SPSR Nellore
-
సారూ.. మహిళతో ఇలాగేనా మాట్లాడేది?
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల వ్యవసాయాధికారి ఎ.వాసు తీరు వివాదాస్పదమైంది. మహిళా వీఏఏను ఫోన్లో అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని నిరసిస్తూ బుధవారం స్థానిక కార్యాలయం ఎదుట వీఏఏలు నిరసన తెలిపారు. వివరాలు.. గుండెమడకల సచివాలయ పరిధిలో పనిచేస్తున్న వీఏఏ మేఘనను వింజమూరు కార్యాలయానికి బుధవారం రావాలని ఏఓ మంగళవారం చెప్పాడు. అయితే బుధవారం గుండెమడకల సచివాలయానికి డిప్యూటీ ఎంపీడీఓ తనిఖీకి రావడంతో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో ఏఓ.. వీఏఏకు ఫోన్ చేసి కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పాడు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె రాక ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన వాసు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. ఆమె మనస్తాపానికి గురై కన్నీటిపర్యంతమైంది. విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఏఓను నిలదీశారు. అయినా అతను ఎలాంటి పశ్చాత్తాపం చెందకుండా నేను ఇలాగే మాట్లాడతానంటూ అందరి ముందు దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీఏఏ మేఘన భోరున విలపించింది. సచివాలయాల్లో మహిళా ఉద్యోగులకు భద్రత, గౌరవం కరువైందని మిగిలిన వీఏఏలు ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణిని ఫోన్లో సంప్రదించగా వీఏఏలు ఈ అంశం తన దృష్టికి తీసుకురాలేదన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య పదజాలం ఉపయోగించిన అధికారులను ఉపేక్షించేది లేదని, కలెక్టర్ కూడా సీరియస్గా ఉన్నారన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఏఓను వివరణ కోరగా పనిఒత్తిడితో తాను అసభ్య పదజాలంతో మాట్లాడిన విషయం వాస్తవమేనని, అదేమి తప్పు పదం కాదని సమ రి్థంచుకున్నాడు. -
కాకాణిపై మరో అక్రమ కేసు నమోదు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదుతో వేదాయపాలెం పీఎస్లో కేసు నమోదు చేశారు. శాంతియుత నిరసన చేసిన కాకాణితో సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.కాగా, మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు బుధవారం కన్నెర్ర చేశాయి. మహిళలపై అసభ్యకరమైన భాషలో కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు, హేయమైన కారుకూతలతో ప్రసారం చేశారంటూ కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రజల మద్దతు రోజురోజుకు మావిగన్ విషయంలో ఆదరణ పెరుగుతుందని ముందుగానే పసిగట్టిన రాధాకృష్ణ ముఠా వ్యక్తిగత హననానికి పూనుకుందని కాకాణి ధ్వజమెత్తారు. -
ల్యాబ్కు రూ.4 లక్షల పరికరాల వితరణ
● బోన్మ్యారో లాంటి ఖరీదైన పరీక్షలు ఉచితం ● ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ మెడికల్ కళాశాల పెథాలజీ (వ్యాధి నిర్ధారణ) ల్యాబ్కు హైదరాబాద్కు చెందిన మౌరి టెక్ ఫౌండేషన్ ఎండీ అనిల్ యర్రంరెడ్డి రూ.4 లక్షల విలువైన పరికరాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా బుధవారం దర్గామిట్టలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి పెథాలజీ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ సాయిప్రసాద్తో కలిసి మాట్లాడారు. నెల్లూరుకు చెందిన డాక్టర్ రజని, డాక్టర్ గోకుల్ చంద్రారెడ్డి సహకారంతో మౌరి టెక్ ఫౌండేషన్ ఎండీ అనిల్ సీఎస్ఆర్ నిధుల కింద నాలుగు ఒలంపస్ హై ఎండ్ రిపోర్టింగ్ బైనాక్యులర్ మైక్రోస్కోప్లను, డెల్ డెస్క్టాప్, మానిటర్, హెచ్పీ లేజర్ ప్రింటర్ తదితర వాటిని అందించారన్నారు. ఈ హైక్వాలిటీ పరికరాలతో కేన్సర్ లాంటి పరీక్షలను అత్యంత కచ్చితత్వంతో చేసి ఫలితాలను నిర్ధారించవచ్చన్నారు. పేద, మధ్య తరగతి రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని రకాల పరీక్షలు ఇక్కడ చేస్తున్నామన్నారు. బోన్మ్యారో లాంటి అత్యంత ఖరీదైన పరీక్షలు సైతం పేదలకు చేస్తున్నట్లు చెప్పారు. రక్త సంబంధిత పరీక్షలతోపాటు గడ్డలను బయాప్సీ చేయడం లాంటి వాటితో రోగులకు త్వరగా వ్యాధి నిర్ధారణ జరుగుతుందన్నారు. డయాగ్నోసిస్ పరీక్షలు అత్యంత ఖరీదైన నేపథ్యంలో పేద రోగులకు ఉపయోగపడేలా పెథాలజీ పరికరాలు అందించిన మౌరి టెక్ సంస్థ ఎండీకి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉండే పారిశ్రామికవేత్తలు, దాతలు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి ఉపయోగపడే ల్యాబ్ పరికరాలు విరాళాలుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్లు డా.కృష్ణమూర్తి, డా.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అందరూ సహకరించాలి
2026 పొగాకు వేలం ప్రక్రియ గురువారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ప్రారంభం కానుంది. వేలానికి రైతులు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందించి సజావుగా సాగేలా సహకరించాలి.– జి.సునీల్కుమార్, వేలం నిర్వహణాధికారి, డీసీపల్లి పొగాకు బోర్డు సూచనలు పాటించాలి ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నాయి. వేలంలో మంచి ధరలు లభించే అవకాశాలున్నాయి. రైతులు అవశేషాల్లేని, హీట్ లేకుండా గ్రేడ్ల ఆధారంగా బేళ్లను తయారు చేసుకోవాలి. పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటిస్తే మంచి ధరలు లభించే అవకాశం ఉంది. – జి.రాజశేఖర్, వేలం నిర్వహణాధికారి, కలిగిరి పొగాకు బోర్డు -
భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడు రాధాకృష్ణ
చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వావివరుసలు లేని, భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడని కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తుంటే, సీబీఎన్ అడ్డుపడుతున్నాడని, ఏబీఎన్ కార్యాలయం ముందు నిరసన అంటే పోలీసులు సీబీఎన్ కార్యాలయం ముందు నిరసన లాగా భావిస్తున్నారన్నారు. ఏబీఎన్కు, సీబీఎన్కు ఉన్న బంధం నేడు నిర్ధారణ అయిందన్నారు. సీబీఎన్ ఆదేశిస్తే ఏబీఎన్ రాధాకృష్ణ ఆచరించడం ఆనవాయితీగా తయారైందని, మహిళలపై అసభ్యకరమైన భాషలో కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు, హేయమైన కారుకూతలతో ప్రసారం చేశారంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి మరొక్కసారి మాట్లాడితే రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వ్యక్తిగతంగా మాపై ఎన్ని మాట్లాడిన పట్టించుకోమని, కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం, విడిచి పెట్టమన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ రాజధాని ప్రతిపాదన విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ ప్రారంభమైందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మావిగన్ ప్రస్తావనతో చాలా మంది ఆకర్షితులవుతున్నారని, చంద్రబాబు కేవలం అమరావతిని బంగారు బాతు లాగా భావించి, తన ఆర్థిక స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజల మద్దతు రోజురోజుకు మావిగన్ విషయంలో ఆదరణ పెరుగుతుందని ముందుగానే పసిగట్టిన రాధాకృష్ణ ముఠా వ్యక్తిగత హననానికి పూనుకుందన్నారు. రాధాకృష్ణ తన మనసులో ఉన్న బాధ, ఆవేదనను, మాటల రూపంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే, సంగతి తేలుస్తామని హెచ్చరించారు. -
జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం
నెల్లూరు(దర్గామిట్ట): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న తాగునీటి పనుల పురోగతిపై బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చేపట్టిన జల్ జీవన్ మిషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీపీడబ్ల్యూఎస్ తాగునీటి పథకాల మెయింటెనెన్స్ సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లా పరిషత్ నుంచి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మంజూరైన వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఓవర్హెడ్ ట్యాంక్లు, పైపులైన్ల మరమ్మతులను వెంటనే చేయాలని ఆదేశించారు. మేనెల 15 లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయభాస్కర్, ఈఈ రెడ్డయ్య, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
మహిళా సమాజం సిగ్గుపడే రీతిలో నీచ రాతలు
జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ రాసిన రాతలు ప్రజలు, మహిళా సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. ఆ భాషను తిరిగి మాట్లాడాలంటే మహిళలే యావగించుకుంటున్నారన్నారు. ఇటువంటి జర్నలిజం బ్రోకర్, బూతు చానల్ రాధాకృష్ణ మహిళలను కించపరిస్తే పోలీసులు, ప్రభుత్వం వెనకేసుకు రావడానికి సిగ్గుండాలన్నారు. ప్రజల్లో మావిగన్ మీద చర్చ జరుగుతుంటే తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత నీచానికి దిగజారటం అవసరమా అన్నారు. రాధాకృష్ణకు మహిళలంటే గౌరవం లేదని, అందుకే పిచ్చి రాతలు, చెత్త పలుకులు పలుకుతున్నాడన్నారు. ఇప్పటికై నా మహిళలను గౌరవించి క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో మహిళలు తరిమి కొడతారన్నారు. -
15న జువ్వలదిన్నెకు వైఎస్ జగన్ రాక
కావలి: మాజీ ము ఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించేందుకు వస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం రూ.289 కోట్లకు పైగా వెచ్చించి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం హార్బర్కు సంబంధించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ బోట్లు అక్రమంగా ఆంధ్రతీర ప్రాంతంలోకి చొచ్చుకొని రావడంతో మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచితే అక్కడ కాపలా ఉండే వారిని బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బోట్లను విడిపించారన్నారు. వీటి విషయమై మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నెకు వస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామన్నారు. తమిళనాడు బోటు పట్టివేత ముత్తుకూరు(పొదలకూరు): అక్రమంగా వేటకొచ్చిన తమిళనాడు ఫిషింగ్ బోటును పోర్టుకు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఐఎన్డీ టీఎన్ – 02 ఎంఎం – 2001 నంబర్ గల ఈ పడవను తనిఖీ చేయగా, అందులో రూ.ఐదు లక్షల విలువైన మత్స్య సంపద లభ్యమైందని మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా వెల్లడించారు. మత్స్యకారులు రవి, సురేష్, దుర్గ, హరిబాబు, పాలరాజు, కునదారి హిట్లర్, శ్రీరాములును అదుపులోకి తీసుకున్నారు. బోటుతో పాటు మత్స్యకారులను జువ్వలదిన్నె తరలించారు. ప్రతిపాదనలను సిద్ధం చేయండి నెల్లూరు(పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్యక్రమాల అమలుకు ప్రతిపాదనలను సిద్ధం చేయా లని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యా లయం నుంచి వివిధ మండలాల ఏపీఎంలతో బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలను ఏటా మంజూరు చేయించి వారి ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నామని వివరించారు. అర్హులైన గ్రూపు సభ్యులను గుర్తించాలని సూచించారు. బ్యాంక్ లింకేజ్, సీ్త్ర నిధి రుణాలకు అర్హత ఉన్న గ్రూపులు ఇతర వివరాలతో ప్రతిపాదనలను రూపొందించాలని కోరారు. రుణాల మంజూరు, శిక్షణ కార్యక్రమాలు తదితరాల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
లైంగికదాడి, హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
నెల్లూరు(లీగల్): మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో గూడూరు మండలం చవటపాళెం గ్రామానికి చెందిన దుగ్గనబోయిన సాయిశివకుమార్, ముద్దురు శరత్, సుబ్రమల్లి వినోద్ కుమార్, చల్ల లక్ష్మయ్యకు శిక్ష పడింది. జీవితఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.6 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. మానసిక వికలాంగురాలైన ఓ మహిళకు వివాహం కాలేదు. ఇంట్లో చిన్న పనులు చేస్తుంటుంది. 2020 జనవరి 5వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో సోదరుడు చెప్పడంతో ఆమె దోసెపిండి, కోడిగుడ్ల కోసం బయటకు వచ్చింది. ఒంటరిగా వెళ్తుండగా నిందితులు వెంబడించి బలవంతంగా ఊరు చివర ఉన్న ఇళ్ల మధ్యకు తీసుకెళ్లి లైంగికదాడి చేసి హత్య చేసి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి మరుసటిరోజు గూడూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నలుగురు నిందితులతోపాటు గోవింద స్వామి వెంకటేష్పై కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో గోవింద స్వామి మృతిచెందాడు. మిగిలిన నలుగురిపై నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు.పొదలకూరు నిమ్మధరలు (కిలో)పెద్దవి : రూ.140 సన్నవి : రూ.100 పండ్లు : రూ.80 -
తప్పు చేసిన రాధాకృష్ణకు ప్రభుత్వం అండ
భార్యను చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపిస్తారంటూ వైఎస్సార్సీపీ శ్రేణులనుద్దేశించి రాసిన రాతలు అత్యంత జుగుప్సాకరం, హేయమని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఖండించారు. రాధాకృష్ణ కచ్చితంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఇంత మంది పోలీసులను పెట్టడం చూస్తే చంద్రబాబు, రాధాకృష్ణ మధ్య ఉన్న బంధం తేటతెల్లమవుతుందన్నారు. విలువలు లేని ఆంధ్రజ్యోతి విషం నింపుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నారు. అప్పులు తెచ్చి ముంపునకు గురయ్యే ప్రాంతంలో రాజధాని పెట్టడం ఎంతవరకు సబబున్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధానిగా చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతివారం అప్పులు తెస్తే గానీ నడవని ప్రభుత్వం లక్షల కోట్లు అమరావతిలో ధారపోయడం అవసరమా అని ప్రశ్నించారు. ఒకే ప్రాంతంలో రూ. 2 లక్షల కోట్లు పెడితే మిగతా రాష్ట్ర పరిస్థితి ఏమిటని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలన్నారు. -
● రాధాకృష్ణ రోత రాతలు, కారుకూతలపై వైఎస్సార్సీపీ శ్రేణుల కన్నెర్ర
పోలీసులతో ఘర్షణ పడుతున్న పూజిత, గౌరి తదితరులుడీఎస్పీతో కాకాణి వాగ్వాదంనెల్లూరు రూరల్: జర్నలిజం ముసుగులో అధికార పార్టీకి బ్రోకరిజం చేస్తూ ఆంధ్రబూతుజ్యోతి చెత్తపలుకులు పలుకుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన వంధిమాగాదులు చేస్తున్న అవినీతి, దోపిడీని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించి, ప్రత్యామ్నాయంగా మావిగన్ రాజధాని ప్రతిపాదన చేస్తే టీడీపీతోపాటు అవినీతిపరుల కూసాలు కదులుతున్నాయన్నారు. మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీకి చెందిన మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు బుధవారం కన్నెర్ర చేశాయి. పిచ్చిరాతలు రాసి, కారుకూతలు కూసిన రాధాకృష్ణ వైఖరికి నిరసనగా కాకాణి నేతృత్వంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, వైఎస్సార్సీపీ నేతలు, మహిళా నేతలతో కలిసి అయ్యప్పగుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ వద్ద నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసు అధికారులు పత్రిక కార్యాలయానికి వెళ్లే అన్నీ మార్గాల్లో బారికేడ్లను, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. నిరసన తెలిపేందుకు వెళుతున్న నేతలను వైఎస్సార్సీపీ శ్రేణులను రోప్లతో అడ్డుకున్నారు. పోలీసుల అడ్డుకట్టలను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ముఖ్యనేతలతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలను శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనీ వెంటనే వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్లు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసి రాధాకృష్ణ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు. నాలుగు వైపులా బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు రోప్ పార్టీలతో పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం ఖాకీల తీరుపై భగ్గుమన్న నేతలు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతుల దహనం -
సమర్థవంతంగా ‘జలధార – జలహారతి’
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో జలధార – జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన జిల్లాలోని వివిధ బేసిన్లు, ఉప బేసిన్లలో నీటి లభ్యతపై సమగ్ర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటికొరత ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు సమగ్ర, స్థిరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు. అధిక నీరు లభ్యమయ్యే బేసిన్లను నీటి కొరత ఉన్నవాటితో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. దెబ్బతిన్న, లీకేజీ ఉన్న చెక్డ్యామ్లను పునరుద్ధరించడంతోపాటు, అనుకూల ప్రదేశాల్లో కొత్త సాగునీటి చెరువుల ఏర్పాటు సాధ్యతను పరిశీలించాలని ఆదేశించారు. చెరువుకట్టలను బలోపేతం చేస్తూ పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. కాలువల్లోని పూడికను తొలగించాలని, తూములు, కలుజుల మరమ్మతులు వేగవంతం చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నిర్దిష్ట కాలంలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ నాయక్, సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు. -
బీదను వదిలే ప్రసక్తే లేదు
అల్లూరు: ప్రాణాలకు తెగించి పట్టుకుని మనకు అప్పగించిన బోట్లను జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు కాపులతోపాటు ఈ ద్రోహానికి తెగబడిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావును వదిలిపెట్టే ప్రసక్తే లేదని నాలుగు పంచాయతీల మత్స్యకారులు ఏకోన్ముఖంగా తీర్మానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన 164 గ్రామాల మత్స్యకారుల సమావేశంలో బోట్లకు బాధ్యత వహించిన మూడు గ్రామాలకు రూ.5 కోట్లు జరిమానా విధించిన నేపథ్యంలో బుధవారం అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ చంద్రబాబునగర్లో ఇస్కపల్లిపాళెం, బోగోలు మండలం చెన్నారాయునిపాళెం, జువ్వలదిన్నె, కావలి మండలం అన్నగారిపాళెం పంచాయతీల్లోని గ్రామాలకు చెందిన మత్స్యకారుల భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోట్లను వదిలేసిన ఘటనకు కారణమైన ఇస్కపల్లిపాళెం, కొత్త బంగారుపాళెం, కొత్తకడపాళెం గ్రామాలు బాధ్యత వహించి రెండు కొత్త బోట్లను కొనుగోలు చేసి మత్స్యకారులకు అప్పగించాలని తీర్మానించారు. పాకలలో జరిగిన సమావేశానికి అయిన ఖర్చును ఈ మూడు గ్రామాలే భరించాలని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని త్వరలో జరగబోయే మరో సమావేశంలో అన్ని మత్స్యకార గ్రామాలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్తో నేటి సమావేశం బహిష్కరణ మత్స్యకారుల సమస్యలపై గురువారం నెల్లూరులోని టౌన్హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, మత్స్యశాఖాధికారులతో నిర్ణయించిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు నాలుగు పంచాయతీల్లోని గ్రామాల మత్స్యకారులు తీర్మానించారు. ఇంత కాలం తమను వాడుకుని, సమస్య వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు, మా ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను వదిలేసి చేసిన ద్రోహాన్ని మేము మరిచిపోలేదు. దీని ఫలితంగా తమ సామాజికవర్గం నుంచి జీవిత కాలం బహిష్కరణకు గురికావాల్సిన పరిస్థితులు ఉత్పన్న మవుతున్నాయి. తప్పు చేసి, ద్రోహం తలపెట్టి తమనేదో ఉద్ధరించేందుకు అన్నట్లు మభ్య పెట్టేందుకు పెట్టిన సమావేశాలు మాకు అవసరం లేదు. మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. తమకు ఎవరి సహకారం అవసరం లేదు. అందుకే కలెక్టర్తో మీటింగ్ను బహిష్కరిస్తున్నట్లు మత్స్యకారులు ముక్తకంఠంతో తీర్మానించారు. తప్పు చేసిన వారు తగిన మూల్యం చెల్లించకతప్పదు బోట్ల విడుదల విషయంలో కారుకలైన ఎవరిని వదలబోకూడదని, ఎంతటి వారైనా సరే క్షమించే ప్రసక్తే లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు. బోట్లు పట్టుకున్న గత ఆరు నెలల నుంచి మన ప్రాంతానికి మత్స్య సంపదను దోచుకునేందుకు ఇతర ప్రాంతాల వాళ్లు రాలేదని, బోట్లు విడుదలైన కొన్ని గంటలకే మళ్లీ తమ సముద్ర తీరానికి మత్స్య సంపదను దోచుకునేందుకు బోట్ల వస్తున్నాయని, దీనికి కార ణం రాజకీయ నాయకుల స్వార్థమే అన్నారు. ఇప్పు డు కూడా వీళ్ల మాటలు, అధికారుల మాటలు నమ్మితే మన జాతికి ద్రోహం చేసిన వాళ్లం అవుతాము. ఈ విషయంలో రాజీ పడితే మన సామాజికవర్గం నుంచి ఈ నాలుగు పంచాయతీలు జీవిత కాలం బహిష్కరణ శిక్షకు గురికావాల్సి వస్తుందంటూ కొందరు మత్స్యకార పెద్దలు స్పష్టం చేశారు. ముగ్గురు కాపులు స్వార్థానికి చేసిన తప్పునకు మూడు గ్రామాలు, నాలుగు పంచాయతీల్లోని మనం భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతలా తమ జీవనోపాధికి తీరని నష్టం కలిగించిన, ద్రోహం తలపెట్టిన ఏ ఒక్కరిని వదలబోకూడదని, తమతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, మత్స్యకారులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో.. త్వరలోనే కారకులకు తెలియజేస్తామని ముక్తకంఠంతో పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష అయితే తప్పదు ఎవరి కోసమో సామాజిక బహిష్కరణకు గురికావాల్సిన అవసరం లేదు వదిలేసిన బోట్లకు మూడు గ్రామాలు బాధ్యత వహించాలి అందరూ చందాలు వేసుకుని రెండు కొత్త బోట్లు కొనిపెడదాం పాకల సమావేశం ఖర్చు కూడా మనమే భరించాలి నేడు కలెక్టర్, మత్స్యశాఖాధికారుల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తీర్మానం -
ఓవైపు ఆశ.. మరోవైపు ఆందోళన
మర్రిపాడు/కలిగిరి: జిల్లాలోని కలిగిరి, మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాల్లో గురువారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. గతేడాది ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూశారు. ఈ ఏడాదైనా గిట్టుబాటు ధర లభిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. వేలం నేపథ్యంలో రైతుల్లో ఓవైపు ఆశ, మరోవైపు ఆందోళన కనిపిస్తోంది. సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిన పరిస్థితుల్లో వేలంలో లభించే ధరలే రైతుల ఆర్థిక పరిస్థితిని నిర్ణయించనున్నాయి. గిట్టుబాటు ధర లభిస్తేనే ఖర్చులు తిరిగి వచ్చి కొంతమేర లాభం సాధ్యమవుతుందని, లేదంటే మరోసారి భారీ నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభావం చూపే అవకాశం ఉత్పత్తి అధికంగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక్క బ్యారన్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అదనపు భారం పడినట్లు పేర్కొంటున్నారు. ఎరువులు, కూలీలు, ఇంధన ధరలు పెరగడం రైతులపై భారంగా మారింది. ఈ నేపథ్యంలో కిలోకు కనీసం రూ.300 ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం వేలం ముగిసే సమయానికి కిలోకు సరాసరి ధర రూ.219.40 మాత్రమే లభించింది. గరిష్ట ధర రూ.345 వరకు నమోదైనా, కనిష్ట ధర రూ.130 వరకు పడిపోవడం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సీజన్లో వ్యాపారులు ఎంతమేరకు పోటీగా కొనుగోళ్లు చేస్తారు?, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయి?, పొగాకు బోర్డు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటుందన్న అంశాలే ధరలను నిర్ణయించనున్నాయి. ధరలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు. వేలం ప్రారంభమైన తొలిరోజే ధరల ధోరణి ఎలా ఉంటుందనే దానిపై రైతులంతా దృష్టి సారించారు. కాగా గ్రేడింగ్ సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పొగాకు బేళ్లుకలిగిరి పొగాకు వేలం కేంద్రం దిగుబడి అంచనా : 10.20 మిలియన్ కిలోలు నేటి నుంచి పొగాకు వేలం ప్రారంభం గిట్టుబాటు ధర దక్కేనా? కిలోకు రూ.300 ఇవ్వాలని రైతుల డిమాండ్ జిల్లాలో కలిగిరి, మర్రిపాడుల్లో కేంద్రాలు -
అమరావతికి ప్రజామోదం లేదు
● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నెల్లూరురూరల్: ‘రాజధాని అమరావతికి ప్రజామోదం లేదు. రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా లేరు’ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. బుధవారం నెల్లూరులోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధాని వల్ల చంద్రబాబు, ఆయన అనుచరగణం మాత్రమే సంతోషంగా ఉందన్నారు. రాజధానిపై పార్లమెంట్ చట్టం చేసినంత మాత్రాన మురిసిపోకూడదన్నారు. రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. రాపూరు నుంచి, ప్రస్తుత తిరుపతి జిల్లా ఏర్పేడు వరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములున్నట్లు చెప్పారు. జాతీయ రహదారులు, విమానాశ్రయం ఉందన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుపతి రాజధాని అవుతుందని తాళపత్ర గ్రంధాల్లో రాశారని, అది ఏనాటికై నా నిజం అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. క్వార్ట్ ్జ, సిలికా మైన్స్ కేటాయింపుపై సమాధానం చెప్పాలన్నారు. సమీఉల్లా పాల్గొన్నారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న మూడు నెలల్లో జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వేసవి కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మే, జూన్, జూలై నెలల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లోని చేతిపంపులు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, డైరెక్ట్ పంపింగ్ స్కీంలు సమర్థవంతంగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. పశువులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర సాగునీటి యాజమాన్య పద్ధతులను పాటించి నీరు వృథా కాకుండా చూడాలన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడంలో విశేషంగా కృషి చేసిన ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు రూ.50వేల నగదు బహుమతిని అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయ్కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, సోమశిల ఎస్ఈ వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బూతు రాతలపై వైఎస్సార్సీపీ నిరసన
మావిగన్ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై హైదరాబాద్లోని ఆ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్సీపీ కుటుంబాలకు చెందిన మహిళలను ప్రత్యేకించి రాధాకృష్ణ రాతలు, వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆ పత్రిక, చానల్ యజమాని తీరును ఖండిస్తూ చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా ?
