు. జగనన్న కాలనీల్లో ఆయన పర్యటిస్తే, జరిగిన అభివృద్ధి కంటికి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు వంద జన్మలెత్తినా ఇలాంటి కాలనీలను నిర్మించలేరని చెప్పారు. తాము నిర్మించిన కాలనీల్లో కనీస వసతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం అయ్యాక అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, గుండాల ఆదినారాయణ, మారంరెడ్డి ప్రదీప్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, దువ్వూరు సుధాకర్రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, సూరపనేని కిశోర్నాయుడు, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, చల్లా నవకోటి, కోసూరు కోటేశ్వరగౌడ్, కేవీఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పార్టీ కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయట విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని సైతం సర్కార్ చేపట్టడంలేదని, పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వారు తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 74,286 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,186 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు డేటా ఎంట్రీ ఆపరేటర్, బేల్దారి, బ్యూటీషియన్, టైలరింగ్, డ్రైవింగ్ తదితర రంగాల్లో ఉచిత శిక్షణను ఇవ్వనున్నామని ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు కొండాయపాళెం గేట్ సమీపంలోని కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ నెల్లూరు రూరల్: పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ వంటి కీలక అంశాలపై చర్చించారు. పెనుశిల లక్ష్మీనరసింహ వన్యప్రాణి అభయారణ్యానికి సంబంధించిన ఎకో సెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్లాన్ పురోగతిని సమీక్షించారు. రిజర్వ్ అటవీ ప్రాంతాలకు వెలుపల ఉన్న రెవెన్యూ భూముల్లో పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణలో భాగంగా ట్రీ ఫౌండేషన్ రూపొందించిన రెండు అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎఫ్ఓ మహబూబ్బాషా, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీపీఓ వసుమతి, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్, సుప్రజ ధరిణి తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్తోమతలేదు
నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం కావలి ఏరియా వైద్యశాలలోని కాన్పుల విభాగానికి వచ్చాను. కొన్ని నెలలుగా ఇక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకుందామంటే అంత ఆర్థిక స్తోమత లేదు. – జడ ప్రవళిక, సర్వాయపాళెం, కావలి మండలం ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకోవాలనుకుంటున్నా.. నాకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందామని కావలి ఏరియా వైద్యశాలకు వెళ్తే ప్రస్తుతం ఇక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని చెప్పడంతో డబ్బులు సమకూర్చుకొని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకుందామని అనుకుంటున్నాను. – ఒంగోలు భార్గవి, జలదంకి ● కాన్పుల విభాగంలో ఇద్దరు డాక్టర్లు, ఎనిమిది మంది సిబ్బంది ● పది నెలలుగా ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయని వైనం ● సౌకర్యాలున్నా.. సేవలు శూన్యం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలునెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆదేశించారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో గల తన చాంబర్లో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. జెడ్పీ నిధులతో మంజూరు చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రారంభం కాని వాటిని రద్దు చేసి, ఆ స్థానంలో కొత్త పనుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కోరారు. వర్కుల్లో నాణ్యత లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీఈఓ శ్రీధర్రెడ్డి, పీఆర్ ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లిలో 414 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 414 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 477 బేళ్లు రాగా, వీటిలో 414ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 57,699.7 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,41,19,350.30 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.220.. సగటు ధర రూ.244.70గా నమోదైందని వెల్లడించారు. ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. కావలి ఏరియా వైద్యశాలలోని కాన్పుల విభాగం ‘కుని’కి పాట్లు పడుతోంది. పేదింటి మహిళలకు కాన్పులు, కుటుంబ నియంత్రణ వైద్య సేవలు అందించేందుకు మెరుగైన సౌకర్యాలు, తగినంత వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ సేవలు శూన్యంగా మారాయి. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు, చుట్టు పక్కల మండలాల్లోని పీహెచ్సీలకు నిత్యం పదుల సంఖ్యలో గర్భిణులు వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే ప్రధానంగా వీరందరికి కాన్పులు, కుటుంబ నియంత్రణచేపట్టాలంటే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఏరియా వైద్యశాలకు తీసుకువస్తుంటారు. అయితే ఇక్కడి కు.ని. ఆపరేషన్లు చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ●కావలి: జిల్లా కేంద్రం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాలలో ఉన్న కాన్పుల విభాగం నిరుపయోగంగా మారింది. కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన అత్యాధునిక వసతులతోపాటు కూడా ఆపరేషన్ థియేటర్, అవసరమైన ఇద్దరు డాక్టర్లు, ఒక ఏఎన్ఎం, సూపర్వైజర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నిషియన్, జూనియర్ అసిస్టెంట్, ఎఫ్ఎన్ఓ, మరో ఉద్యోగి ఉన్నారు. అయితే 10 నెలలుగా ఈ కాన్పుల విభాగంలో ఒక్కటంటే ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన పాపాన పోలేదు. వీరికి నెలలకు రూ.లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నప్పటికీ.. ఒక ఆపరేషన్ కూడా జరగకపోవడంతో ప్రజాధనం ఏ విధంగా దుబారా అవుతుందో అర్థమవుతోంది. జీజీహెచ్కు రెఫర్.. కావలి పట్టణంలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు కావలి మండలం తుమ్మలపెంట, సర్వాయపాళెం, బోగోలు మండలంలోని కోవూరుపల్లి, జలదంకి, కొండాపురం, గట్టుపల్లి ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చే ప్రతి ఒక్కరినీ నేరుగా నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి రిఫరల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలే పేదరికం.. ఊరుకాని ఊరికెళ్లి అక్కడ మూడు రోజుల పాటు ఉండాల్సి రావడంతో ఖర్చులు పెరిగి పోతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆపరేషన్ చేయించుకొనే మహిళలను ఆశా, ఏఎన్ఎం నెల్లూరు జీజీహెచ్కు తీసుకెళ్లాలంటే ఆటో ఖర్చులకు చేతి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఆశా, ఏఎన్ఎంలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలనే టార్గెట్లు పెట్టడం, ప్రభుత్వం సైతం ఖర్చులకు నిధులివ్వకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో వారు వ్యయప్రయాసలు పడుతున్నారు. కొద్దో గొప్పో ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లు స్థానికంగానే ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించి వేల రూపాయిలు వెచ్చించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు, ముఖ్యంగా గిరిజనులు కు.ని. ఆపరేషన్కు దూరమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి గర్భం దాల్చుతున్న పరిస్థితి నెలకొంది. మరి కొందరు అయితే ఇక్కడే కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్ఓ సుజాతను సంప్రదించగా, కావలిలోని కాన్పుల విభాగంలోని డాక్టర్లు ఇద్దరు ఉన్నారని, వారికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేకపోవడంతో ప్రస్తుతం వారు శిక్షణ పొందుతున్నారని, వీలైనంత త్వరలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మొదలు పెడుతామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కావలి ఏరియా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేటట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
క్రిస్ సిటీతో భారీగా ఉపాధి
గూడూరు రూరల్: భారీ పారిశ్రామిక హబ్గా గూడూరు రూపుదిద్దుకోనుందని, ప్రతిష్టాత్మక క్రిస్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికిపైగా ఉపాధి లభించనుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రాజెక్ట్ పురోగతి, జాతీయ రహదారుల విస్తరణపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేయనున్న క్రిస్ సిటీ ప్రాజెక్ట్ పనులు శరవేగంతో జరుగుతున్నాయని చెప్పారు. భూమి కోల్పోయిన బాధితులకు అందాల్సిన రూ.30 కోట్ల పరిహారాన్ని వచ్చే వారంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు. జాతీయ రహదారి పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఆసహనం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తున్న మూడు ప్రధాన కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి.. పనులెక్కడ నిదానంగా జరుగుతున్నాయో గుర్తించి తక్షణమే వేగవంతం చేయాలని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్డీఓ సత్యనారాయణ, డీఎస్పీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
కొన్ని మూత.. మరి కొన్నింట్లో లిమిట్
పొదలకూరు : పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో సోమవారానికి పొదలకూరులోని కొన్ని బంకులు మూతపడగా, నిల్వలు ఉన్న కొన్ని బంకుల ముందు బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. దీంతో బైకులకు పెట్రోల్ రూ.100, ఆటోలకు డీజిల్ రూ.200, కారుకు రూ.500 అంతకు మించి పట్టడం లేదు. ముత్తుకూరు మండలంలో డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 90 శాతం పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అరకొర బంకుల్లో కొద్దిపాటి ఇంధనం అందుబాటులో ఉండగా అక్కడ వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రో ల్ ఉంటే డీజిల్ లేదని, డీజిల్ ఉంటే పెట్రోల్ అందుబాటులో లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దొంగతనం కేసులో పురోగతి లేదు
● ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(క్రైమ్): ‘మా ఇంట్లో గతేడాది సెప్టెంబర్లో దొంగతనం జరిగింది. రూ.లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకెళ్లారు. కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. త్వరితగతిన నిందితుడిని కనుక్కుని సొత్తును రికవరీ చేయాలి’ అని కావలికి చెందిన ఓ మహిళ కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. మీరైనా విచారించి న్యాయం చేయండంటూ బాధితులు ఉన్నతాధికారులను కోరారు. జిల్లా నలుమూలల నుంచి 148 మంది విచ్చేసి వినతులను ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజా వినతుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు సూచించారు. వినతుల్లో అధికశాతం మహిళలకు చెందినవే. కార్యక్రమంలో కావలి, డీటీసీ, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీలు వీవీ రమణకుమార్, గిరిధర్, సత్యనారాయణ, మహిళా పోలీస్స్టేషన్, కంట్రోల్రూమ్, ఎస్బీ– 2 ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవతల్సరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా భర్త లక్ష్మణ్ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. మూడునెలల క్రితం ఆయన అదృశ్యమయ్యాడు. ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పీజీఆర్ఎస్లో చెప్పినా ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నా భర్త ఆచూకీ తెలియజేయాలని వింజమూరుకు చెందిన పావని వినతిపత్రమిచ్చారు. ● ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన కె.ప్రదీప్కుమార్, ఒంగోలుకు చెందిన వెంకటసురేంద్ర నా వద్ద రూ.1.25 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో నగదును తిరిగివ్వాలని అడగ్గా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ యువతి కోరారు. ● నా కుమార్తె ఈనెల 21వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు. నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన ఆచూకీ కనుక్కుని అప్పగించాలని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వివాహిత అర్జీ ఇచ్చారు. -
ఆనందం ఆవిరి
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతినెల్లూరు(క్రైమ్): అతను కుమారుడు పుట్టాడని ఆనందంలో ఉన్నాడు. భార్యాబిడ్డను చూసేందుకు మోటార్బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన పి.సునీల్ (30) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఇటీవల కుమారునికి జన్మనిచ్చి మినగల్లులోని పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం సునీల్ తిరుమలకు వెళ్లి దైవదర్శనం చేసుకుని సోమవారం నెల్లూరుకు వచ్చాడు. అనంతరం భార్య, కుమారుడిని చూసేందుకు ఇంటి నుంచి బైక్పై మినగల్లుకు బయలుదేరాడు. జొన్నవాడ ఆర్చివద్ద దేవరపాళెం నుంచి నెల్లూరు వైపు వేగంతో వెళ్తున్న బొలెరొ వాహనం ఢీకొంది. సునీల్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి వెంకయ్య ఈ మేరకు నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
సమస్యలు అనేకం.. పరిష్కారం గగనం
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పోటెత్తిన అర్జీదారులునెల్లూరురూరల్: ‘అయ్యా.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా కనికరించండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్ పవన్ తేజ, డీఆర్వో విజయ్కుమార్ తదితరులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పరిహారం చెల్లించాలంటూ.. వింజమూరు మండలం గుండెమడకల రిజర్వాయర్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణం అవార్డు ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని మాజీ చైర్పర్సన్ చెంచలబాబుయాదవ్, గ్రామ రైతులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు ఆగిపోవడంతో పాత చెరువు ఆయకట్టు కింద ఉన్న సుమారు 1,000 ఎకరాల మాగాణి భూములు బీడుగా మారినట్లు చెప్పారు. సుమారు రూ.78 కోట్లు చెల్లిస్తే రైతులకు న్యాయం జరిగి, కట్ట నిర్మాణం కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు. గోవధ నిషేధించండి గోవధను నిషేధించాలని కల్లూరుపల్లిలోని శ్రీమావిస్ జైన్ పశుసేవా కేంద్రం వ్యవస్థాపకులు దినేష్ జైన్ సురేష్ జైన్, జలదీప్ జైన్ వినతిపత్రం సమర్పి ంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోసేవ కోసం కేంద్రం చట్టం తీసుకురావాలన్నారు. ఆయిల్ కొరత లేకుండా చూడండి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ కలువాయి మండలంలోని కుల్లూరులో గుంజి రవి ప్రభుత్వ స్థలాలు, గ్రామస్తుల డీ– పట్టాల భూములను ఆక్రమిస్తున్నారని అదే గ్రామానికి చెందిన దేవరకొండా శ్రీరాములు, దేవరకొండ వెంకట సుబ్బయ్య, తుపిలి లక్ష్మమ్మ, ఏగు నరసింహులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రవి పనులు చేయిస్తానని ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ, ఆర్అండ్బీ భూముల్లో దారులు లేకుండా గుంతలు తవ్వి, పెద్ద గేట్లు పెట్టారన్నారు. అతను అనుచరులతో కలిసి సర్వే నంబర్ 667–2బీ, 723–1, 733, 552/1లో ఆక్రమణలు చేసి వేరే వారికి కూడా అమ్మడం జరిగిందని అర్జీలో పేర్కొన్నారు. పొదుపు సమస్యలపై వినతి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వారు కలెక్టర్ను కలిసి పొదుపు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అర్జీ సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ నెల్లూరులో ఆన్లైన్ నమోదు పేరుతో పొదుపు మహిళలపై మెప్మా అధికారులు చేస్తున్న వేధింపులను ఆపాలన్నారు. రుణానికి ప్రభుత్వం తరఫున వడ్డీ మాఫీ ఇవ్వడం లేదన్నారు. -
సమృద్ధిగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● రామన్నపాళెం సమీపంలోని బంక్లో ఆకస్మిక తనిఖీ కోవూరు : జిల్లాలో ఇంధన కొరత లేదని, ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కొడవలూరు మండలం రామన్నపాళెం రైల్వే గేటు సమీపంలోని ఓ పెట్రోల్ బంకును కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి స్టాక్ పొజిషన్, డిప్ రీడింగ్ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. బంకు నిర్వాహకులతో మాట్లాడారు. ఎక్కడా ఇబ్బంది రానియొద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా నిరంతరం కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా కడప, చిత్తూరు డిపోలతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి క్రమం తప్పకుండా సరఫరా జరుగుతోందని చెప్పారు. జిల్లాకు మరికొన్ని గంటల్లోనే వివిధ ఆయిల్ కంపెనీలకు చెందిన ట్యాంకర్లు చేరుకుంటాయన్నారు. జిల్లాలో 243 పెట్రోల్ బంకుల్లోనూ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రతి బంక్ వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలను సృష్టించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్ మంజూరు
● కలెక్టర్ వెల్లడి నెల్లూరురూరల్: జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్ మంజూరైనట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో చమురు సరఫరా పరిస్థితిపై చర్చించారు. జిల్లాలో 271 డీజిల్ అవుట్లెట్లు ఉన్నాయని, వాటిలో 40 షాపుల్లో నిల్వలు కొంత తక్కువగా ఉన్నాయన్నారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీల్ యాజమాన్యాలతో చర్చించామన్నారు. రవాణా విషయంలో జాప్య నివారణకు ఎస్పీతో కూడా మాట్లాడామన్నారు. కృష్ణపట్నం పోర్టు, కడప, చిత్తూరు నుంచి డీజిల్ అందుతుందన్నారు. వరి, రొయ్యల సాగుకు సరిపడా డీజిల్ అందిస్తామని, ఇందు కోసం ప్రతి షాపు దగ్గర ఒక వీఆర్ఓ, హోంగార్డును ఆధార్ కార్డుల పరిశీలనకు ఏర్పాటు చేశామన్నారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాక నేడునెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ, ఏపీ ట్రాన్స్కో సీఎండీ ఎన్.విజయానంద్ మంగళవారం నెల్లూరు నగరానికి రానున్నారు. విద్యుత్ భవన్లో ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియన్ ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్, పలువురు విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.జీతాలివ్వండి మహాప్రభో..● డీఆర్డీఏలో ఇదీ పరిస్థితి నెల్లూరు(పొగతోట): డీఆర్డీఏ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి నుంచి 5వ తేదీలోపు అందాల్సిన జీతాలు 28వ తేదీ వచ్చిన ఇంతవరకు జమ కాలేదు. ఈఎంఐలు, ఇతర అవసరాల కోసం వేతనాలపై ఆధారపడి జీవనం సాగించే ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారు. డీఆర్డీఏలో జిల్లా వ్యాప్తంగా వివిధ హోదాల్లో 200 నుంచి 250 మంది పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, అనేక మండలాలు పాత జిల్లాల్లో విలీనం చేయడం తదితర కారణాలతో జీతాల మంజూరులో జాప్యం జరుగుతోందని అధికారులు సమాధానమిస్తున్నారు. మరోనెల కూడా వస్తోందని అయినా వేతనాలు అందుతాయో లేదోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థాల పట్టివేతమర్రిపాడు: మండలంలో చుంచులూరుక్రాస్ రోడ్డు వద్ద చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని మర్రిపాడు ఎస్సై కాసుల శ్రీనివాసరావు సోమవారం పట్టుకున్నారు. ఆయన కథనం మేరకు.. కడప నుంచి అనుమతి లేకుండా వ్యర్థాలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో భాగంగా బొలెరో వాహనంలో సుమారు 20 డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసిన వ్యర్థాలను గ్రామం బయట పూడ్చివేశారు. -
వైభవంగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోనుపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనృసింహుడు అత్తారింటి నుంచి బయలుదేరి పెంచలకోనకు చేరుకున్నాడు. ఈ ప్రథమ ఊరేగింపుతో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలస్వామి, సీతారామయ్య స్వామి తెలిపారు. గోనుపల్లిలోని ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులను దేవాదాయ సిబ్బంది గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. అక్కడ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఆథిత్యం ఇచ్చి పూజలు చేశారు. అనంతరం గోనుపల్లి నుంచి ఉభయ నాంచారులతో బయలుదేరిన లక్ష్మీనరసింహుడి పల్లకిని బోయలు కాళ్లకు పాదరక్షల్లేకుండా మోసుకుంటూ కోనకు చేరుకున్నారు. అలంకార మండపంలో బ్రహ్మోత్సవాల అంకుర్పారణ కార్యక్రమం జరిగింది. -
బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఏబీన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు గతంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీతో మాట్లాడి వెనుతిరిగారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర రాజధానిగా మావిగన్ పేరును ప్రస్తావించగానే చంద్రబాబులో కలవరం మొదలైందన్నారు. దాని పర్యవసానమే తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై ఏబీఎన్ రాధాకృష్ణ ద్వారా అనుచిత వ్యాఖ్యలు పలికించారని తెలిపారు. ఈ విషయమై తాము నిరసనలు తెలిపి ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వర కు పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తాము, తమ పార్టీ శ్రేణులు ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే సిబ్బందిని అడ్డుకున్నామని ఒక కేసు, డీఎస్పీ విధులకు ఆటంకం కలిగించామని మరో కేసు నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని, ఈ విషయమై తాము పోలీసులను అడిగితే దాటవేత, నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఫిర్యాదుల పురోగతి గురించి తాము అడిగితే సెల్ఫోన్కు మెసేజ్ వస్తుందని సమాధానం ఇచ్చి తప్పించుకునేందుకు చూస్తున్నారని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా తాము సిద్ధమేనని తెలిపారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోకపోగా తిరిగి తమపైనే కేసులు నమోదు చేయించడం చంద్రబాబు నియంతృత్వపాలనకు నిదర్శనమన్నారు. 40 ఏళ్ల సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్షాల పట్ల అణచివేత ధోరణితో అభాసుపాలవుతున్నారన్నారు. బాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు టోల్గేట్లో పనిచేసే మహిళలపై అనుచితంగా ప్రవర్తించి, వారిని దుర్భాషలాడి, దాడి చేసి గాయపరచిన కూడా ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోకపోవడం బాబు అహంకార ధోరణికి అద్ధం పడుతుందన్నారు. ప్రజలు అన్ని విషయాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారని తగిన సమయంలో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభ్యసమాజం సిగ్గుపడేలా రాధాకృష్ణ వ్యాఖ్యలు నెల్లూరురూరల్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కుటుంబంలోని మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నెల్లూరు నగరంలో ట్రీప్ల్లాంటేషన్లో టీడీపీ నాయకుల అవినీతి భాగోతాన్ని తమ పార్టీ నాయకులు గణాంకాలతో సహా బట్టబయలు చేశారని తెలిపారు. దీంతో టీడీపీ నాయకుల అవినీతిని కప్పిపుచ్చేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారన్నారు. పార్టీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, నాయకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, ధనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రీ ప్లాంటేషన్లో అవినీతి ఎమ్మెల్సీ, నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ట్రీ ప్లాంటేషన్ పేరుతో అంతులేని అవినీతి జరుగుతుందని తాము నిరూపించామని తెలిపారు. దీంతో మంత్రి నారాయణ, అవినీతితో సంబంధమున్న నాయకులు యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మొక్క నాటేందుకు రూ.5వేలు, నిర్వహణకు రూ.6,588 చొప్పున అంచనాలు సిద్ధం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ అవినీతి భాగోతం ప్రజలకు తెలియడంతో సీమరాజ అనే పెయిడ్ ఆర్టిస్ట్ను తీసుకొచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, నగర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ అవినీతి, అక్రమాలపై జనవరి 26 తేదీన తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశా మని గుర్తుచేశారు. -
చంద్రబాబు అసమర్థత వల్లే కొరత
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత దాపురించిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నగరంలోని ఓ పెట్రోల్ బంకును సోమవారం సందర్శించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. డీజిల్, పెట్రోల్ కోసం వచ్చిన రైతులు, వాహనదారులతో మాట్లాడారు. ఉదయం నుంచి బంకుల చుట్టూ తిరుగుతున్నామని, ఎక్కడా డీజిల్ పట్టలేదని కాకాణి ఎదుట క్యాన్లు పట్టుకుని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతులకు, సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, చంద్రబాబుకు ముందు చూపులేని కారణంగానే పెట్రోల్ బంకుల వద్ద కి.మీ. మేర వాహనాలు బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇంధన కొరత కారణంగా నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇంధనం పుష్కలంగా దొరుకుతోందని, అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు లేకపోయినా ధరలు తక్కువగా ఉండడమే కాకుండా, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా దొరుకుతుందన్నారు. ఇంధనం దొరక్క నెల్లూరు దాటి వెళ్లలేక వందలాది వాహనాలు హైవే పక్కన నిలిచిపోయాయన్నారు. చంద్రబాబు కేవలం మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడటం మానేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్రానికి సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఒక వైపు సివిల్ సప్లైస్ మంత్రి రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతుంటే, మరో వైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని, ఈ పొంతన లేని మాటలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆయిల్ సరఫరాను పునరుద్ధరించి పెట్రోల్ బంకుల వద్ద రద్దీని తగ్గించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
9వ హుండీ ద్వారా రూ.20.22 లక్షల రాబడి
అనుమసముద్రంపేట: ఏఎస్పేట దర్గాలో హుండీ కానుకల లెక్కింపును రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి సోమవారం ప్రారంభించారు. 9వ హుండీని లెక్కించగా రూ.20,22,100 నగదు, 3.800 గ్రాముల బంగారు, 800 గ్రాముల వెండి వచ్చినట్లుగా దర్గా ఈఓ హుస్సేన్ తెలిపారు. ఇప్పటి వరకు 9 హుండీల లెక్కింపు పూర్తయిందని, మొత్తం రూ.1,55,82, 071 రాబడి వచ్చిందని ఆయన వివరించారు. మరో పది రోజుల పాటు హుండీల లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు. డ్వామా పీడీ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వా మా) పీడీగా సీవీ శ్రీనివాసప్రసాద్ డ్వామా కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పీడీగా విధులు నిర్వహిస్తున్న గంగాభవాని తిరుపతి జిల్లా డివిజనల్ డెవలప్మెంట్ అఽధికారిణిగా బదిలీ అయ్యారు. నూతన పీడీని డ్వామా అడిషనల్ పీడీ స్వరూప్, ఏపీఓలు, టీఏలు, జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఈఈగా ఆనంద్బాబు నెల్లూరు(వేదాయపాళెం): జలవనరుల శాఖ నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఆనంద్బాబు రామలింగాపురంలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గూడూరు డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై అత్యంత కీలకమైన నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈగా నియమతులయ్యారు. జిల్లాలోని ఆత్మకూరు, గూడూరు డివిజన్లలో డీఈఈగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. పెరమన వీఆర్వోపై సస్పెన్షన్ వేటు సంగం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మండలంలోని పెరమన వీఆర్వో ఎం కేశవమూర్తిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఐ ద్వారా అందిన అర్జీలపై నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించకపోవడం, గ్రామ సచివాలయంలో అందుబాటులో లేకపోవడం, పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీల విచారణకు హాజరుకాకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, క్రమశిక్షణ లోపించడం, తదితర అంశాలను తీవ్రంగా పరిగణించి సస్పెన్షన్ విధించినట్లుగా అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కు వగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,878 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,037 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
జిల్లాలో మెజార్టీ బంకుల్లో నోస్టాక్ బోర్డులు
● డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ● అత్యవసరమంటే 10 నుంచి 20 లీటర్లు మాత్రమే సరఫరా ● మధ్యలోనే నిలిచిపోతున్న ట్రావెల్స్ వాహనాలు ● డీజిల్ లేక ఆగిన నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు ● ధరలు పెంచుతున్న వ్యాపారులు ● ధాన్యం, బియ్యం రవాణా వాహనాలపై తీవ్ర ప్రభావం ● ఇసుక, గ్రావెల్, సిలికా మాఫియాకు సమృద్ధిగా డీజిల్ సరఫరా ● ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కూటమి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సంక్షోభంగా ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి చెబుతుండగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం ఈ రాష్ట్రంలోనే ఏర్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, ట్రాన్స్పోర్టు రంగంలోని బైక్లు, ఆటోలు మొదలు ట్రావెల్స్, గూడ్స్ రవాణా వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోతుంటే.. ఇసుక, గ్రావెల్, సిలికా తరలించే మాఫియా వాహనాలకు ఇంధనం సమృద్ధిగా దొరుకుతుండడం గమనార్హం. నిప్పులు చెరిగే ఎండలో నెల్లూరు నగరంలో ఆటోలు, కార్లు, బైక్లు బార్లు తీరిన దృశ్యాలు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెల్లూరులోని మన్సూర్నగర్ ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన ఆటోలునెల్లూరు (టౌన్): కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం, ముందు చూపు కొరవడి జిల్లా అధికార యంత్రాంగం కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం రోజు రోజుకు జఠిలమవుతోంది. మూడు రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఆదివారం నుంచి మొదలైన సమస్య రెండో రోజూ సోమవారానికి మరింత సంక్షోభ స్థితికి చేరింది. ఓ వైపు నిప్పులు చెరిగే ఎర్రటి ఎండలో ద్విచక్రవాహనాదారుల నుంచి ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, మినీ వాహనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నాయి. 10 లీటర్ల్ల డీజిల్ దొరకాలంటే వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయిల్ బంకుల్లో డీజిల్ సరఫరాపై నో స్టాక్ బోర్డులు పెట్టారు. పలుకుబడి ఉన్న, రాజకీయ నాయకులకు మాత్రమే డీజిల్ను సరఫరా చేస్తూ సామన్య ప్రజలను ఆయిల్ బంకుల యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా చార్జీలు అమాంతం పెరుగుదల జిల్లాల్లో ప్రధానంగా ధాన్యం, బియ్యం, నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటితో పాటు ప్రయాణికులను రవాణా చేసే ఆటోల వారు సైతం డీజిల్కు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలను వ్యాపారులు అమాంతంగా పెంచారు. సరిపడా డీజిల్ దొరక్క ప్రతిరోజు జిల్లా నుంచి హైదరబాద్, బెంగళూరు, విశాఖపట్నం వెళుతున్న ట్రావెల్స్ బస్సులను పదుల సంఖ్యలో నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని బస్సుల్లో చార్జీలు పెంచడం గమనార్హం. సోమవారం హైదరాబాద్, విశాఖపట్నం నుంచి ప్రయాణికులతో చెన్నె వెళుతున్న కేవీఆర్, ఎంఆర్ఎం, సాలీమర్ తదితర 7 ట్రావెల్స్ బస్సులు డీజిల్ లేక సోమవారం తెల్లవారుజామున కొడవలూరు మండలం రామన్నపాళెం రైల్వే గేటు సమీపంలో నిలిచిపోయాయి. దీంతో బస్సుల్లో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు సమీపంలోని బంకుల యాజమానులను బతిమిలాడితే రెండు మూడు బస్సులకు 10 నుంచి 20 లీటర్లు మాత్రమే సరఫరా చేశారు. దీంతో ఆయా బస్సుల్లోని ప్రయాణికుల్లో కొంత మంది అధక ధరలతో బాడుగ కార్లు మాట్లాడుకుని వెళ్లగా, మరి కొంతమంది తమ సొంత కార్లును పిలిపించుకుని వెళ్లారు. ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్ మాఫియాకు మాత్రం డీజిల్ సరఫరా జిల్లాలో ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్, బూడిద మాఫియాలకు మాత్రం సమృద్ధిగా డీజిల్ దొరుకుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల రవాణా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతే.. ఈ వాహనాలు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతుండడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి అర్ధరాత్రి సమయంలో లైట్లు ఆపేసి డీజిల్ కొట్టి పంపిస్తున్నట్లు తెలిసింది. పలుకుబడి కలిగిన, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఆయా బంకులు యాజమానులు డీజిల్ను సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులకే ఈ వాహనాలు ఉన్నాయి. ఇంధన ధరలు పెంచడానికేనా! నెల్లూరు (పొగతోట): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వెనుక డబుల్ ఇంజిన్ కూటమి సర్కార్ ఇంధన ధరలు పెంచాలనే కుట్ర ఉందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల్లోనే జిల్లాలో అనేక రంగాలు కుప్పకూలాయి. జిల్లాలో 243 పెట్రోలు బంకులు ఉండగా జిల్లాకు ప్రతి నిత్యం 375 కిలోలీటర్ల. పెట్రోలు, 738 కిలోలీటర్ల డీజిల్ సరఫరా అయ్యేది. వాస్తవానికి జిల్లాలో రోజుకు 314 కి.లీ. పెట్రోలు, 568 కి.లీ. డీజిల్ వినియోగం జరుగుతోంది. అయితే గత రెండు రోజులుగా జిల్లాకు అరకొరగా సరఫరా కావడంతో ఈ పరిస్థ్థితి తలెత్తినట్లు బంకుల యజమానులు చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ఆయిల్ రిఫైన్ కంపెనీలపై పడే భారాన్ని తగ్గించేందుకే ఇలాంటిని పరిస్థితిని సృష్టించారని బంకుల యజమానులు అభిప్రాయపడుతున్నారు. సీఎన్జీ బంకుల్లో సైతం వాహనాలు బారులు తీరి ఉన్నాయి. బంకుల్లో ప్రజలు అడిగినంత పెట్రోలు, డీజిల్ నింపడంలేదు. డీజిల్ కొరతతో అంబులెన్స్లు సైతం సేవలు అందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఆటోలపై ఆధారపడి ప్రయా ణం చేసే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాలపై కార్యాలయాలకు వెళ్లే అధికారులు సైతం పెట్రోలు, డీజిల్ కొరతతో అవస్థ పడుతున్నారు. నిమ్మ మార్కెట్కు డీజిల్ సెగ పొదలకూరు : డీజిల్ కొరత స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్పై ప్రభావం చూపుతోంది. డీజిల్ కొరతతో తోటల్లో నుంచి కాయలను మార్కెట్కు తరలించేందుకు ఆటోలు రావడమే కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతుంటే.. మార్కెట్ నుంచి కాయలను ఉత్తర భారత దేశానికి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు కూడా ఆందోళన చెందాల్సి వస్తోంది. సోమవారం బీహార్ ప్రాంతానికి ఎగుమతులను వద్దన్న అక్కడి వ్యాపారులు తర్వాత డీజిల్ ఎలాగైనా తామే పట్టిస్తామనడంతో స్థానిక వ్యాపారులు కాయలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం బస్తా కాయలు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీదైన సరకును ఢిల్లీ, బీహార్, మధుర, లక్నో, వారణాశి తదితర ప్రాంతాలకు సకాలంలో చేర్చకపోతే వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వందల కి.మీ. వెళ్లాల్సిన లారీలు డీజిల్ కొరత వల్ల మధ్యలో నిలిచిపోతే పచ్చి సరుకు పాడై నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి దుత్తలూరు: బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని సోమలరేగడ సమీపంలో 167 బీజీ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పీట్ల నవీన్ (22) వరికోత మెషీన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయగిరి మండలంలోని ఓ గ్రామంలో పనికి వెళ్లాడు. తిరిగి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. సోమలరేగడ సమీపంలో బైక్ అదుపు తప్పింది. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది నవీన్ను చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్తుండగా మృతిచెందాడు. నవీన్కు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అసత్య ప్రచారాలను నమ్మొద్దు
నెల్లూరు రూరల్: జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎక్కడా కొరత లేదని.. అసత్య ప్రచారాలను నమ్మొద్దని జేసీ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డీఎస్ఓ లీలారాణితో కలిసి విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 243 పెట్రోల్ బంకుల్లో నిల్వలు సరిపడా ఉన్నాయని వెల్లడించారు. సరఫరా సక్రమంగా కొనసాగుతున్నా, కొరత ఉందనే వదంతుల నేపథ్యంలో కొన్ని చోట్ల రద్దీ కనిపిస్తోందని తెలిపారు. అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని కోరారు. క్యాన్లు, బాటిళ్లలో నింపడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆక్వా రంగాలకు తగినంత డీజిల్ను నిరంతరం సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని ప్రకటించారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లు, సీఎస్డీటీలను నియమించి.. నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. అప్పు ప్రాతిపదికన ఆయిల్ కంపెనీలు సరఫరా చేయని కారణంగా జిల్లాలోని 15 బంకుల్లో మాత్రమే చమురు తాత్కాలికంగా అందుబాటులో లేదని, మిగిలిన అన్ని చోట్ల పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టినా.. కృత్రిమ కొరతను సృష్టించేందుకు యత్నించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇబ్బందులు ఏర్పడితే 94922 73897 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
పరిహారంలోనూ టీడీపీ ‘పచ్చ’పాతం
తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల విషయంలో తెలుగుదేశం పార్టీ ద్రోహం ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంది. వేట సాగితే కానీ పూట గడవని మత్స్యకారులకు కడలే జీవనాడి. భీతిల్లే అలల్లో ఊయలలు ఊగినంతగా అలవొకగా జలరాసిపై అనునిత్యం సాగర మదనం చేస్తే కానీ బతుకు బండి నడవదు. నిర్మానుష్య కల్లోల కడలిలోని అగాధ జలనిధిలో సాహస సమరంతో వేట సాగిస్తేనే భవిష్యత్. ఇల్లు విడిచి కడలిలోకి వెళ్తే.. తిరిగొచ్చే వరకు ప్రాణాలను పణంగా పెట్టి అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొనే గంగపుత్రులను ఆదుకునే విషయంలో సర్కారు మీన వేషాలు వేస్తోంది. చేపలను తూకం వేస్తున్న మత్స్యకారులు (ఫైల్)వైఎస్సార్సీపీ పాలనలో 19,329 మంది టీడీపీ పాలనలో 12,192 మంది మత్స్యకార భరోసాను తగ్గించి పెద్దకాపునవుతాసాక్షి ప్రతినిధి, నెల్లూరు: మత్స్యకారుల బతుకులపై తెలుగుదేశం పార్టీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. గంగపుత్రులంటే సీఎం చంద్రబాబుకు ఆది నుంచి చిన్నచూపే. టీడీపీ నాలుగు దశాబ్దాల ప్రస్తావనలో 23 ఏళ్లు అధికారంలో ఉంటే.. అత్యధికంగా చంద్రబాబు ఇప్పటి వరకు 16 ఏళ్లకు పైగా అధికారాన్ని వెలగబెట్టారు. అయితే ఏ నాడు మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వారిని ఓటు బ్యాంక్గానే చూశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కేవలం సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సైతం దక్కనీయకుండా చంద్రబాబు, లోకేశ్ కుట్రలకు బరి తెగించారు. తమ భుక్తి అయిన వేట సాగించే సమయంలో తమిళ బోట్లు మత్స్య సంపదను దోచుకెళ్తుంటే ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను వదిలేసి తీరని ద్రోహం చేశారు. ఇవే సవాలక్ష నిబంధనలు ఈ ఏడాది వేట నిషేధ పరిహారం కోసం ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. ఏప్రిల్ 14వ తేదీ నాటికి లైసెన్స్ రెన్యూవల్ అయి ఉండాలి. వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుంది. వేట చేసే మత్స్యకారుడికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. లబ్ధిదారులు సామాజిక పింఛన్ తీసుకుంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. విద్యుత్ 200 యూనిట్లు కంటే ఎక్కవ వాడకూడదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. మోటారైజ్డ్ బోటులో ఆరుగురు, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేట సాగిస్తూ ఉండాలంటూ నిబంధనలు పెట్టింది. ఈ నెల 29వ తేదీలోగా లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం కానున్నట్లు సమాచారం. వేట నిషేధంపైనా కఠిన నిబంధనలు వేట నిషేధింపైనా చంద్రబాబు సర్కారు కఠిన నిబంధనలు విధించింది. ఈ సమయంలో నిబంధనలు అతిక్రమించిన మత్స్యకారులకు ఏపీ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే బోట్లును స్వాధీనం చేసుకోవడంతోపాటు జరిమానా విధించి, ప్రభుత్వం తరఫున ఇస్తున్న అన్ని రకాల రాయితీలు రద్దు చేస్తామంటూ రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 వేలు – 3,500 మధ్య కుటుంబాలకు పరిహారం అందిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 19,329 మందికి లబ్ధి చేకూర్చారు. టీడీపీ పాలనలో అరకొరగా రూ.4000 ఇస్తున్న పరిహారాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి అందించిన ఘటన వైఎస్ జగన్కే దక్కుతోంది. లబ్ధిదారుల ఎంపికలోనూ ఉదారంగా వ్యవహరించారు. అందరితోపాటు సంక్షేమ పథకాలతోపాటు వేట నిషేధ సాయాన్ని అందించారు. ఏటా రూ.19.33 కోట్లు అందించారు. ఇక డీజిల్పై సబ్సిడీని రూ.9లకు పెంచి ఆ మొత్తాన్ని అందించారు. ఇక ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి టీడీపీ పాలనలో రూ.5 లక్షలు ఉంటే.. దాన్ని రూ.10 లక్షలకు పెంచి ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. 50 ఏళ్లకే పింఛన్ మొత్తం అందించారు. మత్స్యకార భరోసా లబ్ధిదారులు గంగపుత్రుల బతుకులపై కొనసాగుతున్న కుట్రలు, కుతంత్రాలు వేట నిషేధ కాలంలో పరిహార లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు ఏటా రూ.20 వేలిస్తామని సవాలక్ష నిబంధనల పేరుతో అర్హుల్లో కోతలు తొలి ఏడాది ఎగనామం.. మలి ఏడాదిలో లబ్ధిదారుల తగ్గింపు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో తరచూ వేటకు విరామం తాజాగా పునరుత్పత్తి కాలంగా రెండు నెలల పాటు వేట నిషేధం కష్టకాలంలో సాయం చేయకపోగా తీరంలో వేట సాగించినా భారీ జరిమానాలు.. కేసుల నమోదు హెచ్చరికలు మొన్న బోట్లు మాయం చేసి ద్రోహానికి తెగింపు భవిష్యత్ కలల ప్రాజెక్ట్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసే కుట్ర దగా.. దగా.. భారీగా లబ్ధిదారుల కుదింపు..! మత్స్యకారులపై టీడీపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు కొనసాగుతూనే ఉన్నాయి. మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ, వారి భావితరాల అభివృద్ధికి ఏ నాడు చొరవ తీసుకోని చంద్రబాబు గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా వారిని దగాకు గురి చేస్తున్నారు. ఏటా మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసాగా రూ.20 వేలిస్తామని హామీల్చిన చంద్రబాబు.. తొలి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలోనూ గతంలోని లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 19,329 మంది లబ్ధిదారులు ఉంటే, టీడీపీ పాలనలో గతేడాది 12,192 మందికే లబ్ధి చేకూర్చారు. ఈ ఏడాది ఇంకా కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ఎన్యుమరేషన్లోనూ లబ్ధిదారులను తగ్గించేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టడాన్ని మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు రెండు నెలల పాటు మత్స్యసంపద పునరుత్పత్తి కాలంగా భావించి సముద్రంలో వేట నిషేధం అమలు అవుతోంది. ఈ వేట నిషేధ కాలంలోనూ సాయం అందించడంలో గతంలో చంద్రబాబు ‘పచ్చ’ పాతం చూపించారు. పరిహారం ఒక్కొక్క కుటుంబానికి రూ.2000, ఆ తర్వాత రూ.4000 లెక్కన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 వేల నుంచి 3,500 మందికే వేట నిషేధ లబ్ధిని అందించిన పరిస్థితి. అర్హులు దరఖాస్తులు చేసుకున్నా.. అనేక కొర్రీలు వేసి అనర్హులుగా ప్రకటించి వారి పట్ల అమానవీయత చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇక మత్స్యకారుల వేటకు డీజిల్పై లీటర్కు రూ.6 సబ్సిడీని ప్రకటించినా.. ఏనాడు ఆ సబ్సిడీని దక్కించుకున్న పాపాన ఏ మత్స్యకారుడు పోలేదు. వేట సమయంలో మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఉన్నప్పటికీ అనేక కుటుంబాలకు ఆ బీమా పరిహారం కూడా దక్కక.. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కులేక రోడ్డున పడిన కుటుంబాలే అధికంగా ఉన్నాయి. -
