breaking news
SPSR Nellore
-
ఇసుకపల్లి బీచ్లో మరో మృతదేహం లభ్యం
నెల్లూరు: ఇసుకపల్లి బీచ్లో మరో మృతదేహం లభ్యమైంి నిన్న(శుక్రవారం, జనవరి 16వ తేదీ) ఇసుకపల్లి బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థలు వెళ్లగా వారిలో నలుగురు గల్లంతయ్యారు. నిన్ననే మూడు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం, జనవరి 17వ తేదీ) మరో మృతదేహం లభించింది. ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభించగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్కు ఆరుగురు యువకులు వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిషేక్, జి సు«దీర్ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. ఈరోజు మరో మృతదేహం లభించింది. -
ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
ఉదయగిరి: మండలంలోని దాసరపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాహెరా అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు మజహర్ (18) తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం నిమిత్తం చైన్నె తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తల్లీ, కుమారుడి మృతితో దాసరపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలోని తూపిలిపాళెం సముద్ర తీరంలో సందడి నెలకొంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల నలుమూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సముద్ర స్నానాలను ఆచరించి.. వనభోజనాలు చేశారు. యువత కేరింతలు కొడుతూ ఆటపాటలతో గడిపారు. – వాకాడుతీరంలో సందడే.. సందడి -
వస్త్ర దుకాణంలో భారీ చోరీ
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని రాజావీధిలో గల ఓ వస్త్ర దుకాణంలో భారీ చోరీ గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గూడూరు ఒకటో పట్టణ పోలీసుల వివరాల మేరకు.. రాజావీధిలోని ఓ వస్త్ర దుకాణంలోకి వెనుక వైపు నుంచి ఓ దుండగుడు దూరాడు. ముందు రోజు విక్రయాలకు సంబంధించిన నగదును గల్లా పెట్టెలో యజమాని ఉంచి వెళ్లారు. ఈ క్రమంలో దాన్ని దుండగుడు పగలగొట్టి అందులో ఉన్న రూ.నాలుగు లక్షలను చోరీ చేశాడు. దుకాణానికి ఉదయం వచ్చిన యజమాని.. చోరీ విషయాన్ని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకొని వివరాలను పోలీసులు సేకరించారు. సీసీ టీవీని పరిశీలించగా, అందులో చోరీ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఈ దిశగా విచారణ జరుపుతున్నారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించింది. చోరీలో ఎంత మంది పాత్ర ఉందనే విషయాలను త్వరలోనే తెలియజేసి, కేసును ఛేదిస్తామని తెలిపారు. -
పండగ వేళ.. విషాద ఘోష
అల్లూరు: వారంతా పండగ సంబరాలకు బంధువుల ఇళ్లకు వచ్చి సరదాగా గడుపుదామనుకున్నారు. ఒడ్డున ఆడుకుంటూ ఉండగా కనికరం లేని సముద్రుడు కబళించేశాడు. మండలంలోని ఇస్కపల్లి తీరంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అల్లూరు మండలం నార్త్ ఆములూరులోని గొల్లపాళెంలోని చైల్డ్ ఆశ్రమంలో చదువుకుంటున్న ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు. వీరు అల్లూరుపేటలో జరిగిన పోలేరమ్మ తిరునాళ్లకు వచ్చి, ఎర్రపుగుంటలోని తమ అన్న, వదిన ఇంటికి వెళ్లారు. అక్కడ తమ స్నేహితులైన ఇస్కపల్లి పంచాయతీ ఆదిరాఘవపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొమరగిరి అభిషేక్ (16), చేజర్ల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న గంధళ్ల సుధీర్ (15), ఈగ చిన్నబయ్య, శిరసనంబేటి వెంకటేశ్వర్లుతో కలిసి సరదాగా గడుపుదామని శుక్రవారం మధ్యాహ్నం ఇస్కపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. విషాదం ఇలా జరిగింది మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆరుగురు యువకులు స్నానానికి సముద్రంలోకి దిగారు. అమ్ములు, బాలకృష్ణ, అభిషేక్, సుధీర్ ఒకవైపు.. మిగిలిన ఇద్దరు మరో వైపు స్నానం చేస్తున్నారు. అయితే సముద్ర గర్భంలోని లోతైన గుంతను గమనించని ఈ నలుగురూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. పక్కనే ఉన్న చిన్నబ్బయ్య, వెంకటేశ్వర్లు గమనించి కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు రంగంలోకి దిగారు. కొద్ది సేపటికే అమ్ములు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గాలింపు చేపట్టిన మత్స్యకారులకు బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన అభిషేక్, సుధీర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనాథలైన తోబుట్టువులు మరణం.. మృతి చెందిన అమ్ములు, బాలకృష్ణ అనాథలు కావడంతో వారి మరణం స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది. తమ కళ్ల ముందే తోబుట్టువులను కోల్పోయి న మరో సోదరుడు చిన్నబ్బయ్య రోదనలు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించాయి. కాగా గల్లంతైన గంధళ్ల సుధీర్ తల్లిదండ్రులు, సోదరుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పండగ పూట చేతికి అందొచ్చిన పిల్లలు విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆదిరాఘవపురం, అములూరు గ్రామా ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ ఆనందం కాస్తాం విషాదంగా మారిందని ఇస్కపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ ఘటనా స్థలానికి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ శ్రీధర్, సీఐ పాపారావు, ఎస్సై శ్రీనివాసరెడ్డి, మైరెన్ ఎస్సై శేషయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారుల సాయంతో గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు వేగవంతం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మైరెన్ పోలీసుల భద్రతా వైఫల్యమే.. పండగ పూట నలుగురు పిల్లలు సముద్రంలో మునిగి చనిపోవడానికి మైరెన్ పోలీసుల భద్రతా వైఫ్యలమే అని ఇస్కపల్లి వాసులు మండిపడుతున్నారు. వారాంత సెలవులతోపాటు పండగల వేళ ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారని, వారికి జాగ్రత్తలు చెప్పడంతోపాటు పర్యవేక్షించాల్సిన పోలీసులు విధుల్లో ఉండకపోవడం వల్లే ఈ విషాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్కపల్లి తీరంలో నలుగురు బాలల గల్లంతు అన్నా చెల్లెళ్ల మృతదేహాల లభ్యం మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు మృతులందరూ గిరిజనులే మూడు కుటుంబాల్లో సంద్రమంత విషాదం పండగ పూట ఆ కుటుంబాల్లో అంతులేని కన్నీరు మిగిలింది. కడలి తీరంలో సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ పసిపాదాలు.. అలల సుడిగుండంలో కలిసిపోయాయి. అన్నా చెల్లెళ్ల బంధం అలల ఘోషలో జల సమాధి అయింది. పండగ అంటేనే కొత్త బట్టలు, సరదా ముచ్చట్లు. కానీ ఆ సముద్రుడు వారి ఆశలను కనికరం లేకుండా కబళించేశాడు. లోకం తెలియని వయసు.. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని ప్రాయం.. ఆ నలుగురు బాలలు నీటిలో గల్లంతవడంతో ఇస్కపల్లి తీరం కన్నీటి సంద్రమైంది. చేతికి అందొచ్చే కొడుకులు, కూతురు లేరన్న నిజం ఆయా కుటుంబాల్లో సంద్రమంత విషాదం నెలకొంది. పండగ సంతోషాలు నిండాల్సిన వేళ, ఆ ఇళ్లలో గుండెలు పిండేసే విషాద ఘోష మిగిలింది. -
పోలీస్ స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారు
● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి కే నారాయణ చిల్లకూరు: బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మార్చేశారని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. చిల్లకూరు మండలంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న నక్కల కాలువ కండిగ్ర భూముల్లో తానే ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. భూమిలో వరి సాగు చేయాలని పేదలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేద వానికి ఎక్కడా న్యాయం జరగడం లేదన్నారు. నక్కల కాలువ కండ్రిగలోని మిగులు భూములను పేదలు సాగు చేసుకుంటే వారిని పోలీస్స్టేషన్కు పిలిపించి బెదిరించడం దారుణమన్నారు. పేదలు సాగు చేసుకునేందుకు సిద్ధమైన భూమిని అధికార పార్టీ నాయకులు సాగు చేసుకుంటే వారిని మాత్రం ఏమి అనరు. భూములు ఏపీఐఐసీకి ఇచ్చినట్లు చెబుతున్నారని, అయినా సుమారు 10 ఎకరాల వరకు ఇంకా మిగులు భూమి ఉందన్నారు. ఇందులో పేదలు సాగు చేసుకుంటే పోలీసులకు వచ్చిన నష్టం ఏమిటని నారాయణ నిలదీశారు. ఈ భూములను టీడీపీ వారే ఆక్రమించుకునేందుకే పేదలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పేదలు సాగు చేసుకునే భూములను అడ్డుకుని ఇబ్బందులకు గురి చేస్తే పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పాలన సరిగా లేదని దేనికై నా సిపార్సులు తీసుకుని పోవాల్సి వస్తుందని, ఎదిరిస్తే అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందన్నారు. -
బంగారు హారం అపహరణ
నెల్లూరు(క్రైమ్): బంగారు హారం, కొంత బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. వివరాలు.. పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ జిల్లాకు చెందిన శంకర్ మండల్ ఉపాధి నిమిత్తం నెల్లూరుకు ఆరేళ్ల క్రితం వచ్చారు. కామాటివీధిలో నివాసం ఉంటూ ఇంట్లో బంగారు ఆభరణాలను తయారీ చేస్తున్నారు. ఈ తరుణంలో బంగారు హారాన్ని తయారు చేసివ్వాలంటూ ఆయనకు 70 గ్రాముల బంగారాన్ని అదే భవనంలో నివాసముంటున్న మగ్గన్రామ్ అందజేశారు. ఈ నేపథ్యంలో తన అసిస్టెంట్లు రోనిత్ మోస్సీ, రాకేశ్ బోల్తో కలిసి దీన్ని బుధవారం రాత్రి రూపొందించారు. ఆరేందుకు టేబుల్పై ఉంచి బెడ్రూమ్లోకి వెళ్లి నిద్రించారు. మరుసటి రోజు ఉదయానికి తలుపునకు వేసిన తాళం పగలగొట్టి ఉంది. టేబుల్పై బంగారు హారం, కొంత బంగారు.. ఇలా 70 గ్రాములు కనిపించలేదు. దీంతో చోరీ ఘటనపై సంతపేట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పొదలకూరు నిమ్మ ధరలు (కిలో) పెద్దవి: రూ.33 సన్నవి: రూ.20 పండ్లు: రూ.10 -
మద్యం మత్తులో ఇద్దరి వీరంగం
● అడ్డుకున్న కానిస్టేబుళ్లపై దాడి ● అదుపులోకి తీసుకున్న పోలీసులు కలిగిరి: పొద్దుపొద్దున్నే మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న చికెన్ దుకాణం వద్ద వీరంగం సృష్టించారు. అడ్డుకోబోయిన కానిస్టేబుళ్లపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కలిగిరి పోలీస్స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కలిగిరికి చెందిన సర్వేపల్లి బ్రహ్మయ్య, శేఖర్ మద్యం మత్తులో చికెన్ స్టాల్లో నాటుకోడి మాంసం కొనుగోలు విషయమై నిర్వాహకుడితో గొడవకు దిగారు. స్థానికులు సర్దిచెప్పబోగా వారితోనూ వాదనకు దిగారు. గొడవ జరుగుతున్న విషయం గమనించి స్టేషన్లోని కానిస్టేబుళ్లు దొరబాబు, అశోక్ వారికి సర్ది చెప్పడానికి చూశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయితే మద్యం మత్తు తలకెక్కిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపైనే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో పోలీసులపై తిరగబడడంతో మందుబాబులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మహాలక్ష్మమ్మ ఊరేగింపులో అశ్లీల నృత్యాలు ● అనికేపల్లిలో హిజ్రాలతో అభ్యంతరకర డ్యాన్సులు ● టీడీపీ నాయకుల అండతోనే అనుమతులు సాక్షి టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం అనికేపల్లిలో సంక్రాంతి ఉత్సవాల మాటున అశ్లీల నృత్యాలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతోనే నిర్వాహకులు హిజ్రాలను తీసుకు వచ్చి దేవతామూర్తుల ఉత్సవాల్లో అసభ్యకర రీతిలో నృత్యాలు వేయించారు. పండగ వేళ పాడు పనులను చేయించారని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా అనికేపల్లి మహాలక్ష్మమ్మ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అయితే గ్రామోత్సవంలో మహిళలు సైతం ఉన్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్సవాల రూపు మారింది. హిజ్రాలు వచ్చి అశ్లీలంగా నృత్యాలు చేయడం కనిపించింది. ఈ ఊరేగింపునకు హాజరైన యువకులు కొందరు అశ్లీల నృత్యాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అనికేపల్లిలో అసభ్య నృత్యాల వ్యవహారం వైరల్ అయింది. స్థానికంగా ఉన్న ముఖ్య నాయకుడే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మేదరమెట్ల / నెల్లూరు సిటీ: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాళెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత జాఫర్ షరీఫ్ (జకీర్) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. విజయవాడ వైపు నుంచి నెల్లూరు కారు వెళ్తోంది. ఈ క్రమంలో తిమ్మనపాళెం వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా సిమెంట్ దిమ్మెను ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతినింది. ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్ వైద్యశాలకు మేదరమెట్ల పోలీసులు హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జకీర్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారని ఎస్సై మహ్మద్ రఫీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారాయణ ఒంగోలులోని హాస్పిటల్కు వెళ్లారు. ఆయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం నెల్లూరు రూరల్: జకీర్ మృతి తనను తీవ్రంగా కలిచేసిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మంత్రి అండదండలతోనే?
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకాలో పచ్చ తమ్ముళ్ల అహంకారం హద్దులు దాటింది. హైకోర్టు ఆదేశాలను పూచిక పుల్లలా తీసిపడేశారు. చట్టం ముందు అధికార పార్టీ ఆదేశాలే శాసనంగా మారాయి. ఖాకీల కళ్ల ముందే కోళ్లు కత్తులు దూశాయి. నోట్ల కట్టలు చేతులు మారాయి. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాతే బాహాటంగా కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సైన్యం పహారాతో బరుల వద్దకు సెల్ఫోన్లు నిషేధించి విచ్చలవిడిగా పందేలు నిర్వహించారు. గోదావరి జిల్లాలకే పరిమితమైన కోడిపందేల సంస్కృతిని నెల్లూరు జిల్లాలోకి దిగుమతి చేసి, కోట్ల రూపాయల పందేలను బహిరంగంగా జరిపారు. జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పందెంరాయుళ్లను తరలించుకొచ్చి మరీ పందేలు సాగించడంపై జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు.ఆత్మకూరు: హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఖాకీల మాటున ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నాగులవెలటూరు వాగు సమీపంలో శుక్రవారం కూడా యథేచ్ఛగా కోడిపందేలు సాగాయి. బుధవారం కోడిపందేలు సాగిన విషయం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయినా అధికార పార్టీ నేతలు ఆగలేదు. ఖాకీలు అడ్డుకోలేదు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కేవలం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గంలో గోదావరి జిల్లాల తరహాలో కోడి పందేల బరులు ఏర్పాటు చేయడం పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సైన్యంతో పక్కా నిఘా బుధవారం జరిగిన పందేలపై ‘సాక్షి’ కథనంతో అప్రమత్తమైన నిర్వాహకులు, తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి.. మరింత ‘కట్టుదిట్టంగా’ అక్రమాలకు తెరలేపారు. బరుల వద్దకు వెళ్లే దారుల్లో ప్రైవేట్ వ్యక్తులతో బందోబస్తు ఏర్పాటు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, సెల్ఫోన్లను లాక్కొని, ఒక్కో ఫోన్కు రూ. 20 వసూలు చేస్తూ ‘సమాంతర వ్యవస్థ’ను నడిపించారు. కోడి పందేల దృశ్యాలు బయటకు రాకుండా పక్కా ప్లాన్తో పందేలు కానిచ్చేశారు. సరిహద్దులు దాటొచ్చిన పందెం రాయుళ్లు జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పొరుగున ఉన్న రాయలసీమ జిల్లాల నుంచి కూడా పందెం రాయుళ్లు వాహనాల్లో తరలివచ్చారు. నిఘా వర్గాల కళ్లు కప్పేందుకు వాహనాలను ఊరి చివర నుంచి పొలాల వద్ద అక్కడక్కడ నిలిపి, ఎవరికీ అనుమానం రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బరుల వద్ద కోట్లా ది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు ఆనం ఇలాకాలో తమ్ముళ్ల ‘బరి’ తెగింపు బాహాటంగా పందెం బరులు ప్రైవేట్ సైన్యంతో పహారా.. బరుల వద్దకు సెల్ఫోన్ల నిషేధం కోట్లలో చేతులు మారిన పందెం సొమ్ము.. మామూళ్ల మత్తులో యంత్రాంగం జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల నుంచి పందెంరాయుళ్ల రాక ఒక వైపు కోడి పందేలపై కోర్టు ఆంక్షలు విధించినా జిల్లాలో మరెక్కడా లేని విధంగా కేవలం నాగులవెలటూరులోనే ఈ స్థాయిలో పందేలు జరగడం వెనుక అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీగా మామూళ్లు ముట్టాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ను వివరణ కోరగా, ‘మొన్న జరిగాయి. ఈ రోజు జరగలేదు. ఈ విషయమై చేజర్ల ఎస్సైను తీవ్రంగా మందలించడం జరిగింది. మరోసారి జరగకుండా చూడాలని హెచ్చరించాం.’ అంటూ ఆయన ఇచ్చిన వివరణపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో పందేలు రసవత్తరంగా సాగుతుంటే, ఉన్నతాధికారులకు సమాచారం లేదనడం వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రజలు మండి పడుతున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
● ముగ్గురికి గాయాలు జిల్లాలోని రహదారులు నెత్తురోడాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆటోను బైక్ ఢీకొనడంతో.. సంగం: ఆటోను బైక్ ఢీకొనడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కొడవలూరు మండలం నాయుడుపాళేనికి చెందిన దాసరి పోలమ్మ(65), మరికొందరితో కలిసి పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో గల ఆంజనేయస్వామి ఆలయానికి గురువారం రాత్రి వెళ్లారు. ఆపై అక్కడే నిద్రించారు. తెల్లవారుజామున స్నానం చేసిన అనంతరం కొడవలూరు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ తరుణంలో మండలంలోని తరుణవాయి వద్ద లారీని అధిగమించే క్రమంలో పొగమంచులో కనిపించక ఆటోను ఎదురుగా వస్తున్న ఓ బైక్ ఢీకొంది. ఘటనలో ఆటోలో కుడివైపు కూర్చొని ఉన్న పోలమ్మ తలకు గాయమైంది. వైద్యశాలకు తరలించేలోపే మృతి చెందారు. బైక్ను నడుపుతున్న తరుణవాయికి చెందిన వినయ్ స్వల్పంగా గాయపడ్డారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్సై రాజేష్ దర్యాప్తు చేస్తున్నారు. జహీర్ (ఫైల్) ఇందుకూరుపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని గంగపట్నంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మైపాడు చెందిన జహీర్ (23), కాలేషా పని నిమిత్తం గంగపట్నానికి బైక్పై వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఓ పాదచారిని ఢీకొన్నారు. దీంతో బైక్ పైనుంచి వీరు కిందపడిపోగా, పాదచారి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కాలేషా, జహీర్ను మైపాడులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు.. ప్రాథమిక వైద్యం అనంతరం కాలేషాను 108లో నెల్లూరు తరలించారు. కాగా జహీర్ శరీరంపై పెద్దగా గాయాల్లేకపోవడం, మద్యం సేవించి ఉండటంతో ఏ ఇబ్బందీ ఉండదని భావించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకె ళ్లారు. గురువారం ఉదయం స్పృహలోకి రాకపోవడంతో హుటాహటిన నెల్లూరు.. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం చైన్నె తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందంటూ తిరిగి పంపేయడంతో, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సై నాగార్జునరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. -
టీకేపాడు శోకసంద్రం...
ఆత్మకూరు: చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గిరిజనకాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. కాలనీకి చెందిన గంధళ్ల సుధీర్ (16) శుక్రవారం అల్లూరు మండలం ఇస్కపల్లి బీచ్ వద్ద గల్లంతైన విషయం తెలిసి స్థానికులు విషాదంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన గంధళ్ల పెంచలయ్య వ్యవసాయ కూలి పనులు చేస్తుండగా, అతని భార్య ఆశా కార్యకర్తగా చిరుద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వ్యవసాయ పనులకు వెళ్తుండగా, చిన్న కుమారుడు సుధీర్ను తల్లిదండ్రులు చదివిస్తున్నారు. చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పలువురు మిత్రులు ఇసుకపల్లి సముద్ర బీచ్ వద్దకు వెళ్తామని చెప్పడంతో తల్లిదండ్రులకు చెప్పాడు. తొలుత వారు నిరాకరించారు. అనంతరం మిత్రులే చార్జీలు పెట్టి తీసుకొని వెళ్లినట్లు సమాచారం. అల్లూరు మండలంలోని వీరి మిత్రులు తోడవ్వడంతో అందరూ బీచ్ వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో నలుగురు గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటావుటినా ఘటనా స్థలానికి వెళ్లారు. తమ కుమారుడిని చదివించి ఉన్నత స్థితిలో చూద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు సమాధి అయ్యాయి. -
నగర డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగర డీఎస్పీగా బాధ్యతలను దీక్ష శుక్రవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలను నగర ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. ఎస్పీ అజితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్, 2021 బ్యాచ్కు చెందిన ఈమె గ్రేహౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా విధులు నిర్వర్తిస్తూ, నెల్లూరు నగర డీఎస్పీగా నియమితులైన విషయం విదితమే. ఉత్సాహంగా ముగ్గుల పోటీలు వింజమూరు(ఉదయగిరి): సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలోని గోళ్లవారిపల్లిలో ముగ్గుల పోటీలను ఎమ్మెస్సార్ డెవలపర్స్ అధినేత మాధవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు గానూ పోటీలను నిర్వహించామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు, పీటీ నాయుడు, చిన్నవెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్షల్లో పైపందేలు
ఉదయగిరి: పచ్చనేతలు బరి తెగించారు. సంక్రాంతి సంబరాల పేరుతో కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించారు. బరుల నిర్వాహకులు పోలీసులకు మడుపులు ఇవ్వడంతో ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోడి పందేలు, పై పందేల్లో రూ.లక్షలు చేతులు మారాయి. పండగ ముందు రోజు వరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కోడి పందేలు నిర్వహిస్తే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ భోగి నాటికి చేతులు ఎత్తేశారు. ఉదయగిరి మండలం జి.చెరువుపల్లి సమీపంలోని కొండ ప్రాంతంలో పండగ మూడు రోజులు కోళ్ల పందేలు యథేచ్ఛగా సాగాయి. ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలు వారే కాకుండా బద్వేలు, మర్రిపాడు, దుత్తలూరు, సీతారామపురం తదితర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలి వచ్చారు. నిర్వాహకులు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని ఫొటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పక్కనే మద్యం విక్రయాలు నిర్వహించారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. కానిస్టేబుల్స్ పందెం జరిగే సమీప ప్రాంతానికి వచ్చి నిర్వాహకుడితో మాట్లాడి వెళ్లిపోడం విశేషం. దుంపవారిపల్లి, ఆర్లపడియ తదితర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరపురం, ఎన్బీ కాలనీ, మంగాపురం, బోయమడుగుల, విరువూరు కోటవర్ధనపల్లి, ఎన్.కొండాయపాళెం తదితర గ్రామాల్లో జోరుగా పందేలు జరిగినా పోలీసులు కన్నెత్తి చూడ లేదు. కలిగిరి మండలం వెంకన్నపాళెంలో కూడా మూడ్రోజులు జోరుగా కోడి పందేలు నిర్వహించారు. సీతారామపురం మండలం పబ్బులేటివారిపల్లి, దేవమ్మచెరువు, సీతారామపురం శివారు అటవీ ప్రాంతంలో నిర్వహించారు. -
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
● కుటుంబ బంధాలను గుర్తు చేసిన పెద్ద పండగ నెల్లూరు (బృందావనం): సంక్రాంతి.. కేవలం పిండి వంటలు, పంటల పండగ మాత్రమే కాదు. అది తరతరాల బంధాలను గుర్తుచేసే పర్వదినం. గురువారం మకర సంక్రాంతి సందర్భంగా నగర వాసులు తమ పితృదేవతలను స్మరిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కటై పూజలు నిర్వహించారు. పినాకినీ నది ఒడ్డున బోడిగాడి తోట (సమాధుల తోట)లో నిశ్శబ్దంగా నిలిచిన సమాధులు కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు సాక్ష్యాలయ్యాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ పితృదేవతల సమాధులను పూలతో అలంకరించారు. సమాధుల చెంత నిలిచిన ప్రతి కుటుంబంలో ఒకరు తండ్రిని గుర్తు చేసుకున్నారు. మరొకరు తల్లిని, మరికొందరు తాత ముత్తాతల చేతిపట్టుకు ని నడిచిన రోజుల్ని తలుచుకున్నారు. పెద్దలు చెప్పిన మాటలు, చూపిన బాట, జీవితానికి ఇచ్చిన దిశ.. ఇవన్నీ ఆ క్షణాల్లో మళ్లీ మనసుల్ని తాకాయి. తల్లిదండ్రులు పిల్లలకు తమ పెద్దల కథలు చెబుతూ ‘వీరే మన మూలాలు’ అంటూ పూర్వీకులను గుర్తు చేశారు. ఒక వైపు మధుర జ్ఞాపకాలతో చిరునవ్వులు, మరో వైపు వాటినే తలుచుకుని చెమ్మ గిల్లిన కన్నులు కనిపించాయి. ఆనంద భాష్పాలు, గత స్మృతులు కలిసిన ఆ క్షణాలు ప్రతి హృదయాన్ని తడి చేశాయి. పితృదేవతలకు ప్రీతికరమైన పిండి వంటలను సమర్పిస్తూ, మోకరిల్లి స్మరించుకున్నారు. తల్లిదండ్రులు, తాతముత్తాతల జ్ఞాపకాలను పిల్లలకు వివరించి, కుటుంబ బంధాల ప్రాధాన్యతను తెలియజేశారు. తమపై ఉన్న కుటుంబ బాధ్యతలను గుర్తు చేసుకుంటూ, పెద్దలు చూపిన బాటలోనే జీవించాలని సంకల్పించారు. సంప్రదాయాలు, కుటుంబ బంధాలను తెలియజేస్తూ మకర సంక్రాంతి పర్వదినం ఘనంగా జరుపుకున్నారు. -
అగ్నిప్రమాదంలో ఇళ్లు బుగ్గి
పేలిన గ్యాస్ సిలిండర్ ● మంటల్లో ఎనిమిది ఇళ్లు ● వీధిన పడిన నిరుపేద కుటుంబాలుసైదాపురం: అక్కడ నిరుపేద కుటుంబాలు ఉంటున్నాయి. వారికి రోజూ కూలీ పనులకు వెళ్తేనే పూట గడుస్తుంది. భోగి పండగ సందడిలో ఉండగా అగ్నిప్రమాదం జరిగి ఇళ్లన్నీ కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన సైదాపురం మండలంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఊటుకూరు గ్రామ సమీపంలో మిక్స్డ్ కాలనీ ఉంది. అక్కడున్న వారంతా కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. కొందరు రేకులు, మరికొందరు పూరిళ్లలో నివాసముంటున్నారు. భోగి పండగను చేసుకుంటున్న సమయంలో ఆ కాలనీకి చెందిన నక్కా ఏడుకొండలు రేకుల ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. మంటలు చెలరేగి చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయి. నక్కా నాగరాజు, నక్కా రమేష్, శైలజ, పొలుగోటి అంకయ్య, కె.వసంత, కుడుముల పోలయ్య, తిరిమలశెట్టి శీనయ్యకు చెందిన ఐదు రేకులు, మూడు పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. కాలనీవాసులు ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. గూడూరు ఫైర్స్టేషన్కు సమాచారం అందించడంతో ఇన్చార్జి విజయకుమార్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. రూ.లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెప్పారు. తహసీల్దార్ సుభద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులకు తక్షణ సహాయంగా 10 కేజీల బియ్యంతోపాటు, చాపలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని తెలిపారు. -
మోటార్బైక్ను ఢీకొట్టిన కారు
● మహిళ మృతిఉదయగిరి: మండలంలోని దాసరిపల్లి వద్ద బుధవారం రాత్రి మోటార్బైక్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెంంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దాసరిపల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సయ్యద్ మహబూబ్బాషా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబాన్ని స్వగ్రామం దాసరిపల్లి నుంచి ఉదయగిరికి మార్చాడు. మహబూబ్బాషా బుధవారం డ్యూటీకి వెళ్లాడు. భార్య సాహెరా (43) కుమారుడు మజహర్తో కలిసి బైక్పై పుట్టిల్లు దాసరిపల్లికి వచ్చింది. అక్కడ కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపింది. అందరూ కలిసి భోజనం చేశా రు. అనంతరం తల్లీకుమారుడు ఉదయగిరికి బయలుదేరారు. జాతీయ రహదారిపైకి వచ్చిన వెంటనే ఉదయగిరి వైపు నుంచి దుత్తలూరుకు వెళ్తున్న కారు.. బైక్ను ఢీకొట్టింది. దీంతో సాహెరా అక్కడికక్కడే మృతిచెందింది. మజహర్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారయ్యాడు. కారు వింజమూరు మండలం గుండెమడగలకు చెందిన వారిదిగా చెబుతున్నారు. -
గృహ నిర్మాణాలకు మోక్షం
పేదల గూడును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పొదలకూరు జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను తిరిగి నిర్మించేందుకు విజిలెన్స్, థర్డ్ పార్టీ నివేదికలు అందాయి. దాని ప్రకారం ఇళ్లను పూర్తి చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.పొదలకూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద ఊర్లనే నిర్మించి పేదలకు ఇళ్లు అందజేయాలని మూడు ఆప్షన్లను పెట్టి నిర్మాణం చేపట్టింది. జిల్లాలో కావలి తర్వాత పొదలకూరు ప్రభుత్వ లేఅవుట్ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద లేఅవుట్ను ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణం సొంతంగా నిర్మించుకోలేమని లబ్ధిదారులు సమ్మతిపత్రం అందజేశారు. గృహ నిర్మాణ శాఖ తొలివిడతగా 750 ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇక్కడ మొత్తం 1,400 ప్లాట్లు, ఒక్కొక్కరికి 9 అంకణాల వంతున అందజేయడం జరిగింది. లేఅవుట్లో కాంట్రాక్టర్లు 750 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 572 ఇళ్లకు శ్లాబులు, 268 ఇళ్లకు బేస్మట్టాలను పూర్తి చేశారు. పెద్ద లేఅవుట్ కావడంతోపాటు ప్లాట్ల నంబర్లు మారిపోవడంతో లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు సుమారు రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. లేఅవుట్లో విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి నిర్మాణాలను చేపట్టారు. విచారణ చేసి.. లేఅవుట్లో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించాల్సిందిగా విజిలెన్స్కు అప్పగించింది. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు పలుమార్లు లేఅవుట్కు వచ్చి విచారణ చేశారు. ప్లాట్ల నిర్మాణం, ఇళ్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, అర్హులైన వారికి ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై విచారణ నిర్వహించారు. దీంతో పేదల గూడుకు కష్టం వచ్చింది. విచారణ సాగదీత ధోరణలో ఉండటంతో నిర్మాణంలో మరింత జాప్యం జరిగింది. అయితే ఎట్టకేలకు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ద్వారానే రిపేర్లతోపాటు, పూర్తి చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు పద్ధతుల్లో.. ఇప్పటి వరకు నిర్మించిన 572 ఇళ్లలో 385 ఇళ్లకు రిపేర్లు చేపడితే వినియోగానికి పనికొస్తాయని థర్డ్ పార్టీ నివేదిక సమర్పించింది. ఇందులో భాగంగా క్యూరింగ్, క్రాక్స్, సాయిల్ ఫిల్లింగ్, కాంక్రీట్ బెడ్ పద్ధతుల్లో రిపేర్లు చేయాల్సి ఉంటుంది. నిర్మించిన వాటిలో 187 ఇళ్లు బాగున్నాయని వాటికి ఎలాంటి రిపేర్లు అవసరం లేదని నివేదికలో చెప్పారు. ఇక్కడి ప్రభుత్వ లేఅవుట్లో ఏడు కన్స్ట్రక్షన్ కంపెనీలు ముందుకొచ్చి ఇళ్లను నిర్మించడం జరిగింది. మండలంలోని నేదురుమల్లి, వెలికంటిపాళెం, మహ్మదాపురం గ్రామాల్లో లేఅవుట్లకు సంబంధించి థర్ట్ పార్టీ నివేదికలు అధికారులకు అందాల్సి ఉంది.ఇళ్లను నిర్మిస్తాం విజిలెన్స్, థర్డ్ పార్టీ నివేదికలు సమన్వయం చేసుకుని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. పొదలకూరు లేఅవుట్లో ఇళ్ల రిపేర్లతోపాటు, గతంలో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీల చేత పనులు పూర్తి చేయించడం జరుగుతుంది. కాంట్రాక్టర్లు రిపేర్లు చేసేందుకు, మిగిలిన ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చారు. – మహేష్, హౌసింగ్ ఏఈ, పొదలకూరు విచారణ పేరుతో ఆగిన పేదల ఇళ్ల నిర్మాణం కట్టిన వాటికి రిపేర్లు చేస్తే సరిపోతుందని నివేదిక 187 ఇళ్లకు మరమ్మతులు అవసరం లేదు గతంలో నిర్మించినవి కాంట్రాక్టర్లే పూర్తి చేయాలి త్వరలో అతిపెద్ద లేఅవుట్లో పనుల ప్రారంభం -
ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ , ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య డిమాండ్ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధీ పేరును తట్టుకోలేని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందన్నారు. దాని స్థానంలో వీబీ–జీ–రామ్జీ చట్టాన్ని తీసుకురావడం దారుణమన్నారు. జిల్లాలోని 200 గ్రామాల్లో ప్రజలు భోగి మంటల్లో కొత్త చట్టం ప్రతులను వేశారన్నారు. ఈ పథకం ద్వారా 200 రోజుల పనిరోజులు కల్పించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. కొత్త చట్టం ద్వారా వచ్చే ఇబ్బందులపై ఈనెల 18వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ ఉపాధి’ క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నాయకులు గోగుల శ్రీనివాసులు, దయాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
కోవూరు: పట్టణంలోని డొంకలో ఎడ్ల పోటీలను కోవూరు బండ్ల సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా బుధవారం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 40 జతల ఎడ్లు హాజరయ్యాయి. కోవూరుకు చెంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు, పక్క రాష్టాల్లో ఉన్న వ్యాపారులు, ఉన్నతోద్యోగుల సహకారంతో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్లకు కప్తో పాటు పారితోషికాన్ని అందజేశారు. మూడు కిలోమీటర్లు.. 4.59 నిమిషాల్లో ప్రకాశం జిల్లా పమిడిపాడుకు చెందిన అభయాంజనేయస్వామి ఎడ్ల జత మూడు కిలోమీటర్లను 4.59 నిమిషాల్లో చేరుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకూరుపేట మండలంలోని చాముండేశ్వరి సీ ఫుడ్స్కు చెందిన ఎడ్ల జట్టు 5.11.. ప్రకాశం జిల్లా పమిడిపాడుకు చెందిన నల్లబోతు సాయి హర్ష ఎడ్ల జట్టు 5.15 నిమిషాల్లో చేరుకొని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. నగదు బహుమతుల ప్రదానం ● ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.40 వేలు, కప్ను సులోచనమ్మ జ్ఞాపకార్థం భర్త అనపల్లి అశోక్కుమార్రెడ్డి అందజేశారు. ● ద్వితీయ స్థానం సాధించిన జట్టుకు రూ.25 వేలను జనార్దనం ఆదిశేషాచార్యులు, సరోజనమ్మ జ్ఞాపకార్థం కుమారుడు శ్రీకాంతాచార్యులు ప్రదానం చేశారు. రోల్డ్ కప్ను పెద్ది ప్రభావతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు మారుతీ నాగార్జున ఇచ్చారు. ● తృతీయ బహుమతిగా రూ.20 వేలను గాదిరాజు ప్రభాకర్రావు, కుమారుడు సురేష్బాబు జ్ఞాపకార్థం ఆయన తమ్ముడు గాదిరాజు జీవన్కృష్ణ అందజేశారు. రోల్డ్ కప్ను రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఇచ్చారు. ● కొడవలూరు మండలం యల్లాయపాళేనికి చెందిన అత్తిరాజు లాస్య ఎడ్లు 5.20 నిమిషాల్లో గమ్యస్థానం చేరాయి. నాలుగో బహుమతిగా రూ.15 వేలను ఇంతా కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం కుమారులు అందజేశారు. వీరికి కప్ను వరదయ్య జ్ఞాపకార్థం కుమారుడు కృష్ణచైతన్య కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. ● కోవూరు మండలం గంగవరానికి చెందిన తలారి శ్రీలక్ష్మి ఎడ్ల జత 5.37 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకొని ఐదో స్థానంలో నిలిచింది. వీరికి రూ.పది వేలను గడ్డం చిన్నవెంగళ్రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు అందజేశారు. కప్ను కై లాసం పద్మావతమ్మ జ్ఞాపకార్థం భర్త గోపాల్రెడ్డి అందజేశారు . పోలీసుల పర్యవేక్షణ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు. వీక్షించేందుకు పలువురు భారీగా తరలివచ్చారు. వేమారెడ్డి వినీత్రెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఎడ్ల బండ్ల సంఘ నేతలు పొబ్బా మల్లికార్జునరెడ్డి, దేవిరెడ్డి సురేష్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి, తాటిపర్తి విజయకుమార్రెడ్డి, అత్తిపల్లి అనూప్రెడ్డి, నరేంద్రరెడ్డి, మల్లారెడ్డి, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. గమ్యస్థానాన్ని చేరుకునేందుకు దూసుకెళ్తున్న ఎడ్లు -