నెల్లూరు(అర్బన్): ‘ఇసుకను దోపిడీ చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థను ప్రశ్నించడమే నేరంగా భావించారు. పాలకులు చెప్పినట్టు పోలీసులు తలాడించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపారు’ అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న సత్యనారాయణరెడ్డితో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులతో కలిసి పొన్నవోలు మంగళవారం ములాఖత్ అయ్యారు. సత్యనారాయణను పరామర్శించి అతిత్వరలోనే బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం జైలు బయట పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. పెళ్లకూరు మండలంలో ఇసుక తవ్వుకునేందుకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా కాంట్రాక్టర్ అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఈ దోపిడీని ప్రశ్నించేందుకు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గ్రామ ప్రజలతో కలిసి రీచ్ వద్దకు వెళ్లిన సత్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమన్నారు. ఎప్పుడో పెట్టిన కేసులను కూడా పిటీ వారెంట్ కింద చూపి బెయిల్ రాకుండా పాలకులు పోలీసులు ద్వారా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మూడు వారాలుగా కామిరెడ్డిని జైలులో ఉంచడం అప్రజా స్వామికమన్నారు. ప్రజలెవరు పాలకులను ప్రశ్నించకుండా తప్పుడు కేసులుతో భయపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ టీం చురుగ్గా పని చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు. త్వరలోనే కామిరెడ్డికి బెయిల్ రావడం ఖాయమన్నారు. ఒక వేళ రాకపోతే హైకోర్టులో తానే స్వయంగా వాదించి బెయిల్ తెస్తానన్నారు. పోలీసులకు చట్టం చుట్టం కాదు ప్రజలు, తమ పార్టీ కార్యకర్తలపై పాలకులు చెప్పినట్టు అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు చట్టం చుట్టం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమిళనాడులో తండ్రి, కుమారుడికి సంబంధించిన కస్టోడియల్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడిన విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలన్నారు.దేశంలో న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉందనడానికి తమిళనాడు ఘటనే ఉదాహరణ అన్నారు. అధికార పార్టీ పాలకులు చెప్పినట్లు విని తప్పుచేసిన పోలీసు అధికారులను మూడేళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టం ముందు నిలబెట్టి తీరుతామన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు ఫైర్వాల్ లాగా పార్టీ లీగల్ సెల్ ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో కాని కేసులను హైకోర్టులో తేలుస్తామన్నారు. పోలీసులు, పాలకులు కుమ్మౖక్కై ప్రజలను హింసిస్తే ప్రతి ఒక్క రూ నిలదీయాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ న్యాయవాది రవి మాట్లాడుతూ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై అక్రమంగా విచిత్రమైన కేసు ను బనాయించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవానికి, ఎఫ్ఐఆర్కు సంబంధమే లేదన్నారు. పాలకుల ఒత్తిడి మేరకు పోలీసులు వివిధ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారన్నారు. ఎప్పుడో పెట్టిన 420 కేసులో హైకోర్టు స్టే కూడా ఉందన్నారు. అయినా ఆ కేసును కూడా ఇప్పుడు ముందుకు తీసుకుని రావడం సిగ్గు చేటన్నారు. దీనివల్ల తాత్కాలిక సంతోషం తప్పితే పాలకులకు ఒరిగేదేమి లేదన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో పాటు సామా న్య ప్రజలకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. జూనియర్ అడ్వొకేట్ రామ్సింహారెడ్డి పాల్గొన్నారు. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తే సహించేదిలేదు పాలకుల అడుగులకు మడుగులొత్తవద్దు తప్పు చేస్తున్న పోలీసులు తమిళనాడు ఘటనను గుర్తుతెచ్చుకోవాలి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్రాధ్యక్షుడు పొన్నవోలు సెంట్రల్ జైలులో డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డితో ములాఖత్ -
రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు
పొదలకూరు : స్థానిక నిమ్మమార్కెట్ యార్డు లో నిమ్మ ధరలు మంగళవారం రికార్డు స్థాయిలో పలికాయి. ఢిల్లీ మార్కెట్లో నిమ్మకు డిమాండ్ పెరగడంతో నాణ్యత కలిగిన కాయలు బస్తా రూ.12 వేల వరకు ధరలు పలికినట్లుగా వ్యాపారులు వెల్లడించారు. వేసవి నేపథ్యంలో వారం రోజులుగా నిమ్మకాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కిలో రూ.110 నుంచి రూ.140 వరకు పలుకుతున్నాయి. నాణ్యతను బట్టి మరో రూ.5 అదనంగా కూడా చెల్లిస్తున్నారు. ప్రస్తుత ధరలను పరిశీలిస్తే ఒక్క కాయ రూ.7 నుంచి రూ.9 వరకు పడుతోంది. ఫలితంగా నిమ్మమార్కెట్ యార్డు కళకళలాడుతోంది. ప్రస్తుతం కలువాయి, చేజర్ల, రాపూరు, తదితర మండలాల నుంచి కూడా పొదలకూరు నిమ్మమార్కెట్కు కాయలు వస్తున్నట్టుగా వ్యాపారులు వెల్లడించారు. కృష్ణపట్నం తీరంలో ముమ్మర గస్తీ ముత్తుకూరు(పొదలకూరు) : కృష్ణపట్నం సముద్రతీరంలో పుదుచ్చేరి, తమిళనాడు ఫిషింగ్ బోట్ల అక్రమ ప్రవేశాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలను ప్రారంభించారు. కోస్టల్ పోలీస్ వింగ్ స్టేట్ ఇన్చార్జి, విశాఖ మైరెన్ ఐజీ గోపీనాథ్జెట్టి ఆదేశాల మేరకు ఏఎస్పీ మధుసూదన్రావు ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడు హైస్పీడ్ బోట్లతో సముద్రంపై గస్తీని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మధుసూదన్రావు మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని సముద్ర జలాల్లోకి ఇతర రాష్ట్రాలకు చెందిన ఫిషింగ్ బోట్లు అక్రమ ప్రవేశాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. మైరెన్ పోలీసు, మత్స్య, అటవీశాఖల అధికారుల సమన్వయంతో గస్తీని కొనసా గిస్తున్నట్లుగా చెప్పారు. సముద్రంలో నిరంతర గస్తీ ద్వారా విద్రోహశక్తుల అక్రమ ప్రవేశం, అక్రమ వేట కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకట్ట వేయనున్నట్లుగా తెలిపారు. డీఎస్పీ బాలిరెడ్డి, సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఇందుకూరుపేట ఎస్సై నాగార్జునరెడ్డి, మైరెన్ ఎస్సై అంజిరెడ్డి, ఎఫ్డీఓలు శ్రీనివాసరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు ఉదయగిరి: ఏబీఎన్ చానల్ అధినేత రాధాకృష్ణ వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లలోని మహిళలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారం చేస్తున్న విషయం అందరికీ తెలుసునన్నారు. ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిజం విలువలను ఎప్పుడో కోల్పోయాయన్నారు. టీడీపీ కోసం, అమరా వతిలో తన అక్రమ సంపాదన పెంచుకోవడం కోసం, చంద్రబాబు మెప్పు కోసం పాత్రికేయ వృత్తిలో ఉండి మహిళల గురించి నీచమైన భాషలో మాట్లాడడం క్షమించరానిదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మావిగన్ రాజధానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు బినామీ అయిన రాధాకృష్ణ దిగజారి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనుక్కు తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. జర్నలిస్టు ముసుగులో రాజకీయ నేతలకంటే హీనమైన భాషలో మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రాధాకృష్ణ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. -
లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఉద్యోగం నుంచి సస్పెన్షన్ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఐసీడీఎస్ అధికారులు మంగళవారం జిల్లా స్థాయి సమీక్షను నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు కార్యాలయాల్లో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల తమకు వచ్చిన సమాచారం మేరకు మండల రెవెన్యూ అధికారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చిన్నపిల్లల చేత వీధుల్లో భిక్షమెత్తించే లీడర్లను గుర్తించి వారి పేర్లను తెలియజేయాలన్నారు. త్వరలో పోక్సో చట్టంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి హేనాసుజన్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 304 వరకు ఇంటర్నల్ కమిటీలు ఏర్పడ్డాయన్నారు. మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి వారికి జరిగిన అన్యాయాలను తెలియజేయాలని సూచించారు. సఖి – 1 సెంటర్లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ గంగా భవాని, బీసీ కార్పొరేషన్ అధికారిణి నిర్మలాదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వందన, జహీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహార కల్తీపై కఠిన చర్యలు
● 18 హోటళ్లపై క్రిమినల్ కేసులు ● రూ.1.25 లక్షల జరిమానా ● జేసీ మొగిలి వెంకటేశ్వర్లునెల్లూరు(దర్గామిట్ట): కల్తీ ఆహార పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్ 2006 ప్రకారం జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలపై నెల్లూరులోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు వ్యాపారులకు మొత్తం రూ.1.25 లక్షల జరిమానా విధించినట్లు జేసీ తెలిపారు. అదేవిధంగా, నిషేధిత రంగులతో ఆహారం తయారు చేసి విక్రయించిన కేసుల్లో జిల్లాలోని 18 హోటళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయదారులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రణతి ఫ్లోరా, నీరజ తదితరులు పాల్గొన్నారు.అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకంసైదాపురం: నెల్లూరు రిజర్వ్ ఫారెస్ట్లో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు రేంజర్ మాల్యాద్రి వెల్లడించారు. మండల కేంద్రం సమీపంలో ఉన్న సైదాపురం సెంట్రల్ నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ నర్సరీలో 2 లక్షల మొక్కల పెంపకం చేపడుతున్నట్లు వెల్లడించారు. నర్సరీ ద్వారా ప్రజలకు 50 వేల మొక్కలను ఆగస్ట్ నుంచి అందిస్తామన్నారు. 16 రకాల మొక్కల పెంపకం చేపడుతున్నామన్నారు. అక్రమ మైనింగ్ నిరోధించేందుకు ప్రత్యేక కందకపు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణులను ఎవరైనా వేంటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట బీఓ రవిశేఖర్ తదితరులున్నారు. బైక్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు● ఒకరి మృతి కలువాయి(సైదాపురం): స్కూల్ బస్సు మోటార్బైక్ను ఢీకొట్టిన ఘటనలో మంగళవారం ఒకరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. కలువాయి మండలం నూకనపల్లికి చెందిన కలువాయి పెంచలయ్య, అనంతసాగరం మండలం పడమటికంభంపాడు గ్రామానికి చెందిన ఉదయగిరి బాబు (27) బైక్పై తోపుగుంట నుంచి కలువాయికి వెళ్తున్నారు. దారిలో ఓ స్కూల్కు చెందిన బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో స్థానికులు గమనించి క్షతగాత్రులను 108 అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయగిరి బాబు మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో..● యువకుడి ఆత్మహత్య ఆత్మకూరురూరల్: మండలంలోని నువ్వూరుపాడుకు చెందిన వనపర్తి ప్రవీణ్ (21) అనే యువకుడు కుటుంబ కలహాలతో మార్చి 16న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఆత్మకూరు ఎస్సై జిలానీ కథనం మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన ప్రవళ్లికతో ప్రవీణ్కు వివాహమైంది. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రవీణ్ మద్యంలో గడ్డిమందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి తొలుత ఆత్మకూరులో చికిత్స చేయించారు. తర్వాత తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలో చే ర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో)పెద్దవి: రూ.140 సన్నవి: రూ.100 పండ్లు: రూ.80 -
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి
నెల్లూరు(అర్బన్): ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేశాభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 పేరుతో నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అపోలో హాస్పిటల్స్ కృషి చేస్తున్నాయన్నారు. గతంలో వృద్ధాప్యంలో వచ్చే షుగర్, బీపీ, గుండెపోటు లాంటి జబ్బులు నేడు 20 ఏళ్ల నుంచే రావడం బాధాకరమన్నారు. స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 ప్రకారం మన రాష్ట్రంలో 27 శాతం షుగర్, 22.5 శాతం బీపీ, 4.2 మంది రక్తహీనత, 81.8 శాతం అధిక బరువు కలిగి ఉండటం, 56.7 శాతం రక్తంలో కొవ్వు ఉన్న సమస్యలతో బాధపడే వారున్నారన్నారు. నెల్లూరులో కూడా ఇంచుమించు ఇవే శాతాలతో ఆ జబ్బులతో బాధపడుతున్నారన్నారు. అందువల్ల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చికెన్ వ్యర్థాల పట్టివేతమర్రిపాడు: కర్ణాటక రాష్ట్రం నుంచి తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను మర్రిపాడు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం చుంచులూరు క్రాస్రోడ్డు వద్ద ఎస్సై శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బొలెరో వాహనంలో సుమారు 15 డ్రమ్ముల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వ్యర్థాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామం బయట పూడ్చివేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. -
పాపం మూగజీవాలు
కోవూరు: అక్రమార్కుల కాసుల కక్కుర్తికి మూగజీవాలు నరకాన్ని అనుభవిస్తున్నాయి. వాటిని వాహనాల్లో కుక్కి సరిహద్దులు దాటిస్తున్నారు. కోవూరు నియోజకవర్గం మీదుగా నిత్యం మినీలారీల్లో జీవాలను తరలిస్తున్నారు. పాడి పరిశ్రమకు పట్టుగొమ్మలైన మన పశుసంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండటంతో భవిష్యత్లో పాల ఉత్పత్తి పడిపోయి, పాడి పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. నరకప్రాయం సాధారణంగా పశువుల రవాణాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ అవేవీ అమలు కావడం లేదు. లారీలు, మినీలారీల్లో సామర్థ్యానికి మించి పశువులను ఎక్కిస్తున్నారు. జీవాలు కదలకుండా వాటి కాళ్లను, మెడను బలమైన తాళ్లతో బిగిస్తున్నారు. ప్రయాణంలో కనీసం మేత, నీరు కూడా అందించకపోవడంతో గమ్యస్థానం చేరేలోపే కొన్ని ఊపిరాడక ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తోంది. గ్రామాల్లోని దళారుల ద్వారా తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, రాత్రికి రాత్రే వాహనాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కబేళాలకు తరలించి భారీగా లాభాలు గడిస్తున్నారు. హైవేలపై తనిఖీ కేంద్రాల వద్ద కళ్లుగప్పి లేదా కొందరు అధికారుల అండదండలతో ఈ దందా సాఫీగా సాగుతోంది. పాడి పరిశ్రమకు ముప్పు ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పాలు, పెరుగు కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి వస్తుంది. ఉత్తమ జాతి పశువులను తరలించడం వల్ల స్థానికంగా పశుగణాంకాలు పడిపోతున్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేని సమయంలో రైతుకు చేదోడుగా నిలిచే పాడి పరిశ్రమ దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పశువుల సంఖ్య తగ్గితే పాల ధరలు పెరుగుతాయి. ఇంత జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై జంతు ప్రేమికులు, రైతులు మండిపడుతున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి హైవేలపై నిరంతర నిఘా పెట్టాలని కోరుతున్నారు. పశువుల అక్రమ రవాణా నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలి. కంటైనర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సరిహద్దులు దాటనివ్వాలి. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఈ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి. సరిహద్దులు దాటుతున్న పాడి సంపద ఒక్కో లారీలో సామర్థ్యానికి మించి పశువుల రవాణా పట్టించుకోని అధికారులు -
32,534 మందికి ఉచితంగా సోలార్ విద్యుత్
● ఎస్ఈ రాఘవేంద్రం నెల్లూరు(వీఆర్సీసెంటర్): సూర్యఘర్ ఉత్సవ్లో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాలోని 32,534 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించేందుకు రూ.390 కోట్లు ఖర్చు కానుందని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో వినియోగదారుడికి అయ్యే రూ.1,20,000 ఖర్చును కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందన్నారు. కోవూరు డివిజన్లో 6,500 మందికి, కావలి డివిజన్లో 586, నెల్లూరు రూరల్ డివిజన్లో 10,471, ఆత్మకూరు డివిజన్లో 557, నెల్లూరు టౌన్ డివిజన్లో 2,131 మందికి అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 6 వేల మందికి అవసరమైన ప్యానెల్స్ సిద్ధం చేశామన్నారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, సోలార్ విద్యుత్ నోడల్ ఆఫీసర్ శేషాద్రి బాలచంద్ర, జిల్లాకు చెందిన ఈఈలు శ్రీధర్, రమేష్ చౌదరి, భానూనాయక్, నరేంద్రరెడ్డి, బెనర్జీ, ప్రసాద్, పరంధామయ్య, డీఈఈలు, సోలార్ వెండర్స్ పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థినికి పాముకాటు
సంగం: స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని అనూష మంగళవారం పాముకాటుకు గురైంది. వేకువజామున మరుగుదొడ్డికి వెళ్లి వస్తున్న క్రమంలో బాలికను విషపురుగు కాటేసింది. చీకటి కారణంగా పాముకాటుగా గుర్తించలేకపోయారు. బాలికను గురుకుల సిబ్బంది వెంటనే సంగంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యసిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి పాముకాటు అని నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో గురుకుల పాఠశాలలో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
క్షయ వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం
రాపూరు: క్షయవ్యాధిని నిర్మూలించడమే ప్రభుత లక్ష్యమని అదనపు డీఎంహెచ్ఓ ఖాదర్వలీ తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట వైద్యశాల సూపరింటెండెంట్ అర్షియా ఉన్నారు. ● ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వేపినాపి పీహెచ్సీ సిబ్బంది మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ ఆరోగ్యంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వైద్యులు ప్రమీల రాజకుమారి, సూర్య ధర్మేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. -
25న పాలిసెట్
● రాపూరు, పొదలకూరు ప్రాంతాల్లో కేంద్రాల ఏర్పాటునెల్లూరు(టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ఈ నెల 25వ తేదీన జరుగుతుందని నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రామారావు తెలిపారు. మంగళవారం ఆయన కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలిటెక్నిక్ చదివితే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, డీసీసీపీ తదితర సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సౌలభ్యం కోసం రాపూరు, పొదలకూరు ప్రాంతాల్లో కూడా పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. వివరాలకు 99123 42016 నంబరును సంప్రదించాలని కోరారు. -
బీదతోపాటు ఉన్నదెవరు?