మహా ధర్నా విజయవంతానికి పిలుపు
నెల్లూరు రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో మే ఆరున నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కార్ కొలువుదీరి 22 నెలలు దాటినా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. దశలవారీ పోరాటంలో భాగంగా చేపట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి మాట్లాడారు. పీఆర్సీ కమిటీని గత ప్రభుత్వం ప్రకటించి ఐఆర్ను అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత సర్కార్ వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ను ఇవ్వడంతో పాటు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రఘురామ్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర, ప్రసాద్రెడ్డి, ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివశంకర్రెడ్డి, మునీర్జాన్, ప్రకాశం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చేపల చెరువుల్లో పరిశీలన
ఉదయగిరి: జలదంకి, కలిగిరి మండలాల్లో చేపల చెరువులను జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతికుమారి ఆదివారం పరిశీలించారు. జలదంకి మండలంలోని చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘ పరిధిలో గల కాకుటూరు, పెద్దకొండూరు, తిమ్మసముద్రం, మర్రిమాను, చిన్నక్రాక చెరువుల్లో చేపల అక్రమ వేటకు సంబంధించిన సమాచారంతో ఆమె పరిశీలించారు. చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘంలోని బోగస్ సభ్యులను తొలగించి.. ఎన్నికలను నిర్వహించి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈ చెరువుల్లో చేపలు పట్టడాన్ని నిలిపేయాలని ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. దీనిపై అవగాహన కల్పించే నిమిత్తం ఆమె వచ్చి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేటను సాగిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. -
జనగణనలో పాల్గొనాలి : జేసీ
నెల్లూరు(బారకాసు): జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు 5కే రన్ జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గణన చేపడతారన్నారు. దేశ ప్రగతికి జనగణన కీలకమన్నారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. కచ్చితమైన జనాభా గణాంకాలు అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయన్నారు. 5కే రన్ వీఆర్సీ సెంటర్ నుంచి రామలింగాపురం, మినీబైపాస్, మాగుంట లేఅవుట్, కేవీఆర్ సర్కిల్, కొండాయపాళెం గేట్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగింది. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
సంగం: మినీలారీలో చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా మండలంలోని గాంధీజన సంఘం సమీపంలో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి అందులో సుమారు 25 డ్రమ్ము ల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వ్యర్థాలను సమీపంలోని కొండ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోగ్య సమస్యలతో టీచర్ ఆత్మహత్య కోట: మండలంలోని ఉత్తమ నెల్లూరు జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బల్లి ప్రసాద్ (54) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై పవన్కుమార్ కథనం మేరకు.. ప్రసాద్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఉదయం టిఫిన్ తీసుకొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అతను విద్యానగర్లో తెలుగుగంగ కాలువ సమీపంలో పెట్రోల్ పోసుకుని కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య దైవకృప కొత్తపాళెం పాఠశాలలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రసాద్ మృతదేహానికి పలువురు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. న్యూరో సమస్యలపై అవగాహన తప్పనిసరి నెల్లూరు(అర్బన్): రోజురోజుకూ ఎక్కువవుతున్న ఫిట్స్, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, పార్కిన్సన్స్, కాళ్లు తిమ్మిర్లు లాంటి అనేక రకాల న్యూరో సమస్యలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి అన్నారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నారాయణ మెడికల్ కళాశాల న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్కుమార్, పెద్దాస్పత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో న్యూరో అప్డేట్ 2026 అనే ప్రతిష్టాత్మక సదస్సు జరిగింది. నారాయణ కళాశాల న్యూరాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సంపత్కుమార్ మాట్లాడుతూ అటాక్సియా, ఏఎల్ఎస్, ఎస్ఎంఏ, తలనొప్పి, డిమెన్సియా, న్యూరో ఇమ్యునాలజీ, న్యూరో మస్క్యులర్ డిజార్డర్స్ తదితరాలపై సమగ్రంగా వివరించారు. బేసిక్స్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ అనే ప్రధాన థీమ్తో ఈ సదస్సు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ న్యూరాలజిస్టులు, ఎపిలెప్టాలిజిస్టులు, న్యూరో ఇమ్యునాలజీ నిపుణులు పాల్గొని తాజా వైద్య విధానాలు, జబ్బను నిర్ధారించే విధానాలు, చికిత్సల గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్బాషా, పలువురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి పాతర నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశంలో ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా మోదీ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్య దర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ మహాసభలకు నెల్లూరు నుంచి వెళ్తున్న ప్రత్యేక వాహనాలకు సంతపేటలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఢీలిమిటేషన్ బిల్లుతో భవిష్యత్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వరి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్నా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. డయల్ యువర్ ఎస్ఈ నేడు నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను చెప్పాలని కోరారు. -
నిల్వ చేసిన చికెన్తో ఆహార పదార్థాలు
● గుర్తించిన గూడూరు ఆర్డీఓ చిల్లకూరు: గూడూరు పట్టణంలోని పలు చికెన్ దుకాణాలతోపాటుగా బైపాస్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆదివారం ఆర్డీఓ సత్యనారాయణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సంఘం థియేటర్ ప్రాంతంలోని ఓ దుకాణంలో ఫ్రీజర్లో చికెన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే బైపాస్ ప్రాంతంలోని ఓ హోటల్లో తనిఖీలు చేయగా అక్కడ కూడా ఫ్రీజర్లో నిల్వ చేసిన చికెన్తో కస్టమర్లకు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం చికెన్పై ఫినాయిల్ పోసి బయట పార వేయించారు. ఆర్డీఓ మాట్లాడుతూ వారానికి ఒకసారి హోటళ్లు, చికెన్ షాపులను తనిఖీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
● బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య నెల్లూరు(వేదాయపాళెం): బీసీలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. నెల్లూరులోని యాదవ ట్రస్ట్ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలు ఐక్యంగా పోరాడితేనే అన్ని రంగాల్లోసముచిత స్థానం సాధించగలమన్నారు. పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. రాజ్యాంగాన్ని సవరించి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి. పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా అమలు చేయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో ఎంపీ బీద మస్తాన్రావు, నేతలు వై.నాగేశ్వరరావు, శ్రీనివాసులు యాదవ్, నడవడి ముత్యంగౌడ్, బొమ్మి నాగకిషోర్, శ్రీనివాసయాదవ్, వెంకటజ్యోతి, వెంకటసుబ్బయ్య, కిషోర్ యాదవ్, డీఏ లక్ష్మీయాదవ్, ఇందిర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలమే కదా.. కబ్జా చేసేద్దాం
● అధికార పార్టీ నేతల ప్రమేయం ● ఆ స్థలంలో మట్టి తోలకం ● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులుఉదయగిరి: ఉదయగిరి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో కొండాయపాళెం పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల కబ్జా పర్వం కొనసాగుతోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తుల ప్రమేయం ఉండటంతో రెవెన్యూ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలున్నాయి. తాజాగా కొండాయపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1297 – 1లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. టీడీపీ నేత అండదండలతో ఓ వ్యక్తి అందులో ఆదివారం యథేచ్ఛగా అనుమతి లేకుండా వెంకట్రావుపల్లి చెరువు నుంచి గ్రావెల్ తరలించారు. ఈ భూమి ఉదయగిరి – గండిపాళెం రోడ్డు మార్గంలో ఉండటంతో మంచి గిరాకీ పలుకుతోంది. ప్రస్తుతం ఆక్రమణకు గురైన స్థలం విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.25 లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఫేక్ పట్టా సృష్టించి.. ప్రస్తుతం మట్టి తోలి చదును చేస్తున్న స్థలం సర్వేలో మొత్తం విస్తీర్ణం 3.50 ఎకరాలుంది. ఈ భూమికి కొంతమంది ఫేక్ పట్టా సృష్టించి హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కొందరు జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం ఆర్డీఓ కోర్టులో విచారణలో ఉంది. టీడీపీ అధికారంలోకి రావడంతో విలువైన భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 సెంట్ల భూమిని ఆక్రమించి పక్కనే ఉన్న వెంకట్రావుపల్లి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించి చదును చేస్తున్నారు. ఇంతా జరుగుతున్న రెవెన్యూ అధికారులు అక్రమణదారులపై చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేయకుండా.. ఆక్రమణ విషయం రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియడంతో రెవెన్యూ సిబ్బంది స్పందించి పనులు నిలిపివేయించారు. కానీ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాల్సి ఉన్నా స్థానికంగా వీఆర్వో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఇప్పుటికే ఉదయగిరి పట్టణంలోని జాతీయ రహదారి వెళ్తున్న బైపాస్ మార్గంలో విలువైన ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుటికై నా తహసీల్దార్ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్వో మాలకొండయ్య స్పందిస్తూ ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్ జగన్ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జిల్లాలో ఇలా..
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి తీవ్రతకు మానవులతో పాటు పశుపక్షాదులు విలవిల్లాడుతున్నాయి. వడదెబ్బ ఎక్కడ తగులుతుందోననే భయంతో రాకపోకలు సాగించాలంటేనే పలువురు జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీని నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు వేసవి సెలవులను ఇవ్వడం పరిపాటి. ఈ తరుణంలో వీరికి హాలిడేస్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. అయితే అంగన్వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు మాత్రం ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది. ఫలితంగా కొందరు రావడంలేదు. ఆయాలు కష్టపడి కొందర్ని తీసుకొస్తున్నా.. వేసవి తాపం, ఉక్కపోతతో వీరు నానా ఇక్కట్లు పడుతున్నారు. ● వేసవి తీవ్రతతో విలవిల ● తగ్గిన హాజరు శాతం ● సెలవులను ప్రకటించని సర్కార్ ● పక్క రాష్ట్రాల్లో మాత్రం హాలిడేస్ ఉదయగిరి: చిన్నారుల ఇబ్బందులు టీడీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదు. వేసవి తీవ్రతతో అంగన్వాడీ కేంద్రాలకు వీరెలా వస్తారనే కనీస ఆలోచన సర్కార్కు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ సెలవులను నేటికీ ప్రకటించకుండా చోద్యం చూస్తోంది. అదే పక్క రాష్ట్రాల్లో వీటికి హాలిడేస్ను ఇచ్చారు. ఎండలు మండుతున్న తరుణంలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వికటాట్టహాసం చేస్తోంది. ఎందుకింత నిర్లక్ష్యం..? రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయకపోవడంతో అక్కడికి చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ఎండల ధాటికి పెద్దలే ఇళ్లు దాటి బయటకు రాలేకపోతుంటే వీరినెలా పంపుతామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు వస్తున్నా, చాలీచాలనీ ఇరుకు గదులు.. ఫ్యాన్లు లేకపోవడం.. గాలి.. వెలుతురు లేక విలవిల్లాడుతున్నారు. అదే విధంగా కేంద్రాల్లో పనిచేసే ఆయాలు, టీచర్లకు చెరో 15 రోజులు సెలవులివ్వాల్సి ఉంది. ఆ సమయంలో వీరిలో ఎవరో ఒకరు ఉండాలి. అయితే దీనిపైనా నేటికీ స్పష్టత కొరవడింది. మేలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. పౌష్టికాహార పంపిణీలో ఇక్కట్లు కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్ మినహా మిగిలిన వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతి చిన్నారికి రూ.రెండు చొప్పున ప్రభుత్వం నిత్యం అందిస్తోంది. ఈ మొత్తంతో పౌష్టికాహారాన్ని ఎలా పెట్టగలమని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెప్తున్న ప్రభుత్వం, వారికి స్నాక్స్ను అందించడంలో శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్య.. బాబోయ్ కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లున్నా, ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలకు తంటాలు తప్పడంలేదు. విద్యుత్ సరఫరా లో అంతరాయాలు సైతం ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. కేంద్రాలకొచ్చి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన గర్భిణులు, బాలింతల వెతలు అన్నీ ఇన్నీ కావు. అంగన్వాడీ సెంటర్ డిమాండ్లు పెడచెవిన తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంత వరకు సబబని అంగన్వాడీ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. వేతనాలను పెంచాలని.. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఓవైపు వీరు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వానికి కనికరం కరువైంది. కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించకుండా కక్షపూరిత ధోరణిని అవలంబిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. -
పూడికతీత లేకుండా నీటి విడుదలా?
● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు : నియోజకవర్గంలోని అనేక పంట కాలువలు పూడికతీతకు నోచుకోక మరమ్మతులకు గురై సాగునీరు సజావుగా సాగే పరిస్థితి లేదని, ఈ విషయం తెలిసి కూడా పట్టించుకోకపోవడం ఏమిటని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి నిలదీశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో పంటకు సాగునీరు విడుదల చేసేందుకు ఐఏబీ సమావేశంలో 49 టీఎంసీల నీటిని 4.47 లక్షల ఎకరాలకు వినియోగించేలా నిర్ణయించారని, ఈ నేపథ్యంలో మరమ్మతులకు గురైన సాగునీటి కాలువలు మరమ్మతులకు గురైన విషయం అధికారులు తెలపకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతులకు నియోజకవర్గంలో 199 పనులకు ఎఫ్డీఆర్ నిధులను వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు అనంతరం ఆ పనులు ఎంత మేరకు జరిగాయో నేటికీ ప్రకటించలేదన్నారు. సుమారు రూ.10 కోట్లకుపైగా ప్రతిపాదనలతో ఎఫ్డీఆర్ పనులకు నిధులు కేటాయించారని, ఏ మండలంలో ఏ మేరకు పనులు జరిగాయో తెలపాలని డిమాండ్ చేశారు. అనంతసాగరం, ఏఎస్పేట, సంగం, మర్రిపాడు, చేజర్ల మండలాల్లో సుమారు 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే 165 చెరువులను అధికారులు పరిశీలించి కట్టలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
డీజిల్ అయిపోయి నిలిచిన లారీ
● హైవేపై రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ దగదర్తి: కావలి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ లారీ శనివారం అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్దకు రాగానే డీజిల్ అయిపోయి నిలిచిపోయింది. దాని వెనుకే వడ్లపొట్టుతో వెళ్తున్న ట్రాక్టర్ నిలిచిపోయింది. దీంతో వంతెనపై ఒకవైపు వెళ్లే రహదారి కావడంతో నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై భారీగా నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ డీజిల్ కోసం దగ్గరలోని ఉలవపాళ్ల ఐఓసీ పెట్రోల్ బంక్కు వెళ్లగా అక్కడ డీజిల్ లేకపోవడంతో వంతెనపై లారీ అలాగే నిలిచిపోయి సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు రెండు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైవే మొబైల్ సిబ్బంది, దగదర్తి పోలీసులు క్రేన్ సహాయంతో లారీని రహదారిపై పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పెట్రోల్ బంక్లో డీజిల్ లేకపోవడంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో..
పొలానికి వెళ్లి.. విగతజీవిగా మారి విడవలూరు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని దంపూరు పంచాయతీ గోల్కొండతోపు గ్రామ పొలాల్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన కుప్పా కామేశ్వరమ్మ (62) శనివారం మధ్యాహ్నం పొలం పనుల కోసం విడవలూరు మండలంలోని గోల్కొండతోపులో తన పొలం వద్దకు చేరుకుని పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఆమె పొలంలో స్పృహ లేకుండా పడిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు వ్యక్తులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై నరేష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకునేసరికి కామేశ్వరమ్మ మృతిచెందిందని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కామేశ్వరమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ పొలం విషయంలో గతంలో ఎన్నోసార్లు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులకు, కామేశ్వరమ్మకు గొడవలు జరిగి పోలీస్స్టేషన్ను, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమైపె దాడి జరిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోల్కొండతోపునకు చెందిన గతంలో పొలం కవులకు చేసిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూడ్చిన స్థితిలో బాలుడి మృతదేహం ● 15 రోజుల క్రితం అదృశ్యం చిల్లకూరు: తండ్రి పనిచేసే ప్రాంతానికి వచ్చిన చిన్నారి కనిపించడం లేదని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేస్తున్న క్రమంలోనే బాలుడి మృతదేహం లభ్యం కావడం గూడూరులో శనివారం సంచలనం కలిగించింది. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరుకు చెందిన ఓ గిరిజన కుటుంబ వేములపాళెం సమీపంలోని సవక తోటల్లో పనులకు వెళ్తుంటారు. ఈనెల 10వ తేదీన తమ ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా పనుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని వచ్చే సమయంలో తమ కుమారుడు లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించారు. అయితే అక్కడ కూడా లేకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బాలుడి కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే శుక్రవారం వేములపాళెంలోని సవకతోట యజమాని చెట్లకు నీరు కడుతున్న సమయంలో ఓ మృతదేహం పూడ్చి పెట్టి బయటకు కనిపిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్, సీఐ శేఖర్బాబు, ఎస్సై తిరుపతయ్య, వైద్యులు, తహసీల్దార్ ప్రసాద్లతో పాటుగా ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి చూడగా అదృశ్యమైన బాలుడిగా గుర్తించారు. అనంతరం శవ పంచనామా చేసినట్లు తెలిసింది. అయితే ఎనిమిదేళ్ల బాలుడు మృతికి కారణం ఆ తోటలో పనిచేసే 16 ఏళ్ల బాలుడే అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆసక్తిని కనపరచడం లేదు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం వివరాలను వెల్లడించగలమని పోలీసులు తెలిపారు. -
వీఎస్యూకు బస్సు వితరణ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్యూ)లో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ అందజేసిన బస్సును వీసీ అల్లం శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సెయిల్ కంపెనీ తమ సీఎస్సార్ నిధులతో బస్సును వీఎస్యూకు అందజేయడం చాలా సంతోషకరమన్నారు. ఈ బస్సు ద్వారా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు సులువుగా చేరుకుని, అవగాహన సదస్సులు, అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు. సెయిల్ కంపెనీ సీఎస్సార్ హెడ్ డేవిడ్ ఆల్బర్ట్ పీటర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తమ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వీఎస్యూ లాంటి విద్యాసంస్థలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వీఎస్యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు. -
పవిత్రమైన మందిరంలో దాడులా..?
నెల్లూరు రూరల్: కోవూరులోని సాయిబాబా మందిరంలో భక్తుల సమక్షంలో టీడీపీ లోని వర్గాలు దాడులకు పాల్పడటం హేయమని, దీన్ని అడ్డుకోవాల్సిన ఎమ్మె ల్యే ప్రశాంతిరెడ్డి అక్కడే ఉండి చోద్యం చూడటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేర కు నగరంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో విలేకరులతో కోవూరు నియోజకవర్గ నేతలు శనివారం మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ఎక్కడ బయటపడి వైరలవుతాయనే ఉద్దేశంతో భక్తులను చెదరగొట్టారని, ఆపై సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్వాహకులు వెళ్తే, ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలకు సుపరిపాలనను అందించేందుకేనని, అయితే అందుకు విరుద్ధంగా.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికే పరిమితమవడం మినహా నియోజకవర్గానికి ఆమె చేసిందేమీలేదని విమర్శించారు. అక్రమాలకు వత్తాసు పలుకుతూ.. కోవూరు పంచాయతీ కార్యదర్శి అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుంటే ఎమ్మెల్యే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని తెలిపారు. పంచాయతీలో నీళ్లు రావడంలేదని కార్యదర్శిని ప్రశ్నిస్తే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పనిచేసిన ప్రతి కార్యాలయంలో రికార్డులను మాయం చేయడంలో సదరు వ్యక్తి దిట్ట అని విమర్శించారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో వందల కోట్లను వెచ్చించి సచివాలయాలను నిర్మించారని, అయితే ఇందులో ప్రస్తుతం పది శాతాన్నైనా అభివృద్ధికి ఖర్చు చేశారానని ప్రశ్నించారు. కోవూరులో రౌడీయిజం, గూండాయిజం, మాదకద్రవ్యాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము నిరంతరం పోరాటా లు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్దుకోకపోతే ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. పా ర్టీ మండల కన్వీనర్లు అనూప్రెడ్డి, సతీష్రెడ్డి, శేషగిరిరావు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, కార్యదర్శి ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, మాజీ సర్పంచ్ ఉమా, జనార్దన్, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు 274 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్లోని కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్ను శనివారం నిర్వహించారు. 2773 మందికి గానూ 2499 మంది హాజరయ్యారు. జిల్లాలోని 19 కేంద్రాల్లో పరీక్షను జరిపారు. ఏపీజీబీ ఆఫీసర్స్ ఎన్నికలు నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ ఎన్నికలను నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును బ్యాంక్ అధికారులు వినియోగించుకున్నారు. విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగోన్నతులు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భారీగా ఉద్యోగోన్నతులు లభించాయి. మెరిట్, సీనియార్టీ ఆధారంగా 46 మందికి ఇవి లభించాయని ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వీరికి ఉద్యోగోన్నత పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జూనియర్ లైన్మెన్ నుంచి సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఇవి లభించాయని వెల్లడించారు. విద్యుత్ బిల్లులను నేడూ చెల్లించొచ్చు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను ఆదివారం యథావిధిగా చెల్లించొచ్చని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని బిల్లుల వసూలు కేంద్రాలు పనిచేయనున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నెల్లూరు(పొగతోట): డీజిల్, పెట్రోల్కు కృత్రిమ కొరత సృష్టించేలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యవహరిస్తున్నారు. బంకుల నుంచి అధిక మొత్తంలో డీజిల్ను కొనుగోలు చేసి డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో నగర పరిసర ప్రాంతాల్లో తనిఖీలను సివిల్ సప్లయ్స్ అధికారులు శనివారం చేపట్టారు. ఇలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేయనున్నామని హెచ్చరించారు. పెట్రోల్ బంకులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి.. అధికంగా కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 69,270 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,180 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
మలేరియాను నిర్మూలిద్దాం
నెల్లూరు(అర్బన్): మలేరియాను పూర్తి స్థాయిలో నిర్మూలిద్దామని డీఎంహెచ్ఓ సుజాత, మలేరియా నివారణాధికారి డాక్టర్ అంశుధర్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీని శనివారం నిర్వహించారు. అనంతరం జరిపిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. వైద్యశాఖ చేపట్టిన చర్యల ఫలితంగా మలేరియా కేసులు దాదాపు కనుమరుగయ్యాయని వివరించారు. ఇల్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, ఎన్సీడీ అధికారి యశ్వంత్, ఎపిడమిక్ జిల్లా అధికారి భాస్కర్, అసిస్టెంట్ మలేరియాధికారి జయరామ్ తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్సీలో కలెక్టర్ తనిఖీలు
కోవూరు: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించి.. రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆరాతీశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోజుకు ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించారు. ప్రసూతి విభాగంలోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యమందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ సేవలు అత్యవసరమనే అంశాన్ని గుర్తించామని, త్వరలోనే భర్తీ చేయనున్నామని హామీ ఇచ్చారు. 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని డీసీహెచ్ఎస్ పరిమళను ఆదేశించారు. వైద్యులు సునీల్బాబు, సలావుద్దీన్, వంశీకృష్ణ, జ్యోతిప్రభ, సురేష్, పద్మావతి, సంధ్య, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల తన్నులాట
కోవూరు: క్రమ శిక్షణకు మారు పేరు అని చెప్పుకొనే టీడీపీ నేతలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలోనే తన్నులాడుకున్న ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని గుర్తు చేసిన నేపథ్యంలో స్థానికులపై నోటిదురుసుకు తెగబడడం ఆ పార్టీ నేతల అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ ఘటన కోవూరులోని సాయిబాబా మందిరంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎన్నికల ముందు సాయిబాబా మందిర అభివృద్ధికి రూ.5 లక్షల డొనేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె సాయిబాబా మందిరానికి వచ్చి అక్కడ భజన కార్యక్రమంలో ఉన్న మహిళా భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మందిరానికి డొనేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మహిళా భక్తులు గుర్తు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేత మల్లారెడ్డి ఆ మహిళలను అవమానిస్తూ మాట్లాడారు. వీళ్లంతా బలిసినోళ్లే.. గుడికి డబ్బులు అవసరమైతే వాళ్లు సమకూర్చుకోగలరు... మీరు డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నోటి దురుసుతో మాట్లాడారు. ఎమ్మెల్యే డొనేషన్ ఇస్తామంటే ఇవ్వొద్దనేందుకు నీవెవరంటూ మరో వర్గం రెచ్చిపోయింది. ఎమ్మెల్యే సమక్షంలోనే మాటా మాటా పెరగడంతో చినికి చినికి గాలివానగా మారినట్లు రెండు వర్గాలు తున్నుకున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన సాయిబాబా మందిరం రాజకీయ రణరంగంగా మారింది. ఈ దృశ్యాలన్నీ మందిరంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో తమ అరాచకాలు ఎక్కడ బయటకు వస్తాయోనని వాటిని ధ్వంసం చేశారు. టీడీపీ నేతల వ్యవహార తీరుతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో సాయిబాబా మందిరంలో ఘటన మహిళలను అవమానిస్తూ నోరుపారేసుకున్న టీడీపీ నేత ఆయనపై రెచ్చిపోయిన మరో వర్గం నేతలు చినికి చినికి గాలివానగా మారిన వైనం ఘర్షణ తర్వాత సీసీ కెమెరాలు ధ్వంసం టీడీపీ నేత నోటి దురుసు ప్రవర్తన ఆధారాలు మాయం చేసేందుకేననే ఆరోపణలు ఇరువర్గాలపై కేసులు నమోదు -
గిట్టుబాటు ధర కల్పించాలి
మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. దళారులు కుమ్మకై ్క రైతులను దోచుకుంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పంట కొనుగోలుకు పరిమితులు విధించకుండా తేమ శాతం నిబంధనలను సడలించి నాణ్యత పేరుతో నిబంధనలు విధించకుండా పూర్తి పంటను కొనుగోలు చేయాలి. – చిన్నా, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తక్షణమే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలకు తరలించే స్తోమత లేక డబ్బులు అత్యవసరమై దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకుని నష్టపోవాలసిన పరిస్థితి పొంచి ఉంది. పంట చేతికి వచ్చి మూడు వారాలు అవుతున్నా ఇంకా ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. – రత్తయ్య, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.1,500 నుంచి రూ.1,600 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర కంటే చాలా తక్కువ. ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. దళారులు తక్కువ ధరకే కొంటుండడంతో ఎకరాకు 20 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. – పుల్లయ్య, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి -
టీడీపీలో నాబార్డు నిప్పు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా టీడీపీలో నాబార్డు నిప్పు రాజుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తాజాగా బహిరంగ దాడిగా మారింది. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు అధికారిక సమావేశంలో అసంతృప్తి మాటలు తూటాలై పేలాయి. మంత్రి నారాయణ ఒంటెద్దు పోకడలపై ఆయన పరోక్షంగా జరిగిన ఐఏబీ వేదికగా తాడోపేడో తేల్చుకుందామనే వరకు వెళ్లాయి. గురువారం జిల్లాలో రెండో పంటకు సంబంధించి ఐఏబీ సమావేశంలో కాలువల అభివృద్ధిపై జరిగిన చర్చలో నాబార్డు నిధులపైకి మళ్లింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే.. కేవలం రూ.50 కోట్లు నెల్లూరు నగరానికి మాత్రమే కేటాయించుకుని, మిగతా ప్రతిపాదనలు పక్కన పెట్టించడంలో మంత్రి నారాయణ చక్రం తిప్పారంటూ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తడంతో అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురి చేసింది. అయితే ఈ నిధులను తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే డ్రెయినేజీ కాలువల పనులకే కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణ తీరుపై ఆనం రుసరుసలు నాబార్డు నిధులు మంజూరు, కేటాయింపుల్లో మంత్రి నారాయణ తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అందుకు మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం రుసరుసలాడారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యేలకు వంతపాడడంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తొలుత ఈ అంశాన్ని లెవనెత్తడంతో మిగతా ఎమ్మెల్యేలు గళం కలిపారు. నాబార్డు నిధులకు సంబంధించి మన ప్రతిపాదనలు ఏమయ్యాయంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ విషయంలో అధికారులను నిలదీయడంతో ఏమీ చెప్పలేక నీళ్లు నమిలారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చడంతో ఆయా ఎమ్మెల్యేలు మంత్రి నారాయణ తీరును ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గాలను కాదని నారాయణకు ఉన్న పరపతితో సిటీ నియోజకవర్గానికే కేటాయింపులు వచ్చేలా చేయడం, ఆ నిధులు సైతం తమ్ముళ్లు పంపకం చేసేందుకేననే ఆరోపణలున్నాయి. బహిరంగంగానే మంత్రి నారాయణపై ఆరోపణలు చేయడం ఆ పార్టీలోనే ఆధిపత్య పోరుపై మరోసారి ఉన్నట్లుగా తేటతెల్లమైంది. ఇటీవల నెల్లూరు సిటీలో నారాయణ మొక్కలతో సుందరీకరణ పేరుతో మొక్కల పెంపకానికి దాదాపు రూ.60 కోట్లు అవినీతి చేశాడంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి ఆధారాలతో సహా బయట పెట్టినా.. అందుకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా ఏ టీడీపీ నేత కూడా ముందుకు రాలేదంటూ మంత్రి నారాయణ తీరునే ఆక్షేపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తడం ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఏమీలేదు నిధుల కోసం పోరాటం తప్పడంలేదంటూ గత ప్రభుత్వంలో కింద కూర్చొని మాట్లాడే వాడని, ఇప్పుడు పైన కూర్చొని మాట్లాడుతున్నాను.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీలేదంటూ మంత్రి ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. మంత్రి ఆనం బేల మాటలు, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో హాట్టాపిక్గా మారాయి. ప్రభుత్వంలో తన ప్రాభవం లేదని చెప్పకనే చెప్పినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఏబీ వేదికగా పేలిన అసంతృప్తి జిల్లా వ్యాప్తంగా రూ.200 కోట్లకు ప్రతిపాదనలు నగరానికే నిధులు.. నియోజకవర్గాలకు రిక్తహస్తాలు మా పరిస్థితేమిటంటూ గళమెత్తిన ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకుందామన్న మంత్రి ఆనం సాగునీటి సలహా మండలి సమావేశంమిగిలిన నియోజకవర్గాలకు రిక్తహస్తమా..?తమకే దిక్కులేదంటూ అసంతృప్తులు ఐఏబీ సమావేశం వేదికగా పలువురు ఎమ్మెల్యేలు తమ ఆదేశాలకే దిక్కులేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం గిట్టుబాట ధర విషయంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళితే సరిగా స్పందించలేదన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ లష్కర్లు లేని కారణంగా చివరి భూముల వరకు నీరు అందడమలేదన్నారు. ఉన్న లష్కర్లకు వేతనాలు చెల్లించడంలేదన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ టీపీగూడూరు మండలంలో రెండో పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు. మాకే దిక్కులేకుండాపోయింది.. తాడోపేడో తేల్చుకుందాం -
అన్నదాతల ఆరుగాలం కష్టానికి కూటమి ప్రభుత్వం ‘మద్దతు’ కరువైంది. దళారుల దోపిడీకి ఇప్పటికే ధాన్యం రైతులు, తాజాగా జొన్న, మొక్కజొన్న రైతులు బలైపోతున్నా.. సర్కారులో కనీసం కనికరం కరువైంది. రైతులతో దళారులు ధరలాట ఆడుతున్నారు. నానాటికి సాగు ఖర్చులు పెరుగుతుంటే.. ఏటే
సీతారామపురం: కూటమి ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా, నెత్తిన కుంపటిగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే ఏ రైతును ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. వ్యవసాయం అంటే.. అన్నదాతలు దడుచుకునే పరిస్థితిని సృష్టిస్తోంది. సర్కారు నిర్లక్ష్యం, దళారుల దోపిడీ ఖాతాలో తాజాగా మొక్కజొన్న రైతులు చేరారు. తక్కువ సమయంలో పంట చేతుకుందుతుందని ఎన్నో ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులను నష్టాల ఊబిలోకి కూర్చేసింది. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. ధరలు మాత్రం పాతాళానికి పడిపోయాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు జిల్లాలో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా అందులో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో 1200 ఎకరాల్లో సాగు చేస్తే.. మెట్ట ప్రాంతమైన ఒక్క సీతారామపురం మండలంలోనే దాదాపు 400 ఎకరాల్లో సాగు చేశారు. మూడు వారాల క్రితం పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఎప్పుడు పంట కొనుగోలు చేస్తుందా? అని రైతులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా.. నేటికీ దిక్కులేని పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న పంట ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పెట్టుబడి అవుతుందని, ఈ దఫా ఆ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1500 నుంచి రూ.1600 మధ్యనే దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి వస్తే.. రూ.40 వేలు కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు గొల్లుమంటున్నారు. గతేడాదిలో ప్రభుత్వం కింటాల్కు రూ. 2250 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేసింది. ప్రస్తుతం మొక్కజొన్నకు కనీసం మద్దతు ధర రూ.2,400 ఉన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే కొందరు అత్యవసర పరిస్థితుల్లో అడిగిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. మద్దతు ధర ప్రకటించి.. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సాగు ఖర్చులు లెక్కించి క్వింటాల్కు రూ.2100 ధర నిర్ణయించి, ఆ మేరకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. గతంలో ఎకరాకు 25 క్వింటాళ్లు పంట దిగుబడి వస్తే.. ప్రస్తుతం ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్లు దాకా పంట దిగుబడి వచ్చిందన్నారు. ఇటీవల బసినేనిపల్లి ప్రాంతానికి చెందిన మొక్కజొన్న రైతులు కలెక్టర్ను కలిసి పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు, గిట్టుబాటు ధరపై మొర పెట్టుకున్నా నేటి వరకు ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు అధికార యంత్రాంగం స్పందించి మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూటమి సర్కారు నిర్లక్ష్యం పంట చేతికొచ్చి నెల గడిచినా కొనే దిక్కులేని పరిస్థితి నష్టానికి దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్దతు ధర ప్రకటించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు -
యుద్ధంతో సామాన్యులపై పెనుభారం
నెల్లూరు(అర్బన్): సామ్రాజ్యవాదం, యుద్ధాలతో సామాన్య ప్రజలు తీవ్ర భారం మోయాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు అన్నారు. శుక్రవారం నెల్లూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో అమెరికా సామ్రాజ్యవాదం, యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలు అనే సదస్సులో ఆయన మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధ ఫలితంగా ముడిచమురు ధరలు పెరిగాయన్నారు. ఇండియాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిందన్నారు. బ్లాక్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అమ్ముతున్నారన్నారు. నిత్యావసర ధరలు పెంచేశారన్నారు. కార్యక్రమంలో ఏపీ హంస నాయకులు గౌస్బాషా, మంజరి, లక్ష్మీకాంతమ్మ పాల్గొన్నారు. -
హమ్మయ్య.. నీడ దొరికింది
పనుల నిమిత్తం ఎండలో తిరిగేవారికి కాస్తంత సమయం దొరికితే చాలు నీడలో సేదతీరి హమ్మయ్య అనుకుంటారు. మూగజీవాల పరిస్థితి అలా కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అవి పడుతున్న బాధలు వర్ణనాతీతం. చిల్లకూరు మండలం తీర ప్రాంతంలోని కాకువారిపాళెం సమీపంలోని సిలికా భూమిలో ఉన్న వేపచెట్టు కింద శుక్రవారం సుమారు వంద జీవాలు చేరాయి. గ్రామానికి చుట్టుపక్కల ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పెంపకందారులు ఆ భూములకు అటువైపుగా ఉండే పడవ భూముల (వరినాటే భూములు) వద్దకు జీవాలను మేతకు తీసుకెళ్తుంటారు. అయితే మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాటిని ఆ భూమిలో ఉన్న వేపచెట్టు కిందకు చేరుస్తుంటారు. ఆకలి సంగతి దేవుడెరుగు.. ముందు నీడలో సేద తీరుతాం అన్నట్టుగా ఉంటాయి ఆ మూగజీవాలు. – చిల్లకూరు చెట్టు కింద సేద తీరుతున్న జీవాలు -
పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు
నెల్లూరు(పొగతోట): చిన్నపిల్లలతో భిక్షాటన చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.సురేష్ హెచ్చరించారు. భిక్షాటన చేసే బాలలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఏర్పాటు చేశారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం బృంద సభ్యులు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి సెంటర్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించారు. నలుగురు బాలికలు, ఒక బాలుడిని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం పిల్లలను సీడబ్ల్యూసీ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలల చేత భిక్షాటన చేయించే వ్యక్తికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందన్నారు. భిక్షాటన కోసం బాలలను దివ్యాంగులను చేసే వారికి 10 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు వై.శ్రీహరి, డి.సతీష్, రాంబాబు, సిబ్బంది సుమలత, రత్నం, సుజాత, శైలజ పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు
● బ్లాక్స్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ నెల్లూరు(క్రైమ్): ‘రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం’ కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై బ్లాక్స్పాట్లను శుక్రవారం కలెక్టర్, ఎస్పీ అజిత పరిశీలించారు. గతేడాది, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై ఆరాతీశారు. బ్లాక్స్పాట్లలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, సీసీ టీవీ నిఘాను పెంచాలని, ట్రాఫిక్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఽఅధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సూచికలు, హెచ్చరిక బోర్డులు, లైటింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించాలన్నారు. మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి లోపాలను తక్షణమే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని, మద్యం మత్తు, మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదన్నారు. వారి వెంట ఆర్డీఓ అనూష, పోలీసు అధికారులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. కార్మికుల వేతనాలపై నిర్ణయం నెల్లూరురూరల్: 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి నామినల్ మస్తర్ రోల్ కార్మికుల కనీస వేతనాలను కమిటీ నిర్ణయించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం జరిగింది. నెల్లూరు ఉప కార్మిక కమిషనర్, జిల్లాలోని ఇంజినీరింగ్ వర్క్స్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్య స్థాయి ఆధారంగా రోజువారీ వేతనాలను ఖరారు చేశారు. అన్స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.615, సెమీస్కిల్డ్ వారికి రూ.735, స్కిల్డ్ వారికి రూ.870, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.990 వేతనంగా నిర్ణయించారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులకు పైవేతనాలపై అదనంగా 20 శాతం, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే వారికి 25 శాతం అదనపు భత్యం చెల్లించాలన్నారు. ఈ నిర్ణయాలను ఉప కార్మిక కమిషనర్ సీహెచ్ విజయకుమార్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. -
ఆకలి కేకలు..