పర్వతరెడ్డికి టాస్క్ఫోర్స్ కమిటీ బాధ్యతలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ ఫోర్స్ కమిటీలను పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల టాస్క్ఫోర్స్ బాధ్యతలను ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి అప్పగించారు. అక్కడ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి పనిచేయాలని సూచించారు. భోగి వేడుకల్లో వెంకయ్యనాయుడు వెంకటాచలం(పొదలకూరు): మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో భోగి మంటలను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం వేశారు. తన కుటుంబసభ్యులతో కలిసి పండగను జరుపుకొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు. సంక్రాంతిని సుఖసంతోషాలతో జరుపుకోవాలని కాంక్షించారు. సంక్రాంతిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి నెల్లూరు (వీఆర్సీసెంటర్): సంక్రాంతిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. కల్యాణ వైభోగమే..రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, గోదాదేవి కల్యాణాన్ని కనులపండువగా బుధవారం నిర్వహించారు. గోదాదేవి, పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను తిరుచ్చిపై కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మాడవీధుల్లో క్షేత్రోత్సవం, కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,014 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
తమ్ముళ్ల బరి తెగింపు
కోళ్ల పందేలపై హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ టీడీపీ తమ్ముళ్లు బరుల ఏర్పాటుకు బరితెగించారు. సంక్రాంతి సంబరాల ముసుగులో కోడి పందేలతో జూదగాళ్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరులో అధికార పార్టీ నేతల కోడి పందేల బరులు విచ్చలవిడిగా వెలిశాయి. పోలీసుల కళ్లుగప్పి కాదు.. ‘కళ్లు మూయించి’ సాగుతున్న ఈ తంతు న్యాయ వ్యవస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ముడుపుల మత్తులో ఖాకీలు కోడి పందేలను నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే క్షేత్రస్థాయిలో సీన్ దానికి పూర్తి భిన్నంగా ఉంది. పోలీసులకు లక్షలాది రూపాయల ముడుపులను నిర్వాహకులు చెల్లించి, వారిని అటువైపు రాకుండా మేనేజ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరినా, వందలాది మంది గుమిగూడినా కానిస్టేబుల్ కాదు కదా కనీసం హోం గార్డు సైతం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుకున్న మర్మమేమిటో అందరికీ అర్థమవుతోంది. ఆత్మకూరు: సంక్రాంతి వేళ కోడిపందేలను నిర్వహించొద్దంటూ ఆర్డీఓలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టారు. అయితే పోలీస్ వ్యవస్థనే సవాల్ చేస్తూ.. హైకోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇలాకా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం నాగులవెల్లటూరులో కోడి పందేల బరులను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో బరులను నెలకొల్పి రూ.కోట్లల్లో పందేలు ఆడించారు. జిల్లాతో పాటు సమీపంలోని రాయలసీమ జిల్లాల నుంచి వందలాది కార్లు, బైక్లలో పందెంరాయుళ్లు వచ్చారంటే ఇక్కడ ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ బరులకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రైవేట్ సైన్యాన్ని పహారా పెట్టి, ఎవరూ సెల్ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వచ్చే వారు సెల్ఫోన్లలో చిత్రీకరించొద్దని, ఫొటోలు తీయరాదని, స్విచ్ఛాఫ్ చేసుకొని మరీ వెళ్లాలని హెచ్చరించేందుకు, పరిశీలించేందుకు 20 మంది యువకులతో ఒక టీమ్ను ఏర్పాటు చేశారంటే కోడిపందేల నిర్వహణకు ఎంత పకడ్బందీగా సన్నాహాలు చేశారో ఇట్టే అర్థమవుతోంది. ఇదంతా పోలీస్ వ్యవస్థ కళ్లుగప్పి కాదు.. కళ్లు మూయించి ఆడించారనే ఆరోపణలూ లేకపోలేదు. నిబంధనలు గాలికి.. చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామ శివార్లలోని వాగు పరిసర ప్రాంతం మినీ క్యాసినోను బుధవారం తలపించింది. భోగి పండగ సాక్షిగా ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. స్థానికులే కాకుండా, పక్కనే ఉన్న రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 200కుపైగా కార్లలో సంపన్న జూదగాళ్లు తరలివచ్చారు. కోడి పందేలను హైకోర్టు నిషేధించినా, క్రూరత్వాన్ని అరికట్టాలని ఆదేశించినా.. ముడుపుల విందుల్లో మునిగిపోయి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ మాత్రం కత్తులు కట్టిన కోడి పుంజులు రక్తం చిందిస్తున్నాయి. ఎస్సై సమాధానం.. విడ్డూరంగా ఇంత బాహాటంగా పందేలు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎస్సై తిరుమలరావును సంప్రదించగా, ఆయన చెప్పిన సమాధానం విస్తుగొలుపుతోంది. తాను గ్రామంలోనే ఉన్నానని, ఎక్కడా పందేలు జరగడంలేదని, కేవలం గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కళ్లెదుటే వందలాది వాహనాలు, వేలాది మంది జూదగాళ్లు కనిపిస్తున్నా.. పోలీసులకు మాత్రం అంతా శాంతియుతంగా కనిపించడం గమనార్హం. మంత్రి ఆనం ఇలాకా నాగులవెల్లటూరులో కోడి పందేలు హైకోర్టు ఆదేశాలు బేఖాతర్.. చేతులు మారిన రూ.కోట్లు రాయలసీమ నుంచి క్యూ కట్టిన వందలాది వాహనాలు కేంద్రం చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం నుంచే ఆంక్షలు సెల్ఫోన్లపై రెస్ట్రిక్షన్స్.. ప్రైవేట్ సైన్యం పహారా ఖాకీల ‘ముడుపు’ల విందు -
సోమిరెడ్డీ.. జాగ్రత్తగా ఉండు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హితవు పలికారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టం చంద్రబాబు కాగా, జిల్లాకు పట్టిన దరిద్రం సోమిరెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమశిలకు తామెళ్లాలనుకుంటే అనుమతించలేదని, కండలేరుకు పది మందికి మించి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమన్నారు. తాము ప్రజల్లోకి వెళ్తుంటే టీడీపీ నేతలకు వణుకుపుడుతోందని విమర్శించారు. ప్రజలను తరలించాలంటే డ్రైవర్, క్లీనర్ మినహా మరెవరూ రావడంలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల ముఖం చూడాలంటేనే రైతులు ఇష్టపడటం లేదని చెప్పారు. లెక్కలు రాని వారు సైతం చెప్తున్నారని, తనకు చెప్తే మంచి నేర్పరిని పంపుతానని పేర్కొన్నారు. నీ బతుకు గురించి జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. నెల్లూరులోని శ్రీనివాసమహల్లో బ్లాక్ టికెట్ల నుంచి పేకాట, డైమండ్ డబ్బా ఆడించిన విషయం నిజం కాదానని ప్రశ్నించారు. అల్లీపురం కేంద్రంగా నకిలీ ఎరువులను ఎవరు తయారు చేసి రైతులకు అంటగట్టారో కూడా తెలుసునన్నారు. క్రీడల శాఖ మంత్రిగా ఉండి క్రికెట్ కిట్లను అమ్ముకున్న ఘన చరిత్ర ఎవరిదని ప్రశ్నించారు. శివాలయ భూములను విక్రయిస్తూ.. గ్రావెల్, ఇసుక, బూడిద ఇలా అన్నింటినీ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ పనుల్లోనూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నీతో పోటీపడే వారెవరూ లేరన్నారు. పండగ సందర్భంగా ఇలా శని ఏమిటని ఎమ్మెల్యే సునీల్ బాధపడుతున్నారన్నారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని ఇంటికి తీసుకెళ్లి కాళ్లు పట్టుకొని టికెట్ సంపాదించిన వారు.. ఎన్నోసార్లు ఓటమిపాలై మొన్న గెలిచిన వ్యక్తి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తనపై విమర్శలు చేస్తే దీటుగా సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. -
కావలి వద్ద పట్టాలు తప్పిన రైలు.. పలు సర్వీసులు ఆలస్యం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. నెల్లూరులోని కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తున్న గూడ్స్ రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ కారణంగా ట్రాక్ కొంత భాగం దెబ్బతిన్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. దీంతో, ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. -
బాబూ.. ఓటుకు నోటు కేసు భయమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. -
రాజకీయ కక్షతో అక్రమ కేసులు
● మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ● పిన్నెల్లి సోదరులతో ములాఖత్ నెల్లూరు రూరల్: వ్యవస్థలను పనిచేయనీయకుండా.. రాజకీయ కక్షతో కేసులు, వేధింపుల పరంపరను టీడీపీ ప్రభుత్వం సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడితో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్రెడ్డితో కలిసి మంగళవారం ఆయన ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జూదాలు, కోడి పందేలు, ఆన్లైన్ గేమ్స్కు ప్రభుత్వం అనుమతిచ్చి ఆదాయం కోసం పాకులాడుతోందని మండిపడ్డారు. ఏ తప్పూ చేయని వారిని కేసుల్లో అక్రమంగా ఇరికించి జైళ్లలో బంధిస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలే పేర్కొనడం సర్కార్ వికృత చేష్టలకు పరాకాష్టగా అభివర్ణించారు. అనంతరం కాసు మహేష్రెడ్డి మాట్లాడారు. ఆధిపత్యం కోసం టీడీపీ వారే గొడవపడి చంపుకొంటే ఆ కేసును పిన్నెల్లి సోదరులపై బనాయించడం దుర్మార్గమన్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ వెల్లడించారని, అయితే అక్రమంగా కేసు పెట్టడం దారుణమని చెప్పారు. పిన్నెల్లి సోదరులు ఎంతో ధైర్యంగా ఉన్నారని వివరించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పల్నాడు జిల్లా కార్యకర్తల కోసం నిలుస్తామని, తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా ఎక్కడ ప్రశ్నిస్తారనే భయంతో కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమర్నాథ్రెడ్డి మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను విడనాడి ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. జైలు మాన్యువల్ మేరకు అధికారులు పనిచేయడంలేదని గౌతమ్రెడ్డి ఆరోపించారు. బయట భోజనానికి కోర్టు అనుమతిస్తే, అధికారులు మాత్రం ఇవ్వడంలేదని విమర్శించారు. -
భోగి మంటల్లో పీపీపీ జీఓలు
నెల్లూరు రూరల్: పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రతులను భోగి మంటల్లో వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దహనం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన కా ర్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణ మ్మ, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. నిత్యం అఘాయిత్యాలు, వేధింపులు జరుగుతున్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ప్రస్తుత సర్కార్ తీరుతో ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. అనంతరం వీరితో పాటు పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. -
సంక్రాంతిని సంతోషంగాజరుపుకోవాలి
నెల్లూరు రూరల్: సంక్రాంతిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. భోగభాగ్యాలతో తులతూగాలి నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో పంటలు సమృద్ధిగా పండి.. ప్రజలు, రైతులు భోగభాగ్యాలతో తులతూగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఓటీఎం కాంప్లెక్స్ ప్రారంభం ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్లో ఆపరేషనల్ ట్రెయినింగ్ మాన్యువల్ (ఓటీఎం) కాంప్లెక్స్ను తూర్పు ప్రాంత కోస్ట్ గార్డ్ కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్ ధతింధర్సింగ్ సైనీ మంగళవారం ప్రారంభించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రాజేష్ మిత్తల్, డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్స్ నంబర్ 6 కమాండర్ అజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెయింటేస్తూ.. పైనుంచి పడి ● యువకుడి మృతి కావలి (అల్లూరు): పెయింటేస్తూ కిందపడటంతో యువకుడు మృతి చెందిన ఘటన కావలి పట్టణంలోని టీచర్స్ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని అరుంధతీయపాళేనికి చెందిన కోడూరు రమేష్ (35) పెయింటర్. ఈ క్రమంలో కావలి ఏఎమ్సీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్రెడ్డి నివాసానికి పెయింటేస్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి.. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందారు. సుకుమార్రెడ్డి ఇంటికి పెయింటింగ్ వేస్తుండగా, రోప్ తెగి బిల్డింగ్ పైనుంచి జారిపడి మృతి చెందారంటూ కుటుంబసభ్యులిచ్చిన సమాచారం మేరకు కేసును కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి నమోదు చేశారు. పోస్ట్మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మృతుడికి భార్య, నాలుగు నెలల కుమార్తె ఉన్నారు. -
నెల్లూరు నగర డీఎస్పీగా దీక్ష
నెల్లూరు(క్రైమ్): నగర డీఎస్పీగా ఐపీఎస్ అధికారి దీక్షను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తూ సెలవులో ఉన్న సింధుప్రియను బదిలీ చేసింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీక్ష స్వస్థలం హరియాణాలోని రోహ్తక్. ఆమె భర్త ముఖేష్ ఆదాయ పన్ను శా ఖాధికారి. ఈమె 2016లో యూపీఎస్సీ రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిగా పీఎంఓలో విధులు నిర్వర్తించారు. ఆపై 2018లో సీఎస్ఈ, డీఏఎన్ఐపీఎస్ రాసి ఢిల్లీలో ఏసీపీగా పనిచేశారు. ఐపీఎస్ లక్ష్యంగా యత్నించారు. 2021లో 208 ర్యాంక్ సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. గుంటూరులో ట్రెయినీ ఐపీఎస్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ – 1గా పనిచేస్తూ నగర డీఎస్పీగా నియమితులయ్యారు. కాగా ఇక్కడ ఈ హోదాలో ఐపీఎస్ను నియమించడం ఇదే తొలిసారి. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 68,542 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 22,372 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.98 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. రెవెన్యూ వసూళ్లు వేగవంతం నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ నందన్ పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయ పరిధిలోని ప్రతి భవనం, అపార్ట్మెంట్, వ్యాపార, వాణిజ్య భవనాలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రూ.పది వేలకుపైగా ఆస్తి పన్ను బకాయి ఉన్న భవన యజమానితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా స్వయంగా తిరుగుతున్నామన్నారు. టీపీఆర్వో వాసుబాబు, అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ ఆఫీసర్లు సమద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం ఏరులై.. సూర్యుడు ఉదయయించక మునుపే..
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. నెల్లూరు నగరంలో వేకువజాము నుండే మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. సూర్యుడు ఉదయయించక మునుపే బార్ తెరుచుకుంది. ఉదయాన్నే హరినాధపురం సమీపంలోని పికాక్ బార్ అండ్ రెస్టారెంట్లో జోరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. షెటర్ పూర్తీగా తెరిచి మరీ విక్రయాలు జరుపుతున్నారు. సిట్టింగ్కు సైతం అనుమతి ఇచ్చేశారు. బార్ ముందు మద్యం మత్తులో ఓ వ్యక్తి తూలుతూ హల్చల్ చేశాడు. ఎక్సైజ్, పోలీస్ శాఖ అటువైపు కన్నెత్తి అయినా చూడటం లేదు.కాగా, రాష్ట్రంలో ఊరూరా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. ఏనీటైమ్ మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో లిక్కర్ సిండికేట్లు స్థానిక కూటమి నేతలతో కలిసి బడ్డీ దుకాణాల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. -
ఇతర రాష్ట్రాల్లో కార్ల చోరీలు
● నంబర్ ప్లేట్లు, రికార్డులు మార్చి అమ్మకాలు ● ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ● ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ● పరారీలో ప్రధాన నిందితుడునెల్లూరు(క్రైమ్): ఇతర రాష్ట్రాల్లో చోరీ చేసిన కార్లకు నంబర్ ప్లేట్లు మార్చి, నకిలీ రికార్డులతో విక్రయిస్తున్న ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ.1.20 కోట్ల విలువైన ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అజిత వేజెండ్ల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి (ప్రధాన నిందితుడు)కి బీవీ నగర్కు చెందిన కార్ల గ్యారేజీ నిర్వాహకుడు టి.శివ, తిరుపతిలోని ఓ కార్ల షోరూమ్లో పనిచేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన పి.లక్ష్మణ్ కుమార్లు స్నేహితులు. వారు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుడు ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కార్లను చోరీ చేసి నెల్లూరుకు తీసుకొచ్చి శివ గ్యారేజ్లో ఉంచేవాడు. శివ, లక్ష్మణ్ కుమార్ల సహాయంతో ఆ కార్ల నంబర్ ప్లేట్లను మార్చి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నంబర్ ప్లేట్లు అమర్చేవారు. నకిలీ రికార్డుల జెరాక్స్ కాపీలను ఉపయోగించి సాధారణ వాహనాలుగా చూపిస్తూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరలకే విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. తనిఖీలు చేస్తుండగా.. సోమవారం దర్గామిట్ట ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు తన సిబ్బందితో కలిసి అన్నమయ్య సర్కిల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఒక కారులో శివ, లక్ష్మణ్ కుమార్లు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి ఐదు కార్లను స్వాధీనంచేసుకున్నారు. ఢిల్లీ, న్యూఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కార్ల దొంగతనాలపై ఇప్పటికే కేసులున్నాయి. ప్రధాన నిందితుడు ఓ కానిస్టేబుల్ భర్త అని తెలిసింది. వివరాలు తెలిసినా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అదుపులోకి తీసుకుంటే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులను అరెస్ట్ చేసేందుకు కృషిచేసిన దర్గామిట్ట ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు, ఎస్సై వి.బ్రహ్మయ్య, క్రైమ్ పార్టీ సిబ్బంది వేణు, మహేంద్ర, ఖాజా, శామ్యూల్ తదితరులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
చిట్స్ పేరుతో మోసం
● పోలీసులకు బాధితుల వినతి నెల్లూరు(క్రైమ్): చిట్స్ పేరిట మోసగించిన నిర్వాహకురాలు, ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముత్తుకూరు మండలం దువ్వూరుపాళెం, డమ్మాయిపాళేనికి చెందిన పలువురు బాధితులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ పొదుపు లీడర్గా అందరికీ పరియస్తురాలన్నారు. ఆమె కొంతకాలంగా చిట్స్ నిర్వహిస్తోందన్నారు. తాము ఆమె వద్ద చిట్స్ వేశామన్నారు. కాలపరిమితి పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో నిలదీయగా పొలం అమ్మి డబ్బులు ఇస్తామని చెప్పిందన్నారు. ఈనెల 6వ తేదీన పొలం అమ్మినా డబ్బులు ఇవ్వకుండా అదేరోజు రాత్రి కుటుంబంతో సహా ఎటో వెళ్లిపోయిందన్నారు. ఆమె తమ్ముళ్లను అడిగామన్నారు. సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. పొదుపు, చిట్స్ పేరిట సుమారు రూ.80 లక్షల వరకు ఆమె మోసగించిందని బాధితులు ఆరోపించారు. వినతిపత్రం అందజేసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏవీ చలం, మహేష్, రాము, హరికృష్ణ, రాజయ్య తదితరులున్నారు. మతోన్మాద దాడులను అరికట్టాలినెల్లూరు(దర్గామిట్ట): మతోన్మాద దాడులను అరికట్టాలని వివిధ సంఘాలు, పార్టీల నేతలు కోరారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే విధానాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల పోరాట సమితి చైర్మన్ సతీష్, మీదూరు కల్యాణ్ సుందర్, కలివెల ఎలిషా, జానీజు, సీహెచ్ సులోచనామరి, షేక్ జాన్సన్ పాస్టర్, కె.డేవిడ్ పాల్గొన్నారు. జ్యోతికి అండగా ఉంటాంచిల్లకూరు: ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోయిన జ్యోతికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ లీగల్ కౌన్సెలర్ ఎన్.ప్రశాంతి తెలిపారు. మండలంలోని బూదనం గ్రామంలో యువకుడి ఇంట్లో ఉన్న జ్యోతిని సోమవారం ఐసీడీఎస్ అధికారులు, లీగల్ సెల్ వారు కలిసి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతి మాట్లాడుతూ వాకాడు మండలం కొండాపురానికి చెందని జ్యోతి ఓ పరిశ్రమలో పనిచేసే సమయంలో బూదనం గ్రామానికి చెందిన జగదీష్ పరిచయమైనట్లు చెప్పారు. అతడికి కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు సిద్దమవడంతో జ్యోతి నిరసన చేపట్టిందన్నారు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో జ్యోతి అక్కడే ఉంటోందని, ఆమె పరిస్థితి ఆందోళనగా ఉండటంతో పీడీ హేనాసుజన్ ఆదేశాలతో మాట్లాడామన్నారు. చిల్లకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గతంలోనే ఆమె ఇచ్చిన ఫిర్యాదును విచారణ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ మహబూబీ, వన్ స్టాప్ సెంటర్ కేస్ వర్కర్ పి.శారద, సూపర్వైజర్ నాగిశెట్టి రేణుక, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఏఎన్ఎంలకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించి సర్వేలు, మాతాశిశు సంరక్షణ సేవలు రోజూ చేయాల్సి ఉంటుందని వారు అన్నారు. పీడీ యాక్ట్ ఎత్తేయాలంటూ.. అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్ కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలే వెంగయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల గురునాథం మాట్లాడుతూ ఉద్యమకారులపై పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. నేతలు టీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, ఎం.మోహన్రావు, గంగపట్నం రమణయ్య, జి.నాగేశ్వరరావు, ఎం.సుధాకర్ పాల్గొన్నారు. ఎస్టీ కాలనీ సమీపంలో మృతదేహంరాపూరు: మండలంలోని సైదాదుపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరాజేష్ తెలిపారు. -
కండలేరు మట్టికట్టపై జంగిల్ క్లియరెన్స్
పొదలకూరు: కండలేరు మట్టికట్టపై అడవిని తలపిస్తున్న కంపకర్రను తెలుగుగంగ అధికారులు తొలగిస్తున్నారు. ముందుగా జీరో నుంచి 3వ కి.మీ వరకు జంగిల్ క్లియరెన్స్ చేపట్టనున్నారు. కంపకర్ర ఏపుగా పెరగడంతో కట్ట పటిష్టత దెబ్బతింటోందని రైతులు ఆందోళన చెందారు. గత నెల 19వ తేదీన ‘అడవి కాదు.. మట్టి కట్టే’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో జంగిల్ క్లియరెన్స్ పనులను అధికారులు వేగవంతం చేశారు. నాలుగు సబ్డివిజన్లుగా ఉన్న కట్టపై జంగిల్ను ఒక్కొక్క డివిజన్ పరిధిలో సుమారు రూ.20 లక్షల అంచనాలతో చేపడుతున్నట్టు తెలుస్తోంది. -
పీజీఆర్ఎస్కు 105 ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 105 మంది విచ్చేసి తమ సమస్యలపై ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేశారు. ఆమె పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్, ఎస్బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, బాలాజీ నగర్, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు సాంబశివరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● నా కుమార్తె 2024లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరణానికి గల కారణాలు తెలుస్తాయని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చారు. ● చిత్తూరుకు చెందిన మహేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2.85 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, తీసుకున్న నగదు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● శ్రీనివాసులు మరికొందరు నా ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలని దగదర్తికి చెందిన వృద్ధ దంపతులు కోరారు. ● నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్నాను. భార్య, కుమారులు పట్టించుకోవడం లేదు. జీవనోపాధి సైతం ఇబ్బందిగా ఉందని పొదలకూరుకు చెందిన వినతిపత్రమిచ్చాడు. ● నా కుమార్తె కనిపించడం లేదు. నా ఫిర్యాదు మేరకు మనుబోలు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. కుమార్తె ఆచూకీ కనుక్కోవాలని మనుబోలుకు చెందిన ఓ మహిళ కోరారు. -
గిరిజనులపై ‘కూటమి’ కపటప్రేమ
నెల్లూరు రూరల్: గిరిజనులపై కూటమి ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని మాజీ మేయర్ భర్త పి.జయవర్ధన్ ఆరోపించారు. సోమవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్గా గిరిజన వ్యక్తికి అవకాశం కల్పించకుండా ఇన్చార్జి మేయర్నే కొనసాగించడం సిగ్గుచేటన్నారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతుంటారని, ఇది కపటప్రేమ కాదా అని నిలదీశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి గిరిజనుల ఓట్లతో గెలిచారన్నారు. మీ అనుచరుడి కళ్లలో ఆనందం కోసం గిరిజనులకు అన్యాయం చేయడం సబబేనా అని ప్రశ్నించారు. నెల్లూరు నడిబొడ్డున జరుగుతున్న అన్యాయం మీకు కనిపించడం లేదా అని సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుగజేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరో గిరిజన వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వకపోతే పోరాటం చేస్తామన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ సత్తా చాటుదాం
జగనన్న సైన్యం ఏర్పాటు నెల్లూరు రూరల్ / నెల్లూరు(అర్బన్): త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎలక్షన్లలో విజయదుందుభి మోగించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుదామని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయమై ముఖ్య నేతలు తదితరులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నగరంలోని డీఆర్ ఉత్తమ హోటల్లో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం, వార్డులో పార్టీని బలోపేతం చేసేందుకు గానూ కమిటీలను ఫిబ్రవరి 15లోపు ఏర్పాటు చేయాలని సూచించారు. చురుకై న వారిని గుర్తించి ఇందులో నియమించాలని కోరారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు పూర్తయ్యాయని వివరించారు. గ్రామ, వార్డు స్థాయి నేతలను నియమించాలని, వీరందరికీ పార్టీ గుర్తింపు కార్డులను ఇవ్వనున్నామని తెలిపారు. వివరాల డిజిటలైజేషన్ వివరాలను డిజిటలైజేషన్ చేయనున్నామని, ఇలా ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది వేల మంది నేతలు తయారుకానున్నారని మిథున్రెడ్డి చెప్పారు. పరిశీలకులకు జగనన్న నేరుగా ఫోన్ చేసి నేతలు, డిజిటలైజేషన్ వివరాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. కార్యకర్తల్లేనిదే పార్టీలేదని, కేడర్కు జగనన్న అండగా నిలుస్తారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించేలా నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఐక్యంగా పనిచేసి ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యమ ఫలితమే.. విద్య, వైద్యాన్ని పేదలకు అందించేందుకు తమ పార్టీ అధినేత కృషి చేస్తున్నారని మిథున్రెడ్డి వివరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం పూనుకుందని, అయితే తమ ఉద్యమ ఫలితంగా టెండర్ వేసేందుకు ఒక్కరూ ముందుకురాలేదని తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తమ పార్టీ శ్రేణులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించా రు. వీరి అరాచకాలకు తగిన బదులివ్వడం ఖాయమని స్పష్టం చేశారు. ఐదంచెలుగా కమిటీలు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయిలతో పాటు సోషల్ మీడియా ఇలా ఐదంచెలుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నామని పార్టీ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి శివశంకర్రెడ్డి తెలిపారు. గ్రామాధ్యక్షులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలని సూచించారు. గడువుకు ముందే కమిటీలు జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన గడువుకు ముందే గ్రామ కమిటీలను పూర్తి చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పార్టీ టాస్క్ఫోర్స్ సభ్యుడు, తిరుపతి ఎంపీ గురుమూర్తి కాంక్షించారు. సమస్యొస్తే అప్పుడు పోరాడేందుకు సులభంగా ఉంటుందన్నారు. ఈ ప్రక్రియను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని కోరారు. కార్యకర్తలే కీలకం రానున్న తమ పార్టీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలే కీలకమని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా.. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని స్థానాలను పార్టీ సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ను మరోసారి సీఎం చేయాలి ప్రతి ఇంట్లో జగన్మోహన్రెడ్డి అభిమానులున్నా రని, వీరిని పార్టీలో భాగస్వాములను చేయాలని పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కోరారు. జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో ముందుకుసాగాలి పంచాయతీ నుంచి జిల్లా కమిటీల వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ మేరిగ మురళి సూచించారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వనున్నారని సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి కోరారు. పలు అంశాలపై ఉదయగిరి, వెంకటగిరి, కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జీలు మేకపాటి రాజగోపాల్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, బుర్రా మధుసూదన్యాదవ్ మాట్లాడారు. గ్రామస్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు కార్యకర్తలకు ఉచిత బీమా టీడీపీ పాలనలో జరిగే అరాచకాలకు బదులిస్తాం పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి -
ఉత్సాహంగా క్రీడా పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సంప్రదాయ క్రీడా పోటీలను జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. స్కిప్పింగ్, తొక్కుడు బిళ్ల, గాలిపటాలు, కర్రసాము, టగ్ ఆఫ్ వార్ క్రీడాంశాల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 350 మంది హాజరయ్యా రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడా యాప్ ఆవశ్యకతను వివరించేలా రూపొందించిన గాలిపటం ఆకర్షణీయంగా నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. డయల్ యువర్ ఎస్ఈకి 11 ఫిర్యాదులు నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలనే లక్ష్యంతో నగరంలోని విద్యుత్ భవన్లో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సర్కిల్ పరిధి నుంచి 11 మంది తమ ఫిర్యాదులను ఎస్ఈ రాఘవేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈఈ బాలచంద్ర, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, నరసింహరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే చర్యలు నెల్లూరు(క్రైమ్): సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా చేపడుతున్న చర్యలను నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆమె వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశా మని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. కోడిపందేలకు వినియోగించే కత్తుల తయారీ, విక్రయాలు సాగించేవారిపైనా కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. పండగ సందర్భంగా ఊళ్లకెళ్లేవారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రహదారి మార్గాలు, ముఖ్య కూడళ్ల వద్ద పోలీస్ పెట్రోలింగ్, బీట్ సిబ్బందితో ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డయల్ 112, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారమందించాలని కోరారు. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం గూడూరు రూరల్: పట్టణంలోని అడవి కాలనీ ప్రాంతంలో బహిర్భూమికి సోమవారం వెళ్లిన ఐదేళ్ల చిన్నారిపై అదే ప్రాంతంలో ఉంటున్న తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల సదాశివం లైంగిక దాడికి యత్నించారని రెండో పట్టణ పోలీసులు తెలిపారు. చిన్నారి కేకలేయగా, వృద్ధుడ్ని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, తల్లి వివరాల మేరకు పోక్సో కేసును నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవా రం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నా రు. స్వామివారిని 76,447 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,708 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లను సమ ర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంట ల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయింపు
● ఎస్సై న్యాయం చేయడంలేదంటూ బాధితుల ఆందోళన వింజమూరు (ఉదయగిరి): పట్టణంలోని వివిధ చోరీ కేసుల్లో తమ బంగారాన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులు.. తమకు పోలీసులు న్యాయం చేయడంలేదంటూ స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట సోమవారం బైఠాయించి నిరసన తెలిపారు. పట్ణణంలోని యర్రబల్లిపాళెంలో ఓ ఇంట్లో జాతకం చెప్పేందుకొచ్చి బంగారం, డబ్బులతో ఉడాయించిన అనుమానితులను పట్టుకొని వదిలేయడమే కాకుండా, మీరే దొంగతనం చేశారంటూ ఎస్సై తమను అవమానిస్తున్నారంటూ బాఽధితులు మౌనిక, సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం చోరీ, మేకల అపహరణ కేసు విషయంలోనూ ఎస్సై దురుసుగా ప్రవర్తిస్తూ, తమకు న్యాయం చేయలేదని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. బాధితులు బైఠాయించడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఎస్సై వీరప్రతాప్ బయటకొచ్చి, ట్రాఫిక్ను క్లిరయిర్ చెయించారు. మీ కేసును నెల్లూరు లోని క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారని, అక్కడికెళ్లాలని సూచించారు. దీంతో బాఽధి తులు కొద్దిసేపు అక్కడే ఉండి ఆపై వెళ్లిపోయారు. కాగా ఈ విషయమై ఎస్సైను సంప్రదించగా, కేసులు దర్యాప్తులో ఉన్నాయని, పలువురు నిందితులను విచారిస్తున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి చర్యలు చేపడతామని బదులిచ్చారు. -
సంక్రాంతి వచ్చింది.. తమ కుటుంబీకులతో పండగను ఆనందంగా జరుపుకోవాలని వివిధ ఊళ్లలో ఉండే వారు కోరుకుంటారు. ఉరుకులు.. పరుగుల జీవనం నుంచి నాలుగు రోజుల పాటు ఉపశమనం పొంది బంధుమిత్రులతో ఖుషీఖుషీగా గడపాలని కాంక్షిస్తారు. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలవుతోంది. స్వస్థలా
నెల్లూరు (టౌన్): సంక్రాంతి పేరుతో దోపిడీ పర్వానికి ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు తెరలేపాయి. పండగకు సకుటుంబ.. సపరివార సమేతంగా సొంతూళ్లకు రావాలనుకున్న జిల్లా వాసులకు అధిక చార్జీలు అశనిపాతంలా పరిణమించాయి. చార్జీల భారంతో కొందరు ప్రయాణాలను మానుకుంటుంటే.. మరికొందరు అప్పులు చేయాల్సి వస్తోంది. వామ్మో.. ఇంతా..? హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చే ప్రైవేట్ బస్సుల్లో రెండు, మూడు రెట్ల మేర అధికంగా పెంచేశారు. ఈ చార్జీలను ఆన్లైన్లో పేర్కొని, ఆ మేరకు వసూలు చేస్తున్నా, చోద్యం చూడటం ప్రభుత్వ వంతవుతోంది. పండగ సమీపించే కొద్దీ ఇవి ౖపైపెకి చేరుతున్నాయి. ఓ కుటుంబం సొంతూరెళ్లి రావాలంటే సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతోందని పలువురు పేర్కొంటున్నారు. శ్రద్ధ చూపని ఆర్టీసీ రాష్ట్రంలో ఈ నెల 18 వరకు.. తెలంగాణలో ఈ నెల 16 వరకు సెలవులను ప్రకటించారు. కనుమ రోజున సొంతూళ్ల నుంచి ఎక్కువ మంది బయల్దేరరు. ఈ తరుణంలో ఆదివారం లేదా సోమవారం తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు 120 ప్రైవేట్ బస్సుల వరకు నిత్యం తిరుగుతుంటాయి. అయితే పండగ వేళ హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు 28 బస్సులనే ఆర్టీసీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. ఈ పరిణామాల క్రమంలో ప్రైవేట్ బస్సులనే అధిక శాతం మంది ఆశ్రయించాల్సి వస్తోంది. టికెట్ల కోసం వెబ్సైట్ను ఓపెన్ చేస్తే ఓ ధర.. బుక్ చేద్దామనే ఉద్దేశంతో క్లిక్ చేస్తే మరో రేటును చూపిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మినీ బైపాస్లో ప్రైవేట్ బస్సులు సంక్రాంతికి సొంతూళ్లకు క్యూ కడుతున్న ప్రజలు నామమాత్రంగా ఆర్టీసీ బస్సులు దోచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ రెండు నుంచి మూడు రెట్ల మేర పెంపు తిరిగెళ్లేందుకూ కష్టాలే చోద్యం చూస్తున్న రవాణా శాఖ అధికారులుస్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తాం అధిక చార్జీలపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తాం, పండగకు ముందు రెండు రోజులు.. ఆ తర్వాత మూడు రోజుల పాటు తనిఖీలను చేపడతాం. జిల్లా పరిధిలోని మూడు టోల్ గేట్ల వద్ద ఎమ్వీఐలు, ఏఎమ్వీఐలకు విధులను అప్పగించి తనిఖీలు నిర్వహిస్తాం. ఆన్లైన్లో అధిక చార్జీలు పెట్టినా.. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేసినా, విచారణ జరిపి బస్సులపై కేసులు నమోదు చేస్తాం. యాజమాన్యాలతో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించి మార్గదర్శకాలను జారీ చేశాం. – చందర్, డీటీసీ -