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి తమిళనాడు బోట్లు వదిలేయడం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు హస్తం ఉందని మత్స్యకారులు వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే బీద మస్తాన్రావు ముగ్గురు మత్స్యకారులకు రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పి, ఆ డబ్బులు తెచ్చి ఇచ్చిన వారి పేరు మాత్రం బయటకు చెప్పకపోవడం గమనార్హం. మత్స్యకారులకు సుపరిచితమైన అధికార తెలుగుదేశం పార్టీ నేతలే తెరవెనుక ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గత నెల 14న హార్బర్ నుంచి తమిళనాడులోని కరైక్కల్కు చెందిన నాలుగు సోనా బోట్లు వదిలేయడం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చేందుకు సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పాకల పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన దాదాపు ఐదు వేల మంది మత్స్యకారులు సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మంగళవారం ఉదయం 7 గంటల వరకూ అంటే 14 గంటల పాటు పెద్దలు పంచాయితీ నడిపారు. తొలుత బోట్లను వదిలేసిన నెల్లూరు జిల్లా కొత్తబంగారుపాలెంకు చెందిన జాలిరెడ్డి, ఇస్కపల్లికి చెందిన తోటయ్య, పాతపాలెంకు చెందిన శెట్టిలను సమావేశంలో అందరిముందూ హాజరుపరిచారు. గత నెల 14న ఏం జరిగిందో చెప్పాలని మత్స్యకార పెద్దలు నిలదీశారు. బోట్లు వదిలేసింది తామేనని వారు అంగీకరించారు. అయితే తెర వెనుక సూత్రధారులు, పాత్రధారుల పేర్లు వెల్లడించలేదు. పేర్లు చెప్పి తీరాల్సిందేనని మత్స్యకారులు పట్టుపట్టడంతో ఆరుగంటల తర్వాత అంటే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇస్కపల్లికి చెందిన తోటయ్య వాస్తవాలను సభ ముందుంచారు. బోట్లు వదిలేయాలని అధికార టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు డబ్బులు ఇచ్చారని వెల్లడించాడు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారని చెప్పడం తీవ్ర సంచలనాన్ని కలిగించింది. కావలి సీఐ పాత్ర కూడా ఉందని మరో సభ్యుడు శెట్టి వెల్లడించాడు. అయితే అసలు డబ్బులు తెచ్చి ఇచి్చన వారి పేర్లు మాత్రం వారు వెల్లడించలేదు.రూ.5 కోట్లు చెల్లించాలిబోట్ల వదిలివేతకు నాలుగు గ్రామాల మత్స్యకారులు బాధ్యత వహించాలని పెద్దలు ఆదేశించారు. దీనికి ఆయా గ్రామాల కాపులు సమ్మతించటంతో రూ.5 కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేశారు. అయితే మత్స్యకారులు రూ.1.50 కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి మత్స్యకార పెద్దకాపులు అంగీకరించలేదు. దీంతో కొద్దిసేపు సందిగ్ధం నెలకొంది. ఈలోగా మత్స్యకారులు డబ్బులు అయినా ఇస్తాము లేదా మూడు బోట్లను తెచ్చి పెడతామని చెప్పారు. కానీ పెద్ద కాపులు ససేమిరా అన్నారు. ఒక దశలో వదిలేసిన బోట్లను తెచ్చి పెట్టాలని పెద్ద కాపులు చెప్పారు. రెండు కొత్త బోట్లు కొనిస్తామని ఇస్కపాలెం కాపులు చెప్పడంతో ఒక దశలో చెన్నాయపాలెం, ఇస్కపల్లి మత్స్యకారుల మధ్య వాగ్వాదం రేగింది. దీంతో పెద్ద కాపులు సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మత్స్యకార పెద్ద కాపులు స్పష్టం చేశారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో పెద్దలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. సమావేశానికి పోలీసులు మఫ్టీలో బందోబస్తు నిర్వహించారు. -
అర్ధరాత్రి దాకా హైడ్రామా
సింగరాయకొండ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు కరైకల్కు చెందిన బోట్లను వదిలేసిన వ్యవహారంలో తెరవెనుక సూత్రధారులు ఎవరో తేలిపోయింది. ఇందులోని పాత్రధారులను సభ మధ్యలో నిలబెట్టి నిలదీశారు. తాము తప్పు చేశామని అంగీకరించినప్పటికీ.. సూత్రధారుల పేర్లను మాత్రం బాధ్యులు బయటకు వెల్లడించలేదు. ఈ వ్యవహారం తేలే వరకు వదిలిపెట్టేది లేదని, చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మత్స్యకార పెద్దలు హెచ్చరికలు చేసినా.. అర్ధరాత్రి దాకా హైడ్రామా నడిచింది. అర్ధరాత్రి సమయంలో నిందితుల్లో ఒకరైన నెల్లూరు జిల్లా ఇస్కపల్లిపాళెం మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య వెల్లడించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు చెప్పడం వల్లే చేశామని, తమకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలిచ్చినట్లు చెప్పారు. దీంతో ఈ ఘటన వెనుక ఉన్న కీలక సూత్రధారి ఎవరో తేలిపోవడంతో తర్వాతి పరిణామాలపై మత్స్యకారులు చర్చిస్తున్నారు. గత నెల 14న జువ్వలదిన్నె హార్బర్లో మైరెన్ పోలీసుల రక్షణలో ప్రకాశం జిల్లా మత్స్యకారులు పట్టుకున్న తమిళనాడు బోట్లు మాయమయ్యాయి. ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల పంచాయతీ పోతయ్యగారిపట్టపుపాళెంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 164 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు జిల్లాల నుంచి బస్సులు, వ్యాన్ లు, మోటారు సైకిళ్లపై వేలాదిగా తరలివచ్చారు. ఈ సంఘటన జరిగిన రోజు ఘటనకు ప్రధాన కారకులైన నెల్లూరు జిల్లా ఇస్కపల్లిపాళెం మత్స్యకార గ్రామానికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాళేనికి చెందిన జాలిరెడ్డి, పాతపాళేనికి చెందిన శెట్టిలను సమావేశంలో నిందితులుగా నిలబెట్టారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించాలని మత్స్యకార పెద్దలు ఆదేశించారు. దీనికి ఆ ముగ్గురు ‘తాము తప్పు చేశామని బహిరంగంగా ప్రకటించారు’. అయితే ఎవరు చెబితే వదిలేశారో చెప్పడం లేదు. ఈ ఘటనకు వెనకాల ఎవరు ప్రధానపాత్ర పోషించారు, ఏం జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొంతమంది మత్స్యకార కాపులు జరిమానాతో సరిపెడదామని అంటుండగా ఈ ఘటనకు వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరో చెప్పాలని, ఎంత మొత్తం చేతులు మారిందో తెలపాలని సమావేశానికి హాజరైన సింహభాగం మత్స్యకార కాపులు పట్టుబట్టారు. ఒక్కొక్కరిది ఒక్కో మాట సోనాబోట్ల అపహరణలో ప్రధాన నిందితులైన ఇస్కపల్లిపాళేనికి చెందిన తోటయ్య, కొత్త బంగారుపాళేనికి చెందిన జాలిరెడ్డి, పాతపాళేనికి చెందిన శెట్టి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పారు. ఒకరు ఇటీవల లోకేశ్ పర్యటన సందర్భంగా హార్బర్లో బోట్లు అడ్డంగా ఉన్నాయని, వాటిని పక్కకు జరపాలని కావలి సీఐ వాటిని తీసుకుని వెళ్లటానికి అనువుగా ఏర్పాటు చేశాడని చెప్పగా.. మరొకరు ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. మూడవ వ్యక్తి తోటయ్య మాత్రం తనకు తెలుగు వచ్చినప్పటికీ ఇతర భాషలో మాట్లాడే ప్రయత్నం చేయటంతో సీఐతో మాట్లాడటానికి తెలుగు వచ్చుకానీ ఇప్పుడు మాత్రం తెలుగు రాదా అని మత్స్యకారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార పెద్దలు 8 నెలల నుంచి తాము ఏవిధంగా ప్రాణాలకు తెగించి సోనాబోట్లను అదుపులోకి తీసుకుందీ వివరించారు. వాటిని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచి వాటి కాపలా బాధ్యతను ఇస్కపల్లిపాళెం, కొత్తబంగారుపాళెం, తాటిచెట్లపాళెం, పాతపాళెం మత్స్యకారపాళాలకు అప్పగించి ముగ్గురిని కాపలాగా ఉంచామన్నారు. అంతేకాక ఈ బోట్లను విడిపించటానికి సోనాబోట్ల యజమానులు ఒక్కో బోటుకు రూ.15 లక్షలు ఇస్తామన్నా తాము వదల్లేదన్నారు. ఈ ఘటనకు ఆ నాలుగు మత్స్యకార గ్రామాల పెద్దలు కూడా బాధ్యత వహించాలని ప్రకటించగా వారు కూడా అందుకు సమ్మతించారు. ఎన్నో సంవత్సరాలుగా సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయామని తాము తెగించి సమైక్యంగా బోట్లను అదుపులోకి తీసుకుంటే ఈ విధంగా చేశారని మత్స్యకార పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అర్ధరాత్రి వరకు నడిచిన హైడ్రామా అనంతరం సూత్రధారి బీద మస్తాన్రావు అని తేల్చి చెప్పడంతో తర్వాత కార్యాచరణపై మత్స్యకారులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 100 మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సమావేశం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మొదట పోలీసులు, విలేకరులకు అనుమతి ఉండదని ప్రకటించినప్పటికీ ఆ తరువాత విలేకరులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సూత్రధారులెవరో వెల్లడించిన నిందితుల్లో ఒకరు టీడీపీ రాజ్యసభ్యుడు బీద మస్తాన్రావే అని వెల్లడి ఒక్కొక్కరికి రూ.10 లక్షలిచ్చినట్లు ఒప్పుకోలు జువ్వలదిన్నె హార్బర్లో సోనాబోట్ల అపహరణపై మత్స్యకారుల సమావేశం నిందితులను నిలబెట్టి నిలదీసిన పెద్దలు నాలుగు బోట్లను తిరిగి తేవాలని మత్స్యకార పెద్దల డిమాండ్ సమావేశానికి హాజరైన 164 గ్రామాల మత్స్యకారులు -
కూటమి పాలనలో అటకెక్కిన అత్యవసర సేవలు
● మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితా రెడ్డి పొదలకూరు: ‘కూటమి పాలనలో అత్యవసర సేవలు అటకెక్కాయి. రోడ్డు ప్రమాదాలు జరిగితే స్పందన సక్రమంగా ఉండటం లేదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిండెంట్ కాకాణి పూజితా రెడ్డి అన్నారు. ఇటీవల మార్కాపురం సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదంలో మృతిచెందిన 14 మందిలో ఒకరైన పొదలకూరు పంచాయతీ వెంకటేశ్వరనగర్కు చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని సోమవారం పూజిత పరామర్శించారు. పార్టీ ప్రకటించిన రూ.లక్ష నగదును మృతుడి సతీమణి మమతకు పూజిత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం శాంతిభద్రతలపై దృష్టి పెట్టకుండా అక్రమ కేసులతో పాలన చేస్తున్నట్టు విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీగా ఉన్నారని, ప్రమాదాలపై స్పందించడం లేదని ఆరోపించారు. పోయిన ప్రాణాలు వెనక్కు తీసుకురాలేమని కనీసం ఆ కుటుంబాలను ఆదుకునేందుకై నా ముందుకు రావాల్సిందిగా సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర సేవలు సక్రమంగా అందడం లేదని, 108 అంబులెన్స్ల సేవలు పడకేసినట్టు పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల్లో ఏర్పడే సాంకేతిక లోపాల వల్ల వరుస ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందిగా డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 108 అంబులెన్స్లకు ఎంతో ప్రాధాన్యమిచ్చారన్నారు. ప్రమాదాలు సంభవించిన వెంటనే క్షతగాత్రులను 108 వాహనాలు చికిత్స నిమిత్తం తీసుకు వెళ్లేవన్నారు. పట్టణంలోని యాదవవీధిలో రోడ్డు ప్రమాదానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న పడవల శ్రీనివాసులును పూజిత పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు బచ్చల సురేష్కుమార్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సభ్యులు జి.లక్ష్మికల్యాణి, జి.శ్రీనివాసులు, చెమికల వెంకటేశ్వర్లు, రావుల ఇంద్రసేన్గౌడ్, పి.శంకరయ్య, జే.రామచంద్రయ్య, ఎ.వెంట్రామిరెడ్డి, ఎస్కే అంజాద్, డీ.విజయభాస్కర్రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
కారుణ్య నియామక పత్రం అందజేత
నెల్లూరు(దర్గామిట్ట): రెవెన్యూ శాఖలో గ్రేడ్–1 వీఆర్వోగా విధులు నిర్వహిస్తూ మరణించిన షేక్ జాఫర్ కుమారుడు షేక్ యాసిన్బాబుకు జూనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామక పత్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం అందజేశారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో యాసిన్బాబుకు నియామకపత్రాన్ని శుభాకాంక్షలు తెలిపారు. 15లోగా ‘విద్యాంజలి’లో అప్లోడ్ చేయాలి నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రధానోపాధ్యాయులు గుర్తించి విద్యాంజలి పోర్టల్లో ఈ నెల 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలని డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాంజలి పథకం ద్వారా ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లుగా చెప్పారు. దాతలు నేరుగా ఈ పోర్టల్ ద్వారా పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించవచ్చన్నారు. పోర్టల్ ద్వారా నగదు రూపంలో విరాళాలు సేకరించరని, కేవలం వస్తువులు, సేవల రూపంలో మాత్రమే సహకారాన్ని కోరుతున్నట్లుగా చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి సహకారం అందించాలనుకునే వారు పోర్టల్ను సందర్శించి వలంటీరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యాంజలి పథకం ద్వారా గదుల నిర్మాణం, మరమ్మతులు, ఫర్నీచర్, విద్యాసామగ్రి, తదితరాలను అందించేందుకు దాతలు ముందుకురావాలని కరారు. ఘనంగా జాతీయ సముద్ర దినోత్సవం ముత్తుకూరు(పొదలకూరు) : ముత్తకూరు మండలంలోని అదాని కృష్ణపట్నం పోర్ట్లో జాతీయ సముద్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సముద్ర రంగంలో పనిచేసే వారి అమూల్యమైన సేవలను ప్రశంసించారు. సముద్ర రంగం రవాణా, వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందన్నారు. కోస్ట్గార్డ్ సిబ్బంది, కస్టమ్స్ అధికారులు, వ్యాపార భాగస్వాములు, ఓడరేవు ఉద్యోగులు స్థానికులతో కలిసి భద్రత, సామర్థ్యం, పర్యావరణ అనుకూలత కట్టుబాట్లను పునరుద్ఘాటిస్తూ సముద్ర వారసత్వానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం సామూహికంగా మొక్కలు నాటారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,271 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,018 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3, 78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
‘డయల్ యువర్ ఎస్ఈ’కి 8 ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం జరిగింది. ఎనిమిది మంది తమ ఫిర్యాదులను ఎస్ఈ రాఘవేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఫ్యూజ్ బాక్స్ ఏర్పాటు, విద్యుత్ బిల్లింగ్, లో ఓల్టేజీ, సర్వీసుల ఏర్పాటు లాంటి సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీధర్, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరపతయ్య, నరసింహారావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్ మెడల్తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఎస్.భావన ప్రతిభ చూపారు. ఏఐ – డేటా సైన్స్లో 87.58 శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, విభాగాధిపతి డాక్టర్ స్వప్నసుధ భావనకు అభినందనలు తెలిపారు. ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యఆత్మకూరు: ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆత్మకూరు పట్టణంలోని మేదరివీధి కాలనీలో జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. మేదరవీధికి ఎగువ ప్రాంతంలో ఉంటున్న షేక్ నిషాద్ (51) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. ఖర్చుల కోసం తన స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. మరోనెల రోజుల్లో వివాహం ఉందనగా స్థలం అమ్ముడుపోకపోవడం, ఇతర ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. సోమవారం భార్యను బ్యాంక్ వద్దకు పంపి ఇంట్లోని వెనుకవైపు దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంక్ నుంచి ఇంటికొచ్చిన భార్య నిషాద్ను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కండలేరులో 45.920 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 45.920 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 350, లోలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో)పెద్దవి: రూ.120 సన్నవి: రూ.90 పండ్లు: రూ.70 -
అకాల వర్షం... అన్నదాతకు నష్టం
మనుబోలు: మండలంలో సోమవారం వేకువజామున కురిసిన అకాల వర్షం అన్నదాతలకు నష్టాన్ని కలిగించింది. మండలంలో రబీ పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో ఆరబోసుకుని ఉన్నారు. ఈ తరుణంలో అకాలం వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. బద్దెవోలు క్రాస్రోడ్డు వద్ద పలువురు రైతులకు చెందిన సుమారు 100 పుట్లకుపైగా షుగర్లెస్, బీపీటీ రకం ధాన్యం తడిసిముద్దయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఎరువుల కొరతతో బ్లాక్లో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసి వేయడంతో ఎకరాకు సుమారు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు అయ్యాయి. దీనికితోడు ధాన్యం ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ తరుణంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సగం ధరకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఉద్యోగం కోసం..
శారీరక వైకల్యం అడ్డుపడినా ఆమె వెనుకడుగు వేయలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. కానీ ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటోంది. వివరాలు.. కావలి పట్టణంలోని కొత్త మసీదువీధికి చెందిన రేష్మ దివ్యాంగురాలు. దివ్యాంగుల కోటాలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా తనకు ఉద్యోగావకాశం కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి కోరారు. అలాగే తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నెలకు రూ.15,000 పింఛన్ మంజూరు చేసి ఆసరాగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యావంతురాలైన రేష్మ పరిస్థితిని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
● ఉలవపాళ్లలో సర్కారు భూమి స్వాహా
జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే పాగా వేస్తున్నారు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి అక్రమాలకు తెరతీస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చి పాసుపుస్తకాలను సైతం మంజూరు చేస్తున్నారు. తాజాగా దగదర్తి మండలం ఉలవపాళ్లలో జాతీయ రహదారి పక్కనున్న రూ.20 కోట్ల విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారుల సహకారంతో స్థానిక నాయకులు స్వాహా చేయడం సంచలనంగా మారింది. సర్వేయర్ సంతకం లేని ఎఫ్ఎంబీ పరిశీలించి చర్యలు చేపడుతాం దగదర్తి మండలం ఉలవపాళ్లలోని ప్రభుత్వ భూముల వ్యవహారం నా దృష్టికి రాలేదు. ఈ విషయమై సమగ్ర పరిశీలన చేపట్టి తగిన చర్యలు చేపడుతాం. – ఎలీషా, ఆర్డీఓ, కావలి నెల్లూరు (దర్గామిట్ట): దగదర్తి మండలం ఉలవపాళ్లలో జాతీయ రహదారికి ఆనుకుని సర్వే నంబరు 86లో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని రెండు దశాబ్దాల క్రితం ‘వకార్ యూనస్ మైన్స్ అండ్ మినరల్స్’ పేరుతో ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి మైనింగ్ కోసం తీసుకున్నారు. అక్కడ 8 ఏళ్ల పాటు మైనింగ్ సాగింది. ఆ తరువాత ఖాళీగా ఉన్న సదరు భూమిపై ఇద్దరు స్థానిక నాయకులు కన్నేశారు. అందులో ఆరెకరాలను గతంలో మండలాధికారుల సహకారంతో అక్రమంగా క్రమబద్ధీకరించి స్వాహాపర్వానికి తెరతీశారు. మొదట నో.. ఆ తరువాత ఎస్ తాజాగా ఉలవపాళ్లలోని సర్వే నంబరు 86లోని మరో 14 ఎకరాల భూమిని స్వాహా చేసేందుకు స్థానిక నాయకులు స్కెచ్ వేశారు. అందుకోసం ఎకరాకు రూ.30 వేల చొప్పున రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పి పని చక్కబెట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకులు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోగా తొలుత రెవెన్యూ అధికారి ఫైల్ను తిరస్కరించారు. ఆ తరువాత నగదు ముట్టజెప్పడంతో సదరు అధికారి తిరిగి ఫైల్ను ఓకే చేసినట్లు సమాచారం. నిబంధనలకు తూట్లు ఎఫ్ఎంబీపై మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్ గానీ సంతకం చేయలేదు. కనీస క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే తహసీల్దార్ సంతకం చేయడం గమనార్హం. జిల్లాలో ఈ నెల 1న ముఖ్యమంత్రి పర్యటనలో అధికారులంతా బిజీగా ఉండగా, అత్యంత రహస్యంగా, వేగంగా ఫైల్ను కదిలించి పాసుపుస్తకాలు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాటాల కోసం పంచాయితీ దగదర్తి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కార్యాలయంలోని ఓ ఉద్యోగి కీలకంగా వ్యవహరించగా, రెవెన్యూ సిబ్బంది అందరూ వాటాలు పంచుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారమై ‘నా వాటా సంగతేంటి’ అని మండల సర్వేయర్ ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే పంచాయితీ పెట్టినట్లుగా తెలిసింది. ‘మాకు జీఓలు అన్నీ తెలుసు.. ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ సదరు సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. విచారణ జరిపితే వెలుగులోకి ప్రస్తుతం జాతీయ రహదారి పక్కన ఎకరా భూమి ధర రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోంది. పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడానికి భూమి లేదంటున్న అధికారులు, ఇలా కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే రూ.20 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడుకోవడంతో పాటు స్వాహా పర్వం వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దగదర్తి రెవెన్యూ కార్యాలయంలో అక్రమాల పర్వం రూ. 20 కోట్ల విలువైన భూమి క్రమబద్ధీకరణకు చర్యలు నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ సర్వేయర్ సంతకం లేకుండానే ఫైల్ క్లియరెన్స్ -
నేలకొరిగిన వరి పంట
ఉదయగిరి రూరల్: మండలంలోని గానుగపెంటపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఇద్దరు రైతులు సాగుచేసిన వరి పంట నేలవాలి తీవ్ర నష్టం కలిగింది. నారాయణరెడ్డికి చెందిన ఎకరా, బాలయ్యకు చెందిన 1.20 ఎకరాల్లోని పంట తడిసిపోయి నేలకొరిగింది. తాము రూ.80 వేలు పెట్టుబడి పెట్టి తెలంగాణ మసూరా రకాన్ని గతేడాది నవంబర్ నెలలో సాగు చేశామని బాధిత రైతులు తెలిపారు. మరో వారం రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో పంట మొత్తం నేలకొరిగి ధాన్యం సైతం నేలపాలైందన్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టం అందించి ఆదుకోవాలని కోరారు. -
కాసేపు ఆగు.. దాహం తీర్చుకోనివ్వు
వేసవి తీవ్రత అధికమైన నేపథ్యంలో మనుషులు దాహార్తితో అల్లాడిపోతున్నారు. ఇక పక్షులు, మూగజీవాలు నీళ్ల కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సోమవారం తీర ప్రాంతంలోని చింతవరం గ్రామంలో భారీ వాహనం వస్తున్నా లేగదూడ నిలబడి రోడ్డుపై ఉన్న చిన్నపాటి గుంతలోని బురద నీటితో దాహం తీర్చుకోవడం చూపరులను కలచి వేసింది. సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా గ్రావెల్, మట్టి తరలించే భారీ వాహనాలతో రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దుమ్ము విపరీతంగా లేస్తుండటంతో రోడ్డుపై నీటిని పిచికారీ చేస్తుండగా గుంతల్లో నీరు నిలిచింది. నీళ్లు బురదగా ఉన్నా పట్టించుకోకుండా లేగదూడ దాహార్తిని తీర్చుకుంది. మూగజీవాన్ని చూసిన డ్రైవర్ కొంతసేపు వాహనాన్ని నిలిపివేశాడు. – చిల్లకూరు -
బ్యాంక్కు వెళ్తుండగా..
● ట్రావెల్స్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి దుత్తలూరు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలోని తెడ్డుపాడు బీసీ కాలనీ వద్ద 565వ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చందులూరి బ్రహ్మానందం (74) మండలంలోని నర్రవాడలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. తెడ్డుపాడు బీసీ కాలనీలో నివాసముంటున్నాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి భోజన అనంతరం తిరిగి నర్రవాడకు మోటార్బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో బద్వేల్ నుంచి పామూరు వైపు వేగంగా వెళ్తున్న ఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టింది. బ్రహ్మానందం రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సును దుత్తలూరు పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి సొంతూరు ప్రకాశం జిల్లా రాళ్లపాడు కట్టకిందపల్లి. నర్రవాడ బ్యాంక్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
హక్కుల సాధనకై పోరాటం
నెల్లూరు(అర్బన్): ఉద్యోగులు హక్కులను సాధించుకునేందుకు మరోసారి జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేయబోతున్నామని ఏపీ జేఏసీ నెల్లూరు జిల్లా చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ భవన్లో ఏపీ జేఏసీ జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 వచ్చినా ఇప్పటికీ కనీసం కమిటీ కూడా వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం 12వ పీఆర్సీతోపాటు 30 శాతం ఐఆర్ను ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలైన జెడ్పీ పీఎఫ్ వెబ్సైట్ను నవీనకరించాలని కోరారు. ఏపీ జీఎల్ఐ వెబ్సైట్ను సరళీకరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కిరణ్కుమార్, లక్కాకుల పెంచలయ్య, చలపతిశర్మ, దశరథరాములు, నరసింహం, ప్రసాద్, ప్రసాద్రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనయ్య, కరుణమ్మ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి ఆదేశించినా మారని రాత
పింఛన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించి రోజులు గడుస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో బాధితుడు కలెక్టర్ను కలిసి మరోసారి అర్జీ సమర్పించారు. వివరాలు.. వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన నిమ్మకంటి శంకర్, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సాయిచరణ్ తొమ్మిదేళ్లుగా తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతూ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. చరణ్కు 90 శాతం వైకల్యం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మూడేళ్ల క్రితమే సదరం సర్టిఫికెట్ను మంజూరు చేసింది. ఇటీవల చంద్రబాబు వింజమూరు పర్యటనకు వచ్చిన సమయంలో బాధిత తల్లిదండ్రులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అధికారులు స్పందిస్తారని ఆశించిన ఆ పేద కుటుంబానికి నిరాశే ఎదురైంది. దీంతో నెల్లూరుకు వచ్చి అర్జీ సమర్పించారు. -
బారులు తీరి.. అర్జీలిచ్చి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు సమర్పించిన ప్రజలునెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నెల్లూరులోని కలెక్టరేట్కు తరలివచ్చారు. బారులు తీరి అర్జీలు సమర్పించారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, తెలుగుగంగ స్పెషల్ అధికారి కేశవర్ధన్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ అప్లోడ్ను కొన్ని శాఖలు ఇంకా మొదలు పెట్టలేదన్నారు. మరికొన్ని శాఖలు వెనుకంజలో ఉన్నాయన్నారు. శాఖల వారీగా సమీక్షించి ఈనెల 8వ తేదీ లోపు ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. -
పేదల బియ్యం తరలిస్తుండగా..
● 40 టన్నుల స్వాధీనం ● ఒంగోలు నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమ రవాణా చేస్తూ.. ● కోవూరులో పట్టుకున్న పోలీసులుకోవూరు: రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది. అక్రమార్కులు కొత్త మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బియ్యాన్ని పట్టుకుంటూనే ఉన్నా అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. ఒంగోలు నుంచి కావలి మీదుగా పోర్టుకు బియ్యం తరలిస్తున్నారని పోలీసులకు ముందస్తుగా సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటల్ నెల్లూరు గ్రాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో లారీని ఆపి పరిశీలించారు. అందులో 40 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. బియ్యంతో సహా లారీని కోవూరు పోలీస్స్టేషన్కు తరలించారు. సోమవారం సివిల్ సప్లయీస్ అధికారులు పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి బియ్యాన్ని ఇనమడుగులోని సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, క్లీనర్ను అరెస్ట్ చేశారు. ● కొంతకాలంగా నెల్లూరు మీదుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అధికారుల మొక్కుబడి తనిఖీల వల్లే ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. గ్రామాల్లో లబ్ధిదారుల వద్దకు వెళ్లి బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల కోవూరు ప్రాంతంలో 600 కేజీల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. తాజాగా 40 టన్నుల బయటపడటం కలకలం రేపింది. -
బీరాపేరు వంతెనపై రోడ్డు ప్రమాదం
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సంగం: సంగం సమీపంలోని బీరాపేరు వంతెనపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన సిమెంట్ ట్యాంకర్ ముందుగా ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను సైడ్లో ఢీకొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో బస్సు డ్రైవర్ ఆకస్మికంగా వాహనాన్ని ఆపడంతో వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి బస్సు కిందకు వెళ్లింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని అధికారులు తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెరువు సమీపంలో వ్యక్తి మృతి
కోట: కోట చెరువు సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శోభారాణి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వెంకన్నపాళెం గ్రామానికి చెందిన పెంచలయ్య(45)గా గుర్తించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు మర్రిపాడు: బైక్ అదుపుతప్పి పడి ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని 565 జాతీయ రహదారిపై బాట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి 108 సాయంతో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వేగం, మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఘనంగా వార్షికోత్సవం
గూడూరురూరల్: పట్టణ సమీపంలోని ఆదిశంకర డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో శనివారం రాత్రి 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగర్ మంగ్లీ పాటలకు యువత నృత్యాలు చేస్తూ సందడి చేశారు. యూనివర్సిటీగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వర్సిటీ చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, ఎమ్మెల్యే సునీల్కుమార్, షార్ డైరెక్టర్ పద్మ కుమార్, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈడీ డాక్టర్ హుజైఫా ఖోరాకివాలా, సోలిటెక్ సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ హార్దిక్ రమణి, నౌకాయాన మంత్రిత్వ శాఖ షిప్పింగ్ ఏడీజీ జితేంద్ర జాదవ్, మిరాయ్, రాజాసాబ్ సినిమాల వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కుమార్ నిర్మల సృజన్, వర్సిటీ చాన్సలర్ వంకి అరవింద, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ మోహన్, రిజిస్ట్రార్ రాజయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకన కేంద్రాల వద్ద నిరసన 9న
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిట్టేడి రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జానకిరామయ్యకు కార్యాచరణ నోటీసు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పది మూల్యాంకన కేంద్రానికి ఉపాధ్యాయులందరూ నిల్ల రిబ్బన్లతో హాజరు కావాలన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కోచైర్మన్ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు చలపతిశర్మ, పిచ్చిబాబు, నరసింహం, దశరథరాములు, ఉదయభాస్కర్, కృష్ణారెడ్డి, రఘు, రాజశేఖర్, రవి, నరసయ్య పాల్గొన్నారు. ట్రాక్టర్ అదుపుతప్పి.. ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవం సెంటర్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని అటుగా వెళ్తున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన విద్యుత్ తీగలు రాకపోకలకు అంతరాయం కలిగించాయి. బైక్పై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఐదుగురు జూదరుల అరెస్ట్కావలి: కావలి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బుడంగుంట అంబేడ్కర్నగర్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఆదివారం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై తిరుమలరెడ్డి తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా పేకాట, కోడిపందెలు వంటి జూదాలు నిర్వహిస్తున్నా, గంజాయి రవాణా, విక్రయాలు, సేవనం, అక్రమ మద్యం విక్రయాలు చేపడుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
వేసవి జాగ్రత్తలు తీసుకున్నాం
ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సైలెన్లు సిద్ధంగా ఉంచాం. అలాగే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వద్ద కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాం. ఉపాధి హామీ కూలీల కోసం ఆ శాఖకు సరిపడిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాం. ఎండ వేడిమికి నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీటిలో కలుపుకుని తాగాలి. ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేయాలని అన్ని పీహెచ్సీల డాక్టర్లకు సూచించాం. వేసవి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీరసం, తలనొప్పి లాంటి లక్షణాలుంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ -
దురాయి వేసి మరీ ఓట్లు వేస్తే.. ఇంత ద్రోహమా?