కూటమి నేతలే ఎఫ్ఏలు నెల్లూరు(పొగతోట): టీడీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ శ్రామికులకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. ఫలితంగా వీరు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్ష మంది హాజరవుతుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య వేలకు పతనమైంది. అంతులేని నిరీక్షణ గతంలో బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు వార వారం జమయ్యేవి. అయితే ప్రస్తుతం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పనులకు అధిక శాతం మంది ముఖం చాటేస్తూ.. వ్యవసాయ సంబంధిత వర్కులకెళ్తున్నారు. జనవరికి సంబంధించిన జీతాలను చెల్లించి.. ఆపై వేయలేదు. ఇలా జిల్లాలో రూ.20 కోట్లకుపైగా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన నిధులను రెండు రోజుల క్రితం మంజూరు చేశారని సమాచారం. ఇవి శ్రామికుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది. సన్నగిల్లిన అవకాశాలు జిల్లాలో జాబ్కార్డులు కలిగిన శ్రామికులు నాలుగు లక్షల మంది ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు పనులకు నిత్యం లక్ష మంది హాజరయ్యేవారు. ఈ వర్కులతో జిల్లాలో నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మంజూరయ్యేవి. అయితే ప్రస్తుతం పనులకొచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర భవన నిర్మాణాలకు నిధులు విడుదలయ్యే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. గతంలో ఏటా రూ.వందల కోట్లతో పనులు చేపట్టగా, ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఉన్నవి పూర్తయితేనే కొత్తవి.. ఉపాధి హామీ పథకంలో నూతన విధానాలతో పంచాయతీల్లో 20 పనులకే అనుమతులిస్తున్నారు. ఇవి పూర్తయ్యాకే ఇతర వాటి కోసం డిమాండ్ పెట్టాల్సి ఉంది. పంచాయతీల్లో గతంలో వార వారం డిమాండ్ పెట్టే వారు. ఈ– కేవైసీ పూర్తి చేసుకున్న శ్రామికుల ఫొటోలే అప్లోడ్ అవుతున్నాయి. ఇవి కాని వారు పనులకు హాజరైనా వేతనాలు జమయ్యే అవకాశాల్లేవు. నాలుగు నెలలుగా అందని వేతనాలు రూ.20 కోట్లకుపైగా పెండింగ్ ఉపాధి శ్రామికుల హాహాకారాలు రోజురోజుకూ తగ్గిపోతున్న వచ్చే వారి సంఖ్య గ్రామ పంచాయతీల్లో కూటమి నేతలే ఎఫ్ఏలుగా అవతారమెత్తడంతో పనులు ముందుకు సాగడంలేదు. ఉపాధిలో నూతన నిబంధనలు వీరికి మింగుడుపడటం లేదు. బోగస్ మస్టర్లేసుకొని నిధులను స్వాహా చేయాలనే ఆలోచనలకు బ్రేకులుపడ్డాయి. జిల్లాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న 500 మంది ఎఫ్ఏలను తొలగించి వారి స్థానాల్లో అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కనుసన్నల్లో వర్కులు జరుగుతున్నాయి. వీరు చెప్పిన వారికే పనులు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆశించిన స్థాయిలో వర్కుల్లేకపోవడం.. వేతనాలు సక్రమంగా రాకపోవడంతో ఇతర వాటివైపు శ్రామికులు మొగ్గు చూపుతున్నారు. -
30 వేల మంది భక్తులొస్తారా..?
● దేవదాయ శాఖ అధికారుల తీరుపై ఆశ్చర్యం ● మంత్రి ఆనం సమక్షంలోనే నిలదీసిన డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నంలోని కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఏటా నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 30 వేల మంది భక్తులు హాజరవుతారని దేవదాయ శాఖ అధికారులు వెల్లడించడంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో పునరుద్ధరణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఆలయాధికారులు అందజేసిన నివేదికలు నమ్మశక్యంగా లేవని కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఆలయానికి 30 వేల మంది భక్తులెలా వస్తారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన రికార్డులున్నాయా అంటూ మంత్రితో పాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమక్షంలోనే నిలదీశారు. మహాశివరాత్రి మహోత్సవాల సమయంలో చిత్రీకరించిన వీడియోలను పురావస్తు శాఖ అధికారులకు చూపగా, పలు ప్రశ్నలను వారు సంధించారు. కనీసం ఐదు వేల మంది సైతం హాజరుకాలేదని అభిప్రాయపడ్డారు. సమగ్ర సర్వే జరపండి ఆలయానికి ఇరువైపులా సమగ్రమైన సర్వే చేసి నివేదికను అందజేయాలని మంత్రి ఆదేశించారు. 11వ శతాబ్దం నాటి ఆలయ ప్రాచీన నైపుణ్యం దెబ్బతినకుండా సాంకేతిక పరిజ్ఞానంతో సిమెంట్తో నిర్మాణం చేయకుండా పనులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచించారు. ఆలయాధికారులు శేఖర్, గిరికృష్ణ, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మలేరియా.. చాలా డేంజర్
● అవగాహనతోనే చెక్ ● జిల్లా వైద్యశాఖలో కాకి లెక్కలు ● వరల్డ్ మలేరియా డే నేడునెల్లూరు(అర్బన్): ప్రజలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో మలేరియా ఒకటి. ప్రతి సంవత్సరం దేశంలో లక్షలాది మంది ఈ వ్యాధిన పడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీని వరల్డ్ మలేరియా డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దోమ కాటుతోనే వ్యాప్తి మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది దోమ లాలాజలంలో నివాసం ఏర్పరుచుకుంటుంది. ఆడ అనాఫిలస్ అనే దోమ కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మానవుని రక్తంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మలేరియా అనే జబ్బును కలిగిస్తాయి. నీటిగుంతలు ఎక్కువగా ఉండే చోట దోమల పునరుత్పత్తి జరిగి వాటి ద్వారా రోగం వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా విస్తరిస్తాయి. ఈ లెక్కలేంటో.. జిల్లాలో సీజనల్లో వివిధ ప్రాంతాల్లో ఒకప్పుడు వందలాది కేసులు నమోదయ్యేవి. అయితే ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నిచోట్ల కొన్నేళ్లుగా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా అడపాదడపా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేసులు తరచూ నమోదవుతూనే ఉన్నాయి. సంవత్సరం మొత్తంగా వందలాదిగా వస్తున్నా వైద్యశాఖలో మాత్రం జిల్లా మొత్తానికి కలిపి 5 లేదా 10 కేసులు మాత్రమే నమోదవుతున్నట్టు కాకిలెక్కలు చూపుతున్నారు. ఉదాహరణకు శంకరాగ్రహారంలోని ఒక ప్రజా వైద్యశాలలో రెండు నెలల డేటాను పరిశీలిస్తే పదుల సంఖ్యలో రోగులున్నట్లు తేలింది. అలాగే నారాయణ, మెడికవర్, అపోలో, కిమ్స్, పెద్దాస్పత్రి, జయభారత్ ఆస్పత్రి ఇలా పలుచోట్ల మలేరియా కేసులు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వైద్యశాఖలో ఒకటో, రెండో నమోదు చూపి చేతులు దులుపుకొంటున్నారని విమర్శలున్నాయి. ఎన్నో రకాలు మలేరియాను కలిగించే పరాన్న జీవులు ఐదు రకాలుగా ఉన్నాయి. అవి ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవాలే, ప్లాస్మోడియం నోలెసి. మన ప్రాంతంలో ప్రధానంగా మూడు రకాలు మలేరియాను కలిగిస్తాయి. వీటిలో ప్లోస్మోడియం ఫాల్సిపారం అత్యంత ప్రమాదకరమైంది. ప్రాణా పాయం సంభవించవచ్చు. ఈ రకమైన జీవి మనిషి మెదడును కూడా దెబ్బతీస్తుంది. రక్తపరీక్షల్లో వైవాక్స్ మలేరియా అయితే రెండు వారాలు పూర్తిగా చికిత్స తీసుకోవాలి. ఫాల్సిపారం మలేరియా అయితే మూడు రోజులపాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. సంవత్సరం ప్రభుత్వ లెక్కలు ప్రైవేట్ ఆస్పత్రిలో.. 2021 12 63 2022 3 56 2023 1 62 2024 6 73 2025 5 67 2026 0 21 లక్షణాలు ఏంటంటే? జ్వరంతోపాటు చలి, వణుకు, తలనొప్పి, వాంతులు, వికారం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే మలేరియా జబ్బు కావచ్చు. దీనిని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే చికిత్స చేయించుకోవాలి. ఇళ్ల చుట్టూ నిలువ నీరు లేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ ఉపయోగించాలి. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. నీటి ట్యాంక్లను మూసేయాలి. దోమల నిర్మూలన జరిగితే మలేరియా కూడా నియంత్రణ జరిగినట్టే. జిల్లాలో ఇలా.. నియంత్రణలో కేసులు జిల్లాలో మలేరియా కేసులను నియంత్రించగలిగాం. 2026లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు దోమకాటుకు దూరంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు కుట్టకుండా, పుట్టకుండా చూసుకోగలిగితే మలేరియాను పారదోలినట్టే. – డాక్టర్.టి.అంశుధర్, ఇన్చార్జి జిల్లా మలేరియా నివారణాధికారి, వైద్యశాఖనిర్మూలనే అంతిమ లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంటే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి. మలేరియా నిర్ధారణ అయితే ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాం. ప్రజలు కూడా అవగాహన కలిగి ఇల్లు, పరిసరాల్లో నీరు నిలబడే గుంతలు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ, జిల్లా వైద్యశాఖ -
సోమిరెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ దోపిడీ
వెంకటాచలం: అక్రమ సంపాదన కోసం పేదల భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ అక్రమంగా తవ్వుతూ వారి కడుపు కొట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడులో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న ప్రదేశాన్ని గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులతో కలిసి కాకాణి శుక్రవారం పరిశీలించారు. గ్రామస్తులు, మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి, కన్నీరు పెట్టుకున్నారు. తమ భూముల్లో దౌర్జన్యంగా గ్రావెల్ తవ్వేస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే సీఐ సుబ్బారావు తమపైనే కేసులు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను సైతం తవ్వేశారని విలపించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో సహజ వనరుల దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రోద్బలంతోనే గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. దశాబ్దాలుగా నిరుపేదలు సాగు చేసుకునే ఈ భూముల్లో గతంలోనే కొందరికి డీ ఫారం పట్టాలు కూడా ఇచ్చారని, 2007లోనే విద్యుత్ సౌకర్యం కల్పించారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా«దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి కనుసన్నల్లో గ్రావెల్ తవ్వేస్తున్నారని «విమర్శించారు. అడ్డుకున్న మహిళలపై కూడా కేసులు పెడతామని సీఐ సుబ్బారావు బెదిరించడం చూస్తే ఎంత అవినీతిలో కూరుకుపోయారో అర్థమవుతుందన్నారు. జిల్లాలో కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. మైనింగ్ శాఖ డీడీ నిద్రలేస్తే అవినీతిలో మునిగి తేలుతున్నాడని ఆరోపించారు. అసలు జిల్లాలో అధికార యంత్రాంగం పనిచేస్తోందా అని నిలదీశారు. గ్రావెల్ తరలిస్తున్న లారీల నంబర్లు నమోదు చేస్తున్నామని, కలెక్టర్తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. టీడీపీ, బీజేపీ సానుభూతిపరులు కూడా ఈ అక్రమ తవ్వకాల వల్ల నష్టపోయి తమతో కలిసి పోరాటానికి వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల వైస్ ఎంపీపీలు కనుపూరు కోదండరామిరెడ్డి, పచ్చబట్ల మస్తానయ్య, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
● ప్రాణాలు కాపాడిన సంగం పోలీసులు సంగం: కారు కాలువలోకి దూసుకెళ్లింది. సంగం పోలీసులు తక్షణమే స్పందించడంతో వాహనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు జేఆర్ పేటకు చెందిన షేక్ నాగూర్ తన సోదరి షేక్ నాగూర్బీ, ఆమె పిల్లలతో కలిసి బుధవారం సాయంత్రం నెల్లూరుకు కారులో వెళ్లారు. నారాయణ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అర్ధరాత్రి సొంతూరికి బయలుదేరారు. పెరమన గ్రామం వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న నాగూర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు బాధితులను కారులో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వారిని పోలీస్ వాహనంలో ఆత్మకూరుకు తీసుకెళ్లారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జాతీయ రహదారిపై పెన్నానది బ్రిడ్జి వద్ద కారు పూర్తిగా దగ్ధమైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. విడవలూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో నరుకూరుకు వెళ్లాడు. తిరిగి తెల్లవారుజామున విడవలూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో పెన్నానది వంతెన వద్దకు రాగానే కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సుబ్రహ్మణ్యం వెంటనే కారును రోడ్డు పక్కన ఆపాడు. కొన్ని నిమిషాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ కేసు నమోదు చేశారు. -
బాక్సింగ్, ఫుట్బాల్ పోటీలకు ఎంపికలు
నెల్లూరు(టౌన్): శాప్లీగ్ – 2026లో భాగంగా జిల్లా క్రీడాప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని ఏసీ స్టేడియంలో జిల్లా స్థాయి బాక్సింగ్, ఫుట్బాల్ పోటీలు జరిగాయి. వీటిని డీఎస్డీఓ జసీమ్ ప్రారంభించారు. ఫుట్బాల్ పోటీల్లో 170 మంది, బాక్సింగ్ పోటీల్లో 35 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలో జరిగే ఫుట్బాల్, అలాగే విశాఖలో జరిగే బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ డాక్టర్ దేవిక, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
బస్ షెల్టర్ను తొలగించేందుకు తమ్ముళ్ల యత్నం
● అడ్డుకున్న ఎంపీడీఓ ● ప్రయాణికులకు నీడ లేకుండా చేసేందుకు కుట్రచేజర్ల: తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోతోంది. మండల కేంద్రమైన చేజర్లలో ప్రయాణికుల కోసం దాతలు పంచాయతీ స్థలంలో షెల్టర్ను 20 సంవత్సరాల క్రితం నిర్మించారు. తాము నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్కు ఇది అడ్డుగా ఉందని తెలుగు తమ్ముళ్లు కూలగొట్టేందుకు గురువారం ప్రయత్నించగా మండల అభివృద్ధి అధికారి, చేజర్ల గ్రామ ప్రత్యేకాధికారి అమర్ అడ్డుకున్నారు. అనుమతుల్లేకుండా కూల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య తన తల్లి వెంకమ్మ జ్ఞాపకార్థం ఈ షెల్టర్ను సొంత నిధులతో బస్టాండ్ ఆవరణలో నిర్మించారు. దానికి ఇరువైపులా పంచాయతీ పాలకవర్గం శాశ్వత ప్రాతిపదికన షాపులను నిర్మించి అద్దెకిచ్చింది. ఏం చేశారంటే.. బస్ షెల్టర్ వెనుక భాగంలో దేవదాయ శాఖకు స్థలం ఉంది. అందులో తెలుగు తమ్ముళ్లు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి దుకాణాలు అద్దెకు ఇచ్చారు. దాని ముందుభాగాన ఇరువైపులా పంచాయతీ షాపులు, షెల్టర్ ఉన్నాయి. వీటిని తొలగించాలని మొన్నటి వరకు ఉన్న పాలకవర్గంపై నేతలు ఒత్తిడి తెచ్చారు. పంచాయతీకి ఆదాయం తెచ్చే షాపులను, ప్రయాణికులకు విశ్రాంతినిచ్చే షెల్టర్ను తొలగించేది లేదని అప్పట్లో పాలకవర్గం తేల్చి చెప్పింది. దీంతో పదవీకాలం ముగిసే వరకు వేచి చూసిన తెలుగు తమ్ముళ్లు ఏప్రిల్ రెండో తేదీన షెల్టర్ను, పంచాయతీ గదులను కూలదోసేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఈ ప్రయత్నాన్ని ప్రారంభించగా ఎంపీడీఓ అడ్డుకున్నారు. అసలే వేసవికాలం. నీడనిచ్చే షెల్టర్ను కూలగొట్టే విషయంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని మండి పడుతున్నారు. -
వామ్మో.. బూడిద బల్కర్లు
బూడిద బల్కర్లు కనిపిస్తే చాలు ప్రజలు హడలిపోతున్నారు. అతివేగం, రహదారి గురించి సరైన అవగాహన లేకపోవడం, నిద్రలేమి తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలున్నాయి. నివారించాల్సిన అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.● వందల సంఖ్యలో రాకపోకలు ● అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు ● భయం గుప్పిట్లో ప్రజలు ● నియంత్రణలో అధికారుల వైఫల్యంముత్తుకూరు(పొదలకూరు): ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బల్కర్లు బూడిదను తరలిస్తుంటాయి. నేలటూరులోని ప్రైవేట్ పవర్ ప్లాంట్లు, ఏపీ జెన్కో నుంచి భారీగా బల్కర్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవి దాదాపుగా అన్ని మార్గాల గుండా బయటి రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్తున్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవల మండలంలోని పంటపాళెం పంచాయతీ పరిధిలో ఇటీవల బల్కర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో పక్కనే ఉన్న పట్టల గోదాముకు మంటలు వ్యాపించి భారీగా నష్టం వాటిల్లింది. వరుస ప్రమాదాలు ఇటీవల ఈ ప్రాంతంలో బూడిద బల్కర్ల ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మార్చి 12వ తేదీన మల్లూరు సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాలువలో పడిపోయింది. 14వ తేదీ అర్ధరాత్రి ఏపీ జెన్కో సమీపంలో రెండు బల్కర్లు ఎదురెదురుగా ఢీకొని పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ ఘటనల్లో ప్రాణనష్టం జరగలేదు. తోటపల్లిగూడూరు వద్ద నేరుగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ధ్వంసమైంది. అదే కారణమా? అధికార పార్టీ నేతల కమీషన్ల కక్కుర్తి కారణంగా బూడిద రవాణా చేసే బల్కర్లు రాత్రింబవళ్లు అతి వేగంతో నడుస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. నియంత్రణ లేకుండా వెళ్తుండటంతో ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. బల్కర్ల నుంచి బూడిద రోడ్డుపై పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గాలికి దుమ్ము ఎగిరి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. పట్టించుకుంటే కదా.. ప్రమాదాలపై సంబంధిత శాఖల అధికారుల వైపు ఎలాంటి చర్యల్లేవు. ముత్తుకూరు మెయిన్ రోడ్డుపై బూడిద పడితే పంచాయతీ నిర్వాహకులు తొలగించాల్సి వస్తోంది. పాఠశాలలకు నుంచి ఇళ్లకు వెళ్లే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు భయాందోళనకు లోనవుతున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కానిస్టేబుళ్లకు శిక్షణ
నెల్లూరు(క్రైమ్): చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం పరిశీలించారు. వివిధ జిల్లాల నుంచి 177 మంది కానిస్టేబుళ్లు వచ్చి శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం తొలి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రిమినల్ లాస్ 1, క్రిమినల్ లాస్ 2, కంప్యూటర్ అంశాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిని తనిఖీ చేసిన ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుళ్లకు పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతి, భద్రతా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ గిరిధర్, సీఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు. గండిపాళెం హైస్కూల్లో చోరీఉదయగిరి: మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు గదుల తాళాలు పగలగొట్టారు. గురువారం ఉదయం స్కూల్కు వచ్చిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ రెండు గదుల్లో బీరువాలతోపాటు నాలుగు సీలింగ్ ఫ్యాన్లు, సైన్స్ సామగ్రి, ఇతర వస్తువులు చోరీ చేశారని ప్రధానోపాధ్యాయుడు ఆర్.రవీంద్ర తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పెన్నా తీరంలో మృతదేహంనెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని సుభాన్ నగర్ సమీపంలో పెన్నానది తీరానికి గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టికొచ్చింది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సున వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఛాతిపై కుమారి అని పచ్చబొట్టు ఉంది. రూరల్ సీఐ వేణు కేసు నమోదు చేశారు. రోడ్డు బాగు చేయాలంటూ ఆందోళన సైదాపురం: మండలంలోని తుమ్మలతలుపూరు గ్రామ రోడ్డును బాగు చేయాలంటూ గ్రామస్తులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుడూ గ్రామ రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. దీంతో కంకర రాళ్లు లేచి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.190 సన్నవి : రూ.130 పండ్లు : రూ.90 -
సమస్యల పరిష్కారానికి కృషి
● ఎస్పీ అజిత ఉదయగిరి: ‘ఉదయగిరి లాంటి మారుమాల ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా వచ్చా. వాటి పరిష్కారానికి కృషి చేస్తా’ అని ఎస్పీ వేజండ్ల అజిత తెలిపారు. ఉదయగిరి పోలీస్టేషన్లో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి అర్జీలు సేకరించారు. ఎస్పీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూ వివాదాలపై దృష్టి పెట్టి గొడవల్లేకుండా చూస్తామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, బాలికల అదృశ్యం కేసులపై శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్కు 18 అర్జీలు వచ్చాయి. వీటిలో చోరీలు, సైబర్ నేరాలు, ఉద్యోగాల పేరుతో నగదు వసూలు, భూ వివాదాలు తదితర వాటిపై ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కావలి డీఎస్పీ రమణరావు, ఎస్బీ డీఎస్పీ వినీల్, కలిగిరి, ఉదయగిరి సీఐలు సుబ్బారావు, వెంకట్రావు, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
రెండో పంటకు 4న సాగునీటి విడుదల
● 4.47 లక్షలెకరాలకు.. ● ఐఏబీలో తీర్మానం నెల్లూరు(పొగతోట): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సాగునీటిని వచ్చే నెల నాలుగున విడుదల చేయనున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 4,47,322 ఎకరాలకు 49 టీఎంసీలను విడుదల చేయాలని తీర్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులొచ్చే అవకాశమున్న తరుణంలో, నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. కాలువల పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించారు. సోమశిల ప్రాజెక్ట్ ఉండేది ఆత్మకూరు నియోజకవర్గంలోనేనని, తాము గేట్లెత్తితేనే కింది ప్రాంతాలకు నీరు పారుతుందని తెలిపారు. మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరిలో పరిస్థితి దయనీయంగా ఉందని వివరించారు. వీరి జీవితాల్లో వెలుగులు రావాలంటే సోమశిల హైలెవల్ కెనాల్ పనులు పూర్తి కావాలని తెలిపారు. రానున్న ఐఏబీ సమావేశానికి తిరుపతి కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను ఆహ్వానించాలని సూచించారు. విడుదల ఇలా.. పెన్నా డెల్టా ఆయకట్టు 2,02,322.. కనుపూరు కాలువ 27 వేలు.. సోమశిల ప్రాజెక్ట్ కావలి కాలువ 74 వేలు.. దక్షిణ కాలువ 20 వేలు.. కండలేరు జలాశయ కాలువల ద్వారా 1.24 లక్షలెకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. దీనికి గానూ 49.76 టీఎంసీలను కేటాయించారు. గత సీజన్లో ఏడు లక్షలెకరాలకు.. గత సీజన్లో ఏడు లక్షలెకరాలకు సాగునీటిని విడుదల చేశామని వెల్లడించారు. వర్షాలతో 20 టీఎంసీలు ఆదా కాగా, 133 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, వీటిని సరిచేసుకొని ముందుకుసాగాలని కోరారు. సోమశిలలో 58.17, కండలేరులో 18 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని.. తాగునీరు, ఆవిరి, తిరుపతి, చైన్నెకి మంచినీరు తదితర అవసరాలు పొనూ 49 టీఎంసీలు ఉంటాయని చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని రెండో పంటకు విడుదల చేసేలా తీర్మానించామని ప్రకటించారు. నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతులను పొందనున్నామన్నారు. సమావేశాలకు హాజరుకాని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు మెమోలను జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలను శాసనసభ్యులు లేవనెత్తారు. ఎమ్మెల్యేలు పాశం సునీల్కుమార్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నెలవల విజయశ్రీ, కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి, ఇరిగేషన్ అధికారులు దేశ్నాయక్, వెంకటరమణారెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, తిరుపతి ఎస్ఈ రాధాకృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులపై సర్కార్కు చిత్తశుద్ధేదీ..?
సంక్షేమ ప్రదాత జగన్ ● జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలి ● బోట్ల మిస్సింగ్లో కారకులను శిక్షించాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తప్పులపై తప్పులు చేస్తోందని, మత్స్యకారుల బోట్ల దొంగతనం కూడా ఇందులో భాగమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారుల్లో కొందరు చేసిన తప్పునకు వాళ్ల పెద్దలు జరిమానాలను విధించారని, అయితే దీన్ని ప్రోత్సహించిన టీడీపీ నేతలు బీద మస్తాన్రావు, బీద రవిచంద్రపై చర్యలను చేపట్టకుండా సీఎం చంద్రబాబు మీనమేషాలను లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. గంగపుత్రుల సంక్షేమానికి ఎవరేమి చేశారో తేల్చే విషయమై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీస్తున్న బోట్ల మాయంపై పోరాటాలను తమ పార్టీ సాగిస్తోందని వివరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రాగా, ఆయన్ను మత్స్యకారులు కలిశారని చెప్పారు. ఆ సమయంలో బండారం మొత్తాన్ని మత్స్యకారులు బయటపెడితే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, జగన్మోహన్రెడ్డి రాకతో ఆ ప్రాంతం జనసంద్రమైందని గుర్తుచేశారు. వారి నీతిని ఆదర్శంగా తీసుకోండి.. సింగరాయకొండ మండలం పాకల వద్ద సమావేశాన్ని మత్స్యకారులు ఈ నెల ఆరున నిర్వహించారని చెప్పారు. బీద మస్తాన్రావుతో పాటు కావలి సీఐ ప్రోద్బలంతోనే బోట్ల విడుదలకు తాము సహకరించామని వారు అంగీకరించారని తెలిపారు. సంప్రదాయం ప్రకారం ఘటనపై రూ.ఐదు కోట్ల జరిమానాను విధించగా, అంత కట్టలేమని పేద మత్స్యకారులు చెప్పగా, సమావేశాన్ని వాయిదా వేశారని వివరించారు. తాజాగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తప్పును మత్స్యకారులు అంగీకరించగా, రూ.2.25 కోట్ల జరిమానాను విధించారన్నారు. వీరు నీతి, నిజాయతీగా వ్యవహరించి తప్పు చేసిన తోటి మత్స్యకారులపై జరిమానాను విధించడం గొప్ప విషయమని, ఈ తీరును ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అయితే వీరికి ద్రోహం చేసింది తమ వారేగా.. ఏమవుతుందనే రీతిలో సర్కార్ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను తప్పిస్తున్నారు.. సాగర్ డిఫెన్స్కు సంబంధించి జువ్వలదిన్నెకు మంత్రి లోకేశ్ ఏ రోజైతే వచ్చారో.. బోట్ల దొంగతనానికి అప్పుడే బీజం పడిందని కాకాణి ఆరోపించారు. ఇందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకొని తమను మభ్యపెట్టారని తోటయ్య అనే వ్యక్తి పాకలలో జరిగిన మత్స్యకారుల సమావేశంలో చెప్పారన్నారు. ఈ తప్పు చేసిన బీద మస్తాన్రావు, రవిచంద్రపై చర్యలు చేపడుతుందో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోషులతో తనకు సంబంధం లేదని బీద మస్తాన్రావు చెప్పారని.. అయితే రవిచంద్ర మాత్రం తాము మాట్లాడితే తప్పా.. శుభాకాంక్షలు చెప్పామంటున్నారని, వీరి వ్యాఖ్యల బట్టే అసలు విషయం అర్థమవుతోందని తెలిపారు. మత్స్యకారులకు తాము అండగా నిలిస్తే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులకు తమ పార్టీ ఏమి చేసిందో అందరికీ తెలుసునని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేట నిషేధ సమయంలో రూ.నాలుగు వేలనే ఇచ్చారని చెప్పారు. అదే తమ హయాంలో వీరికి రూ.పది వేల చొప్పున అందజేసిన అంశాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.20 వేలిస్తామని చెప్పి ఎగ్గొట్టలేదానని చంద్రబాబును ప్రశ్నించారు. బకాయిలను చెల్లించకుండా వీరిని పస్తులుంచిన చరిత్ర మీదని దుయ్యబట్టారు. మత్స్యశాఖ జేడీకి టీడీపీ ఫిర్యాదు చేస్తే, మత్స్యకారులను పక్కనబెట్టడం పక్షపాత వైఖరి కాదానని నిలదీశారు. వీరికి అండగా ఎవరు నిలిచారనే అంశమై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. బీద మస్తాన్రావుపై చర్యలు చేపడితే కొల్లు రవీంద్ర, లోకేశ్ పేర్లు బయటకొస్తాయనే భయంతోనే మిన్నకుండిపోతున్నారని విమర్శించారు. ఈ తప్పును మత్స్యకార కుటుంబాలు క్షమించవని, ఈ విషయంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. బోట్ల మిస్సింగ్కు కారకులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
మాయమాటలతో ఉద్యోగులకు వంచన
● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన పర్వతరెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాయమాటలు చెప్పి ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి దుయ్యబట్టారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా మేలు చేస్తామని గత ఎన్నికలకు ముందు టీడీపీ ఊదరగొట్టిందని, అయితే ప్రస్తుతం వీటిని గాలికొదిలేసిందని ఆరోపించారు. ఆ కథనాలు హేయం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూస్తుంటే ఉద్యోగులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎల్లో మీడియాలో ప్రజా వ్యతిరేక వార్తలను రాయించడం.. ఆపై వీటిని చంద్రబాబు అమలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యో గుల జీతాలు, పెన్షన్ల వ్యయమెక్కువగా ఉందని, ఇలా అయితే మనదీ హిమాచల్ప్రదేశ్ తరహాలో మారుతుందని.. వేతనాలను తగ్గిస్తామని అక్కడి ప్రభుత్వం పే ర్కొందని, ఇక్కడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ కథనాలను ప్రచురించి దుర్మార్గపు వైఖరిని అ వలంబిస్తోందని మండిపడ్డారు. కోవిడ్ లాంటి విపత్క ర పరిస్థితుల్లోనూ ఒకటో తేదీనే జీతాలను అప్పటి త మ ప్రభుత్వమిచ్చిందని గుర్తుచేశారు. అన్ని ఇబ్బందుల్లోనూ పీఆర్సీని నాటి సీఎం జగన్మోహన్రెడ్డి అమ లు చేశారని చెప్పారు. ఉద్యోగోన్నతులను కల్పించి.. స హాయ, సహకారాలను అందించారని కొనియాడారు. అన్నింట్లో మోసమే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసిచ్చిన మేనిఫెస్టోను ఆ రోజు అందరూ నమ్మారని, అయితే నేడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని, మంచి పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారని, అయితే పీఆర్సీకి సంబంధించిన కమిషన్ను నేటికీ వేయలేదని విమర్శించారు. ఐఆర్ను ప్రకటిస్తామని చెప్పినా, నేటికీ అతీగతీ లేదని తెలిపా రు. ఇలా అన్ని రంగాల్లోనూ దారుణంగా వంచించారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు సంబంధించిన రూ.35 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయినా, వాటిని చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పచ్చ పత్రికల్లో అసత్య కథనాలను ప్రచురించి.. జీతాలు పెంచాలని ఉద్యోగులు అడగకుండా వారిని మానసికంగా తయారు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగం నుంచి తొలగించడం అనైతికం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని అనైతిక చర్యగా అభివర్ణించారు. ఉద్యోగుల హక్కులపై మాట్లాడకూడదనే దుర్మార్గపు ఆలోచనతో సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం కొలువుదీరిన 22 నెలల్లోనే రూ.3.56 లక్షల కోట్ల అప్పు చేసిందని ధ్వజమెత్తారు. 7.81 వడ్డీకి రుణాన్ని తెస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోందని ఆరోపించారు. వీటిని కూటమి నేతలు దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో రూ.55 వేల కోట్లతో పనులను ప్రారంభిస్తున్నామని చెప్పి, టెండర్లు పిలిచి వారందరికీ మొబిలైజేషన్ ఫండ్స్ కింద పది శాతం అంటే రూ.5500 కోట్లను మంజూరు చేసి కమీషన్ రూపంలో ఎనిమిది శాతాన్ని తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, పనుల్లేక పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎం, డిప్యూటీ సీఎం తిరుగుతూ ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. -
విద్యాసంస్థలకు నేటి నుంచి సెలవులు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులను శుక్రవారం నుంచి ప్రభుత్వం ప్రకటించింది. జూనియర్ కళాశాలలను జూన్ ఒకటిన.. ప్రభుత్వ పాఠశాలలను జూన్ 12న పునఃప్రారంభించనున్నారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆర్ఐఓ వరప్రసాదరావు, డీఈఓ బాలాజీరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని ఐదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 65,353 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,550 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.43 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
మహిళా భద్రతపై అవగాహన సదస్సు
ఉదయగిరి: మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు గానూ కఠిన చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మహిళా భద్రతపై స్థానిక పోలీస్స్టేషన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తమ హక్కుల కోసం మహిళలు పో రాడాలని, అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు సంస్కారంతో కూడిన అలవాట్లను నేర్పాలని కోరారు. ఆత్మకూరు ఆర్టీఓ పావని, సీఐ వెంకట్రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలు వెంకటాచలం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉత్తమ ఫలితాలను సాధించొచ్చని ఆర్ఐఓ వరప్రసాదరావు పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వెంకటాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బహుమతులను గురువారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేందుకు శ్రమించాలని సూచించారు. పోటీతత్వం ఉంటేనే మెరుగైన ఫలితాలను సాధించొచ్చన్నారు. అర్థమయ్యే రీతిలో బోధించాలని అధ్యాపకులను కోరారు. డీసీపల్లిలో 236 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 236 బేళ్లను గురువారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. 299 బేళ్లు రాగా, వీటిలో 236ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 33,012 కిలోల పొగాకును విక్రయించగా, రూ.80,60,464 వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.230.. సగటు ధర రూ.244.17గా నమోదైందని వివరించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. -
బీదా కుట్రలు కన‘పడవ’!