అక్రమ కేసులతో నిర్బంధం
● తిరుపతి ఎంపీ గురుమూర్తి ● కేంద్ర కారాగారంలో పిన్నెల్లి సోదరులతో ములాఖత్ నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులను ప్రభుత్వం మోపి జైల్లో నిర్బంధిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడితో గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, ప్రభుత్వ కుట్రలకు త్వరలో తెరపడుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కుట్రపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతరం మధుసూదన్రెడ్డి మాట్లాడారు. జైల్లో సరైన భోజనాన్ని అందించడంలేదని, ఈ తరుణంలో హోంమంత్రి ఎందుకొచ్చారో.. ఎవరితో మాట్లాడారో అర్థం కావడంలేదని చెప్పారు. -
పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థలో పనిచేసే విద్యుత్ మీటర్ రీడర్లు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిలానీబాషా, శంకర్ కిషోర్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని సంతపేటలో సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా విద్యుత్ మీటర్ రీడర్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన నేతలు మాట్లాడుతూ నేడు ప్రభుత్వ, విద్యుత్ యాజమాన్యం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో 20 సంవత్సరాలుగా సంస్థలో పనిచేస్తున్న రీడర్లకు ఉద్యోగభద్రత లేదన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు తిరుపతి సీఎండీ కార్యాలయం వద్ద చేపట్టే నిరాహారదీక్షలు, 22వ తేదీన చలో తిరుపతి కార్యక్రమానికి జిల్లాలోని మీటర్ రీడర్లు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, మీటర్ రీడర్ల యూనియన్ నాయకులు హజరత్వలీ, కృష్ణ, బాలకృష్ణ, ఫిరోజ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులు కల్పించాలని డిమాండ్
నెల్లూరు(అర్బన్): వైద్య, ఆరోగ్య శాఖలో 30 సంవత్సరాలుగా ఒకే కేడర్లో పనిచేస్తున్న ఏఎన్ఎంల (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఫీమేల్)కు ప్రభుత్వం తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఏపీ హంస అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్రావు, కమల్కిరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. పలువురు ఏఎన్ఎంలు తమకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వంతో పోరాడాలని కోరుతూ నాయకులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సుధాకర్రావు మాట్లాడుతూ ఏఎన్ఎంలు పదోన్నతులు లేకుండానే రిటైర్డ్ అవుతున్నారన్నారు. వైద్యశాఖలో వీరికన్నా వెనుక చేరిన ఉద్యోగులు ఒకటికి రెండు ప్రమోషన్లు పొంది ఏఎన్ంలపైనే సూపర్వైజర్లుగా అజమాయిషీ చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పందించి న్యాయం చేయాలన్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్ల పదోన్నతులు, పీజీ చేసే వారికి ఇన్ సర్వీస్ రిజర్వేషన్లు తదితర విషయాలను కూడా పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోశాధికారి శేషగిరిరావు, నాయకులు నాగరాజు, మజార్, సుకన్య, గౌస్బాషా, మంజరి, సుధాకర్రెడ్డి, మార్క్, లక్ష్మీకాంతమ్మ, ఉమా, విజయ, పద్మ, హైమావతి, రియానా తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని సోమవారం విద్యుత్ భవన్లో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య వినియోగదారులు 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడిదొరవారిసత్రం: మండలంలోని నేలపట్టు పక్షుల కేంద్రంలో ఆదివారం సందర్శకుల సందడి నెలకొంది. పక్షుల పండగ సందర్భంగా రెండోరోజు వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విహంగాలను తిలకించారు. ఉదయం వర్షం కురవడంతో కేంద్రానికి విచ్చేసిన సందర్శకులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం నుంచి వాహనాల రద్దీ పెరగడంతో డీవీసత్రం నుంచి పక్షుల కేంద్రం ప్రధాన గేట్ల వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుపతి, చైన్నె, నెల్లూరు, విజయవాడ, చిత్తూరు, కడప తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు అఽధిక మొత్తంలో విచ్చేసి విహంగాలను వీక్షించారు. -
ఔటర్ రింగ్ రోడ్డు.. ఔట్
తప్పుదోవ పట్టిస్తున్న పచ్చ నేతలు రియల్టర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకే ప్రకటన ● కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన సమీక్ష.. తూచ్ ఉత్తుత్తిదే ● అవసరమని నుడా చైర్మన్.. అక్కర్లేదని మంత్రి నారాయణ ప్రకటనలు ● ఎవర్ని మభ్యపెట్టేందుకు ఈ నాటకమంటున్న ప్రజలు నెల్లూరు సిటీ: నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు కానుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనికి సంబంధించి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో ఇటీవల సమీక్షించారు. ఇలా నెల్లూరు ప్రజలకు ఎంతో ఆశ కలిగించారు. జిల్లా వాసులకు ట్రాఫిక్ కష్టాలుండవని.. హైదరాబాద్ తరహాలో నెల్లూరులోనూ ప్రయాణించొచ్చంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. సరిగ్గా నాలుగు రోజులు తిరిగేసరికే దీన్ని మంత్రి నారాయణ తుస్సుమనిపించారు. నెల్లూరుకు ప్రస్తుతం ఓఆర్ఆర్ అవసరమేలేదని ఆదివారం ఆయన తేల్చిచెప్పారు. దీన్ని నిర్మించాలంటే రూ.రెండు వేల కోట్లు ఎలా వస్తాయని.. భూసేకరణకు ఇబ్బందులొస్తాయని తేల్చేశారు. ఫలితంగా ఓఆర్ఆర్ అనేది బూటకమనే విషయం తేలిపోయింది. కమీషన్లు దండేందుకేనా..? జిల్లాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. విక్రయాలు, కొనుగోళ్లు దాదాపు ఆగిపోయాయి. రియల్టర్లు నీరసించిపోయారు. ఈ తరుణంలో ఔటర్ రింగ్ రోడ్డు అని మభ్యపెట్టి కృత్రిమ బూమ్ను సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు యత్నించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రియల్టర్ల నుంచి భారీగా కమీషన్లు పొందేందుకు పన్నాగం పన్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఎందుకయ్యా.. ఈ డ్రామాలు..? కోవూరు నియోజకవర్గంలో 41.44.. సర్వేపల్లి నియోజకవర్గంలో 20.94.. నెల్లూరు రూరల్లో 19.64 కిలోమీటర్ల పరిధిలో రూ.1930 కోట్లతో ఓఆర్ఆర్ను నిర్మించనున్నామని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అయితే మంత్రి నారాయణ దీనికి భిన్నంగా స్పందించారు. నగరంలో గతంలో ట్రంకురోడ్డు మాత్రమే బైపాస్ రోడ్డుగా ఉండేదని, అప్పట్లో ట్రాఫిక్ భారీగా పెరిగిందని.. ఈ తరుణంలో మినీబైపాస్, నేషనల్ హైవేలొచ్చాయని.. సిటీలో రెండు అండర్ పాస్లు రానున్నాయని, రెండు ఫ్లయ్ఓవర్లున్నాయని తెలిపారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని, ఇప్పట్లో రింగ్ రోడ్డు అవసరమే లేదని, అసలీ విషయం తమ అజెండాలోనే లేదని చెప్పేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భూసేకరణకు నిధులెలా వస్తాయని ప్రశ్నించారు. దీంతో ఇదంతా బూటకమనే విషయం తేలిపోయింది. ఓఆర్ఆర్ పేరుతో ప్రజలను కొంతమంది టీడీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. తమ భూముల విలువను అమాంతం పెంచుకునేందుకే ఈ పన్నాగం పన్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. అభివృద్ది పనులు చేయకపోగా, ఊహల్లో విహరించేలా చేయడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా వట్టి మాటలను కట్టిపెట్టి.. చేతల్లో అభివృద్ధిని చూపాలని.. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజలే అధికార పార్టీ నేతలకు తగిన గుణపాఠం చెప్తారంటున్నారు. -
ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమిస్తాం
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు జిల్లాకు తీరని అన్యాయం నిర్వీర్యం చేస్తూ.. బుకాయింపా..? ● వైఎస్సార్సీపీ నేతల అడ్డగింత ● సామాన్యులనూ ఇబ్బందులకు గురిచేసిన వైనం పొదలకూరు: రాయలసీమతో పాటు జిల్లా రైతాంగం.. ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే సీమ ఎత్తిపోతల పథక నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు డొల్లతనాన్ని బయటపెట్టేందుకు కండలేరు జలాశయ సందర్శనకు వెళ్తుంటే.. తమను టెర్రరిస్టుల మాదిరిగా పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కండలేరు జలాశయ సందర్శన నిమిత్తం పార్టీ నెల్లూరు రూరల్, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలిసి కాకాణి ఆదివారం బయల్దేరారు. ఈ క్రమంలో కండలేరు మెయిన్ రోడ్డు ఆర్చి వద్ద వీరిని పోలీసులు అడ్డుకొని, 25 మందికే అనుమతి ఉందని చెప్పారు. దీంతో ఖాకీల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విలేకరులతో కాకాణి మాట్లాడారు. ప్రభుత్వ మెడలు వంచైనా జిల్లా సాగునీటి హక్కులను సాధించుకునేంత వరకు ఉద్యమాలను చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సోమశిల సందర్శన విషయంలోనూ పోలీసులు శనివారం ఇదే తరహాలో నిరంకుశంగా అడ్డుకున్నారని ఆరోపించారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల వ్యవహారంలో చంద్రబాబు వైఖరి బయటపడిందని చెప్పారు. భయంతోనే అడ్డుకుంటున్నారు.. జిల్లాలోని జలాశయాలను సందర్శిస్తే చంద్రబాబు చీకటి ఒప్పందాలు ప్రజల్లోకి వెళ్తాయనే భయంతో తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజలతో పాటు రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. నెల్లూరులో తాము బయల్దేరితే, నెల్లూరు, పొదలకూరు, డేగపూడి, కండలేరు ఇలా నాలుగు చోట్ల చెక్పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారని తెలిపారు. చివరికి చంద్రబాబు తన నీడను చూసినా భయపడుతున్నారని, తమ పార్టీ శ్రేణుల ఉద్యమబాటను చూసి వణికిపోతున్నారని చెప్పారు. రేవంత్రెడ్డి చెప్పింది వాస్తవమా.. కాదా..? తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వాస్తవమా కాదాననే అంశాన్ని టీడీపీ నేతలు చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పష్టతిచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబు అండ్ కంపెనీకి ఉందానని సవాల్ విసిరారు. సీమ ఎత్తిపోతల పథకం లేకపోతే ప్రధానంగా నష్టపోయేది నెల్లూరు జిల్లానేనన్నారు. శ్రీశైలం తర్వాత జిల్లాలో సోమశిల, కండలేరు పెద్ద జలాశయాలుగా ఉన్నాయని, జిల్లా కు ఇవి జీవనాడులని పేర్కొన్నారు. రాష్ట్రాల విభజనానంతరం ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుకై ్కన చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి వచ్చారని విమర్శించారు. తెలంగాణ అక్రమ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రశ్నిస్తే, ఆయన్ను జైలుకు పంపుతారనే భయంతో మిన్నకుండిపోయారని ఆరోపించారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని కాకాణి ధ్వజమెత్తారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. తామేమి చేస్తే కండలేరుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. హౌస్ అరెస్ట్లు, అడ్డుకోవడాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామాననే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. జిల్లాకు అన్యాయం జరిగితే ఉద్యమబాట పడుతూనే ఉంటామని హెచ్చరించారు.అడుగడుగునా పోలీసుల మోహరింపు పొదలకూరు: రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ఎండగట్టేందుకు కండలేరు జలాశయ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆంక్షలను పోలీసులు విధించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి వెంట వెళ్తున్న పార్టీ నేతలను పొదలకూరులో పోలీసులు నిలువరించి వెనక్కి పంపారు. సంగం రోడ్డు, రామనగర్ గేట్ సెంటర్లలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్నీ తనిఖీ చేశారు. నెల్లూరులో కాకాణి బయల్దేరుతున్న సందర్భంగా చుట్టుపక్కల మండలాల నుంచి కండలేరుకు వెళ్లేందుకు వచ్చిన పార్టీ నేతలను గేట్ సెంటర్లోనే నిలిపేశారు. పండగల సందర్భంగా గ్రామాలకు వెళ్లే వారి కార్లను సైతం తనిఖీ చేయడంతో వారు ఇబ్బందులు పడ్డారు. కండలేరు వెళ్లేందుకు కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య పొదలకూరు చేరుకున్నారు. అయితే వారి వెనుక వస్తున్న వాహనాలను పోలీసులు నిలిపేశారు. దీంతో వెనక్కి వెళ్లిన కాకాణి.. ఖాకీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల కార్లను వదలాల్సిందిగా సూచించారు. తమ వాహనాలకు అనుమతి ఉందని పోలీసులకు వెల్లడించి కండలేరు వెళ్లారు. మార్గమధ్యలో డేగపూడి కూడలి వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ప్రతి కారు నంబర్నూ నోట్ చేసుకొని పంపారు. చిల్లకూరు: పుట్టిన గడ్డకే ద్రోహానికి పాల్పడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తూ.. బుకాయించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ విమర్శించారు. పట్టణంలోని సనత్నగర్లో గల పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన నాటి నుంచి అభద్రతా భావంలో చంద్రబాబు ఉన్నారని, అందుకే తమ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పోలీసులను వెంటనే రంగంలోకి దింపి అడ్డుకుంటున్నా రని మండిపడ్డారు. నెల్లూరులో హౌస్ అరెస్ట్లను శనివారం చేపట్టడం దుర్మార్గమన్నారు. ఖాకీలను అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. బాబు మెడలు వంచైనా హక్కులను కాపాడుకుంటాం జలాశయాలను సందర్శిస్తే మీకొచ్చిన నష్టమేమిటి..? ప్రభుత్వ తీరు దుర్మార్గం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి 2014 – 19 మధ్య ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో, కల్వకుర్తి సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని కాకాణి గుర్తుచేశారు. భీమ, నెట్టెంపాడు ఎత్తిపోతలను తీసుకొచ్చారని.. పాలమూరు, రంగారెడ్డి, డిండికి సంబంధించి శ్రీశైలం నుంచి 800 అడుగుల లోతు నుంచే రోజూ ఎనిమిది టీఎంసీల చొప్పున నీటిని తోడుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణను చంద్రబాబు అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44 వేల క్యూసెక్కులకు దివంగత సీఎం వైఎస్సార్ పెంపొందించడంతో జిల్లాకు నీటిని తీసుకురాగలుగుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటిమట్టం ఉంటేనే, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్కు నీరందుతుందని, అయితే 800 అడుగుల్లోనే పవర్ జనరేటర్కు నీటిని తెలంగాణ పెట్టుకుంటోందని తెలిపారు. ఈ తరుణంలో రాయలసీమ, నెల్లూరు రైతాంగ కష్టాలను తీర్చేందుకు సీమ ఎత్తిపోతల పథకాన్ని గత సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. సీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను నిలిపేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేదిలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయక్త కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. కండలేరు ముఖద్వారం వద్ద బైఠాయించిన ఆయన మాట్లాడారు. చీకటి ఒప్పందాలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమశిల జలాశయాన్ని సందర్శించేందుకు శనివారం యత్నిస్తే, పోలీసులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి ఒక్క పిలుపిస్తే ఎంత దూరమైనా వెళ్తామని చెప్పారు. సాగునీటి విషయంలో జిల్లాకు జరుగుతున్న అన్యాయం తమ ద్వారా బయటపడుతుందనే భయంతో పోలీసులను ప్రభుత్వం పెట్టి తమను అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఉద్యమిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. కండలేరు జలాశయ మెయిన్ రోడ్డు ఆర్చి వద్ద బైఠాయించిన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విధ్వంసాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని ఆరోపించారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయడంపై చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు ఖండించడంలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉద్యమం ద్వారా బహిర్గతమైందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను తాకట్టుపెడితే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. -
పొలానికి వెళ్లొస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం కోవూరు: గుర్తుతెలియని వాహనం అతివేగంగా బైక్ను ఢీకొనడంతో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలం గండవరం గ్రామానికి చెందిన మోపర్తి వెంకటేశ్వర్లు (62) ప్రస్తుతం నెల్లూరులోని వీవర్స్ కాలనీలో నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం తన స్వగ్రామమైన గండవరంలోని పొలాలను చూసేందుకు మోటార్బైక్పై వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి నెల్లూరుకు వెళ్తుండగా కోవూరు సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు జాతీయ రహదారిపై ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
● తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యం ● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు ● ఎల్హెచ్ఎంఎస్ సేవలు వినియోగించుకోవాలని సూచన నెల్లూరు(క్రైమ్): సంక్రాంతి నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేశారు. పండగకు చాలామంది ఊర్లకు పయనమయ్యారు. ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా దుండగులు రెక్కీ వేసి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పండగ సంతోషంగా ముగించుకుని తీపి జ్ఞాపకాలతో తిరిగి రావొచ్చు. అప్రమత్తంగా లేకపోతే చేదు అనుభవం తప్పదు. ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) సేవలను వినియోగించుకుంటే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే.. మారుతున్న కాలంతోపాటు చోరులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో పలు కేసుల ఛేదన కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊర్లకు వెళ్లే విషయాలను సోషల్ మీడియాలో పంచుకోరాదు. ఇంటిని గమనిస్తూ ఉండాలని ఇరుగుపొరుగు వారికి చెప్పాలి. ఇంటి తలుపులకు సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం అమర్చుకోవాలి. ఎవరైనా తలుపు తీయాలని ప్రయత్నిస్తే ఫోన్కు సమాచారం అందుతుంది. ఇంటి లోపల, బయట కొన్నిలైట్లు వేసి ఉంచాలి. సాంకేతికతో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. బంగారు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలి. బీరువా, లాకర్ల తాళాలను ఇంట్లో ఉంచరాదు. వెంట తీసుకెళ్లాలి. వాహనాలను ఇంటి ఆవరణలోనే నిలపాలి. ద్విచక్ర వాహనాలకు వీల్లాక్లను వేయాలి. అపార్ట్మెంట్ల్లో నివాసం ఉండేవారు నమ్మకమైన వాచ్మెన్లను, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి. ఇళ్లముందు దినపత్రికలు, పాలప్యాకెట్లు, చెత్తాచెదారాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. పనిమనిషి ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ఊర్లకు వెళ్లే సమయంలో తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ను స్థానిక పోలీస్స్టేషన్లో ఇవ్వాలి. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్థానిక కుటుంబాలు స్వచ్ఛందంగా కమిటీలు వేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. అప్రమత్తత తప్పనిసరి బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. ఎక్కువ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తీసుకెళ్లినా ఎక్కడ పడితే అక్కడ వదిలేయరాదు. సెల్ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలి. పండగ వేళ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసి ఉంటాయి. వాటిని ఎక్కే సమయంలో జేబు దొంగతనాలు, బ్యాగ్ల కత్తిరింపు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. పూర్తి ఉచితం తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు పూర్తి ఉచితం. ఈ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వివరాలను పొందుపరచాలి. ఊర్లకు వెళ్లే సమయంలో యాప్లోకి వెళ్లి రిక్వెస్ట్ పోలీస్ వాచ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఎప్పుడు వెళ్లేది, సమయం, తిరిగొచ్చే తేదీ టైప్చేసి సబ్మిట్ వాచ్ రిక్వెస్ట్పై క్లిక్ చేయాలి. పోలీసులు ఇంటికొచ్చి ఇంట్లో మోషన్ కెమెరాలను బిగించి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించారంటే కమాండ్ కెమెరా ఆన్ అవుతుంది. కంట్రోల్ రూమ్లో అలారం మోగుతుంది. ఆ ప్రాంత బ్లూకోట్ పోలీసుల నుంచి అందరూ అప్రమత్తమవుతారు. నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని దొంగను పట్టుకునే అవకాశం ఉంది. -
ఉత్తర కాలువలోకి దూసుకెళ్లిన కారు
● భార్యాభర్తలకు స్వల్ప గాయాలు కలిగిరి: మండలంలోని కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం సమీపంలో హైవే పక్కన ఉన్న గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువలోకి ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. కావలి నుంచి కడప దర్గాకు షేక్ సుల్తాన్, ఆరిఫా దంపతులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందారు. మోటార్బైక్లు, ఆటోల సీజ్కావలి(అల్లూరు): ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు కావలి రూరల్ పరిధిలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు బుడమగుంట కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రతి ఇల్లు తనిఖీ చేశారు. సరైన పత్రాల్లేని 50 మోటార్బైక్లు, నాలుగు ఆటోలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు చేసినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.20 సన్నవి : రూ.10 పండ్లు : రూ.5 -
‘సంక్రాంతి’ షాపింగ్
సండే మార్కెట్లో జనాల రద్దీ షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేస్తున్న ప్రజలు సంక్రాంతి పండగ సమీపిస్తోంది. దీంతో ఆదివారం నెల్లూరు నగరంలో సందడి నెలకొంది. గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి షాపింగ్ చేస్తున్నారు. చిన్నపాటి దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకూ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండగ నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు పెట్టి దుస్తులు విక్రయిస్తున్నారు. సండే మార్కెట్కు ప్రజలు పోటెత్తారు. కొన్నిచోట్ల రోడ్లపైనే విక్రయాలు జరుగుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
దాడి ఘటనపై పునర్విచారణ జరపాలి
● నిందితుల పేర్లను కేసులో చేర్చాలి ● దర్గామిట్ట పోలీసులకు ప్రసన్న వినతి నెల్లూరు(లీగల్): తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పునర్విచారణ జరిపి నిందితుల పేర్లను కేసులో చేర్చడంతో పాటు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేగవంతమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కల్యాణరాజుకు వినతిపత్రాన్ని ఆదివారం ఆయన అందజేశారు. అందులోని వివరాల మేరకు.. రాజకీయ విభేదాలతో గతేడాది జూలై ఏడున వంద మందికిపైగా వ్యక్తులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కర్రలు, మారణాయుధాలతో ఆస్తి నష్టం, బెదిరింపులు, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దాడి వెనుక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రూప్కుమార్యాదవ్ ప్రోత్సాహం, కుట్ర ఉందంటూ అప్పట్లోనే దర్గామిట్ట పోలీసులకు ప్రసన్నకుమార్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 125 / 2025 కేసును నమోదు చేశారు. అయితే ఫిర్యాదులో పొందుపర్చిన ప్రధాన నిందితులు పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును పునర్విచారణ చేయాలంటూ ఆదేశాలను గతేడాది డిసెంబర్ 11న జారీ చేసింది. దీనికి అనుగుణంగా వేగవంతమైన, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, ప్రధాన నిందితులతో సహా దాడికి పాల్పడిన వారిని గుర్తించి విచారణ జరపాలని కోరారు. ఘటనకు ముందు ఆరు గంటలు, తర్వాత రెండు గంటల వరకు నిందితుల కాల్ డిటెయిల్స్, టవర్ లొకేషన్లను సేకరించి పరిశీలించడం ద్వారా కుట్ర, సమన్వయం, పాత్రలపై స్పష్టతొస్తుందని ప్రసన్న పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, బుచ్చిరెడ్డిపాళెం మండల కన్వీనర్ సతీష్రెడ్డి, కలువ బాలశంకర్రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు. -
షిప్యార్డు నిర్మాణ పనుల పరిశీలన
వాకాడు: మండలంలోని తూపిలిపాళెం తీరంలో ఏర్పాటు చేయనున్న షిప్ యార్డు పనులను మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ ఆదివారం పరిశీలించారు. అవసరమైన భూములు, రోడ్డు, రైల్వే మార్గాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గూడూరు జంక్షన్ నుంచి తూపిలిపాళెం షిప్ యార్డు వరకు రైల్వే మార్గాన్ని ఏ విధంగా అనుసంధానం చేయాలనే అంశంపై ఆరాతీశారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది, రవాణా వ్యవస్థ మెరుగుపడి, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, ఆర్ఐ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు నెల్లూరు(దర్గామిట్ట): ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి.. వాటిని పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్ర మాన్ని సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఓ వైపు చలి.. మరో వైపు వర్షం నెల్లూరు(అర్బన్):అసలే చలికాలం.. దానికి తోడు తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మ హాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఆ ప్రభావం జిల్లా పై పడింది. చిరుజల్లుల మొదలుకొని ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీనికి చలిగాలులు తోడయ్యా యి. ఫలితంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయా యి. గరిష్టంగా 25.5.. కనిష్టంగా 19.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదివారం నమోదైంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదివారం మధ్యాహ్నా నికి జిల్లాలో సరాసరిగా 4.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 4.30 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నెల్లూరులో ఆకాశం మేఘావృతమై వర్షాలు పడటంతో నగరమంతా చిత్తడిగా మారింది. పాదచారులు, ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. బుజబుజనెల్లూరు మొదలుకొని వెంకటేశ్వరపురం, కొత్తూరు, పొదలకూరు రోడ్డు, మూలాపేట, ఎన్టీఆర్నగర్, నవా బుపేట ఇలా అన్ని చోట్ల వర్షం కురిసింది. ఘనంగా వడ్డే ఓబన్న జయంతి నెల్లూరు(దర్గామిట్ట): స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఓబన్న జయంత్యుత్సవాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లెపు మునిస్వామి, బత్తల కృష్ణయ్య, నేతలు గుంజి సుధాకర్, ఉప్పు భాస్కర్, బాలాజీ, జనార్దన్, బూధాటి రాధయ్య, బెల్లంకొండ శ్రీనివాసులు, ఉదయగిరి నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన పథకానికి విరాళం రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1.89 లక్షల విరాళాన్ని ఆదివారం అందజేశారని ఏసీ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లాకు చెందిన కంకణాల రామకృష్ణయ్య జ్ఞాపకార్థం భార్య ఆదిలక్ష్మమ్మ, కుమారుడు పెంచలనరసింహం, సుబ్బరత్నమ్మ ఈ మొత్తాన్ని అందజేశారని ఆయన చె ప్పారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, తీర్థప్రసాదాలను అందజేశారు. -
చందన, సీఎంఆర్లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): చందన, సీఎంఆర్ ఫెస్టివ్ వండర్స్లో భాగంగా ఆదివారం లక్కీ డ్రాను నెల్లూరు రూరల్ ఇన్చార్జి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తీశారు. గిద్దలూరుకు చెందిన ఎం.గాయత్రి హీరో ప్లెషర్ స్కూటీ విజేతగా ప్రకటించారు. అలాగే డైలీ డ్రా తీయగా గ్రైండర్ను ఎం.అరినా (నెల్లూరు), ప్యాన్సెట్ను డి.నాగేంద్రబాబు, మిక్సీని సీహెచ్ బాలాజీ (కోవూరు), డిన్నర్సెట్ను వి.రాజగోపాల్ గెలుపొందారు. అలాగే మలేసియా ట్రిప్ విజేత బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పి.సురేష్ దంపతులకు టికెట్ను అందజేశారు. గత వారం స్కూటీ విజేత మోహన్రెడ్డికి కీని, అలాగే గ్రైండర్, పాన్సెట్, మిక్సీ, డిన్నర్సెట్లను గెలుపొందిన 35మందికి బహుమతులను గిరిధర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతికి వస్త్రాలు, బంగారు ఆభరణాలపై అనేక డిస్కౌంట్లు, ఆఫర్లు, వన్ప్లస్ వన్, వన్ప్లస్ టు, అలాగే ఒక చీర కొంటే రెండో చీర కేవలం రూ.1కే అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, సుబ్బన్న, శైలేష్, కిశోర్ పాల్గొన్నారు. -
కండలేరు సందర్శనపైనా ఆంక్షల సంకెళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రాపూరు–సైదాపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం కండలేరు జలాశయం సందర్శనకు ఆదివారం బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడుగడుగునా ఆంక్షలతో అడ్డుకున్నారు. సోమశిల జలాశయ సందర్శనపై శనివారం ఉక్కుపాదం మోపినట్లుగానే తాజాగా కండలేరు సందర్శననూ పోలీసులు నిలువరించారు. నెల్లూరు జిల్లా ప్రజలు, రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు కండలేరు ప్రాజెక్టుకు ఆదివారం బయల్దేరారు.ఆయనతో పాటు పార్టీ నెల్లూరు రూరల్, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్యను కండలేరు ముఖద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మార్గంమధ్యలో నెల్లూరు, పొదలకూరు, డేగపూడి, కండలేరు డ్యామ్ మెయిన్ రోడ్డు వద్ద బారికేడ్లను అడ్డుపెట్టి నిలువరించారు. రాపూరు, సైదాపురం, వెంకటగిరి, కలువాయి, పొదలకూరు, చేజర్ల మండలాలకు చెందిన రైతుల్ని కండలేరు వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే, ఎలాగోలా రైతులు పెద్ద సంఖ్యలో కండలేరు ముఖద్వారం వద్దకు చేరుకుని నేతలకు మద్దతు ప్రకటించారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అడ్డుకున్న డీఎస్పీ .. నేతలు బైఠాయింపు.. కండలేరు ముఖద్వారం వద్దకు చేరుకున్న కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటిని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ అక్కడే నిలిపేశారు. ఐదుగుర్ని మాత్రమే జలాశయ సందర్శనకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో తమను ఎందుకు పంపరని పోలీసులను ప్రశి్నస్తూ ముఖద్వారం వద్ద కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటి బైఠాయించారు. పోలీసులు సైతం ముఖద్వారం వద్ద భారీగా మోహరించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పర్యవేక్షణలో ఆరుగురు సీఐలు, ఎస్సైలు, అదనపు బలగాలతో నేతలను నియంత్రించారు. ప్రాజెక్టు సందర్శనకు 50 మందికి అనుమతివ్వాలని కాకాణి డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు ససేమిరా అనడంతో నాలుగు గంటల పాటు ముఖద్వారం వద్దే నేతలు బైఠాయించారు. బలవంతంగా నేతల అరెస్టు.. తుపాను ప్రభావంతో వర్షం కురుస్తున్నా వైఎస్సార్సీపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించిన నాయకులు ఎంతసేపైనా అక్కడే ఉంటామని వెల్లడించడంతో రైతులు వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని షామియానాలను తీసుకొచ్చారు. అయితే, వీటిని తొలగించేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. సా.3.45 గంటల సమయంలో పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటిని అరెస్టుచేసి రాపూరు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో కాకాణి, కిలివేటిని లాక్కెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేయగా తోపులాట జరిగింది. ఆ తర్వాత నేతలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.బాబు అర్ధంతరంగా ప్రాజెక్టును ఆపేశారు.. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంత రైతులకు ఎలాంటి కష్టాలు రాకూడదని, మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించారని చెప్పారు.పనులు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును అర్ధంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు. అరెస్టులకు భయపడేదిలేదని, చావుకైనా సిద్ధపడే వచ్చామని ఆయన స్పష్టంచేశారు. ఎవరైతే దీనిపై గళం విప్పుతారో వారిని అరెస్టుచేస్తున్నారని.. రైతు ద్రోహిగా ముద్రపడుతుందనే భయంతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఇక రేవంత్రెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన చీకటి ఒప్పందాలను ప్రజలకు తెలియజేసేందుకే జలాశయ సందర్శనకు వచ్చామని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి చెప్పారు. -
బాబూ.. అరెస్ట్లతో వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేయిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరు అని చెప్పుకొచ్చారు. అరెస్ట్లతో వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు అని అన్నారు.కండలేరు డ్యామ్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. సీమ లిఫ్ట్ నిలిపేసి నెల్లూరు జిల్లాకు బాబు ద్రోహం చేశారు. లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు భయపడేవాళ్లం కాదు. పోలీసులను అడ్డుకుని చంద్రబాబు.. దాడులు చేయిస్తున్నాడు. పోలీసు శాఖ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మొండి వైఖరి ప్రవర్తిస్తోంది.కండలేరు డ్యామ్ పరిశీలనకు వెళ్ళకుండా అరెస్టులు చేస్తారా?. అరెస్టులతో మా పోరాటం ఆగదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆశయాలు, ఆదేశాలతో పోరాడుతూ ముందుకు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల వలన నెల్లూరు జిల్లాకు కూడా చంద్రబాబు తీరని లోటు తలపెట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ నేతల కండలేరు సందర్శన అడ్డగింత
నెల్లూరు: రాపూర్ మండలంలోని కండలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిజర్వాయర్ సందర్శనకు వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం(జనవరి1వ తేదీ) వైఎస్సార్సీపీ నేతల కండలేరు సందర్భనన అడ్డుకున్నారు. పొదలకూరు సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నేతల్ని అడ్డగించారు పోలీసులు. అదే సమయంఓ కండలేరు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. దాంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు కాకాణితో పాటు పలువురు నేతలు.దీనిపై నేదురమల్లి రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తమను అడ్డకుంటున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అర్థాంతరంగా నిలిపివేస్తే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబులు లోపాయకారీ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శిస్తన్నారు. -
అదుపుతప్పి కారు బోల్తా