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి మత్స్యకారులు ఆయనపై ఉన్న అభిమానంతో ఆ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉండేవారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఆ పార్టీకి అండగా నిలిచారు. ఎన్నికల సమయంలో దురాయి వేసి.. టీడీపీకి ఓట్లేస్తే ఇంత ద్రోహం తలపెడతారా? అంటూ మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాల కాలంలో 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ 2020 విజనరీగా చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకోలేదని మత్స్యకారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్లు హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లతో ఆంధ్రా ప్రాంత సముద్ర జలాల్లోకి చొచ్చుకువచ్చి మత్స్య సంపదను దోపిడీ చేయడంతోపాటు స్థానిక మత్స్యకారులపై దాడులు చేయడం, బోట్లు, వలలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అయినా ఏనాడూ మత్స్యకారుల భవిష్యత్ను కాంక్షించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ దశలో తమ ప్రాణాలకు తెగించి తమిళ బోట్లను పట్టుకుని నిర్బంధిస్తే.. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా వదిలేయడానికి మంత్రి లోకేశ్ స్కెచ్ వేస్తే.. మరో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కనుసన్నల్లో జరిగిందని మత్స్యకారులు గుర్తించారు. -
అడ్డుకుంటే తిరగబడతాం
గ్రామాల మత్స్యకారులు ఐక్యమవుతున్నాం ఇది మా మత్స్యకారుల భవిష్యత్ సమస్య మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోకపోగా తమ న్యాయ పోరాటాలను అడ్డుకోవడం మంచిది కాదు. ప్రకాశం జిల్లా పాకలలో జరిగే మత్స్యకార సమావేశాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న తమను అడ్డుకుంటే మత్స్యకారులంతా ఐక్యమై ప్రభుత్వంపై తిరగబడతాం. మత్స్యకారులకు మంచి చేయాల్సిన ప్రభుత్వం వెన్నుపోటు పొడిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు. – వీవీ రమణయ్య, మత్స్యకార గ్రామ పెద్ద తూపిలిపాళెం సోమవారం ప్రకాశం జిల్లాలో జరిగే మత్స్యకారుల ఐక్య సదస్సుకు 164 గ్రామాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న మా సమస్యలకు మేమే శాశ్వత పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాపై చిత్తశుద్ధి ఉంటే.. వదిలేసిన బోట్లను తెచ్చిపెట్టండి. ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తీసుకురండి. అంతేకాని సదస్సుకు తమను పోనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తిరుపతి జిల్లా తడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న మత్స్యకారులంతా ఐక్యమై తిరుగుబాటు చేస్తాం. – కె వెంకటేశ్వరు,్ల మత్స్యకారుడు, తూపిలిపాళెం పాకలలో జరిగే మత్స్యకారుల మీటింగ్కు పాల్గొంటున్నాం. ఎవరు అడ్డుపడినా మత్స్యకారులందరూ తిరుగుబాటు చేస్తారు. ఇది మా మత్స్యకారుల భవిష్యత్ సమస్య. ప్రభుత్వం, అధికారుల సహకారం మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు చేసిన ద్రోహం చాలు. మాకు అన్యాయం చేసి.. ఇప్పుడు సవతి ప్రేమ చూపిస్తే.. తలొగ్గిపోతామనుకుంటే అది మీ భ్రమే. రెండు దశాబ్దాలుగా బతుకు పోరాటం చేస్తున్నాం. తమిళనాడు బోట్లతో వచ్చిన అక్కడి మత్స్యకారులు మా కడుపులు కొడుతుంటే.. వారికి సపోర్టు చేయడం ఎంత వరకు న్యాయం. – కొండూరు తిరుపతయ్య, ఇస్కపల్లిపాళెం, మత్స్యకారుడు, అల్లూరు మండలం ప్రభుత్వం చేసింది ద్రోహం కాదా? -
మాకు ద్రోహం చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోం
మాకు ద్రోహం తలపెట్టిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టబోము. తమిళ బోట్లలో వచ్చిన అక్కడి మత్స్యకారులు మా బతుకుదెరువును దెబ్బకొట్టి.. వేట మొత్తం దోచుకుని పోతున్నారు. వారిని ఎదుర్కొన్న సందర్భంలో రక్తగాలయాలకు గురయ్యాం. బోట్లు, వలలు ధ్వంసం చేస్తే నష్టపోయాం. ఏనాడూ ప్రభుత్వం కానీ, అధికారులు మాకు అండగా నిలబడలేదు. మా ప్రాణాలకు తెగించి బోట్లను పట్టుకుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం మాకు అన్యాయం చేయడం తగదు. – సున్నపు హరినారాయణ, మత్స్యకారుడు, ఇస్కపల్లిపాళెం, అల్లూరు మండలం -
ప్రభుత్వ పెద్దలు తప్పు చేయకపోతే.. ఎందుకు హడావుడి
మా ప్రాణాలకు తెగించి నాలుగు బోట్లను పట్టుకుని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఉంచితే.. రాత్రికి రాత్రే వాటిని వదిలేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి. స్థానికంగా ఉండే మత్స్యకారుల కడుపులు కొట్టి.. పక్క రాష్ట్రంలోని వాళ్లకు సపోర్టు చేయడం ఎంత వరకు సబబు. మా సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రణరంగమే అవుతుంది. పాకలలో జరగబోయే 164 మత్స్యకార గ్రామాల పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే.. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అదే అమలు చేస్తాం. – వాయిల తిరుపతి, తుమ్మలపెంట, కావలి రూరల్ మండల కన్వీనర్ -
మత్స్యకారుల తరతరాల భవిష్యత్కు జగన్ బాటలు
ప్రాణాలకు తెగించి కడలిపై వేట సాగిస్తే తప్ప పూట గడవని స్థితిలోని మత్స్యకారులకు మరో బతుకుదెరువు లేదు. దీంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కారణం.. ఆయా రాష్ట్రాల్లోని మత్స్యకారులకు ఉన్న హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లు ఆంధ్రా మత్స్యకారులకు లేకపోవడమే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు, తమిళ బోట్ల దాష్టీకాలను గుర్తించి దీనికి చెక్ పెట్టాలంటే.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించడం ఒక్కటే మార్గమని భావించి.. ఆ మేరకు వారికి హామీ ఇచ్చారు. అధికారంలోకి గానే ఏక కాలంలో హైస్పీడ్ మెకనైజ్డ్ 1250 బోట్లు నిలిపే విధంగా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి రూ.2 కోట్లు విలువ చేసే మెకనైజ్డ్ బోటుకు స్థానిక మత్స్యకారులను యజమానులుగా చేసే విధంగా 50 శాతం సబ్సిడీతో 1250 బోట్లను సైతం ప్రభుత్వం అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిలు సిద్ధం చేశారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం కావడంతో ఎన్నికల సమయానికి పూర్తయింది. కానీ కోడ్ రావడంతో మత్స్యకారులకు అంకితం చేయలేకపోయారు. ఒక్క జువ్వలదిన్నెలోనే కాకుండా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మరో మూడో చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా అవి సైతం చివరి దశలో ఉన్నాయి. వీటిని ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వినియోగంలోకి తేకుండానే నిర్వీర్యం చేసే కుట్రకు తెగించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వినియోగంలోకి వచ్చి ఉంటే.. తమిళ జాలర్లకు పోటీగా వారి కంటే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మెకనైజ్డ్ బోట్లతో విస్తృతంగా మత్స్య సంపదను సేకరిస్తూ.. ఆంధ్రా మత్స్యకారుల తరతరాలు ఆర్థికంగా సంపన్నులుగా మారేందుకు అవకాశం ఉండేది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ -
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్రంలోని తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైన్స్, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల మత్స్యకారుల నుంచి జిల్లాలోని మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కోస్టల్ సెక్యూర్టీ ఐజీ గోపీనాథ్ జెట్టితో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మూడు బోట్లతో సముద్రంలో నిరంతర గస్తీని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్పీ సౌజన్య, మత్స్యశాఖ జేడీ శాంతి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకర్లపై లోకేశ్కు ఫిర్యాదు ఉదయగిరి: స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కిన టీడీపీ మహిళా కార్యకర్త పచ్చవ వెంగమాంబ కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లాలో మంత్రి లోకేశ్ను కలిశారు. గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చేసిన కృషి.. కాకర్ల సురేష్ తనను రాజకీయంగా పెడుతున్న ఇబ్బందులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఉదయగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాకుండా పోలీసులు కిడ్నాప్ చేసిన వైనం... దాని వెనుక శాసనసభ్యుడి పాత్రపై లోకేశ్ వద్ద ప్రస్తావించారని సమాచారం. విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారనే అంశం పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సోమవారం నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు తెలిపారు. దర్గామిట్టలోని జెడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాలను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏడు ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లుగా ఏడుగుర్ని నియమించామని వివరించారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 85 గ్రూపులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చీఫ్ ఎగ్జామినర్లుగా 85 మంది.. అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 510 మంది.. స్పెషల్ అసిస్టెంట్లుగా 255 మందిని నియమించామని చెప్పారు. విధులు నిర్వ ర్తించనున్న ఉపాధ్యాయులు.. క్యాంప్ ఆఫీసర్కు సోమవారం ఉదయం 8.30కు రిపోర్టు చేయాలని సూచించారు. హాజరు కాని వారి పై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డయల్ యువర్ ఎస్ఈ నేడు నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే లక్ష్యంగా డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నగరంలోని విద్యుత్ భవన్లో సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 0861– 2320427 నంబర్ను వినియోగదారు లు ఉదయం 8.30 నుంచి 9.30లోపు సంప్రదించి సమస్యలను తెలియజేయాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వద్దకు క్యూ చేరింది. స్వామివారిని 80,841 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,559 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
మత్స్యకారుల మాటే శాసనం
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మత్స్యకారులను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ దఫా అయితే ‘జీవిత కాలం’ ద్రోహం తలపెట్టారు. దశాబ్దాలుగా సంక్షేమానికి, భవిష్యత్కు నోచుకోని సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల ఉజ్వల భవిష్యత్కు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్తో బాటలు వేస్తే.. తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ భవిష్యత్ను భగ్నం చేస్తూ.. ఆశలను చిదిమేసే కుట్ర పూరిత చర్యలకు తెగించారు. రెండు దశాబ్దాలుగా తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి స్థానిక మత్స్యకారులపై దాడులు చేసి, వారి సాధారణ బోట్లను, వలలను ధ్వంసం చేసి మత్స్య సంపదను దోచుకెళ్తూనే ఉన్నా.. ఏ ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టలేకపోయాయి. ఈ దశలో ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళ బోట్లను వారితో చేసుకున్న చీకటి ఒప్పందాలతో గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి.. స్థానిక మత్స్యకారుల ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారు. టీడీపీ పాలకుల చర్యలతో మత్స్యకారులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలో మత్స్యకారులు తీసుకునే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం సర్కారు పెద్దల్లోనే కాకుండా.. స్థానిక అధికార పార్టీ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ స్థానిక నేతలు తమిళ జాలర్లతో చేసుకున్న చీకటి ఒప్పందాలతో మత్స్యకారులకు చేసిన ద్రోహానికి తీర ప్రాంతం నివురు గప్పిన నిప్పులా రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు సోమవారం ప్రకాశం జిల్లా పాకలలో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని 164 మత్స్యకార గ్రామాల పెద్దలు, నాయకులు సమావేశం కానుండడంతో సర్కార్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. ‘మత్స్యకారుల మాటే శాసనం’ కావడంతో వారి అనుమతి లేకుండా ఆ గ్రామాల్లో కి అడుగుపెట్టే సాహసం ఎవరూ చేయలేకపోతు న్నారు. నమ్మితే ప్రాణాలిచ్చేంత మనస్సున్న మత్స్యకారులు.. అదే అన్యాయం చేసే ఎవరైనా సరై వారి పీచమణచడానికి కూడా వెనుకాడరు. తమ కుటుంబ సభ్యులైనా సరే జీవిత కాలం శిక్ష విధిస్తారు. ఇక తమకు ద్రోహం తలపెట్టిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు, నేతల విషయంలోనూ అటువంటి నిర్ణయం ఉండబోతోందనే సమాచారంతో ఉలిక్కి పడుతున్నారు. వారిని శాంత పరిచేందుకు నేలవిడిచి సాము చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ పరం మత్స్యకారుల భవిష్యత్ను కాంక్షించి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. ఈ క్రెడిట్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు రహస్యంగా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయం శంకుస్థాపన చేసేంత వరకు మత్స్యకారులకు కూడా తెలియకుండా చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఫిషింగ్ హార్బర్ను నిర్వీర్యం చేసేందుకు దీనికి కేటాయించిన 70 ఎకరాల్లో సుమారు 29 ఎకరాలను సాగర్ డిఫెన్స్కు కట్టబెట్టారు. ఇది తొలి దశ మాత్రమేనని, భవిష్యత్లో మరింతగా విస్తరిస్తామని చెప్పడం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులకు దక్కకుండా చేసే కుట్రగా కనిపిస్తోందని తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు మత్స్యకార కాపులు, మత్స్యకారులు పేర్కొన్నారు. తమ భూములను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టే క్రమంలో తమ అభిప్రాయాలను కూడా తీసుకోకపోవడం .. ఫిషింగ్ హార్బర్నే లేకుండా చేసేందుకు వ్యూహంగా మత్స్యకారులు మండిపడిపోతున్నారు. ఈ పరిణామానికే మత్స్యకారులు రగిలిపోతుంటే.. తమ ప్రాణాలకు తెగించి పట్టుకున్న పుదుచ్చేరి బోట్లను గుట్టు చప్పుడు కాకుండా వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో దాదాపు రెండు వారాలకుపైగా పూర్తిగా చేపల వేటను బంద్ చేసి.. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం ప్రకాశం జిల్లా పాకల కేంద్రంగా 164 మత్స్యకార గ్రామాలు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నారు. రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్ల మత్స్య దోపిడీ, దాడులు ఈ దాష్టీకాన్ని అడ్డుకోలేకపోయిన గత ప్రభుత్వాలు ముప్పై ఏళ్లలో 16 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ఏనాడూ మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోని వైనం ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని ఆలోచనే చేయని ఆ ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలను గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ అధికారంలోకి రాగానే వారి ఉజ్వల భవిష్యత్కు శ్రీకారం నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీరం వెంబడి ఏకకాలంలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రూ. 289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి జిల్లా పరిధిలోని మత్స్యకారులకు 1250 హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లు 50 శాతం రాయితీతో అందించేందుకు ప్రణాళిక ప్రభుత్వం మారడం మత్స్యకారుల శాపంగా మారిన వైనం మత్స్యకారుల కోసం నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను నిర్వీర్యం చేసేందుకు రహస్యంగా ప్రైవేట్ పరం ప్రాణాలకు తెగించి పట్టుకున్న నాలుగు మెకనైజ్డ్ బోట్లు వదిలేసి ద్రోహం నేడు ప్రకాశం జిల్లా పాకలలో 164 మత్స్యకార గ్రామాల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం సర్కారులో ప్రకంపనలు.. అధికార పార్టీ నేతల్లో వణుకులు ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. మా కడుపులు కొట్టేందుకు వీళ్లెవరు. మాకు ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతుంటే.. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉండండి. మా సమస్యను మమే పరిష్కరించుకుంటాం. కాదని మా జోలికి వస్తే.. మత్స్యకారులందరూ ఏకమైతే తట్టుకోలేరు. గత ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించింది. దీన్ని ప్రైవేటోళ్లకు ఇవ్వడానికి మీకేం హక్కు ఉంది. తీర ప్రాంతం మత్స్యకారుల హక్కు. మావాళ్లు ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన తమిళ బోట్లను వదిలిపెట్టినోళ్లు ఎవరో బయటపెట్టండి. ఇవన్నీ ప్రభుత్వం చేసిన ద్రోహాలు కదా?. – కొమారి రాజు, మత్స్యకార నేత, తుమ్మలపెంట -
జగ్జీవన్రామ్ భవన్ ఏర్పాటుకు ప్రణాళికలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): నగరంలో బాబూ జగ్జీవన్రామ్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణిని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో బాబూ జగ్జీవన్రామ్ జయంత్యుత్సవాలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పిల్లలతో కేక్ను కట్ చేయించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని హాస్టళ్ల అభివృద్ధే తన లక్ష్యమని వివరించారు. జిల్లాను పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దేలా ప్రణాళికలను రూపొందించామని ప్రకటించారు. ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతాల్లో రెండు మెగా పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. డీఆర్వో విజయ్కుమార్, వివిధ సంఘాల నేతలు కలివెల ఎలీషాకుమార్, కుడుముల సుబ్బారావు, మన్నేపల్లి దాసు, మురళి, రాఘవేంద్రరావు, పెంచలయ్య, ఈపూరు వెంకటేశ్వరరావు, తాడిపర్తి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ● వేదాయపాళెం సెంటర్లోని జగ్జీవన్రామ్ విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు. -
ప్రతిష్టను భ్రష్టుపట్టిస్తున్నారు
నెల్లూరు సిటీ: టీటీడీ ప్రతిష్టను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మండిపడ్డారు. నగరంలోని కరెంటాఫీస్ సెంటర్లో ధర్నాను శనివారం చేపట్టారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం విజయకుమార్రెడ్డి మాట్లాడారు. అనైతిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులను థార్మిక సంస్థలకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. తిరుమలలో భక్తులను ఇబ్బందులకు గురిచేయడం, దాడి చేయడం లాంటి చర్యలతో టీటీడీ అప్రతిష్టపాలవుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో బీఆర్ నాయుడి వీడియోలు బయటకొచ్చినా, తప్పులు చేసిన వారిని సమర్థిస్తూ ప్రజలకు సీఎం చంద్రబాబు ఏమి సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. వయస్సులో పెద్ద.. ఓ చానల్ యజమానే ఈ విధమైన చర్యలకు పాల్పడితే.. తామేమీ తీసిపోమనే రీతిలో తెలుగు తమ్ముళ్లు అసభ్యకర చేష్టలతో రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి.. బీఆర్ నాయుడ్ని తొలగించి, సంస్కారవంతులను చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ సత్తార్, జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మహిళా జోనల్ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద, అంగన్వాడీ విభాగాధ్యక్షురాలు లావణ్య, బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్యామ్సింగ్, జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు ఇక్బాల్, రూరల్ మహిళాధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల మనస్సుల్లో జగనన్నకు విశిష్ట స్థానం
● ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నెల్లూరు(పొగతోట): ప్రజల మనస్సుల్లో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొన్నారు. వేదాయపాళెంలోని ఓ కల్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా సదస్సును పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె మాట్లాడారు. జగనన్న పాలన స్వర్ణయుగమని తెలిపారు. సీఎం చంద్రబాబు రాక్షస పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మహిళల రక్షణ కోసం అనేక సంస్కరణలను తమ ప్రభుత్వ హయాంలో అమలు చేయగా, వీటిని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు సంక్షేమ కార్యక్రమాలను నాడు అమలు చేశారని, అయితే ప్రస్తుతం వీరికి రక్షణ కరువైందని మండిపడ్డారు. మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు హామీలు, బాండ్లు ఇచ్చి ప్రజలు, రైతులు, ఉద్యోగులను చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అయితే సూపర్ సిక్స్ను అమలు చేశామంటూ సీఎం గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. మాచర్లలో మహిళ ఇంట్లోకి దుండగుడు పట్టపగలు ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడినా, ఎలాంటి చర్యల్లేవని ఆరోపించారు. పోరాటం చేయాలి జగనన్న ఆలోచనల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలను ఏర్పాటు చేశామని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. టీడీపీ అరాచకాలతో బలైన కుటుంబాలకు బాసటగా నిలిచి న్యాయ పోరాటం చేయాలని కోరారు. ప్రశ్నిస్తున్న మహిళలను కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా, పార్టీ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మహిళలు శక్తిగా పనిచేయాలని కోరారు. కుతంత్రాలతో గెలిచారు కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేసి కూటమి పార్టీలు గెలిచాయని కాకాణి పూజిత ఆరోపించారు. టీడీపీ పాలనలో మహిళల పరిస్థితి దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. జగనన్న అధికారంలోకి వచ్చాక, ప్రస్తుతం తప్పులు చేస్తున్న అధికారులు, నేతల తాటతీస్తారని తెలిపారు. సదస్సుకు హాజరైన వారిని చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వివరించారు. అనంతరం కల్యాణి, అరుణమ్మ, పూజితను గజమాలతో సత్కరించారు. పార్టీ నేతలు లక్ష్మీసునంద, కోడూరు కల్పలతారెడ్డి, మొయిళ్ల గౌరి, కటకం దీపిక తదితరులు పాల్గొన్నారు. కల్యాణి, అరుణమ్మ, పూజితకు సత్కారం మాట్లాడుతున్న వరుదు కల్యాణి రెడ్బుక్ రాజ్యాంగ అమలుకే పరిమితం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకే ఖాకీలు పరిమితమవుతున్నారని కల్యాణి విమర్శించారు. కూటమి పాలనలో ప్రతి వీధిలో బెల్టుషాపులు వెలిశాయని ధ్వజమెత్తారు. సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు గానూ ప్రతి మహిళా ఆదిపరాశక్తి అవతారమెత్తాలని పిలుపునిచ్చారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ మహిళా విభాగం బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
సంగం: అతివేగం, ఆపై డ్రైవర్ నిద్రమత్తు వెరసి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. అనంతపురం నుంచి నెల్లూరు వైపు ఆర్టీసీ బస్సు 22 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్.. ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పరిశీలించి, వివరాలను ఎస్సై, సీఐ గంగాధర్ను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు ఉస్మాన్సాహెబ్పేటకు చెందిన సుజాత, శ్రీనివాసులు, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన అశోక్కుమార్తో పాటు మరో వ్యక్తికి ప్రాథమిక చికిత్సను 108 సిబ్బంది అందించి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలాన్ని ఆత్మకూరు ఎమ్వీఐ రాములు పరిశీలించి.. డ్రైవర్, స్థానికులతో మాట్లాడారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. అనంతరం సంబంధిత డిపోకు తరలించారు. -
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు..