ఉలవపాడు: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్లో ఉంచిన తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన బోట్ల మాయంపై 164 గ్రామాల మత్స్యకార కాపులు నిర్వహించిన సమావేశంలో అసలు సూత్రధారి అయిన టీడీపీ ఎంపీ బీదా మస్తాన్రావుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మత్స్యకార కాపుల సమావేశం జరిగింది. ప్రధానంగా బోట్ల మాయంకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై తీర్పుతో పాటు అందుకు కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 164 గ్రామాలకు చెందిన 1,500 మందికిపైగా మత్స్యకార కాపులు, మత్స్యకారులు పాల్గొన్నారు. హార్బర్లో బోట్లు మాయం చేసిన తోటయ్య, జాలిరెడ్డి, కొండూరు పోలిశెట్టిని సమావేశంలో హాజరుపరిచారు. వీరు ముగ్గురూ అల్లూరు మండలం ఇసకపాలెం, బోగోలు మండలం కొత్తబంగారుపాలెం, పాతపాలేనికి చెందిన వారు కావడంతో ఆయా గ్రామాలే వారికి సంబంధించిన జరిమానా బాధ్యత తీసుకోవాలని తీర్మానించారు. బోట్ల విషయంలో ప్రధానంగా జరిపిన చర్చలో తొలుత ముగ్గురూ 2 కోట్ల 40 లక్షల రూపాయల జరిమానా కట్టాలని కాపులు తీర్మానించారు. తప్పు చేసిన వారు కాపుల కాళ్లు పట్టుకోవడంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున తగ్గించడంతో 2 కోట్ల 25 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు. దీనికి వారు కట్టుబడి కొంత నగదూ చెల్లించారు. ఐదు రోజుల్లో మిగిలిన డబ్బులు జమ చేసేలా నిర్ణయించారు. టీడీపీ ఎంపీ బీదాపై నిర్ణయం తీసుకోకుండా భారీ ఒత్తిళ్లు తప్పు చేసిన వారికి జరిమానా విధించడంతో పాటు వారి వెనుక ఉన్న టీడీపీ ఎంపీ బీదా మస్తాన్రావు విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని, ఆ మేరకు మత్స్యకార కాపుల సమావేశంలో చర్చించాలని తొలుత నిర్ణయించారు. కానీ, మత్స్యకార గ్రామ కాపులపై భారీగా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. 164 గ్రామాలకు చెందిన కాపుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న కొందరు కాపులు చక్రం తిప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగాగానీ, బీదాకు వ్యతిరేకంగాగానీ ఎలాంటి చర్యలూ లేకుండా చేశారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే బోట్లు మాయం చేసిన ముగ్గురికి మాత్రమే జరిమానా విధించి సమస్యను ముగించినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టీడీపీ నేతలు చేసిన ద్రోహంపై చర్చ జరగకుండానే మత్స్యకార కాపుల సమావేశం ముగిసింది. అయితే రాజకీయ నేతల వలనే ఈ సమస్యలు వచ్చాయని విలేకరుల సమావేశంలో మత్స్యకార కాపులు వెల్లడించడం గమనార్హం. జరిమానా చెల్లింపు సమయంలో కూడా.. ఎంత జరిమానా విధించినా కట్టేది బీదా మస్తాన్రావే కదా అని కాపులు చర్చించుకోవడం విశేషం. సమావేశంలో పలు తీర్మానాలు ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వాటికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరి హైస్పీడ్ బోట్లను ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి రానివ్వరాదని డిమాండ్ చేశారు. ఏపీఎంఎఫ్ఆర్ యాక్ట్ను ఆధునికీకరించాలని, పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మెరైన్ పోలీసు, సమీప పోర్టులలో మత్స్యకార యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కాపుల కూటమి తరఫున ఈ నిర్ణయాలు తీసుకున్నారు. -
అధ్వాన దారులు.. ప్రజలకు గాయాలు
సోమశిల: అనంతసాగరం మండల పరిధిలో పలు రహదారులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. భారీ గుంత కారణంగా బుధవారం జరిగిన ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం మేరకు.. అనంతసాగరం ఎస్సీ కాలనీకి చెందిన కె.వాసు తన స్నేహితుడి వివాహానికి ఆత్మకూరుకు మోటార్బైక్పై వెళ్లాడు. తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ముత్తుకూరు వద్ద కొమ్మలేరు బ్రిడ్జిపై ఉన్న లోతైన గుంతలో బైక్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో వాసు తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్నేహితులు అతడిని 108 అంబులెన్స్లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా సోమశిల – ఆత్మకూరు ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
నీరడిగితే కేసులు పెడతారంట..!
● రాళ్లమిట్టలో తాగునీటికి కటకట ● సమస్యను తెలియజేసేందుకు పంచాయతీ కార్యాలయానికి మహిళలు ● కార్యదర్శి బెదిరింపు ధోరణి కోవూరు: దాహార్తి తీర్చాలని కోరగా, కేసులు పెడతామంటూ ఓ అధికారి చిందులేసిన ఘటన కోవూరులో కలకలం రేపింది. స్థానిక రాళ్లమిట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో, ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయానికెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వాస్తవానికి రాళ్లమిట్టలో తాగునీటి సరఫరా కొంతకాలంగా నిలిచిపోవడంతో స్థానికులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ ఉమాతో పాటు మహిళలు, ఆ ప్రాంత ప్రజలు బుధవారం వెళ్లారు. అయితే కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మోటార్ చెడిపోయింది.. రిపేరయ్యాకే నీళ్లొస్తాయి.. అప్పుడే తాగండి అంటూ వెటకారంగా మాట్లాడారు. ఇదే విషయమై మరోసారి వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. విజ్ఞప్తి.. పెడచెవిన ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారానైనా తాగునీటిని సరఫరా చేయాలని మహిళలు చేసిన విజ్ఞప్తినీ కార్యదర్శి పట్టించుకోలేదు. తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేయనున్నామని స్థానికులు స్పష్టం చేశారు. -
26 నుంచి లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే 6వ తేదీ వరకు జరుగుతాయని నెల్లూరు ఆర్డీఓ అనూష తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఐపీ దర్శనాలను ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చిన లోటుపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎండాకాలం దృష్ట్యా చలువ పందిళ్లు వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ అందిస్తామన్నారు. త్వరితగతిన స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అత్యవసర మందులు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆలయ చైర్మన్ అచ్యుత్రెడ్డి, ఈఓ గోపీ పాల్గొన్నారు. -
వైభవంగా రామానుజ జయంతి
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో బుధవారం రామానుజ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి, రామానుజ విగ్రహానికి పాలు, చందనం, నెయ్యి, తేనె, వివిధ రకాల పళ్లరసాలతో స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అలంకార మండపంలో నరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిలో కొలువుదీర్చారు. రామానుజ ఉత్సవ విగ్రహన్ని మరో తిరుచ్చిలో కొలువుదీర్చి స్వామి, అమ్మవారికి అభిముఖంగా ఉంచి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. -
కోర్టులో క్యాంటీన్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం
నెల్లూరు (లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో క్యాంటీన్ నిర్వహణకు అనుభవం గల వ్యక్తుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కార్యాలయానికి టెండర్ దరఖాస్తులను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు పంపాలని కోరారు. కండలేరులో 44.31 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 44.310 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వెల్లడించారు. -
ప్రిన్సిపల్ వైఖరిపై విద్యార్థుల నిరసన
చిల్లకూరు: గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఫీజుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకార వేతనాలతో తనకు సంబంధం లేదంటూ, ఫీజు చెల్లించకుంటే కళాశాల నుంచి బయటకు పంపిస్తానని హెచ్చరిస్తున్నారని తెలిపారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఫీజులు చెల్లించే వారన్నారు. నేడు అవి అందకపోవడంతో ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలను ఫీజుల కింద జమ చేసుకోవాలని చెబుతున్నా ప్రిన్సిపల్ వైఖరిలో మార్పు లేదన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పేద విద్యార్థుల ఫీజులు చెల్లించాలని, ప్రిన్సిపల్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
ఉలవపల్లిలో ఉద్రిక్తత
● మంత్రి ఆదేశాలతో ఓ వర్గానికి రెవెన్యూ అధికారుల వత్తాసు ● కోర్టు ఉత్తర్వుల ధిక్కారం చేజర్ల: మండలంలోని తిమ్మాయిపాళెం రెవెన్యూ పరిధిలో గల ఉలవపల్లి గ్రామంలో భూ వివాద నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత బుధవారం నెలకొంది. బోడిపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు మస్తానయ్య కుటుంబసభ్యుల పేరుతో 12 ఎకరాలపైగా భూములున్నాయి. ఈ క్రమంలో ఉలవపల్లికి చెందిన వెంకటస్వామికి గతంలో ప్రభుత్వం పట్టా ఇచ్చి.. అనంతరం రద్దు చేయడంతో కోర్టును ఆయన ఆశ్రయించారు. ఆయనకు ఎక్కడో చోట భూమిని చూపాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో మస్తానయ్య సాగు చేసుకుంటున్న సర్వే నంబర్లేసి వెంకటస్వామికి నకిలీ పట్టాలను రెవెన్యూ అధికారులు అందజేశారు. దీనిపై వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో ఎంపీటీసీని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో ప్రత్యర్థులను మంత్రి అనుచరులు పురమాయించారు. పొలం వద్దకు జేసీబీతో వచ్చి చదును చేసే క్రమంలో మస్తానయ్య అడ్డుకున్నారు. దీంతో ఆయనపై వెంకటస్వామి వర్గం దాడికి యత్నించింది. ఈ విషయంలో న్యాయస్థాన ఆదేశాలున్నా, రాజకీయంగా ఒత్తిడి తెచ్చి వెంకటస్వామికి అనుకూలంగా మారారని మస్తానయ్య వాపోయారు. కాగా భూ వివాదంలో న్యాయం చేస్తానంటూ స్థానిక తహసీల్దార్ తనను నగదును డిమాండ్ చేశారని, అయితే ఇవ్వకపోవడంతో ఆయనే ప్రత్యర్థులను పురమాయించి పొలం వద్దకు పంపారని ఆరోపించారు. -
కొందరి స్వార్థం.. ప్రజలకు శాపం
వెంకటాచలం: చెరువులో ఉన్న చేపలను పట్టుకోవాలనే స్వార్థం వారిది.. ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలో పది గ్రామాలకు పైగా తాగు, సాగునీరుకు అందించే ప్రధానమైన కనుపూరు చెరువు ప్రస్తుతం అడుగంటి ఎండిపోయే స్థితికి చేరింది. చేపల కోసం చెరువులో ఉన్న నీటిని కాలువలకు వృథాగా వదిలేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల అండతోనే.. మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్ తర్వాత సాగు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కనుపూరు చెరువు అడిగంటిపోయింది. ఇక్కడ నీరు పుష్కలంగా ఉంటే వెంకటాచలం, కనుపూరు, కందలపాడు, చవటపాళెం, తిక్కవరప్పాడు, కంటేపల్లి, కాకుటూరు తదితర గ్రామాల్లోని బావులు అడుగంటకుండా ఉంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎటువంటి సాగునీటి సమస్య రాదు. అయితే చెరువులో రూ.లక్షలు విలువైన చేపలు, రొయ్యలు ఉన్నాయి. దీంతో కనుపూరు చెరువు చేపల సొసైటీ నిర్వాహకులు నీటిని కాలువలకు వదిలేసి చేపలు పట్టేందుకు పూనుకున్నారు. ఇలా చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా, కొందరు టీడీపీ నాయకుల అండ చూసుకుని చెరువు నీటిని కాలువల ద్వారా వృథాగా వదిలేశారు. అధికారులకు మామూళ్లు కనుపూరు చెరువు నీటిని కాలువలకు వదిలేయడంతో వెంకటాచలం, కనుపూరు, చవటపాళెం గ్రామాల రైతులు, ప్రజలు చేపల సొసైటీ నిర్వాహకులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. మార్చి నెల 20 తేదీ నుంచి చెరువులో ఉన్న నీటిని కాలువలకు వదిలేస్తున్నారు. వెంకటాచలం, కనుపూరు గ్రామాల ప్రజలు ఇరిగేషన్ ఏఈకి చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని రైతులు చెబుతున్నారు. మామూళ్ల మత్తు కారణంగానే అధికారులు కనుపూరు చెరువు నీటిని బయటకు వెళ్లనీయకుండా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజల డిమాండ్ కనుపూరు చెరువు పూర్తిగా అడుగంటిపోతే 10 గ్రామాల్లో ఇప్పట్నుంచే తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నీరు లేనికారణంగా నేల, బోరు బావుల్లో నీరు అడుగంటి, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కేవలం చేపల సొసైటీ నిర్వాహకులకు ప్రయోజనం చేకూర్చేందుకు కనుపూరు చెరువును ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య పూర్తిస్థాయిలో రాకముందే చెరువుకు నీరు విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చేపల వేట కోసం చెరువు నీళ్లు ఖాళీ కాలువలకు వదిలేస్తున్న వైనం అడుగంటిన కనుపూరు చెరువు 10 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు -
ఆర్టీసీ ఉద్యోగుల సమర శంఖారావం
● ఐదు నుంచి సమ్మెలోకి.. ● ప్రజా రవాణాధికారికి నోటీస్ను నేడు ఇవ్వనున్న జేఏసీ నెల్లూరు సిటీ: నగరంలోని ఆర్టీసీ రెండో డిపోకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న యత్నాలను నిరసిస్తూ 72 రోజులుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమర శంఖారావాన్ని పూరించేందుకు వీరు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఏడు డిపోల్లో మే ఐదు నుంచి సమ్మె చేసేందుకు ఉపక్రమించారు. నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమ్మెకు సిద్ధమవ్వా లని ఉద్యోగులకు సూచించారు. దీనికి సంబంధించిన నోటీస్ను ప్రజా రవాణాధికారి షమీమ్కు బుధవారం అందజేయనున్నామని జేఏసీ నేత ప్రసాద్ తెలిపారు. విలువైన స్థలాన్ని కట్టబెట్టేందుకు.. నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో రెండో డిపోకు సంబంధించిన ఐదెకరాల స్థలం విలువ దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేసుకునేందుకు టెండర్ ద్వారా పినాకిల్ అనే కంపెనీకి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా, సర్కార్కు చీమ కుట్టినట్లు కూడా లేదు. దీనిపై విసిగి వేసారి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. నేటి నుంచి డబుల్ డ్యూటీ బాయ్కాట్ నెల్లూరు రెండో డిపోలోని ఉద్యోగులు డబుల్ డ్యూటీని గురువారం నుంచి బాయ్కాట్ చేయనున్నారు. ఈ డిపోలో ఎన్నో ఏళ్లుగా దాదాపు 540 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 70 మందిని ఒకటో డిపోకు.. 470 మందిని ఇతర డిపోలకు తరలించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులతో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ బస్సులను కంపెనీ యాజమాన్యమే నడపనుంది. ఈ పరిణామాల క్రమంలో భద్రత, అలవెన్స్ను వీరు కోల్పోయే ప్రమాదం ఉంది. వీరిలో వయస్సు పైబడిన వారి సంఖ్యా ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా ఇతర డిపోలకు తరలించడం ద్వారా తమపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
యూఎన్ఐడీఓ బృందం పర్యటన
నెల్లూరురూరల్: యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం బుధవారం నెల్లూరులో పర్యటించింది. వారు జిల్లాలోని సముద్ర ఆహార ప్రాసెసింగ్ క్లస్టర్ను పరిశీలించి, ఎగుమతుల విస్తరణ అవకాశాలపై అధ్యయనం చేశారు. పర్యటనలో భాగంగా బృందం నార్త్ రాజుపాళెం, గండవరం ప్రాంతాల్లోని పలు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రతినిధులతో సమావేశమై ఉత్పత్తి, ఎగుమతి అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఉప సంచాలకుడు శ్రీధర్బాబు పాల్గొన్నారు. కోళ్ల వ్యర్థాలు తరలిస్తుండగా..● వాహనం పట్టివేత సీతారామపురం: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని బుధవారం సీతారామపురం పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. బెంగళూరు నుంచి నెల్లూరుకు కోళ్ల వ్యర్థాలను మినీ లారీలో తరలిస్తున్నారని, నారాయణప్పపేట చెక్పోస్టు దాటి వెళ్తోందన్న సమాచారం పోలీసులకు అందింది. వారు వెంటనే స్పందించి వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం వ్యర్థాలను గ్రామానికి దూరంగా పెద్ద గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న నిషేధిత కోడి వ్యర్థాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కాపాడి..● కుటుంబ సభ్యులకు అప్పగింత చిల్లకూరు: ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను రైల్వే పోలీసులు కాపాడి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన గూడూరు రైల్వే స్టేషన్లో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్కు చెందిన ముఖేష్కుమార్ సింగ్ చైన్నెలోని టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడికి ఆర్థిక సమస్యలున్నాయి. కంపెనీ నుంచి సొంతింటికి బయలుదేరి దారిలో ఆత్మహత్య చేసుకోవాలని గూడూరు రైల్వేస్టేషన్ వద్ద దిగేశాడు. నెల్క్యాస్ట్ ప్రాంతంలో పట్టాలపై కూర్చొని ఉండగా రైల్వే పోలీసులు గుర్తించి వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించినట్లు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ మస్తానయ్య, గూడూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. -
జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
దుత్తలూరు: దుత్తలూరులోని కమ్మవారిపాళెం సొసైటీలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని అధికారులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సీరియల్ నంబర్లను కేటాయించారు. నిర్దేశించిన తేదీల్లో జొన్న దిగుబడులను విక్రయానికి తీసుకురావాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి మదన్మోహన్, సొసైటీ డైరెక్టర్ చుండి హరిగోపాల్రెడ్డి, సీఈఓ లోకనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న హుండీ కానుకల లెక్కింపు అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో హుండీ కానుకల లెక్కింపు బుధవారం కొనసాగింది. మూడు రోజుల పాటు లెక్కించగా, రూ.60,32,397 నగదు.. 20 గ్రాముల బంగారం.. రెండు కిలోల వెండి లభించిందని ఈఓ హుస్సేన్ తెలిపారు. మిగిలిన హుండీలనూ లెక్కించనున్నామని వివరించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు అధికారులు ఆదాం, షఫీ, ఇబ్రహీం, రవూఫ్, హుస్సేన్, ఖాజామొహిద్దీన్, వక్ఫ్ ఇన్స్పెక్టర్ కుదావన్, అలీబాషా తదితరులు పాల్గొన్నారు. బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి కలిగిరి: బడి బయటున్న పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యాశాఖ గుంటూరు రీజినల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కలిగిరిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్ను బుధవారం సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బడిఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. డ్రాపౌట్స్ అనేది లేకుండా చూడాలని ఆదేశించారు. సర్కార్ నిర్దేశించిన అకడమిక్ స్టాండర్డ్స్ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించేలా చూడాలని సూచించారు. గ్రామాల్లోని అందరి సహకారంతో సత్ఫలితాలను సాధించాలని పిలుపునిచ్చారు. కావలి డిప్యూటీ డీఈఓ మారెళ్ల హరిప్రసాద్, ఎంఈఓ గోళ్ల సురేష్, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మిశ్రీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పూడికతీత పనుల పరిశీలన సంగం: మండలంలోని గాంధీజన సంఘం సమీపంలో చేపట్టిన కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ పూడికతీత పనులను ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ దేశ్నాయక్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పూడికతీత పనులు పూర్తయ్యాక సాగునీటి సరఫరా మెరుగుపడి రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్కుమార్, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘ అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తే చర్యలు
నెల్లూరు రూరల్: జిల్లాలో పండ్లను సురక్షితంగా పక్వం చేయడం.. హానికరమైన రసాయనాల వినియోగాన్ని నిరోధించేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని ఆహార భద్రత కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాల్షియం కార్బైడ్ వినియోగంపై కఠినంగా వ్యవహరించనున్నామని స్పష్టం చేశారు. ఎథిలిన్ వాయువుతో పనిచేసే రిఫైనింగ్ చాంబర్లనే వినియోగించాలని సూచించారు. రసాయనాలను పండ్లపై నేరుగా వేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలను విధించడంతో పాటు చట్టపరమైన చర్యలను చేపడతామని పేర్కొన్నారు. మార్కెట్లు, గోదాములు, రవాణా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించనున్నామని వెల్లడించారు. వ్యాపారులు, రైతులు, సరఫరాదారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సురక్షిత పండ్ల గుర్తింపుపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని ప్రకటించారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,324 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 22,955 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
మలేరియా నిర్మూలనే లక్ష్యం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మలేరియా నిర్మూలనే లక్ష్యమని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. ఈనెల 25వ తేదీన వరల్డ్ మలేరియా డే సందర్భంగా నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్యశాఖధికారి కార్యాలయంలో బుధవారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం సాధించగలం – ఇప్పుడు మనం తప్పక సాధించాలి’ అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనే అంతిమ లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. 25న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సబ్యూనిట్ అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాలన్నారు. కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏఎంఓ జయరాం, డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసుల సవాలక్ష ఆంక్షలు
● కొండాపురం చేరిన శ్రీనివాసులు మృతదేహం ● రూట్ మార్చి పాత ఇంటికి తరలింపు ● నిరసనగా రోడ్డుపై బైఠాయించిన బంధువులుకొండాపురం: చిమ్మిలి శ్రీనివాసులు మృతదేహాన్ని కొత్త ఇంటికి తరలించే విషయంలో పోలీసులు సవాలక్ష ఆంక్షలు విధించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. మండల కేంద్రమైన కొండాపురంలో శ్రీనివాసులు ఇల్లు, షాపులు ఎదుట టీడీపీకి చెందిన కొందరు నాయకులు రాత్రికి రాత్రే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్రీనివాసులుపై టీడీపీ నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను చైన్నెలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. వాస్తవానికి కావలి నుంచి కొండాపురం వైపు రావాల్సి ఉంది. కానీ కావలి పెద్దపవని మీదుగా శ్రీనివాసులు పాత ఇంటికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యులు బంధువులు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన వివాదాస్పద స్థలానికి మృతదేహాన్ని తరలించాలని లేదంటే ఒప్పుకోమని పోలీసులతో తేల్చి చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బంధువులు పాత ఇంటి వద్ద అంబులెన్స్ నిలిపి రోడ్డుపై బైఠాయించారు. రాత్రి వరకు పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచేశారు. గ్రామస్తులు, నాయకులు మాట్లాడి మృతదేహాన్ని పాత ఇంటి వద్దే ఉంచారు. కాగా కొత్త ఇంటి వద్దకు తరలించకుండా పోలీసులు సవాలక్ష ఆంక్షలు విధించారు. కొండాపురం సెంటర్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, డివిజన్లో ఉన్న ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. -
స్పందించండి మహాప్రభో..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు సమర్పించిన జనంనెల్లూరురూరల్: ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా అర్జీలను పరిశీలించండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, స్పెషల్ అధికారి వంశీకృష్ణ, డీపీఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ● ఆమంచర్ల పంచాయతీ మట్టంపాడు గ్రామంలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలివ్వాలని సీపీఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ నేతలు జేసీ మొగలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ● దివ్యాంగులకు రైల్వే పాసులు కావాలంటే నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని డాక్టర్ అప్లికేషన్పై సంతకం చేయాలని, ఒకరే ఉండటంతో ఇబ్బందిగా ఉందని వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సనావుల్లా వినతిపత్రం అందజేశారు. ఐదుగురు డాక్టర్లను ఏర్పాటు చేసి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ● రైతులకు ప్రభుత్వ బీమాను అమలు చేయాలని భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ కోరారు. కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నేతలు డాక్టర్ గుంజి నరసింహారావు, సోమ గోపాల్, గారా వెంకటరమణయ్య, సెల్వం, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో బెట్టింగ్ రాయుళ్లు?
నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో మాగుంట లేఅవుట్లోని ఓ లాడ్జీపై పోలీసులు దాడిచేసి బెట్టింగ్ ఆడుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు నెల్లూరు నగరం, పొదలకూరు ప్రాంతానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.భవిత కేంద్రాలకు కరదీపికలునెల్లూరు(టౌన్): దివ్యాంగ విద్యార్థుల అభ్యసనను మెరుగుపరిచేందుకు జిల్లాలోని భవిత కేంద్రాలకు ప్రత్యేక మాడ్యూల్ పేరుతో 7 రకాల కరదీపికలు అందజేస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు తెలిపారు. సోమవారం నెల్లూరులోని విద్యాశాఖ కార్యాలయంలో కరదీపికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తి, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు నాణ్యమైన, సాంకేతిక ఆధారిత విద్య అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. జిల్లాలోని 38 భవిత కేంద్రాలకు 2,088 కరదీపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సహిత విద్య సమన్వయకర్త పి.ప్రసాద్రావు, ఏఎంఓ సుధీర్బాబు, డిప్యూటీ డీఈఓ జానకిరామ్, ఎంఈఓ తిరుపాల్, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. గోడను ఢీకొట్టిన ట్రాక్టర్● వృద్ధుడి మృతి సంగం: మండలంలోని జెండాదిబ్బ గ్రామం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పుట్టావారిగుంట వద్ద రోడ్డు పక్కన గోడపై సుబ్బారెడ్డి (72) అనే వృద్ధుడి కూర్చొని ఉన్నాడు. ఈ క్రమంలో తాటిమొద్దుల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గోడని ఢీకొట్టింది. దీంతో సుబ్బారెడ్డి కాలువలో పడిపోయి మృతిచెందాడు. వాహనం కూడా కాలువలోకి దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పరిశీలించారు. బైక్పై వెళ్తుండగా..● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి అల్లూరు: ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్ను మోటార్బైక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన అల్లూరు బస్టాండ్ సెంటర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అల్లూరు రాయాజీ వీధికి చెందిన గుర్రం సాయిప్రదీప్ (25) స్థానికంగా మొబైల్ షాపులో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆదివారం రాత్రి బైక్పై వెళ్తూ బస్టాండ్ సెంటర్లో యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాలేదు. -
రైలు ప్రయాణికులే లక్ష్యంగా మోసాలు
● బిహార్ గ్యాంగ్ అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్లు, నగదును దోచేస్తున్న ఐదుగురు సభ్యులున్న బిహార్ గ్యాంగ్ను సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 21 సెల్ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని సంతపేట పోలీస్స్టేషన్లో సోమవారం నగర ఏఎస్పీ దీక్ష, స్థానిక ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్యతో కలిసి గ్యాంగ్ వివరాలను వెల్లడించారు. బిహార్ రాష్ట్రం అరారియా జిల్లాకు చెందిన పప్పుకుమార్, మనోజ్కుమార్, సీతామఢి జిల్లాకు చెందిన రంజిత్ కుమార్, రాజేష్రాయ్, భాగ్బెట్టియ ప్రాంతానికి చెందిన విజయ్కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా వారు నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద ఉంటూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెరలేపారు. నిందితులు రైల్వేస్టేషన్ బయట ఉంటూ రైలు ఎక్కేందుకు వచ్చేవారితో మాటలు కలుపుతారు. తమకు రైల్వే ఉద్యోగులు తెలుసని, టికెట్ రిజర్వేషన్ చేయిస్తామని నమ్మిస్తారు. మీ ఫోన్కు ఓటీపీ వచ్చిన వెంటనే ఫోన్పే ద్వారా నగదు పంపాలని, ప్రయాణికుడికి అనుమానం రాకుండా పాస్వర్డు తెలుసుకుంటారు. పక్కనే రిజర్వేషన్ కార్యాలయం ఉందని అక్కడికి వెళ్లి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని వస్తామని సెల్ఫోన్ తీసుకుంటారు. గ్యాంగ్లోని ఓ వ్యక్తిని వారితో ఉంచి మిగిలిన వారు అక్కడ్నుంచి జారుకుంటారు. అనంతరం దుకాణాల వద్దకు వెళ్లి ఫోన్పేలో వేసి వారి నుంచి చేతికి నగదు తీసుకుని ఉడాయిస్తారు. రిజర్వేషన్కు వెళ్లినవారు ఎంతకీ రాకపోవడంతో ప్రయాణికులు గాబరాపడుతుండగా ఇదే అదునుగా భావించిన వారివద్దనున్న నిందితుడు తాను వెళ్లి తీసుకొస్తానని పరారవుతాడు. ఈ తరహాలో నిందితులు పలువుర్ని మోసగించసాగారు. వెలుగులోకి ఇలా.. అజాద్ సెంటర్ సమీపంలో హేమంత్ కుమార్ ప్రొవిజన్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈనెల 12వ తేదీన నిందితులు దుకాణం వద్దకు వచ్చి ఫోన్పేలో నగదు వేసి చేతికి రూ.55 వేలు తీసుకెళ్లారు. ఆ నగదు బ్లాక్ అవడంతో బాఽధితుడు బ్యాంక్కు వెళ్లి ఆరాతీయగా మోసం వెలుగులోకి వచ్చింది. దీప్కుమార్ శర్మ అనే వ్యక్తి తన ఖాతాలోని రూ.30 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారనే ఫిర్యాదుతో ఆ మొత్తాన్ని బ్లాక్చేసినట్లు వెల్లడైంది. దీంతో తనను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని హేమంత్కుమార్ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారించగా మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రూ.6 లక్షల విలువైన 21 సెల్ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సంతపేట ఎస్సైలు జి.బాలకృష్ణ, ఎం.అనిల్రెడ్డి, సుల్తాన్బాషా, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
నెల్లూరు(క్రైమ్): జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరిరోజు నెల్లూరు రైల్వే ఫీడర్స్రోడ్డులోని అగ్నిమాపక కేంద్రంలో వైద్యశాలలు, పాఠశాలలు, పరిశ్రమలు, రెడ్క్రాస్ సిబ్బంది, షాపింగ్ మాల్స్ ప్రతినిధులతో సెమినార్ నిర్వహించారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఫైర్ సర్వీస్ యాక్ట్ తదితరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ వాకా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయోగాత్మకంగా వివరించామన్నారు. వారోత్సవాల విజయవంతానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్టాల్ను పాఠశాలల విద్యార్థులు పరిశీలించారు. వారికి అగ్నిప్రమాద నివారణ చర్యలపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఎఫ్ఓ ఎం.రాజా, నెల్లూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
వెహికల్ ఎఫ్సీకి లంచాలు
వెహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేట్ సంస్థ అయిన ప్రణీత్ టెస్టింగ్ సెంటర్కి అప్పగించారని, లంచాలు ఇస్తే వెంటనే పని అవుతుందని నెల్లూరుకు చెందిన లారీ ఓనర్ బొద్దుకూరు నాగరాజు వినతిపత్రం ఇచ్చారు. హెవీ వెహికల్స్కి రూ.9,000, ఎల్ఎన్వీకి రూ.4,000 లంచం ఇస్తే ఏజెంట్లు ఎఫ్సీ తెచ్చిస్తున్నారని ఆరోపించారు. యార్డులో ఉన్న లారీకి రూ.50 వేలు లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ఆర్టీఏ అధికారులకు తెలిపితే మాకు ఏమీ సంబంధం లేదని బదులిచ్చారన్నారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హైవేపై తెగిపడిన విద్యుత్ తీగ
● అప్రమత్తం చేసిన ఏఎంవీఐ ● తప్పిన పెను ప్రమాదంమనుబోలు: 11 కేవీ విద్యుత్ తీగ తెగి హైవేపై పడింది. అదే సమయంలో కారులో వెళ్తున్న ఓ అధికారి అందర్ని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ కారులో గూడూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్నాడు. కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలోకి వచ్చే సరికి హైవేపై 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడిపోయింది. దీనిని చూసిన వెంటనే కారు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది స్పందించి హైవేపై ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటే సరఫరాను నిలిపివేసి తీగను తొలగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తీగ హైవే పక్కన మొక్కలకు తగిలి మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగ వ్యాపించింది. ఇది చూసిన వాహనచోదకులు ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామో తలుచుకుని హడలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
శ్రామికుల సంఖ్య పెంచండి : పీడీ