దగదర్తి: మండల పరిధిలోని సున్నపుబట్టి అటవీ ప్రాంతం వద్ద జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న కారు శనివారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న కారు సున్నపుబట్టి అటవీ ప్రాంతం వద్దకు రాగానే మలుపు వద్ద వేగాన్ని నియంత్రించలేక అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. కారులో నలుగురు ప్రయాణిస్తున్నారని వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారన్నారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో నెల్లూరు హాస్పిటల్కు తరలించామని ఎస్సై జంపానికుమార్ తెలిపారు. ఉదయగిరిలో కార్డన్ సెర్చ్ ● 26 బైక్లు, మూడు ఆటోలు సీజ్ ఉదయగిరి: ఉదయగిరి పట్టణ సమీపంలోని బీసీ కాలనీలో శనివారం సీఐ ఎన్.వెంకట్రావ్, ఉదయగిరి కలిగిరి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది 50 మందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాలనీలోని 270 గృహాల్లో తనిఖీలు నిర్వహించి ఎలాంటి ధ్రువపత్రాల్లేని 26 మోటార్ బైక్లు, మూడు ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. ఎస్సైలు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు, ఆదిలక్ష్మి, రఘునాథ్, శివకృష్ణారెడ్డి, ఉమా శంకర్, వీరప్రతాప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శాంతినగర్లో.. బుచ్చిరెడ్డిపాళెం రూరల్: పట్టణంలోని శాంతినగర్లో శనివారం డీఎస్పీ జి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేరాలను అదుపులో ఉంచేందుకు కార్డన్ సెర్చ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనాలకు సంబంధించి లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించడం ద్వారా దొంగతనం చేసిన వాహనాలు, నిందితులను పట్టుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 11.5 కిలోల గంజాయి స్వాధీనం వెంకటాచలం (పొదలకూరు): ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 11.5 కిలోల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ పి.అనిత తన సిబ్బందితో కలిసి శనివారం వెంకటాచలం టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్స్ బస్సులో అన్నవరానికి చెందిన రజిత్ పిచ్చాడి అనే వ్యక్తి చైన్నెకు 11.5 కిలోల గంజాయిను తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా అన్నవరంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయిను కొనుగోలు చేసి చైన్నెలో అమ్ముకునేందుకు వెళ్తున్నట్లుగా వెల్లడించాడు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు గిరిబాబు, మురళీమోహన్ పాల్గొన్నారు. -
భూ ఆక్రమణకు యత్నం
మర్రిపాడు: టీడీపీ అధికారంలోకి వచ్చాక విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి. మెట్ట మండలమైన మర్రిపాడులో అత్యధిక ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీంతో కూటమి నాయకులు ప్రతి నిత్యం ఏదో ఒక గ్రామంలో భూ ఆక్రమణలకు బరితెగిస్తూనే ఉన్నారు. మండలంలోని చాబోలు గ్రామంలో మేడిబోయిన వెంకటాద్రి అనే వ్యక్తి సర్వే నంబర్ 388, 391లలో జేసీబీతో శనివారం భూ ఆక్రమణకు ప్రయత్నించాడు. దీంతో స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ సిబ్బంది భూ ఆక్రమణను అడ్డుకున్నారు. గతంలోనే వెంకటాద్రి గ్రామ సర్వే నంబర్ 400, 403లలో ఎస్టీల సాగులో ఉన్న పది ఎకరాల భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు చేపట్టినట్లు స్థానిక ఎస్టీలు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఎస్టీలు కోరుతున్నారు. రెవెన్యూ సిబ్బందికి తాము సమాచారం ఇచ్చి వారు వచ్చి పదే పదే హెచ్చరిస్తున్నా బరితెగింపుగా భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని, దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని విన్నవిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ అనిల్కుమార్ యాదవ్ను వివరణ కోరగా గ్రామస్తుల సమాచారం ఇచ్చిన వెంటనే ఆక్రమణలను నిలిపివేశామని, మండలంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు. -
కమనీయం.. నృసింహుని కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం కమనీయంగా జరిగింది. ఉదయం అభిషేకాలు, సుప్రభాతం, పూలంగిసేవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను నిత్య కల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కల్యాణం గావించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిలో సహస్ర దీపాలంకరణ మండపంలోకి తీసుకొచ్చి అర్చకులు ఊంజల్సేవ చేశారు. నిత్యాన్నదానానికి విరాళాలు స్వామివారి నిత్యాన్నదాన పథకానికి ఇందుకూరుపేట మండలం గమళ్లపాళెం గ్రామానికి చెందిన తుళ్లూరు పెంచల నరసయ్య, రాజేశ్వరమ్మ దంపతులు రూ.51,381 నగదును అందించినట్లు దేవస్థానం ఏసీ శ్రీనివాసులు తెలిపారు. అలాగే ఆత్మకూరు మండలం నరసాపురానికి చెందిన కోటంరెడ్డి సుబ్బారెడ్డి, రాజేశ్వరి దంపతులు రూ.50 వేల నగదు అందించినట్లు చెప్పారు. -
సెమీ ఓపెన్ జైలు నుంచి ఖైదీ పరార్
నెల్లూరు(క్రైమ్): చెముడుగుంటలోని సెమీ ఓపెన్ జైలు నుంచి ఖైదీ పరారైన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన షేక్ చిన్నసైదులు భార్య హత్య కేసులో నిందితుడు. ఇతనికి కోర్టు 2022లో జీవితఖైదు విధించింది. రెండేళ్ల పాటు ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించారు. 2024 చివరలో జైలు ఉన్నతాధికారులు ఆయన్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి మార్చారు. ఆరు నెలలుగా చిన్నసైదులు సెమీ ఓపెన్ జైలులో వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం తోటి ఖైదీలతో కలిసి సెమీ ఓపెన్ జైలులో పనులకు వెళ్లారు. అక్కడి నుంచి ఆయన పరారయ్యారు. సాయంత్రం జైలు సిబ్బంది ఖైదీలను లెక్కించే క్రమంలో చిన్నసైదులు కనిపించకపోవడంతో వెంకటాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. 14, 15న నిమ్మ యార్డుకు సెలవు పొదలకూరు: స్థానిక ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డుకు సంక్రాంతి సందర్భంగా వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నట్టు అసోసియేషన్ కోశాధికారి మెంతెం బాలకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. 15వ తేదీ గురువారం సంక్రాంతి సందర్భంగా సెలవు ప్రకటించామని, ప్రతి బుధవారం మార్కెట్కు సెలవు అయినందున రెండు రోజులు మార్కెట్ ఉండదన్నారు. రైతులు గురువారం కాయలు కోసి శుక్రవారం మార్కెట్కు తీసుకు రావాల్సిందిగా సూచించారు. 13న డైట్ కళాశాలలో స్క్రాప్ వేలం నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని డైట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పాత (స్క్రాప్) ఇనుప సామగ్రిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 13న బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి, ఇన్చార్జి డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల స్క్రాప్ వ్యాపారులు, వేలం దారులు డైట్ కళాశాలలో జరిగే వేలానికి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 94404 58428 నంబర్ను సంప్రదించాలన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,678 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 18,173 మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.82 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు మూడు గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. లిఫ్ట్ ఇస్తానని నగదు దోపిడీ నెల్లూరు(క్రైమ్): లిఫ్ట్ ఇస్తానని ఓ వృద్ధుడిని బైక్ ఎక్కించుకుని దారి మళ్లించి బ్యాగ్లోని నగదును గుర్తుతెలియని దుండగుడు దోచుకెళ్లిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో ఓ వృద్ధుడు కొత్తూరు వెళ్లేందుకు ఆటో కోసం వేచి చూస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో దారి మళ్లించి నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ వీధిలోని ఓ స్కూల్ సమీపంలోకి తీసుకెళ్లి వృద్ధుడి బ్యాగ్లోని నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధితుడు కుటుంబసభ్యులకు తెలియజేసి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కండలేరులో 61.350 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 61.350 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,950 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ఇక్కడి నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,150, లోలెవల్ కాలువకు 100, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. గుంతలను తప్పించబోయి.. సైదాపురం: మండల కేంద్రానికి సమీపంలోని కల్వర్టు వద్ద శనివారం సవక కర్రను తరలిస్తున్న లారీ గుంతలను తప్పించే క్రమంలో బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండో సంక్రాంతి పండగ వచ్చినా కూడా ఏ రోడ్డూ బాగుపడిన పరిస్థితులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భగవతారాధనతో జీవితానికి సాఫల్యత నెల్లూరు(బృందావనం): భగవంతుని ఆరాదించడం ద్వారా జీవితానికి సాఫల్యత కలుగుతుందని కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి మహాస్వామి అనుగ్రహభాషణ చేశారు. పప్పులవీధిలోని గురుదత్తాత్రేయ మఠంలో శనివారం జరిగిన వార్షికోత్సవానికి ఆయన విచ్చేశారు. తొలుత మఠం ప్రాంగణంలోని సౌభాగ్య సరస్వతి అమ్మవారిని, పరివార దేవతలకు పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి మంగళ శాసనాలను అందించారు. కలియుగంలో మనకు అవసరమైనది భక్తి యోగమన్నారు. పాప, పుణ్యాల ఫలితంగానే జన్మలు ప్రాప్తిస్తాయన్నారు. కార్యక్రమంలో కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన పండితులు, వైదిక రత్న మాచవోలు రమేష్శర్మ, గురుదత్తాత్రేయ మఠం మేనేజర్ మాచవోలు అనూరాధ, ప్రసాద్, కసవరాజు శ్రీధర్, కాకుటూరు శ్రీహరి, గ్రంధి లోకేష్బాబు, రాజాశ్రీనివాసరావు, చల్లగుండ్ల మోహన్రావు, గురురాజ, ఏడుకొండలు, పచ్చిపులుసు శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు. -
పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం
కావలి(అల్లూరు): పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. చెన్నాయపాళెం ప్రాంతంలో కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. రైతులకు ఎలాంటి అపోహలు, ఇబ్బందులు కలుగకుండా, చట్టప్రకారం అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాస్ పుస్తకాల పంపిణీతో పాటు ఈకేవైసీ పూర్తి కావడం కీలకమన్నారు. సమావేశంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకోవడం దుర్మార్గం
సోమశిల: రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తోందని, వారు చేసే తప్పులను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నేతలను అడ్డుకోవడం దారుణమని.. పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్ట్లు, గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. సోమశిల జలాశయాన్ని శనివారం సందర్శించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తదితరులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ శ్రేణులు, అభిమానులు, రైతులు సోమశిలకు బయల్దేరగా, మార్గమధ్యలో ఉప్పలపాడు జాతీయ రహదారి జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ బిజ్జివేముల పిచ్చిరెడ్డి మాట్లాడారు. కాకాణితో పాటు పలువుర్ని నిర్బంధించడాన్ని ఖండించారు. అనంతరం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సంగం మండల మాజీ కన్వీనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. -
ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు
నెల్లూరు రూరల్: సోమశిల జలాశయ పరిశీలనకు వెళ్లనీయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నివాసం వద్ద పోలీసులను మోహరించి.. నోటీసులను అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనకు నోటీసులను అందజేశారు. -
బాబులో వణుకు
● చంద్రబాబు పాపాలు.. రైతుల పాలిట శాపాలు సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగం, ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు తాము ఎందాకై నా పోరాడతామని, కాల్చి చంపినా.. లాఠీచార్జీలు జరిపినా, అరెస్ట్లు చేసినా వెనక్కి తగ్గేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయడంతో సీమతో పాటు నెల్లూరుకు జరిగే అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో కలిసి సోమశిల జలాశయాన్ని శనివారం సందర్శించేందుకు ఆయన నిర్ణయించారు. అయితే ప్రాజెక్ట్ సందర్శనను అడ్డుకునేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని తమను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ విలేకరులతో కాకాణి మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాటకం బయటపడిందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో అక్కడి సీఎం రేవంత్రెడ్డి ప్రకటనతో రాష్ట్ర రైతాంగానికి ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు. అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడారని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో శ్రీశైలం నుంచి నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కులను తీసుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు. దీని ద్వారా సోమశిల ప్రాజెక్టుకు సాగునీరు సమృద్ధిగా అందిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు జుట్టు తెలంగాణ చేతిలో ఉండటంతో.. వారు చేసే దౌర్జన్యాలను ఆపే ధైర్యం ఆయనలో లోపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించిన నాటి సీఎం జగన్మోహన్రెడ్డి.. నెల్లూరు ప్రాంత సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం రోజూ మూడు టీఎంసీలను తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. దీనికి గానూ నిధులను కేటాయించి పనులను ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే వీటిని చంద్రబాబు అర్థాంతరంగా ఆపేసి.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి అమ్ముడుబోయారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమా కాదాననే అంశాన్ని ఆయన తెలియజేయాలని డిమాండ్ చేశారు. పొంతని లేని మాటలు చంద్రబాబుతో రహస్యంగా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయించానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్రెడ్డి చెప్పారన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన చంద్రబాబు, దానికి విరుద్ధంగా పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది రాయలసీమ నుంచి వచ్చిన వారేనన్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది దివంగత సీఎం వైఎస్సారేనని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడు కావడంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలంగాణలో 2014 – 19 మధ్య నిర్మించిన ప్రాజెక్టులతో పాటు కొన్నింటి సామర్థ్యాన్ని పెంచి 777 నుంచి 800 అడుగుల్లో రోజూ ఎనిమిది టీఎంసీలను వాడుకుంటోందని ఆరోపించారు. ఈ తరుణంలో మూడు టీఎంసీలను తీసుకొచ్చేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే, రహస్య ఒప్పందంతో దానికి చంద్రబాబు గండికొట్టారని మండిపడ్డారు. జిల్లాలో సోమశిల జలాశయంపై ఆధారపడి లక్షలాది మంది రైతులున్నారని తెలిపారు. హౌస్ అరెస్ట్లు దారుణం సోమశిల జలాశయ సందర్శనకు వెళ్తున్న తమను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. భవిష్యత్తు భయంకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన దుర్మార్గాలు బయటకు రాకుండా ఉండాలనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికై నా ఆయన తన స్వార్థ ప్రయోజనాలను విడనాడి.. రైతుల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఆయన మెడను వంచైనా జిల్లాకు రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని స్పష్టం చేశారు. కోవూరు: ప్రజా సమస్యలపై గళమెత్తే ప్రతిపక్ష నేతలను చూసి సీఎం చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. సోమశిల జలాశయ సందర్శనకు వెళ్లనీయకుండా ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి కుమ్మకై ్క రాష్ట్ర రైతుల పొట్టగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు గానూ రేవంత్రెడ్డితో చంద్రబాబు లాలూచీ పడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ఆపేస్తున్నారని ఆరోపించారు. సోమశిల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. తామేమైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులమా.. లేక సోమశిల డ్యామ్ను పేల్చేసేందుకు వెళ్తున్నామానని ప్రశ్నించారు. శాంతియుతంగా సందర్శించి, వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే తమ యత్నాన్ని అడ్డుకోవడం పిరికితనానికి పరాకాష్టగా అభివర్ణించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కాకముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్ట్లు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయన నివాసం వద్దకు చేరుకొని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన తప్పులు బయటపడతాయని ఆయనలో భయం అందుకే హౌస్ అరెస్ట్లు మెడలు వంచైనా సాగునీటి వాటాను సాధించుకుంటాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
సోమశిల సందర్శనపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు, రైతుల భవిష్యత్ను తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి.. సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్ సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్లతో నానాహంగామా సృష్టించారు. సోమశిల డ్యామ్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునిచి్చంది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకుని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర్ర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు.సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై మూడుచోట్ల, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు రెండు ప్రాంతాలతోపాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు. కాకాణి నివాసం వద్ద ఉద్రిక్తత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకాణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకువజాము నుంచే కాకాణి నివాసం వద్ద కాపు కాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, కిలివేటి సంజీవయ్యతోపాటు వందలాది మంది కార్యకర్తలు కాకాణి నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లడం నేరమా? అంటూ కాకాణి వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకాణితోపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాణి నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జి కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశి్నంచారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తే గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలి పెట్టబోమని మండిపడ్డారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
● హోం మంత్రి అనిత నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చెముడుగుంటలోని కేంద్ర కారాగారాన్ని ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. కారాగారంలో పరిశ్రమల విభాగం, ఖైదీల బ్యారక్, వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులను ఆరాతీశారు. అనంతరం పోలీస్ అతిథిగృహానికి చేరుకున్న ఆమె పలు అంశాలపై జిల్లా పోలీస్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఖైదీల జీవన విధాన మార్పునకు జైలు అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. స్వయంగా పేస్టులు, షాంపులు, నూనె, బీరువాలను తయారు చేస్తూ నెలకు రూ.ఏడు వేల నుంచి రూ.ఎనిమిది వేలను సంపాదించుకుంటున్నారని వివరించారు. జైలు, అగ్నిమాపక శాఖల్లో కొంతకాలంగా ఎలాంటి నియామకాలు జరగని కారణంగా ఖాళీలున్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ను త్వరలో విడుదల చేసి నియామకాలు చేపడుతామని చెప్పారు. పోలీస్ రిక్రూట్మెంట్ను ఏటా చేపడతామని వెల్లడించారు. ఎస్పీ అజిత పనితీరును అభినందించారు. ఏఎస్పీ సౌజన్య, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల నిరసన
నెల్లూరు (లీగల్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధులను న్యాయవాదులు నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యపరెడ్డి మాట్లాడారు. న్యాయమిత్ర పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు రూ.పది వేల స్టయ్పండ్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ నిధులతో హెల్త్ ఇన్సురెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. గతేడాది జూలైలో హైకోర్టు జారీ చేసిన సర్కులర్ను ఉపసంహరించాలని పేర్కొన్నారు. ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి వెంకటాచలం(పొదలకూరు): యువత ఉద్యోగాల కోసమే కాకుండా ఉపాధిని కల్పించే స్థాయికి ఎదగాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వర్సిటీలో ఐదు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ శుక్రవారంతో ముగిసింది. సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. యు వత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాంక్షించారు. స్టార్టప్లపై సమగ్ర అవగాహనను కల్పించామని వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. టెట్ ఫలితాల విడుదల నెల్లూరు (టౌన్): టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ పది నుంచి 21 వరకు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 10,640 మంది రిజిస్టర్ చేసుకోగా, 9928 మంది హాజరయ్యారు. 48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యాసంస్థలకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈ నెల 18 వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు పాఠశాలలపై చర్యలు చేపడతామని డీఈఓ బాలాజీరావు స్పష్టం చేశారు. పోర్టుకు ఐసీసీ పర్యావరణ అవార్డు ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చాంపియన్ – ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ భాగస్వామ్య సదస్సులో అవార్డును అందజేశారు. పురస్కారాన్ని అందుకున్న వారిని పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ అభినందించారు. -
పోలీసులు, అధికారులూ జాగ్రత్త
నెల్లూరు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడబోదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రాజ్యాంగ హక్కులు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులతో నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి కాకాణి శుక్రవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. ప్రభుత్వం మారితే వారెవరూ దరిదాపుల్లో ఉండరని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అక్రమ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. వీరిని 28 రోజులుగా నిర్బంధించినా, చెక్కు చెదరని ఆత్మస్థయిర్యం, గుండె నిబ్బరంతో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నియంతృత్వ పోకడలతో అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించాలనే దుర్మార్గమైన కుట్రకు తెరలేపారని దుయ్యబట్టారు. 19 నెలల ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవాలంటే, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పాలనను అందించాలని చెప్పారు. అయితే ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులను పెడతామని, జైలుకు పంపిస్తామనే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల హామీల మేరకు యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ను అమలు చేయడంలేదని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించినందుకు గానూ నెల్లూరులో పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జునతో పాటు విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమిటని నిలదీశారు. అక్రమ కేసులో 28 రోజులుగా జైల్లో శిక్ష చంద్రబాబువి నియంతృత్వ పోకడలు వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయాలనే కుట్రతో అక్రమ కేసులు ప్రభుత్వ 19 నెలల పాలనను ప్రజలు ఛీ కొడుతున్నారు పిన్నెల్లి సోదరులతో కాకాణి, గోపిరెడ్డి ములాఖత్ Æð‡yŠæº$MŠS Æ>gêÅ…VýS… õ³Æý‡$™ø §ýl$Æ>Ã-Æ>Y-ÌSMýS$ ÌZMóSÔŒæ ´ëÌSµ-yýl$™èl$-¯é²Æý‡° Vøí³-Æð‡yìlz }°-Ðé-çÜÆð‡yìlz «§ýlÓf-Ððl$-™é¢Æý‡$. AçÜË$ çÜ…º…-«§ýlÐól$ Ìôæ° MóSçÜ$ÌZ í³¯ðl²-ÍÏ Ýù§ýlÆý‡$-ÌS¯]l$ AÆð‡‹Üt ^ólíÜ Ðól«¨…-^èlyýl… A¯éÅ-Ķæ$-OÐðl$¯]l ^èlÆý‡ÅV> AÀ-Ð]l-Ç-~…-^éÆý‡$. sîæyîl-ï³ÌZ° Æð‡…yýl$ Ð]lÆ>YÌS Ð]l$«§ýlÅ B«¨ç³™èlÅ ´ùÆý‡$ M>Æý‡-׿…V> çßæ™èlÅË$ fÇV>Ķæ$° çÜÓĶæ$…V> Aç³µsìæ Gïܵ MýS…^ólsìæ }°Ðé-çÜ-Æ>Ð]l# ^ðl´ëµ-Æý‡-¯é²-Æý‡$.️ çœ$r¯]l fÇ-W¯]l VýS…r-ÌZõ³ AMýSPyìl-MðS-ãÏ A°² ç³ÇÖ-Í…-^éMýS Ò$yìlĶæ* çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ ÑÐ]lÆ>-ÌS¯]l$ BĶæ$¯]l ÐðlÌSÏyìl…-^é-Æý‡-°, AƇ$$™ól CÐólÒ ç³sìæt…^èl$-Mø-MýS$…yé MýS„ýS-Ýë-«¨…ç³# ^èlÆý‡ÅÌZÏ ¿êVýS…V> í³¯ðl²-ÍÏ Ýù§ýlÆý‡$-ÌSOò³ A{MýSÐ]l$ MóSçÜ$ ò³sìæt Ðól«¨-çÜ$¢-¯é²Æý‡° Ð]l$…yìlç³-yézÆý‡$. Cç³µ-sìæMóS Æð‡…yól-âýæÏ-Ƈ$$…§ýl-°, Ð]l$Æø Æð‡…yólâ¶æ$Ï Cº¾…¨ ò³yýl-™é-Æó‡-Ððl*¯]l±, B ™èlÆ>Ó™èl Ò$ ç³Çíܦ† HÑ$sZ BÌZ-_…-^èl$-Mø-ÐéÌS° íßæ™èlÐ]l# ç³ÍM>Æý‡$. C糚yýl$ GÐ]l-OÆð‡™ól ™èl糚yýl$ MóSçÜ$Ë$ ò³yýl$™èl$-¯é²Æø, ÐéDZ A§ól OgñæâýæÏÌZÏ ò³sôæt Æøk MýS_a-™èl…V> Ð]lçÜ$¢…§ýl° çܵçÙt… ^ólÔ>Æý‡$. í³¯ðl²ÍÏ Ýù§ýlÆý‡$Ë$ ™èlÓÆý‡V> ºÄ¶æ$-rMýS$ Æ>ÐéÌS° M>…„ìSçÜ*¢ ç³Ìê²yýl$ hÌêÏ ÐéÅç³¢…V> MöÐöÓ-™èl$¢ÌS Æ>ÅÎ-ÌS¯]l$ °Æý‡Óíßæ-çÜ$¢¯é²Æý‡-°, Ñ$W-ͯ]l A°² °Äñæ*-f-MýS-Ð]l-Æ>YÌZϯ]l* D ™èlÆý‡-àÌZ °Æý‡-çÜ-¯]lÌS¯]l$ ™ðlÍ-Ķæ$-gôæ-Ķæ$-¯]l$-¯é²Ð]l$° ÑÐ]l-Ç…-^éÆý‡$. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట దుర్మార్గాలు -
ఆటోలు, మోటార్బైక్ల స్వాధీనం
పొదలకూరు: పట్టణంలోని విఘ్నేశ్వరపురం (ఎమ్మార్వో) కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి తనిఖీలు చేశారు. ఈ ప్రాంతంలో 15 వీధుల్లో జల్లెడ పట్టి పత్రాలు సక్రమంగా లేని రెండు ఆటోలు, 22 మోటార్బైక్లను స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పేకాట, కోడిపందేలు ఆడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీగా జరిమానాలు ఉంటాయన్నారు. డీఎస్పీ వెంట పొదలకూరు, పోర్టు సీఐలు ఎ.శివరామకృష్ణారెడ్డి, రవినాయక్, ఎస్సై హనీఫ్ తదితరులున్నారు. పోలీసుల అదుపులో అనుమానితులు వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని యర్రబల్లిపాళెంలో జరిగిన చోరీ కేసులో అనుమానితులుగా భావిస్తున్న జాతకం చెప్పే ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. వీరితోపాటు బంగారం పోగొట్టుకున్న బాధితులను కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎస్సై వీరప్రతాప్ మాట్లాడుతూ అనుమానితులను విచారిస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
చిరుధాన్యాలను సాగు చేయాలి
పొదలకూరు: పంటల మార్పిడిలో భాగంగా చిరుధాన్యల సాగును రైతులు అధికంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి సూచించారు. స్థానిక చిరుధాన్య పరిశోధన స్థానంలో ఐదు మండలాల రైతులు శుక్రవారం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల మేళాకు హాజరైన ఆమె మాట్లాడారు. వరినే సంప్రదాయ పద్ధతిలో పండిస్తున్నారని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయమొచ్చే చిరుధాన్యాలనూ సాగు చేయాలని సూచించారు. నెల్లూరు, పొదలకూరు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు, ప్రసన్న రాజేష్, ప్రకృతి వ్యవసాయ డీపీఎం వెంకురెడ్డి, పొదలకూరు, నెల్లూరు ఏడీఏలు శివనాయక్, నర్సోజీ పాల్గొన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు నెల్లూరు(పొగతోట): యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ధరలకు విక్రయించే డీలర్ల లైసెన్స్లను రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం – 1985 మేరకు కఠిన చర్యలను చేపడతామని చెప్పారు. ప్రైవేట్ డీలర్లు, కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్ఎస్కేలు, మార్క్ఫెడ్, రిటైల్, హోల్సేల్ గోదాముల్లో 15,795 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించారు. -
లారీ క్యాబిన్ దగ్ధం
నెల్లూరు(క్రైమ్): వైర్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీ క్యాబిన్ దగ్ధమైన ఘటన నెల్లూరు జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాజస్థాన్ నుంచి విద్యుత్ వైర్ లోడ్తో లారీ చైన్నెకి బయలుదేరింది. శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ సమీప జాతీయ రహదారిపైకి వచ్చేసరికి లారీలోని వైర్లు షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన అటుగా వెళ్లేవారు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. సిబ్బంది సీహెచ్ నారాయణ, కిరణ్ తదితరులు ఫైర్ ఇంజిన్తో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. లారీ క్యాబిన్ దగ్ధమైంది. -
మార్కెట్లోకి కియా న్యూ సెల్టోస్ కారు
నెల్లూరు(టౌన్): కాకుటూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కారు షోరూంలో శుక్రవారం ఆల్ న్యూ కియా సెల్టోస్ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథరెడ్డి మాట్లాడుతూ ఈ కారులో గ్లోబల్ కే3 – ఈ ప్లాట్ఫారం భారతదేశంలోనే మొదటిసారిగా ఈ సెగ్మెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కొత్త రకం ఎస్యూవీ కియా న్యూ సెల్టాస్ ప్రారంభ ధర రూ.10.99 లక్షలు ఉందన్నారు. ఈ కారు 8 రంగుల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. బుకింగ్ కోసం 86888 29718 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో షోరూం డైరెక్టర్లు నిరంజన్, భారతి, హోషిమారెడ్డి, ఆశిష్రెడ్డి పాల్గొన్నారు. మహీంద్ర నూతన కార్లు మార్కెట్లోకి విడుదల నెల్లూరు(టౌన్): స్థానిక మహీంద్ర డీలర్ బాలాజీ ఏజెన్సీస్ అండ్ ఇండస్ట్రీస్లో శుక్రవారం మహీంద్ర అండ్ మహీంద్ర కు చెందిన ఎక్స్ యూవీ 7 ఎక్స్ఓ, ఎక్స్ఈవీ 9ఎస్ కార్లను ఆర్డీఓ అనూష చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ పార్టనర్ యడ్లపల్లి సంజయ్ మాట్లాడుతూ ఎక్స్యూవీ 7ఎక్స్ఓ కారు పెట్రోలు, డీజిల్ వెర్షన్లో 11 రకాల మోడళ్లలో లభ్యమవుతుందన్నారు. రూ.13.66 లక్షలు నుంచి అందుబాటులో ఉందన్నారు. అదే విధంగా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ వాహనం 16 రకాల మోడళ్లలో లభిస్తుందన్నారు. దీని ధర రూ.19.95 లక్షల నుంచి అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో వేదాయపాళెం పోలీస్స్టేషన్ సీఐ శ్రీనివాసరావు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. చెరువుకట్ట ధ్వంసం కోట: ఉత్తమ నె ల్లూరు చెరువుకట్ట ను ధ్వంసం చేసి మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరు తున్నారు. ఇటీవ ల కురిసిన వర్షాలకు చెరువు జలకళ సంతరించుకుంది. కట్టల పటిష్టత కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెరువుకట్టను కొందరు యంత్రాలతో కోతకు గురిచేసి మట్టిని తరలించారు. స్థానిక అధికార పార్టీ నాయకుడు రోడ్డు పనుల కోసం కట్టను తెగ్గొట్టి ఆ మట్టి తీసుకెళ్లినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ మునిరత్నంను వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉద్యమంపై ఖాకీల ఉక్కుపాదం
20 మంది అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): గాంధీబొమ్మ వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం, వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన 20 మందిని చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఊటుకూరు నాగార్జున, ఆశ్రిత్రెడ్డి, తౌఫిక్, వంశీ, దిలీప్, నానీ, యస్దానీ, సునీల్, ప్రవీణ్, విష్ణువర్ధన్ తదితరులున్నారు. నెల్లూరు రూరల్: గత ఎన్నికలకు ముందు విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాలతో పాటు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్యూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక పిలుపు మేరకు పలువురు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నగరంలోని గాంధీబొమ్మ వద్ద శాంతియుతంగా నిరసనను శుక్రవారం చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగ నేతలు తమ చేతులకు సంకెళ్లేసుకొని సర్కార్ వైఖరిని ఎండగట్టారు. రోడ్డుపై ఓ పక్కన బైఠాయించారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నా, అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఉద్యమంపై ఖాకీలు ఉక్కుపాదం మోపారు. చిన్నబజార్ పోలీసులొచ్చి ఆందోళనను ఆపాలంటూ హుకుం జారీ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా నిరసన తెలుపుతున్నామని వారు చెప్పినా, తమ మార్కును ప్రదర్శించారు. తామెలాంటి తప్పూ చేయలేదని, రాజ్యాంగ పరిధిలోనే నిరసన చేపట్టామని తెలిపినా, వినకుండా నిరంకుశంగా అరెస్ట్ చేసేందుకు యత్నించారు. దీంతో వారు ప్రతిఘటించారు. ఓ దశలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు నేతలను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనంలో పడేసి చిన్నబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆపై అక్రమ కేసులను నమోదు చేశారు. హామీలను అమలు చేసేంత వరకు పోరుబాట నిరసనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగ అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ను ఏటా జనవరి ఒకటిన విడుదల చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని వారు చెప్పారని, అయితే అధికారంలోకి వచ్చి 19 నెలలైనా, దీన్ని ప్రకటించకుండా, మోసం చేశారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల నుంచి విద్యార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఉపకార వేతనాలనూ సకాలంలో విడుదల చేయడంలేదని విమర్శించారు. ప్రైవేట్ను ప్రోత్సహిస్తూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత మంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనాన్ని ఇస్తామని నమ్మబలికిన సర్కార్ అనేక మందికి కోత విధించిందని దుయ్యబట్టారు. 20 లక్షల ఉద్యోగాలను కల్పించడంతో పాటు జాబ్ వచ్చేంత వరకు నిరుద్యోగులకు రూ.మూడు వేల చొప్పున భృతిని ఇస్తామని చెప్పి, ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విద్య, వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి, పేదలను ఆదుకున్నారని గుర్తుచేశారు. అబద్ధాల ప్రభుత్వం రాష్ట్రంలో అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మస్తాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మున్నా, పీడీఎస్యూ జిల్లా నేత సునీల్ ఆరోపించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో తన పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన వైఎస్సార్సీపీ నేతలను లాక్కెళ్తున్న పోలీసులు సంకెళ్లేసుకొని నిరసన తెలుపుతూ.. సంకెళ్లతో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగ నేతల ఆందోళన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ హామీలు అమలు చేయాలంటే అరెస్టులా..? పోలీసులతో వాగ్వాదం, తోపులాట ఉద్రిక్త వాతావరణం -
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు ● నుజ్జునుజ్జయిన కుడిచేయి ● వాహనాన్ని వదిలేసిన పోలీసులు వింజమూరు(ఉదయగిరి): టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి కుడిచేయి కోల్పోయిన ఘటన శుక్రవారం వింజమూరు మండలం బత్తినవారిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొండాపురం మండలం యర్రబొట్లపల్లి వద్ద ఉన్న ఓ క్వారీ నుంచి తెల్లరాయి లోడుతో వింజమూరు వైపు టిప్పర్ వెళ్తోంది. అదే సమయంలో వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన కంచుపాటి ఆనంద్ మోటార్బైక్పై వింజమూరుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బత్తినవారిపల్లి సమీపంలో బైక్ వెళ్లేందుకు టిప్పర్ డ్రైవర్ సైడ్ ఇచ్చాడు. అయితే ఒక్కసారిగా మళ్లీ రోడ్డుపైకి వచ్చాడు. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. టిప్పర్ వెనుక టైరు ఆనంద్ కుడిచేయిపై ఎక్కడంతో నుజ్జునుజ్జయింది. ముఖంపై గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యు లు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు స్వాధీనం చేసుకోకుండా వదిలేయడంపై రాజకీయ ఒత్తిళ్లున్నట్లు ప్రచా రం జరుగుతోంది. క్షత్రగాత్రుడు నిరుపేద. బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ విషయమై ఎస్సై వీరప్రతాప్ను సంప్రదించగా వైద్యశాల నుంచి సమాచారం రాలేదని, వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తామని తెలిపారు. వాహనం వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. -
బస్సు సీటు.. పెద్ద పరీక్షే..