ఉదయగిరి: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడ్ని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి డిమాండ్ చేశారు. వింజమూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలను శనివారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని విమర్శించారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని సైతం రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన నిలిచి.. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేసిన అంశాన్ని ప్రస్తావించారు. అరాచక పాలన సాగిస్తున్న కూటమి నేతలకు సద్బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వరుడ్ని కోరారు. యువనేత మేకపాటి అభినవ్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు గూడపు వీరశేఖర్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కోనం సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీలు మాల్యాద్రి, గణపం బాలకృష్ణారెడ్డి, శివలీల, నేతలు పల్లాల కొండారెడ్డి, రేవునూరి శ్రీనివాసరెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, రాజగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పవిత్రతను మంటగలుపుతున్నారు
కోవూరు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారని, ఇలాంటి వ్యక్తిని నియమించి తిరుమల పవిత్రతను టీడీపీ మంటగలుపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు మండిపడ్డారు. మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడారు. బీఆర్ నాయుడి వీడియోలు వైరలై, ప్రజలు ఛీదరించుకుంటున్నా, ఆయన్ను పదవి నుంచి తొలగించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నేనింతే.. ఇలాగే ఉంటాను.. మీరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తిరుమలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ను తొలగించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలను ఉధృతం చేయనున్నామని చెప్పారు. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమలలో వివాదాస్పద వ్యక్తుల పెత్తనమేమిటని ప్రశ్నించారు. అనంతరం పార్టీ కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులతో తిరుగుతున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగలడం ఖాయమని చెప్పారు. భక్తుల మనోభావాలను గాయపర్చినందుకు గానూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీఎల్డీఏ మాజీ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, సుబ్బారెడ్డి, మండల కన్వీనర్లు శేషగిరిరావు, సతీష్రెడ్డి, షాహుల్, నవీన్కుమార్రెడ్డి, లక్ష్మీకుమారి, శ్రీలత, ఉమా తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
నెల్లూరు(లీగల్): జూనియర్ సివిల్ జడ్జిగా నెల్లూరు బార్ అసోసియేషన్కు చెందిన సిరి విశ్వజ హింద్ ఎంపికయ్యారు. బీవీనగర్కు చెందిన బీఎస్సెన్నెల్ విశ్రాంత ఉద్యోగి నరేంద్రబాబు, హైమావతి కుమార్తె అయిన ఈమె విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ (హానర్స్) చదివారు. అనంతరం నెల్లూరు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాగా ఈమెకు అభినందనలను పలువురు తెలియజేశారు. కోర్టు భవనాల పరిశీలన కోవూరు: పట్టణంలోని కోర్టు భవనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సూచనలు చేశారు. సీనియర్ జడ్జి కోర్టు హాల్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. తమ సమస్యలను తెలియజేయగా, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పనితీరు, కేసుల విచారణ తదితర అంశాలపై బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సునీల్కుమార్, చంద్రమోహన్, ఏజీపీ సలీమ్, ఏపీపీ స్టాలిన్ వివరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సీనియర్ సివిల్ జడ్జి చైతన్య పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 68,445 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,383 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో శనివారానికి 46.11 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 350, లో లెవల్కు 100, పిన్నేరుకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. నిత్యాన్నదానానికి రూ.50 వేల విరాళం రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఆత్మకూరుకు చెందిన గుండాల శేషారెడ్డి జ్ఞాపకార్థం భార్య పెంచలమ్మ, కుమార్తెలు నీరజ, పద్మజ, అల్లుళ్లు జనార్దన్రెడ్డి, రామ్మోహన్రెడ్డి శనివారం అందజేశారని దేవస్థాన ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు ఆత్మకూరు: ఆత్మకూరు మీదుగా దూర ప్రాంతాలకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు శనివారం ఉదయం తనిఖీ చేశారు. బస్సుల కండీషన్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, అగ్నిమాపక పరికరాలు, హ్యామర్స్ ఉన్నాయాననే అంశాన్ని పరిశీలించారు. బస్సులు కండీషన్లో లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. -
వివాహేతర సంబంధమే హత్యలకు కారణం
● నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): జిల్లాలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే నిందితులు హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు శనివారం నెల్లూరు మూలాపేటలోని తన కార్యాలయంలో కేసు పూర్వాపరాలను వెల్లడించారు. దగదర్తి మండలం పెద్దపుత్తేడుకు చెందిన వెంకటేష్(29), బుచ్చిరెడ్డిపాళెం కాగులపాడు గ్రామానికి చెందిన బాల అంకయ్య(25)లు వరుసకు అన్నదమ్ములు. వారు గత నెల 29వ తేదీన కొడవలూరు మండలం గండవరం గ్రామ శివారుల్లోని పొలాల వద్ద దారుణ హత్యకు గురైన విషయం విదితమే. నెల్లూరు రూరల్ డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడింది దగదర్తి మండలం పెద్దపుత్తేడు గ్రామానికి చెందిన ప్రశాంత్కుమార్, కల్యాణ్కుమార్, విజయ్భాస్కర్, ప్రకాష్, శీనయ్యలుగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించారు. మృతుడు వెంకటేష్కు నిందితుల బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో వారు వెంకటేష్పై కక్షపెంచుకున్నారు. ఈనెల 29వ తేదీన వెంకటేష్, బాల అంకయ్యలు డీజిల్ తీసుకుని బైక్పై వెళ్తుండగా గండవరం గ్రామశివార్లలో బైక్ను నిందితులు అడ్డుకున్నారు. రాడ్లు, కత్తితో వెంకటేష్పై దాడి చేస్తుండగా అడ్డుపోయిన బాల అంకయ్యపై సైతం దాడి చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్లు, కత్తి, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో బుచ్చి సీఐ ఒ.దుర్గాప్రసాద్, కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి పాల్గొన్నారు. -
లారీల ఢీ– ఒకరికి గాయాలు
● డ్రైవర్కు గాయాలు ఆత్మకూరు: టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుకనే ధాన్యం లోడ్తో వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొన్న ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు–ముంబై రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై ఎస్కే జిలానీ వివరాల మేరకు.. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అదే క్రమంలో తిరుపతికి ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ వెనుకనే వస్తూ నిలిచి ఉన్న లారీని వేగంగా ఢీకొంది. దీంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జుకావడంతో పాటు డ్రైవర్ భాషుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో నిలిచి ఉన్న ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రాజధాని పేరుతో దోపిడీకే మేము వ్యతిరేకం
● మావిగన్ ద్వారా రూ.లక్షల కోట్లను ఆదా చేయొచ్చు ● ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నెల్లూరు(పొగతోట): అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో అక్కడ జరుగుతున్న అవినీతి, దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కొందరి రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. జగనన్న సూచించిన మావిగన్ కారిడార్ రాజధానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలన్నారు. డ్రగ్స్, మద్యం ఏరులు.. మహిళలకు రక్షణ కరువు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. మ ద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నా కూటమి నేతలు పట్టించుకోవడం లేదన్నారు. మద్యం సేవించిన వ్యక్తులు మృగాలుగా ప్రవర్తించి మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రోజుకు నలుగురు మహిళలపై అత్యాచారాలు, 60 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో 15 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడి నాలుగు దఫాలు గర్భవతిని చేశాడన్నారు. ఆమె స్వయంగా ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినా చర్యలు లేవన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళల రక్షణకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేశారన్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కనీస చర్యలు లేనందు వల్లనే నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయన్నారు. జగనన్నను తిట్టడానికి హోం మంత్రికి పదవి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువయిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చీవాట్లు పెట్టినా ప్రభుత్వ పెద్దల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. హోం మంత్రి పేకాట స్థావరాలు, మద్యం దుకాణాల వద్ద పీఏలతో డబ్బులు వసూలు చేస్తోందన్నారు. బీఆర్ నాయుడుపై చర్యలకు మీనమేషాలెందుకు? ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తిపై కేవలం ఆడి యో లీక్ కాగానే జగనన్న అతన్ని తొలగించి ఆ చానల్ ప్రతిష్టను ఇనుమడింప చేస్తే.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఆరోపణలు వచ్చినా ఇంత వరకు పదవి నుంచి తొలగించలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు అధికమయ్యాయన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగనన్నను సీఎం చేసేందుకు మహిళలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ● రాష్ట్ర వైఎస్సార్సీపీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే కూ టమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. మహిళా శక్తిని కూటమి తక్కువగా అంచనా వేసిందన్నారు. ఇప్పటికై నా కూటమి నేతలు మహిళా లోకంపై జరుగుతున్న దాడులను నివారించి, అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకురాలు లక్ష్మీసునంద పాల్గొన్నారు. -
స్క్రబ్ టైఫస్తో వ్యక్తి మృతి
కోట: స్క్రబ్ టైఫస్ వ్యాధితో చికిత్స పొందుతూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలంలో వ్యవసాయ కూలీ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కోట మండలంలోని తిన్నెలపూడి అరుంధతీయకాలనీకి చెందిన ముత్యాలయ్య(65) పదిరోజుల క్రితం పశువులకు గడ్డి వేసే క్రమంలో చేతిపై పురుగు కుట్టడంతో చిన్న దద్దుర్లు వచ్చాయి.రెండు రోజుల అనంతరం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు కోట ఆస్పత్రిలో చికిత్స అందించారు. జ్వరం తగ్గకపోవడంతో నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్క్రబ్టైఫస్గా డాక్టర్లు నిర్ధారించారు. అప్పటికే శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నట్లు గుర్తించి అత్యవసర చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. -
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు జిల్లా: సంగం మండలం కోలగట్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు ప్రమాదం జరిగింది. చెట్టును ఢీకొట్టి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. అనంతపురం నుంచి నెల్లూరు వెళ్తుండగా లారీని తప్పింబోయి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వేప చెట్టును ఢీకొట్టి బోల్తాపడటంతో పెను ప్రమాదమే తప్పింది. -
ఎగబాకుతున్న నిమ్మ ధరలు
● బస్తా కాయలు రూ.పది వేలు ● ఢిల్లీ మార్కెట్లో డిమాండ్ ● పొదలకూరు యార్డు నుంచి ఎగుమతులు పొదలకూరు: తోటల్లో నిమ్మకాయల దిగుబడి తగ్గుతున్న సమయంలో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో రైతుల పంటపండుతోంది. 100 బస్తాల కాయలుంటే, రూ.తొమ్మిది లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయమొచ్చే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతుల తోటల్లో కాయలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఎంత ధరలు ఉన్నా, ఇవి లేకపోవడంపై నిట్టూరుస్తున్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో కిలో కాయలు రూ.100 నుంచి రూ.125 వరకు ప్రస్తుతం పలుకుతున్నాయి. నాణ్యత గల బస్తా రూ.పది వేల వరకు ఉంటోంది. దీంతో నాణ్యత ఉన్న కాయలను రెండు, మూడు బస్తాల్లో తీసుకొస్తున్న రైతులు రూ.20 నుంచి రూ.30 వేల వరకు తీసుకెళ్తున్నారు. వేసవి తాపం పెరుగుతున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల్లో నిమ్మకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ప్రస్తుతం దిగుబడి తగ్గుముఖం పట్టింది. ఫలితంగా ఉన్న కాయలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి. 20 లారీల్లో ఎగుమతి పొదలకూరు యార్డు నుంచి కాయలు తక్కువగా ఉన్నా, నిత్యం 20 లారీల్లో వివిధ ప్రాంతాలకు ఎగుమతవున్నాయి. నిత్యం 400 టన్నుల కాయలను ఢిల్లీ, వారణాశి, మదుర, లఖ్నవూ, గోరఖ్పూర్, చైన్నె, బెంగళూరు, కేరళ, బిహార్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఢిల్లీ మార్కెట్కు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి మార్కెట్లు పెద్దవైనా, అక్కడి నుంచి ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవు. కర్ణాటక, మధ్యప్రదేశ్లో నిమ్మ తోటలున్నా, అక్కడ ప్రస్తుతం దిగుబడి లేదు. దీంతో పొదలకూరు పరిసర ప్రాంతాల్లోని వాటికి డిమాండ్ ఏర్పడింది. తోటల్లో పిందె కాయలు కోతకొచ్చేంత వరకు ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెలంతా ధరలు ఆశాజనకంగానే ఉంటాయని చెప్తున్నారు. -
భర్త వేధింపులు తాళలేక..
● వివాహిత బలవన్మరణం చిల్లకూరు: ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి గూడూరు రెండో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన దేశాయిశెట్టి నిర్మల కుమార్తె వీణా జెస్సీకి గూడూరు రెండో పట్టణానికి చెందిన పంచేటి వంశీతో 2021లో వివాహమైంది. వారికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఇటీవల కాలంలో వంశీ భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధించేవాడు. గురువారం ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వీణా జెస్సీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నిర్మల మాట్లాడుతూ తన కుమార్తెను వంశీ మానసికంగా, శారీరకంగా తరచూ వేధిస్తుండే వాడని చెప్పారు. పలుమార్లు ఇద్దరి మధ్య వివాదాలు నెలకొనడంతో సర్ది చెప్పామని తెలిపారు. అయితే వంశీ ఎక్కువగా వేధించడంతోనే జెస్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. -
మంచి నడవడికతో ఉన్నత శిఖరాలకు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బిట్రగుంట: పుస్తక పరిజ్ఞానం, సృజనాత్మక ధోరణితో పాటు మంచి అలవాట్లను పెంపొందించుకుంటే లక్ష్యాలను విద్యార్థులు సులువుగా చేరుకోవచ్చని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కాకాణి, జేఎన్టీయూ (అనంతపురం) అకడమిక్ అండ్ ఆడిట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. లక్ష్యాలను విద్యార్థులు నిర్దేశించుకొని కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అలవాట్లు, ఆకర్షణలకు దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడారు. ప్రస్తుత విద్యా, ఉద్యోగ రంగాల్లో వస్తున్న మార్పులు, వాటికి అనుగుణంగా విద్యార్థులు పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలపై అవగాహన కలిగించారు. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమైన బోధనను అందించాలనే లక్ష్యంతో కడనూతలలో అన్ని సదుపాయాలతో కళాశాలను నిర్మించామని ప్రతాప్కుమార్రెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతిక అంశాలు, సంస్థలకు అవసరమైన నైపు ణ్యాలపై ఎప్పటికప్పుడు శిక్షణనిస్తుండటంతో క్యాంపస్ ఎంపిల్లో విద్యార్థులు రాణిస్తున్నారని వివరించారు. కళాశాల డైరెక్టర్ రాజారెడ్డి, ప్రిన్సిపల్ పీవీఎన్ రెడ్డి, ఏఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆడిందే ఆట.. పాడిందే పాట
నెల్లూరు(టౌన్): వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో రాజకీయం జోక్యం అధికమైంది. ఆయా జిల్లాల్లో ఉండే అధికార పార్టీకి చెందిన నేతల సిఫార్సుతో డిప్యుటేషన్లపై ఇతర వర్సిటీలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికితోడు అక్కడ పనిచేస్తున్న అధికారులు సైతం వత్తాసు పలుకుతుండటంతో కొంతమంది అధ్యాపకులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా మారింది. వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు కొరత తీవ్రంగా వేధిస్తున్నా కొందరు నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లపై ఇతర యూనివర్సిటీలకు వెళ్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకులు నియామకం చేపడుతున్నట్లు కూటమి ప్రభుత్వం చాలాకాలంగా చెబుతున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. వర్సిటీల్లో బోధించేందుకు సరిపడా అధ్యాపకుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముగిసినా.. విక్రమ సింహపురి యూనివర్సిటీలోని సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో నలుగురు అధ్యాపకులను నియమించారు. వారిలో ఒకరు రిటైర్ అయ్యారు. ఒకరు డిప్యుటేషన్పై ఎస్వీ యూనివర్సిటీకి వెళ్లగా మిగిలిన ఇద్దరిలో ఒకరు రిజిస్ట్రార్గా, మరొకరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక్కరే సోషల్ వర్క్ విభాగంలో విధుల్లో ఉన్నారు. అధ్యాపకురాలు కుసుమ గతంలో ఎస్వీ వర్సిటీకి వెళ్లారు. కాలం ముగిసిన వెంటనే తిరిగి వీఎస్యూకు వచ్చారు. విధుల్లో చేరినా అధికార పార్టీ నేత సిఫార్సుతో డిప్యుటేషన్పై మళ్లీ ఎస్వీకి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఏడాది ఫిబ్రవరిలో గడువు ముగిసినా ఆమె ఇక్కడికి రాలేదు. వీఎస్యూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను ఎస్వీలో సోషియాలజీ అధ్యాపకురాలిగా పంపడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. విక్రమ సింహపురి వర్సిటీలో జీతం, ఎస్వీలో విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది. డిప్యుటేషన్ ముగిసినా ఎస్వీ అధికారులు రిలీవ్ చేయకుండా ఉండటం, వీఎస్యూ అధికారులు ఇక్కడికి వచ్చి వెంటనే జాయిన్ కావాలని ఆదేశాలివ్వలేదని తెలిసింది. మరో ఇద్దరు ఎస్వీకి డిప్యుటేషన్పై వెళ్లేందుకు వీఎస్యూలోని టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధ్యాపకుడు జవహర్బాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో తమ పరిశోధన పత్రాన్ని దొంగిలించారని మహిళా ప్రొపెసర్ జయంతి రంజన్ వీఎస్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో పరిశోధన పత్రాన్ని దొంగిలించినట్లు తేలడంతో జవహర్బాబుపై పాలకమండలిలో పనిష్మెంట్ విధించారు. ఆయన పనిచేసే డిపార్ట్మెంట్కు సంబంధించి మూడేళ్లపాటు పరిశోధన విద్యార్థులను అలాట్ చేయకపోవడం, రెండు ఇంక్రిమెంట్లను కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు భవిష్యత్లో పాలనాపరమైన బాధ్యతలను అప్పజెప్పకూడదని తీర్మానించారు. అయితే ప్రస్తుతం అతని పనిష్మెంట్ను ఎత్తివేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. వర్సిటీలో పాలనా పరమైన అంశాల కంటే ఇలాంటి వివాదాస్పద అంశాల్లో రిజిస్ట్రార్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పలువురు అధికారులు చెబుతున్నారు. డిప్యుటేషన్పై వెళ్లేందుకు వీఎస్యూ రిజిస్ట్రార్, ఎస్వీయూ రిజిస్ట్రార్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీఎస్యూలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు ఫిబ్రవరితో ముగిసినా వెనక్కి రాని అధ్యాపకురాలు వెళ్లేందుకు మరో ఇద్దరు లెక్చరర్ల ప్రయత్నాలు కొరత ఉన్నా వెనక్కి తగ్గని వైనం రెగ్యులర్ అధ్యాపకుల్లేక విద్యార్థుల ఇబ్బందులు నియామకాలు చేపడతామని కాలం వెళ్లదీస్తున్న కూటమి ప్రభుత్వంకావలి పీజీ సెంటర్లో.. కావలి పీజీ సెంటర్లో ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాగార్జున యూనివర్సిటీకి డిప్యుటేషన్పై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఐదేళ్లపాటు అక్కడ ఆర్ట్స్ కళాశాలలో ఆర్థిక శాస్త్రం విభాగానికి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయా యూనివర్సిటీల్లో జరుగుతున్న డిప్యుటేషన్లపై ప్రభుత్వ జోక్యం మితిమీరడంతో పనిచేస్తున్న అధికారులు సైతం గ్రీన్సిగ్నల్ ఇవ్వక తప్పడం లేదని తెలిసింది. ఇప్పటికై నా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పలువురు కోరుతున్నారు.ఇంకా జాయిన్ కాలేదు ఎస్వీ యూనివర్సిటీలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కుసుమ డిప్యూటేషన్ కాలం ముగిసింది. ఇప్పటికే వీఎస్యూలో జాయిన్ కావాల్సి ఉంది. ఉన్నత విద్యామండలి నుంచి డిప్యుటేషన్లపై ఆదేశాలు వస్తే తప్పకుండా పాటించాల్సిందే. డిప్యుటేషన్లపై ఇంకా ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. – అల్లం శ్రీనివాసరావు, వీసీ, వీఎస్యూ -
వేట సాగక.. పూట గడవక..
● ప్రతికూల వాతావరణంతో నిలిచిన వేట ● మరోవైపు ఆగని తమిళ జాలర్ల దోపిడీవాకాడు: రెండు నెలలుగా సముద్రంపై ప్రతికూల వాతావరణం కారణంగా పోరుగాలి నెలకొని వేట సక్రమంగా సాగడం లేదు. సాధారణంగా విరామ సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో వేట సజావుగా సాగడమే కాకుండా మత్స్య సంపద ఎక్కువగా దొరుకుతుంది. అలాంటిది ఈ ఏడాది మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. సముద్రంలో వల వేసి ఎంత గాలించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. దీంతో డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. వేట తప్ప మరేపని తెలియని వారికి రెండు నెలలుగా పూట గడవటం కష్టంగా మారింది. వారి వల్ల ఇబ్బందులు ఇటీవల తమిళ జాలర్ల దోపిడీని జిల్లా మత్స్యకారులు అడ్డుకుని వారిని పట్టుకోవడం జరిగింది. మందలించి చర్యలు తీసుకోవాల్సిన నేటి ప్రభుత్వ పాలకులు కొందరు పక్క రాష్ట్రంలో ద్వారా ముడుపులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా దోపిడీదారులను వదిలిపెట్టడం జరిగింది. దీనిపై జిల్లా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అయితే ఇరు రాష్ట్రాల నడుమ ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ మళ్లీ వారంరోజులుగా తమిళ జాలర్ల దోపిడీ యథావిధిగా కొనసాగుతుందని మత్స్యకారులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా తీరం వెంబడి నిబంధనలకు విరుద్ధంగా తమిళ జాలర్లు తమ స్పీడ్ బోట్లతో సముద్రంలోని మత్స్య సంపదను గాలించి తీసుకెళ్లిపోతున్నారు. అడ్డొచ్చిన స్థానిక జాలర్లను ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసురుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. కడలూరు, నాగూరు నాగపట్నం తదితర ప్రాంతాలకు చెందిన జాలర్లు ప్రత్యేకంగా చిన్న రంధ్రాలతో తయారు చేసిన వలలతో స్పీడ్ బోట్ల ద్వారా హద్దులు దాటి జిల్లా సముద్రంలో చేపలను తీసుకెళ్తున్నారు. కడు పేదరికంతో సముద్ర మత్స్య సంపదే ఆధారంగా జీవనం సాగిస్తున్న జిల్లా మత్స్యకారులు కొన్నిరోజులుగా పూటగడవక లబోదిబోమంటున్నారు. కనీసం ఆయిల్ ఖర్చులు గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది వేట నిలిపేసి ఇంటికే పరిమితమయ్యారు. సాధారణంగా స్పీడ్ బోట్లు 8 నాటికల్ మైళ్ల దూరం పైన వేట చేయాలి. అలా కాకుండా తమిళ జాలర్లు అధికారుల నిబంధనలు బేఖాతరు చేయకుండా 3 నాటికల్ మైళ్ల దూరంలోనే స్పీడ్ బోట్లతో వేట చేస్తున్నారు. చిన్న నలక చేపలు సైతం పొరుగు రాష్టాల దోపిడీకి గురవుతుండటంతో స్థానిక మత్స్యకారులు బాధను వ్యక్తం చేస్తున్నారు. -
టీబీ ముక్త్ అభియాన్కు సహకరించాలి
నెల్లూరు(అర్బన్): దేశంలో టీబీ నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూరు రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ప్రైవేట్ వైద్యులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా టీబీ, ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణాధికారి ఖాదర్వలీ కోరారు. జిల్లాలోని టీబీ కేసులు, వైద్య శాఖ చేపట్టిన నివారణ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ను నగరంలోని రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలిక్లినిక్లో గల సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీబీ నివారణే లక్ష్యంగా నూరు రోజుల కార్యక్రమాన్ని మార్చి 24న ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు సమన్వయంతో పనిచేస్తూ టీబీ కేసులను గుర్తించాలని కోరారు. రెండు వారాలకు మించి దగ్గు, ఆకలి మందగించడం, సాయంత్రం జ్వరం రావడం లాంటి లక్షణాలున్న వారికి టీబీ పరీక్షలు చేయించాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ పరీక్షలు, వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో అనుమానిత కేసులను గవర్నమెంట్ హాస్పిటళ్లకు సిఫార్సు చేయాలని కోరారు. వ్యాధి నిర్ధారణైన వారికి పౌష్టికాహారానికి సంబంధించిన నిధులను ఖాతాలో జమ చేయనున్నారని వెల్లడించారు. పీపీఎం కో ఆర్డినేటర్ హరీష్, రామచంద్రారెడ్డి వైద్యశాల సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, డాక్టర్లు రమేష్బాబు, శ్రీనునాయక్, శైలజ, పద్మావతి, నారాయణస్వామి పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
● రూ.2 లక్షల నష్టం చిల్లకూరు: గూడూరు రెండో పట్టణంలోని జీఎస్ రాయులు సినిమా హాల్ ప్రాంతంలోని ఓ కిరాణా దుకాణంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు.. సురేష్ అనే వ్యక్తి జీఎస్ రాయులు హాల్ సమీపంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాప్తించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు అనుమసముద్రంపేట: మండల కేంద్రంలోని దొరసానమ్మ తోటలో ఉన్న ప్రైవేట్ బస్సులను బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు, ఆత్మకూరు సీఐ గంగాధర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఏఎస్పేట దర్గా నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్నిమాపక, పోలీస్, రవాణా శాఖల అధికారులు వాహనాలపై దృష్టి పెట్టారు. డ్రైవర్లకు, యజమానులకు తగిన సూచనలిచ్చారు. అతి వేగంగా బస్సులు నడపరాదని సూచించారు. వారి వెంట ఏఎస్పేట ఎస్సై సైదులు, సిబ్బంది ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
నెల్లూరురూరల్: గుడ్ ఫ్రైడేగా సందర్భంగా శుక్రవారం నెల్లూరు 51వ డివిజన్ కపాడిపాళెంలో ఉన్న సెయింట్ జోసెఫ్ క్యాథెడ్రల్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనల్లో కార్యక్రమంలో నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఆయనశిలువ మోసి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ఏసుక్రీస్తు ప్రజల కోసం అనుభవించిన బాధలు, ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి సందీప్, కార్పొరేటర్ సాహిత్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాళెంలో సీఎం చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి శిలువ మోశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● నెల్లూరు(బృందావనం): నగరంలోని అన్ని చర్చీల్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలను ఆలపించారు. -
మహిళలకు అండగా వైఎస్సార్సీపీ