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు సంబంధించి శ్రామికుల సంఖ్యను రెట్టింపు చేసేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగాభవాని ఆదేశించారు. నెల్లూరులోని డ్వామా కార్యాలయం నుంచి సోమవారం వివిధ మండలాల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. పనులకు హాజరయ్యే శ్రామికులకు త్వరలో నగదు వారి బ్యాంక్ అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించి అధిక సంఖ్యలో పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన నిబంధనలను వంద శాతం పాటిస్తూ పనులు కల్పించాలన్నారు. పని ప్రదేశాల నుంచి శ్రామికుల ఫొటోలు యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. కండలేరులో 44.510 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 44.510 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
మా గ్రామాన్ని కలుషితం చేస్తున్నారు
● చలివేంద్ర గ్రామస్తుల అర్జీ అందజేత నెల్లూరురూరల్: ‘మా ప్రాంతంలో ఇటీవల ఆయిల్ కంపెనీలు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలను పాటించకుండా వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేసి గ్రామాన్ని కలుషితం చేస్తున్నారు’ అని ముత్తుకూరు మండలం చలివేంద్ర గ్రామస్తులు తెలిపారు. సోమవారం నెల్లూరులో ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో కలెక్టర్కు హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుంగే ఇండియా కంపెనీ ఎడిబుల్ ఆయిల్ తయారు చేస్తోందన్నారు. అన్ని నిబంధనలు పాటిస్తామని తుంగలో తొక్కి ఇప్పుడు ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా ఏపీఈఎంసీఎల్ ద్వారా తరలించాలన్నారు. కానీ ఇవేమీ పట్టించకుండా అనుమతి లేని వారి ద్వారా వ్యర్థాలు తరలిస్తున్నట్లు చెప్పారు. వారు తీసుకొచ్చి రోడ్ల పక్కన పడేస్తున్నారని చెప్పారు. దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నట్లు వాపోయారు. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇంతకుముందు ఇదే కంపెనీకి రెండుసార్లు బోర్డు అధికారులు నోటీసులిచ్చి సరిపెట్టారన్నారు. ఇప్పటికై నా స్పందించి గ్రామాన్ని కాపాడాలని కోరారు. -
పేదలు ఎదిగితే చంద్రబాబు సహించలేరు
వెంకటాచలం: మోసాలు, అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్టని, తాను రాజ్యాధికారంలో ఉండాలంటే పేదలు ఎన్నటికీ పేదలుగా ఉండిపోవాలనేదే ఆయన భావజాలమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. ‘జగనన్న కాలనీ.. చంద్రబాబు కహానీ’ కార్యక్రమ పేరిట వెంకటాచలంలోని జగనన్న కాలనీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. స్థానికులతో కలిసి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. జగనన్న పుణ్యం.. మీ సహకారంతోనే తమ సొంతింటి కల సాకారమైందని, జీవితాంతం రుణపడి ఉంటామని లబ్ధిదారులు తమ ఆనందాన్ని కాకాణితో వ్యక్తపర్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2029లో జగన్మోహన్రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను తమ పార్టీ అధినేత నెరవేర్చారని కొనియాడారు. 2014 – 19 మధ్య సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో పేదలు అనేక అర్జీలిచ్చినా, వాటిని పట్టించుకున్న దాఖలాల్లేవని విమర్శించారు. పేదల సొంతింటి కల సాకారానికి జగనన్న కృషి 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పేదల సొంతింటి కలను సాకారం చేసేలా నాటి సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల ఎకరాల ప్రభుత్వ.. 26 వేల ఎకరాల ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. అప్పట్లో నిర్మించింది ఇళ్లు కావని.. ఊళ్లని.. గ్రామగ్రామాన ఉన్న జగనన్న లేఅవుట్లే దీనికి సాక్ష్యమని చెప్పారు. ఐదేళ్ల పాలనలో గృహ నిర్మాణ రంగంలో స్థలాల కోసం రూ.50 వేల కోట్లు.. నిర్మాణానికి రూ.50 వేల కోట్లు.. మొత్తంగా రూ.లక్ష కోట్లను వెచ్చించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ఒక్కొక్కరికీ రూ.తొమ్మిది లక్షల ఆస్తి వెంకటాచలంలోని జగనన్న కాలనీలో తొలి విడతలో ఏడెకరాలను కేటాయించి 260 మంది లబ్ధిదారులకు.. రెండో విడతలో మరో ఏడెకరాల్లో ప్లాట్లు వేసి పంపిణీ చేశామని వివరించారు. ఒక్కొక్కరికీ దాదాపు రూ.తొమ్మిది లక్షల విలువజేసే తొమ్మిదంకణాల స్థలాన్ని మంజూరు చేయడమే కాకుండా ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలతో పాటు అదనంగా వడ్డీలేని రుణం రూ.35 వేలు, ఉచిత ఇసుక ద్వారా రూ.15 వేలిచ్చి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహించారని గుర్తుచేశారు. అయితే కొంతమందికి రావాల్సిన ఇళ్ల బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని హితవు పలికారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు సిద్ధహస్తుడు తన 21 నెలల పాలనలో 5.5 లక్షల ఇళ్లను నిర్మించామని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధమని తెలిపారు. నాయుడుపేటలో ఇటీవల పర్యటించిన సమయంలో 2,50,893 ఇళ్లను ప్రారంభిస్తున్నారని ప్రకటించారని చెప్పారు. కూటమి పాలనలో మంజూరు చేసి నిర్మించిన ఒక్క ఇంటినైనా చూపాలని సవాల్ విసిరారు. తమ హయాంలో కట్టిన గృహాలను తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజలను గతంలో మోసం చేసిన అంశాన్ని గుర్తుచేశారు. తమ హయాంలో నిర్మించిన ఇళ్లను తాను కట్టినట్లుగా చంద్రబాబు చెప్పుకొని ప్లయ్ఉడ్ నమూనా తాళాలివ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. కల్లబొల్లి మాటలను కట్టబెట్టి జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. జగనన్న కాలనీల్లో పనులు చేస్తే తమ పార్టీ అధినేతకు పేరొస్తుందనే కుట్రతోనే చేయడంలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా పేదలకు చేసిందేమీలేదని, అదే జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలోనే వారు చిరస్థాయిగా గుర్తుంచుకునే పనులు చేశారని చెప్పారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ మందా కవిత, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్రెడ్డి, చిట్టమూరు శివకుమార్రెడ్డి, జిల్లా నేత కొణిదెన విజయభాస్కర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2029లో జగనన్న రాజ్యం రావడం ఖాయం తమ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగంపై రూ.లక్ష కోట్ల ఖర్చు ప్రస్తుతం ఈ ఊసేలేదు ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
పాలిసెట్కు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఏపీ పాలిసెట్కు ఏర్పాట్లను పక్కాగా చేయాలని డీఆర్వో విజయ్కుమార్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షను నెల్లూరు, ఆత్మకూరు, కావలి, గూడూరు కేంద్రాల్లో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం పదింటికే చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరని.. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేదిలేదని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయనున్న పద్మ అవార్డులకు క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఎస్డీఓ జసీమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు awards. gov. inలో పొందుపర్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ దరఖాస్తులను sportsinap@gmail. com లేదా incentives. schemes@gmail. comకు వచ్చే నెల 15లోపు పంపాలని కోరారు. దరఖాస్తుల కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ – మెయిల్ ద్వారా వచ్చిన ద రఖాస్తులనే ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాఽధికార సంస్థ, విజయవాడకు పంపనున్నామని వెల్లడించారు. 29న జిల్లా స్థాయి అండర్ – 13 చెస్ ఎంపికలు నెల్లూరు (టౌన్): జిల్లా స్థాయి అండర్ – 13 బాలుర, బాలికల చెస్ చాంపియన్షిప్ ఎంపికలను ఈ నెల 29న నిర్వహించనున్నామని నెల్లూరు చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంజుల, కార్యదర్శి మస్తాన్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు సమీపంలోని కలివెలపాళెంలో గల రెయిన్బో స్కూల్లో నిర్వహించనున్నామని చెప్పారు. 2013, జనవరి ఒకటి తర్వాత జన్మించిన వారై ఉండాలని, అర్హులు 80963 28326, 96033 45326 నంబర్లను ఈ నెల 27లోపు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిభ చూపిన వారికి సైకిళ్లతో పాటు ట్రోఫీని అందజేయనున్నామని వివరించారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్కు అర్హత సాధించనున్నారని పేర్కొన్నారు. ధర ఉన్నా.. దిగుబడేదీ..? ● కిలో నిమ్మ రూ.170 చిల్లకూరు: నిమ్మకు మంచి ధర ప్రస్తుతం లభిస్తున్నా.. దానికి తగిన విధంగా దిగుబడి లేక రైతులు దిగులు చెందుతున్నారు. ధరలు అమాంతం పెరిగినా, ఆశించిన స్థాయిలో కాయల్లేక వీరి పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవానికి గూడూరు నిమ్మ మార్కెట్ జిల్లాలోనే అతి పెద్దది. ఇక్కడ్నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం పది లారీలకు తక్కువ కాకుండా ఎగుమతవుతాయి. రైళ్లు, పార్శిల్ వ్యాన్లలోనూ తరలిస్తుంటారు. ఢిల్లీ మార్కెట్లో ధరలు రెండు రోజుల్లో అమాంతం పెరిగాయి. దీంతో ఇక్కడి వ్యాపారులు గ్రేడింగ్ను బట్టి కిలో కాయలకు రూ.200 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద వాటి ధర రూ.170 మేర మంగళవారం పలికింది. రేట్లు బాగుండటంతో పిందెలను సైతం కోసి రైతులు తీసుకొస్తున్నారని వ్యాపారులు తెలిపారు. మేలో ధరలు తగ్గిపోతే నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ధరలున్న టైమ్లో కాయలు అందుబాటులో ఉండవని.. చెట్లకు విరివిగా కాసిన సమయంలో మార్కెట్ రేట్లను అమాంతం తగ్గించేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
● రూ.2.05 లక్షల నగదు, 13 సెల్ఫోన్లు సీజ్ నెల్లూరు(క్రైమ్): ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు సబ్ బుకీ, పంటర్లను అరెస్ట్ చేశారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలను ఎస్పీ అజిత మంగళవారం రాత్రి వెల్లడించారు. ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్లను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మాగుంట లేఅవుట్లోని కింగ్స్ కోర్టు గెస్ట్ ఇన్లో తనిఖీలను దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కల్యాణరాజు తన సిబ్బందితో కలిసి ఆదివారం రాత్రి నిర్వహించారు. ఓ గదిలో క్రికెట్ బెట్టింగ్ యాప్ రాధే ఎక్స్చేంజ్ అడ్మిన్ ఫరియాజ్తో పాటు పంటర్లయిన అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వాసు, ప్రవీణ్కుమార్, తోటపల్లిగూడూరుకు చెందిన మహేంద్రను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు సబ్ బుకీలు, పంటర్లయిన పొదలకూరు ప్రాంతానికి చెందిన శివకుమార్, రవికుమార్, లెనిన్ తేజ, మోహిత్, మస్తాన్, నవీన్కుమార్, నగరానికి చెందిన ప్రణీత్, మణికంఠను సోమవారం అదుపులోకి తీసుకొని అందర్నీ అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ 2,05,200 నగదు, 13 సెల్ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.37 లక్షల ఆర్థిక లావాదేవీలు జరిగాయని గుర్తించి సదరు ఖాతాలను హోల్డ్ చేశారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వీరినీ త్వరలో అరెస్ట్ చేయనున్నామని ఎస్పీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన ఇన్స్పెక్టర్, సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బందిని అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. నగర ఏఎస్పీ దీక్ష తదితరులు పాల్గొన్నారు. -
జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు నేడు
దుత్తలూరు: స్థానిక కమ్మవారిపాళెం సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేయనున్నామని టెక్నికల్ ఏఓ సుబ్బారెడ్డి, మండల వ్యవసాయాధికారి మదన్మోహన్ తెలిపారు. జొన్న రైతుల కష్టాలపై ’జొన్నకు ధర దన్నేదీ..?’ అనే శీర్షికన సాక్షిలో కథనం మంగళవారం ప్రచురితమైంది. ఈ తరుణంలో స్పందించిన అధికారులు.. జొన్న రైతులతో సమావేశాన్ని సొసైటీ ఆవరణలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్వింటాను రూ.3699 చొప్పున కొనుగోలు చేయనున్నామని వివరించారు. విక్రయానికి తెచ్చే జొన్నల తేమ శాతం 13గా ఉండాలని, దుమ్ము, ధూళి లేకుండా, రంగు మారకుండా ఉన్న వాటిని కొను గోలు చేయనున్నామని వెల్లడించారు. గోనె సంచులు ప్రస్తుతం లేవని, రైతులే సమకూర్చుకోవాల ని కోరారు. దుత్తలూరు మండలంలోని 364 ఎకరాల్లో జొన్న పంటను ఈ – క్రాప్లో నమోదు చేశారని, వీరి నుంచి కొనుగోలు చేయనున్నామని ప్రకటించారు. సొసైటీ సీఈఓ లోకనాథ్రెడ్డి, వీఏఎలు దినేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన బాలిక అనుమానాస్పద మృతి
● ఇంటి వరండాలో ఉరేసుకున్న వైనం ● సందేహాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు నెల్లూరు సిటీ: అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని గిరిజన బాలిక మృతి చెందిన ఘటన కాకుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ మండలంలోని కాకుపల్లిలో ఓ వ్యక్తి.. లేఅవుట్కు వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే ఓ గదిలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వీరికి ఐదుగురు కుమారులు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో బాలిక తన ముగ్గురు సోదరులతో కలిసి స్కూల్కెళ్లింది. ఈ తరుణంలో కూలీ పనుల నిమిత్తం నెల్లూరెళ్లే క్రమంలో వీరిని పాఠశాల నుంచి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఆపై ఇంటి వరండాలో చీరతో ఉరేసుకొని బాలిక మధ్యాహ్నం కనిపించింది. ఈ విషయమై స్థానికులకు బాలిక సోదరులు తెలియజేయగా, వారొచ్చి చూడగా అపస్మారక స్థితిలో వేలాడుతూ కనిపించింది. తండ్రికి ఫోన్ చేయగా, వెంటనే వచ్చి కాకుపల్లిలోని ఓ ఆర్ఎంపీని తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. అనుమానాలు.. ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు వెళ్తూ.. అటుగా తిరిగారని పోలీసులకు పిల్లలు చెప్పారు. తాము సమీపంలో ఆడుకుంటున్నామని, ఇంటి నుంచి సోదరి ఎంతసేపటికీ రాకపోవడంతో వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించిందన్నారు. ఘటనపై నెల్లూరు రూరల్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి రూరల్ సీఐ వేణు, కోవూరు సీఐ సుధాకర్రెడ్డి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఫొరెన్సిక్, నెల్లూరు క్లూస్టీమ్ చేరుకొని ఆధారాలు, వివరాలను సేకరించారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల విడుదల
నెల్లూరు (టౌన్): ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి గానూ నిర్వహించిన రెండో విడత జేఈఈ మెయిన్స్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో అక్షయ విశిష్ట 561, వేనాటి కుశాల్రెడ్డి 954, పొదిలి రామ్చరణ్ 1602, యశ్వంత్రెడ్డి 1872 ర్యాంకులను సాధించారు. కామాక్షితాయికి వెండి పట్టీల బహూకరణ బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో వెలసిన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారికి 234 గ్రాముల వెండి పట్టీలను ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన దంపూరి కుష్వంత్కుమార్ దంపతులు సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా దాత గోత్రనామాలతో పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ తిరుమూరు అశోక్రెడ్డి, ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లో టీడీపీ దోపిడీ పర్వం
నెల్లూరు రూరల్: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నగరంలో మొక్కలు, స్కూళ్ల పేరుతో దోపిడీకి టీడీపీ నేతలు తెరలేపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి.. పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సోమవారం వారు మాట్లాడారు. ఒక్కో మొక్క నాటేందుకు రూ.ఐదు వేలు, దాని నిర్వహణకు రూ.12 వేలను కార్పొరేషన్ నిధుల నుంచి వెచ్చిస్తున్నారంటూ తాము ఆధారాలతో సహా ప్రశ్నిస్తే, సీఎస్సార్ నిధులంటున్నారని తెలిపారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి విషయంలోనూ ఇలానే ఖర్చు పెట్టేందుకు యత్నిస్తే, తాము అడ్డుకున్నామని గుర్తుచేశారు. వ్యక్తిగత విమర్శలతో.. నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న దోపిడీ.. మంత్రి నారాయణ నేతృత్వంలో ప్రజల సొమ్మును తెలుగు తమ్ముళ్లు ఎలా దోచుకుంటున్నారనే విషయాన్ని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి బయటపెట్టారని, అప్పటి నుంచి ఎవరెవర్నో ఉసిగొల్పి తమపై వ్యక్తిగత విమర్శలు చేయిస్తూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలతో సహా ఆయన మాట్లాడారని, అయితే టీడీపీ నేతలు సవాళ్లు చేస్తున్నారని విమర్శించారు. వీరి ప్రతి మాటకూ సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నిధులు కొట్టేసేందుకు కుట్ర నగరంలోని 11, 13వ డివిజన్లలో వెయ్యి మొక్కలకు గానూ రూ.50 లక్షల చొప్పున వర్క్ ఆర్డర్ను ఇచ్చారని, అంటే ఒక్కో మొక్కకు రూ.ఐదు వేలానని ప్రశ్నించారు. 14వ డివిజన్లో 1800 మొక్కలకు రూ.1.24 కోట్లతో వర్క్ ఆర్డర్ను రూపొందించారని, దీని మేరకు ఒక్కో దాని నిర్వహణకు రూ.12 వేలను ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా నగరపాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే సొంత నిధులు, సీఎస్సార్ ఫండ్స్ అంటూ బుకాయిస్తున్నారని చెప్పారు. మాది అసత్య ప్రచారం కాదు.. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న నిధులపై పర్వతరెడ్డి ప్రశ్నించడంతోనే మీ దోపిడీ బయటపడిందని, ఈ క్రమంలోనే సొంత నిధులను ఖర్చు పెడుతున్నామంటున్నారని చెప్పారు. కమిషనర్కు దీంతో ఏమి సంబంధమని ప్రశ్నించారు. డొంక తిరుగుడు సమాధానాలివ్వడం, తీర్మానాలను ఆమోదించుకోవడం, అడిగితే ఎదురుదాడి చేయడం వీరికి పరిపాటిగా మారిందని విమర్శించారు. మొక్కలను దొంగలించిన వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి చెప్తున్నారని, మరో వ్యక్తి ప్రెస్మీట్ పెట్టి ఫొటోలు చూపి మొక్కలు తీసేశారనే ఆరోపణలు చేశారని తెలిపారు. తమ పార్టీకి అంత దిగజారాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సీఎస్సార్ నిధుల విడుదల్లో ఓ ప్రక్రియ సీఎస్సార్ నిధుల విడుదల్లోనూ ఓ ప్రక్రియ ఉంటుందని, కంపెనీలు ఇష్టారాజ్యంగా వీటిని ఇవ్వకూడదని చెప్పారు. ఇటీవలి కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా మారిటైమ్ బోర్డు నిధులను అడుగుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నేలటూరు ఫిషింగ్ జెట్టీ కోసం రూ.25 కోట్ల నిధులివ్వాలని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని కోరామని, అన్ని అనుమతులను ఇప్పించామని, డ్రెడ్జింగ్ మినహా మిగిలినవి పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా మిగిలిన వర్కుల కోసం మారిటైమ్ నిధులను అడుగుతున్నారంటే, అది అవినీతి కోసమేనని ఆరోపించారు. పన్నులు.. సీఎస్సార్ నిధులపై పారదర్శకంగా వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మొక్కకు రూ.12 వేలంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. మొక్కలు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి అడిగితే సమాధానం చెప్పలేక బెదిరింపులు వీఆర్ హైస్కూల్ విషయంలోనూ ఇదే తీరు ధ్వజమెత్తిన కాకాణి, పర్వతరెడ్డి దోపిడీకి విఫలయత్నం నగరంలో మొక్కలు నాటడాన్ని చూసి ఓర్వలేక కడుపు మండి మాట్లాడుతున్నామంటూ నారాయణ వంటి వ్యక్తి వ్యాఖ్యానించడం బాధ కలిగిస్తోందని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులను ఇలా ఇష్టారాజ్యంగా పంచి పెడతామంటే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. నగరంలో 14,800 మొక్కలను నాటుతున్నామని, దీనికి రూ.8.2 కోట్ల ఖర్చవుతుందని నారాయణ చెప్పారని, దీని ద్వారా ఒక్కో దానికి రూ.రూ.5540 అవుతోందని వివరించారు. అనుమతి పొందింది రూ.ఐదు వేలకై తే.. టీడీపీ నేతలేమో రూ.3700 అంటున్నారని.. మంత్రి మాత్రం రూ.5540 వ్యయం అవుతుందంటున్నారని చెప్పారు. నారాయణ ఓఎస్డీ.. వాట్సాప్ గ్రూపుల్లో 10 వేల మొక్కలకు రూ.ఐదు కోట్లని మెసేజ్లు పంపారని.. చెప్పేది అబద్ధం కాబట్టే ఒక్కో చోట ఒక్కో లెక్క చెప్తున్నారని విమర్శించారు. కమిషనర్ మరో లెక్క చెప్తున్నారని, ఇదంతా మోసం కాదానని ప్రశ్నించారు. నగరంలో వీఆర్ హైస్కూల్ ఆధునికీకరణ కోసం రూ.15 కోట్ల సీఎస్సార్ నిధులను తెచ్చి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గతంలో చెప్పారని, దీన్ని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి గుదిబండలా మార్చారని ఆరోపించారు. దీని అభివృద్ధి కోసం రూ.ఐదు కోట్లు అవసరమని కమిషనర్, మేయర్ సంతకాలు చేసి అనుమతులిచ్చారని.. వాహనాల కోసం మరో రూ.ఐదు కోట్లు కావాలన్నారని పేర్కొన్నారు. ఒక్కో వ్యాన్ రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలకు వస్తుంటే, రూ.50 లక్షల బడ్జెట్ పెట్టారని విమర్శించారు. సీఎస్సార్ నిధులంటూ కార్పొరేషన్ నుంచి రూ.10 కోట్లు తీసుకునేందుకు కుట్ర పన్నారని, తాము ప్రశ్నిస్తే నారాయణ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. -
సీఎం ముందు స్టాళ్లు పెట్టి డప్పు..
అన్నదాతలను చంద్రబాబు ప్రభుత్వం దళారుల దోపిడీకి వదిలేసింది. యూరియా సరఫరా చేయమని అడిగితే.. సీఎం చంద్రబాబు మాత్రం వరి అన్నం తింటే రోగాలు వస్తున్నాయంటున్నారు. ధాన్యానికి కనీసం మద్దతు కల్పించమని అడిగితే.. వరి బియ్యం ఎవరూ తినడం లేదు.. మార్కెట్లో డిమాండ్ లేదని, అందుకే కొనేవాడు లేడని, మేము కొని ఏం చేయమంటారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తారు. వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు సాగు చేసినా.. ధరలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతున్న పాలకులు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయడు చెబుతున్నారు. ఉదయగిరి/దుత్తలూరు: చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం జొన్న రైతుల పాలిట శాపంగా మారింది. జొన్న పంట సాగు చేస్తే వచ్చిన దిగుబడులను తామే కొనుగోలు చేస్తామని నమ్మబలికి ఇప్పుడు నోరు మెదపకపోగా, ప్రభుత్వం కొనడానికి డబ్బుల్లేవంటూ సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం రైతులను కలవర పెడుతోంది. జిల్లాలో పంట రైతుల చేతికి వచ్చి రెండు నెలలు గడిచినా ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దీంతో జొన్న సాగు చేసిన రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం దేవుడెరుగు.. ప్రభుత్వ పాలకులు ఏ గాలికి ఆ గాలి మాటలు మాట్లాడున్నారు. తమ అసమర్థ పాలనతో రైతుల కష్టాన్ని దళారులకు, వ్యాపారులకు, మిల్లర్లకు దోచిపెడుతున్నారు. పంటల సాగు సమయంలో యూరియా, ఎరువులు అడిగితే సరఫరా చేయలేని అసమర్థులు యూరియా వాడితే రోగాలు వస్తున్నాయని అన్నదాతల చెవుల్లో పూలు పెడుతున్నారు. పండించిన పంటలకు మద్దతు ధర కల్పించమని అడిగితే.. కొనేవాడు లేడంటూ తప్పించుకుంటారు. ప్రభుత్వమైన కొనమంటే డబ్బుల్లేవని తెగేసి చెబుతున్నారు. ఏ పంట సాగు చేసిన రైతులైనా ఇదే పరిస్థితి. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా దళారులు, దోపిడీదారులు ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి చెక్ పెడుతూ తీసుకున్న నిర్ణయాలు అన్నదాతలను ఆదుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి.. పంట పండినప్పుడు ధరల్లేని సమయంలో మార్క్ ఫెడ్ ద్వారా, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులను కనీసం మద్దతు ధరలు కల్పించారు. గత ప్రభుత్వానికి సాధ్యమైన ఈ ప్రణాళికను అమలు చేస్తే కనీసం మద్దతు ధరలు దక్కేవని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. 3158 ఎకరాల్లో జొన్న సాగు.. జిల్లాలో టీపీగూడూరు, సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం, ఎస్పేట, పొదలకూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో రబీ సీజన్లో 3158 ఎకరాల్లో హైబ్రీడ్ జొన్న సాగు చేశారు. మార్చి మొదటి వారానికి అంతా కోతలు పూర్తయ్యాయి. పంట రైతుల చేతికి అందికి వచ్చి దాదాపు నెల రోజులు పూర్తయింది. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం దిగుబడిన అయిన జొన్నలు 63 వేల కింటాళ్లు రైతుల దగ్గర నిల్వలు ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు రైతులను మెప్పించి హైబ్రీడ్, మాలదండి రకాల జొన్న సాగు చేయించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రూ.3,649 నుంచి రూ.3,749 కొనుగోలు చేస్తామని తెలిపారు. కానీ తీరా పంట చేతికి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ? ప్రస్తుతం జొన్నలు క్వింటాలకు బహిరంగ మార్కెట్లో ధర రూ.2 వేల నుంచి రూ.2,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి సగటున రూ.15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఎకరానికి సాగు బడి ఖర్చులు రూ.25 వేలు వరకు అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం విక్రయిస్తే పెట్టుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరి రైతు కష్టం వృథానే అవుతుంది. అదే ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తే ఎకరానికి రూ.20 వేలు వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు జొన్న కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతులు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. దీంతో ఇప్పుటికే కొంత మంది రైతులు సాగు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు వారి బాధ తట్టుకోలేక రూ.2 వేలకే తెగనమ్మి నష్టపోయారు. స్టాక్ ఉంచిన రైతులకై నా న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన సివిల్ సప్లయీస్ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనే వారు లేక రైతు విలవిల పంట చేతికి వచ్చి 2 నెలలు ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు క్వింటా కనీస మద్దతు ధర రూ.3,749 దళారులు కొనే ధర రూ.రెండు వేలు ఇటీవల సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటనలో బోగస్ రైతుతో సంభాషణ ఎకరానికి రూ.50 వేల లాభం వచ్చిందని డప్పు ఈ ఏడాది ఎకరానికి 20 క్వింటాళ్ల లోపే దిగుబడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి జొన్న సాగు ఖర్చు రూ.25 వేలు అవుతోంది. ఈ ఏడాది ఎకరం 15 నుంచి 20 క్వింటాల మధ్య దిగుబడి వచ్చింది. పంటను తామే ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు. కానీ పంట చేతికి వచ్చి రెండు నెలలు అయినా ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కొంతమంది క్వింటా రూ.2 వేలకే వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలి. – గువ్వల సుబ్బారెడ్డి, దుత్తలూరుఇటీవల వింజమూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం వ్యవసాయ స్టాల్ను పరిశీలించారు. ఆ స్టాల్లో ఉన్న ఆదర్శ రైతు తాను జొన్న పంట సాగు చేసి ఎకరానికి రూ.50 వేలు లాభం చేశాను అని చెప్పడంపై పలువురు జొన్న సాగు రైతులు విస్మయం వ్యక్తం చేశారు. ఎకరానికి 25 క్వింటాలు దిగుబడి వచ్చినా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.50 వేలు వస్తోంది. ఖర్చు రూ.25 వేలు పోతే.. మరి రూ.50 వేలు ఎలా లాభం వస్తుందని రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీఎంను సంతృప్తి పరిచేందుకు ఇలా చెప్పారే తప్ప.. వాస్తవ పరిస్థితులు సీఎం దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం జరగలేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎంతో మాట్లాడిన రైతు అసలు జొన్న సాగే చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
మంత్రి ఆనం అధికార దుర్వినియోగం
తిరుమల గాలిగోపురం తరహాలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ ఆత్మకూరు: దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలతో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పాతాళానికి దిగజారిపోయారు. తిరుమల గాలిగోపురం తరహాలో ఆత్మకూరులో సెట్టింగ్ వేసి, ఏకంగా తిరుమల అర్చకులతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జొన్నవాడ, పెంచలకోన, రాజరాజేశ్వరి ఆలయాల అర్చకులను రప్పించి ఆయుష్షు హోమాన్ని నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మలికార్జునస్వామి లడ్డూ ప్రసాదాలను తెప్పించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మొదలుకొని ఈఓలు, ఇన్స్పెక్టర్లు, ఫారెస్ట్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల హాజరై సేవలందించడం గమనార్హం. -
ప్రభుత్వ నిబంధనలను పాటించాలి
నెల్లూరు (టౌన్): రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫారం, నోట్ పుస్తకాలు, స్టేషనరీలను స్కూళ్లలో విక్రయించకూడదని స్పష్టం చేశారు. ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, టెక్నో, ఈ – టెక్నో, మెడికల్ లాంటి పేర్లు పెట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయండి నెల్లూరు రూరల్: ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గానూ జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. జూన్ 30 వరకు లేదా వడగాలుల తీవ్రత తగ్గేంత వరకు నిరంతరంగా నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నెలకొల్పాలని చెప్పారు. నిబంధనల మేరకు అత్యుత్తమంగా నిర్వహించే సంస్థలకు తన తరఫున ప్రశంస పత్రాలు, నగదు బహుమతులను అందజేయనున్నామని ప్రకటించారు. డయల్ యువర్ ఎస్ఈకి మూడు ఫిర్యాదులు నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్లో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ రాఘవేంద్రం దృష్టికి తమ సమస్యలను ముగ్గురు తెలియజేశారు. లో ఓల్టేజీ.. గృహ విద్యుత్ సర్వీస్కు టైటిల్ ట్రాన్స్ఫర్.. నూతన వ్యవసాయ సర్వీస్ ఏర్పాటు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిని సత్వరమే పరిష్కరించనున్నామని ఆయన వివరించారు. ఈఈ శేషాద్రిబాలచంద్ర, ఏఈలు నరసింహరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు.. హుండీ కానుకల లెక్కింపు అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని పవిత్ర పు ణ్యక్షేత్రమైన హజరత్ ఖాజారసూల్ దర్గాలో హుండీ కానుకల లెక్కింపును సోమవారం ప్రారంభించారు. దాదాపు 27 నెలలుగా లెక్కింపు జరగలేదు. తాజాగా వక్ఫ్బోర్డు అధికారులు అను మతులివ్వడంతో ప్రక్రియను ప్రారంభించారు. దర్గాలో దాదాపు 20 హుండీలున్నాయని, సీసీ కెమెరాల నీడన దాదాపు పది రోజుల పాటు సిబ్బంది లెక్కించనున్నారని ఈఓ హుస్సేన్ తెలిపారు. కాగా తనకు చెందిన హుండీలున్నాయంటూ హైకోర్టును మాజీ ముతవలీ గతంలో ఆశ్రయించడంతో లెక్కింపునకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో వక్ఫ్ బోర్డు అధికారులు గట్టిగా యత్నించి కోర్టు నుంచి అనుమతులు పొందడంతో హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి హుండీ లెక్కింపు ద్వారా రూ.18,83, 570.. 15.4 గ్రాముల బంగారం, 814 గ్రాముల వెండి లభించిందని ఈఓ తెలిపారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని ఎనిమిది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 76,406 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 28,463 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
చంద్రబాబు, పవన్లను ఏకిపారేసిన కార్యకర్త
నెల్లూరు : ‘ పవన్ సార్.. మేం అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు కదా.. ఇవేనా రోడ్లు’ అంటూ పశ్నించాడు కూటమి కార్యకర్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం కలిచేడు రోడ్డు అధ్వాన్నంగా ఉందని నడిరోడ్డుపైనే మంచం వేసుకుని నిరసన తెలిపాడు కూటమికి చెందిన కార్యకర్త. నెల్లూరు-గూడూరులను కలిపే ఈ రోడ్లపై వెళుతుంటే తమ ప్రాణాలు పోతున్నాయని, ఎటు చూసినా గుంతలు, గోతులతో చాలా అథ్వాన్నంగా ఉందని ఫైర్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు వేయిస్తామన్నారు కదా.. ఇవే నా మీరు వేసిన రోడ్లు అంటూ నడిరోడ్డుపై మంచంపై కూర్చొని మరీ నిరసన తెలిపాడు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఏకిపారేశాడు.‘అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకూ వేయలేదు. నేను ఆరు నెలల క్రితం చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మళ్లీ ఈ విషయాన్ని ఇలా చెబుతున్నా. మా కడుపులు మండిపోతున్నాయ్. గతంలో టెంట్లు వేసుకుని రోడ్లు వేయమని అడిగాం. ఇప్పుడు ఇలా నులక మంచం వేసుకుని నిరసన తెలపాల్సి వచ్చింది.పుట్టిన రోజు వేడుకల్లో బిజిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ఇక్కడ(ఈ రోడ్లపై) పుట్టినరోజు చేసుకుని చూడండి. మా బాధ ఏంటో అర్ధమవుతుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానండి.. కడుపు మండిపోతుంది. నేను అడిగేది ఒక్కటే అబ్బా.. మీరు వారం రోజుల్లో రోడ్లు వేయిస్తారా.. లేక నిధులు పోగు చేసుకుని మేమే రోడ్డు వేసుకోవాలా? చెప్పండి’ అంటూ సూటిగా ప్రశ్నించాడు. -
బాబు బర్త్డే వేడుకల్లో తిరుమల సెట్!