ఆత్మకూరు బస్టాండ్లో ఎదురుచూస్తూ.. సంక్రాంతి పండగకు మరికొద్దిరోజులే ఉంది. విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. దీంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సొంతూర్లకు వెళ్లేందుకు శుక్రవారం నెల్లూరులోని ప్రధాన, ఆత్మకూరు బస్టాండ్లకు క్యూ కట్టారు. అయితే బస్సులు తగినంత లేక, సకాలంలో రాక గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. వచ్చిన బస్సుల్ని ఎక్కేందుకు అష్టకష్టాలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
మండే స్వభావమున్న వస్తువులు తీసుకెళ్లొద్దు
● రైల్వే డీఎస్పీ మురళీధర్ నెల్లూరు(క్రైమ్): మండే స్వభావమున్న వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడం ప్రమాదకరం, నేరమని రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ ప్రయాణికులకు సూచించారు. ఇటీవల రైళ్లలో తర చూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బందితో కలిసి ప్రధాన రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దీంతో పలువురు తమవద్దనున్న అగ్గిపెట్టెలు, సిగరెట్ లైటర్లు స్వచ్ఛందంగా బయటపడేశారు. అనంతరం రైళ్లతోపాటు ప్లాట్ఫారమ్లపై తనిఖీలు చేశారు. కార్యక్రమంలో రైల్వే ఎస్సై హరిచందన పాల్గొన్నారు. గుడిసె దహనంపై పోలీసుల విచారణ కోట: ఊనుగుంటపాళెం పంట పొలాల్లో పూడి గుడిసెను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు చెముడుగుంట వెంకటయ్య అనే రైతు ఎస్సై పవన్కుమార్కు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. గుడిసెలో ఉన్న విలువైన విద్యుత్ సామగ్రి, పైపులు, ఎరువులు పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు తెలిపాడు. రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందన్నాడు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
విచారణ.. సాదాసీదాగా..!
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి.. ఈ అంశాలపై ప్రచురితమైన వార్తలను ఆధారంగా చేసుకొని వాస్తవాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన విచారణ ప్రక్రియ సాదాసీదాగా జరిగింది. నెల్లూరులోని హరనాథపురంలో గల ఇరిగేషన్ సెంట్రల్ కార్యాలయానికి విచారణ నిమిత్తం విజయవాడ వర్క్స్ అండ్ ఆడిట్ జేడీ శైలజ గురువారం వచ్చారు. ఎంకై ్వరీలో భాగంగా సెంట్రల్ డివిజన్లో ఈఈ నుంచి అక్కడ పనిచేస్తున్న అటెండర్లను పిలిచి వారికిచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయించుకొని వాటిని స్వీకరించారు. మమ.. అనిపించి..! మేనేజర్ స్థాయిలో ఉండే వ్యక్తి కాంట్రాక్టర్ల వద్ద ఎలా లంచాలు తీసుకున్నారనే విషయం అటెండర్ స్థాయి వారెలా చెప్పగలరో ఎవరికీ అంతుచిక్కడంలేదు. లంచాలిచ్చామని చెప్పిన కాంట్రాక్టర్లను విచారణకే పిలవకపోతే అసలు విషయం ఎలా బయటకొస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సంబంధిత అధికారులను సైతం పిలవకపోవడంతోనే అసలు ఎంకై ్వరీ తీరు ఎలా జరిగిందనే విషయం ఇట్టే అర్థమవుతోంది. మౌనమే.. సమాధానం విలేకరులు సంధించిన ఏ ప్రశ్నకూ.. జేడీ సమాధానమివ్వలేదు. విచారణాధికారిగా మిమ్మల్ని నియమించాక మీకు రూ.పది లక్షల లంచమిచ్చారనే ప్రచారం జరుగుతోందనే ప్రశ్నకు మాత్రమే స్పందించారు. మేనేజర్, తాను ఒకే శాఖ అయినా ఒక్కసారి ఆయనతో మాట్లాడలేదని.. విచారణలో తెలిసిన అంశాలను ప్రభుత్వానికి అందజేస్తానని, తనను మరే ప్రశ్న అడగొద్దని తెలిపారు. లంచమిచ్చామని చెప్పిన కాంట్రాక్టర్లను కనీసం విచారణకు పిలవకపోవడం.. పనులు చేయిస్తున్న కొందరు అధికారులనే ప్రశ్నించడంతో ఇదేమి ఎంక్వైరీనని ఆ శాఖలోని వారే పేర్కొంటున్నారు. దీని బట్టి మేనేజర్కు అధికార పార్టీ అండదండలున్నాయనే విషయం స్పష్టమవుతోంది. రంకెలేసిన మేనేజర్ తాను అవినీతికి పాల్పడితే నిరూపించాలనీ.. అయితే రాజకీయ నేతలు ప్రెస్మీట్లు పెడితే ఈ విచారణ ఏమిటనీ.. తానూ ప్రెస్మీట్ను ఏర్పాటు చేస్తాననీ.. సెలవులు పెడితే మీకెందుకు.. పెట్టకపోతే మీకెందుకు అంటూ విలేకరుల అడిగిన ప్రశ్నలకు మేనేజర్ గంగాధర్రెడ్డి రంకెలేశారు. ఈ విషయమై ఎస్ఈను సంప్రదించగా, విచారణకు ఈఈగా హాజరయ్యాననీ, వారడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనదని చెప్పారు. కాగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు వరకు సాగిన విచారణలో ఏ మాత్రం వాస్తవాలు తెలిశాయో వేచి చూడాల్సిందే. ఈఈ మొదలుకొని అటెండర్ల వరకు ఒకటే ప్రశ్నలు ప్రశ్నపత్రాలిచ్చి జవాబులు రాయించుకున్న వైనంగా తంతు కాంట్రాక్టర్లను అసలు పిలవనేలేదు కొంత మంది అఽధికారులపైనే ఎంకై ్వరీ ఇరిగేషన్ శాఖలో అవినీతిపై ఇదండీ తీరు -
ఇదేం పాడు పనులు ఆఫీసర్..?
సాక్షి టాస్క్ఫోర్స్: నెల్లూరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. అవినీతికే కాకుండా మహిళా ఉద్యోగులపై వేధింపులకూ అడ్డాగా మారింది. ఇక్కడ కొందరు అధికారుల తీరు జుగుప్సాకరంగా మారింది. తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులనే అంశాన్ని విస్మరించి లైంగిక వేధింపులకు పాల్పడి వారిని మానసికంగా వేధించి పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా ఓ మహిళా ఉద్యోగిని డివిజనల్ స్థాయి ఇంజినీరింగ్ అధికారి లైంగికంగా వేధించారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె విలపించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాధేయపడి.. సారీ చెప్పించి తనపై ఆఫీసర్ అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళా ఉద్యోగి బోరున విలపించారు. దీంతో సహచర ఉద్యోగులు ఆమెను ఓదార్చారు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె యత్నించగా, ఇరిగేషన్ శాఖ అధికారులు బతిమాలి.. సదరు అధికారితో సారీ చెప్పించారని తెలుస్తోంది. ఆయన్ను కాపాడేందుకు యత్నించిన తోటి అధికారులు.. ఎందుకు బుద్ధి చెప్పలేకపోయారని చిరుద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు సదరు అధికారిని పిలిచి మందలించి.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారని తెలుస్తోంది. ఆత్మకూరులోనూ ఇదే పంథా.. గతంలో ఆత్మకూరు సబ్ డివిజన్లో పనిచేసిన సదరు అధికారి.. మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేసిన ఘటనలున్నాయి. గతంలో ఇదే తరహాలో అక్కడ ముగ్గుర్ని లైంగికంగా వేధించి వారితో చెప్పు దెబ్బలు తిన్న ఉదంతాలూ ఉన్నాయని తెలుస్తోంది. అప్పట్లో ఇదే విషయమై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయన్ను క్వాలిటీ కంట్రోల్ సెక్షన్కు బదిలీ చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో మహిళా చిరుద్యోగికి లైంగిక వేధింపులు గతంలోనూ ఇదే తీరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, కాళ్లబేరానికి వచ్చిన వైనం జరిగిందిదీ.. నా దృష్టికొచ్చింది మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన విషయం నా దృష్టికొచ్చింది. వెంటనే విచారణకు ఆదేశించా. పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. ఎంకై ్వరీ జరిపి శాఖాపరమైన చర్యలు చేపడతాం. – దేశ్నాయక్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ, నెల్లూరు నెల్లూరులోని ఇరిగేషన్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ డివిజనల్ స్థాయి అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరులో గల కార్యాలయంలో పనిచేయాల్సిన ఈయన సెంట్రల్ డివిజన్ ఆఫీస్లో నిత్యం తిష్ట వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇక్కడే పనిచేసే మహిళా ఉద్యోగిపై కన్నేసిన సదరు అధికారి ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవారు. పెద్ద సారు కావడంతో మానసికంగా వేదనకు గురవుతున్నా, విషయాన్ని ఆమె బయటకు చెప్పుకోలేకపోయారు. తాజాగా స్థానిక డివిజనల్ ఇంజినీరింగ్ అధికారి గదిలో పనిచేస్తుండగా, అక్కడికెళ్లిన అధికారి, వెంటనే తలుపునకు గడయపెట్టి ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ఆమె కేకలేశారు. ఆపై కార్యాలయ ఉద్యోగులు వెంటనే తలుపులను గట్టిగా కొట్టడంతో సదరు అధికారి తెరిచి పరారయ్యేందుకు యత్నించారని తెలుస్తోంది. -
పాపం అయ్యోర్లు
● పేరుకే బదిలీ ● పాత స్థానాల్లో విధులు ● నెలలుగా తిప్పలు పడుతున్న వైనం ● టీడీపీ ప్రభుత్వంపై గుర్రుగా టీచర్లుఉదయగిరి: వైఎస్సార్సీపీ పాలనలో అమలు చేసిన నూతన విద్యావిధానంపై టీడీపీ విష ప్రచారం చేసింది. దీనిని నమ్మిన ఉపాధ్యాయ లోకం కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతోందని భావించింది. అయితే నేడు జరుగుతోంది వేరు. సమస్యలకు పరిష్కారం లభించలేదు. ప్రస్తుత ప్రభుత్వ విద్యావిధానాలు టీచర్లకు తలనొప్పిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా గత వేసవిలో జరిగిన బదిలీల్లో కొంతమంది టీచర్లు తాము కోరుకున్న స్థానాలకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. మరో 259 మంది కౌన్సెలింగ్లో కొత్త స్థానాలకు బదిలీ అయ్యారు. అయితే వారు అక్కడికి వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము పనిచేసే (పాతవి) స్థానాలను కొత్తగా టీచర్లెవరూ కోరుకోలేదు. దీంతో బదిలీ జరిగినా రిలీవర్ రాలేదనే సాకుతో అక్కడే ఉంచారు. కొన్నేళ్లుగా సుదూర ప్రాంతాల్లో పనిచేసి అలసిపోయి, తాము కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యామనే సంతోషం వారికి ఎక్కువ కాలం మిగల్లేదు. గత వేసవిలోనే బదిలీలు పాఠశాలల పునఃప్రారంభం నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం సంబంధిత ప్రక్రియను నిర్వహించింది. ఈ క్రమంలో ముందుగా ఖాళీల్లో మెగా డీఎస్సీలో ఎంపికై న వారిని భర్తీ చేసింది. ఆపై మిగిలిన టీచర్లకు బదిలీలు జరిగాయి. వీరిలో కొంతమందికి నిరాశే మిగిలింది. ఒకేచోట 8 సంవత్సరాలు పనిచేసిన వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కానీ వేరేవారు ఆ స్థానాలను కోరుకోకపోవడంతో బదిలీ చేయలేదు. సాంకేతికంగా బదిలీ అయినా భౌతికంగా తాము పనిచేస్తున్న పాత బడుల్లోనే ఉండాల్సి వచ్చింది. చాలామంది టీచర్లు బదిలీ జరిగిన ప్రాంతాలు, సమీపంలో కుటుంబాలను ఏర్పాటు చేశారు. అయితే పాతచోటే పని చేయాల్సి రావడంతో వ్యయప్రయాసలతో సతమతమతున్నారు. పని ఒకచోట.. జీతం మరోచోట బదిలీ అయిన ఉపాధ్యాయుల పని ఒకచోట.. రికార్డుల్లో పేరు మరోచోట ఉంది. జీతం అక్కడి నుంచే తీసుకోవాల్సి ఉంది. సీనియారిటీ ప్రకారం తాము కోరుకున్న చోటుకు బదిలీ అయిన వెంటనే జాయిన్ అయ్యారు. కానీ పాఠశాలల పునఃప్రారంభం అయిన తర్వాత కొత్త టీచర్ వచ్చే వరకు పాత బడుల్లోనే పని చేయాలని అధికారులు వెనక్కి పంపారు. మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, టీచర్లు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఇప్పటికే వారు కుటుంబాలను బదిలీ ప్రాంతాలకు మార్చుకున్నారు. అక్కడి నుంచి రోజూ దూర ప్రయాణం చేయడం కష్టంగా మారింది. ఏడు నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి. – సురేంద్రరెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
జగన్ను కలిసిన పర్వతరెడ్డి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్లను జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 20న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు నెల్లూరు(పొగతోట): నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 20న నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాలను ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించనున్నామని చెప్పారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పక హాజరుకావాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. క్యూ నారాయణగిరి షెడ్ వద్దకు చేరుకుంది. స్వామివారిని 88,752 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,443 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.69 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ నేడు నెల్లూరు (లీగల్): న్యాయవాదులకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధులను శుక్రవారం బహిష్కరించనున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, జల్లి పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజయాదవ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వివిధ అంశాలను పరిష్కరించాలనే డిమాండ్తో చేపట్టనున్న విధుల బహిష్కరణకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో సత్తా కోట: జాతీయ స్థాయి మట్టి కుస్తీ పోటీల్లో స్థానిక ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వీరిని గురువారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో ఈ నెల మూడు నుంచి నిర్వహించిన పోటీల్లో అండర్ – 14 విభాగంలో ఏడో తరగతి విద్యార్థి నాగసాయి స్వర్ణ.. సాయినిఖిల్ కాంస్య పతకాలను సాధించారని వివరించారు. యోగానంద్ ఉత్తమ ప్రతిభ చూపారని తెలిపారు. పీడీ రాజ్కుమార్కు అభినందనలను తెలియజేశారు. కండలేరు వరద కాలువలో మృతదేహం కలువాయి (సైదాపురం): కలువాయి మండలంలోని దాసరపల్లి సమీపంలో గల కండలేరు వరద కాలువ బ్రిడ్జి వద్దకు ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై కోటయ్య, సిబ్బంది చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ధైర్యముంటే సీబీఐ విచారణ జరపండి
● కమీషన్లను దండుకున్న సోమిరెడ్డి ● విజిలెన్స్ కార్యాలయంలో ఆయనకేమి పని ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి తానెన్నో సార్లు సవాల్ విసిరానని, ధైర్యముంటే సీబీఐతో విచారణ జరిపిస్తే దొంగ ఎవరో తేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ పనులపై ఇటీవలి కాలంలో తనపై సవాళ్లు విసురుతున్నారని, వీటిని తాను స్వీకరిస్తున్నానని, భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇరిగేషన్ శాఖను సోమిరెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని, జరగకూడని ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించా రు. జిల్లాలో ఈ శాఖ అంటేనే నీచంగా మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్కు సంబంధించిన ప్రతి పనిలో కమీషన్లను ఆయన దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన ఇరిగేషన్ పనుల జాబితా ప్రతి పేజీపై సంతకం చేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.100 కోట్లను దోచుకున్నారని తాము ఆరోపిస్తుంటే, వాటికి సమాధానం చెప్పకుండా రూ.19 కోట్లంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. కనుపూరు కాలువను పరిశీలించేందుకు తామొస్తామంటే భయపడి, హౌస్ అరెస్ట్ను ఎందుకు చేయించారని ప్రశ్నించారు. బిడ్లు వేసినట్లు నిరూపించగలరా..? కనుపూరు కాలవ షట్టర్ పనుల్లో అవినీతి జరిగిందంటున్నారని, ఇందులో తమ పార్టీకి సంబంధించిన ఏ కాంట్రాక్టరైనా బిడ్లు వేసినట్లు నిరూపించగలరానని ప్రశ్నించారు. షట్టర్ పనులు చేసే కాంట్రాక్టర్ను రూ.10 కోట్లను సోమిరెడ్డి డిమాండ్ చేశారని, అయితే అంత ఇచ్చుకోలేని ఆయన చెప్పడంతో అవినీతి జరిగిందంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిద్రలేచినప్పటి నుంచి విజిలెన్స్ డీజీపీ ఆఫీస్లో సోమిరెడ్డి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తమ హయాంలో విజిలెన్స్ ఆఫీసర్తో తాను లేక తన మనుషులు మాట్లాడినట్లు రుజువు చేయగలరానన్నారు. తమ హయాంలో అంతా సక్రమంగా.. తమ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి క్రమపద్ధతిలో ఉంచారని తెలిపారు. పొదలకూరు వంటి ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించినందుకు గానూ అవార్డులొచ్చాయని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పొదలకూరు ఆస్పత్రి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డులను మూడుసార్లు దక్కించుకుందని గుర్తుచేశారు. ఎఫ్డీఆర్ పేరిట దొంగ బిల్లులు ఎఫ్డీఆర్ పనుల పేరిట దొంగ బిల్లులు చేసుకొని దోచుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. నీరొదిలాక ఈ పనులను ఎలా చేయగలరని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఆఫీస్లో మేనేజర్గా ఉన్న గంగాధర్రెడ్డి అవినీతి వ్యవహారంపై తాను ఆధారాలతో సహా ఇటీవల బహిర్గతం చేశానని తెలిపారు. అవినీతి ఎలా చేయాలో సోమిరెడ్డి వద్ద గంగాధర్రెడ్డి ట్రెయినింగ్ తీసుకొని, వాటినే ఇప్పుడు చెప్తున్నారని విమర్శించారు. నిజంగా గంగాధర్రెడ్డి కుమారుడి ఖాతాలో పడాల్సిన డబ్బులు ఆయనకు పడితే సర్వీస్ రూల్స్ మేరకు ఇప్పటికే వివరణిచ్చి ఉండాలని చెప్పారు. తన ఇంటిని కరోనా హౌస్ అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, ఆ సమయంలో తానెలాంటి పనులు చేశానో.. ఎవరికి ఎంత సాయం చేశానో.. ఎంత ఖర్చు పెట్టానో సర్వేపల్లి ప్రజలు, ఆ భగవంతుడికి తెలుసునన్నారు. సర్వేపల్లి, అల్లీపురంలో గృహాలను ఆయన ఎలా కట్టారో తాను చెప్తే అవమాన భారాన్ని తట్టుకోలేరని చెప్పారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గొలగమూడి, కసుమూరులో డైమండ్ డబ్బాను ఆడిస్తున్నారని విమర్శించారు. గ్రావెల్, ఇసుక, మట్టి అనే తేడా లేకుండా ప్రతి అంశంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. -
డైట్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
ఇందుకూరుపేట: మండలంలోని పల్లిపాడు డైట్ కళాశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపల్ వి.అక్కిరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండగ సంక్రాంతి అన్నారు. అన్ని మతాలకు చెందిన పండగలను విద్యాసంస్థలో నిర్వహించడం జరుగుతోందన్నారు. తద్వారా వాటి ప్రాముఖ్యత, సంస్కృతులను విద్యార్థులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు భోగిమంటలు వేశారు. సామూహిక భోజనాలు చేశారు. పెద్ద పండగను ప్రతిబింబించే విధంగా పాటలు పాడారు. సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. రంగువల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డైట్ సీనియర్ అధ్యాపకులు వి.రాధారాణి, ఎల్.నటరాజమూర్తి, జి.సుబ్బారావు, హైమావతి, ఖాజారసూల్, విజయచంద్ర, రఘుకుమార్, ఎస్.మాధవీలత, జి.నీరజ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఐసీలో పెట్టుబడులు సురక్షితం
నెల్లూరు(అర్బన్): కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీలో ప్రజలు చెల్లించే ప్రీమియంలు 100 శాతం సురక్షితంగా ఉంటాయని ఎల్ఐసీ ఏఓఐ రాష్ట్ర ట్రెజరర్ బెజవాడ శివయ్య తెలిపారు. గురువారం నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జిల్లా ఏఓఐ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బీమా సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నందువల్ల అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జాతీయం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ఐసీని స్థాపించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రజలు చెల్లించే ప్రతి పైసాకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సావరిన్ గ్యారంటీ కల్పించి అందుకు అనుగుణంగా చట్టం చేసిందన్నారు. అయితే నేటి కేంద్ర ప్రభుత్వం మళ్లీ 100 శాతం ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఎల్ఐసీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలపై కూడా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం డివిజన్ ప్రెసిడెంట్ సీహెచ్ నరసింహారావు, రాష్ట్ర నాయకులు మేకల నరసింహారావు యాదవ్, హజరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెడికవర్లో కిడ్నీ మార్పిడి
● బిడ్డకు దానం చేసిన తల్లి నెల్లూరు(అర్బన్): బిడ్డకు తల్లి కిడ్నీ దానం చేయడంతో డాక్టర్ల బృందంతో కలిసి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించామని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంవీ సురేష్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం ఆస్పత్రిలో వివరాలు వెల్లడించారు. సూళ్లూరుపేటకు చెందిన 34 ఏళ్ల పొంకం శ్రీనివాసులు కిడ్నీ ఫెయిలైంది. నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సమస్య తీవ్రం కావడంతో శ్రీనివాసులు ఆస్పత్రికి వచ్చాడన్నారు. 58 ఏళ్ల వయసున్న రోగి తల్లి విజయమ్మ కిడ్నీ ఇచ్చేందుకు మందుకొచ్చారన్నారు. గత నెల 11న ఆపరేషన్ చేసి కిడ్నీ తీసి బిడ్డకు అమర్చామన్నారు. లాపరోస్కోపిక్ విధానంలో సర్జరీ వల్ల ఆమె రెండురోజులకే నడవగలిగిందన్నారు. శ్రీనివాసులు పూర్తిగా కోలుకున్నాడన్నారు. మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి ఆపరేషన్ను ఇప్పుడు నెల్లూరులో విజయవంతంగా చేశామన్నారు. యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్ నచికేత్, మత్తు డాక్టర్ రంగనాథ్, సీసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ గౌతమ్, క్లస్టర్ హెడ్ రంజిత్రెడ్డి, సెంటర్ హెడ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
కెరీర్ గైడెన్స్ కోర్సు ప్రారంభం
వెంకటాచలం (పొదలకూరు): కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో టూరిజం మేనేజ్మెంట్ విభాగ ఆధ్వర్యంలో పీఎం – ఉషా నిధులతో నూతనంగా రూపొందించిన సర్టిఫికెట్ కోర్సు ఇన్ కౌన్సెలింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ను గురువారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హజరైన వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడారు. పోటీ ప్రపంచంలో కేవలం విద్యాభ్యాసం మాత్రమే సరిపోదని, సరైన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని చెప్పారు. చంద్రమోహన్, పెరుగు రామకృష్ణ, ఉషశ్రీ, నరసింహారెడ్డి, విజయానంద్కుమార్బాబు, త్యాగరాజు, జవహర్బాబు, నీలామణికంఠ, సుజాత, రాజారామ్ పాల్గొన్నారు. -
నగదు కోసమే వృద్ధురాలి హత్య
● బెట్టింగుల్లో అప్పులపాలైన యువకుడు ● మరో మహిళ హత్య కేసు వెలుగులోకి.. ● నిందితుడి అరెస్ట్ ● 30 గ్రాముల బంగారు సరుడు స్వాధీనంనెల్లూరు(క్రైమ్): అతను కారు డ్రైవర్. ఆన్లైన్ బెట్టింగ్లాడుతూ అప్పులపాలయ్యాడు. తన అవసరాలకు సరిపడా నగదు కోసం ఇంటికి ఎదురుగా నివాసముంటున్న ఒంటరి వృద్ధురాలిని హత్య చేసి ఆమె మెడలోని 30 గ్రాముల సరుడును దోచుకెళ్లాడు. మృతురాలి శరీరంలో చిక్కుకున్న గోరు ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో మూడేళ్ల క్రితం చేసిన మరో మహిళ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ అజిత వేజెండ్ల కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామంలో పేట కోటేశ్వరమ్మ (68) ఒంటరిగా నివాసముంటోంది. ఆమె కుమారుడు శ్రీనివాసులు ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉంటున్నాడు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కోటేశ్వరమ్మను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి ఆమె మెడలోని బంగారు సరుడును దోచుకెళ్లారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కొడవలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్థానిక సీఐ ఎ.సురేంద్రబాబు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కోటేశ్వరమ్మ శరీరంపై లభ్యమైన గోరు ఆధారంగా నిందితుడు ఆమె ఇంటికి సమీపంలో ఉంటున్న కారు డ్రైవర్ వేముల రంజిత్కుమార్గా గుర్తించారు. గురువారం నిందితుడు నార్తురాజుపాళెంలో రోడ్డు వద్ద నిలబడి ఉండగా సీఐ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించారు. అప్పులపాలై.. రంజిత్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్, జల్సాలతో అప్పులపాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. దీంతో ఎలాగైనా నగదు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కోటేశ్వరమ్మ ఒంటరిగా, ఒంటిపై బంగారు ఆభరణాలతో ఉండటాన్ని గమనించాడు. ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకుంటే తన అవసరాలు తీరుతాయని భావించాడు. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కోటేశ్వరమ్మ ఇంటికెళ్లాడు. వరండాలో నిద్రిస్తుండగా తన వెంట తెచ్చుకున్న రాయితో ఆమెను హతమార్చాడు. ఆమె మెడలోని 30 గ్రాముల సరుడును దోచుకెళ్లానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. దీంతో అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ హత్య కేసు పోలీసులు నిందితుడిని విచారించే క్రమంలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 2022 జూన్ 2వ తేదీన కొత్త వంగల్లు గ్రామంలో గోలి సుశీలమ్మ మృతిచెందారు. ఆ ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు ఫిర్యాదు చేయలేదు. దీంతో ఈ విషయం మరుగున పడిపోయింది. రంజిత్ కుమార్, ఓ మహిళ (సుశీలమ్మ సమీప బంధువు)తో కలిసి సుశీలమ్మను హత్య చేసినట్లు తాజా విచారణల్లో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సిబ్బందికి అభినందన వృద్ధురాలి హత్య కేసును ఛేదించేందుకు కృషిచేసిన రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, కొడవలూరు, కోవూరు, కృష్ణపట్నం పోర్టు సీఐలు ఎ.సురేంద్రబాబు, వి.సుధాకర్రెడ్డి, రవినాయక్, వెంకటాచలం, సీసీఎస్, మహిళా పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్లు పి.సుబ్బారావు, సీహెచ్ సీతారామయ్య, టీవీ సుబ్బారావు, సిబ్బంది తదితరులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్కు అనుమతులు
● జేసీ వెంకటేశ్వర్లు సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్ అనుమతులు ఇవ్వడం జరుగుతుందని జేసీ ఎం.వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోని గూడూరు మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల రెవెన్యూ పరిఽధిలోని సర్వే 793లో 10.305 హెక్టార్లులో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణం అనుమతి కోసం ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మైనింగ్ కావాలంటూ తద్వారా తమ జీవనోపాధికి ఉపాధి కలుగుతుందని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పలువురు అధికారులకు విన్నవించారు. మరికొందరు మైనింగ్ వద్దన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ అధికారి అశోక్ కుమార్, గని యజమాని ఉదయ్భాస్కర్, తహసీల్దార్ సుభద్ర, ఆర్ఐ ప్రదీప్కుమార్, పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలులో దొంగల బీభత్సం ● రెండుచోట్ల చోరీలు మనుబోలు: మండల కేంద్రంలోని బీసీ కాల నీ, వైఎస్సార్ సర్కిల్ వద్ద బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసుల కథనం మేరకు.. బీసీ కాలనీలో నివాసముంటున్న కొమరాల శ్రీ కాంత్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి నెల్లూరులోని అత్తారింటికి వెళ్లాడు. గురువారం ఉదయం పక్కింటి వాళ్లు ఫోన్ చేసి మీ ఇంటి తాళం తీసుందని చెప్పడంతో వెంటనే వచ్చాడు. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఉంగరాలు, వెండి వస్తువులు, రూ.50 వేల నగదు దోచుకున్నారు. అలాగే వైఎస్సార్ సర్కిల్ వద్ద కావేటి పెంచలయ్య అనే వ్యక్తికి చెందిన దుస్తుల షాపు గోదాము తాళాలు పగులగొట్టి కిటికి గ్రిల్స్ తీసివేసి లోపలికి ప్రవేశించారు. రూ.3 లక్షల విలువ చేసే దుస్తులు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ అజిత వేజెండ్ల గూడూరు రూరల్: గంజాయి రవాణా, విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరించారు. గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఒకటో పట్టణ, రెండో పట్టణ పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఎస్పీ వెంట గూడూరు డీఎస్పీ గీతాకుమారి, సీఐలు శేఖర్బాబు, కిశోర్బాబు, శ్రీనివాస్, ఎస్సైలు మనోజ్కుమార్, శిరీష, సిబ్బంది ఉన్నారు. -
గూడూరులో కార్డన్ సెర్చ్
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో గురువారం వేకువజాము నుంచి మూడుగంటలపాటు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 600 ఇళ్లలో తనిఖీలు చేశారు. అద్దె ఇళ్లలోని వారి ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడి నుంచి వచ్చారు?, ఎక్కడ పని చేస్తున్నారు? తదితర విషయాలను ఆరాతీశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ అద్దె ఇళ్లలో నివాసముండేందుకు వచ్చినవారు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లేవారు తమ బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకుల్లో పెట్టాలన్నారు. అలాగే స్థానిక పోలీస్స్టేషన్లో తెలియజేస్తే బీట్కు వెళ్లే పోలీసులు ఇంటిపై నిఘా ఉంచుతారన్నారు. సరైన ధ్రువీకరణపత్రాల్లేని 14 ద్విచక్ర వాహనాలకు సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఒకటి, రెండో పట్టణ, రూరల్ సీఐలు శేఖర్బాబు, శ్రీనివాసులు, కిశోర్బాబు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
గణతంత్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
నెల్లూరు(దర్గామిట్ట): 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారు చేసి ప్రదర్శించాలన్నారు. పోలీస్, సాయుధ దళాలు, ఎన్సీసీ సంయుక్తంగా కవాతు ప్రదర్శనలివ్వాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్వో విజయ్కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీఈఓ ఆర్.బాలాజీరావు, డీఆర్డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు నాగరాజకుమారి, గంగా భవాని, హేనాసుజన్, డీసీఓ గురప్ప, జిల్లా హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, ఐఅండ్పీఆర్ డీడీ వేణుగోపాల్రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారి రమేష్ నాయక్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ అనూష పాల్గొన్నారు. -
పంటపాళెంలో కార్డన్ సెర్చ్
ముత్తుకూరు(పొదలకూరు) : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముత్తుకూరు మండలం పంటపాళెం ఊటల బలిజపాళెంలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని 25 బైక్లు, మూడు ఆటోలను సీజ్ చేసినట్టుగా ఎస్సై ప్రసాద్రెడ్డి తెలిపారు. కృష్ణపట్నం పోర్టు సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 11 వాహనాల స్వాధీనం రాపూరు: మండలంలో సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు, గంజాయి, ప్రభుత్వ నిషేధిత పదార్థాలపై సీఐ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాపూరు, కండలేరు డ్యామ్, సైదాపురం, ఎస్సైలు వెంకటరాజేష్, రామకృష్ణ, క్రాంతికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సహజీవనం చేస్తున్నాడనే అక్కసుతో..