నెల్లూరు(పొగతోట): రాష్ట్రంలోని మహిళలకు తమ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేయనున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. మహిళలపై టీడీపీ ప్రభుత్వంలోని నేతలు వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడుతుంటే సీఎం చంద్రబాబు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దాష్టీకాలను ప్రశ్నించిన మహిళలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా.. బాధిత మహిళలను బెదిరించడం.. వేధింపులకు గురిచేయడం.. కేసులు పెట్టడం.. ఆపై వెనక్కి తీసుకునేలా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై సాక్ష్యాలతో సహా మహిళ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యల్లేవన్నారు. ఈమైపె పట్టపగలు ప్రజలు, పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకునే స్థితిలో లేరని దుయ్యబట్టారు. విచారణ పూర్తయ్యేంత వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించినా, అదెక్కడా అమలు కావడంలేదని విమర్శించారు. వారి విధులను నిర్వర్తించాలనే ఆలోచనలో సైతం ఖాకీలు లేరని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారని పేర్కొన్నారు. నేరస్తులను తప్పించాలని చూస్తున్నారని, దీంతో నేరాలు మరింత పెరిగిపోతున్నాయని తెలిపారు. సత్తెనపల్లిలో మహిళా ఉద్యోగిపై దాడి చేశారన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలు కరువైనా, కూటమి నేతలు సంబరాలు జరుపుకొంటున్నారని విమర్శించారు. మహిళల కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేసిన దిశ చట్టాలు, ఇతర సంస్కరణలను తీసేశారని ఆరోపించారు. జగనన్నకు మంచిపేరొస్తుందనే దురుద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉండేదని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ను పొగిడేందుకే హోం మంత్రి పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. దాడులు, అఘాయిత్యాలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లి శిక్ష పడేలా చూస్తామన్నారు. -
కూటమి పాలనలో కుదేలు
తేమల్లో, మొగ్గుల్లో ఎంతైనా దోచుకో.. నిన్ను మేం అడగం..!సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని దళారులు, మిల్లర్లు దోచుకునే విధంగా కూటమి ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. ధరలు పతనమై పెట్టిన పెట్టుబడులు రాక కర్షకులు కన్నీరుమున్నీరవుతుంటే.. కనికరం లేని సర్కారు పెద్దలు ధాన్యం ధరలను రోజు రోజుకు పతనం చేస్తూ మిల్లర్లకు మద్దతుగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత విషాదకరం. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ (బీజీ)లు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నారని 1:3 నిష్పత్తిలో బీజీలు తీసుకుని ధాన్యం సరఫరా చేయాలంటూ సాక్షాత్తు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలో చెప్పడం బట్టి చూస్తే.. రైతులపై వీరికున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో పుట్టి రూ.24 వేలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేఎన్ఎం రకం ధాన్యం పుట్టి రూ.24 వేల వరకు ధరలను స్థిరీకరించింది. ఇది అప్పట్లో కేంద్రం నిర్ణయించిన ఎంఎస్పీ కంటే రూ.5 వేలు అదనంగా ఉంది. ఇక షుగర్ లెస్ రకం అయితే అప్పట్లో పుట్టి కోతల సీజన్లో రూ.28 వేల వరకు కొనుగోలు చేసిన పరిస్థితి. ఎంఎస్పీ మించి రూ.9 వేల అదనపు ధర లభించింది. నిల్వ పెట్టిన ధాన్యం రూ.35 వేల నుంచి రూ.39 వేలు పలికింది. ఎంఎస్పీకి రెట్టింపు ధరగా చెప్పొచ్చు. జిల్లాలోని ప్రతి రైస్మిల్లరు పీపీసీల ద్వారానే ధాన్యం కొనాలే కండీషన్ పెట్టింది. పక్క జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి మిల్లర్లను ఆహ్వానించడంతో డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జిల్లాలోని మిల్లర్లు కూడా అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయడంతో ధాన్యం ధరలు పెరగడానికి కారణమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. బోగస్ జిల్లాలో ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారానే కొంటామని ఒక పక్క ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, జిల్లా అధికారం యంత్రాంగం ఊదరగొడుతున్నారు. అయితే గతంతో పోల్చితే.. కొనుగోలు కేంద్రాలను గణనీయంగా తగ్గించేశారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 250పైగా కొనుగోలు కేంద్రాలు ఉంటే.. ఈ రబీ సీజన్లో 167 పీపీసీ (ధాన్యం కొనుగోలు కేంద్రాలు)లు అధికారులు ఏర్పాటు చేశారు. పీపీసీలకు ఏ రోజుకు ఆ రోజే ఇండెంట్ రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. రిలీజ్ ఆర్డర్ పూర్తయితే.. మరుసటి రోజు వరకు రిలీజ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో రైతులు ఈ తలనొప్పులు భరించలేక దళారులకు తెగనమ్ముకుంటున్నారు. అయితే ఈ పీపీసీల ద్వారా దిగుబడి అయిన ధాన్యంలో 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని తమకు ఆదేశాలు ఉన్నాయని ఇటీవల సివిల్ సప్లయ్స్ అధికారులు వెల్లడించడాన్ని బట్టి చూస్తే.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. బోగస్ కేంద్రాలని స్పష్టమవుతోంది. జిల్లాలో అధికారిక సాగు విస్తీర్ణం 7.7 లక్షల ఎకరాలు అనధికారికంగా సాగు 1.5 లక్షల ఎకరాలు ప్రతి ఎకరాకు సగటు దిగుబడి 3.5 పుట్లు (3 మెట్రిక్ టన్నులు) జిల్లాలో సగటున వచ్చే దిగుబడి 27.37 లక్షల మెట్రిక్ టన్నులు పీపీసీల ద్వారా కొనుగోలుకు అనుమతి 2 లక్షల మెట్రిక్ టన్నులు 7.3 శాతమే ప్రభుత్వం కొనుగోలు జిల్లాలో ఐఏబీ సమావేశంలో అధికారికంగా 7.70 లక్షల ఎకరాలకు సాగునీటి కేటాయింపులు చేసింది. ఇదంతా అధికారిక ఆయకట్టు విస్తీర్ణమైతే.. అనధికారికంగా మరో 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. మొత్తంగా చూస్తే 9.20 లక్షల ఎకరాల్లో సగటు దిగుబడి (3.5 పుట్లు) లెక్కన సుమారుగా 27.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం పీపీసీ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడం బట్టి.. జిల్లాలో దిగుబడి అయిన ధాన్యంలో కేవలం 7.3 శాతమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టమవుతోంది. ఇందులో కూడా టీడీపీ నేతలైన పీఏసీఎస్ అధ్యక్షులు రైతుల పేరుతో విక్రయించినవే అధిక శాతం ఉందని సమాచారం. ఇక 92.7 శాతం ధాన్యాన్ని దళారులు, మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసి దోచుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం వరి కోతలు పూర్తి కాగా, మరో వారానికి కోతలు పూర్తి కానున్నాయి. అలంకారప్రాయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు దిగుబడి ధాన్యంలో 7.3 శాతాన్నే సేకరిస్తున్న ప్రభుత్వం మిగతా 92.7 శాతాన్ని దళారుల ద్వారా మిల్లర్ల కొనుగోలు పీపీసీలకు ఏ రోజుకు ఆ రోజే రిలీజ్ ఆర్డర్ సివిల్ సప్లయ్స్ శాఖ నుంచి అనుమతి ఉంటేనే ట్రక్ షీట్ జిల్లాలో ఇప్పటికే 70 శాతం రబీ వరి కోతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేఎన్ఎం పుట్టి రూ.24 వేలు, ఇప్పుడు రూ.17 వేలు షుగర్ లెస్ అప్పట్లో పుట్టి రూ.35 వేల నుంచి రూ.39 వేలు ఇప్పుడు రూ. 17 వేల నుంచి రూ.18 వేల్లోపే తేమ, తరుగు పేరుతో రైతుల నుంచి మరో రూ.రెండు వేల వరకు దోచుకుంటున్న దళారులు, మిల్లర్లు ఎంఎస్పీ ప్రకారం పుట్టి రూ.20,389 ఉంటే.. రూ.15 వేల నుంచి రూ.17 వేలకే కొంటున్న వైనంజిల్లాలో ధాన్యం విక్రయాల్లో రైతులు గింజ గింజలోనూ దోపిడీకి గురవుతున్నారు. పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు. ఇక్కడ రైతుల పేరుతో టీడీపీ నేతలు, సొసైటీ అధ్యక్షులు, దళారులు, మిల్లర్లే నమోదు చేసుకుంటూ నిలువునా దోచుకుంటున్నారు. ఎంత ధాన్యం పండితే అంత కొనుగోలు చేస్తామంటూ సర్కారు పెద్దలు, మంత్రులు, అధికార యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పీపీసీల ద్వారా రోజుకు ఇంత ధాన్యమే కొనాలని టార్గెట్లు విధించడంతోపాటు ఏ రోజుకు ఆ రోజు కొనుగోలు రిలీజ్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ రిలీజ్ ఆర్డర్ వస్తేనే ట్రక్ షీట్ ఇచ్చే పరిస్థితి పీపీసీల్లో నెలకొంది. సివిల్ సప్లయ్స్ శాఖాధికారులు చెప్పడం బట్టి చూస్తే.. కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్లో రెండు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో సగటున దిగుబడి అయ్యే ధాన్యంలో 7 శాతం కూడా ప్రభుత్వం కొనడం లేదని స్పష్టమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిప్పటి నుంచి రైతులు దళారులు, మిల్లర్లకు తోడు టీడీపీ నేతల చేతిలో నిలువు దోపిడీకి గురవుతున్నారు. గడిచిన రెండు సీజన్లుగా ధరలు చూస్తే.. ఎంఎస్పీ ప్రకారం పుట్టి రూ.20,389 ఉంటే రూ.15 వేల నుంచి రూ.17 వేలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అత్యంత డిమాండ్ ఉన్న కేఎన్ఎం, జిలకర మసూరి రకాలను రూ.17 వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. ఇక షుగర్ లెస్ రకమైతే మరో రూ.వెయ్యి అదనం. దళారులతోపాటు టీడీపీ నేతలు రైతుల దగ్గర అతి తక్కువకు కొనుగోలు పీపీసీల ద్వారా ట్రక్ షీట్లకు అనుమతులు తీసుకుని మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ధరలు పరిస్థితి ఇలా ఉంటే.. ధాన్యం కొనుగోలులోనూ మరో దోపిడీ జరుగుతోంది. పుట్టి ధాన్యం 845 కేజీలకు తేమ, తరుగు పేరుతో 950 కేజీల నుంచి వెయ్యి కేజీల వరకు రైతులను సేకరిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి పుట్టికి మరో రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు దోపిడీకి గురవుతున్నారు. -
రైల్లో మహిళ ప్రసవం
● తల్లీబిడ్డ క్షేమం నెల్లూరు(క్రైమ్): ఓ గర్భిణి రైల్లో ప్రయాణిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. రైల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నా యి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదిపూడి మనోజ్, వెంకటేశ్వరమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకటేశ్వరమ్మ గర్భిణి. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో చెరువు గుంతల వద్ద కాపలా ఉండేందుకు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం చీరాల నుంచి పూరి – తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో బయలు దేరారు. రైలు కావలి రైల్వేస్టేషన్ దాటగానే వెంకటేశ్వరమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యా యి. మనోజ్, కుటుంబ సభ్యులు ఆమెకు ధైర్యం చెబుతూ ఉండగానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బిట్రగుంట రైల్వే అధికారులు వైద్యబృందంతో ప్లాట్ఫారంపై సిద్ధంగా ఉన్నారు. రైలు స్టేషన్కు చేరుకోగానే వైద్యులు భోగిలోకి వెళ్లి ఆమెను పరీక్షించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం నెల్లూరు 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. రైలు నెల్లూరు స్టేషన్కు రాగానే 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆస్పత్రికి తరలించారు. -
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
వెంకటాచలం: చికెన్ వ్యర్థాలతో వెళ్తున్న వాహనాన్ని గురువారం రాత్రి పట్టుకున్నారు. వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ క్రమంలో గూడూరు వైపు నుంచి నెల్లూరు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, చికెన్ వ్యర్థాలు ఉండటాన్ని కనుగొన్నారు. దీంతో వాహనాన్ని సీజ్ చేశారు. వెంకటాచలం సమీపంలోని అడవిలో గుంత తవ్వి వ్యర్థాలను మత్స్యశాఖ అధికారుల సమక్షంలో పూడ్చిపెట్టారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 62,642 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 23,887 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల గోదాముల్లో తనిఖీలు చిల్లకూరు: గూడూరు పట్టణంలోని పలు గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన గోదాములను సివిల్ సప్లయ్స్ జిల్లా అధికారి లీలారాణి శుక్రవారం తనిఖీ చేశారు. ఏజెన్సీల వారు అధిక ధరలకు విక్రయించి.. డిమాండ్ సృష్టించిన అంశమై పలు ఫిర్యాదులు రావడంతో ఆమె పరిశీలించారు. నిల్వలు ఎంత మేర ఉన్నాయి.. బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తున్నారాననే అంశాలను ఆరాతీసిన అనంతరం ఆమె మాట్లాడారు. అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వినియోగదారులు సైతం అవసరమైనంత మేరకే బుక్ చేసుకోవాలని కోరారు. పట్టణంలోని సాయి గ్యాస్ ఏజెన్సీపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, పునరావృతమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామన్నారు. గూడూరు డీటీ చైతన్య పాల్గొన్నారు. జడ్జి పరీక్షల్లో కావలి వాసికి తృతీయ ర్యాంక్ కావలి: జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో కావలికి చెందిన దరిశి వెంకటసత్య ధనూషా రాష్ట్రస్థాయిలో తృతీయ ర్యాంక్ను సాధించారు. పట్టణంలోని దరిశి వెంకటశ్యామ్ ప్రసాద్, వనజ కుమార్తె అయిన ఈమె ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంతో పాటు సీఏ, ఎంఏ జర్నలిజం విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయవాదిగా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమై జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభను చూపారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 46.190 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 350, లోలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు ఐదు క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నామని వెల్లడించారు. -
అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తారు?
● ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు కట్టలేని పరిస్థితి ● వైఎస్సార్సీపీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డినెల్లూరు సిటీ: ‘ప్రైవేట్ హాస్పిటళ్లకు రూ.3 వేల కోట్లు బకాయిలు కట్టలేక ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు’ అని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాళెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణం పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ చేస్తూ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పొట్టగొట్టి పొలాలను తీసుకుని రియల్ ఎస్టేట్ చేసి అవినీతికి పాల్పడటానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నారు. చంద్రబాబు నాయుడుపేటకు వచ్చి పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. చేయని పనిని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తెచ్చింది తానేనని బాబు చెప్పడం దారుణమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టించారన్నారు. పథకాలు, వివిధ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పేర్లు మార్చి తన ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తు న్నారన్నారు. తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మండలాధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్ప్రసాద్రెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, నవీన్రెడ్డి, ఇక్బాల్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక
నెల్లూరు(లీగల్): జూనియర్ సివిల్ జడ్జిలుగా నెల్లూరుకు చెందిన ఇద్దరు యువ మహిళా న్యాయవాదులు ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు ఫలితాలు విడుదల చేసింది. నెల్లూరు వాసి పెళ్లకూరు చెంచుకృష్ణ ప్రియాంక దేవి, దామరమడుగు దివ్యశ్రీ ఎంపికయ్యారు. ప్రియాంకదేవి సీనియర్ న్యాయవాది పీసీ కృష్ణయ్య చిన్న కుమార్తె. దివ్య సీనియర్ న్యాయవాది శ్రీనివాసమూర్తి వద్ద జూనియర్గా పనిచేస్తున్నారు. తండ్రి నేవీ ఉద్యోగి. వీరి ఎంపికపై నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులిమి అయ్యప్పరెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకుడు రోజా రెడ్డి, ఐక్యవేదిక నాయకుడు కుడుముల రవికుమార్ తదితరులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. -
మహిళా సదస్సు రేపు
నెల్లూరు రూరల్: నగరంలోని గాంధీనగర్లో గల ఆరెస్సెన్ కల్యాణ మండపంలో మహిళా సదస్సును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హాజరుకానున్నారు. జిల్లాలోని మహిళలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పూజిత కోరారు. పది పరీక్షలు ముగిశాయి నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 27,992 మందికి గానూ 27,748 మంది హాజరయ్యారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. -
పర్యావరణ అధికారుల పరిశీలన
వరికుంటపాడు: మండలంలోని వరికుంటపాడు, భాస్కరాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 233, 1లో సుమారు 16 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొండ ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ పరిరక్షణ మంత్రిత్వ శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ గురువారం పరిశీలించారు. గ్రామంలో మైనింగ్కి సంబంధించిన కార్యకలాపాలు చేపట్టొద్దంటూ ప్రజలు జాతీ య పర్యావరణ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న చర్చి, శివాలయం, పాఠశాల, నివాస గృహాలు, వ్యవసాయ భూములు, అటవీ భూములను గ్రామస్తులు అధికారులకు చూపించారు. ఈ కొండ ప్రాంతం పశువులకు జీవనాధారమని, మైనింగ్ పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా మైనింగ్ డీడీఏ శ్రీనివాసరావు, కొండేపోగు దిలీప్కుమార్, చల్లగాలి వెంకటమోహన్, నల్లగొర్ల నరసింహ, షేక్ పేరయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి పేరిట అడ్డగోలు దోపిడీ
● చట్టబద్ధత అంటూ కొత్త డ్రామాలు ● చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అక్కడ రాజధాని ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): అమరావతి పేరిట అడ్డగోలుగా దోపిడీ చేసేందుకే చట్టబద్ధత అంటూ కొత్త డ్రామాలను సీఎం చంద్రబాబు ఆడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహేంద్రబాబు, లక్ష్మి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనారోగ్యానికి గురైన రావి రవీంద్రబాబురెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజధాని విషయంలో సరికొత్త ప్రతిపాదనను తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. దీంతో టీడీపీ నేతలకు మింగుడుపడక అయోమయంలో పడ్డారని విమర్శించారు. మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ రాజధాని కారిడార్ను నిర్మించాలనే ఆయన ప్రతిపాదనను తెలుగు ప్రజలు ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణ పనుల్లో చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల మేర తన అస్మదీయులకు చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రజలను ఆయన ఉద్ధరించరని, తన స్వప్రయోజనాల కోసమే పాటుపడతారని విమర్శించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో లక్ష ఎకరాలను రైతుల నుంచి సేకరించి, ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోవడంతో భూములిచ్చిన వారు మండిపడుతున్నారని చెప్పారు. దేవతల రాజధాని అమరావతి అంటూ సినిమా టైటిళ్లను చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.మూడు లక్ష కోట్లకుపైగా అప్పులు చేసిందని, రాష్ట్రంపై ఎన్నడూ లేని విధంగా ఆర్థిక భారం పడిందన్నారు. రాజధాని పేరుతో దాని చుట్టూ వేల ఎకరాల భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసి, అమరావతికి ఎక్కడా లేని పేరు ప్రఖ్యాతలున్నాయనే ప్రచారాన్ని సాగిస్తున్నారని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతూ.. మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటానని ఢాంబికాలు పలుకుతున్నారని విమర్శించారు. 2028లోపు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారని, ఆలోపే కంప్లీట్ చేస్తే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చెప్పిన విధంగా మరో 15 ఏళ్లు కూటమి పాలనే కొనసాగితే, అమరావతిని రాజధానిగా చేసుకునేందుకు అభ్యంతరాలుండవు కదానన్నారు. చంద్రబాబు తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే చట్టబద్ధతను తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయనున్నామని వెల్లడించారు. నేతలు ఆలపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యుడు రావి విజయ్కుమార్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్, చెంగారెడ్డి, దిలీప్కుమార్రెడ్డి, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..
● వ్యక్తి బలవన్మరణం నెల్లూరు సిటీ: కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి మద్యంలో గడ్డిమందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండలంలోని దొంతాలి గ్రామంలో నర్రా వెంకటరాజు (55) నివాసముంటున్నాడు. వివాహమై ఇద్దరు కుమారులున్నారు. అతని భార్య మూడు సంవత్సరాల క్రితం కేన్సర్తో చనిపోయింది. వెంకటరాజు ఒంటరిగా ఉంటున్నాడు. అనారోగ్యంతో నిత్యం బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లోనే మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగాడు. హైదరాబాద్ నుంచి గురువారం పెద్ద కుమా రుడు యశ్వంత్ వచ్చా డు. ఇంట్లోకి వెళ్లగా అపస్మారకస్థితి లో తండ్రి కనిపించాడు. వెంటనే 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. సిబ్బంది హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంకటరాజు గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు
నెల్లూరురూరల్: ప్రశ్నించే వారిపై కూటమి ప్రభు త్వం అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నా రు. అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో గురువారం వారు, నేతలు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న నాయకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కేసులతో భయపెట్టే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
● నెల్లూరులో ఘటననెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని ఓ వృద్ధుడు లక్నో ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున నెల్లూరు రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో కావలి వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడు సుమారు 5.3 అడుగుల ఎత్తు ఉన్నాడు. 60 నుంచి 65 సంవత్సరాల్లోపు వయస్సు ఉంటుంది. కాషాయం రంగు ఫుల్హ్యాండ్స్ చొక్కా, బంగారు అంచుగల కాషాయం రంగు పంచె ధరించి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
సాక్షి,నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఐదవ వీధిలో ఓ మహిళపై భర్త దారుణ హత్య జరిపిన ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల జర్సీ అనే యువతిని ఆమె భర్త వంశీ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో అధిక కట్నం తేవాలని వాదనలతో భార్యపై వంశీ దాడి చేశాడు.అనంతరం సాయంత్రం సమయంలో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. -
మధ్యంతర భృతిని చెల్లించాలి
● కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): పీఆర్సీ కమిటీని నియమించాలని, మధ్యంతర భృతిని చెల్లించాలని నగరంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం యూటీఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు వీవీ శేషులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ వెంకట్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్.గౌస్బాషా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను పాత పింఛన్ విధానంలోకి మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 57ను తప్పక అమలు పరచాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆకస్మికంగా మృతిచెందిన 956 మంది ఉపాధ్యాయులకు సంబంధించి వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.కిరణ్కుమార్, రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్.గౌస్బాషా, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి చలపతిశర్మ, గౌరవాధ్యక్షుడు ఎంసీ అచ్చయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు షేక్.ఖాజావలీ, పి.సుభాషిణి, కోశాధికారి ఎ.మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
పురిటి బిడ్డ మృతి
● సీహెచ్సీ ఆవరణలో కుటుంబసభ్యుల ఆందోళన ఉదయగిరి రూరల్: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురిటి బిడ్డ మృతిచెందిన ఘటనపై బాధిత కుటుంబసభ్యులు బుధవారం సీహెచ్సీ ఆవరణలో బైటాయించి ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. వరికుంటపాడు మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లెబోయిన పావనికి నెలల నిండి ఉమ్మనీరు పోవడంతో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. వైద్యురాలు నాగజ్యోతి తన సిబ్బందితో కలిసి వేకువజామున పావనికి కాన్పు చేశారు. అయితే కాన్పు సమయంలో పుట్టిన మగబిడ్డ మృతిచెందడంతో వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం కాన్పు చేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ వైద్యశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వైద్యురాలు మాత్రం పావనికి ఇంటి వద్ద ఉమ్మనీరు పోయి వైద్యశాలకు వచ్చిందన్నారు. గైనకాలజిస్ట్ సూచనల మేరకు వైద్యం అందించామన్నారు. కష్టమైన కాన్పు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు వైద్యశాలకు వెళ్లాలని సూచించామన్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇక్కడే వైద్యం అందించాలని కోరారన్నారు. దీంతో కాన్పు చేసిన తర్వాత బిడ్డ మృతిచెందిందని ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. -
అక్రమాల్లో ఆరితేరిన సోమిరెడ్డి
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి వెంకటాచలం: అభివృద్ధి, సంక్షేమ పాలనే తమ లక్ష్యమని.. అయితే అవినీతి, అక్రమాల్లో ఆరితేరడం సోమిరెడ్డి నైజమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ మంగళంపాడు గిరిజన కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల సాత్విక గ్రావెల్ గుంతలో పడి గత నెల 29న మృతి చెందింది. ఈ క్రమంలో బాలిక కుటుంబాన్ని బుధవారం పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ నలగర్ల దేవసేనమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో కాకాణి మాట్లాడారు. గ్రావెల్ గుంతలో పడి బాలిక మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డి ధనదాహంతో ఎక్కడ చూసినా తాటిచెట్టు లోతులో గ్రావెల్ గుంతలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిలో పడి చిన్నారులు మృత్యువాత పడుతున్నా, గ్రావెల్ తవ్వకాలను నిలపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సర్వేపల్లి కేంద్రంగా సర్వం దోపిడీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డంపెట్టుకొని సోమిరెడ్డి సర్వం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పొదలకూరులో జరిగిన రెండు కార్యక్రమాల్లో వాస్తవాలను సోమిరెడ్డి అంగీకరించడం సంతోషకరమన్నారు. సోమిరెడ్డి తరహాలో అవినీతికి పాల్పడటం తనకు చేతకాదని తెలిపారు. టీడీపీ కొలువుదీరాక సోమిరెడ్డి చేసిన అవినీతి చిట్టా చాంతాడంత ఉందన్నారు. కాకుటూరు శివాలయ భూములు.. విరువూరు, సూరాయపాళెం రీచ్లలో రేయింబవళ్లు ఇసుకను అక్రమంగా తరలించి దోచుకోవడం.. లేఅవుట్ల యజమానులను బెదిరించి ముడుపులు తీసుకోవడం.. ఇలా ఎన్నో ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలో పర్యటించినా, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే దర్శనమిస్తున్నాయని తెలిపారు. కూటమి పాలనలో చేసిన అభివృద్ధి పనులేంటో ధైర్యంగా చెప్పగలరానని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఎంత మేర అభివృద్ధి పనులు జరిగాయో ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, నేతలు కొణిదెన విజయభాస్కర్నాయుడు, కనుపూరు మధుసూదన్రెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, నలగర్ల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
నువ్వు కాకపోతే.. మరొకరు