సాక్షి, నెల్లూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు టీడీపీ శ్రేణులు అతి ప్రదర్శిస్తున్నాయి. వేడుకల పేరుతో రోడ్ల మీదకు చేరి జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఆత్మకూరులో స్వయానా దేవాదాయ శాఖ మంత్రి అత్యుత్సాహానికి దిగారు. తిరుమల తరహా సెట్టింగ్ వేయించి పూజలు చేయిస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ దండోరా వేయించారాయన. ఇక్కడితో ఆగితే ఫర్వాలేదు.. ఏకంగా తిరుమల గాలిగోపురం సెట్ వేయించారాయన. ఆ సెట్ను ఆనుకుని పొలిటికల్ బ్యానర్లు వెలిశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల అర్చకులు, పండితులతో పూజలు, బాబు పేరిట హోమాలు చేయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమై విమర్శలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. -
దండకాల దంగల్
కోవూరు: అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, తల్లుల ఆరోగ్యం కోసం కేటాయించిన నిధుల్లో వాటాల కోసం ఇందుకూరుపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో కక్కుర్తి పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సీడీపీఓను సైడ్ ట్రాక్ చేసి.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరును అడ్డం పెట్టుకొని ఆ కింది స్థాయి అధికారిణి అక్రమ వసూళ్లకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. మనం పంపాల్సిందే.. ఈ ప్రాజెక్ట్లో సర్వం తానై వ్యవహరిస్తున్న ఓ అధికారిణి అంగన్వాడీ వర్కర్లను పిలిపించి మేడమ్ (సీడీపీఓ) అడుగుతున్నారు.. మనం పంపాల్సిందేనంటూ వర్కర్ల నుంచి డబ్బులు గుంజుతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ వ్యవహారంలో సీడీపీఓకు ఎటు వంటి సంబంధం లేదని తెలిసిన అంగన్వాడీ వర్కర్లు.. సదరు కింది స్థాయి అధికారిణి ఆదేశాలతో ముడుపులు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో సదరు శాఖ ఉన్నతాధికారిణి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. పీడీ, సీడీపీఓ మధ్య గ్యాప్.. ఆమెకు వరం ఐసీడీఎస్ పీడీ, ఇందుకూరుపేట సీడీపీఓ మధ్య గ్యాప్ ఉన్నట్లు సమాచారం. గ్యాప్ను సదరు కింది స్థాయి అధికారిణి తనకు అనుకూలంగా మార్చు కున్నారు. ఈ క్రమంలో సీడీపీఓను సైడ్ ట్రాక్ చేసి, ఆమె కింది స్థాయి అధికారిణికి పెత్తనం ఇవ్వడంతో ఆమె సర్వం తానై వసూళ్ల వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులు తనకున్నాయని అంగన్వాడీ వర్కర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. మాట వినని వారిని మానసికంగా వేధించడం, షోకాజ్ నోటీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారిందని పోతున్నారు. గుట్టురట్టవడంతో ఆందోళన సీడీపీఓ పేరుతో ఇప్పటివరకు సాగుతున్న ఈ వసూళ్ల దందా ఇటీవల బయటపడింది. ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్లోని కింది స్థాయి అధికారిణి ఆడియో, వీడియోలు ఉండడం, ఈ వ్యవహారంపై కలెక్టర్కు విచారణకు ఆదేశించడంతో సదరు అధికారిణి ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. సీడీపీఓ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న అధికారిణి వెనుక ఉన్న పెద్దలెవరో బయటపడే అవకాశం ఉందని అంగన్వాడీ వర్కర్లు అంటున్నారు. సీడీపీఓ పేరుతో కింది స్థాయి అధికారిణి వసూళ్ల పర్వం లబోదిబోమంటున్న అంగన్వాడీ వర్కర్లు ఐసీడీఎస్ ఉన్నతాధికారి అండతో చెలరేగిపోతున్న ప్రాజెక్ట్ అధికారిణి బట్టబయలు కావడంతో తమకేమీ తెలియదని ప్రకటన -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపికలు
సంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ చాంపియన్ షిప్కు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ పర్యవేక్షణలో జరిగిన ఎంపికల్లో మహిళలు, పురుషుల విభాగాల్లో జిల్లాలోని పలు మండలాల నుంచి క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు దువ్వూరులో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. -
చీకట్లో మగ్గుతున్న గిరిజనులు
● అధికారులు, పాలకుల తీరుకు కొవ్వొత్తులతో నిరసన మనుబోలు: వైఎస్సార్సీపీ మద్దతుదారులుగా ఉన్నారనే కక్షతో అధికార పక్షం వివక్షకు, అధికారులు వంత పాడుతున్నారు. ఫలితంగా రెండు వారాలుగా వీధిలైట్లు వేయకుండా ఆ గిరిజన కాలనీలను చీకట్లో మగ్గపెడుతున్నారు. అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ స్థానిక గిరిజనులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. మండలంలోని జట్లకొండూరు పంచాయతీ కొండూరుసత్రం ఎస్టీ కాలనీ, జ్యోతినగర్కు చెందిన గిరిజనులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాలుగా తమ కాలనీల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీ పక్కనే చెట్లు, పొలాలు ఉండడంతో రాత్రయితే తేళ్లు, పాములు వీధుల్లోకి వస్తున్నాయని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రయితే ఇంట్లోంచి బయట అడుగు పెట్టాలంటే బయపడే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు చెప్పినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందరూ ఉద్దేశ పూర్వకంగానే తమ కాలనీలపై వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే వీధిలైట్లు వేయాలని కోరారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీకి అవార్డు ముత్తుకూరు(పొదలకూరు): దేశంలోని ప్రముఖ విద్యుదుత్పత్తి సంస్థల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ లిమిటెడ్కు ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయిన్ అవార్డు లభించింది. హైదరాబాద్లో నిర్వహించిన టీజీపీఆర్ కాన్ఫరెన్స్, నేషనల్ పీఆర్ డే వేడుకల సందర్భంగా ఈ అవార్డును సంస్థ కార్పొరేట్ రిలేషన్స్ విభాగ మేనేజర్ రాజిరెడ్డి కేసిరెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ జన్మేజయ మహాపాత్ర మాట్లాడారు. కార్పొరేట్ రిలేషన్స్ బృంద సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచనతోనే ఈ గుర్తింపు లభించిందని వివరించారు. -
ఓటేయలేదని టీడీపీ అక్కసు
ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో ఎన్నో ఏళ్లుగా డీఫారం పట్టాలు పొంది అనుభవిస్తున్న రైతుల పేర్లను ఆన్లైన్లో తొలగించి ఆ భూమిని తెలుగు తమ్ముళ్లకు కట్టబట్టేందుకు ప్రయత్నం కొనసాగుతోంది. అధికారులు కూడా టీడీపీ నేతల ఆగడాలకు వంత పాడుతూ బాధిత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భూమిని నమ్ముకున్న రైతులను ఇబ్బందులు పెడుతున్న ఘటన చేజర్ల మండలం, బిల్లుపాడు గ్రామంలో జరుగుతోంది. ● ఆన్లైన్లో రైతుల పేర్ల తొలగింపు ● ఆ భూమిని తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు యత్నం ● మంత్రి ఆనం అనుచరుడి నిర్వాకం చేజర్ల: మండలంలోని బిల్లుపాడు గ్రామంలో సర్వే నంబర్ ఒకటిలో 180 ఎకరాల అనాధీన ప్రభుత్వ భూమి ఉంది. 1998 సంవత్సరంలో ప్రభుత్వం 40 మంది నిరుపేద రైతులకు 70 ఎకరాలకు పైగా భూమిని పంచి పట్టాలు అందజేసింది. అప్పటి నుంచి పట్టాలు పొందిన రైతులు ఆ భూములను సాగులోకి తెచ్చుకొని కరెంటు సర్వీసులు, బోర్లు, మోటార్లు ఏర్పాటు చేసుకుని పైర్లు వేసుకుంటున్నారు. తరువాత 2007 ప్రాంతంలో వారికి మాన్యువల్గా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. 2010లో ఆన్లైన్ చేసే క్రమంలో కొంతమందివి మాత్రమే జరిగింది. చాలామంది రైతులు ఈ భూమి పత్రాలను బ్యాంకులో తనకా కూడా పెట్టి రుణాలు కూడా పొంది ఉన్నారు. అధికారులతో కుమ్మకై ్క.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా ఓటు వేయలేదనే అక్కసుతో గ్రామానికి చెందిన టీడీపీ నేత, దేవదాయ శాఖ మంత్రి ఆనం అనుచరుడు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తొలుత పట్టాలు లేని భూముల్లో ఆక్రమణలతో పాటు పట్టాలు పొంది సాగులో ఉన్న భూముల్లో ఉన్న నిమ్మ చెట్లను సైతం తొలగించి బోర్డు ఏర్పాటు చేశారు. వెంటనే రీసర్వే ప్రక్రియ గ్రామంలో జరగడంతో సర్వే నంబర్ ఒకటికి సంబంధించిన భూముల్లో పట్టాలు పొంది అనుభవంలో ఉన్న రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా కూటమి నాయకుల మాటలు విన్న రెవెన్యూ యంత్రాంగం అన్నదాతలకు అన్యాయం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఉన్నవి లేనివి సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. -
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
● డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్య సేవనంపై 69 కేసులు నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివారు ప్రాంతాలు, జాతీయ రహదారి ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాల్లో వాహన తనిఖీలు జరిపారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిపై 30 కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనులపై 227 కేసులు నమోదు చేసి రూ.1,25,040 జరిమానా విధించారు. బహిరంగ మద్య సేవనంపై 39 కేసులు నమోదు చేశారు. మందుబాబులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా జిల్లాలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేశారు. లాడ్జీల్లో బసచేసిన వారి వివరాలను సేకరించారు. రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే డయల్ 112కు లేదా పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జీలో బసచేసే వారి వివరాలను ప్రతిరోజు స్థానిక పోలీస్స్టేషన్లో అందజేయాలని చెప్పారు. నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల కదలికలు, చీకటి కార్యకలాపాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు తదితరాలు గుర్తిస్తే తెలియజేయాలని కోరారు. నాకాబందీలో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అడ్మిషన్లు ఇవ్వాల్సిందే
విద్యాహక్కు చట్టం ఆర్టీఈ – 12 (1)సీ ద్వారా ఉచిత ప్రవే శం కింద సీటొచ్చి న పేద విద్యార్థుల కు అడ్మిషన్లను తప్పక ఇవ్వాల్సిందే. గత మూడేళ్లుగా ఉచిత ప్రవేశాలకు సంబంధించిన ఫీజులను సకాలంలో చెల్లించకపోవడంతో అడ్మిషన్లను కొన్ని యాజమాన్యాలు నిరా కరించిన మాట వాస్తవమే. వీటిని చెల్లించాం. ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందేమీ ఉండదు. – బాలాజీరావు, డీఈఓఅడిగిన ఫీజు కడితేనే అడ్మిషన్ ఉచిత ప్రవేశాలకు సంబంధించి నారాయణ పాఠశాలలో అడ్మిషన్ను నిరాకరిస్తే ఎంఈఓ, డీఈఓకు ఫిర్యాదు చేయగా. అడిగిన ఫీజు కట్టి ప్రవేశం పొందాలని వారు సలహా ఇచ్చారు. దీనిపై సదరు అధికారిపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో అధిక శాతం కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ విషయమై కలెక్టర్ దృష్టి సారించాలి. – నరహరి, పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
వెటర్నరీ వైద్యుల క్రీడా సంబరాలు
నెల్లూరు (టౌన్): ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా ఏహెచ్ఓఎస్ఏ, వీఏఎస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చరీ, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, క్యారమ్స్, టేబుల్ టెన్నీస్ తదితర ఆటల పోటీలను జరిపారు. ముఖ్య అతిథిగా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వి.సన్యాసిరావు హాజరై, ఆర్చరీ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పశువైద్య వృత్తితో ఉండే వారు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. జిల్లా పశుసంవర్థక అధికారుల సేవా సంఘం అధ్యక్షుడు కృష్ణమౌర్య మాట్లాడుతూ ఈనెల 25న ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పశువైద్య శాఖ సంయుక్త సంచాలకుడు కె.రమేష్నాయక్, జిల్లా హార్టికల్చర్ అధికారి కె.సుబ్బారెడ్డి, ఏహెచ్ఓఎస్ఏ కార్యదర్శి మాధవీలత, వీఏఎస్ ఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ జయపాల్, కార్యదర్శి కృష్ణమోహన్, చైతన్య కిశోర్, స్సోర్ట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉప్పు కాలువలో గుర్తుతెలియని మృతదేహం
తోటపల్లిగూడూరు (పొదలకూరు): మండలంలోని కొత్త పట్టపుపాళెం వద్దను న్న ఉప్పు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వీరేంద్రబాబు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఉప్పు కాలువలో పడి మృతిచెంది ఉన్నాడని, అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. గోధుమ రంగుపై బ్లూ, పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఫుల్షర్ట్, తెల్లటి బనియన్, నల్లని నైట్ ఫ్యాంట్ వేసుకొని ఉన్నాడని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందజేయాల్సిందిగా కోరారు. జనావాసాల్లోకి చుక్కల దుప్పి ఉదయగిరి రూరల్: దాహం తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి ఓ చుక్కల దుప్పి మండలంలోని తిరుమలాపురం పంచాయతీ గుడినరవ గ్రామంలోకి వచ్చిన ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఈ క్రమంలో దుప్పిని వీధి కుక్కలు గమనించి దాడి చేసేందుకు వెంబడించాయి. దీంతో గ్రామస్తులు గమనించి కుక్కల బారి నుంచి చుక్కల దుప్పిని రక్షించి దాహార్తిని తీర్చారు. అనంతరం ఉదయగిరి అటవీ రేంజ్ అధికారి బీఎస్ కుమార్ రాజాకు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఎఫ్బీఓ అఫ్జల్, సిబ్బంది గ్రామానికి చేరుకుని చుక్కల దుప్పిని స్వాధీనం చేసుకొని గన్నేపల్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వీఆర్వోకు బెదిరింపులు.. చీటింగ్ కేసు నమోదు సోమశిల: అనంతసాగరం మండలంలో పనిచేస్తున్న మహిళా వీఆర్వో రాజేశ్వరి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి ఆదివారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజేశ్వరికి గత ఆదివారం ఓ వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీ అంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఆమె బయపడి లక్ష రూపాయలను ఫోన్పే ద్వారా అతని నంబర్కు పంపింది. అనంతరం అతనికి కాల్ చేయగా ఫోన్ కలవకపోవడంతో మోసపోయానని తెలుసుకుని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అప్పు చెల్లించాలని అడిగినందుకు దాడి ఉదయగిరి: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు పట్టణంలోని మంగలికట్టకు చెందిన అగర శేషమ్మపై ఇద్దరు దాడి చేసినట్లు ఫిర్యాదు అందినట్లు ఎస్సై కర్నాటి ఇందసేనారెడ్డి ఆదివారం తెలిపారు. పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు.. మస్తానమ్మ అనే మహిళకు శేషమ్మ కొంత నగదు అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తీర్చమని అడిగేందుకు వెళ్లగా మస్తానమ్మ, ఆమె భర్త తిరుపతయ్య తనపై దాడి చేసి దుర్భాషలాడినట్లు శేషమ్మ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
పారదర్శకంగా సిబ్బంది బదిలీలు
మాట్లాడుతున్న ఎస్పీ నెల్లూరు(క్రైమ్): జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సిబ్బంది బదిలీల ప్రక్రియ జరిగింది. ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పీసీ, హెచ్సీ, ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న 221 మంది సిబ్బందిని ఖాళీల ఆధారంగా వారు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పారదర్శకంగా సిబ్బంది బదిలీల ప్రక్రియ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో నగర ఏఎస్పీ దీక్ష, ఎస్బీ డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ తదితరులు పాల్గొన్నారు. -
కేసులను వేగవంతంగా పరిష్కరించాలి
● హైకోర్టు జడ్జి జస్టిస్ సురేష్రెడ్డి ● జిల్లాలోని న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ నెల్లూరు (లీగల్): పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించి.. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా న్యాయమూర్తులు చొరవ చూపాలని హైకోర్టు జడ్జి జస్టిస్, జిల్లా న్యాయపాలన వ్యవహారాల జడ్జి సురేష్రెడ్డి సూచించారు. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా స్థాయి న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన న్యాయవ్యవస్థ పనితీరును సమీక్షించారు. కొత్త చట్టాలపై సూచనలు, సలహాలిచ్చారు. న్యాయమూర్తుల సందేహాలను జిల్లా జడ్జి శ్రీనివాస్ నివృత్తి చేశారు. ఘన స్వాగతం హైకోర్టు జడ్జి జస్టిస్ సురేష్రెడ్డికి జిల్లా జడ్జి శ్రీనివాస్, అదనపు జిల్లా జడ్జిలు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఎస్బీఐ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం, కోర్టు ఆవరణలో కక్షిదారులు కూర్చునేందుకు వీలుగా కల్పించిన సిమెంట్ బెంచీలను జస్టిస్ సురేష్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఎస్పీ అజిత, జేసీ వెంకటేశ్వర్లు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఉదయ్కిషన్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి, నాగరాజయాదవ్, ఉపాధ్యకుడు జల్లి పద్మాకర్. న్యాయవాది వేనాటి చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. వచ్చేది మన ప్రభుత్వమే
● మోసగించడంలో చంద్రబాబు దిట్ట ● తీవ్రంగా నష్టపోతున్న రైతులు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు(పొదలకూరు): అధైర్యపడకండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. మరో మూడేళ్లు ఓపిక పడితే రైతులకు మంచి రోజులొస్తాయని.. మోసగించడంలో సీఎం చంద్రబాబు దిట్టని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మాచర్లవారిపాళెం, కొత్తపాళెం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయడంలేదని గ్రామస్తులు తెలిపారు. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి భావించారని తెలిపారు. గ్రామాల్లో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు ప్రస్తుతం నిరాదరణకు గురై కళావిహీనంగా మారాయని ఆరోపించారు. గ్రామస్థాయిలో పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ అధినేత ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయనకు మంచి పేరొస్తుందనే దురుద్దేశంతో సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నీరుగార్చారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 22 నెలలు గడుస్తున్నా, కొత్త పింఛన్లను నేటికీ అందజేయడంలేదని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించక అన్నదాతలు అప్పులపాలవుతున్నారని తెలిపారు. ఆక్వా రైతులకు అన్యాయం ఆక్వా సాగు చేస్తున్న రైతులను గత ప్రభుత్వ హయాంలో ఆక్వా జోన్లో చేర్చి యూనిట్కు రూ.1.5 రాయితీని కల్పించి నాణ్యమైన విద్యుత్ను అందజేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వమొచ్చాక వీరిలో కొందరికే రాయితీని కల్పిస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతల మాటలు విని అధికారులు, పోలీసులు తమ పార్టీ శ్రేణులకు ద్రోహాన్ని తలపెడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. విచారణను అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మాచర్లవారిపాళెంలో ఇటీవల మృతి చెందిన తూపిలి సుశీలమ్మ కుటుంబసభ్యులు.. కొత్తపాళెంలో అలుపూరు పెంచలయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ నేత చిల్లకూరు సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ క్రికెట్ జట్టు కెప్టెన్గా ముత్తుకూరు యువకుడు
ముత్తుకూరు (పొదలకూరు) : మధ్యప్రదేశ్లోని ఇందౌర్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే జాతీ య స్థాయి టీ–10 క్రికెట్ పోటీలకు ఏపీ జట్టు కెప్టెన్గా ముత్తుకూరుకు చెందిన క్రీడాకారుడు బి.ప్రకాష్ ఎంపికయ్యారు. జట్టు సభ్యులుగా కరిముల్లా, సునీల్, వెంకటేశ్ నాగేంద్ర, అఖిల్ను అసోసియేషన్ ప్రకటించినట్లు ప్రకాష్ వెల్లడించారు. ముత్తుకూరు యువకుడు టీ–10 టీమ్కు కెప్టెన్గా ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమశిలలో 58.47 టీఎంసీలు సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం సాయంత్రానికి 58.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 70, ఉత్తర కాలువకు 50, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 97.781 మీటర్ల నీటిమట్టం నమోదైంది. జర్నలిస్టులకు 24, 25న మెగా హెల్త్ క్యాంపు నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని జీజీహెచ్లో జిల్లాలోని జర్నలిస్టులకు ఈ నెల 24, 25న ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హాజరుకావాలనుకునే వారు 95816 48888 వాట్సాప్ నంబర్కు తమ వివరాలతో మంగళవారం ఉదయం పదిలోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. జీజీహెచ్లో నేరుగా నమోదు చేసుకునే అవకాశం సైతం ఉందన్నారు. షుగర్, రక్త, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల రిపోర్టులను తీసుకురావాలని కోరారు. సంబంధిత వైద్యుల ద్వారా కన్సల్టేషన్ను సైతం నిర్వహించనున్నామని వివరించారు. పేరు, పనిచేస్తున్న మీడియా సంస్థ, జన్మదినం, వయస్సు, ఆధార్, రేషన్, హెల్త్ / ఆరోగ్యశ్రీ కార్డు, మొబైల్ నంబర్, అక్రిడిటేషన్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 69,049 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 23,842 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ఐసీడీఎస్లో రాబందులు
● కమీషన్లు ఇవ్వాలని హుకుం ● ప్రశ్నిస్తే వేధింపులు ● డబ్బులు కొల్లగొట్టేందుకు స్కెచ్ కోవూరు: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా రెండుసార్లు నిర్వహించే సీబీ సమావేశాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఇది ఖాతాల్లో పడటమే ఆలస్యం, దానిపై జిల్లా స్థాయిలోని ఓ అధికారి కన్ను పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీ ఆదేశాలంటూ అబద్ధపు ప్రచారంతో రంగంలోకి దిగారు. దీనికి గానూ సూపర్వైజర్లతో సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రం నుంచి రూ.600 చొప్పున వసూలు చేయాలని హుకుం జారీ చేయడం గమనార్హం. ఐసీడీఎస్ ఇందుకూరుపేట ప్రాజెక్టులో ఇటీవలి కాలంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. టార్గెట్ రూ.16 లక్షలు జిల్లా వ్యాప్తంగా 12 సెక్టార్లకు గానూ దాదాపు 6500 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. జిల్లాలోని 2672 కేంద్రాల్లో సీబీ ఈవెంట్లను ప్రతి నెలా రెండు చొప్పున ఏటా 20 సార్లు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి గానూ నెలకు రూ.500 చొప్పున ఏటా రూ.పది వేలను జమ చేయనున్నారు. ఈ తరుణంలో ఒక్కో కేంద్రం నుంచి రూ.600 చొప్పున సుమారు రూ.16 లక్షలను దండుకోవాలనే ప్రణాళికను రూపొందించారు. ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వసూళ్ల పర్వం మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్కర్లకు సూపర్వైజర్లు నేరుగా ఫోన్ చేసి.. ‘మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి.. అందులో జిల్లా మేడమ్ వాటాను వెంటనే పంపండంటూ వేధింపులకు దిగుతున్నారనే టాక్ నడుస్తోంది. కింది స్థాయిలోని ఓ అధికారి ఇలా అక్రమ వసూళ్లకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం పీడీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులడిగితే నమ్మకండి.. పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎవరైనా వేధిస్తే నేరుగా ఫిర్యాదు చేయండి.. బాధ్యులపై కఠిన చర్యలు చేపడతానంటూ సెక్టార్ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. సాక్ష్యాలున్నా..చర్యలేవీ..? డబ్బులను ఎందుకు వసూలు చేస్తున్నారు.. ఎవరికివ్వాలని ప్రశ్నించిన వారిపై అంతర్గత వేధింపులు ప్రారంభమయ్యాయని సమాచారం. కలెక్టర్ ప్రత్యే క విచారణ జరిపించి, అక్రమ దందాను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు. కాగా ఈ విష యమై ఇందుకూరుపేట ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీప్రియను సంప్రదించగా, డబ్బులను వసూలు చేయా లని ఎవరికీ చెప్పలేదని, ఈ పని ఎవరు చేయించారో త్వరలో తెలుస్తుందని బదులిచ్చారు. ఐసీడీఎస్ సెక్టార్లు – 12 అంగన్వాడీ కేంద్రాలు – 2672 కార్యకర్తలు – దాదాపు 6500 మంది జిల్లాలో ఇలా.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించి వారిని సంరక్షించే అంగన్వాడీ కేంద్రాలపై కొందరు రాబందుల్లా వాలారు. ప్రభుత్వమిచ్చే అరకొర నిధుల్లోనూ తమకు వాటా కావాలంటూ బరితెగించారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ దందా అటు అంగన్వాడీ వర్కర్లు, ఇటు అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో వర్గపోరు కొనసాగుతుండగా, కార్యకర్తల నుంచి ఎవరెక్కువ మొత్తంలో వసూలు చేస్తారో వారినే అందలమెక్కిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాకెలాంటి సంబంధం లేదు ఇందుకూరుపేట ప్రాజెక్ట్ పరిధిలో నాపై రెండు రోజులుగా జరుగుతున్న అసత్యప్రచారాన్ని నమ్మొద్దు. నేనెవర్నీ డబ్బులడగలేదు. కొందరు పనిగట్టుకొని బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను తయారు చేసి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాను. ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు.. కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని మాత్రమే సూచిస్తుంటా. ఇలాంటి మెసేజ్లను వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం సరికాదు. – హేనాసుజన్, పీడీ, ఐసీడీఎస్ -
దుమ్ము, ధూళితో అల్లాడిపోతున్నాం
● రోడ్ల ధ్వంసంతో భారీ వాహనాలను అడ్డుకున్న ఏరూరు గ్రామస్తులు ● స్పష్టమైన హామీ వచ్చేవరకు తగ్గేది లేదు చిల్లకూరు: రహదారుల అభివృద్ధి పేరుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో పాత రోడ్డు పూర్తిగా ధ్వంసమై దుమ్ము, ధూళితో అల్లాడిపోతున్నామని ఏరూరు గ్రామస్తులు వాపోయారు. మండల తీరప్రాంతంలోని ఏరూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మట్టి, గ్రావెల్, సిలికా వాహనాల రాకపోకలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా వాహన డ్రైవర్లు ఆ ప్రాంతంలో ఉదయం అల్పాహారంతో పాటు భోజనం దొరక్క అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా భారీ వాహనాల రాకపోకలతో పాతరోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. దీనివల్ల దుమ్ము నివాసాల్లోకి వచ్చి ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను కోరినా, కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పట్టించుకోలేదన్నారు. తూర్పుకనుపూరు ముత్యాలమ్మ జాతర సందర్భంగా వరగలి క్రాస్రోడ్డు నుంచి చింతవరం వరకు తాత్కాలింకగా కొంత రోడ్డును బాగు చేయగా ఈ ప్రాంతంలో కనీసం తట్టెడు మట్టి కూడా వేయడం లేదని వాపోయారు. భారీ వాహనాలతో రోడ్డు పూర్తిగా దెబ్బతింటుంటే ఆర్అండ్బీ అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధుల నుంచి ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నిత్యం అరగంటకో ఆర్టీసీ బస్సు కోట, గూడూరుకు ఉంటుండగా, రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో నాలుగు ట్రిప్పులను మాత్రమే తిప్పుతున్నారన్నారు. ఇప్పటికైనా రోడ్డును బాగు చేయకపోతే వాహనాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారుల చర్చలు విఫలం భారీ వాహనాలను ఏరూరు గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. స్థానికులతో సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. వాహనాలను నిలిపేయడం సరైన పద్ధతి కాదని, వాహనాలను వదిలేయాలని నచ్చజెప్పారు. అయితే భారీ వాహనాల రాకపోకలు సాగించాలంటే ముందుగా రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని, లేకుంటే వాహనాలను పూర్తిగా నిలిపేయాలని పట్టుబట్టారు. కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వాహనాలను వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దీంతో తహసీల్దార్ గోపీనాథ్రెడ్డితో పాటు రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. భారీ వాహనాల వద్ద బందోబస్తును పోలీసులు నిర్వహిస్తున్నారు. -
కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టర్ కార్యాలయములోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ జరిగింది. వినతులను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్కు రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. కేటాయించిన స్థలానికి సంబంధించి ఉమ్మ డిగా నిధిని సేకరించామని, అసోసియేషన్లో జమ చే శామన్నారు. తమ అధ్యక్షుడు అడుగుతున్నా ఆ నిధి వివరాలు తెలియజేయడం లేదన్నారు. అమానుల్లా, శ్రీనివాసులు, భాస్కర్రెడ్డి, శివప్రసాద్, రియాజుద్దీన్ పాల్గొన్నారు. ● గత సంవత్సరం జూలై 25 నుంచి ప్రతినెలా 3వ శుక్రవారం ఉద్యోగస్తుల గ్రీవెన్స్ను నిర్వహించారు. 235 ఫిర్యాదులు అందులో 172ని పరిష్కరించారు. -
అనుమతితో మాకు పనిలేదు
● లేఅవుట్కు గ్రావెల్ తరలింపు ● ఇష్టారాజ్యంగా బాటల నిర్మాణం పొదలకూరు: ఎలాంటి అనుమతి లేకుండా విచ్చలవిడిగా గ్రావెల్ను తరలిస్తున్నారు. మండలంలోని మరుపూరుకు సమీపంలో ఉన్న ఇస్కాన్ సిటీ – 2 అతిపెద్ద లేఅవుట్కు భారీగా గ్రావెల్ తరలిస్తున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. లేఅవుట్కు సమీపంలో ఉన్న కల్సర్ గని నుంచి అమ్మిగుంట చేలు మీదుగా ఇందుకోసం తాత్కాలికంగా బాటల నిర్మాణం చేపట్టారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రావెల్ తరలిపోతోంది. పొలాలకు సమీపంలో పెద్ద గుంతలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. లేఅవుట్ నిర్మాణం నుంచి వివాదాలు చోటుచేసుకుంటుండగా గతనెలలో తహసీల్దార్ సైతం వెళ్లారు. ప్రభుత్వ భూములు లేఅవుట్లో కలిశాయనే ఫిర్యాదుపై విచారణ నిర్వహించారు. ఇక్కడి లేఅవుట్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకుని నిర్మాణం చేపడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నాయకులు సైతం లేఅవుట్ వద్ద గతనెలలో ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో లేఅవుట్కు విచ్చలవిడిగా గ్రావెల్ తోలకంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. -
మద్యం మత్తులో లైన్మెన్ విధులు
● సకాలంలో విద్యుత్ సరఫరా ఇవ్వలేదని రైతుల ఆందోళన ● ఈఈ కార్యాలయానికి లైన్మెన్ సరెండర్ పొదలకూరు: ఓ విద్యుత్ ఉద్యోగి ఫూటుగా మద్యం తాగి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కథనం మేరకు.. పొదలకూరు సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా లైన్మెన్ బాలమురళి పనిచేస్తున్నాడు. శుక్రవారం పార్లపల్లి, చెర్లోపల్లి తదితర గ్రామాలకు ఉదయం 6:30 గంటలకు వ్యవసాయ విద్యుత్ను అందజేయాల్సి ఉంది. అయితే లైన్మెన్ మద్యం తాగి విధులకు హాజరైన సకాలంలో త్రీఫేజ్ విద్యుత్ ఉదయం 7:30 గంటల వరకు కూడా ఆయా గ్రామాలకు సరఫరా చేయలేదు. దీంతో రైతులు కొందరు సబ్స్టేషన్కు ఫోన్లు చేశారు. లిఫ్ట్ చేయకపోవడంతో వారు నేరుగా సబ్స్టేషన్కు వెళ్లి ఆరా తీశారు. అయితే బాలమురళి మద్యం మత్తులో జోగుతుండగా రైతులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లైన్మెన్ను నెల్లూరు ఈఈ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నట్టు పొదలకూరు డీఈ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. చాలారోజులుగా ఇదే తంతు జరుగుతున్నా సహచర ఉద్యోగులు సర్దుకుపోతూ లైన్మెన్ షిఫ్ట్ ఆపరేటర్ విధులను వారే నిర్వహించేవారు. అయితే వేసవి కాలంలో నిమ్మచెట్లకు నీరు పెట్టుకునేందుకు విద్యుత్ కోసం ఎదురు చూసే రైతులు కలుగజేసుకుని ఫిర్యాదు చేయడంతో బాలమురళి నిర్లక్ష్యం బయటపడింది. -
డ్వామాకు ఏ సారొస్తారో..
నెల్లూరు(పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో పీడీగా పనిచేస్తున్న సీవీ శ్రీనివాసప్రసాద్ను నెల్లూరుకు బదిలీ చేస్తూ రాష్ట్ర అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అదే సమయంలో డీడీఓగా ఉన్న ఎం.చిన్న మద్దులేటిని కూడా నెల్లూరు అధికారిగా బదిలీ చేశారు. కాసేపటికి ఉత్తర్వులు మార్చి తిరుపతి పీడీగా మద్దులేటిని నియమించారు. కాగా శ్రీనివాసప్రసాద్ జిల్లాకు వచ్చేందుకు సుముఖంగా లేరనే చర్చ జరుగుతోంది. ఆయన తిరుపతిలోనే కొనసాగుతారని, మద్దులేటికి నెల్లూరు డ్వామా పీడీగా మరలా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బదిలీలకు సంబంధించి జీఓలు మాత్రమే జారీ చేశారు. పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ పనిచేస్తున్న బి.గంగాభవానీని తిరుపతి డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా (డీడీఓ)గా బదిలీ చేశారు. పీడీలుగా ఇద్దరు అధికారులకు ఉత్తర్వులు మళ్లీ మార్చిన వైనం కానీ ఎవరొస్తారో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉన్న అధికారిణి తిరుపతికి బదిలీ -
నిలకడగా నిమ్మ ధరలు
● బస్తా రూ.12 వేలు ● తోటల్లో తగ్గిన కాయల దిగుబడి పొదలకూరు: స్థానిక నిమ్మ మార్కెట్ యార్డులో కాయల ధరలు కొద్ది రోజులుగా నిలకడగా ఉన్నాయి. తోటల్లో దిగుబడి తగ్గుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బస్తా కాయల ధరలు రూ.11 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతున్నాయి. ధరలు తగ్గుతాయనే ఉద్దేశంతో పిందెలను కూడా వదలకుండా కోసి మార్కెట్కు కొందరు రైతులు తరలిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. కాయలు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. వేసవి తాపం బాగా పెరుగుతున్న క్రమంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కాయలకు డిమాండ్ ఉంది. ఢిల్లీ మార్కెట్కు ఎగుమతులు బాగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వరకు ధరలు పతనమయ్యే పరిస్థితి ఉండదంటున్నారు. ఈలోపు కాయలు కోతకొస్తే మేలో కొంత మేర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తి రాక నేడు
నెల్లూరు (లీగల్): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి నెల్లూరుకు శనివారం రానున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తితో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల నెల్లూరు(అర్బన్): నగరంలోని పెద్దాస్పత్రిలో గల డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఏడాది పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు గానూ వెలువడిన నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు, అభ్యంతరాలుంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు వ్యక్తిగతంగా పెద్దాస్పత్రి పరిపాలన భవనంలోని కార్యాలయానికొచ్చి లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. జాబితాను spsnellore. ap. gov. in/ notice/ recruitmentను పరిశీలించాలని సూచించారు. కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల పరిశీలన నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లో పలు సామగ్రిని ఏసీబీ అధికారులు, ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ నేతృత్వంలో శుక్రవారం పరిశీలించారు. 2019కి ముందు ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై అప్పటి జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రోజ్మాండ్పై కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో పలు గృహోపకరణాలను జప్తు చేసి కలెక్టరేట్లో నిల్వ ఉంచారు. వీటివివరాలను సేకరించేందుకు గానూ వారు పరిశీలించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 63,454 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,882 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
అరుదైన వ్యాధి.. హీమోఫీలియా
● జిల్లాలో 200 మంది వరకు వ్యాధిగ్రస్తులు ● సరైన చికిత్సతో సాధారణ జీవితం నెల్లూరు(అర్బన్): హీమోఫీలియా.. ఇది అరుదైన వ్యాధి. అనుకోకుండా శరీరానికి చిన్నగాయమైనా, గీసుకున్నా రక్తం త్వరగా ఆగకపోవడాన్ని ఇలా పిలుస్తారు. రక్తం ఎక్కువగా రావడంతో ప్రాణాంతకమయ్యే అవకాశం ఎక్కువ. రక్తం గడ్డకట్టే ఫ్యాక్టర్లలో లోపం వల్ల ఇది వస్తుంది. ప్రధానంగా ఇది వంశపారంపర్యంగా (జెనెటిక్) వచ్చే వ్యాధి. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీని ప్రపంచ హీమోఫీలియా డేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వివిధ ఆస్పత్రుల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి కచ్చితమైన రికార్డులు లేకపోయినప్పటికీ ఐఎంఏ అంచనా ప్రకారం జిల్లాలో 200 మంది రోగులు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. చైన్నె, హైదరాబాద్ నగరాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న వారే ఎక్కువ. అతి చిన్న గాయంతోనే ఎక్కువ సేపు రక్తస్రావం జరగడంతో ఈ జబ్బు వచ్చిన రోగులు జీవితాంతం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫ్యాక్టర్ రీప్లేస్మెంట్ థెరపీ అందుబాటులో ఉంది. అవసరమైనప్పుడు ఉచితంగా మందులు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి అవగాహన లేకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు. ఎక్కువగా పురుషుల్లోనే ఈ జబ్బు వస్తుంది. లక్షణాలు ఏంటంటే.. చిన్నపాటి గీరుకున్నా రక్తం ఆగకపోవడం, మోకాళ్లు, కండరాల్లో వాపు, నొప్పి, తరచూ ముక్కునుంచి రక్తస్రావం, దంత చికిత్స తర్వాత కూడా రక్తస్రావం ఆగకపోవడం.. ఇలాంటి వారు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదకరమైన క్రీడలకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించిన చికిత్సను క్రమంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ రకమైన కేసులు తక్కువగా ఉన్నా అవగాహన లోపంతో సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అవసరమైనప్పుడు రోగులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రక్తస్రావం నియంత్రణలో వైద్యం ముందడుగు వేస్తోంది. -
మూణ్ణాళ్ల ముచ్చట
వెంకటాచలం: కాసుల కోసం కాంట్రాక్టర్ల కక్కుర్తి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. రోడ్డు పనులు ఇలాగేనా చేసేదంటూ నిలదీసేవాళ్లు లేకపోవడం వెరసి కనుపూరు – చవటపాళెం గ్రామాల మధ్య నిర్మించిన రహదారి నెల్లోపే అధ్వానంగా మారింది. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా పనులను చకాచకా పూర్తి చేయడంతో ఎక్కడ చూసినా తారు లేచిపోతూ.. కంకర రాళ్లు కనిపిస్తుండటంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూతూమంత్రంగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనుపూరు – చవటపాళెం గ్రామాల మధ్య 2.6 కిలోమీటర్ల మేర తారు రోడ్డును రూ.1.4 కోట్లతో మంజూరు చేసింది. అయితే తమ గ్రామంలో బయట్నుంచి ఎవరో వచ్చి నిర్మాణ పనులు చేస్తే తాము అంగీకరించబోమంటూ స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రారంభం కాలేదు. అయితే ఆ పార్టీ జిల్లా నేతలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేయడంతో పనులను ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఆ తర్వాత వారంలోపే పూర్తి చేసేశారు. నిర్మాణ పనుల సమయంలో అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ నుంచి ముడుపులు పుచ్చుకొని వీటిని పర్యవేక్షించలేదనే టాక్ నడుస్తోంది. కాంట్రాక్టర్ను నిలదీసే ధైర్యం లేక తాము మౌనంగా ఉండాల్సి వచ్చిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆనందం.. ఆవిరి కనుపూరు – చవటపాళెం గ్రామాల మధ్యలో రహదారిపై ప్రయాణం రెండు గ్రామాల ప్రజలకు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ఈ రోడ్డుపై అడుగడుగునా గోతులు పడి ఉండటంతో రాకపోకలకు తీవ్ర అవస్థలు పడేవారు. రాత్రి వేళ గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు గాయపడేవారు. అయితే ఇటీవల రోడ్డు పనులను ప్రారంభించడంతో వీరిలో ఆనందం నెలకొన్నా, అది అంతలోనే ఆవిరి కావడం గమనార్హం. ప్రస్తుతం పలు చోట్ల గుంతలు పడి రోడ్డు అఽధ్వానంగా మారడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నాణ్యతతో పనులు చేయించేలా చూడాలని కోరుతున్నారు. చవటపాళెం సమీపంలో ఇలా.. తారు లేచిపోయి దర్శనమిస్తున్న రోడ్డు రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల నెల్లోనే అధ్వానంగా మారిన చవటపాళెం రోడ్డు నిర్మాణ సమయంలో అధికారుల పర్యవేక్షణ శూన్యం పనులు చేయిస్తాం చవటపాళెం రోడ్డుకు మరమ్మతు పనులు చేయిస్తాం. వరికోత మెషీన్లు, ట్రాక్టర్లతో కొన్ని చోట్ల రోడ్డు దెబ్బతినింది. వీటిని బాగు చేసేలా చూస్తాం. – శ్రీనివాసరావు, డీఈ, పంచాయతీరాజ్ (పీఓపీ) -
కూటమి పాలనలో సంక్షేమం కరువు
● గిట్టుబాటు ధరల్లేక రైతన్నల దిగాలు ● దోపిడీ తప్ప అభివృద్ధి పట్టని చంద్రబాబు ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి మనుబోలు: కూటమి పాలనలో సంక్షేమం కరువై ప్రజలకు ఆవేదన తప్పడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని గొట్లపాళెం, పిడూరుపాళెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను ఆరాతీశారు. గొట్లపాళెంలో ఇటీవల మరణించిన చింతా రమణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. పిడూరుపాళెంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నేత ఉగ్గుమూడి వేణుగోపాల్రెడ్డిని పరామర్శించారు. అనంతరం కాకాణి మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ బూటకపు హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తక్కువ ధరలకు ధాన్యాన్ని తెగనమ్ముకున్నాక.. మార్కెట్లో రేట్లు పెరగడం ప్రభుత్వ వైపల్యానికి నిదర్శనమని విమర్శించారు. జేసీ ఇప్పుడే నిద్ర లేచినట్లుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ ప్రకటనలు చేయడంపై రైతులు మండిపడుతున్నారని తెలిపారు. ఇరిగేషన్లో అంతులేని అవినీతి ఇరిగేషన్ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతూ కోట్లాది రూపాయలను వెనుకేసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ పనులపై ఏ రోజు విచారణ జరిగినా, టీడీపీ నేతలు, ఇరిగేషన్ అధికారులు జైలుకెళ్లడం ఖాయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్లను మంజూరు చేయిస్తే.. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని సైతం పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు తిరిగి జగన్మోహన్రెడ్డి సంక్షేమ రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, కొండూరు జనార్దన్రెడ్డి, రామచంద్రారెడ్డి, బత్తుల వెంకటేశ్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఉగ్గుమూడి గోపిరెడ్డి, జయశేఖర్రెడ్డి, పద్మనాభరెడ్డి, ప్రతాప్రెడ్డి, రాఘవరెడ్డి, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణులకు ముప్పు
నాబార్డు ద్వారా..నగరవనం కోసం నాబార్డు ద్వారా నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులను మాత్రం అటవీ శాఖ చేపట్టింది. నిధులు ఏ ఖాతా ద్వారా విడుదల చేస్తున్నారనే విషయాన్ని అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ వివరాలను అడిగితే ఉన్నతాధికారులు వెల్లడిస్తారంటూ దాటేస్తున్నారు. నెలరోజులుగా పనులు చేస్తున్నారు. టోల్ప్లాజాకు దగ్గరగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లోని చిట్టడివిలో కొంత భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం వన సంరక్షణ సమితి కింద మొక్కల పెంపకం చేపట్టారు. వృక్షాలను తొలగించడంపై అధికారులను వివరణ కోరితే రోడ్లు, చిల్డ్రన్స్ పార్కు, నడక మార్గం పనులు చేపడుతున్నందన అక్కడ అడ్డమొచ్చిన చెట్లను తొలగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఏళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి వాతావరణ సమతుల్యతను కాపాడుతుంటే వాటిని అధికారులే తొలగించడం ఎంతవరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.చిల్లకూరు: మండలంలోని బూదనం టోల్ప్లాజాకు దగ్గరగా జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 20 ఎకరాలకు పైగా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. మధ్యలో పున్నపువారిపాళేనికి వెళ్లేందుకు రోడ్డు వసతి ఉంది. గతంలో మట్టిరోడ్డు ఉండగా.. నేడు అటవీ భూములకు ఆనుకుని ఉన్న పరిశ్రమల యాజమాన్యాలకు అనువుగా ఉండేలా తారురోడ్డుగా మారుస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్లో దక్షిణం వైపు అధికంగా సుమారు 15 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చుక్కల దుప్పిలు, కుందేళ్లు, నక్కలు, అడవి పందులు, పక్షులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇవి సమీపంలోని ప్రాంతాల్లో ఆహారం సంపాదించుకుని రిజర్వ్ ఫారెస్ట్లో తలదాచుకుంటున్నాయి. అలాంటి అటవీ ప్రాంతంలో నేడు ఆ శాఖ అధికారులే నగరవనం పేరుతో చెట్లు తొలగించేస్తున్నారు. దీంతో వన్యప్రాణాల జీవనానికి ముప్పు వాటిల్లే ప్రమాదముంది. గూడూరుకు దూరంగా.. వాస్తవానికి గూడూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిలో నగరవనాన్ని ఏర్పాటు చేయాలి. గూడూరు పరిసర ప్రాంతాల్లో అనువైన భూములు లేకపోవడంతో చిల్లకూరు మండలంలోని బూదనం టోల్ప్లాజా వద్ద ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ను ఎంపిక చేశారు. అయితే గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినా వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని విరమించుకున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం వణ్యప్రాణుల భద్రతను విస్మరించింది. గూడూరు పట్టణ ప్రాంతవాసులకు పార్కు సుమారుగా 12 కి.మీ దూరంలో ఉంటుంది. నగరవనం పేరుతో రిజర్వ్ ఫారెస్ట్కు ఎసరు 20 ఎకరాల్లో పార్కు ఏర్పాటుకు సన్నాహాలు గూడూరుకు దూరంగా ఏర్పాటు నిధుల విషయంలో గోప్యత పాటిస్తున్న అధికారులుఆ ప్రాంతంలో సంవత్సరాలుగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ త్వరలో కనుమరుగు కానుంది. నగరవనం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చెట్లు కొట్టేస్తోంది. ఫారెస్ట్పై ఆధారపడిన వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడింది.త్వరలో వెల్లడిస్తాం బూదనం టోల్ప్లాజా వద్ద ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసే నగరవనంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. త్వరలో పూర్తి వివరాలను వారే వెల్లడిస్తారు. నగరవనంలో చిన్న పిల్లలకు అవసరమైన ఆట వస్తువులతోపాటుగా చిన్నపాటి రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తాం. – రమణయ్య, ఫారెస్ట్ రేంజర్, నాయుడుపేట -