● పథకం ప్రకారమే శివ హత్య నెల్లూరు(క్రైమ్): స్నేహితురాలు రాలేదన్న అక్కసుతో ఆమెతో సహజీవనం చేస్తున్న శివను నిందితులు హతమార్చారు. పోలీసుల వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన జ్యోతికి కోటకు చెందిన లీలామోహన్తో 2018లో వివాహమైంది. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. మనస్పర్థల నేపథ్యంలో ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింటిలో ఉంటోంది. ఏడాది కిందట ఒంటిమిట్టకు చెందిన సాయితో ఆమెకు పరిచయమైంది. ఎనిమిది నెలలు వారు ఒంటిమిట్టలో సహజీవనం చేశారు. సాయితో మనస్పర్థలు రావడంతో ఆమె అతనికి దూరంగా ఉంటూ మూడు నెలల కిందట నెల్లూరుకు వచ్చింది. ఇక్కడ భిక్షాటన, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద ఉంటోంది. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపుర్ జిల్లా, రత్నతాటి గ్రామానికి చెందిన చిన్ననరసింహ అలియాస్ శివ (30) సైతం పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. వారి మధ్య పరిచయమైంది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన అశోక్ నెల్లూరు నగరంలో పనులు చేసుకుంటూ రైల్వేస్టేషన్ వద్ద ఉంటున్నారు. అశోక్ తనతో రమ్మని జ్యోతిని కోరగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలోనే పది రోజుల కిందట సాయి నెల్లూరుకు వచ్చారు. తన స్నేహితురాలు శివతో సహజీవనం చేస్తుందని తెలుసుకుని రగిలిపోయాడు. అతన్ను విడిచి రమ్మని కోరగా ఆమె నిరాకరించడంతో శివను చంపైనా తీసుకెళ్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే సాయి, అశోక్ ఒక్కటై శివను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి వారు ఫూటుగా మద్యం తాగారు. రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో శివ, జ్యోతి కూర్చొని ఉండగా తమ వద్దనున్న కర్రతో వారు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇందులో శివ మృతిచెందగా, జ్యోతికి గాయాలయ్యాయి. ఆమె ఫిర్యా దు మేరకు సంతపేట ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య నిందితులపై హత్యకేసు నమోదు చేశారు. సాయి పాత నేరస్తుడని ఆయనపై నెల్లూరు, కడప జిల్లాలో దొంగతనం కేసులున్నాయని తెలిసింది. -
గూడూరులో చీలికలు దుర్మార్గం
చిల్లకూరు(గూడూరు): ఎంతో చరిత్ర కలిగిన గూడూరును ప్రస్తుత ప్రభు త్వం చీలికలు తెచ్చి మూడు మండలాలు నెల్లూరులో, రెండు మండలాలను తిరుపతిలో చేర్చడం దర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అధికార పార్టీలోని కొందరి స్వార్థం కోసం గూడూరును రెండు ముక్కలు చేశారన్నారు. దగ్గరాజపట్నం ఓడరేవు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య అని, ప్రస్తుతం గూడూరు విభజన చేసిన తరువాత ఓడరేవు నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. చరిత్ర కలిగిన గూడూరును ఒకటిగా ఉంచేలా వైఎస్సార్సీపీ కృషి చేస్తోందని, దీనికి ప్రతిఒక్కరి మద్దతు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు తీసు కుని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటామన్నారు. -
పిడతాపోలూరులో డీజిల్ మాఫియా
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని ఏపీ జెన్కో రోడ్డులో అక్రమంగా డీజల్ అమ్మకాలు సాగిస్తున్న వైనాన్ని అధికారులు గుర్తించారు. జిల్లా కు చెందిన ఓ కంపెనీ నిర్వాహకులు అక్రమంగా ఇక్కడ డీజిల్ వ్యాపారం చేస్తున్నట్టు స్థానికుల ఫిర్యాదుతో అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ బంకుల్లో ఎలాగైతే అమ్మకాలు సాగిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసుకు ని బూడిద లారీలకు డీజిల్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్ మాఫియా పెద్ద ఎత్తున రూ.లక్షల్లో వ్యాపారం సాగిస్తూ ప్రమాదాలకు సైతం కారణం అవుతున్నట్టుగా తెలిసింది. సివిల్ సప్లయ్స్ అధికారులు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ డీజిల్ వ్యాపారాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. అక్రమంగా డీజిల్ అమ్మకాల వల్ల స్థానికంగా ఉండే పెట్రోల్ బంకుల యజమానాలు నష్టపోతున్నారు. ఈ మేరకు అధికారులు డీజిల్ లారీలను సీజ్ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు అందజేస్తామని వెల్లడించారు. రైల్లోంచి పడి వ్యక్తి మృతి మనుబోలు: రైల్లోంచి పడి ఓ వ్యక్తి మరణించిన ఘటన మండల పరిధిలోని మనుబోలు, గూడూరు రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ 142/13–11 కిలోమీటర్ వద్ద అప్లైన్లో ప్రమాదవశాత్తూ జరిపడి మరణించాడు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు చొక్కా, దానిపై బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ జర్కిన్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్సై హరిచందన మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల నిరాహార దీక్ష ● సమస్యల పరిష్కారానికి డిమాండ్ నెల్లూరు(దర్గామిట్ట): నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బుధవారం సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.చంద్రమౌళి మాట్లాడుతూ ఈపీఎస్ 95 స్కీమ్ ద్వారా విశ్రాంత ఉద్యోగులకు రూ.9000 వరకు పెన్షన్ పెంచి అందించాలన్నారు. ఈహెచ్ఎస్ మెడికల్ సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీలోని అన్ని బస్సుల్లో విశ్రాంత ఉద్యోగితో పాటు అతని భార్యకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని దీక్షను చేపట్టినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు జి.శంకరయ్య, అధ్యక్షుడు చంద్రమౌళి, కోశాధికారి మురళి పాల్గొన్నారు. -
ఎనీటైమ్ మద్యం
జిల్లాలో మద్యం వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. నిబంధనలు తమకు పట్టవంటూ అందినంత మేరకు విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించాలి. అయితే అనేక దుకాణాలు, బార్లలో నైట్సేల్స్తో పాటుగా తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగుతున్నాయి. దీంతో మందుబాబులు చెలరేగిపోతున్నారు. జిల్లాలోని కోవూరు నియోజకవర్గం పెద్ద పడుగుపాడు ప్రాంతంలో ఉదయం 8:30 గంటల సమయంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్దకు వచ్చిన వారికి అనధికారికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న వైనం సాక్షి కంటపడింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
జగన్ను కలిసిన నేదురుమల్లి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. రాజరాజేశ్వరి ఆలయ హుండీ కానుకల లెక్కింపు నెల్లూరు(బృందావనం): నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకలను లెక్కించారు. గతేడాది అక్టోబర్ నాలుగు నుంచి బుధవారం వరకు కానుకల రూపంలో రూ.26,71,781, అన్నదాన హుండీ ద్వారా రూ.1,10,482, ఒక యూఎస్ డాలర్ను భక్తులు సమర్పించారని ఈఓ కోవూరు జనార్దన్రెడ్డి తెలిపారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష, వివిధ ఆలయాల ఈఓలు అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి, శ్రీధర్నాయుడు, దేవదాయ శాఖ నెల్లూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాసబాబు, ప్రధానార్చకుడు రఘురామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 82,022 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 20,230 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.84 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నెల్లూరు సిటీ: సంక్రాంతిని పురస్కరించుకొని 28 ప్రత్యేక సర్వీసులను నడపనున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి 18.. బెంగళూరు నుంచి 10 బస్సులను నడపనున్నామని వివరించారు. రిజర్వేషన్ సౌకర్యం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రామికులకు పనులు కల్పించండి నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి ఉపాధి హామీ శ్రామికులకు కల్పించాలని డ్వామా పీడీ గంగాభవానీ ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఈసీలతో బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. గతంలో ఉపాధి పనులకు హాజరైన శ్రామికులకు పేమెంట్లు వారి ఖాతాల్లో జమవుతున్నాయని వెల్లడించారు. ఈ విషయమై అవగాహన కల్పించి పనులకు అధిక శాతం మంది హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గోకులాలు, పంటకుంటల లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలని కోరారు. నిబంధనల మేరకు పనులను కల్పించడంతో పాటు యాప్లో సక్రమంగా అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఈ విషయాల్లో అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
జిల్లా రెడ్క్రాస్ సేవలకు రాష్ట్రంలో గుర్తింపు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): పలు ప్రాజెక్టులతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సేవలకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల రెడ్క్రాస్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రారంభించారు. తలసేమియాతో బాధపడుతూ రక్తమెక్కించుకుంటున్న చిన్నారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వాడవాడలా రెడ్క్రాస్ సేవలు అనే వాహనాన్ని ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ దాత, రెడ్క్రాస్ కేన్సర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ కలికి శ్రీహరిరెడ్డిని అభినందించారు. రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆద్యులైన జోలి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. 13 రకాల ప్రాజెక్టులను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వీటి ద్వారా సేవలందిస్తున్న జిల్లా చైర్మన్ వాకాటి విజయకుమార్రెడ్డిని అభినందించారు. రెడ్క్రాస్ సేవలకు తాను అండగా ఉంటానన్నారు. రక్తదాన మోటివేటర్లకు అవార్డులు జిల్లాలో 135 మంది రక్తదాన మోటివేటర్లకు జ్ఞాపికలు, ప్రశంసపత్రాలను కలెక్టర్ అందజేశారు. నేస్తం ఫౌండేషన్ నుంచి కోరెం ప్రవీణ్కుమార్, హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి కుంచాల వినయ్, తబిత తదితరులు అవార్డులను అందుకున్నారు. బ్లడ్ బ్యాంక్ కో ఆర్డినేటర్ బయ్యా ప్రసాద్, రెడ్క్రాస్ వైస్ చైర్మన్ జనార్దన్రాజు, కోశాఽధికారి సురేష్కుమార్ జైన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రవిప్రకాష్, కలికి శ్రీహరిరెడ్డి, యడవల్లి సురేష్, గునపాటి ప్రసాద్రెడ్డి, రంగయ్యనాయుడు, దాసరి రాజేంద్రప్రసాద్, రెడ్క్రాస్ మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. -
తప్పు చేసిన అధికారులు విచారణ ఎదుర్కోవాలి
● సర్పంచ్ల చెక్ పవర్ను అన్యాయంగా రద్దు చేశారు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం(పొదలకూరు): అధికార పార్టీకి తొత్తుల్లా మారి తప్పులు చేస్తున్న అధికారులు విచారణను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వెంకటాచలం సర్పంచ్గా మందల రాజేశ్వరి బాధ్యతలను బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెంకటాచలం సర్పంచ్పై లేనిపోని అవినీతి ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించడం దుర్మార్గమని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యపై కక్ష సాధింపుల్లో భాగంగా ఆయన సతీమణి రాజేశ్వరిపై అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయించడంతో కాలపరిమితి విధించి తిరిగి విచారణ చేపట్టాలని.. అది దాటితే సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దవుతాయని పేర్కొందని తెలిపారు. ఇది పూర్తి కావడంతో కోర్టు ఆదేశాల మేరకు రాజేశ్వరి తిరిగి సర్పంచ్గా బాధ్యతలను స్వీకరించారని తెలిపారు. సోమిరెడ్డి కక్షసాధింపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచ్లపై అప్పటి డీపీఓ శ్రీధర్రెడ్డిని అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు సోమిరెడ్డి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే రాజేశ్వరిపై సస్పెన్షన్ను విధించారని చెప్పారు. ఆమెతో పాటు అనేక మంది సర్పంచ్ల చెక్పవర్ను జిల్లా వ్యాప్తంగా రద్దు చేశారన్నారు. దీనికి నజరానాగా శ్రీధర్రెడ్డికి జెడ్పీ సీఈఓ పోస్ట్ను ఇప్పించారని విమర్శించారు. తమ పార్టీ సర్పంచ్ల చెక్పవర్ను రద్దు చేసిన శ్రీధర్రెడ్డి.. వారు టీడీపీ కండువాలు కప్పుకోగానే పునరుద్ధరించారని తెలిపారు. ఆయన లాంటి అవకాశవాద అధికారి మాటలను వినకుండా వాస్తవాలను కలెక్టర్ గుర్తించి చర్యలు చేపట్టాలని కోరారు. సోమిరెడ్డి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసుల సాయంతో గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారని, లేనిపక్షంలో ప్రజలు తిరుగుబాటు చేస్తారని స్పష్టం చేశారు. ఇరిగేషన్ పనుల్లో భారీగా అవినీతి ఇరిగేషన్ పనుల్లో రూ.100 కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారని, ఆయనతో అంటకాగిన అధికారులు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని తెలిపారు. ఇరిగేషన్ కార్యాలయ మేనేజర్ గంగాధర్రెడ్డిపై విచారణకు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ ఆదేశించారని, దీనికి హాజరవుతున్న కాంట్రాక్టర్లను సాక్ష్యం చెప్పొద్దంటూ ఫోన్లు చేసి సోమిరెడ్డి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. గంగాధర్రెడ్డి ఫోన్పేతో పాటు ఆయన కుమారుడు, సమీప బంధువుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రవర్తించిన తీరును ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, వైస్ ఎంపీపీలు కోదండరామిరెడ్డి, మస్తానయ్య, పార్టీ మండల కన్వీనర్ మోహన్నాయుడు, డేగా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కోవూరు: కోవూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం జారీ చేశారు. స్థానిక పీఎస్లోని వేణు, సునీల్ డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. యూపీఎస్సీ ర్యాంకర్కు అభినందన గూడూరు రూరల్: గూడూరు మండలం కందలికి చెందిన దర్శి సాగర్ యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీస్లో 66వ ర్యాంక్ను సాధించారు. ఈ తరుణంలో దర్శి సాగర్తో పాటు తల్లిదండ్రులు వెంకటకృష్ణయ్య, విజయమ్మను గ్రామస్తులు సత్కరించారు. బల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ఎన్నికల సమయంలో కూటమి నేతలిచ్చిన హామీల మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. సంతపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మస్తాన్షరీఫ్, వైఎస్సార్ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంజయ్ బుధవారం మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా, నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. యోగాంధ్ర, ఆవకాయ్ అమరావతి లాంటి ఈవెంట్లకు భారీగా వెచ్చిస్తున్న ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిధుల్లేవని చెప్పడం సిగ్గుచేటని చెప్పారు. విమానాల్లో ప్రయాణానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు వేల కోట్లు ఎక్కడ్నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. గతేడాది ఏప్రిల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులున్నారనే విషయం తేలిందన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరిన విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులను బనాయించడంతో పాటు పాత కేసులను బయటకు తీసి అణిచేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళనను యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన చేపట్టనున్నామని వెల్లడించారు. నేతలు మున్నా, సుధీర్, వంశీ, రాజా, శివమ్, వర్మ, గౌస్బాషా, మధుసూదన్రెడ్డి, సుజిత్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన బొమ్మనహళ్ ఎంపీటీసీలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను బొమ్మనహళ్ ఎంపీటీసీలు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను ఎంపీటీసీలు వివరించారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా దౌర్జన్యంగా ఎంపీపీ పదవిని కైవసం చేసుకున్న తీరును చెప్పుకొచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరపాల్సిన ఎన్నికను ఇలా అప్రజాస్వామిక పద్దతిలో గెలుపొందడం దారుణం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్దామన్నారు. ఇదే సమయంలో రాయదుర్గంలో జరిగిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ ఆరా తీశారు. పార్టీ ఇంఛార్జ్ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి గురించి ఆయన కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. -
ఇంకెంతకాలం ఎదురుచూడాలో?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఒకప్పుడు నెల్లూరంటే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పేరు ప్రముఖంగా వినిపించేది. 1979లో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు రైతుల విజ్ఞప్తి మేరకు కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2013 వరకు నిరంతరాయంగా నియోజకవర్గంలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట మండలాల చెరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. సమీప నియోజకవర్గాలైన నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో చెరకు పండించే రైతులు లాభాలు ఆర్జించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన షుగర్ ఫ్యాక్టరీ నష్టాల పేరుతో మూతపడటం, బకాయిలు చెల్లించకపోవడంతో అటు కార్మికులు, ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలమందికి ఉపాధి ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించింది. ప్రత్యక్షంగా 600 నుంచి 700 మంది వరకు పని చేసేవారు. పరోక్షంగా 5 వేల మంది రైతులు, చెరకు కట్చేసే కార్మికులు, మరో మూడువేలమందికి నాలుగైదు నెలలపాటు ఉపాధి దొరికేది. అంతేకాకుండా ఎద్దుల బండ్ల రైతులు, ట్రాక్టర్లు, లారీలు కలిగిన వారు ఫ్యాక్టరీకి తరలించడం ద్వారా ఉపాధి పొందేవారు. అప్పట్లో రైతులకు ఫ్యాక్టరీ ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా ఖాతాలు తెరచి ముందస్తు రుణాలు కూడా అందించేవారు. సన్నకారు రైతులు, నిరుపేద కూలీలకు చెందిన దాదాపు 10 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవనం సాగించేవి. నష్టాల పేరుతో.. కాలక్రమేణా నిర్వహణ ఖర్చులు, జీతాలు తదితర ఖర్చులు పెరిగాయని ప్రభుత్వాలు ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో మూతపడింది. 2013 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం కార్మికులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో నష్టాల పేరుతో మూతపడేలా చేశారు. 2019 సంవత్సరంలో ఏర్పాటైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందుకు కమిటీని కూడా నియమించింది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం చెరకు సాగు తగ్గి, చేపలు, రొయ్యలు తదితర ఆక్వా ఉత్పత్తుల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించింది. ఈలోగా 2024కు సంబంధించి ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు వీలు పడలేదు. ఎప్పుడిస్తారో? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి రాగానే ఆ హామీని పక్కన పెట్టేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని అనేకసార్లు కార్మికులు కలిశారు. రూ.23 కోట్ల బకాయిల విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి నిధులు విడుదలయ్యేలా చూడాలని విన్నవించుకున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ విషయమై ఆమె ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దాదాపు 20 నుంచి 30 ఏళ్ల వరకు ఫ్యాక్టరీలో పనిచేసిన తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన బకాయిలు ప్రభుత్వ వెంటనే చెల్లించేలా నెల్లూరు ఎంపీ ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే చొరవ చూపాలని కా ర్మికులు కోరుతున్నారు.కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పాపం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఎన్నికల హామీ నెరవేర్చని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అందాల్సిన బకాయిలు రూ.23 కోట్లు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతో కాలం సాగవు
● పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులు ● సీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ ప్రశ్నించరు ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి రోజా వెంకటాచలం (పొదలకూరు): అధికారముందనే అహంకారంతో తండ్రీకొడుకులు బరితెగించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలను సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళితో కలిసి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నేతలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికీ అదే గతి పడుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులను నమోదు చేయించి జైలు పాల్జేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు చేసుకుంటే, ఆ కేసును పిన్నెల్లి సోదరులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని విమర్శించారు. ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా, అమలు చేయించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్లో పోలీస్ వ్యవస్థ అట్టడుగున ఉందని, దీనికి ఆ శాఖ సిగ్గుపడాలన్నారు. క్రెడిట్ చోరీ చంద్రబాబుకు అలవాటే క్రెడిట్ చోరీకి పాల్పడటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటుగా మారిందని రోజా ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కృషితోనే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగిందని సంబంధిత కాంట్రాక్ట్ పొందిన జీఎమ్మార్ సంస్థ చెప్తున్నా, చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. తన కృషిగా నిస్సిగ్గుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు నెల్లూరు, కుప్పంలో ఎయిర్పోర్టులను నిర్మిస్తానని ప్రకటించిన చంద్రబాబు, అక్కడ ఎందుకు జరపలేకపోయారని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని రామ్మోహన్నాయుడ్ని ప్రశ్నించారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబును దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారు..? రాయలసీమలో పుట్టానని చెప్పుకొంటున్న డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్.. సాగునీటి విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నా రని రోజా ప్రశ్నించారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని చెప్తున్న ఆయన.. రాయలసీమ విషయంలో చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోతున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మన్ననలు పొందిన కుటుంబం మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన ఫ్యామిలీ పిన్నెల్లి కుటుంబానిది అని అంబటి మురళి పేర్కొన్నారు. పిన్నెల్లి సుందరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి వరుసగా మాచర్లలో పోటీ చేసి గెలుపొందేవారని తెలిపారు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండటంతో అభ్యర్థిని ప్రతి ఎన్నికల్లో మార్చేదన్నారు. అక్కడ ఎలాగైనా పట్టుసాధించాలనే ఉద్దేశంతో పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించిందని ఆరోపించారు. -
అవునండీ.. నగదు బదిలీ వాస్తవమే
సాక్షి టాస్క్ఫోర్స్: నెల్లూరు ఇరిగేషన్ శాఖలో చోటుచేసుకున్న సిత్రాల్లో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్పే ద్వారా లంచాలను స్వీకరించారనే అంశంపై సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో ఫోన్పే ద్వారా నగదు బదిలీ అయంది వాస్తవమేనంటూ అధికారులకు ఇచ్చిన నివేదికలో కార్యాలయాధికారి పేర్కొనడం గమనార్హం. అయితే అది కాంట్రాక్టల్లిచ్చే పర్సంటేజీ కాదని.. తన కుమారుడు ఇంజినీరింగ్ కన్సల్టెంట్గా ఉన్న నేపథ్యంలో ఆయన సేవలకు మెచ్చి వారు ఇచ్చిన నజరానానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవినీతి వాస్తవమేనని ఆ వివరణ లేఖ ద్వారా తెలుస్తోంది. ఇంత పక్కా ఆధారాలతో అవినీతి వెలుగులోకి వచ్చినా, ఏసీబీ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఇలా జరుగుతోందనే ప్రచారం లేకపోలేదు. చేయని పనులకూ బిల్లులు నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి మూడు వర్కులు.. ఆరు పేమెంట్లు అనే చందంగా సాగుతోంది. ప్రతి పనికీ పర్సంటేజీలను వసూలు చేసి బిల్లులివ్వడం.. చేయని వాటికి సైతం మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అకౌంట్స్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న సదరు అధికారి నిత్యం తిరుపతి జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తూ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ జరిగే ప్రతి పనీ తనకు తెలిసే జరపాలంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి బిల్లుకు ఐదు శాతాన్ని సదరు అధికారికే ఇవ్వాలి. ఇక ఏఈ నుంచి ఎస్ఈ స్థాయి అధికారికి దాదాపు 15 శాతం మేర సమర్పించాల్సి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మొత్తంలో వసూలు చేస్తుంటే పనిలో నాణ్యత ఎలా ఉంటుందో పెరుమాళ్లకే ఎరుక. కన్సల్టెంటా..? తన కుమారుడు కన్సల్టెంట్గా పనిచేయడంతోనే నగదు బదిలీ అయిందని సదరు అధికారి వివరణ ఇవ్వడం గమనార్హం. వాస్తవంగా ఇలా ఉండాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరోవైపు సదరు అధికారి తనయుడు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంటారు. అయితే ఆయన ఇక్కడ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారని చెప్పడం సదరు అధికారికే చెల్లింది. వాస్తవానికి ఒక పనికి అంచనాలేయాలంటే ప్రైవేట్ కన్సల్టెంట్కు అధికారులే ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ఈ అవకాశం ఉండదు. ఇలా కన్సల్టెంట్.. అధికారి.. వారి సమీప బంధువుకు ఫోన్పే ద్వారా నగదు బదిలీ అవ్వడంతో ఈ ముగ్గురి బ్యాంక్ ఖాతాలను సమగ్రంగా పరిశీలిస్తే ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయో తెలుస్తుంది. మౌనమేలనోయి..? అవినీతికి పాల్పడ్డారనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తే వారిని జైలుకు పంపుతామంటూ ఏసీబీ అధికారులు నిరంతరం చెప్తుంటారు. అయితే ఇరిగేషన్ శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా, స్పందన కొరవడింది. బిల్లుల్లో పర్సంటేజీల కోసం భారీగా నగదు బదిలీ అవుతోందంటూ పక్కా ఆధారాలను మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని అందరూ ప్రచురించినా, విచారణకు ఏసీబీ అధికారులు ఏ మాత్రం ముందుకురావడంలేదు. వీరిపై రాజకీయ ఒత్తిడి ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత టీడీపీ పాలన లో అవినీతి ఏ స్థాయికి చేరిందనే అంశానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి కొత్త పుంతలు తొక్కింది. ముడుపులను యూపీఐ ద్వారా స్వీకరించి సరికొత్త అధ్యయానికి ఇక్కడ తెరలేపారు. ఈ ఉదంతంలో ఆ శాఖ అధికారి చెప్తున్న మాటలు విస్మయం కలిగిస్తున్నాయి. నగదు బదిలీ అయింది వాస్తవమేనని, తన కుమారుడు కన్సల్టెంట్గా ఉండటంతో వీటిని జమ చేశారంటూ బుకాయింపు చర్యలకు పాల్పడ్డారు. బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే అసలు బాగోతం బయటకొచ్చే అవకాశమున్నా, ఏసీబీ అధికారులు మాత్రం మౌనవ్రతం దాలుస్తున్నారు. నా కుమారుడు కన్సల్టెంట్గా ఉన్నారు అందుకే కాంట్రాక్టర్లు డబ్బులేశారు ఇరిగేషన్ అధికారి బుకాయింపు ఆధారాలున్నా, ఏసీబీ అధికారుల మౌనవ్రతం బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తే అవినీతి బయటపడే అవకాశం -
గిరిజన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): గిరిజన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు నగరంలో గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొ మ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ 40 ఏళ్లకు గిరిజన మహిళకు మేయర్ పదవి దక్కితే దానిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేయడం దారుణమన్నారు. ఇదేనా రాజ్యాంగాన్ని గౌరవించడమని ప్రశ్నించారు. మేయర్ పదవిని మరో గిరిజన మహిళకు ఇస్తామని రూప్కుమార్ యాదవ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆయన ఇన్చార్జి బాధ్యతలు తీసుకొని ఆ విషయాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణశేఖర్, ఏకశిరి మురళి, సుధీర్బాబు, సేవూరి శ్రీనివాసులు, మైనంపాటి లక్ష్మి, లక్ష్మి, పద్మ, కమతం శీనయ్య, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ పాల్గొన్నారు. -
వైభవంగా ముగ్గురమ్మల తిరునాళ్ల
అల్లూరు: అల్లూరు గ్రామదేవతలైన పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేశ, విదేశాల్లో స్థిరపడిన అల్లూరీయులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. కార్యనిర్వాహకుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 1001 కుండలతో అమ్మవారికి సద్ది నివేదన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. కాటంరెడ్డి నివాసం నుంచి ఆయన సతీమణి శివప్రియ ఆధ్వర్యంలో 1001 కుండలతో సద్దిని ఊరేగింపుగా పోలేరమ్మ గుడి వద్దకు తీసుకెళ్లారు. ప్రత్యేకాలంకరణలు, పొంగళ్లు, గ్రామోత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా ఉంచిన ముగ్గురమ్మవార్ల విగ్రహాలను చూసేందుకు భక్తులు తరలివచ్చారు.అమ్మవార్ల విగ్రహాలు పొంగళ్లు కార్యక్రమం నిర్వహిస్తున్న కాటంరెడ్డి దంపతులు -
మత్తు పదార్థాల జోలికెళ్లొద్దు
కోవూరు: యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని పోలీస్ అధికారులు తెలిపారు. జల్సాలకు అలవాటుపడిన కొందరు విశాఖపట్నం, ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు, కోవూరు ఇనమడుగు సెంటర్ ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఉదయ్, జయదేవ్, సుబ్రహ్మణ్యం, ఎస్కే అక్బర్, శ్రీనాథ్ తదితరులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. వారి నుంచి మంగళవారం మధ్యాహ్నం రూ.3 లక్షల పైగా విలువచేసే ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానిక పోలీస్స్టేషన్ నుంచి బజార్ సెంటర్ వరకు నడిపించారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్రెడ్డి, కోవూరు ఎస్సై ముత్యాలరావు, ఏఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్లో వాహనాల స్వాధీనం
సంగం: మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాల్లేని 56 బైక్లు, 8 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. సెర్చ్లో సంగం, ఆత్మకూరు సీఐలు శ్రీనివాసులురెడ్డి, గంగాధర్, సంగం, ఏఎస్పేట, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం ఎస్సైలు రాజేష్, తిరుమలరావు, జిలానీ, సూర్యప్రకాష్రెడ్డి, సైదులు పాల్గొన్నారు. ● వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. సరైన పత్రాల్లేని 47 బైకులతోపాటు 3 ఆటోలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు వీరప్రతాప్, ఆల శ్రీను, మాల్యాద్రి, ఉమాశంకర్, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.సంగం : కార్డన్ సెర్చ్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు వింజమూరు : సీజ్ చేసిన వాహనాలతో పోలీసులు -
అంతని.. ఇంతని.. చివరికి పత్తాలేరు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఇరిగేషన్ శాఖలో తాను చెప్పిందే జరగాలని.. అంతా తానేనంటూ ఉన్నతాధికారులను సైతం గందరగోళానికి గురిచేసిన మేనేజర్ అడ్రస్ లేకుండాపోయారు. ‘ఫోన్పేలో లంచం... ఫైల్లో సంతకం’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఈ నెల రెండున ప్రచురితమైంది. ఇది వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆఫీస్లో సదరు అధికారి కుదురుగా ఉన్న సందర్భం లేకపోవడం గమనార్హం. ప్రసన్నానికి పాకులాట బుచ్చిరెడ్డిపాళెం సబ్ డివిజన్లో 31 వర్కులకు సంబంధించిన ప్రతిపాదనల ఆమోదంలో కాంట్రాక్టర్లకు మద్దతిస్తూ అర్హత లేని పనులకు సైతం అనుమతులివ్వాలంటూ ఇంజినీర్లతో మేనేజర్ గత నెల్లో గొడవపడ్డారు. ఈ తరుణంలో అక్రమాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా కథనం ప్రచురితం కావడంతో సదరు అధికారిలో దడ మొదలైంది. ఇంకేముంది అధికార పార్టీ నేతల కాళ్లు పట్టుకునేందుకు వారి ఇళ్లకెళ్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా పేర్కొంటున్నారు. సెలవు పెట్టకుండా నాలుగు రోజులుగా కనిపించని సదరు మేనేజర్పై నిజనిర్ధారణ చేయాల్సిందిగా విజయవాడ వర్క్స్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ను నియమించారు. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారని తెలు స్తోంది. కార్యాలయంలోని తన గది తాళాలను తీస్తున్నా, తలుపులను మాత్రం సిబ్బంది తెరవడంలేదు. కాగా డిప్యుటేషన్పై ఇన్ని రోజులు పనిచేసిన ఈయన్ను సొంత శాఖ వర్క్స్ అండ్ అకౌంట్స్కు సరెండర్ చేస్తారనే టాక్ నడుస్తోంది. -
మట్టి వ్యాపారం.. కాసుల వర్షం
మట్టిని తరలించి చదును చేసిన ఏపీఐఐసీ ఆధీనంలోని ప్రైవేట్ వ్యక్తుల భూమి చిల్లకూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి సంపదను అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు. గ్రావెల్, సిలికా, ఇసుక, క్వార్ట్ ్జను తవ్వి తరలించుకునేందుకు ముందుగా గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ, గనుల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న పోరెడ్డిగుంట కింద సుమారు 50 ఎకరాలు వరిని రైతులు సాగు చేశారు. డిసెంబర్లో వచ్చిన దిత్వా తుఫాను కారణంగా పోరెడ్డిగుంటకు గండి పడి నీరు మొత్తం దిగువకు ప్రవహించింది. దీంతో అది ఖాళీ అయ్యింది. రైతులు పంట సాగును పూర్తిగా నిలిపివేశారు. ఇదే అదునుగా భావించిన గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గుంతల్లో ఉన్న మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏపీఐఐసీసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కొనుగోలు చేసిన వారికి ఐదురోజులుగా 10 టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నాడు. గండి పడిన పోరెడ్డిగుంటకు ఇరిగేషన్ అధికారుల అనుమతితో అక్కడే త వ్విన మట్టితో కట్టను ఏర్పాటు చేస్తే తెలుగుగంగ నీటిని గుంతకు తెప్పించికుని రైతులు వరి సాగు చేసుకునే వీలుంది. ఇలా చేస్తే తనకు ఏమి వస్తుందనుకున్న నాయకుడు ఏకంగా మట్టి తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నాడు. మట్టి తవ్వకాలమై ఇరిగేషన్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.పోరెడ్డిగుంటలో మట్టిని తవ్వుతున్న యంత్రాలు -
చీటింగ్ కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఫ్రాంచైజర్లను మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది ప్రస్తుతం నెల్లూరు శ్రీహరినగర్లో నివాసముంటున్న బి.విజయ్కుమార్ ఎండీగా, కర్నూలుకు చెంది ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్న ఎ.మహేంద్రకుమార్, తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ఎస్.సునీల్లు మేనేజర్లుగా ఆరునెలల క్రితం మాగుంటలేఅవుట్లో విహాన్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థను ప్రారంభించారు. సంప్రదాయ పిండివంటలు, మిఠాయిలు అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. దీంతో పలువురు డిపాజిట్లు చెల్లించి ఫ్రాంచైజ్లను తీసుకున్నారు. కొంతకాలంగా ఉత్పత్తులు పంపకపోవడం, నగదు ఇవ్వకపోవడంతో నెల్లూరు నగరానికి చెందిన ఫ్రాంఛైజర్ మనోజ్కుమార్తోపాటు 17 మంది మూడు రోజుల క్రితం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు మోదు చేశారు. మంగళవారం ఎండీతోపాటు ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
● ఎమ్మెల్యే వర్గీయులపై మాలేపాటి వర్గీయుల దాడి దగదర్తి : దగదర్తి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం రాత్రి కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి వర్గానికి చెందిన కడియాల సురేష్ ఇంటిపై మాలేపాటి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా సురేష్ను రోడ్డుపైకిలాగి వీధుల్లో తరిమితరిమి దాడికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇప్పటి వరకు మాలేపాటి వర్గంలో ఉన్న వడ్డే శ్రీకాంత్నాయుడు వారిని విభేదించి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అండదండలతో టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్నాయుడును మాలేపాటి సోదరులు రవీంద్రనాయుడు, సుధాకర్నాయుడు అనుచరులు తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుధాకర్నాయుడుకు శ్రీకాంత్నాయుడు వర్గానికి చెందిన కడియాల సురేష్ ఫోన్ చేసి ఆయనతో పాటు ఆయన భార్యను కించపరుస్తూ నానా దుర్భాషలాడి బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న మాలేపాటి వర్గీయులు సురేష్ ఇంటిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఇంటి తలుపులు, అద్దాలతో పాటు గృహోపకరణాలను ధ్వంసం చేశారు. కడియాల సురేష్ను బయటకు లాగి వీధుల్లో తరిమితరిమి దాడి చేశారు. దీంతో సురేష్ తలకు తీవ్ర గాయమైంది. సురేష్పై దాడి చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అడ్డుకునేందుకు వచ్చిన వడ్డే శ్రీకాంత్నాయుడు, సోదరుడు వినయ్పైన దాడికి దిగారు. దీంతో వారు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుమణిగించారు. గాయపడిన సురేష్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దగదర్తిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పికెట్ ఏర్పాటు చేశామని, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
విమానాశ్రయ భూములకు రెట్టింపు పరిహారం ఇవ్వాలి
● కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా కావలి(అల్లూరు): దగదర్తి విమానాశ్రయ నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులు తమకు రెట్టింపు పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2013 భూపరిహార చట్టం కింద తమ భూములకు ఎకరాకు రూ.13లక్షల పరిహారాన్ని అందజేయడం అన్యాయమన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి కుటుంబంలోని అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ ప్రస్తుత రేట్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీల భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామసభ పెట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులురెడ్డి, కే చంద్ర, బీ వెంకయ్య, మాలేపాటి గణేష్ నాయుడు, మక్కినేని వెంకయ్య, నెల్లూరు రమణారెడ్డి, జే శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలి
● వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎంపీపీ ఎన్నికను అధికార పార్టీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మకై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అక్రమంగా నిర్వహించారని, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే ఎన్నికను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వింజమూరులోని బంగ్లా సెంటర్లో సోమవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసులు పథకం ప్రకారం తమ ఎంపీటీసీలను సమావేశ మందిరం వద్దకు వాహనాల్లో రానీయకుండా కాలినడకన నడిపించి తమ ఎంపీటీ పీ మల్లికార్జున కిడ్నాప్కు సహకరించారన్నారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా జరపనందున వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ అభ్యర్థి, జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమ సభ్యులను కిడ్నాప్ చేయడమే కాకుండా తమను సమావేశ మందిరంలోకి అనుమతించలేదన్నారు. ఎన్నిక సమయం ముగిసే రెండు నిమిషాల ముందు (11.58గంటలకు) ఒక ఎంపీటీసీని దొడ్డిదారిన లోపలికి తీసుకెళ్లి తలుపులు మూసి ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయడం అప్రజాస్వామికమన్నారు. దీనికి అధికారులు పూర్తిగా సహకరించినందున కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ షేక్ అలీఅహ్మద్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి 8 మంది ఎంపీటీసీల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. అయినా తమ ఎంపీటీసీని బలవంతంగా కిడ్నాప్ చేశారని, ఇందుకు పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. టీడీపీ వారే దౌర్జన్యానికి పాల్పడి ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికార పార్టీకి గెలిచే బలం లేకపోయినా అక్రమాలకు పాల్పడిందన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్పీపీ మండలాధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డి, నేతలు మద్దూరి బాబు, కాటం రవీంద్రరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, పోలిబోయిన వెంకటేశ్వర్లు, డబ్బుకొట్టు రమణయ్య, బండి కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు డేగా వంశీ, భవానీ, ఉంటా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి నగదు గోల్మాల్పై ఫిర్యాదు
వరికుంటపాడు: సీ్త్రనిధి నగదు గోల్మాల్పై తోటలచెరువుపల్లికి చెందిన ఆరు స్వయం సహాయక సంఘాల సభ్యులు మండల వెలుగు కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఏపీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ఆరు గ్రూపులు ఉన్నాయని తెలిపారు. సీ్త్రనిధి నుంచి ఒక్కో గ్రూపు రూ.2లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు రుణంగా తీసుకున్నట్లుగా చెప్పారు. అందుకు సంబంధించి ఒక్కోగ్రూపు నెలకు రూ.9,600 చొప్పున 23 నెలలు చెల్లించాల్సి ఉండగా 25 నెలలు చెల్లించినట్లుగా తెలిపారు. అయినా ఇంకా ఆరు గ్రూపులకు సంబంధించి రూ.లక్షకుపైగా చెల్లించాలని వెలుగు సీసీ ఒత్తిడి చేస్తోందని, ఆ మొత్తం చెల్లించకపోతే కొత్త రుణాలు మంజూరు చేయబోమని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగు తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సీసీని డిప్యుటేషన్పై మర్రిపాడు మండలానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా వాటిని లెక్కచేయకుండా కొనసాగుతున్నారని ఆరోపించారు. సీ్త్రనిధి నిధుల గోల్మాలకు పాల్పడుతున్న సీసీలను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏపీఎంను కోరారు. -
ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం
ఉదయగిరి: వింజమూరు ఎంపీపీ ఎన్నికలో అధికార టీడీపీ దౌర్జన్యాలు, కిడ్నాప్లు, అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వింజమూరులో ఎంపీపీ ఎన్నిక జరిగిన తీరుపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీకి 8 మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు ఓటమి భయంతో కిడ్నాప్, దౌర్జన్యాలు, కుట్రలు చేసి ఎంపీపీ పదవిని పొందడం సిగ్గుచేటు అన్నారు. ఉదయగిరి రాజకీయ చరిత్రలో ఎన్నడూ కిడ్నాప్లు లేవన్నారు. టీడీపీ నేతలు నాటుతున్న ఈ విషబీజం మానై భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదన్నారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి, మరో మహిళా ఎంపీటీసీని గాయపరిచి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి తాము విజయం సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఈ ఎన్నికలో టీడీపీ విజయం సాధించామని చెప్పుకున్నా, నైతికంగా తమ పార్టీ విజయం సాధించినట్లేనన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల అరాచకాలకు లొంగకుండా ధైర్యంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న తమ పార్టీ ఎంపీటీసీలు, నేతలకు భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామన్నారు. ఈ అరాచక చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నేతలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. -
ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అధికారం దక్కించుకున్న ప్రతీసారి ఎన్నిక ఏదైనా అరాచకమే ఆయుధంగా చేసుకుని అడ్డదారులు తొక్కడం టీడీపీకి పరిపాటిగా మారింది. గతంలో జెడ్పీ చైర్మన్తో పాటు నెల్లూరు కార్పొరే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఖాకీల సాక్షిగా ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం కుమిలి కుమిలి ఏడుస్తోంది. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి పాదాక్రాంతం కావడంతో రెడ్బుక్ రాజ్యాంగం ముందు భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోంది. ప్రజాదరణతో గెలవలేని టీడీపీ అడ్డదారుల్లో పదవులను తమ ఖాతాలో వేసుకునేందుకు అరాచకాలకు పాల్పడుతోంది. గతంలో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ఎరవేసి సంతలో పశువులను కొన్నట్లుగా కొంటే.. ఇప్పుడు పోలీసుల ఎస్కార్ట్తో అరాచక శక్తులను ప్రోద్బలచి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయ డం, దౌర్జన్యం చేయడానికి తెగబడుతోంది. తాజా గా ఒక ఎంపీటీసీ సభ్యుడు కూడా లేని టీడీపీ వింజమూరు ఎంపీపీ పదవిని ౖకైవశం చేసుకునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం సాగించింది. ఒక వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేస్తే.. మరో మహిళా ఎంపీటీసీని సైతం ఎత్తుకెళ్లేందుకు బరితెగించారు. మాజీ ఎంపీపీని పోలీసుల ద్వారా అజ్ఞాతంలో నిర్బంధించగా, తాత్కాలిక ఎంపీపీని సైతం దాచేసి, ఆఖరి క్షణంలో తీసుకొచ్చి ఎంపీపీ పదవిని కొల్లగొట్టి.. టీడీపీ ముద్ర వేసుకున్నారు. అరాచకమే ఆయుధంగా.. టీడీపీ అధికారంలో వచ్చాక అరాచకాలే ఆయుధంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో అడ్డదారుల్లో అందలమెక్కుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కనీస స్థానాలు కూడా లేని జెడ్పీ చైర్మన్, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి.. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులను బెదిరించి కొందరిని, రూ.లక్షలు ఇచ్చి ప్రలోభ పెట్టి సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా.. టీడీపీకి పరాభవం దక్కగా, చివరకు వైఎస్సార్సీపీనే అధికార పీఠాలు దక్కించుకుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అదే పంథాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కొలువుదీరిన పీఠాలపై ఆ పార్టీ ముద్ర వేసుకునేందుకు అరాచకాలకు తెగించింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా, వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఒక్క కార్పొరేటర్ స్థానం టీడీపీకి లేదు. అయినా అధికారంలోని టీడీపీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మెడపై పోలీస్ కేసుల గన్ పెట్టి పచ్చ కండువాలు కప్పేసి.. టీడీపీ కార్పొరేటర్లంటూ చెప్పుకుంది. ఇదే సమయంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగితే.. పచ్చ కండువా కప్పుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో టీడీపీ ముద్రతో ఆ పదవిని దక్కించుకుంది. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన రెండు డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక సమయంలో కూడా బలం లేని టీడీపీ రాత్రికి రాత్రే వైఎస్సార్సీపీ సభ్యులను డబ్బు సంచులతో కొనుగోలు చేసి విప్ భయంతో స్వతంత్ర అభ్యర్థిగా తమ ఖాతాలో వేసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్సీపీ సభ్యులను రానివ్వకుండా విలువలకు పాతరేసి ఎన్నిక జరిపినట్లుగా చూపించి పేర్లు రాసుకున్నారు.. ఇలా ఏ ఎన్నిక జరిగినా సరే అడ్డదారులు తొక్కి తమ ఖాతాలో వేసుకుని తాత్కాలికంగా పైశాచికానందం పొందడం టీడీపీకే చెల్లింది. తాజాగా నెల్లూరు మేయర్ విషయంలోనూ టీడీపీ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు సామదాన దండోపాయాలు ప్రదర్శించారు. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు తిరిగి సొంత గూటికి చేరడంతో ఏకంగా పోలీసులతోనే వారిని కిడ్నాప్ చేయించి, చివరాఖరుకు టీడీపీ శిబిరానికి అప్పగించే విధంగా క్రూరంగా వ్యవహరించారు. వింజమూరులో ప్రజాస్వామ్యం ఖూనీ.. వింజమూరు ఎంపీపీ ఎన్నిక వేళ పోలీసులు వ్యవహరించిన తీరుతో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి, మరో మహిళా ఎంపీటీసీపై దౌర్జన్యానికి తెగబడ్డారు. పోలీసుల సాక్షిగా అరాచకాలు జరుగుతున్నా.. కట్టడి చేయకపోగా, టీడీపీ గూండాలకు కొమ్ముకాశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి వింజమూరు మండలంలో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేదు. అయినా ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ పెద్దలు ఖాకీలతోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారు. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో 8 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒకరు జనసేన ఎంపీటీసీగా గెలిచిన వారే. టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా గెలవలేకపోయింది. అప్పట్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇనగలూరి మోహన్రెడ్డిని ఎంపీపీగా ఎంపిక చేసింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంపీపీతోపాటు మరో ఇద్దరు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇద్దరి నేతల మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టి దించేశారు. ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన మహిళను ఎంపీపీగా ఎన్నుకునేందుకు అరాచకం సాగించి ప్రజాస్వామ్యానికి పాతరేశారు. ఇటీవల నెల్లూరు మేయర్ ఎన్నికల సమయంలో కూడా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ను పోలీసులు కిడ్నాప్ చేసి టీడీపీ క్యాంపులో వదిలి పెట్టిన సంగతి మరవక ముందే వింజమూరులో కూడా ఖాకీల సాక్షిగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తున్నా చోద్యం చూసి వదిలేయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. జిల్లాలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అధికారం మారగానే తమ ఖాతాలో వేసుకునేందుకు అడ్డదారులు ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పదవులపై టీడీపీ ముద్ర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు పచ్చ కండువాలు వేసి.. టీడీపీ బలంగా చెప్పుకోవడం పరిపాటి పరాయి బిడ్డలకు తానే తండ్రిననే రీతిలో టీడీపీ వ్యవహారం తాజాగా వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో కిడ్నాప్లు, దాడులు అధికారానికి కొమ్ము కాస్తున్న ఖాకీలు -
ఇదే ఆఖరి అవకాశం
● పన్నులు చెల్లించండి నెల్లూరు(బారకాసు): పన్నులకు సంబంధించి మొండి బకాయిలున్నవారు ఆఖరి అవకాశంగా భావించి వెంటనే చెల్లించాలని కమిషనర్ నందన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి ఆస్తులను జప్తు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 15,737 అసెస్మెంట్ల నుంచి చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం రూ.108.82 కోట్లన్నారు. ఇది 10 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పరిధిలో జమ కావాల్సి ఉందని, మొండి బకాయిలను వసూలు చేయడానికి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు తెలియజేశారు. రూ.10 వేలకు పైగా బకాయిలున్న వారికి నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదన్నారు. దీంతో కారణాలు తెలుసుకునేందుకు బకాయిదారులతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్ ● వాహనాల స్వాధీనం ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని టిడ్కో గృహాల వద్ద డీఎస్పీ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 1,028 గృహాలున్న ఈ ప్రాంతంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 50 మంది పోలీసులు సెర్చ్లో పాల్గొని ఆధార్కార్డులు పరిశీలించారు. సరైన పత్రాల్లేని రెండు కార్లు, నాలుగు ఆటోలు, 30 మోటార్బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు జి.గంగాధర్, శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు ఎస్కే జిలానీ, బి.సాయిప్రసాద్, సైదులు తదితరులు పాల్గొన్నారు. మినీ ట్రాక్టర్ కింద పడి..● వ్యక్తి మృతి సోమశిల(చేజర్ల): పేద కుటుంబానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తు మినీ ట్రాక్టర్ కిందపడి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండల పరిధిలోని చిత్తలూరు గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి (35) అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. కోళ్ల ఫారం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో మరొకరి పొలంలో మినీ ట్రాక్టర్తో బురద దుక్కి దున్నతుండగా ప్రమాదవశాత్తు దాని కిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. దస్తగిరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదునెల్లూరు(క్రైమ్): ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించిన మాజీ విద్యార్థి సంఘ నేతపై నెల్లూరు సంతపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సోమవారం వారు వివరాలు వెల్లడించారు. బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్కు చెందిన ఎం.పెంచలయ్య నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీన అతను కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం విషయమై అర్బన్ తహసీల్దార్తో మాజీ విద్యార్థి సంఘ నేత జీవీ ప్రసాద్ వాగ్వాదానికి దిగాడు. గమనించిన ఇన్చార్జి ఆర్ఐ గొడవ చేయొద్దని ప్రసాద్ను వారించాడు. దీంతో ప్రసాద్ సదరు ఆర్ఐని కులం పేరుతో దూషించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించాడు. బాధిత ఉద్యోగి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.కండలేరులో 61.290 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 61.290 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,200 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 700, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. 10, 11 తేదీల్లో పక్షుల పండగదొరవారిసత్రం: ఈనెల 10, 11 తేదీల్లో జరిగే పక్షుల పండగకు నేలపట్టు పక్షుల కేంద్రానికి విచ్చేసే సందర్శకుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ, పక్షుల పండగ ప్రత్యేకాధికారి భానుప్రకాష్రెడ్డి ఆదేశించారు. పక్షుల కేంద్రంలో సోమవారం అన్ని శాఖల మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాన్ని సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, అటవీ శాఖలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని 36 బ్లాక్స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్లాక్స్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యలపై సోమవారం నెల్లూరు పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్లాక్స్పాట్లలో స్పెషల్ డ్రైవ్లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. వాహనదారులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో హెచ్చరిక బోర్డులు, లైటింగ్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యసేవనం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫేస్ వాష్ కార్యక్రమాన్ని రాత్రివేళల్లో నిర్వహించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా ప్రామాణికత కలిగిన హెల్మెట్లను ధరించాలన్నారు. అతివేగం ప్రమాదాకరమని, ఇంటివద్ద తమ కోసం కుటుంబ సభ్యలు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తెరిగి బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. కాన్ఫరెన్స్లో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
మీరైనా న్యాయం చేయండి
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 124 వినతుల అందజేత నెల్లూరు(క్రైమ్): ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. మీరైనా విచారించి న్యాయం చేయండి’ అని పలువురు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 124 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ అజిత వేజండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మాను. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తున్నాడు. ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులతో కలిసి బెదిరిస్తున్నాడని కావలికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నా ఫోన్ నంబర్ను గుర్తుతెలియని వ్యక్తులు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అర్ధరాత్రుల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్, మెసేజ్లు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నూరుల్లా అనే వ్యక్తి అన్నలా ఉండేవాడు. నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మూడునెలల నుంచి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సైతం తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని పొదలకూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రం సమర్పించారు. ● వినోద్ అనే వ్యక్తితో నాకు వివాహమైంది. రెండునెలల తర్వాత అతను కువైట్కు వెళ్లాడు. వీసా పంపి నన్ను తీసుకెళ్తానని నమ్మబలికాడు. మూడు సంవత్సరాలైనా తీసుకెళ్లలేదు. ఈ విషయమై ప్రశ్నించగా భర్త, అత్తింతివారు రూ.10 లక్షల అదనపుకట్నం తీసుకుని వస్తేనే కువైట్కు తీసుకెళ్తామని చెబుతున్నారు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని గూడూరుకు చెందిన ఓ మహిళ కోరారు. ● భర్త అనుమానిస్తూ నా వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నాకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. నా భర్త ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ కనుగొని అప్పగించాలని చిల్లకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. -
కన్నీళ్లు దిగమింగి.. కష్టాలు పడుతూ..
పాలకులు, అధికారులు దృష్టి పెడితే ప్రజలకు కష్టాలు తప్పుతాయి. కానీ అలా జరగడం లేదు. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలానికి చెందిన శ్రీదేవికి నాగ్ గోవర్ధన్ అనే కుమారుడున్నాడు. అతను దివ్యాంగుడు. మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్ను రూ.15,000కు పెంచాలంటూ ఆ తల్లి ప్రజాప్రతినిధులు, యంత్రాంగం చుట్టూ తిరుగుతోంది. అయితే ఎవరూ కనికరించలేదు. దీంతో సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కుమారుడిని ఆటోలో తీసుకొచ్చింది. గోవర్ధన్ను కిందకు దించేందుకు అక్కడి సిబ్బంది సాయం తీసుకుని ఉన్నతాధికారులను వేడుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
చమురు నిక్షేపాలు కొల్లగొట్టేందుకే దాడి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వెనెజువెలా దేశంలో ఉన్న చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకే అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. సీపీఎం జిల్లా సెక్రటేరియల్ సభ్యుడు మోహన్రావు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి వీరమరాజు, సీపీఐ ఎంఎల్ నాయకుడు కె.రాంబాబు మాట్లాడారు. దాడిని ఖండిస్తూ మంగళవారం నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అంతర్జాతీయ కోర్టు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ భద్రతా మండలి న్యాయసూత్రాలకు విరుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. వెనెజువెలా ఘటనను ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం ఖండించకపోవడం దారుణమన్నారు. మదురోను వెంటనే విడుదల చేసి అంతర్జాతీయ కోర్టులో ట్రంప్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజాతంత్రవాదులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, దయాకర్ పాల్గొన్నారు. -
పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
చిల్లకూరు: పిల్లలకు గురుకుల పాఠశాలలో భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి కుటుంబం, ప్రజా సంఘాల నాయకులు కలిసి సోమవారం చిల్లకూరు బాలుర గురుకుల పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ అనిల్కుమార్తో వాగ్వాదానికి దిగారు. సుధాకర్ వివరాలు వెల్లడించారు. తన కుమారుడు అరవింద్ ఆరో తరగతి చదువుతున్నట్లు చెప్పారు. ఆదివారం పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్ల వద్దకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అరవింద్కు మత్తు ఇచ్చాడన్నారు. దీంతో అతను గంటకు పైగా అక్కడే ఉన్నాడని, మెలకువ వచ్చాక 9వ తరగతి విద్యార్థులు గుర్తించి తరగతి ఇన్చార్జికు సమాచారం ఇచ్చారన్నారు. అరవింద్ను గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం తమకు సమాచారం అందించారని ఆరోపించారు. తాము గురుకులానికి వచ్చి పిల్లవాడ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రిన్సిపల్, టీచర్లు పర్యవేక్షణ చేయకపోవడం దారుణమని విమర్శించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రిన్సిపల్ మాట్లాడుతూ అరవింద్కు వైద్యం చేయించామన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో సుధాకర్ స్పందించి తమ బిడ్డను కొద్దిరోజులపాటు ఇంటికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థి చెప్పిన విషయంపై గురుకులం సిబ్బంది దృష్టిసారించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ నాయకుడు వెంకటేశ్వర్లు కోరారు. -
ట్రాన్స్కోకు నష్టం
అధికారుల నిర్ణయం..● రూ.4 కోట్లు ఎక్కువ టెండర్ వేసిన కాంట్రాక్టర్కు పనులు ● సబ్స్టేషన్ నిర్మాణంతో వెలుగులోకి స్కామ్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): అధికారుల తీసుకున్న నిర్ణయంతో ట్రాక్స్కోకు నష్టం వస్తోందని ఆరోపణలున్నాయి. ఏపీ ట్రాన్స్కో గతేడాదిలో నెల్లూరు నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన రెండెకరాల స్థలంలో 132 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు టెండర్లు పిలిచింంది. రూ.32 కోట్లకు వచ్చిన టెండర్ను ఖరారు చేశారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ప్రచారముంది. అయితే ఖరారు చేసిన వ్యక్తికి కాకుండా అదనంగా రూ.36 కోట్లకు టెండర్ వేసిన కాంట్రాక్టర్కు నిర్మాణ పనులు అప్పజెప్పేలా నేతలు ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్కోలో టెండర్స్కాం వెలుగులోకి వచ్చింది. అదనపు భారం సబ్స్టేషన్ నిర్మాణానికి తక్కువ టెండర్ వేసిన కాంట్రాక్టర్ను కాదని రూ.4 కోట్లు అదనంగా వేసిన వ్యక్తికి పనులు కేటాయించడంతో ఏపీ ట్రాన్స్కోపై భారం పడనుంది. ఈ టెండర్ స్కామ్లో నాయకులు, అధికారుల పాత్ర ఏ మేర ఉందో తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్లో నిర్మించనున్న 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ స్థలం డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందింది. నిర్మాణానికి ఆ స్థలం కేటాయించడంతో అందుకు బదులుగా ట్రాన్స్కోకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయానికి ట్రాన్స్కో ఇవ్వాల్సి ఉంది. ట్రాన్స్కోకు నెల్లూరులోని అంబాపురం, కావలి, గూడూరు ప్రాంతాల్లో భూములున్నాయి. డీఎంహెచ్ఓ వారు ఏ ప్రాంతంలో కావాలంటే అక్కడ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఏది ఏమైనా ట్రాన్స్కో వారు అదనంగా రూ.4 కోట్లు టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్కు సబ్స్టేషన్ నిర్మాణ పనులు అప్పజెప్పడం చర్చనీయాంశమైంది.నిర్ణయాలు అక్కడే జరుగుతాయి ట్రాన్స్కో వారు నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు సంబంధించిన నిర్ణయాలు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో తీసుకుంటారు. అదనంగా నగదు కేటాయించే అధికారాలు మాకు లేవు. ట్రాన్స్కో ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సబ్స్టేషన్ల నిర్మాణ ప్రక్రియను, నాణ్యతా ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తారు. టెండర్ల విషయంలో జిల్లా ట్రాన్స్కో అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు. – రత్నం, ఏపీ ట్రాన్స్కో ఈఈ (ఇన్చార్జి కన్స్ట్రక్షన్ విభాగం) -
వింజమూరు ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికం
ఉదయగిరి: రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలు వింజమూరు ఎంపీపీ ఎన్నిక ఘటనతో పరాకాష్టకు చేరాయని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘గతంలో వైఎస్సార్సీపీ తరఫున వింజమూరు ఎంపీపీగా ఉన్న వ్యక్తిపై అవిశ్వాసాన్ని ప్రకటించి టీడీపీ నేతలు బలవంతంగా పదవి నుంచి దించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికకు అధికారులు సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీకి తగినంత బలం లేకపోవడంతో కుట్రలకు తెరలేపింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ మోహన్రెడ్డిని పోలీసులతో బలవంతంగా కిడ్నాప్ చేయించి నిర్బంధించి, కుటుంబ సభ్యులను బెదిరించి ఆ«దీనంలో ఉంచుకున్నారు.ప్రత్యేక సమావేశానికి వస్తున్న ఊటుకూరు ఎంపీటీసీ మల్లికార్జునను పోలీసుల సమక్షంలో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. మరో మహిళా ఎంపీటీసీ ఉంటా రత్నమ్మను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా మా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. టీడీపీ సభ్యులకు తగిన కోరం లేనందున తటస్థంగా ఉన్న ఎంపీటీసీనీ పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి అక్కడి నుంచి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. ఎమ్మెల్యే బలవంతంగా ఆ వ్యక్తిని సమావేశం దగ్గరకు తీసుకొచ్చి ఎన్నిక వాయిదా పడేందుకు రెండు నిమిషాల ముందు దొడ్డిదారిన లోపలికి పంపారు. అక్కడే తిష్ట వేసిన ఎమ్మెల్యే తమ ఎంపీటీసీలను పోలీసులు, అధికారుల ద్వారా బలవంతంగా బయటకు పంపి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తిచేశారు.ఓటమి భయంతో టీడీపీ బరితెగించి, మా పార్టీ ఎంపీటీసీలను బలవంతం చేస్తూ దౌర్జన్యాలు, దాడులకు తెగబడి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. ఇక సామాన్యుల పరిస్థితులు ఎలా ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ విధానాలను, కూటమి పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారు.’’ అని కాకాణి విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా, దౌర్జన్యాలు, అరాచకాలను లెక్క చేయకుండా ఎదురొడ్డి నిలబడిన ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు కాకాణి ధన్యవాదాలు తెలిపారు. వింజమూరులో పోలీసులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ ఎమ్మెల్యే గూండాల్లాగా వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. -
‘ఎన్నికల కమిషన్కు కళ్లు లేవా?.. ఎంపీటీసీలపై దాడులేంటి?’
సాక్షి, తాడేపల్లి/ నెల్లూరు: వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు వైఎస్సార్సీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామం లేదు.. ఉప ఎన్నికల్లో సైతం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కళ్లు ఉండి.. గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు.వింజమూరు, బొమ్మనహళ్లి ఎన్నికలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ..‘వింజమూరు, బొమ్మనహళ్లిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలాంటి అప్రజాస్వామ్యమైన పనులు చేయలేదు. ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఎన్నికల కమిషన్ గుడ్డిగా వ్యవహరిస్తోంది. మా పార్టీ ఎంపీటీసీ సభ్యులను పోలీసుల ఎదుటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మహిళా ఎంపీటీసీపై దాడి చేయటంతో చేతికి గాయమైంది. అధికారులు పద్దతులు మార్చుకోవాలి. టీడీపీ గూండాలకు మద్దతుగా వ్యహరించిన వారందరి పేర్లనూ మా డిజిటల్ బుక్లో ఎక్కిస్తాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.మరోవైపు.. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ..‘వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై అతి దారుణంగా దాడి చేశారు. మహిళా ఎంపీటీసీకి గాయలయ్యాయి. సంఖ్యా బలం కోసం నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. నైతికంగా వైఎస్సార్సీపీ విజయం సాధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి యత్నించడంతో కలకలం రేగింది. ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. అనంతరం, ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. అంతేకాకుండగా మల్లికార్జున్ అనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం అయిన ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల జులం ప్రదర్శించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత
నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి యత్నించడంతో కలకలం రేగింది. ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకరల్లల వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మలహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసి మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం అయిన ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల జులం ప్రదర్శించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
కూటమి గొప్పలు.. రైతులకు తిప్పలు
● తప్పుల తడకలుగా పాస్ పుస్తకాలు ● పది మంది రైతుల పాస్ బుక్స్లో ఒకే వ్యక్తి ఫొటో ● జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షలు మంజూరు నెల్లూరు (దర్గామిట్ట): కూటమి ప్రభుత్వం మరోసారి గొప్పలకు పోయి రైతులకు మళ్లీ తిప్పలు తెచ్చింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లాయంటూ నానా హంగామా సృష్టించి తాము అధికారంలోకి వస్తే తప్పులు లేని పాస్ పుస్తకాలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. కూటమి మళ్లీ అవే తప్పులతో పాసు పుస్తకాలను రాజముద్ర వేసి మరీ రైతులకు అంటగడుతూ ఏదో ఇచ్చేశామంటూ చెప్పుకొస్తూ రైతులను మరింత ఇబ్బందులకు గురి చేసింది. గత ప్రభుత్వంలో రీ సర్వే జరిగిన సమయంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన భూముల వివరాల నమోదులో తప్పులకు పాల్పడ్డారు. వీటిని సరిచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంది. తప్పులు సరిదిద్దకుండానే.. రీ సర్వే చేసిన గ్రామాల్లో రైతుల భూముల వివరాల నమోదులో జరిగిన తప్పులను సరిదిద్దకుండానే పాస్పుస్తకాలు మంజూరు చేయడంతో రైతులు ఏ విధంగానూ ఉపయోగం లేకుండా పోతున్నాయి. తమ హక్కులు కోల్పోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. అనేక గ్రామాల్లో ఒకే ఫొటోతో పదుల కొద్దీ పాసుపుస్తకాలు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం తన ఆర్భాటాన్ని ప్రదర్శించేందుకు రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. 328 గ్రామాల్లో రీ సర్వే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో 737 గ్రామాలకు గాను 328 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసింది. ఆయా గ్రామాల్లో దాదాపు 1.13 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు. అయితే రీ సర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నంబర్లు, విస్తీర్ణం, సబ్ డివిజన్లు లేకపోవడం, ఆసైన్డ్, చుక్కల భూములు, సర్వీస్ ఇనాం ఇలాంటి అనేక కాలమ్స్ తప్పుగా రావడంతో రైతులు వీటన్నింటిపై నూతన ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. అయితే వీటన్నింటిని సరి చేయకుండానే కూటమి ప్రభుత్వం పాత డేటాతోనే కొత్తగా పాసు పుస్తకాలు ప్రింట్ చేయించి రైతులకు మంజూరు చేస్తుండడంతో వీటిని సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదంటూ రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వ్యక్తి ఫొటో 10 పుస్తకాల్లో.. జిల్లాలోని దగదర్తి మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందులో 9 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయింది. ఇందులో లింగాలపాడులో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన పాసు పుస్తకాల్లో ఒకే వ్యక్తి ఫొటో 10 పాసుపుస్తకాల్లో రావడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీంతో అధికారులు వాటిని సరిచేసి ఇస్తామంటూ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో వాటిని రైతులకు అందజేయకుండానే తీసుకుంటున్నారు. దీనిపై దగదర్తి తహసీల్దారు టీ కృష్ణను వివరణ కోరగా ఇలా ఒక వ్యక్తి ఫొటో 10 పాసు పుస్తకాల్లో వచ్చింది నిజమేనంటూ వివరణ ఇచ్చారు. -
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
రూ.72 కోట్లు మంజూరు ●ట్రాఫిక్ కష్టాలు తొలగాయి పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారిని విస్తరించడంతో ట్రాఫిక్ కష్టాలు తొలగాయి. గతంలో నెల్లూరు నగరంలోకి సరుకు రవాణా వాహనాలు వెళ్లేందుకు అరగంటకుపైగా సమయం పట్టేది. ప్రస్తుతం రోడ్డు విస్తరణతో సమయం బాగా ఆదావుతోంది. గతంలో ట్రాఫిక్తో ఇంధన ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడు బాగా తగ్గింది. –నెల్లూరు సుబ్బయ్య, వ్యాపారి, పడుగుపాడు పార్కింగ్ సమస్య తప్పింది రోడ్డు విస్తరణకు ముందు దుకాణాల ఎదుట వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా ఉండేది. దీంతో దుకాణాల వద్దకు కస్టమర్లు వచ్చేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం రోడ్డు విస్తరణతో పార్కింగ్ సమస్య తప్పింది. డ్రైనేజీ నిర్మాణంతో వర్షపు నీరు నిల్వక పోడంతో వ్యాపారానికి ఆటంకం కలగడం లేదు. –కడింపాటి శశిధర్ గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల సంస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి విస్తరణకు రూ.72 కోట్లను మంజూరు చేసింది. ఆరు లేన్లుగా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి 118 మంది బాధితులకు రూ.1.80లక్షలు చొప్పున రూ.2,12,40,000 పరిహారాన్ని అందజేశారు. కోవూరు : రాజకీయాల్లో మాటలు చెప్పేవారు కొందరైతే.. పనులు చేసి చూపించేవారు మరికొందరు. ఆ కోవకే చెందుతారు మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పోలుబోయిన అనిల్కుమార్యాదవ్. కోవూరు నియోజకవర్గ ముఖద్వారమైన పడుగుపాడు ప్రాంతాన్ని చూస్తుంటే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రూపురేఖలను సమూలంగా మార్చివేసిన ఘనత ఈ ఇద్దరు నేతలకే దక్కుతుంది. గతంలో అధ్వానంగా రహదారి గతంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం జాతీయ రహదారి అధ్వానంగా ఉండేది. ఈ రహదారి ఏషియన్ హైవే 16తో నెల్లూరు–ముంబై రహదారిని కలుపుతుంది. అలాగే జాతీయ రహదారి నుంచి నెల్లూరు నగరంలోకి వెళ్లేందుకు ప్రధానమైన రోడ్డుగా ఉంది. జాతీయ రహదారుల పరిధిలోని ఈ రహదారి దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండేవారు. లారీయార్డు నుంచి వెంకటేశ్వరపురం ఫ్లయిఓవర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునేవి. మరోవైపు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు అల్లాడిపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ రహదారిపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రహదారి విస్తరణ ద్వారా పడుగుపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్తో కలిసి రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించారు. ఆధునిక హంగులతో ఆరులేన్లుగా.. గత ప్రభుత్వ హయాంలో పడుగుపాడు నుంచి వెంకటేశ్వరపురం వరకు ఆధునిక హంగులతో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నికల నాటికి దాదాపుగా పనులు పూర్తయ్యాయి. భారీ వాహనాల రాకపోకలను తట్టుకునేలా అత్యంత నాణ్యమైన బీటీరోడ్లను నిర్మించారు. ఇరువైపులా సర్వీసురోడ్లతో పాటు రెయిలింగులను ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణతో పాటు శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ పనులను చేపట్టడంతో వర్షపు నీటి సమస్యకు చెక్ పడింది. రోడ్డు మధ్యన ఏర్పాటు చేసిన అధునాతన విద్యుద్దీపాలు పడుగుపాడు ప్రాంతానికి కొత్త శోభను తెచ్చాయి. గతంలో చీకటిలో భయం భయంగా వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు ధైర్యంగా రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రహణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి విస్తరణకు సంబంధించి దాదాపుగా 98 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ రావడంతో కేవలం 200 మీటర్ల రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారి విస్తరణ పనులు ముందుకు సాగలేదు. తుదిదశ పనులకు దాదాపు 18 నెలల గ్రహణం తరువాత మోక్షం కలిగింది. ప్రస్తుతం మిగిలిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ రహదారిని పెన్నానదిపై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జితో లింక్ చేయడం వల్ల పాతబ్రిడ్జిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు పడుగుపాడు, వెంకటేశ్వరపురం మీదుగా నెల్లూరు నగరంలోకి ప్రవేశించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఏషియన్ హైవే నుంచి నెల్లూరు నగరంలోకి ఉన్న మిగిలిన లింక్రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అభివృద్ధికే తలమానికం కోవూరు ముఖద్వారం డబుల్ రోడ్డు నుంచి ఆరు వరుసల రహదారి విస్తరణ సెంటర్ లైటింగ్తో వెలుగులీనుతున్న మార్గాలు మాజీ మంత్రులు నల్లపరెడ్డి, అనిల్ చొరవతో 98 శాతం పనులు పూర్తి మిగిలిన తుది దశ పనులకు 18 నెలల గ్రహణం తర్వాత మోక్షం -
నేడు వింజమూరు ఎంపీపీ ఎన్నిక
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్మలాదేవి పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో కొందరు టీడీపీ, వైఎస్సార్సీపీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నిక సమయానికి రెండు శిబిరాల్లోని ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది. ఎంపీపీ ఎన్నికలో మాజీ ఎంపీపీ మోహన్రెడ్డి, ప్రస్తుత తాత్కాలిక ఎంపీపీ ఆనంగి రమణయ్య ఓట్లు కీలకంగా మారనున్నాయి. వీరి ఓటింగ్పైన ఆధారపడి ఫలితం ఉండనుంది. మొత్తం మీద ఎంపీపీ కుర్చీలో టీడీపీకి చెందిన వనిపెంట హైమావతి లేక వైఎస్సార్సీపీకి చెందిన పల్లాల కొండారెడ్డి కూర్చుంటారా లేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని తాత్కాలిక ఎంపీపీ ఆనంగి రమణయ్యని వరిస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఎస్ఈఐఎల్ ఎనర్జీ నూతన కార్యాలయ ప్రారంభం ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ విజయవాడలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆ కంపెనీ సీఈఓ జన్మేజయ మహాపాత్ర ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో హెచ్ఆర్ హెడ్ బ్రిగేడియర్ సీహెచ్డీ శంకర్ప్రసాద్, అడ్మిన్, ఈఆర్హెచ్ జీఎన్ రఘురామ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన మొత్తం 2,640 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయమైన భాగాన్ని రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తమ కొత్త కార్యాలయం ద్వారా రాష్ట్రంలో తమ కంపెనీ ఉనికి మరింతగా బలోపేతమై వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు చెప్పారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి పొదలకూరు మండలం చిట్టేపల్లికి చెందిన మోదేపల్లి కృష్ణప్రసాద్, రాధ, కుమారుడు జయసింహలు రూ 1,00,116 విరాళాన్ని ఆదివారం అందజేశారు. వీరికి దేవస్థాన ఏసీ శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. సొంత పార్టీ నేతలపైనే కాకర్ల విసుర్లు నెల్లూరు సిటీ: సొంత పార్టీ నేతలపైనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తనను అప్రతిష్ట పాల్జేసేందుకు అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. అందులో భాగంగానే వెంగమాంబ అనే మహిళ వీడియోను విడుదల చేశారని, దీని వెనుక నాటకదారులు, సూత్రధారులు ఎవరో తేలుస్తానని హెచ్చరించారు. తనపై చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటుండడాన్ని చూసి ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని నిందలు వేయాలని చూస్తున్నారన్నారు. తనపైన నిరాధారమైన ఆరోపణలు చేసిన వెంగమాంబ సెప్టెంబర్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు వెళ్లిన క్రమంలో పరిచయమైందన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయాలని ఉందని చెప్పడంతో అంగన్వాడీ కోఆర్డినేటర్గా నియమించామని తెలిపారు. అయితే విజయవాడలో ఆమెను ఉపయోగించి తనపై కుట్రకు యత్నించినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. మహిళ విషయం కాబట్టి అక్కడితో వదిలివేశానన్నారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని, దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తానన్నారు. తన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. అడ్డదిడ్డంగా, ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోనని, అటువంటి వారిపై చట్టపరంగా వెళ్తానని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు చేజర్ల మల్లికార్జున, మద్దసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
యూనియన్ సభ్యుల సంక్షేమానికి కృషి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పోతుల సురేష్, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కంపెనీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం (ఏఈ) అన్నారు. నెల్లూరులోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా జరుగుతున్న యూనియన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోటారాలు చేసేందుకు యూనియన్ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సుందరకుమార్ వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్.సురేష్, కార్యనిర్వహక అధ్యక్షుడిగా పులి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, కోశాధికారిగా రాజు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎస్కే మీరావలీ, సంయుక్త కార్యదర్శిగా వాసుదేవ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శుభకర్, సభ్యులుగా దేవదాసు, పూర్ణచంద్రరావు, జార్జి, గోపిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వందనకుమార్, సువర్ణ కుమారి, అడ్వైజర్ రవినారాయణ(డీఈఈ), బెనర్జీ (కావలి ఈఈ), డిస్కం సెక్రటరీ బాలరాజు, జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, సెక్రటరీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఎస్ఈ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని సోమవారం విద్యుత్ భవన్లో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 0861 – 2320427 నంబర్కు వినియోగదారులు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరు● జేవీవీ నాయకులు నెల్లూరు(అర్బన్): ప్రశాంతంగా ఉన్న జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిన మాదకద్రవ్యాలు, మత్తు మందులు, గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరు నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ తెలిపారు. ఆదివారం నెల్లూరు హరనాథపురంలోని జేవీవీ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్యను గంజాయి మూకలు హత్య చేయడం దారుణమన్నారు. ఇలాగే ఉంటే సమాజం తిరోగమనంలో నడుస్తుందన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలతో కలిసి మత్తు మందులు, గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తీర్మానించామన్నారు. అలాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు మోహన్రెడ్డి, డాక్టర్ కాలేషాబాషా, హెచ్ఎం ఎంవీ చలపతి, డాక్టర్ రఫీ, బుజ్జయ్య, నగర కార్యదర్శి కృష్ణ, ఉదయభాస్కర్, మాదాల రాము, విద్యాచరణ్, పోలయ్య, సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. చైతన్యపురి కాలనీలో మురళీకృష్ణ కుటుంబం నివాసముంటోంది. అతని తల్లి ధనమ్మ (66)కి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్తో ఆమె బాధపడుతూ వాటికి మందులు వాడుతోంది. ప్రతి చిన్న విషయానికి అందరిపై కోప్పడేది. ఆరోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఆమె చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులకు చెప్పగా వారు సర్ది చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 3వ తేదీన ఆమె బాత్రూమ్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. బాధిత కుమారుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.మహిళపై బ్లేడ్తో దాడి● హత్యాయత్నం కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): వివాదం వద్దని సర్దిచెప్పిన ఓ మహిళపై బ్లేడ్తో విచక్షణారహితంగా దాడి చేసిన మరో మహిళపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. రంగనాయకులపేట ఉప్పరపాళెంలో నివాసముంటున్న రాజేశ్వరి, కీర్తిల మధ్య డ్రెయినేజీ నీరు వెళ్లే దారి విషయంలో వివాదం ఉంది. ఈనెల మూడో తేదీన వారి మధ్య గొడవ జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణి, మరికొందరు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో గొడవ ఆగిపోయింది. కీర్తి పాత గొడవను మనసులో పెట్టుకుని ఆదివారం రాజేశ్వరిపై దాడి చేసింది. అడ్డువెళ్లిన కృష్ణవేణి కుడిచేతి చిటికిన వేలును కొరికి చంపేస్తానని బెదిరించింది. దీంతో ఆమె తన భర్త, రాజేశ్వరి, లక్ష్మీలతో కలిసి సంతపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా కీర్తి అడ్డుకుంది. కృష్ణవేణిపై బ్లేడ్తో విచక్షణారహితంగా దాడిచేసి పరారైంది. ఎడమ చెంపపై తీవ్రగాయమైన కృష్ణవేణిని ఆమె భర్త, అక్కడున్నవారు వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. బాధితురాలు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
సాయం అందించాలి
ఉప్పు సాగునే నమ్ముకుని జీవించేవారం. పదేళ్లుగా సరైన పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్యాకేజీ రైతులతోపాటు మాలాంటి కార్మికులకు సైతం పోర్టు వారు సాయం అందజేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. జీవనం కూడా కష్టం మారింది. పోర్టులో మాకు తగిన పనులు లేవంటున్నారు. – ఎం.రమణమ్మ, గోపాలపురం, ఉప్పు కార్మికురాలు యాజమాన్యం పట్టించుకోవాలి కృష్ణపట్నం పోర్టు రావడం మాకు సంతోషమే. కానీ మాకు జీవనాధారం లేకుండాపోయింది. గతంలో ఉప్పు సాగు వల్ల చేతినిండా పనులు లభించేవి. నేడు మాకు తెలిసిన పనులు చేసేందుకు వీలులేకుండాపోయింది. పోర్టు యాజమాన్యం పెద్ద మనస్సు చేసుకుని ప్యాకేజీ ప్రకటించాలి. – జి.సుబ్రహ్మణ్యం, కృష్ణపట్నం, ఉప్పు కార్మికుడు ● -
టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్
● వాహనాల స్వాధీనంనెల్లూరు(క్రైమ్): నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని భగత్సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అందులో నివాసం ఉంటున్న వివరాలను సేకరించారు. వారి ఆధార్కార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఫిన్స్ సాయంతో వేలిముద్రలు సేకరించారు. వాహనపత్రాల్లేని 24 మోటార్బైక్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్లకు ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నవాబుపేట సంతపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, బాలాజీ నగర్ ఇన్స్పెక్టర్లు జి.వేణుగోపాల్రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్లీపురంలో.. నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని అల్లీపురంలో టిడ్కో గృహాల్లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ జరిగింది. మొత్తం 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి 300 ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన పత్రాల్లేని 46 మోటార్బైక్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. -
ఉప్పు సాగు బంద్
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం పంచాయతీ గోపాలపురంలో ఉప్పు సాగు నిలిచిపోయింది. బ్రిటిష్ హయాం నుంచి ఉత్పత్తి ఉండగా.. దశాబ్దం క్రితం వరకూ కళకళలాడింది. అయితే కృష్ణపట్నం పోర్టు వెదజల్లుతున్న బొగ్గు, దుమ్ము, ధూళి కాలుష్యం కారణంగా సాగు బంద్ అయింది. దీనిపై ఆధారపడిన సుమారు 1,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సుమారు 700 ఎకరాల్లో ఉప్పు కయ్యలు వర్షపునీటితో నిండిపోయాయి. పోర్టు యాజమాన్యం ప్రతి ఏడాది సాల్ట్ లీజుదారులకు అందజేస్తున్న జీవనభృతి మాకు అందజేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతోమందికి ఆధారం ఉప్పు ఉత్పత్తి వెయ్యిమంది కూలీలకు ఆధారంగా ఉండేది. కృష్ణపట్నం, గోపాలపురం, చలివేంద్రం, బలిజపాళెం, సుబ్బారెడ్డిపాళెం, పాదర్తిపాళెం, శంభునితోపు గ్రామాలకు చెందినవారు పనికి వెళ్లేవారు. కాలుష్యం కారణంగా కూలీలు వీధినపడ్డారు. అప్పట్లో సేద్య కాపులు మడవ కట్టి తొక్కుడు తొక్కి ఉప్పు మోసేవారు. కొలత, కువ్వ తట్టడం, ప్యాకింగ్ తదితర పనులుండేవి. ఇందుకోసం గుమస్తాలు దగ్గరుండి లోడ్ చేసి ఎగుమతి చేశారు. గోపాలపురంలో సాల్ట్ కార్యాలయం కూడా ఉండేది. అది నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రతి ఏడాది ఏడునెలలపాటు ఈ ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగు పూర్తిగా లేకపోవడంతో చాలామంది సరైన పనుల్లేక ఖాళీగా ఉంటున్నట్టు వెల్లడిస్తున్నారు. వయస్సు పైపడిన వారు కావడంతో పోర్టులో సైతం పనులు ఇవ్వడం లేదంటున్నారు. పూటగడవటం కూడా కష్టంగా మారిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ అందజేయాలి ఉప్పు రైతులు తమ భూములను పోర్టుకు అప్పగించారు. అయితే ఆ పరిశ్రమను నమ్ముకుని జీవించే వందలాది మంది కార్మికులు మాత్రం పనుల్లేక పస్తులు ఉంటున్నారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకుని వెళ్లడంతో పోర్టు యాజమాన్యం ప్యాకేజీ అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్యాకేజీ అందలేదని వారు చెబుతున్నారు. పోర్టు యజమాన్యం ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం వెయ్యిందికి పైగా ఎదురు చూస్తున్నారు. నవయుగ ఆధ్వర్యంలో పోర్టు నడిచే సమయంలో వారు కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఉప్పు పరిశ్రమ రైతులకు పోర్టు యాజమాన్యం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో 700 ఎకరాల్లో సాగు నేడు బీడుగా మారిన భూములు దశాబ్ద కాలంగా ప్యాకేజీ కోసం కార్మికుల నిరీక్షణ ఉపాధి కోల్పోయిన వెయ్యి మంది గోడు వినాలని పోర్టు యాజమాన్యానికి విజ్ఞప్తి -
బీపీసీఎల్కు తప్పిన ప్రమాదం
ముత్తుకూరు (పొదలకూరు): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సముద్ర తీర ప్రాంతంలోని బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ కంపెనీ సమీపంలో అగ్నికీలలు ఎగసి పడ్డాయి. ఆదివారం కావడంతో తీరానికి వచ్చిన పర్యాటకులు ఎవరో సమీపంలోని సవక తోటల్లో నిప్పు రాజేయడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదానీ కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అధికారులు మంటలను సీసీటీవీ ఫుటేజీలో పరిశీలించి అప్రమత్తమయ్యారు. మెరైన్ పోలీసులకు సమాచారం అందించి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోర్టు పరిధిలోని తీర ప్రాంతంలో బీపీసీఎల్ పెట్రోల్ రిఫైనరీ, గ్యాస్ కంపెనీలు ఉన్నాయి.వీటికి 200 మీటర్ల సమీపంలోనే మంటలు ఎగసిపడడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. పర్యాటకులపై ఆంక్షలు లేకుండా పోయాయని తీరప్రాంత గ్రామస్తులు అంటున్నారు. దీనికితోడు సెక్యూరిటీ వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకుల పేరుతో కొందరు ఆకతాయిలు వచ్చి సవక తోటల్లో పార్టీలు చేసుకుంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ గ్యాస్ కంపెనీలు ఉన్న తీర ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటున్నారు. -
కనుల పండువగా ఆరుద్రోత్సవం
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శివముక్కోటిని (ఆరుద్రోత్సవం) కనులపండువగా నిర్వహించారు. తొలుత శివ కామసుందరి సమేత నటరాజస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. స్వామివారికి రుద్ర పారాయణ సహిత అన్నాభిషేకం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నాట్యం, నాదం, గానం మండపంలో నేత్రపర్వంగా చేశారు. ఆరుద్రోత్సవంలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చి భక్తజనంతో దేవస్థానం కిటకిటలాడింది. తదుపరి రాత్రి స్వామివారి పేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలుగా దేవిశెట్టి వెంకటసుబ్బయ్య కుమారులు వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. -
నడిచి వెళ్తుండగా..
● మహిళ వద్ద రూ.లక్ష నగదు, సెల్ఫోన్ అపహరణ వెంకటాచలం: బ్యాంక్ నుంచి నగదు తీసుకుని వెళ్తున్న మహిళ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మోటార్ బైక్పై వచ్చి రూ.లక్ష నగదు, సెల్ఫోన్ లాక్కొని పరారైన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో శనివారం జరిగింది. చెముడుగుంట గ్రామానికి చెందిన సుకన్య శనివారం స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి, రూ.లక్ష నగదు తీసుకుని కాలినడకన కసుమూరు క్రాస్రోడ్డు వద్దకు వెళ్తుండగా, మోటార్ బైక్పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి సెల్ఫోన్ను, రూ.లక్ష నగదును లాక్కొన్నాడు. దీంతో మహిళ పెద్దగా కేకలు వేసే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. బాధితురాలు వెంకటాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేట్కు కీలుబొమ్మల్లా బ్యాంక్లు కావలి (అల్లూరు): దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిందని, పేదలకు అందాల్సిన రుణాలు బడా బాబులకు మళ్లిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ధ్వజమెత్తారు. కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను విద్యనభ్యసించిన జవహర్ భారతి కళాశాల ప్రస్తుతం ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు సక్రమంగా రాకపోవడం వల్ల వెనుకబడిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.14.30 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించేలా కావలిలో ఆరుగురు జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైలు దిగిన వృద్ధురాలి అదృశ్యంనెల్లూరు(క్రైమ్): వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై నెల్లూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన పి.బాలమ్మ గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక బాధపడుతోంది. ఆమె కుమారుడు చైన్నెలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 1వ తేదీ చైన్నెలోని కుమారుడిని చూసేందుకు ఆమె తన తమ్ముడు నరసింగరావుతో కలిసి చైన్నె ఎక్స్ప్రెస్లో బయలుదేరింది. 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు నెల్లూరుకు చేరుకుంది. తమ్ముడు నిద్రలో ఉండగా బాలమ్మ రైలు దిగి ఎటో వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత నిద్ర నుంచి లేచిన నరసింగరావు తన అక్క కనిపించకపోవడంతో బోగి అంతా గాలించాడు. జాడ తెలియరాలేదు. ఈ మేరకు ఆయన శనివారం నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై హరిచందన వృద్ధురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94406 27644, 99664 16581 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. 5,500 లీటర్ల డీజిల్ సీజ్ ● మూడు వాహనాల స్వాధీనం నెల్లూరు సిటీ: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా డీజిల్ తరలింపుపై విజలెన్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ పరిధిలోని అల్లీపురం గ్రామంలో భగవాన్ వెంకయ్య స్వామి లేఅవుట్కు సమీపంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్ను దిగుమతి చేసుకుంటున్నారు. బిల్లులు, లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. అందులో భాగంగా మూడు వాహనాల నుంచి రూ.17.38 లక్షలు విలువ చేసే 5,500 లీటర్ల ఆయల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ చేసి 6–ఏ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీహరి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి కావలి(అల్లూరు): కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొని మృతిచెందారు. రైల్వే ఎస్సై వెంకట్రావ్ వివరాల మేరకు.. ఓ వృద్ధుడు ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చనిపోయారు. మృతుడు తెల్లరంగు చొక్కా, గ్రీన్ కలర్ లుంగీ ధరించి ఉన్నారు. మృతుడి జేబులో తూర్పు ఎర్రబెల్లి నుంచి కావలికి వచ్చిన బస్ టికెట్ ఉందని, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీస్ అదుపులో నిందితుడు? ఉదయగిరి: సీతారామపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి పేరిట మోసం చేసిన అఖిల్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించి ఒకట్రెండు రోజుల్లో కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. -
డిపార్ట్మెంటల్ పరీక్షలపై సమావేశం
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో రేపటి నుంచి 10వ తేదీ వరకు జరగనున్న డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలపై డీఆర్వో విజయ్కుమార్ శనివారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల మధ్య మాత్రమే పరీక్ష కేంద్రానికి అనుమతి ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చిన వారికి 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపారు. కాగా పరీక్షల నిర్వహణకు అమసరమైన మౌలిక వసతుల ఏర్పాటు విషయమై తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫొటో ఆధారిత ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. -
ఒక్క విద్యార్థికి రూ.14 లక్షల ఖర్చు
ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేయడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిస్తోంది. నెమ్మదిగా విద్యార్థుల సంఖ్యను తగ్గించి ప్రాథమిక పాఠశాలలే లేకుండా చేసేందుకు అడుగులు వేస్తోంది. విలీన ప్రక్రియ వల్ల కోవూరు నియోజకవర్గంలోని రెండు పాఠశాలలు కేవలం ఒక్కో విద్యార్థితో నడిపిస్తూ రేపటి రోజున వాటిని కూడా మూతపడేలా చేస్తోంది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో అనేకం ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచాలి చదువు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడం, పోటీ పడడం ద్వారానే పిల్లల్లో మానసిక, సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఆ బాబుకు తోటి స్నేహితులే లేరు. ముగ్గురు పెద్దల మధ్య ఆ ఒక్క చిన్నారి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కోవూరు: ‘విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం.. ప్రపంచ స్థాయి ప్రమాణాలు తీసుకొస్తాం’ అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమైంది. కోవూరు మండలంలోని చావడివీధి, ఇనమడుగు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్, ఒక్క విద్యార్థితో కొనసాగుతోంది. అదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళెం (వడ్డిపాళెం) ఎంపీపీ పాఠశాల పరిస్థితి ఉంది. ఇలా ఒక్క విద్యార్థి కోసం ఏటా అక్షరాలా రూ.14 లక్షల ప్రజాధనాన్ని వినియోగిస్తోంది. గణాంకాలు ఇలా.. ఓ వైపు ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే, ఇక్కడ మాత్రం విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది. నెలకు సుమారు రూ.80 వేల పైచిలుకు జీతం తీసుకునే ఒక ఉపాధ్యాయుడితో పాటు ఆయా వంట మనిషి, మొత్తం ముగ్గురు సిబ్బంది ఆ ఒక్క పిల్లాడికే సేవలు అందిస్తున్నారు. జీతాలు, మధ్యాహ్న భోజన వ్యయం కలిపి ఏడాదికి రూ.14 లక్షలు ఆ ఒక్క విద్యార్థిపై ఖర్చు అవుతోంది. విలీనమే కారణమా? గతంలో ఐదో తరగతి వరకు కళకళలాడిన ఈ పాఠశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అస్తవ్యస్తమైన ‘విలీన’ నిర్ణయాలతో కుదించేశారు. మూడు, నాలుగు, ఐదో తరగతులను మరో పాఠశాలలో కలిపేసి, ఇక్కడ కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే వదిలేశారు. ప్రాథమిక పాఠశాలలకు విలీన శాపం చాలాచోట్ల సింగిల్ స్టూడెంట్లకు పరిమితమైన పాఠశాలలు విద్యార్థుల సంఖ్యను పెంచకుండా మీనమేషాలు -
ఈవీ స్టేషన్లకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అన్నారు. ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు త్వరలో రానున్న ఎలక్ట్రికల్ బస్సుల కోసం విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశామని, 220 కేవీ అంబాపురం విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ ఫీడర్ల ద్వారా వీటికి సరఫరా సులభతరం అవుతుందన్నారు. అనంతరం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిర్మిస్తున్న కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్ పనులను, నగరంలో నిర్మాణంలో ఉన్న 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శేషాద్రి బాలచంద్ర, శ్రీధర్, పరంధామయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిరణ్, ట్రాన్స్కో, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
పోలీసుల తీరుపై ప్రైవేట్ కేసులేస్తాం
చట్టాన్ని ఖాకీలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా చేయడం నేరమే అవుతుంది. పౌరహక్కులను కాలరాయొద్దని సుప్రీంకోర్టు ఓ వైపు ఆదేశాలిస్తోంది. అయితే ఖాకీలు మాత్రం అధికార పార్టీ నేతల మెప్పు కోసం థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలంలో నివాసాన్ని కూలదోసిన ఘటనలో ప్రైవేట్ కేసుతో పాటు డ్యామేజ్, ప్రాసిక్యూషన్ కోసం పిటిషన్ను వేస్తాం. – ఉమామహేశ్వర్రెడ్డి, సీనియర్ న్యాయవాది, నెల్లూరు ● -
సాంకేతికతతో త్వరితగతిన కేసుల ఛేదన
నెల్లూరు(క్రైమ్): సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను త్వరితగతిన ఛేదించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న సాంకేతిక టూల్స్పై తన కార్యాలయం నుంచి నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఆధారాల సేకరణలో ఆధునిక సాంకేతిక టూల్స్ కీలకపాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. సీసీటీఎన్నెస్, డిజిటల్ అండ్ సైబర్ ఫొరెన్సిక్, మొబైల్ డేటా విశ్లేషణ, సాఫ్ట్వేర్ ఆధారిత పోలీసింగ్ టూల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, డ్రోన్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డీపీఓలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సదస్సుకు ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు హాజరయ్యారు. -
రాష్ట్రస్థాయి కెరీర్ ఎక్స్పోకు ఐదు ప్రాజెక్ట్లు
నెల్లూరు (టౌన్): సంతపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో జిల్లాస్థాయి కెరీర్ ఎక్స్పో / ఎగ్జిబిషన్ను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జిల్లా నుంచి నాలుగు విభాగాల్లో 126 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. విభాగానికి ఒకటి చొప్పున నాలుగింటిని రాష్ట్రస్థాయి కెరీర్ ఎక్స్పోకు ఎంపిక చేశారు. హెల్త్ అండ్ బ్యూటీ వెల్నెస్ విభాగం నుంచి బ్రాహ్మణకాక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఆర్షియా.. మోడల్స్ విభాగం నుంచి బుచ్చి జెడ్పీహెచ్ఎస్ స్టూడెంట్ సాహితి.. ఒకేషనల్ డ్రస్ అప్ విభాగం నుంచి గండవరం జెడ్పీహెచ్ఎస్కు చెందిన ప్రేమచరణ్.. పోస్టర్ మేకింగ్ విభాగం నుంచి పేరారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ నిహారిక ప్రదర్శించిన ప్రాజెక్ట్లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ విభాగాల్లో తొలి మూడు నమూనాలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపట్నుంచి ఎఫ్ఏ – 3 పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఆన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ – 3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని సూచించారు. పులి సంచారంపై వీడని కలకలం దుత్తలూరు: మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీ సమీపంలో పులి సంచరించిందనే ప్రచారం శనివారం జరిగింది. మండలంలోని నందిపాడు బీట్ పరిధిలో గల రేగుమానుకుంటలో గేదె కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన ప్రభాకర్కు చెందిన గేదె అటవీ ప్రాంతంలో మృతి చెందిందనే అంశాన్ని కనుగొన్నారు. పులి చంపి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఘటన స్థలానికి అధికారులు చేరుకొని.. గేదె కళేబరం, పెంటికలు, పాదముద్రలను గుర్తించి ఉన్నతాధికారులకు పంపగా, పులి కాదని నిర్ధారించారు. గ్రామస్తులు మాత్రం పులి లేదా చిరుతపులి అని భావిస్తున్నారు. గేదెకు పోస్ట్మార్టాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఆత్మకూరు: ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్సీ సంక్షేమ సాధికారత జిల్లా అధికారి శోభారాణి పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలబాలికల హాస్టళ్లను ఆర్డీఓ పావనీతో కలిసి శనివారం సందర్శించారు. అక్కడి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, విద్యాసామగ్రిని అందజేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడారు. చదువుల్లో విద్యార్థులు చక్కగా రాణించి మంచి పేరు తీసుకురావాలని కాంక్షించారు. ఏఎస్డబ్ల్యూఓ (బీసీ) బ్రహ్మానందచారి, వార్డెన్లు పద్మనాభరెడ్డి, స్పందన తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 83,032 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 27,272 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.3.81 కోట్లను సమర్పించారు. టైమ్స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. మూడు కిలోల బంగారు ఆభరణాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): కారులో ఎలాంటి బిల్లుల్లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను జీఎస్టీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యాపారి ఎలాంటి బిల్లుల్లేకుండా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను విక్రయించేందుకు కారులో చైన్నె తరలిస్తున్నారనే సమాచారం జీఎస్టీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు శుక్రవారం అందింది. దీంతో వారి బృందం వెంకటాచలం టోల్ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై జీఎస్టీ అధికారులు ఆరాతీస్తున్నారు. -
నిషేధిత పాపం చంద్రబాబుదే
నెల్లూరు రూరల్: రెవెన్యూ సమస్యలను తామే పరిష్కరిస్తున్నామనే రీతిలో టీడీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. 22ఏ జాబితాలో భూములను పెట్టిందే చంద్రబాబు అని, ఈ విషయంలో వక్రీకరణతో కూడిన ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. , 2014 – 19 మధ్య వెబ్ల్యాండ్ పేరు చెప్పి, తహసీల్దార్ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన మనుషులను పెట్టి గిట్టని వారి భూములన్నింటినీ 22ఏలో పెట్టారని, ఫలితంగా యజమానులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాకే బాధితులకు ఊరట లభించిందనే అంశాన్ని గుర్తుచేశారు. 2024 తర్వాత కష్టాలు ప్రారంభం 2024లో చంద్రబాబు మరోసారి సీఎం అయ్యాక అసైన్డ్, ఇతర కేటగిరీల భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ విషయంలో నానా ఆరోపణలు చేసి, ఇప్పటికీ యజమానులను నానా కష్టాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు జరిగాయని ఎన్ని ఆరోపణలు చేసినా, ఎలాంటి ఆధారాల్లేవని అధికారులే చెప్పారన్నారు. రాజధాని పేరిట అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి 1100 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. అసైనన్డ్దారుల చేతుల్లో భూములుంటే పరిహారం రాదని.. ప్లాట్లు రావంటూ పథకం ప్రకారం ప్రచారం చేసి లాగేసుకున్నారని విమర్శించారు. ఆ తర్వాత జీఓ ఇచ్చి, వాటిని పప్పుబెల్లాలకు కొనుగోలు చేసి, చేతులు మారాక పూలింగ్లోకి తీసుకొని, ప్లాట్లు కేటాయించి వాటిని తిరిగి విక్రయించి రూ.కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. సమస్యకు తమ హయాంలోనే పరిష్కారం పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసైన్డ్ చట్టానికి జగన్మోహన్రెడ్డి సవరణలు చేశారని చెప్పారు. ఒరిజినల్ అసైనీలు మాత్రమే న్యాయబద్ధంగా, తమ ఇష్టపూర్వకంగా అవసరానికి విక్రయించుకునే హక్కును కల్పించారని గుర్తుచేశారు. ఈ చట్టం పేదలకు పూర్తిగా అండగా నిలిచిందని, ఇలాంటి సందర్భాల్లో కుంభకోణాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.. ఈ చట్టాన్ని తెస్తున్న సమయంలో చాలా మంది ఒత్తిళ్లు తెచ్చారని, అయితే అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ససేమిరా అన్నారన్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఈ రకంగా దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించారని, అలాంటిది టీడీపీ ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్లు నిలిపేయమని, ఫ్రీ హోల్డ్ చేయొద్దని ఆదేశాలిచ్చి భూ యజమానులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. 27.4 లక్షల ఎకరాలకు సంబంధించి 15.2 లక్షల మంది రైతులకు మేలు చేసింది తామే.. 22ఏ నుంచి మినహాయించామంటూ రెవెన్యూ మంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తమ హయాంలో సమగ్ర సర్వే జరిగితే రైతుల భూములు పోతాయంటూ దుష్ప్రచారం చేశారని, ల్యాండ్ టైట్లింగ్ను భూతంగా చూపారని ఆరోపించారు. ఇప్పుడు సమగ్ర సర్వే అంటూ తమ పద్ధతులనే అనుసరిస్తున్నారని తెలిపారు. 22ఏలో భూములు చేర్చిన వైనం నాటి సీఎం జగన్ హయాంలో వీటికి మోక్షం తిరిగి అదే జాబితాలోకి మార్చిన సర్కార్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
వారం రోజులుగా అజ్ఞాతంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
నెల్లూరు రూరల్: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేయడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వారిద్దరూ విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్లినట్టు. తండ్రీ కొడుకుల రహస్య పర్యటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జనం దృష్టి మరల్చడానికి మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు.పెట్టుబడులు ఆకర్షించడంలో తమకు ఎవరూ సాటిలేరంటూ ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రీ కొడుకులు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటినుంచి పెట్టుబడులన్నీ కట్టుకథలే తప్ప ఏ ఒక్కటీ నిజం లేదు. చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా రెవెన్యూ పుస్తకాల ముద్రణ, పంపిణీ గురించి చర్చించినట్టు ఎక్స్లో పోస్టులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలా రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి. వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్తున్నట్టు చెప్పి మరీ వెళ్లారు. అయినా దాని గురించి ఈ తండ్రీ కొడుకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ.. చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి కూడా ఎక్కడున్నారో చెప్పడం లేదు. అంత రహస్యంగా పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది’అని కాకాణి నిలదీశారు. ‘వీటిలో ఒకటైనా వచ్చిందా’ 2014–19 మధ్య భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,761 ఒప్పందాల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 30.91 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. పరిశ్రమల శాఖ కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో అమల్లోకి వచి్చనవి కేవలం 45 మాత్రమే. 2014–19 మధ్య మూడుసార్లు నిర్వహించిన సీఐఐ సదస్సు సహా అనేక సందర్భాల్లో చంద్రబాబు పెట్టుబడులు, పరిశ్రమలపై గొప్పగా ప్రకటనలు చేశారు. వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ అన్నారు.దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండ్రస్టియల్ కలిపి యూనిట్ ఏర్పాటవుతాయన్నారు. నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేష¯న్ యూనిట్, కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అంటూ హడావుడి చేశారు. టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ, స్విట్జర్లాండ్కి చెందిన ఏరో స్పేస్ వెంచర్స్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి, ఎయిర్ బస్, మైక్రోసాఫ్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అన్నారు. వీటిలో ఏ ఒక్కటీ ఏపీకి రాలేదు. చంద్రబాబు హయాంలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనమైంది’అని కాకాణి గోవర్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
‘చంద్రబాబు, లోకేష్ ఎక్కడ?.. ప్రజలు అడుగుతున్నారు’
సాక్షి, నెల్లూరు జిల్లా: కూటమి సర్కార్ 19 నెలల పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని.. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడులు ఆకర్షించడంలో దిట్టలు అన్నట్టుగా బాకాలు ఊదుతున్నారు. రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారాలు, ట్వీట్లు ఏ ప్రాంతం నుండి చేస్తున్నారో చెప్పలేరా? మీరు ఉంది.. ఏమైనా రహస్య ప్రదేశమా?. తెలియపరచకూడదా?. చంద్రబాబు, లోకేష్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి పేర్కొన్నారు.‘‘వారం రోజులు నుండి లోకేష్ పత్తాలేడు, చంద్రబాబు నాలుగు, ఐదు రోజులుగా జాడ లేదు. మీకు వున్న అనుకూల ఎల్లో మీడియాకు కూడా పాపం సమాచారం లేదు. ప్రజల్లో మీ జాడ ప్రస్తావన వస్తుందంటూ ఈ ట్వీట్ల డ్రామా చేస్తున్నారు. గతంలో కుమార్తెను చూడటానికి వైఎస్ జగన్ లండన్కు వెళ్తే బాబు హంగామా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.‘‘నేడు రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు మాత్రం మొదటి స్థానం అని ఓ పత్రిక రాసింది. ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి అంటే ఐదు శాతం కూడా లేదు. 2014-19 మధ్యన 1761 కంపెనీలతో ఎంవోయూలు, 18.87 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాడు. అందులో కార్యరూపం దాల్చింది 10 శాతం మాత్రమే, అంటే 90 శాతం అబద్ధాలే...అమరావతి నుండి విశాఖకు హైపర్ లూప్ అన్నాడు.. ఎక్కడ..?. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అన్నాడు.. ఎక్కడ ?. ఏవియేషన్, విమానాల తయారీ అన్నాడు.. ఎక్కడ బాబు..?. ఏయిర్ బస్సు, మైక్రోసాఫ్ట్ రకరకాల పేర్లు చెప్పాడు. 2023 మా హయాంలో 394 ఒప్పందాలు చేసుకున్నాము. 13.15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అంచనా వేశాం. తద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాం. మొదటి సంవత్సరంలోనే 20 శాతం ఎంవోయూలు కార్యరూపం దాల్చాయి. జగన్ నిర్ణయాలు, సంస్కరణలతో 91.6 శాతం కార్యరూపం దాల్చాయి. కరోనా విపత్కర పరిస్థితిల అనంతరం 17.700 లక్షల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపం చేశాం. వాస్తవాలు దాచి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు’’ అని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
బైక్ ఢీకొని మహిళ మృతి
నెల్లూరు సిటీ: మోటార్బైక్పై ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లూరులో జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మూడో మైలులోని యనమలవారి వీధి మామిడిచెట్ల సెంటర్లో మన్నెపల్లి శీనయ్య, కామాక్షమ్మ (51) దంపతులు నివాసముంటున్నారు. ఆత్మకూరు బస్టాండ్లోని పూలమార్కెట్లో కామాక్షమ్మ పనిచేస్తోంది. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. లిఫ్ట్ అడిగి బైక్పై వెనుక కూర్చొంది. ఇంటి వద్ద బైక్ను ఆపగా వెనుక నుంచి ఓ వ్యక్తి వేగంగా బైక్పై వచ్చి ఢీకొన్నాడు. దీంతో కామాక్షమ్మ తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు 108 అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
ఎన్నాళ్లీ పడిగాపులు
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతినెలా రేషన్ అందుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలు ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందించాయి. నేడు లబ్ధిదారులు చౌకదుకాణాలకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి రేషన్ను మోసుకుంటూ ఇంటికెళ్తున్న దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. చాలామంది రోజువారీ పనులు మానుకుని వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. బియ్యం తీసుకెళ్లేందుకు వృద్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
బంగారం చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
● 40.44 గ్రాముల బంగారం స్వాధీనం విడవలూరు: బంగారం చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విడవలూరులోని పోలీస్స్టేషన్లో బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేంద్రబాబు, ఎస్సై నరేష్ వివరాలు వెల్లడించారు. వావిళ్ల గ్రామానికి చెందిన గుంజి నాగమ్మ అనే మహిళ గతేడాది సెప్టెంబర్లో రామేశ్వరం వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సాంకేతికత ఆధారంగా నెల్లూరు హరనాథపురానికి చెందిన చల్లా మధు, విడవలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు తంబి నరేష్, తంబి సతీష్ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. సతీష్ పరారీలో ఉన్నాడు. చోరీ చేసిన బంగారాన్ని నరేష్, సతీష్ తమ తల్లి తంబి వజ్రమ్మ వద్ద ఉంచారన్న సమాచారంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. 40.44 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