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెండరుకు నకిలీ ధ్రువీకరణ పత్రం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరుకు చెందిన వైఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత నాగమోహన్రెడ్డి. ఆయన రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి అనం రామనారాయణరెడ్డికి అనుచరుడు. ఆయన టెండర్ వేస్తే.. పోటీదారులను తప్పించేంత అత్యంత సన్నిహితుడు. జిల్లా పంచాయతీరాజ్శాఖ సదరు కాంట్రాక్టర్ ఊబిలో పడి కూరుకుపోయింది. ఆయన మంత్రి అనుచరుడు కావడంతో అతను సమర్పించే నకిలీ సర్టిఫికెట్లను పరిశీలించకుండానే కాంట్రాక్ట్లు కట్టబెట్టేస్తున్నారు. ఏ శాఖలోనైనా నిర్వహించే టెండర్లకు సంబంధించి ఏ కాంట్రాక్ట్ సంస్థ కానీ, కాంట్రాక్టర్ కానీ బిడ్లు దాఖలు చేసే.. ఆయా టెండర్దారుల బిడ్ కెపాసిటీలు, ఆన్ హ్యాండ్ వర్కులు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేపట్టి.. అర్హతను నిర్ధారించి, వారు దాఖలు చేసిన బిడ్లను ఫైనల్కు అనుమతించాల్సిన ఉంటుంది. పీకల్లోతులో కూరుకుపోయిన పీఆర్ శాఖ వైఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత ఆది నుంచి అడ్డదారుల్లో అడ్డగోలు వ్యవహారాలతో కాంట్రాక్ట్లు దక్కించుకోవడంలో ఆరితేరిపోయాడు. అధికారం ధీమాతో మంత్రి పేరు చెప్పుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. అర్హత లేకపోయినా నకిలీ ధ్రువీకరణ పత్రాలతో టెండర్లు దక్కించుకున్నాడు. టెండర్ల విషయంలో పక్కాగా ఉండాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు మంత్రి అనుచరుడి విషయంలో మాత్రం నిబంధనలను కాలరాశారు. సదరు కన్స్ట్రక్షన్ సంస్థ అర్హతలు, బిడ్ కెపాసిటి పరిశీలించకుండానే రూ.6.30 కోట్ల విలువైన ఆత్మకూరు బైపాస్ రోడ్డు పనులను అడ్డగోలుగా కట్టబెట్టిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు.. బిల్డింగ్ కన్స్ట్రక్షన్పై అనుభవం లేకపోయినా రూ.1.70 కోట్ల విలువైన పంచాయతీరాజ్శాఖ అతిథి భవన నిర్మాణం కాంట్రాక్ట్ను కట్టబెట్టేశారు. ఆనం అనుచరుడే.. ఆయన అర్హతలు సదరు కాంట్రాక్ట్ సంస్థ బిడ్ కెపాసిటి రూ.52 కోట్లు. ఈ సంస్థకు ఇప్పటి వరకు ఎర్త్ వర్కుల తప్ప.. బిల్డింగ్ కన్స్ట్రక్షన్పై అనుభవం లేదు. అయితే ఇప్పటి వరకు మంత్రి అనుచరుడినని కాంట్రాక్టర్లను పోటీ నుంచి తప్పించడం, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లను మేనేజ్ చేసుకుంటూ తన బిడ్ కెపాసిటికి మించి ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సుమారు రూ.280 కోట్ల పనులు దక్కించుకున్నట్లు విజిలెన్స్ విచారణలోనూ వెల్లడైంది. మంత్రి అనుచరుడు కావడంతో... అదే ఆయన అర్హతలుగా టెండర్ నిబంధనలను ఈ శాఖాధికారులు ఎక్కడా పట్టించుకోలేదు. తీగలాగితే డొంక కదిలిందిలా.. గతంలో ఆత్మకూరులో బైపాస్రోడ్డు వర్కుకు టెండర్లు పిలవగా ఆత్మకూరుకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేశారు. ఈ కాంట్రాక్ట్పై కన్నేసిన సదరు నాగమోహన్రెడ్డి ఆ పనులు దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు వినిపించాయి. ఏకంగా మంత్రి పీఏతో ఆ కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి.. తప్పుకోవాలంటూ ఆదేశించినట్లు, వారేసిన బిడ్ మొత్తం తెలుసుకుని వారి కంటే తక్కువ మొత్తం 4.9 శాతం లెస్తో రూ.6.30 కోట్ల కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. అయితే ఈ టెండర్ దక్కించుకునేటప్పటికి తన బిడ్ కెపాసిటికి మించి ఏపీ, తెలంగాణలో ఆన్ హ్యాండ్ వర్కులు ఉన్నా.. వాటిని కనబరచకుండా ఈ రోడ్డు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడనే ఆరోపణలు వెల్లువగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో జిల్లాలోని కాంట్రాక్టర్లు వైఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత అక్రమాలు గుర్తించి సీఎంఓకు ఫిర్యాదు చేయడంతో అక్కడి అధికారులు స్పందించారు. గతేడాది సెప్టెంబర్లోనే విచారణకు ఆదేశించడంతో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే మంత్రి అండతో ఆ నివేదికను పక్కన పెట్టడంతో బాధిత కాంట్రాక్టర్లు విజిలెన్స్ విచారణకు, మరోసారి సీఎంఓకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా పంచాయతీరాజ్ శాఖలో భవన నిర్మాణ టెండర్లో నకిలీ ధ్రువీకరణ పత్రం విషయం వెలుగులోకి వచ్చింది. హడావుడిగా బ్లాక్ లిస్టులో పెట్టేందుకు.. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా వైఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థను, అధినేత నాగమోహన్రెడ్డిని బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబరులోనే ఇతని అక్రమాలు వెలుగులోకి వచ్చినా.. మంత్రి అనుచరుడిని ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టారు. తాజాగా విజిలెన్స్ విచారణ చేపట్టడంతో టెండర్ నింబంధనలు పాటించకుండా.. ధ్రువపత్రాలు పరిశీలన చేయకుండా బిడ్కు అనుమతించడం, ఏక పక్షంగా కట్టబెట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తుండడంతో ఎక్కడ తమ ఉద్యోగాలుకు ముప్పు ఏర్పడుతుందని భావించి బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు ఈఎన్సీకు పంపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ వ్యవహారం మంత్రికి తలబొప్పి కట్టడంతో ఆయం మౌనం దాల్చారని ప్రచారం జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ అతిథి భవనం నాగమోహన్రెడ్డి దాఖలు చేసిన దేవదాయ శాఖ నకిలీ ధ్రువపత్రం నాగమోహన్రెడ్డి దక్కించుకున్న టెండర్.. అతిథి భవన శిలాఫలకంకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో జెడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.85 లక్షలను తొలి విడతగా మంజూరు చేయగా, మరో రూ.85 లక్షలతో కలిపి రూ.1.70 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహం నిర్మించుకునేందుకు టెండర్లు పిలిచారు. అయితే ఈ పనులను మంత్రి ఆనం అనుచరుడు, వైఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ అధినేత నాగమోహన్రెడ్డికి దక్కేలా ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి బిడ్స్ దాఖలు చేయకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఆయన కన్స్ట్రక్షన్ సంస్థకే టెండర్ దక్కింది. అయితే ఈ సంస్థకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అనుభవం లేకపోయినా.. ఉన్నట్లు ఏకంగా మంత్రి ఆనం శాఖ నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని జతపరిచారు. నంద్యాలలోని మూలమఠంలో కొలువైన శ్రీ భీమేశ్వర ఆలయ ముఖమండపం రూ.కోటి వ్యయంతో 2019–20 మధ్య పూర్తి చేసినట్లుగా అనుభవ ధ్రువీకరణ పత్రం జత చేశారు. అయితే జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్లు మాత్రం అవేమి పరిశీలన కూడా చేయకుండానే మంత్రి అనుచరుడనే క్వాలిఫికేషన్ చూసి టెండర్ ఓకే చేశారు. ఆ భవన నిర్మాణ పనులు దాదాపు 30 శాతం వరకు పూర్తయ్యాయి. ఈఎన్సీకి నివేదిక ఇచ్చాం ఆత్మకూరు అతిథి గృహం భవన నిర్మాణంలో వైఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ నకిలీ ధ్రువీకరణ పత్రం జతపరిచింది వాస్తవమే. ఈ విషయం గుర్తించి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోమని ఈఎన్సీకి నివేదిక ఇచ్చాం. అక్కడి నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. – కోటేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ, ఎస్ఈ -
సీనియార్టీ జాబితాలో తప్పులు
నెల్లూరు(దర్గామిట్ట): ‘పదోన్నతులు, బదిలీల్లో కీలకమైన సీనియార్టీ జాబితాలో తప్పులున్నాయి. లోటుపాట్లకు ఉద్యోగులను బలి చేయకుండా అందరికీ న్యాయం చేయాలి’ అని సచివాలయ ఉద్యోగులు కోరారు. యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ఉద్యోగుల గ్రీవెన్స్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగణన విధుల్లో భాగంగా పక్క సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్కు సంబంధించి టార్గెట్లు విధించి ఒత్తిడి పెంచకూడదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.రాజ్యలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు లోకేష్, గౌరీశంకర్, సభ్యులు వరలక్ష్మి, సునీత, సురేఖ, తేజస్విని, సుమతి పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలునెల్లూరు(లీగల్): బాలికపై లైంగిక దాడిచేసి, బాల్య వివాహానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు ఎస్టీ కాలనీకి చెందిన మాణికల చిన్నసుబ్బయ్య (45)కు పదేళ్ల జైలుశిక్ష పడింది. ఇంకా రూ.20 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. చిన్నసుబ్బయ్య పిల్లలు పెళ్లి చేసుకుని వేరే గ్రామాల్లో ఉన్నారు. అతను పదేళ్ల నుంచి సొంత అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఆమె కూతురైన బాధితురాలిని 2021 ఫిబ్రవరి 23వ తేదీన బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నానని అందర్నీ నమ్మించాడు. వెంకటాచలం మండలం నిడిగుంట గ్రామ ఎస్టీ కాలనీ సమీపంలో బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు. మరుసటిరోజు ఆ గ్రామంలోని బంధువులు ఇంటికి తీసుకెళ్లి వివాహం జరిగిందని చెప్పాడు. అనుమానించిన బంధువులు ఇంట్లోకి రానీయలేదు. చివరకు చిన్నసుబ్బయ్య ఫిబ్రవరి 25న బాలికను తీసుకుని విడవలూరు మండలం దంపూరు గ్రామ ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాలిక భయపడి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రక్షించి పక్కరోజు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నెల్లూరు దిశ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అప్పటి దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ నాగరాజు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు. కండలేరులో 44.850 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 44.850 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 370, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కరెంట్ కష్టాలు
● అనధికార కోతలతో జనం సతమతం ● కూటమి ప్రభుత్వంలో ఇదీ పరిస్థితి నెల్లూరు(వీఆర్సీసెంటర్): కూటమి ప్రభుత్వంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. అసలే వేసవి కాలం కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో మాత్రం అధికారికంగా కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం రోజూ విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతుల పేరుతో గంటలపాటు పగటిపూట సరఫరా ఆపేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో కోతలు విధిస్తున్నారు. అక్కడ ఆదా చేసిన విద్యుత్ను పట్టణ, నగర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో కోతలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.నెల్లూరులోని విద్యుత్ భవన్ -
స్వచ్ఛ కార్యక్రమాలపై శిక్షణ
నెల్లూరు(పొగతోట): స్వచ్ఛ కార్యక్రమాలపై డీఎల్పీఓలు, ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమాలను నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి తదితరులు పాల్గొన్నారు. పోర్టు కార్మికుల నిరసన ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టులోని సబ్ కాంట్రాక్ట్ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మి కులు.. మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరు సెంటర్లో నిరసనను గురువారం వారు చేపట్టారు. పనిభారం అధికంగా ఉందని, వేతనం మాత్రం సరిపడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కార్మికులు మాట్లాడారు. దాదాపు 12 గంటలకుపైగా పని చేయించుకుంటున్నా, వేతనాలను మాత్రం పెంచడంలేదని ఆరోపించారు. పని ముగిశాక ఎలాంటి రవాణా సదుపాయాన్ని కల్పించకపోవడంతో పోర్టు నుంచి ముత్తుకూరుకు నడిచి రావాల్సి వస్తోందని వాపోయారు. బిహార్, జార్ఖండ్, ఒడిశా నుంచి వచ్చి బెల్టు వర్కులు, వెల్డింగ్, బ్రిడ్జి, ఎలక్ట్రికల్ పనుల్లో నిమగ్నమైన తమను అధిక పనిభారంతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే కంపెనీ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి సంబంధిత ప్రైవేట్ కంపెనీ మేనేజర్ను నిలదీశారు. చివరికి సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విధులకు కార్మికులు హాజరయ్యారు. -
మహిళా సాధికారతకు జగనన్న పెద్దపీట
నెల్లూరు రూరల్: మహిళా సాధికారతకు పెద్ద పీటేసిన ఏకై క నేత జగన్మోహన్రెడ్డి అని.. సీఎంగా ఉన్న ఐదేళ్లు వారి సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. మహిళా బిల్లుకు మద్దతు చెప్పే అర్హత జగనన్న తర్వాతే ఎవరికై నా ఉంటుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపారమైందని, రాష్ట్రంలో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించి దేశ చరిత్రలోనే కొత్త దిశను చూపారని కొనియాడారు. కేబినెట్లో డిప్యూటీ సీఎం, హోం, ఆరోగ్య, విద్య, సీ్త్ర శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను మహిళలకు అప్పగించారని గుర్తుచేశారు. ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యం కల్పించారని.. మహిళల హక్కులు, గౌరవం కోసం నిజంగా పనిచేసిన నేత జగనన్నేనని కొనియాడారు. సీబీఎస్ఈ పది ఫలితాల విడుదల నెల్లూరు (టౌన్): సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 1500 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 90 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. డీసెట్కు దరఖాస్తు గడువు పొడిగింపు నెల్లూరు (టౌన్): ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇంటర్ అర్హతతో రెండేళ్ల డీఎల్ఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్కు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో వెలువడనున్నాయని వివరించారు. వివరాలకు cse.a p.gov.in, apdeecet.apcfss.inను సంప్రదించాలని సూచించారు. మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి.. జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి గానూ ఈ నెల 30వ దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో సాధించిన మెరి ట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలను కల్పించనున్నామని వెల్లడించారు. స్కూల్ స్థాయిలో మె రిట్ జాబితా ప్రదర్శనను మే మూడున.. ఎంపికై న వారి జాబితాను ఐదున విడుదల చేసి.. సర్టిఫికెట్లను ఆరున పరిశీలించనున్నామని వివరించారు. ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు deonellore.50webs.c omను సంప్రదించాలని సూచించారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో నారాయణ ప్రభంజనం
నెల్లూరు(టౌన్): ీసబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో నారాయణ సీబీఎస్ఈ పాఠశాలల విద్యార్థులు జిల్లాలో ప్రథమ, రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని సాధించారని ఏజీఎం రవివర్మ తెలిపారు. గోమతినగర్లోని స్కూల్లో విద్యార్థులను గురువారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడా రు. ధనలక్ష్మీపురంలోని బాయ్స్ క్యాంపస్ విద్యార్థి సుధీర్ 500కు గానూ 493 మార్కులను సాధించారని వివరించారు. శశాంక్ కుమార్ 485, వర్షిణి 483, ప్రీతమ్ 482, వర్షిత, పర్ణిక 481, ఈక్షిత, కీర్తిప్రియ, సౌరభికి 480 మార్కులొచ్చాయన్నారు. ధనలక్ష్మీపురంలోని బాయ్స్ రెసిడెన్షియల్, రత్నం నారాయణ సీబీఎస్ఈ, ధనలక్ష్మీపురంలోని నారాయణ డే, గోమతినగర్లోని నారాయణ సీబీఎస్ఈ పాఠశాలల్లో చదువుతున్న 436 మంది ఉత్తీర్ణుౖలయ్యారని తెలిపారు. విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్లస్టర్ ప్రిన్సిపల్ శాంతి, రీజినల్ ఇన్చార్జి ఆదిశేషయ్య, సీబీఎస్ఈ కో ఆర్డినేటర్ నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
మావిగన్పై చర్చకు సిద్ధమా..?
మర్రిపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన రాజధాని మావిగన్పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఆత్మకూరులో ఎన్నికలు పెడితే.. మీరో.. మేమో ప్రజలే చెప్తారనీ.. అభివృద్ధిపై ముందు దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి హితవు పలికారు. మండలంలోని పల్లవోలు పంచాయతీ తిక్కవరంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 90 శాతం పనులను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తి చేయించి.. ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారని, అయితే మిగిలిన పది శాతం పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయకుండానే ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమైందని ఆరోపించారు. ఇలా అయితే హార్బర్లో ఏమి చేయాలన్నా.. అక్కడి మౌలిక వసతులను వినియోగించుకోవాలన్నా, ప్రైవేట్ వ్యక్తుల వద్ద మత్స్యకారులు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. దీన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని డిమాండ్ చేశారని, స్థానిక మత్స్యకారులకు నష్టం కలిగేలా ఎవరు యత్నించినా, రానున్న తమ ప్రభుత్వం ఊరుకోబోదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తమ స్వలాభం కోసమే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీటన్నింటినీ మంత్రి ఆనం పక్కనబెట్టి.. మావిగన్లో ఒక అంశాన్ని తీసుకొని జగన్మోహన్రెడ్డి మరోసారి అధికారంలోకి రారంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆత్మకూరులో ఎన్నికలను ఇప్పుడు నిర్వహిస్తే, ఎవరు గెలుస్తారో తెలుస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో అనేక రకాల మాఫియాలున్నాయని.. ఇసుక, మట్టి మాఫియా విజృంభిస్తోందని మండిపడ్డారు. ప్రతి మండలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉందని ఆరోపించారు. ఇలా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణిస్తే, కారకులపై నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. సోమశిల జలాశయ పనులు జరగలేదని.. ఆప్రాన్ వర్కులను చేపట్టకపోతే భారీ నష్టం సంభవిస్తుందంటూ గతంలో చెప్పిన ఆనం.. అధికారంలోకి వచ్చాక ఒక్క అంగు ళం పనిని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించా రు. హైలెవల్ కెనాల్ విషయంలోనూ ఇదే పరిస్థితని, ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉన్నాయని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ముందు దృష్టి సా రించాలని సూచించారు. అన్ని అంశాలను ప్రజలు గ మనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు. పార్టీ మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులునా యుడు, బొర్రా సుబ్బిరెడ్డి, బాబునాయుడు, శ్రీను, నారాయణస్వామి, సుధాకర్ పాల్గొన్నారు. జగన్మోహన్రెడ్డిపై విమర్శలు మాని.. అభివృద్ధిపై దృష్టి సారించండి మత్స్యకారుల కోసమే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి -
ఆంక్షలు ఛేదించి.. నీరాజనాలు పలికి
● మత్స్యకారులతో జగనన్న భేటీ సక్సెస్ ● పచ్చ మీడియా పిచ్చి రాతలు.. పచ్చి అబద్ధాలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నిర్వహించిన మత్స్యకార భేటీ కార్యక్రమం అద్భుత విజయం సాధించిందని.. ప్రభుత్వమెన్ని ఆంక్షలు పెట్టినా, గంగపుత్రులు నీరాజనం పలికారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత పర్యటనకు లభించిన భారీ స్పందనను చూసి ఓర్వలేకే అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. నీచ రాజకీయాలు జువ్వలదిన్నెలో జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు నీచ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడిందని ధ్వజమెత్తారు. హెలికాప్టర్ ల్యాండింగ్కు సంబంధించిన అనుమతిని చివరి నిమిషం వరకు పెండింగ్లో ఉంచారని విమర్శించారు. రవాణా శాఖ అధికారులతో వాహనాలను నిలిపేయించి.. బ్యారికేడ్లను పెట్టినా జనం ఆగలేదని తెలిపారు. వేట సాగనీయబోమని, పథకాలను నిలిపేస్తామని మత్స్యకారులను స్థానిక నేతలు బెదిరించినా, వేలాదిగా తరలివచ్చి జగనన్నకు నీరాజనం పలికారని వివరించారు. దీన్ని జీర్ణించుకోలేక పచ్చ మీడియా రోత రాతలు రాస్తోందని.. వారి సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆనం.. ఆ ఘటన మీకు గుర్తుందా..? జగన్మోహన్రెడ్డి పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. 2011లో సోంపేటలో మత్స్యకారులపై కాల్పులు జరిగిన సమయంలో మంత్రిగా మీరే ఉన్నారని, ఆ విషయాన్ని మరిచారానని ప్రశ్నించారు. అక్కడ థర్మల్ ప్లాంట్ వద్దన్నది తమ పార్టీ అధినేతేనని గుర్తుచేశారు. చంద్రబాబులా మతిమరుపుతో మా ట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రాంతా నికి వచ్చి వలలను తెంపి వేటాడుతున్న పొరుగు రాష్ట్ర మెకనైజ్డ్ బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుంటే, వాటిని విడిచిపెట్టింది టీడీపీ నేతలనే విషయం తెలియదానని నిలదీశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు తమ ప్రభుత్వ హయాంలో జరిగాయని, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. మత్స్యకారులకు అండగా జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనకు జగనన్న రావడం మత్స్యకారులకు భరోసానిచ్చిందని.. కావలి నియోజకవర్గంలో దురాయి వేసినా.. ఎన్ని అంక్షలు పెట్టినా, మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తెలియజేశారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ చర్య సరికాదని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలను మత్స్యకారులు తెలియజేయగా, తమ పార్టీ అధినేత భరోసా ఇచ్చారని చెప్పారు. పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న బోట్లను దొంగచాటుగా ఎత్తుకెళ్తే, వాటిని తీసుకురాకుండా మీనమేషాలను ప్రభు త్వం లెక్కిస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ సంస్థకు భూములివ్వడం తప్పు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మంచి పనులను నిర్వీర్యం చేసే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. జువ్వలదిన్నె హార్బర్కు సంబంధించిన భూములను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. ప్రాణాలకు తెగించి బోట్లను మత్స్యకారులు పట్టుకుంటే, వాటిని వదిలేస్తారానని ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడారు. చేపల వేట నిషేధ సమయంలో సాయం చేయాలని మత్స్యకారులు అభ్యర్థించగా, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.పది వేలను అందజేసి మాటను తమ పార్టీ అధినేత నిలబెట్టుకున్నారని చెప్పారు. పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులకు అప్పగిస్తారని తెలిపారు. మత్స్యకారుల కడుపు కొడుతుంటే ప్రశ్నించాల్సింది పోయి, సిగ్గు లేకుండా సమర్థించడం పొరపాటని పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. పదవి కోసం పాకులాడకుండా ప్రజల కోసం పనిచేయాలని రామనారాయణరెడ్డికి హితవు పలికారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్న ఆయన అసలు మంత్రేనానని నిలదీశారు. ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ అనుమతి రద్దు చేయాలంటూ..
● గ్రామస్తుల ఆందోళన సీతారామపురం: మండలంలోని సింగారెడ్డిపల్లిలో రెవెన్యూ అధికార యంత్రాంగం క్వార్ట్జ్ మైనింగ్కు అక్రమంగా ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనను స్థానికులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ సర్వే నంబర్ 129లో సుమారు 169 ఎకరాల మేత పొరంబోకు భూమిలో 80 ఏళ్లుగా పశువులు, మేకలు, గొర్రెలను మేపుతూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఇటీవల ఆ భూమిని ఎస్జీఎస్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 30 ఏళ్ల పాటు క్వార్ట్జ్ మైనింగ్కు అనుమతులిచ్చారని తెలిసిందన్నారు. నెల్లూరులోని మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయగా, మంజూరు పత్రాలను ఇచ్చారని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కో రామన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎంఓ యూ, రెవెన్యూ ఎన్ఓసీని వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఫాజిహాకు వినతిపత్రాన్ని అందజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
‘ఎన్ని అడ్డంకులు సృష్టించినా మత్స్యకార భేటీ సక్సెస్’
సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వేదికగా వైఎస్ జగన్ నిర్వహించిన మత్స్యకార భేటీ అద్భుత విజయం సాధించిందని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా గంగపుత్రులు నీరాజనం పట్టారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెల్లడించారు. వైఎస్ జగన్ పర్యటనకు లభించిన భారీ స్పందన చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపిందని కాకాణి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..అడ్డంకులు సృష్టించినా ఆగని జన ప్రవాహం:జువ్వలదిన్నెలో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడింది. హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతిని ఆఖరి నిమిషం వరకు పెండింగ్లో పెట్టారు. రవాణా శాఖ అధికారులతో వాహనాలను నిలిపివేసి, బారికేడ్లు పెట్టినా జనం ఆగలేదు. వేట సాగనివ్వమని, పథకాలు ఆపేస్తామని స్థానిక నేతలు మత్స్యకారులను బెదిరించినా, 4 వేల మందికి పైగా తరలివచ్చి వైఎస్ జగన్కి నీరాజనం పట్టారు. అది చూసి ఓర్చుకోలేకనో పచ్చ మీడియా రోత రాతలు రాస్తోంది. ఆ మీడియాల సర్టిఫికేట్లు మాకవసరం లేదు.ఆనం గారూ.. ఆ ఘటన మీకు గుర్తుందా?:జువ్వలదిన్నెలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. 2011లో సోంపేట మత్స్యకారులపై కాల్పులు జరిగినప్పుడు ఆనం మంత్రిగా ఉన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు. మత్స్యకారుల రక్త చరిత్ర జగన్ది కాదు. మీ హయాంలో జరిగిన కాల్పులది. సోంపేటలో థర్మల్ ప్లాంట్ వద్దు అన్నదే వైఎస్ జగన్. కానీ, మీరు మాత్రం అన్నీ మర్చిపోయారు. చంద్రబాబులా మతిమరుపుతో మాట్లాడుతున్నారు.ఇంకా తమ ప్రాంతానికి వచ్చి, తమ వలలు తెంపి చేపలు వేటాడుతున్న పొరుగు రాష్ట్ర మెకనైజ్డ్ బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుంటే, వాటిని విడిచిపెట్టింది టీడీపీ నేతలు. ఈ విషయం ఆనంకు తెలియదా? జువ్వలదిన్నె హార్బర్ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 2019–24 మధ్య జరిగాయి. అందుకే ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని అదే పనిగా అబద్దాలు వల్లె వేయొద్దని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మంత్రి ఆనంకు హితవు చెప్పారు.మత్స్యకారులకు వైఎస్ జగన్ భరోసా: రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డివైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్భర్ పర్యటనకు రావడం మత్స్యకారులకు భరోసానిచ్చింది. కావలి నియోజకవర్గంలో దురాయి వేసినా, ఎన్ని అంక్షలు పెట్టినా, మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన వారందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు. మత్స్యకారులకు ఆస్తిగా ఇచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ చర్య సరికాదు. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్ధితుల్లోనూ దాన్ని అడ్డుకునేలా చూస్తాం. మత్స్యకారులకే హార్బర్ చెందేలా చేస్తాం.పొరుగు రాష్ట్రాల మెకనైజ్డ్ బోట్లు ఇక్కడ చేపల వేటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని, అవి వలలను తెంపి, తమ బోట్లను కూడా ధ్వంసం చేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు మొర పెట్టుకుంటే జగన్ హామీ ఇచ్చారు. మరో వైపు పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న బోట్లను దొంగచాటుగా ఎత్తుకుని పోతే వాటిని తీసుకుని రాకుండా ప్రభుత్వం, అధికార పార్టీ మీన మేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికైనా ఆ బోట్లను వెనక్కి తీసుకుని రావాలి. మత్స్యకారులకు వైఎస్ జగన్ ఎప్పటికీ అండగా ఉంటారు.డిఫెన్స్ అకాడమీకి జువ్వలదిన్నె భూమి ఇవ్వడం తప్పు: పి.చంద్రశేఖర్రెడ్డిమత్స్యకారులకు తోడుగా నిల్చేలా వైఎస్ జగన్ 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఆయన ఏ మంచి పని చేసినా కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఆ దిశలోనే జువ్వలదిన్నె హార్బర్కు చెందిన భూమిని ఒక ప్రైవేటు డిఫెన్స్ అకాడమీకి ఇవ్వడం దారుణం. మరో చోట భూమి ఇచ్చే అవకాశం ఉన్నా ఫిషింగ్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూమి కేటాయించం తప్పు.మత్స్యకారులకు రూ.10 వేలు ఇచ్చిన ఘనత జగన్ది: కిలివేటి సంజీవయ్యనాడు సూళ్లూరుపేటలో జగన్ని కలిసిన మత్స్యకారులు చేపల వేట నిషేధ సమయంలో తమను ఆదుకోవాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం అక్కడి మత్స్యకారులకు రూ.5 వేలు ఇస్తోందని వారు చెప్పగా, తాము అధికారంలోకి వస్తే, రూ.10 వేలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. మత్స్యకార భరోసా కింద వారికి ఆర్థిక సాయం చేశారు.వైఎస్ జగన్పై మత్స్యకారులకు అపార విశ్వాసం: కాకాణి పూజితవైఎస్ జగన్ది జువ్వెలదిన్నె పర్యటన సందర్బంగా ఎన్ని అడ్డంకులు పెట్టినా పెద్ద సంఖ్యలో హాజరైన మత్స్యకారులు తమకు కేవలం ఆయన వల్లే మేలు జరుగుతుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. అదే వారు బలంగా నమ్ముతున్నారు కూడా. అదే నిజం. వైఎస్ మాట మీద నిలబడతారు. రేపు అధికారంలోకి వచ్చాక, జువ్వెలదిన్నె హార్బర్ను మత్స్యకారులకు అప్పగిస్తారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బల్కర్
● పట్టలు కట్టే గోదాముపై తీగలు పడి మంటలు ● రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టంముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బూడిద బల్కర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పోర్టు రైల్వే వ్యాగన్లకు పట్టలు కట్టే గోదాముపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. దీంతో పట్టలు తగులబడి సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం కారణంగా గోదాము పక్కనే ఆనుకుని ఉన్న పోర్టు టౌన్షిప్లో నివాసముంటున్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు అయ్యింది. తమిళనాడు ప్రాంతానికి చెందిన బల్కర్ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేసినట్టుగా చెబుతున్నారు. బూడిదను తమిళనాడుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. తరచూ బల్కర్లు రోడ్డు ప్రమాదాలకు గురికావడంపై స్థానికులు మండిపడుతున్నారు. -
ఫిషింగ్హార్బర్ ప్రైవేట్పరం దారుణం
– రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగనన్న మత్స్యకారుల ఆస్తిగా ప్రకటించి నిర్మించిన ఫిషింగ్హార్బర్ను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనుకోవడం దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. సుమారు 70 ఎకరాల్లో రూ.300 కోట్ల వ్యయంతో 95 శాతం మేర పనులు పూర్తిచేసిన ఫిషింగ్హార్బర్ను స్వప్రయోజనాల కోసం పక్కన పెట్టేసి సాగర్ డిఫెన్స్ అనే సంస్థకు 30 ఎకరాలు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మత్స్యకారులకు జరుగుతున్న అన్యా యం తెలుసుకుని నేరుగా జగనన్నే జువ్వలదిన్నె వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న నేతృత్వంలో మత్స్యకారులకు అండగా నిలబడుతామని హామీ ఇచ్చారు. -
మీడియా గొంతు నొక్కేందుకే శ్రీహరి అరెస్ట్
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరురూరల్: ‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేయడమే’ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఎక్కువయ్యాయన్నారు. పూడి శ్రీహరి గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీహరి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేశారన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మీడియా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారన్నారు. ఎప్పుడూ అసభ్యపదజాలం వాడరని, ఎవరిని వ్యక్తిగతంగా దూషించే అలవాటు లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారన్నారు. పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శ్రీహరి ప్రధాన కారకుడిగా భావించి, ఆ విభాగాన్ని బలహీనపరచాలనే లక్ష్యంతోనే అక్రమ అరెస్ట్ జరిగిందన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని హైకోర్టు ఆదేశాలున్నా, సివిల్ డ్రెస్లో వెళ్లి శ్రీహరిని అదుపులోకి తీసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో బెయిల్ ఇవ్వాలని, రిమాండ్కు పంపకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటివరకు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకుండా వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. భవిష్యత్లో ఎవరూ కూటమి నాయకులను ప్రశ్నించకుండా ఉండేలా, బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. శ్రీహరి అరెస్ట్ను కేవలం వైఎస్సార్సీపీ శ్రేణులు, జర్నలిస్టులే కాకుండా సామాన్య ప్రజలు కూడా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్లు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, అక్రమంగా జైలుకు పంపడం వంటి చర్యలు మానుకోవాలన్నారు. శ్రీహరిని భేషరతుగా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలి గానీ, ఇలాంటి వేధింపులు సరికాదన్నారు. -
చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం బనవరాజుపాళేనికి చెందిన ఉపాధి కూలీలు మనోజ్ (32), అరుణ్ (24)తోపాటు మరో వ్యక్తి మోటార్బైక్పై డీసీపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో అకస్మాత్తుగా గేదెలు అడ్డుగా రావడంతో వాటిని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మనోజ్, అరుణ్ తీవ్రంగా గాయపడగా వెంటనే వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. అరుణ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనోజ్కు వివాహామైంది. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై మర్రిపాడు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్ల జైలునెల్లూరు(లీగల్): గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడని నమోదైన కేసులో నేరం రుజు వు కావడంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన షణ్ముగవేలు మారిముత్తుకు శిక్ష పడింది. ఐదు సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.గీత బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో 2021 డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు – 1 అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన షణ్ముగవేలు 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైమేరకు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు. స్నేహితుడితో ఈతకెళ్లి..● యువకుడి మృతి నెల్లూరు సిటీ: పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని మనుమసిద్ధినగర్కు చెందిన నాగరాజు (28) తన స్నేహితుడైన మణికాంత్తో కలిసి మంగళవారం రూరల్ మండలంలోని కొండ్లపూడి గ్రామ సమీపంలోని పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నాగరాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మణికాంత్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని గాలించారు. నాగరాజు ఆచూకీ తెలియకపోవడంతో రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బుధవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం ఒడ్డుకు చేరడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
అడుగడుగునా జగనోత్సాహం
● ఉదయం ఏడు గంటల నుంచే వేలాది మంది రాక ● మహిళలు, యువత జెండాలు పట్టుకుని కేరింతలు కొడుతూ పరుగులు ● ఉప్పు కాలువలో పడవల్లో వైఎస్సార్సీపీ జెండాలతో జగన్కు స్వాగతం ● ఎండవేడి, ఉక్కపోతను లెక్క చేయకుండా చంటిబిడ్డలతో సహా వచ్చిన గంగపుత్రులు సాగర్ డిఫెన్స్ శిలాఫలకానికి పోలీసు భద్రతమాజీ సీఎం వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటనతో కడలి తీరం.. జనసునామీగా మారింది. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కానివ్వబోమని, ప్రతి మత్స్యకారుడిని మెకనైజ్ బోట్లకు యజమానులను చేస్తానని హామీ బతుకు, భవిష్యత్పై బెంగ ఉన్న గంగపుత్రుల్లో కొండంత భరోసానిచ్చింది. ప్రభుత్వ పెద్దలే కుట్రధారులుగా మారి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములు ప్రైవేట్ పరం చేయడం, తమిళ బోట్లువదిలేసిన వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులకు ధైర్యానిచ్చారు. మండు వేసవి ఎండను సైతం లెక్క చేయకుండా మత్స్యకార యువత, మహిళలు తురుపులు తురుపులుగా తలిరావడంతో సాగరతీరంలో జగనోత్సాహం ఉప్పొంగింది. బిట్రగుంట: తీర ప్రాంతానికి, మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకు వచ్చేందుకు, వారికి భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా జువ్వలదిన్నెకు బుధవారం రావడంతో సుమారు 64 మత్స్యకార గ్రామాల నుంచి మత్స్యకారులు భారీగా తరలివచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఉదయం ఏడు గంటలకే, జగన్ రాకకు సుమారు మూడు గంటల ముందుగానే జిల్లాతో పాటు ప్రకాశం, ఇతర తీర ప్రాంత జిల్లాల నుంచి సుమారు పది వేల మందికి పైచిలుకు జువ్వలదిన్నె చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి సభా స్థలి మీదుగా ఫిషింగ్ హార్బర్ వరకూ ఇసుక వేస్తే రాలనంతంగా జనం నిండిపోయారు. ఒక వైపు తీరంలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా విపరీతమైన ఎండ, ఉక్కపోతతో చెమటలు తడిపేస్తున్నా లెక్క చేయకుండా జగన్ కోసం ఎదురుచూస్తు ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.45 గంటలకు వైఎస్ జగన్ హెలికాప్టర్లో జువ్వలదిన్నె చేరుకోవాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 10.16 గంటలకు చేరుకున్నారు. అనంతరం హెలిపాడ్ వద్ద దిగిన జగన్కు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు మత్స్యకారులు, ప్రజలు వేలాదిగా తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. తొలుత ఇక్కడికి చేరుకున్న మత్స్యకారులను చూసి హెలికాప్టర్ నుంచే జగన్ అభివాదం చేశారు. అప్పటికే హెలిప్యాడ్ చుట్టూ వేలాదిగా జనం చేరిపోయారు. మరో వైపు స్థానిక మత్స్యకారులు, మహిళలు హెలికాప్టర్ చూసిన వెంటనే పరుగు పరుగున జగనన్నను చూసేందుకు పొలాల మీదుగా పరుగులు తీస్తూ వచ్చారు. తన కోసం వేచి ఉన్న మత్స్యకారులకు అభివాదం చేస్తూ జగన్ మత్స్యకారులు, కాపులు, గ్రామ పెద్దలతో కలిసి వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను సందర్శించారు. వలసలు నివారించి, మత్స్యకారులకు స్థిరమైన ఉపాధి, మత్స్య సంపదకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన హార్బర్ను స్వయంగా పరిశీలించారు. హార్బర్లో నిర్మించిన చిల్లింగ్, ఐస్ప్లాంట్లు, వలల రిపేర్ గదులను నిశితంగా పరిశీలించారు. అందరినోటా అదే మాట మత్స్యకారులు మంచివాళ్లు, సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్లు. ఒకసారి మంచి చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ రాకకు రెండు గంటల ముందే వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు తమ పిల్లలను కూడా తీసుకువచ్చారు. జగన్ వచ్చిన వెంటనే ‘అదిగో జగనన్న...ఆయనే మనకు హార్బర్ కట్టించింది’ అంటూ తమ పిల్లలకు చెప్పి జగన్మోహన్ రెడ్డిని చూపించడం కనిపించింది. మత్స్యకార మహిళలు, యువత కూడా మాకు హార్బర్ కట్టించిన జగనన్న వచ్చాడు అంటూ సంబరంగా సభా వేదిక వద్ద జై జగనన్న... మీరు కట్టించిన హార్బర్తో మాకు భవిష్యత్పై నమ్మకం వచ్చింది అన్నా.. మాపిల్లలు పొట్ట చేత పట్టుకుని పక్కరాష్ట్రాలకు వలసలు వెళ్లే బాధ తప్పుతుంది అన్నా అంటూ నినాదాలు చేశారు. కడలూరు బోట్లపై ఫిర్యాదు కడలూరు బోట్ల కారణంగా జిల్లాలోని తీర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పెద్ద బోట్లు, వలలతో మన తీరంలోకి వేటకు వస్తున్న బోట్లు ఇక్కడి మత్స్య సంపదను దోచేస్తున్నాయని, వాటి కారణంగా తమ వలలు దెబ్బతింటున్నాయని విన్నవించారు. కడలూరు బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచగా, ప్రభుత్వంలోని వారు బోట్ల యజమానులతో లాలూచీ పడి తమను మోసం చేసి పడవలు తప్పించారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. పడవలు తప్పించిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఫిర్యాదు చేశారు. జగన్ అనే నేను.. మాటిస్తున్నా..! ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులతో మమేకమయ్యారు. జగనన్న మీరే ఈ హార్బర్ను కాపాడాలన్నా.. అంటూ వలసతో తాము పడిన కష్టాలను, హార్బర్ సిద్ధమైన తర్వాత జరిగిన మేలు ఇదంటూ వివరించారు. కేవలం పది శాతం పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని, అవి కూడా పూర్తయితే మత్స్యకారుల భవిష్యత్కు బంగారుబాట అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనులు పక్కన పెట్టి సాగర్ డిఫెన్స్ కంపెనీకి భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మత్స్యకారులు కన్నీటితో జగన్కు నివేదించారు. ‘అన్నా... మీ అందరికి మాటిస్తున్నాను. గట్టిగా కళ్లు మూసుకుని తెరిచే లోపు మూడేళ్లు అయిపోతాయి.. వచ్చేది మన ప్రభుత్వమే. ఫిషింగ్ హార్బర్లు మీ హక్కు, ఆస్తిగా మీకు తప్ప మరెవరికి చెందకుండా చూస్తాను. ప్రతి కుటుంబాన్ని యజమానులను చేస్తాను’ అంటూ జగన్ చెప్పడంతో.. ‘జగనన్నా.. నిన్ను నమ్ముతున్నామన్నా.. మీరే మాకు దిక్కు..’ అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకున్న జగన్ మత్స్యకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. -
జగనన్నే మన గుండె ధైర్యం
– మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ‘ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనివ్వం. జగనన్నే మన గుండె ధైర్యం. ఆ ధైర్యంతోనే పోరాడుదాం. మన మత్స్యకారుల ఆస్తి, భవిష్యత్ను కాపాడుకుందాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఈ ప్రాంత మత్స్యకారుల దశాబ్దాల కలను నిజం చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 90 శాతం మేర పనులు కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. హార్బర్ను అందుబాటులోకి తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం అంటే మత్స్యకారుల కడుపు కొట్టడమేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగనన్న నేతృత్వంలో ఫిషింగ్ హార్బర్ను కాపాడుకుని మత్స్యకారులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. -
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,426 మంది స్వామిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.130 సన్నవి : రూ.100 పండ్లు : రూ.80 -
ద్వితీయ సంవత్సరంలో..
● ఇంటర్మీడియట్ ఫలితాల్లో వారిదే హవా ● ప్రథమ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత ● ద్వితీయ సంవత్సరంలో 82 శాతం నమోదు ● రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ఇయర్లో జిల్లాకు ఏడో స్థానం ● ద్వితీయ సంవత్సరంలో 9వ స్థానంబాలికల ఉత్తీర్ణత శాతం : 83 నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలికలు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో హవా ప్రదర్శించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 80 శాతం, బాలురు 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 83 శాతం, బాలురు 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 78 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఏడో స్థానంలో, సెకండ్ ఇయర్లో 82 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో ఏడో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 5వ స్థానం జిల్లాకు దక్కింది. సెకండ్ ఇయర్లో గతేడాదితో పోలిస్తే 4 స్థానాలు పడిపోయి 9వ స్థానానికి చేరింది. 53,404 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగాయి. వీటికి జిల్లా వ్యాప్తంగా 53,404 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 26,935 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 26,469 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకోవచ్చు ఫలితాలపై మార్కుల కోసం రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్కు ఒక్కో పేపర్కు రూ.260, రీవాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.1,300లు ఆన్లైన్లో చెల్లించాలి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. నెల్లూరులో పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థినులు (ఫైల్)సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం స్థానం 2021 – 22 25,374 14,791 58 4 2022 – 23 25,535 17,042 67 4 2023 – 24 24,620 17,100 69 8 2024 – 25 26,272 19,282 73 7 2025 – 26 25,147 19,682 78 7 2021 – 22 25,576 17,190 67 3 2022 – 23 22,789 17,438 77 4 2023 – 24 21,293 17,292 81 6 2024 – 25 22,720 19,848 87 5 2025 – 26 24,141 19,771 82 9 విద్యార్థుల సత్తా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు అత్యధికంగా వెంకట్ చేతన్ శ్రీధర్రెడ్డి 468, మన్నే సహస్ర దీక్షితరెడ్డి, పెంచల జస్విత, మనోజ్ఞ, మునిశశాంక్, పూర్వికాక్షయ, మోక్షితలక్ష్మి, వైష్ణవి, సాత్విక్రెడ్డి, సంకీర్తన 467 మార్కులు, ఛాయశ్రుతి, ఎన్.చరణి 466, నవదీప్, రోషిణి అనుజ్ఞ, వెంకట ధర్మేంద్ర, ప్రవీణ్కుమార్, ఓంకారేశ్వర్, హిమవర్షిణి, సాత్విక్ 465 మార్కులు, బైపీసీలో 455 మార్కులకు తుమ్మల లలిత 452, నిశాంత్, లక్ష్మీప్రణీత, జవేరి లాస్య, వసుధ హర్షిణి 451 మార్కులు, మహిశ్రీ, సిద్ధిఖ్లు 450 మార్కులు సాధించారు. సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1,000 మార్కులకు దివ్య ముత్యాల 992 మార్కులు, కావ్య హరి, నాగహేమంత్, నాగలక్ష్మి సువిధ 991, సీహెచ్ శరణ్య 988, బైపీసీలో షేక్ తస్లీమ్ 990, దేవ హర్షిణి 989 మార్కులు సాధించారు.ఐదేళ్లుగా ప్రథమ సంవత్సర ఫలితాలిలా.. -
నేటి నుంచి 15 రోజులపాటు స్వీయ గణన
నెల్లూరు(దర్గామిట్ట): కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన విధానాన్ని జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి అమలు చేయనున్నట్లు డీఆర్వో విజయ్కుమార్ బుధవారం తెలిపారు. ప్రజలు తమ వివరాలను https://se.census.gov.in Ððl-»Œæ-OòÜsŒæ §éÓÆ> çÜÓĶæ$…V> ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MýS$¯ól AÐ]l-M>Ôèæ… MýSÍ-µ-çÜ$¢-¯]l²r$Ï ÐðlÌSÏ-yìl…-^éÆý‡$. MýSÌñæ-MýStÆŠ‡ íßæÐ]l*¯]l$Û Ô¶æ$M>Ï B§ól-Ô>-ÌS™ø ïÜÓĶæ$ f¯]l-VýS-׿¯]l M>Æý‡Å-{MýS-Ð]l$…Oò³ A«¨M>-Æý‡$-ÌS™ø yîlBÆøÓ º$«§ýl-ÐéÆý‡… ¯ðlË*ÏÆý‡$ ¯]l$…_ sñæÍM>-¯]l¹-Æð‡¯ŒSÞ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$™èl* Ð]l¬…§ýlçÜ$¢V> D¯ðlÌS 16 ¯]l$…_ 30Ð]l ™ól© Ð]lÆý‡MýS$ ïÜÓĶæ$ VýS׿-¯]lMýS$ AÐ]l-M>Ôèæ… MýS͵…_-¯]lr$Ï ™ðlÍ-´ëÆý‡$. {ç³fË$ D AÐ]l-M>-Ô>°² ѰÄñæ*W…^èl$MýS$° ™èlÐ]l$ MýS$r$…º ÑÐ]l-Æ>-ÌS¯]l$ Ððl»Œæ-OòÜsŒæÌZ çÜÓĶæ$…V> ¯]lÐðl*§ýl$ ^ólĶæ*ÌS° çÜ*_…-^éÆý‡$. f¯]lVýS-׿¯]l §éÓÆ> õÜMýS-Ç…^ól çÜÐ]l*-^éÆý‡… {糿¶æ$™èlÓ ç³£ýl-M>ÌS Æý‡*ç³-MýS-ÌSµ-¯]lMýS$ Eç³-Äñæ*-VýS-ç³-yýl$™èl$…-§ýl-¯é²Æý‡$. -
పోలీసులు సీజ్ చేసిన బోట్లు దొంగతనమా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబునాయుడు మత్స్యకారులకు మేలు చేయకపోగా వారి కడుపు మీద కొడుతున్నాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించిన అనంతరం అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఇది మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియా. ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు ఎవరూ రాకూడదు. అందుకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినా వాటిని ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంత జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారికి కడుపు మండి వారే స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీజ్ చేసిన ఆ బోట్లను బీద సోదరులు కుట్ర పన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు బీద సోదరులు, ఆయన అనుచరుడు కొండూరు పోలిశెట్టి, అక్కడి బోటు యజమాని అశోక్ మధ్య జరిగిన సంభాషణ, వారి కాల్ డేటానే సాక్ష్యం. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు వస్తే, మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోయారు. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంతో మంది ఏకమయ్యారు. వారు కుట్ర పన్నినట్టు కాల్ డేటా ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీస్ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా.. పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనగా చూస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?’ అంటూ మండిపడ్డారు.ఫిషింగ్హార్బర్ మీకే.. ఇదే నా భరోసామీ అందరికీ భరోసా ఇస్తున్నా. కళ్లు మూసుకుని తెరిచే లోపల మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కు. ఈ ఫిషింగ్ హార్బర్ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగేలా ఒక్కో బోటుకు 10, 12 మందిని యజమానులను చేస్తాం. ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తాం. ఇక్కడ పాళెం మత్స్యకారులు కొంత మంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడిగారు. నాడు మన ప్రభుత్వంలో అడిగిన వారికి కాదనకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.ఈ ప్రభుత్వం మా కడుపు కొడుతోంది అన్నా..అన్నా.. ఇక్కడ హార్బర్కు 79 ఎకరాల స్థలం ఉందన్నా. ఆరు జిల్లాల్లో సుమారు 150 మరపడవలు ఉన్నాయి. కావలి నియోజకవర్గంలోని ఆరు తీర ప్రాంత పంచాయతీల్లో మరో వెయ్యి వరకు సంప్రదాయ పడవలు ఉన్నాయి. హార్బర్ అందుబాటులోకి వస్తే నిత్యం నాలుగు వేల మంది వరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. చేపలు ఆరబెట్టుకోవడం, ఐస్ ఫ్యాక్టరీలు, వలల రిపేర్లు, తదితర పనులకు ఉన్న స్థలం సరిపోదనుకుంటుంటే కూటమి ప్రభుత్వం హార్బర్ స్థలంలో సగం ప్రైవేట్ సంస్థకు కేటాయించడం అంటే హార్బర్ను పూర్తిగా మూసివేయడంతో సమానం. మీ హయాంలో 95 శాతం పూర్తయిన హార్బర్లో మిగిలిన ఐదు శాతం పూర్తి చేసి, అందుబాటులోకి తేకపోవడం మా కడుపులు కొట్టడమే. మీరే మాకు అండగా నిలబడి న్యాయం చేయాలన్నా. మావాళ్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయిన తర్వాత, ప్రాణాలకు తెగించి అక్రమంగా వేట సాగిస్తున్న కడలూరుకు చెందిన పడవలను పట్టుకుని నాలుగు జిల్లాల్లోని 160 గ్రామాలకు చెందిన మత్స్యకారులు వంతుల వారీగా కాపలా ఉంటే పోలీసుల సాయంతో పడవలు తప్పించేశారు. ఈ విషయంలో కూడా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా. – రామచంద్రయ్య, మత్స్యకారుడు, అన్నగారిపాళెం, కావలి రూరల్ మండలం ఇలాగైతే మేము బతకలేం జగనన్నా..అన్నా.. మీ హయాంలో హార్బర్ వచ్చింది. త్వరత్వరగా నిర్మాణం కూడా పూర్తి చేశారు. మాకు చాలా సంతోషం కలిగిందన్నా. హార్బర్ రాక ముందు మేము తెప్పల్లో వెళ్లి పది కిలోలు, 20 కిలోలు చేపలు తెచ్చుకునే వాళ్లం. వాటిని ఇక్కడ అమ్ముకునే వీలు లేక పల్లెలకు వెళ్లి అమ్ముకునేవాళ్లం. హార్బర్ వచ్చిన తర్వాత మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం అన్నా. వలసలు ఆగిపోతాయని, ఇక్కడే పని దొరుకుతుందని సంబర పడ్డాం. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం హార్బర్లో మిగిలిన కొద్దిపాటి పనులు నిలిపేసి, ప్రైవేట్ సంస్థకు భూములు ఇచ్చిందన్నా. మాకు ఆస్తిగా మీరు ఇచ్చిన హార్బర్ను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడితే ఎలా అన్నా? మీరే మా మత్స్యకారులకు న్యాయం చేయాలన్నా. హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మా పరిస్థితి ఏమిటన్నా.. ఇలాగైతే మేము బతకలేం జగనన్నా.– రంగయ్య, మత్స్యకారుడు, అలిచెర్ల బంగారుపాళెం, జువ్వలదిన్నె -
మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు: వైఎస్ జగన్
చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. కళ్లు మూసి తెరిచే లోపు మూడేళ్లు పూర్తవుతాయి. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు. వాటిని చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా లాక్కోలేరు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పనులు ప్రారంభించాం. దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. ఇది జరిగి రెండేళ్లయినా మత్స్యకారులకు అందుబాటులోకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియాలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు రాకూడదు. కఠిన నిబంధనలు ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు వచ్చి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్లకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారే స్వయంగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బోట్లను సీజ్ చేశారు. దీంతో బీద సోదరులు కుట్ర పన్నడం.. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు రావడం.. మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోవడం చూస్తున్నాం. ఇందుకు బీద అనుచరుడు, బోట్ యజమాని మధ్య జరిగిన కాల్డేటానే సాక్ష్యం.మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు పలువురు ఏకమవ్వడం దుర్మార్గం. ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనా? చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి కడుపుపై తంతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.20 వేల కోట్లతో ఆ పనులన్నింటికీ శ్రీకారం చుట్టాం. అవే కాకుండా అదనంగా మరో రూ.6 వేల కోట్లతో మొత్తంగా రూ.26 వేల కోట్లతో పోర్టులకు సంబంధించి విస్తరణ ప్రణాళిక కూడా సిద్ధమైంది. మా హయాంలోనే దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. 2024 మార్చి 12న ఎన్నికల కోడ్ రావడంతో ప్రత్యక్ష ప్రారంభానికి వీలుపడలేదు. అదే ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రెండేళ్ల క్రితమే జాతికి అంకితమైన ఈ ఫిషింగ్ హార్బర్ను దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అప్పగించకుండా కుట్రలతో వ్యవహరిస్తోంది’ అని నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మమేకమయ్యారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. రెండేళ్లయినా ఇంత వరకు దీనిని గంగపుత్రులకు అప్పగించకుండా వారి పొట్ట కొట్టేందుకు చంద్రబాబు సర్కారు హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ‘జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమే కుట్ర చేస్తోంది. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మేము రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని అక్కడి నుంచి తరిమేస్తాం. రాష్ట్రంలోని 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు, ఆస్తి. వాటిని ఎవరూ సొంతం చేసుకోలేరు. మత్స్యకారులందరినీ పక్కాగా మ్యాపింగ్ చేసి, ఆర్థిక తోడ్పాటు అందించి.. ఆ హార్బర్ల పరిధిలోనే మెకనైజ్డ్ బోట్లకు యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..జువ్వలదిన్నె హార్బర్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతున్న మత్స్యకారులు, అశేష జనవాహినిలో ఒక భాగం రూ.26 వేల కోట్లతో పనులు ⇒ రాష్ట్రంలో ఎంత ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయనడానికి ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉదాహరణ. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం. ⇒ ఇప్పటికే మూలపేట, మచిలీపట్నం పనులు 35 శాతం పూర్తి కాగా, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫిషింగ్ హార్బర్లలో జువ్వలదిన్నెను కూడా పూర్తి చేశాం. రాష్ట్రంలో అంతకు ముందు 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే, కొత్తగా మరో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టాం. వాటి ద్వారా వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగు పడాలని రాష్ట్రవ్యాప్తంగా ఒక మ్యాప్ గీసి పనులు చేపట్టాం. ఎక్కడెక్కడైతే మత్స్యకారులున్నారో వాళ్లందరికీ హక్కుగా ఫిషింగ్ హార్బర్లు రావాలి.⇒ దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే వీట న్నింటికీ వేగంగా అడుగులు ముందుకు పడ్డాయి. పోర్టులకు సంబంధించి కీలకమైన భూ సేకరణలు కూడా పూర్తి చేసి, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చాం. ఈ పోర్టులన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంకు రుణాలను సైతం దీనికి టై అప్ చేశాం. ఫైనాన్సియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి, మారిటైమ్ బోర్డు క్రియేట్ చేశాం. అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయాం. ⇒ రామాయపట్నం పోర్టులో దాదాపు 95 శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేశాం. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో కీలకమైన భూసేకరణతో పాటు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్ కూడా పూర్తి చేసి, ఆ ప్రాజెక్టులో కూడా దాదాపు 35 శాతం పనులు వేగంగా పరుగెత్తించగలిగాం. అప్పటికే పనులు మొదలయ్యాయి. బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్లు పనులు చేసుకుంటూ పోతే చాలు ప్రాజెక్టుకు ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి వాటిని తీసుకొచ్చాం. ⇒ మచిలీపట్నంలో కూడా భూ సేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులూ తీసుకొచ్చి బ్యాంకులతో టై అప్ చేసి, లోన్లన్నీ శాంక్షన్ చేయించాం. మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు చేసి, దాంట్లో కూడా దాదాపు 35 శాతం పనులు మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కాకినాడ వద్ద ఇంకో ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు మొదలు పెట్టింది. ప్రైవేట్ పోర్టు పక్కన పెడితే ప్రభుత్వ రంగంలో ఉన్న 3 పోర్టుల పనులు రెండేళ్లవుతున్నా ఎందుకు జరగడం లేదు? దీనిపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా. ఇవి కాకుండా దాదాపు రూ.3,800 కోట్లతో మొదలు పెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు. ఇందులో జువ్వలదిన్నె ప్రాజెక్టు ఒకటి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద మత్స్యకారులుచంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం ⇒ చంద్రబాబును రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చీదరించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అని, బాండ్లు అని ఇంటింటికీ తిరిగి అందరినీ మోసం చేశాడు. ఎన్నికలైపోయిన తర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేశాడు. చివరికి పలావు పోయింది. బిర్యానీ పోయింది. ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు. మరో వైపు చూస్తే గవర్నమెంట్ బడులు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతున్న దుస్థితి. మనం గోరు ముద్ద పథకం అమలు చేస్తే, ఈ రోజు చిన్నారులకు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనపడాల్సిన చోట, ఇంగ్లిష్ మీడియం బోధన జరగాల్సిన చోట.. ఈ రోజు నాసిరకం చదువులు అందుతున్నాయి. పడకేసిన ఆరోగ్యశ్రీ.. మెడికల్ కళాశాలలు నిర్వీర్యం ⇒ ఆరోగ్య శ్రీ పథకం పడకేసింది. రూ.లక్షలు కడితే తప్ప పేదవాడికి వైద్యం అందని పరిస్థితి. ఈ రోజు కూడా ఇక్కడికి ఒకరు బోర్డు పట్టుకుని వచ్చారు. నా పరిస్థితి ఇలా ఉందన్నా.. మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉందన్నా.. అని బోర్డు పట్టుకుని నన్ను కలిసి గోడు చెప్పుకున్నాడు. అదే మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. 3,300 ప్రొసీజర్లతో ఏ పేద వాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా చిక్కని చిరునవ్వుతో వైద్యం అందించే పరిస్థితి ఉండింది. ఈ రోజు పేదవాడికి వైద్యం అందించడానికి నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేస్తున్న పరిస్థితి. వైద్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పాల్సిన పని లేదు. ⇒ ఉచిత పంటల బీమా గాలికెగిరి పోయింది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఆ రోజు అక్కచెల్లెమ్మలకు అన్ని పథకాలు అందిస్తూ.. సున్నా వడ్డీ పథకం సైతం అందించాం. ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకమూ అందక.. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా తీసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రజలు చంద్రబాబును తిడుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రభుత్వాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే వస్తాయి. మత్స్యకారుల అభివృద్ధి గురించి ఒక్క రోజైనా ఆలోచించారా? ⇒ తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్టులతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఫిషింగ్ హార్బర్.. వీటన్నింటి ద్వారా మత్స్యకారులకు మేలు జరిగేలా బ్లూ ఎకానమీని బిల్డ్ చేసేలా అడుగులు ముందుకు వేశాం. అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఏ రోజూ కూడా మత్స్యకారుల గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని ఏ రోజూ ఆలోచించ లేదు. ఏ రోజూ వాళ్లకు మంచి జరిగేలా కార్యక్రమం చేయలేదు. ⇒ నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగన్ చేసిన పని.. జువ్వలదిన్నెలో ఇక్కడే కనిపిస్తోంది. ఈ జువ్వలదిన్నె ప్రాజెక్టు తయారై రెండేళ్లు అవుతోంది. నేను 2024 మార్చి 12న ఈ ప్రాజెక్టును వర్చువల్గా జాతికి అంకితం చేస్తే, ప్రధాని మోదీ అదే ఏడాది ఆగస్టులో జాతికి అంకితం చేశారు. అలాంటి దీనిని కూడా మత్స్యకారులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? చంద్రబాబు గారూ సమాధానం చెప్పండి.జువ్వలదిన్నె హార్బర్లో నిలిపి ఉన్న బోట్లను పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రెండేళ్ల నుంచి ఎందుకంత తాత్సారం?⇒ కాసేపటి క్రితం ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను రాష్ట్రం మొత్తానికి చూపించాం. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయినా కూడా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాక పోవడం దారుణం. ⇒ బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కు సంబంధించి 62 శాతం పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ పనులు కూడా దాదాపు 57 శాతం పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే 56 శాతం పూర్తయ్యాయి. ⇒ మరో వైపు రెండో దశ కింద శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాళెం, మంచినీళ్లపేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, బాపట్ల జిల్లా వాడరేవు, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. ఇవి కాకుండా దాదాపు రూ.150 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. విశాఖపట్నం జిల్లా భీమిలి, విజయనగరం జిల్లా చింతపల్లి, అనకాపల్లి జిల్లా రాజులపేట, దొండవాక, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పల్లంకలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేసే వాళ్లం⇒ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, చిల్ రూమ్స్, ఐస్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్స్.. ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ మెషీన్లు, గేర్ షెడ్ల వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఫిషింగ్ హార్బర్లో ఈ వసతులన్నీ ఉంటాయి. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏడాదికి దాదాపు 41 వేల టన్నుల మత్స్య సంపద వస్తుంది. మత్స్యకార అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరిగేలా వారికి ప్యాకింగ్, మార్కెటింగ్, వేల్యూ ఎడిషన్లో, ఫుడ్ స్టాల్స్లో పని దొరుకుతుంది. ఈ రకంగా పెద్ద ప్రణాళిక చేశాం. ⇒ ఇక్కడ ఏకంగా 1,250 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారులు హక్కుగా పొందాలని ఆరాటపడ్డాం. ఒక్కో బోటుకు 12–15 మంది వరకు గ్రూపు చేసి వారిని ఓనర్లుగా చేయాలని భావించాం. వారు 10 శాతం చెల్లిస్తే, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 40 శాతం లోనుగా ఇప్పిస్తామని చెప్పాం. ఈ ఆదాయమంతా ప్రతి మత్స్యకారుడికి చెందాలని, వారి కుటుంబాలు బాగుండాలని కలలు కన్నాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే మత్స్యకారులందరికీ బోట్లు అంది ఉండేవి. 1,250 మెకనైజ్డ్ బోట్లకు దాదాపు 20 వేల మంది మత్స్యకారులు ఓనర్లు అయ్యేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. అయితే మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా మత్స్యకారుల నుంచి లాక్కోలేరని హెచ్చరిస్తున్నా.⇒ ఇక్కడ హార్బర్ కోసం సేకరించిన భూములను ప్రైవేట్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టి మత్స్యకారులను తరిమేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడు. 79 ఎకరాల్లో సగం భూములు ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి కేటాయించి, దోపిడీ కార్యక్రమం చేపట్టారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కావాల్సినన్ని భూములున్నాయి. అక్కడ ప్రైవేట్ సంస్థకు కేటాయించకుండా హార్బర్ భూములనే కట్టబెట్టడం వెనుక ఆంతర్యం గ్రహించాలి. ఇదంతా మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసే కార్యక్రమం. మత్స్యకారుల కోసం జగన్ భూములు సేకరించి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే, చంద్రబాబు వారిని తరిమేసి ప్రైవేట్ వారికిచ్చి దోచుకునే కార్యక్రమానికి తెర లేపాడు. -
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
జగన్ పర్యటన.. జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు రూరల్: మత్స్యకారుల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఇవాళ(బుధవారం) పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తోంది.జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బయటి నుంచి వచ్చే పడవలకూ మద్దతు ఇస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనలకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది. ఫిషింగ్ హార్బర్ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మత్స్యకారులను సైతం అటువైపు అనుమతించడం లేదు. చివరకు మీడియాకు సైతం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షలపై వివరణ కోరితే.. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇదీ చదవండి: జువ్వలదిన్నెకు జగనన్న.. కూటమిలో ఉలిక్కిపాటు -
మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన యావత్ ఆంధ్రప్రదేశ్ తీరంలోని మత్స్యకారుల జీవితాలకు భరోసాగా నిలువనుందా? అంటే అవునని గంగపుత్రులతోపాటు వైఎస్సార్సీపీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. ఆయన చేసే దిశానిర్దేశంపైనే మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ తమ భావితరాల భవిష్యత్ కోసం అందుబాటులోకి తెచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం, తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న పుదుచ్చేరి బోట్లను వదిలేసేందుకు మంత్రి లోకేశ్ పోలీసులకు ఆదేశాలివ్వడం, టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు వదిలేయించడంతో ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో అర్థమవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. తమ జీవితాలను మార్చేందుకు వైఎస్ జగన్ పడిన కష్టాన్ని, విజన్ను వృథా కానివ్వమని, మా భవిష్యత్, మా నమ్మకం జగనేనంటున్నారు. మత్స్యకారుల బతుకులతో ఆడుకుంటూ, భవిష్యత్ను చీకట్లోకి నెట్టేసే ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నెలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని జువ్వలదిన్నెకు బయలుదేరుతారు. 10 గంటలకు జువ్వలదిన్నె హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఫిషింగ్హార్బర్ వద్దకు చేరుకుని 10.25 గంటల వరకు సందర్శిస్తారు. ఆ తరువాత 11.05 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని బెంగళూరుకు తరలి వెళుతారు.చంద్రబాబు/లోకేశ్ చేసిన ద్రోహం æగత ప్రభుత్వం ప్రారంభించి, పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సీఎం చంద్రబాబు, లోకేశ్, నేతలు ఈ క్రెడిట్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించి కుట్రలకు తెగించారు. ఫిషింగ్ హార్బర్కు కేటాయించిన 78.6 ఎకరాల్లో ముఖ ద్వార ప్రాంతంలోనే తొలి దశలోనే 29.5 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేసి ఒక్క రోజు ముందు వచ్చి శంకుస్థాపన చేసి మత్స్యకారుల భావితరాలకు సైతం ద్రోహం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్లతో పడుతున్న కష్టనష్టాల నేపథ్యంలో ఐదు నెలల క్రితం ప్రాణాలకు తెగించి కావలి మండలం పెద్దపట్టపుపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె ప్రాంతాల్లో నాలుగు పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు. అప్పట్లో మత్స్య శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళ బోట్ల యజమానులతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల నేపథ్యంలో మార్చి 12న జువ్వలదిన్నెకు వచ్చిన లోకేశ్ నాలుగు పాండిచ్చేరి బోట్లు వదిలేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులతో పెట్టుకుంటే ఇబ్బందని పోలీసులు చెప్పినా రెడ్బుక్ రాజ్యాంగం మత్తులో ఉన్న లోకేశ్ అదంతా నేను చూసుకుంటానని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రను మార్చి 17న నెల్లూరుకు పంపించి, మత్స్యకారులకు మేలు చేస్తున్నామంటూ మీటింగ్ పెట్టించారు. స్థానికుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు సహకారంతో అదే రోజు రాత్రి నాలుగు పాండిచ్చేరి బోట్లను వదిలేయించి ఏకంగా ఆత్మస్థైర్యంపైనే దెబ్బ కొట్టారు.ఫలితం ఏమిటంటే.. ఐదు నెలలుగా స్థానిక మత్స్యకారుల నిర్బంధంలో పాండిచ్చేరి బోట్లు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడిన తమిళ జాలర్లు.. బోట్లు విడుదల చేసిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా తీరం వైపు దూసుకొచ్చి ఆంధ్రా మత్స్యకారులకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేసిన మేలు తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, భావితరాల భవిష్యత్ను ఉజ్వలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక అభివృద్ధి చేపట్టారు.బతుకు దెరువుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గుజరాత్ వంటి పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే మత్స్యకారులు, యువతకు స్థానికంగానే వేట, ఉపాధి కలి్పంచేందుకు జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టారు. దానికి అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కలి్పంచారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయంచంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రభుత్వం చేయాల్సిన పని మేం చేసి తమిళ రాష్ట్రాల సోనాబోట్లను పట్టుకుంటే వాటిని ప్రభుత్వ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా విడిచి పెట్టి ఏం తెలియనట్లు నాటకాలాడుతున్నారు. అదేమంటే మంత్రుల కమిటీ వేశామని బుకాయిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా ఉంటుంది. మత్స్యకారులకు జగనన్నే అండ. – కొండూరి అంకయ్య, ఎంపీటీసీ, పాకలఆర్థికంగా నష్టపోయాం సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయాం. సోనాబోట్లను అడ్డుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. చివరికి మేం సమష్టిగా వెళ్లి 4 సోనాబోట్లను తెచ్చి జువ్వలదిన్నె హార్బర్లో ఉంచితే వాటిని ప్రభుత్వ పెద్దలు కుటిల రాజకీయంతో విడిపించి మాకు తీరని ద్రోహం చేశారు. మత్స్యకారులకు మొదటి నుంచి జగనన్న అండగా ఉన్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు మేలు జరుగుతుంది. – కాటంగారి చిట్టిబాబు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, పోతయ్యగారిపట్టపుపాళెం, పాకలమా గోడు ఆలకించరు ఇతర రాష్ట్రాల సోనాబోట్ల వల్ల తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా మా గోడు పట్టించుకోలేదు. మేం చందాలు వేసుకుని నిధులు సమకూర్చుకుని సోనాబోట్లపై ప్రాణాలకు తెగించి దాడి చేసి వాటిని పట్టుకుంటే ప్రభుత్వ పెద్దలు ఏం ఎరగనట్లు కుట్రలు పన్ని వాటిని విడిపించి మాకు తీరని ద్రోహం చేశారు. ప్రభుత్వ పెద్దలు మాకు మభ్య పెట్టే మాటలు చెబుతున్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా లభిస్తుంది. – వాయిల రామ్మూర్తి, మాజీ కాపు, పోతయ్యగారిపట్టపుపాళెం, పాకలటీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ మా భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ ఐదేళ్లు అధికారంలో ఉంటే.. అందరితోపాటు సమానంగా సంక్షేమ పథకాలు, మా మహిళలకు పొదుపు రుణాల మాఫీ, మా బిడ్డలకు అమ్మఒడి, ఫీజురీయింబర్స్మెంట్, మాకు వేట నిషేధ సమయంలో ఏటా రూ.10 వేలు లెక్కన ఠంచన్గా అందించారు. చంద్రబాబు రూ.20 వేలిస్తామని చెప్పినా.. సగం మందికి కూడా రావడం లేదు. ఈ సమస్యలన్నీ జగన్కు వివరించి పరిష్కారం కోరాలని మత్స్యకారులందరూ ఎదురు చూస్తున్నారు. – వాయిల శ్యామ్, మార్కండేయపురం, తుమ్మలపెంట పంచాయతీ