● ఎమ్మెల్యే కాకర్లపై చంద్రబాబు ఫైర్ ● ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం చివాట్లు సాక్షి టాస్క్ఫోర్స్: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పనితీరు బాగాలేదని, మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని సీఎం చంద్రబాబు మందలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వింజమూరు పర్యటనలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని ముఖ్య టీడీపీ నేతలతో హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని కార్యకర్తల ముందే కుండబద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే ఉదయగిరి 171వ స్థానంలో ఉందన్నారు. 2024 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉదయగిరి మొదట్నుంచీ కాంగ్రెస్, వైఎస్సార్సీపీకి బలమైన నియోజకవర్గమని, ఇక్కడి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని చెప్పినట్లుగా సమాచారం. పార్టీ ముఖ్య నేతలకు, ఎమ్మెల్యేకు మధ్య రోజులు గడుస్తున్న కొద్దీ దూరం పెరుగుతున్నట్లుగా తెలుస్తోందని, ఈ గ్యాప్ను వీలైనంత త్వరగా పూడ్చుకోవాలని సూచించినట్లుగా సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గంలో మహిళలకు రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ఉందని, మహిళా నేతలను తయారు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. పార్టీ ముఖ్యమని, నేతలు కాదని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరైనా అభ్యర్థిగా నిలబడే అవకాశముందన్నారు. మీ సొంత ప్రయోజనాల కోసం పార్టీని దెబ్బతీయొద్దని గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి సంబంధించి 1,300 మంది పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్న సమావేశంలో ఎమ్మెల్యే తీరును సీఎం తప్పుబడుతూ హెచ్చరించడంతో ఆ పార్టీ ముఖ్య నేతల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని అన్ని కులాల వారిని కలుపుకోవాలన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు సీఎం వింజమూరు పర్యటన నేపథ్యంలో పత్రికా ప్రకటనలు, ఇతరత్రా ఖర్చుల కోసం ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు నియోజకవర్గ స్థాయిలో పార్టీ పదవులు పొందిన వారి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారని తమ్ముళ్లు బాహాటంగా చర్చించుకుంటున్నారు. రాజకీయ పదవులు పొందినప్పటికీ తాము ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పార్టీ ద్వారా పొందలేదని, అయినా తమ వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేయడంపై పార్టీకి చెందిన పెద్దల వద్ద వాపోయినట్లుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై సంచలన వ్యాఖ్యలు చేసిన వెంగమాంబ అనే మహిళ ముఖ్య పార్టీ నేతల కార్యక్రమానికి వచ్చేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే పోలీసుల ద్వారా ఆమెను సమావేశ మందిరానికి రాకుండా అడ్డుకున్నట్లుగా టీడీపీ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమెను సమావే శానికి రానివ్వకుండా ఓ సీఐ, ఒక మహిళా ఎస్సై తమ ఆధీనంలో ఉంచుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వింజమూరులో చంద్రబాబు పర్యటనతో తన క్రేజ్ పెరుగుతుందని భావించిన కాకర్లకు కార్యకర్తల సమక్షంలోనే చివాట్లు పెట్టడంతో ముఖం చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రత్యర్థి వర్గీయుల్లో ఆనందాన్ని నింపినట్లుగా ఆ పార్టీ కేడర్లో చర్చ సాగుతోంది. నీ పద్ధతి మార్చుకో.. లేకుంటే సహించేది లేదుసమావేశానికి బొల్లినేని డుమ్మా ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లినేని వెంకటరామారావు వింజమూరులో జరిగిన సీఎం సభకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో కాకర్ల సురేష్కు టీడీపీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి బొల్లినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం సురేష్ విజయం సాధించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఘటనలూ లేకపోలేదు. ఈ క్రమంలో బొల్లినేని, కాకర్ల మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరడంతో సీఎం సమావేశానికి బొల్లినేని డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. -
బాలుడికి పెన్షన్ మంజూరు
సోమశిల: అనారోగ్యంతో బాధపడుతూ సదరం సర్టి ఫికెట్ ఉండి కూడా పెన్షన్ మంజూరు కాక, ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న బాలుడి దీనస్థితిపై ఫిబ్రవరి 19న సాక్షి దినపత్రికలో ‘ఆదు కోండయ్యా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. అనంతసాగరం మండల పరిధిలోని పాతదేవరాయపల్లి గ్రామానికి చెందిన చిచ్చు సంతోష్ అనే బాలుడికి దివ్యాంగుల పింఛన్ను మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం సంతోష్కు రూ.6 వేల పింఛన్ను ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ అందజేశారు. దీంతో సంతోష్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెన్షన్ మంజూరు చేసేలా సహాయపడిన సాక్షి పత్రికకు, సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పింఛన్ నగదు సంతోష్ వైద్య ఖర్చులకు సహాయపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్ శోభన్బాబు, డిజిటల్ అసిస్టెంట్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వడ్డీ మాఫీ గడువు పొడిగింపు నెల్లూరు(బారకాసు): రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ అవకాశాన్ని ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థకు బకాయిలు ఉన్న ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ పొందాలని సూచించారు. రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు సిటీ: నెల్లూరు సౌత్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. సౌత్ రైల్వేస్టేషన్కు సమీపంలో గుర్తుతెలియని 60–65 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి రైలు పట్టాలు దాటుతున్నారు. ఈ క్రమంలో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు తెలుపురంగు నిలువుగీత ఫుల్ హ్యాండ్ షర్ట్, బంగారు అంచు తెలుపురంగు పంచె ధరించి ఉన్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ల ఢీ.. నలుగురికి గాయాలు బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై బుధవారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని నలుగురు గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నెల్లూరు వైపు నుంచి కడప వైపునకు వెళ్తున్న కారు, అలాగే యడవల్లి నుంచి కోవూరు వైపునకు వస్తున్న మరో కారు బుచ్చిరెడ్డిపాళెం వద్దకు రాగానే ఊహించని రీతిలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో రెండు కార్లలో మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరిలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బ్లాక్ డే
నెల్లూరు(అర్బన్): కార్మికులకు అండగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు బుధవారం నుంచి పార్లమెంట్ ద్వారా చట్టంగా అమలు కావడాన్ని నిరసిస్తూ ఎల్ఐసీ ఏజెంట్లు, ఐసీయూ(ఇన్సురెన్స్ కార్పొరేషన్ యూనియన్) నాయకులు బ్లాక్ డేను నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బృందావనంలోని సిటీ బ్రాంచ్–2 వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎల్ఐసీ ఏఓఐ నెల్లూరు డివిజన్ రెసిడెంట్ సెక్రటరీ రాపూరు హజరత్రెడ్డి మాట్లాడారు. పోరాటాల ద్వారా ఎన్నో ఏళ్లు కష్టపడి కార్మికుల భద్రత కోసం ఒక్కొక్కటిగా 29 చట్టాలు సాధించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆయా చట్టాలను రద్దు చేయడం ద్వారా ఎల్ఐసీలో పనిచేస్తున్న 14 లక్షల మందిపై చిలుకు ఏజెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా లేకపోవడం, కార్మికుల హక్కులను కాలరాయడం, పని గంటలు పెంచడంతో కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం పాత చట్టాలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల నరసింహారావు, డివిజన్ ఉపాధ్యక్షులు ఎస్.నరసింహులు, వెంకటేశ్వర్లు, బ్రాంచ్ అధ్యక్షుడు రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. ప్రాణం తీసింది
నెల్లూరు సిటీ: తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించి ఉత్తమంగా చూడాలని తల్లిదండ్రులు సంకల్పించారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం నుంచి నెల్లూరొచ్చి ఉన్నంతలో తమ పిల్లలను బాగా చూసుకుంటున్నారు. వీరి ఆశలకు తగిన విధంగానే కుమార్తె బీటెక్ చివరి సంవత్సరం చదువుతూ.. తన ఉజ్వల భవిష్యత్తుకు బాటలేసుకుంటోంది. ఈ తరుణంలో ఓ భవన నిర్మాణ యజమాని నిర్లక్ష్యం.. యువతి ప్రాణాలను బలిగొని ఇంటి ఆశలను చిదిమేసిన హృదయ విదారక ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆనందంగా వెళ్లి.. విగతజీవిగా వచ్చి పొదలకూరు మండలంలోని పద్మావతినగర్కు చెందిన చింతగింజల వెంకటేశ్వర్లు, పావని దంపతులకు కుమార్తెలు హర్షిత (22), పూజిత, కుమారుడు లోకేష్ ఉన్నారు. నగరంలోని నాలుగో మైలుకు కొంతకాలం క్రితం వచ్చి కుటుంబంతో సహా అద్దె ఇంట్లో ఉంటున్నారు. కిసాన్నగర్లోని ఓ రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె హర్షిత గీతాంజలి కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో దుస్తులను కొనుగోలు చేసి స్కూటీపై ఇంటికి బయల్దేరారు. వాహనాన్ని తండ్రి నడుపుతుండగా, వెనుక కుమార్తె కూర్చున్నారు. ఇంటికి మరో రెండు కిలోమీటర్ల దూరం ఉందనగా, కిసాన్నగర్ వద్ద రోడ్డుపై పోసిన ఇసుక కారణంగా బైక్ అదుపుతప్పింది. వెనుక నుంచి వస్తున్న లారీ చక్రాల కింద హర్షిత పడింది. తీవ్రంగా గాయపడటంతో 108కు స్థానికులు సమాచారమిచ్చారు. వారొచ్చి పరిశీలించి, అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. అటువైపు పడటంతో ప్రాణాపాయం నుంచి తండ్రి తప్పించుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంతులేని నిర్లక్ష్యం.. అధికారుల నిర్లిప్తత వాస్తవానికి రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి ఉండకూడదంటూ కార్పొరేషన్ అధికారులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటిది కిసాన్నగర్లో ఓ భవన నిర్మాణం కోసం ఇసుకను నడిరోడ్డుపై పోసినా, ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. అంతులేని ఈ నిర్లక్ష్యం.. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న ఓ విద్యార్థినిని చిదిమేసింది. అసలే సిమెంట్ రోడ్డు.. ఆపై ఇసుకను పోయడంతో బ్రేక్ వేసే క్రమంలో బైక్ అదుపుతప్పి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్పొరేషన్ అధికారుల తీరుపై కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఆ ప్రాంతంలో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడుతో లారీలు నగరంలోకి రావడం సైతం ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రోడ్డుపై ఇసుకను పోసిన భవన యజమాని వాహనం అదుపుతప్పి కిందపడిన ఇంజినీరింగ్ విద్యార్థిని లారీ చక్రాలెక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం కుటుంబసభ్యుల ఆందోళన -
తమిళనాడు బోటు పట్టివేత
● రూ.1.5 లక్షల విలువైన మత్స్య సంపద స్వాధీనం ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం సముద్ర తీరంలో చేపల వేటను అక్రమంగా సాగిస్తున్న తమిళనాడు మత్స్యకారులను అధికారులు వెంబడించి పట్టుకున్నారు. పెట్రోలింగ్ను జిల్లా మత్స్య శాఖ జేడీ శాంతి, మైరెన్ ఎస్సై అంజిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బుధవారం చేపట్టారు. హై స్పీడ్ బోటులో ప్రయాణించిన అధికారులు.. చైన్నెకి చెందిన ఒక బోటు, సుమారు రూ.1.5 లక్షల విలువైన మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని జువ్వలదిన్నె హార్బర్కు తీసుకెళ్లారు. బోటులో ఉన్న మత్స్యకారులను రక్షణ శాఖ అదుపులోకి తీసుకుంది. మరికొన్ని బోట్లు పరారయ్యాయని తెలిపారు. ఏడీ చాంద్బాషా పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ఓపీ సేవల నిలిపివేత నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)లో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నెల్లూరులో ఓపీ సేవలను పలు ఆస్పత్రుల యాజమాన్యాలు బుధవారం నిలిపేశాయి. అత్యవసర కేసులకే చికిత్సను అందిస్తున్నారు. నగరంలోని అరవింద్ కిడ్నీ సెంటర్, నెల్లూరు ఆస్పత్రి, రాజశేఖర్ కంటి ఆస్పత్రి, రెయిన్బో, ఎయిమ్స్ తదితర హాస్పిటళ్లలో సేవలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అరవింద్ కిడ్నీ సెంటర్ అధినేత, ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నారాయణరావు మాట్లాడారు. జిల్లాలో 36 నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించి సుమారు రూ.200 కోట్ల వరకు బకాయిలున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీని ప్రారంభించిన తొలినాళ్ల ప్యాకేజీనే ఇప్పటికే అమలు చేస్తోందని వివరించారు. నిధులను విడుదల చేయకపోవడంతో అప్పులపాలవుతున్నాని, విధిలేని పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టామని వెల్లడించారు. సమ్మెను మరిన్ని ఆస్పత్రులకు విస్తరించనున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర కేసులకు వైద్యాన్ని అందించలేమని స్పష్టం చేశారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు నెల్లూరు (టౌన్): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈ నెల పది వరకు పొడిగించారని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు.. ఏడు నుంచి పది, 12వ తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వెబ్సైట్లో డీఎల్ఈడీ వివరాలు నెల్లూరు (టౌన్): డైట్లో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించనున్న రెండేళ్ల డిప్లొమా కోర్సు (డీఎల్ఈడీ)లో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను apdeecet.apcf ss.in, cse.ap.gov.inలో పొందుపర్చామని డీఈఓ బాలాజీరావు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను బుధవారం విడుదల చేశారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
● రూ.32 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ● చేజర్ల రెవెన్యూలో అవినీతి కంపు ● ఇతర అధికారుల పాత్రపై ఆరా చేజర్ల: నిషేధిత భూముల జాబితా నుంచి సర్వే నంబర్ను తొలగించేందుకు రూ.32 వేల లంచాన్ని డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు వీఆర్వో బుధవారం పట్టుబడ్డారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ వివరాల మేరకు.. చేజర్ల మండలంలోని వావిలేరు పంచాయతీ మజరా గ్రామమైన దొరువుపాడుకు చెందిన గంటా అంజిబాబుకు సంబంధించిన 1.53 ఎకరాల భూమి ఏటూరు రెవెన్యూ పరిధిలో ఉంది. దీన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ఈ తరుణంలో తనకు హక్కులున్నాయని.. నిషేధిత భూముల జాబితా నుంచి సదరు సర్వే నంబర్ను తొలగించాలంటూ కలెక్టర్కు అర్జీని బాధితుడు ఇటీవల అందజేశారు. విచారణ జరిపి సదరు రైతుకు న్యాయం చేయాలంటూ చేజర్ల తహసీల్దార్కు కలెక్టర్ సిఫార్సు చేశారు. క్షేత్రస్థాయి విచారణ నిమిత్తం సదరు ఫైల్ను వీఆర్వో వంశీ ప్రదీప్కుమార్కు పంపారు. దీంతో వీఆర్వో చుట్టూ అంజిబాబు పలుమార్లు తిరిగి విచారణ నివేదికను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అయితే సదరు పొలంలో నలుగురు అన్నదమ్ములు భాగస్తులు కావడంతో రూ.ఎనిమిది వేల చొప్పున రూ.32 వేలను ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశారు. తానంత ఇచ్చుకోలేనంటూ బాధితుడు ప్రాధేయపడ్డారు. అయితే ఇందులో తహసీల్దార్కు వాటా ఇవ్వాల్సి ఉంటుందని వీఆర్వో తెలిపారని బాధితుడు ఆరోపించారు. దీనికి అంగీకరించని అంజిబాబు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ తరుణంలో పక్కా ప్రణాళిక మేరకు ఆదూరుపల్లి సెంటర్లోని టీ స్టాల్ వద్ద అంజిబాబు నుంచి లంచాన్ని వీఆర్వో తీసుకుంటుండగా.. రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ నిమిత్తం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. తహసీల్దార్ పాత్రపై విచారణ ఈ ఉదంతంలో చేజర్ల తహసీల్దార్ పాత్రపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో నిషేధిత జాబితా నుంచి ఇటీవల కాలంలో ఎంత మేర భూములు విముక్తి పొందాయాననే అంశాలను ఆరాతీస్తున్నారు. మండలంలో ఇటీవలి కాలంలో నిషేధిత భూముల జాబితాను పలుమార్లు తారుమారు చేసి ఉన్నతాధికారులు విచారణ జరిపిన ఘటనలూ ఉన్నాయి. దీనికి తోడు ఏసీబీ అధికారుల దాడులతో ఆయా గ్రామాల వీఆర్వోల్లో ఆందోళన మొదలైంది. -
పాత పింఛన్లకు బాబు పబ్లిసిటీ దుబారా
● కొత్తవి మంజూరుకు నేటికీ దిక్కులేదు ● జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వాటికి కోతలు విధిస్తూ.. ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: పాత పింఛన్లను కొత్తగా ఇస్తున్నామనే రీతిలో చంద్రబాబు పబ్లిసిటీ పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని కంటేపల్లిలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 22 నెలలవుతున్నా, కొత్త పింఛన్ల మంజూరుకు దిక్కులేదని ఆరోపించారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో మంజూరు చేసిన వాటికి కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు మంజూరు చేసిన పింఛన్లను తమ ఘనతగా చంద్రబాబు మొదలుకొని సాధారణ కార్యకర్త వరకు నానా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. దుబారా ఖర్చులు మానేస్తే కొత్తగా ఇవ్వొచ్చు పాత పింఛన్ల పంపిణీ పేరిట విమానాలు, హెలికాప్టర్లలో తిరగడం, ప్రభుత్వ ఖర్చుతో సమావేశాలను నిర్వహించడాన్ని చంద్రబాబు మానేస్తే, కనీసం కొందరికైనా కొత్తగా మంజూరు చేయొచ్చని చెప్పారు. కొత్త వాటిని ఎప్పుడిస్తారానని వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, కళాకారులు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారని చెప్పారు. వితంతువులకు మంజూరు చేయడంలో చంద్రబాబుకు కనికరం లేదన్నారు. పర్యటనల్లో తానేమి చేశానో చంద్రబాబు చెప్పుకోలేక, నాటి తమ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పతనమవుతున్న ధాన్యం ధరలు ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయని చెప్పారు. కూటమి పాలనలో పెరిగిన ఎరువుల ధరలతో పెట్టుబడి వ్యయం ఎక్కువై కనీసం ఆ ఖర్చులూ రావడంలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. యూరియా సక్రమంగా అందక, సాగునీరు సాఫీగా పారక అష్టకష్టాలు పడి పంటలు పండించుకుంటే, ధాన్యం చేతికొచ్చే సమయానికి మద్దతు ధర లేక కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు, దళారులు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. మిన్నంటుతున్న ఆక్రందనలు సీఎంగా జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలో 70 నుంచి 80 శాతం ధాన్యాన్ని సేకరించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతున్నాయని చెప్పారు. వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. మంత్రులు, నేతలు, అధికారులు మాటలు చెప్పి వెళ్లిపోవడమే తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పక్షాన నిలిచి ధరలు పెరిగేలా చూడటంలేదని మండిపడ్డారు. పుట్టిపై నిత్యం రూ.500 తగ్గుదల జిల్లాలో ధాన్యం ధరలు చూస్తే గుండెతరుక్కుపోతోందని చెప్పారు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు కూడా కాలేదని, పుట్టి రూ.22 వేలు ఉండగా.. ఇవి ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజుకు రూ.17 వేలకు చేరాయంటే.. సగటున రోజుకు రూ.500 మేర తగ్గించేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా తెరిచి మూడు రోజులకే మూసేశారని ఆరోపించారు. గోనె సంచులను అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం ఉందని ధ్వజమెత్తారు. ధాన్యం రవాణా సౌకర్యాన్ని కల్పించలేక అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, అధ్యక్షులు.. దళారుల అవతారమెత్తి.. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి పాస్పుస్తకాలను తీసుకొని, అధిక మొత్తానికి ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు చెప్పిన విధంగా జిల్లాలో 50 వేల టన్నుల ధాన్యాన్ని పూర్తిగా దళారులు, వ్యాపారుల వద్ద సేకరించిందే తప్ప, రైతుల నుంచి కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని స్పష్టం చేశారు. -
అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం
నెల్లూరు(బారకాసు): ‘చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించకపోతే మేముందుకు?, ప్రజల ఫిర్యాదులు, సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం ఉండటం లేదు’ అని పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నగర కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో 2026 – 27 వార్షిక బడ్జెట్ సమావేశం మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన జరిగింది. అకౌంటెంట్ బడ్జెట్లో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు. మేయర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టామన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్కుమార్ యాదవ్, తహసిన్, కో – ఆప్షన్ సభ్యులు, కమిషనర్ నందన్, అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్ఈ రహంతుజానీ, ఇన్చార్జి సిటీ ప్లానర్ రఘునాథరావు, సెక్రటరీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొందరు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కార్పొరేటర్ల ఆగ్రహం పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలపై గళాన్ని వినిపించారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఎవరూ కూడా సక్రమంగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజల నుంచి పన్నులను ముక్కుపిండి వసూలు చేయడంపై మండిపడ్డారు. తన డివిజన్ పరిధిలో 10 మందికి పైగా కుళాయి కనెక్షన్లు లేకపోయినా రూ.వేలు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారని, ఇది ఎంతవరకు సబబని 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్ అధికారులను ప్రశ్నించారు. పర్యటన నిమిత్తం వార్డులోకి వచ్చే ముందు కమిషనర్, అధికారులు సమాచారం ఇవ్వాలని అనేకమార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నామని, ఇకపై కూడా అలా వస్తే ప్రజలు తిరగబడి గుణపాఠం చెబుతారని 35వ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి అన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై ప్రశ్నిస్తే తప్పా? కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్క గ్రాంట్ కూడా కార్పొరేషన్కు తీసుకురాలేదని 21వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ మొయిళ్ల గౌరి అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ఎంసీలో జరిగిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వంలోని ఎన్సీఏపీ, నుడా, జీజీఎంపీ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధుల (జనరల్ ఫండ్స్)తోనే చేశారన్నారు. పనుల పేరిట పచ్చ నేతలకు కట్టబెడుతూ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్పొరేటర్ కర్తం ప్రతాప్రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో గౌరి తాను ప్రజా సొమ్ము దుర్వినియోగంపై ప్రశ్నించడం తప్పా.. ట్యాక్స్ గురించి మాట్లాడుతుంటే టాపిక్ను డైవర్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. మౌలిక వసతుల కల్పనలో శ్రద్ధ పెట్టకుండా బ్యూటిఫికేషన్, పార్కులపై ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బడ్జెట్లో నిధులు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోందని, వాటిని దేనికి ఏవిధంగా ఖర్చు చేస్తారనే విషయాలపై తెలియజేయాలని అడిగారు.లెక్కలిలా.. 2024 – 25లో ఆదాయం/ఖర్చులు ప్రారంభ నిల్వ : రూ.125.43 కోట్లు జమలు : రూ.210.48 కోట్లు ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు : రూ.335.91కోట్లు ఖర్చులు : రూ.211.14 కోట్లు అంత్య నిల్వ : రూ.124.77 కోట్లు 2025 – 26 బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ : రూ.121.30 కోట్లు జమలు : రూ.585.48 కోట్లు ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు : రూ.706.79 కోట్లు ఖర్చులు : రూ.695.95 కోట్లు అంత్య నిల్వ : రూ.10.83 కోట్లు 2025 – 26కు సవరించిన బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ : రూ.124.77 కోట్లు జమలు : రూ.274.55 కోట్లు ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు : రూ.399.32 కోట్లు ఖర్చులు : రూ.272.92 కోట్లు అంత్య నిల్వ : రూ.126.40 కోట్లు 2026 – 27 బడ్జెట్ అంచనాలు ప్రారంభ నిల్వ : రూ.126.40 కోట్లు, జమలు : రూ.366.35 కోట్లు ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం జమలు రూ.492.76 కోట్లు ఖర్చులు : రూ.473.31 కోట్లు అంత్య నిల్వ : రూ.19.45 కోట్లతో ప్రతిపాదించి ఆమోదించారు. కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ సమావేశంలో కార్పొరేటర్ల అసంతృప్తి రూ.473.31 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు -
వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి
● టీడీపీ ఎంపీటీసీ సభ్యుడి నిర్వాకం ● ఇంటి కిటికీలు, ఎలివేషన్ ధ్వంసం ● అడ్డొచ్చిన వారిపైనా దాడికొడవలూరు: అధికారం అండ చూసుకుని టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన వారైతే చాలు అనవసర విషయాల్లోనూ జోక్యం చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు కొడవలూరు మండలం యల్లాయపాళెంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన అద్దం పడుతోంది. వివరాలిలా ఉన్నాయి. యల్లాయపాళేనికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తాటిపర్తి భాస్కర్ సొంత పనులపై కారులో సోమవారం బుచ్చిరెడ్డిపాళేనికి వెళ్లాడు. అదేరోజు రాత్రి తిరిగి ఇంటికొస్తున్నాడు. ఊరి మొదట్లో పరిచయస్తుడైన ట్రాక్టర్ డ్రైవర్ శేషయ్య కనిపించగా కారు నిలిపి మాట్లాడుతున్నాడు. వెనుకనే కారులో వచ్చిన టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజేంద్ర హారన్ కొట్టాడు. దీంతో కారును పక్కకు తీసినా దుర్భాషలాడారని భాస్కర్ తెలిపాడు. తదుపరి భాస్కర్ ఇంటికెళ్లిపోయాడు. రాజేంద్ర తన అనుచరులైన కోలగట్ల సుమంత్, కోలగట్ల సుకుమార్తో కలిసి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కర్రలు, రాళ్లతో భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. కిటికీలు, ఎలివేషన్ అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు అడ్డొచ్చిన భాస్కర్ భార్య సునీత, కుమార్తైపెనా చేయి చేసుకున్నారు. బాధితులు మంగళవారం కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిపై దాడికి పాల్పడిన రాజేంద్రపై రౌడీషీట్ కూడా ఉన్నందున తమ ప్రాణాలకు హాని ఉందని పేర్కొన్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మూడు ఆలయాల్లో హుండీ కానుకల చోరీ
ఉదయగిరి రూరల్: మండలంలోని దాసరిపల్లి, అప్పసముద్రం పంచాయతీ చవటపల్లి గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం మేరకు.. దాసరపల్లి గ్రామ బీసీ కాలనీలో ఉన్న నాగార్పమ్మ ఆలయం, చౌటపల్లిలోని మహాలక్ష్మమ్మ, గంగమ్మ తల్లి ఆలయాల్లో ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం అటువైపుగా వెళ్లిన స్థానికులు ఆలయాల తలుపులు తెరిచి ఉండటం, హుండీలు లేకపోవడాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించారు. అనంతరం పరిసరాలను పరిశీలించగా చౌటపల్లి గ్రామ చెరువు సమీపంలో నగలు, నగదు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడవేసిన హుండీలు కనిపించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. కండలేరులో 46.490 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 46.490 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 650, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 150, పిన్నేరు కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
ఆత్మకూరు: పట్టణంలోని బీఎస్సార్ సెంటర్లో దర్గా ప్రహరీని ఆనుకొని నిర్మించిన గదుల నుంచి రోడ్డుపైకి వచ్చిన నిర్మాణాలను కమిషనర్ గంగాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం తొలగించారు. ఈ ప్రాంతంలోని బీఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న కొన్ని ఆక్రమణలను మూడు రోజుల క్రితం తొలగించగా, కొందరు మంగళవారం వరకు అనుమతి కోరారు. వీటిని తొలగించేందుకు యత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తాము వక్ఫ్బోర్డుకు అద్దె.. మున్సిపాల్టీకి పన్నును చెల్లిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మీరామొహిద్దీన్ పేర్కొన్నారు. ఎస్సై జిలానీ జోక్యం చేసుకొని టీపీఓ సహకారంతో ఆక్రమణలను జేసీబీతో కూల్చేశారు. తాను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా, ఇలా తొలగించడం అన్యాయమని మీరామొహిద్దీన్ వాపోయారు. త్వరలో ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులు చేయించి.. బీఎస్సార్ విగ్రహం చుట్టూ ఐల్యాండ్ను నిర్మించనున్నామని మున్సిపల్ సిబ్బంది తెలిపారు.జేసీబీకి అడ్డుగా నిలిచిన మీరామొహిద్దీన్ ఆక్రమణల తొలగింపు -
ఎందుకీ వివక్ష?
ప్రతిపక్షంపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదని 29వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ షేక్ సత్తార్ అన్నారు. మమ్మల్ని కార్పొరేటర్లుగా అధికారులెవరూ చూడటం లేదని, దీంతో స్థానిక డివిజన్ ప్రజల్లో గౌరవం కూడా లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా వాటర్ ప్లాంట్ ధ్వంసం తన డివిజన్ పరిధిలో ఉన్న వాటర్ ప్లాంట్ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేశారని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలంటూ 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ మేయర్ను కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్పొరేటర్లందరూ మేయర్కు వినతిపత్రం అందజేశారు. -
అంతా ఆర్భాటమే..!
అధికారమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆచరణ సాధ్యం గాని హామీలను గుప్పించారు. ఇందులో భాగంగా అర్హులందరికీ పింఛన్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇది నిజమని భావించి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు.. విజయం సాధించాక తన నిజ స్వరూపాన్ని చూపారు. కొత్తగా మంజూరు చేయకపోగా, ఉన్న వాటి తొలగింపునకు ఉపక్రమించారు. తమ పార్టీకి ఓటేయని వారి పింఛన్లను తొలగించాలంటూ గ్రామీణ ప్రాంతాల్లో అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇంత అస్తవ్యస్తమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో వీటిని పంపిణీ చేసేందుకు గానూ వింజమూరుకు ముఖ్యమంత్రి బుధవారం రానుండటం విస్మయానికి గురిచేస్తోంది. నూతనంగా ఒక్కటిని సైతం మంజూరు చేయకుండా.. ఆయన రావడమెందుకనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. నెల్లూరు(పొగతోట) / ఉదయగిరి: టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి 22 నెలలవుతున్నా, నేటికీ ఒక్క పింఛన్ను సైతం మంజూరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అర్హులందరికీ మంజూరు చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక రకరకాల కొర్రీలతో ఉన్న వాటికి కత్తెరేసేందుకు సర్కార్ ఉపక్రమించింది. అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే కుట్రను తెరపైకి తెచ్చింది. ఈ తరుణంలో లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రావడంతో పరిశీలన ప్రక్రియను కొంతకాలం పాటు వాయిదా వేశారు. ఈ తరహాలో దివ్యాంగ పింఛనర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరిని నానా ఇబ్బందులకు గురిచేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. మరోవైపు వీటిని అందుకుంటున్న వారు మరణిస్తే, వారి కుటుంబసభ్యులకు మంజూరు చేసేందుకే ప్రస్తుతం పరిమితమయ్యారు. నాటికి.. నేటికీ ఎంతో వ్యత్యాసం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2024 మార్చిలో జిల్లాలో 3.17 లక్షల మందికి పింఛన్లను అందజేశారు. అయితే ప్రస్తుతం ఇది 2.9 లక్షలకు పరిమితమైంది. దీనిబట్టి ఈ రెండేళ్లలో 27 వేల మందికి మొండిచేయి చూపి వారి నోట్లో మట్టి కొట్టారు. ఏదో కారణాన్ని చూపి దీన్ని మరింత తగ్గించే దిశగా సర్కార్ అడుగులేస్తోంది. మరోవైపు నూతన పింఛన్ల కోసం దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంతో ఆశగా నిరీక్షిస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే అవకాశాన్నీ కల్పించపోవడంతో ఏమి చేయాలో పాలుపోక వీరు కుమిలిపోతున్నారు. నాడు.. సంక్షేమమే పరమావధిగా.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల మంజూరు ప్రక్రియ ఎంతో సజావుగా సాగేది. అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండేది కాదు. అర్హుల ఇళ్ల నుంచే వారి వివరాలను వలంటీర్లు అప్లోడ్ చేస్తే మరుసటి నెల్లోనే లభించేవి. ఇబ్బందుల్లేకుండా కొత్త వాటిని ఎప్పటికప్పుడు మంజూరు చేసేవారు. రాజకీయాలకతీతంగా అందరికీ అందేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లేకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. 2.9 లక్షల మందికి.. సామాజిక భద్రత పింఛన్ల నగదు పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 2.9 లక్షల మంది లబ్ధిదారులకు రూ.126 కోట్ల మేర బుధవారం పంపిణీ చేయనున్నారు. జలదంకికి చెందిన 69 ఏళ్ల మస్తానయ్య వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటున్నారు. వయస్సు రీత్యా పనులకు సక్రమంగా వెళ్లలేక అగచాట్లకు గురవుతున్నారు. ఒక్కొక్కరి గాథ.. ఒక్కోలా.. బోగోలుకు చెందిన దివ్యాంగుడు రవి పింఛన్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. సంగం మండలానికి చెందిన శాంతి భర్త ఏడాదిన్నర క్రితం మృతి చెందారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. వితంతు పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, కనికరం చూపే నాథుడే కరువయ్యారు. అఽధికారులకు దరఖాస్తులను అందజేసినా ప్రయోజనం శూన్యం. గత వైఎస్సార్సీపీ హయాంలో.. మార్చి 2024 నాటికి 3.17 లక్షలుకూటమి ప్రభుత్వంలో.. ప్రస్తుతం – 2.9 లక్షలు గత ఎన్నికలకు ముందు హామీలు ఉన్న వాటికి ప్రస్తుతం కోత.. నూతనంగా మంజూరు శూన్యం దరఖాస్తు చేసుకునేందుకూ అవకాశమేదీ..? ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇదే పరిస్థితి వేలాది మంది ఎదురుచూపులు గత ప్రభుత్వ హయాంలో ఎంతో సాఫీగా వాగ్దానాలను విస్మరించి నేడు జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు ఉదయగిరి: వింజమూరులో బుధవారం నిర్వహించనున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై.. స్థానిక ఎస్సీ కాలనీలో ఓ లబ్ధిదారుడికి నగదును అందజేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వాస్తవ విరుద్ధంగా ఉంది. నూతనంగా పొందాలనే ఆశతో ఎంతో మంది ఉన్నా, వారిపై ఏ మాత్రం కనికరం చూపడంలేదు. రెండు నెలల క్రితం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ప్రతి జిల్లాకూ 200 కొత్త పింఛన్లను కేటాయిస్తూ, ఎంపిక బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. అయితే దీనికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. -
‘కుబేర’ కేటుగాళ్ల పంజా
● గ్రామీణ గిరిజనులు, దళితులే లక్ష్యంగా మెప్మా ఉద్యోగులు ● ఒక్కొక్కరి పేరిట రూ.లక్ష రుణం మంజూరు ● రూ.20 వేలు చేతిలో పెట్టి మొత్తం కాజేస్తున్న ముఠా ● ‘శ్రీ మణికంఠ’ అనే గ్రూపు పేరుతో రూ.12 లక్షల రుణాలు మంజూరు చేయించిన వైనం ● కథ అడ్డం తిరగడంతో ఖాతాలను అప్పటికప్పుడే ఫ్రీజ్ చేయించిన ఆర్పీఎంలు ● బ్యాంక్ అధికారుల అండదండలతో సాగుతున్న దందా? ● లబ్ధిదారులను పట్టణ వాసులుగా చూపించి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభం ● నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న డీఆర్డీఏ అధికారులు కోవూరు: అమాయక గిరిజన, దళిత మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, రుణాల పేరుతో అడ్డంగా దోచుకుంటున్న ‘మనీ మాఫియా’ కోవూరు మండలంలో కోరలు చాచుతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తులే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటే... తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని మెప్మా ఉద్యోగులు, కొందరు ఆర్పీఎంలు తమ పరిధి దాటి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన, దళిత కాలనీలను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. కొంత కాలం క్రితం విడుదలైన ‘కుబేర’ సినిమా తరహాలో ఆయా సామాజిక వర్గాల మహిళలను పావులుగా వాడుకుంటూ లక్షలాది రూపాయల స్కామ్కు తెరలేపారు. ఆర్పీఎంల ముసుగులో వచ్చిన కొందరు కేటుగాళ్లు, బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క సాగిస్తున్న ఈ దందా ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. అప్పులు లబ్ధిదారులకు.. డబ్బులు ఆర్పీఎంలకు రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. తెల్లవారితే కూలి పనులకు వెళ్తేనే గానీ పొయ్యి వెలగని దుస్థితి. అటువంటి నిరుపేద దళిత, గిరిజన మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఈ కేటుగాళ్లు, వారి జీవితాలను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ‘మీ కష్టాలు తీరుస్తాం.. మీకు అండగా ఉంటాం‘ అంటూ నమ్మబలికి.. వారి మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు. కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ వాస్తవానికి గ్రామీణ పరిధిలోకి వస్తోంది. వీరందరూ డీఆర్డీఏ పరిధిలోకి వస్తారు. కానీ నెల్లూరు నగరంలోని మెప్మా ఉద్యోగులు, ఆర్పీఎంలు కొందరు పడుగుపాడులోని ఎన్టీఆర్నగర్ గిరిజన కాలనీకి చెందిన 12 మంది మహిళలను గ్రూపు తయారు చేశారు. తమకు నెల్లూరు నవాబుపేటలోని కెనరా బ్యాంకు అధికారులతో పరిచయాలు ఉన్నాయని, భారీగా రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. కోవూరు బ్యాంకుల్లో చేస్తే ఎక్కడ గుట్టు రట్టవుతుందోనన్న భయంతో వ్యూహాత్మకంగా వారిని నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరంతా పట్టణ వాసులుగా నమ్మబలికి ‘శ్రీ మణికంఠ’ అనే గ్రూపు పేరుతో 12 మందికి వ్యక్తిగత ఖాతాలను ప్రారంభించారు. ఒక్కొక్కరు రూ. 20 వేలు జమ చేస్తే రూ.లక్ష లోన్ వస్తుందని ఆర్పీఎంలు మహిళలకు చెప్పారు. అయితే ఆ పేద మహిళలు తమ వద్ద అంత డబ్బు లేదనడంతో ఆ ఆర్పీఎంలే రూ. 2.40 లక్షలు కట్టి ఖాతాలు తెరిపించారు. అనుకున్నట్లుగానే అందరి పేరిట రుణాలు మంజూరు చేయించారు. అయితే ఈ లోను మొత్తం మీరే చెల్లించాల్సి ఉంటుందని ఎవరో వారికి స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. లక్ష జమ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. తీరా డబ్బులు డ్రా చేసే సమయానికి అసలు రంగు బయట పడింది. వచ్చిన రుణంలో మీరు రూ.20 వేలు మాత్రమే తీసుకొని మిగిలిన రూ.80 వేలు తమకు ఇవ్వాలని ఆర్పీఎంలు చెప్పారు. అదేంటి మీరిచ్చిన రూ.20 వేల అయితే ఇస్తామని, మిగిలిన డబ్బులివ్వబోమని మహిళలు అడ్డం తిరిగారు. మాకు వచ్చిన డబ్బులు మేమే తిరిగి కట్టాలి కదా? మీకెందుకు ఇవ్వాలని ఎదురు తిరగడంతో ఆర్పీఎంల బృందం, లబ్ధిదారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘బ్యాంకు రికార్డుల్లో లోన్ మొత్తం మా పేరునే ఉంటుంది.. రేపు మీరు కట్టకపోతే బ్యాంకు వాళ్లు మా ఇళ్లకు వస్తారు.. మీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు‘ అని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో వారి ఖాతాల్లో జమ అయిన మొత్తాలు డ్రా చేయనీకుండా ఆర్పీఎంలు ఖాతాలను ప్రీజింగ్ చేయించారు. బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు కేవలం పది వేల రుణం కావాలంటే సామాన్యులను ముప్ప తిప్పలు పెట్టే బ్యాంకు అధికారులు, ఏకంగా లక్షల రూపాయల రుణాలను ఇంత సులభంగా ఎలా మంజూరు చేశారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మహిళలు డబ్బులు ఇవ్వడం లేదని తెలియగానే, ఆర్పీ ఎంలు ఫోన్ చేయగానే బ్యాంకు అధికారులు స్పందించి ఖాతాలను నిలుపుదల ప్రీజ్ చేయడం చూస్తుంటే, ఈ స్కామ్లో వారి పాత్రపై అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో నెల్లూరులోని ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు సైతం కొందరు టీడీపీ నేతలతో కలిసి అక్షరం ముక్క రాని గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి రూ.కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర వెలుగుచూడడం విదితమే. తాజాగా ఆ తరహాలో ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులు రుణాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా కరువైన డీఆర్డీఏ జిల్లాలో పొదుపు సంఘాల ముసుగులో ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. వాటిని పర్యవేక్షించాల్సిన డీఆర్డీఏ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు తమ పరిధి దాటి గ్రామీణ ప్రాంతాల్లో పేదలను పొదుపు గ్రూపుల్లో చేర్పించి, వారి పేరుతో రుణాలు తీసుకుని మోసాలకు తెగబడుతుంటే.. తమకేమి సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు. ఆర్పీఎంల వాటాల్లో వీరికి కూడా కమీషన్లు అందుతున్నాయే కాబట్టే పట్టించుకోవడం లేదని గిరిజన మహిళలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కోవూరు మండలంలో ఇలాంటి స్కామ్లు గతంలోనూ వెలుగు చూసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, గిరిజన మహిళలను అప్పుల పాలు చేస్తున్న ఈ ‘మనీ మాఫియా’ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కుంభకోణంలో భాగస్వాములైన బ్యాంకు అధికారులు, ఆర్పీఎంలపై విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.మెప్మా అధికారిక యాప్లో అఫ్రూవల్ అయితేనే రుణాలు మంజూరు చేస్తాం నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఉండే గ్రూపులకు మాత్రమే మా బ్యాంక్ నుంచి కొత్త రుణాలు మంజూరు చేస్తాం. మెప్మా పీడీ అఫ్రూవల్ ఇస్తేనే లోన్ మంజూరు చేస్తాం. మండల ప్రాంతాల్లో ఉండే వారికి మాత్రమే ఖాతాలు ప్రారంభిస్తాం. శ్రీ మణికంట గ్రూప్ గతంలో నెల్లూరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఉంటూ రూ.10 లక్షల రుణం తీసుకొన్నారు. అక్కడ రద్దు చేసుకొని ఇక్కడ ఓపెన్ చేశారు. గతంలో ఉన్న సీనియారిటీని తీసుకొని ఈ గ్రూపునకు రూ.10 లక్షలు రుణం మంజూరు చేశాం. ఆ సభ్యులంతా నెల్లూరు ప్రాంతానికి చెందిన వారం అని చెప్పడంతోనే గ్రూప్నకు రుణం ఇవ్వడం జరిగింది. – గుజ్జల చంద్రశేఖర్, కెనరా బ్యాంక్ మేనేజర్, నవాబుపేట, నెల్లూరు ‘కుబేర’ సినిమా తరహాలో మెప్మా ఉద్యోగుల ముఠా దళిత, గిరిజనులను టార్గెట్ చేసి బ్యాంకుల్లో లోన్లు కొల్లగొడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో కొందరు టీడీపీ నేతలు నిరక్షరాస్యులైన గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించి రూ.కోట్ల వ్యక్తిగత రుణాలు తీసుకుని చేసిన మోసాలు మరిచిపోకముందే.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని మెప్మా విభాగం ఆర్పీఎంలు గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక గిరిజన, దళిత మహిళలకు రుణాలిప్పిస్తామంటూ వారిని ముంచేస్తున్నారు. కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ ఎన్టీఆర్నగర్ గిరిజన కాలనీలో మహిళలను మోసం చేసే యత్నంలో వీరి బండారం తెలిసి రచ్చ జరిగడంతో గుట్టురట్టయింది. ఈ కేటుగాళ్ల దందాలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది బ్యాంక్మేమెందు కీయాలి..?.. ఇచ్చేదిలేదు -
ఖాకీల స్వామిభక్తి
● షాడో మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్ స్టేటస్ ● విస్మయం కలిగించిన ఎస్సైల తీరు చేజర్ల: ఓ షాడో మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ తమ వాట్సాప్ స్టేటస్గా ఖాకీలు పెట్టుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. సదరు నేత ఆశీస్సులు పొందేందుకు ఎస్సైలు ఈ రకంగా వ్యవహరించడం ఆత్మకూరు నియోజకవర్గంలో విస్మయం కలిగించింది. ఆశీస్సుల కోసం తాపత్రయం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి షాడోగా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన తాళ్లూరి గిరి వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అమాత్యుడ్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమ వ్యాపారాలకు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ అధికారి నియామకం జరగాలన్నా, ఈయన ఆశీస్సులు తప్పనిసరి. దీంతో అధికారులందరూ ప్రజాసేవ కంటే ఆయన సేవలోనే తరిస్తుంటారు. ఈ క్రమంలో తాళ్లూరి గిరి జన్మదినాన్ని మంగళవారం పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చేజర్ల, సంగం ఎస్సైలు వారి అధికారిక మొబైల్ ఫోన్ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నారు. దీన్ని చూసిన పలువురు మీడియా ప్రతినిధులు, ప్రముఖులు నివ్వెరబోయారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ.. నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ సదరు పోలీస్ అధికారులు చెలరేగిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చివరికి ఎస్సైల వ్యవహారం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో వెంటనే వారు తొలగించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గిరినాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన వాట్సాప్ స్టేటస్ -
ఆక్రమణల తొలగింపులో ‘పచ్చ’పాతం
● 25 ఏళ్ల నాటి నిర్మాణాల కూల్చివేత ● కాకుటూరులో విలువైన భూమి కబ్జా ● కలెక్టర్ ఆదేశించినా చర్యలు చేపట్టని అధికారులు సాక్షి, టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులు పచ్చపాతాన్ని చూపుతున్నారు. అయిన వారికి ఆకుల్లో.. కానీ వారికి కంచాల్లో అనే విధంగా వారి తీరు ఉంది. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అడ్డుకునేందుకు జంకుతున్నారు. కానీ వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఏళ్ల క్రితం చేసిన నిర్మాణాలను ఆక్రమణల పేరుతో కూల్చి వేయడం వివాదాస్పదమైంది. టీడీపీ నాయకుల కుట్రలు వెంకటాచలం మండలంలో అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పుంజులూరుపాడు గ్రామానికి చెందిన కరుణాకర్రెడ్డి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. గ్రామంలో సర్వే నంబర్ 139లో 5.68 ఎకరాల పట్టా భూమి అతడికి ఉంది. 25 సంవత్సరాల క్రితం తన భూమిలోని సుమారు ఐదు సెంట్లలో రూ.5 లక్షల వ్యయంతో రెండు గదులు (కొట్లు) కట్టించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు కరుణాకర్రెడ్డి పొలం వద్ద నిర్మించిన రెండు కొట్లను తొలగించాలనే కుట్రలతో అధికారులకు అర్జీలు ఇస్తూ వచ్చారు. నేతల ఒత్తిళ్లతో అధికారులు సర్వే చేయించి కరుణాకర్రెడ్డికి సర్వే నంబర్ 139లో 5.68 ఎకరాలు ఉందని, మిగిలిన ఐదు సెంట్లు ఆక్రమణ అని తేల్చారు. రెవెన్యూ, పంచాయతీ, సర్వే అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకుని జేసీబీతో రెండు గదులను ధ్వంసం చేశారు. తన భూమిలో ఎలాంటి ఆక్రమణల్లేవని, కూటమి నాయకులు కక్ష కట్టి వాటిని నేలకూల్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆక్రమణలపై చర్యలేవి? కాకుటూరు గ్రామంలో రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణల గురించి గ్రామస్తులు మూడుసార్లు కలెక్టర్కు, మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలపై సాక్షి పత్రికలో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ స్పందించి నివేదిక పంపాలని ఆదేశించారు. అయినా ఆక్రమణదారులు లెక్కచేయకుండా సదరు భూముల్లో ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. కాకుటూరు భూ ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తి నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత కావడం, అతడికి సర్వేపల్లి ముఖ్యనేత అండదండలు ఉండటంతో అధికారులు పచ్చపాతం చూపుతున్నారు. ఆక్రమణల జోలికి వస్తే జిల్లా సరిహద్దు మండలాలకు బదిలీ కావాల్సి వస్తుందని ఆక్రమణదారుల బెదిరింపులు తోడు కావడంతో సర్వేతో సరిపెట్టుకున్నారు. పుంజులూరుపాడులో ఆక్రమణల పేరుతో రెండు గదులను కూల్చిన అధికారులు, కాకుటూరులో కూడా తక్షణమే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
తండ్రి హత్య కేసులో కుమారుడికి జీవిత ఖైదు
నెల్లూరు(లీగల్): ఇల్లు రాసివ్వలేదన్న కక్షతో తండ్రిని దారుణంగా హత్య చేశాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో కుమారుడికి శిక్ష పడింది. జీవిత ఖైదుతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.సరస్వతి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కొడవలూరు మండలం యల్లాయపాళెం గ్రామం తల్లమిట్ట గిరిజన కాలనీకి చెందిన పొట్లూరి పోలయ్యకు వివాహమైంది. భార్య చనిపోయింది. కాగా అతని చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యం వేధింపులు భరించలేక భార్య వదిలేసి వెళ్లిపోయింది. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు కుటుంబంతో వేరుగా అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. పోలయ్య పేరిట ఉన్న ఇంటిని తన పేరుపై రాసివ్వాలని సుబ్రహ్మణ్యం నిత్యం వేధించేవాడు. తండ్రి విసిగిపోయి ఇద్దరు కుమారులకు ఇల్లు సమానంగా రాసిస్తానని చెప్పాడు. 2024 డిసెంబర్ 28వ తేదీన వెంకటేశ్వర్లు తండ్రికి టిఫిన్ తెచ్చిచ్చాడు. సుబ్రహ్మణ్యం ఇల్లు రాసివ్వాలంటూ పోలయ్యతో గొడవ పెట్టుకుని కోపంతో ఇంట్లో ఉన్న కత్తితో పొడిచాడు. కింద పడిన ఆయన్ను గొడ్డలితో తలపై నరికాడు. పోలయ్య అక్కడికక్కడే మరణించాడు. చుట్టుపక్కల వారు రావడంతో సుబ్రహ్మణ్యం పరారయ్యాడు. అదేరోజు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం సుబ్రహ్మణ్యంపై కోర్టులో చార్జిషీ ట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతోపై మేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ ప్రేమ్కుమార్ వాదించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలివ్వాలి ఆత్మకూరు: కనీస వేతనమివ్వాలంటూ అంగన్వాడీ వర్క ర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం ఆత్మకూరు సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యనియన్ నాయకురాలు పి.రాధమ్మ మాట్లాడుతూ హెల్పర్ల ప్రమోషన్కు స్పష్టమైన సూచనలివ్వాలన్నారు. మే నెలలో వేసవి సెలవులివ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొండమూరి హజరత్తయ్య, తిరుపాలయ్య, ఎన్.రఘురామయ్య, ఎ.నాగయ్య, పి.రాధమ్మ, రమణమ్మ, రూతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కూల్డ్రింక్ బాటిల్లో పురుగు
కోట: స్థానిక ఎన్సీఆర్ నగర్ వద్ద ఉన్న ఓ మార్ట్లో మంగళవారం వివాదం చోటుచేసుకుంది. కొక్కుపాడు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి అక్కడ ఓ కంపెనీ కూల్డ్రింక్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందులో పురుగులు కనిపించినట్లు బాధితుడు తెలిపాడు. దీనిపై మార్ట్ సిబ్బందిని నిలదీయడంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నాడు. బాటిల్ను తిరిగిచ్చేయాలని మరొకటి ఇస్తామని చెప్పడంతో అతను ససేమిరా అన్నాడు. మార్ట్లో పనిచేసే సిబ్బంది బాటిల్ బయటకు వెళ్లకుండా అతడి వద్ద నుంచి లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. కూల్డ్రింక్ బాటిల్ తన వద్దే ఉందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మురళి తెలిపాడు. అంగన్వాడీ కేంద్రంలో రికార్డుల పరిశీలన వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని జైభీమ్ నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి హేనాసుజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం సీఎం చంద్రబాబు జైభీమ్ నగర్ కాలనీకి వస్తున్న నేపథ్యంలో ఆమె వచ్చి రికార్డులు పరిశీలించి కార్యకర్తలకు పలు సూచనలిచ్చారు. ఆమె వెంట సీడీపీఓ పద్మజాకుమారి, సూపర్వైజర్లు ఉన్నారు. రైలు ఢీకొని.. ● గుర్తుతెలియని వ్యక్తి మృతి కోవూరు: రైలు ఢీకొట్టడంతో గుర్తుతెలియని మృతిచెందిన ఘ టన మండలంలోని పడుగుపాడు రైల్వేస్టేషన్ పరిధిలో ఇనమడుగు గేటు వద్ద మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సుమారు 40 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని చనిపోయాడు. అతని చేతికి సైలెన్ ఎక్కించేందుకు ఉపయోగించే కాన్యులా ఉండటాన్ని గుర్తించారు. దీన్ని బట్టి సదరు వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడని, అక్కడి నుంచి వెళ్తూ చనిపోయి ఉంటాడని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నెల్లూరు(టౌన్): రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో జిల్లా రవాణాశాఖాధికారులు అప్రమత్తయ్యారు. మంగళవారం రాత్రి డీటీసీ బి.చందర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్కింగ్ ప్రదేశాల్లో రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను నిలిపివేశారు. తనిఖీల్లో ఎంవీఐలు బాలమురళీకృష్ణ, రఫీ, పవన్ కార్తీక్, గోపీనాయక్, ఏఎంవీఐలు ప్రభాకర్, రఘునాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు చేజర్ల: వైద్యారోగ్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి సూచించారు. మండలంలోని చేజర్ల, చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రోజూ ఓపీలో 50 మంది రోగులు తగ్గకుండా చూడాలని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు మెహతాబ్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
మనుబోలు: విజయవాడ డివిజన్ నెల్లూరు–గూడూరు సెక్షన్ పరిధిలో మనుబోలు మండలంలోని కొమ్మరపూడి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పాల ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న గూడ్స్ రైలు కొమ్మలపూడి సమీపంలోని 152/11 కి.మీ. వద్ద పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరో మార్గంలో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. మధ్యాహ్నం 2 గంటలకు రాకపోకలను పునరుద్ధరించారు. -
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుపతికి పాలు నింపుకునేందుకు వెళ్తుండగా.. వెంకటాచలం-మనుబోలు మధ్య కొమ్మలపూడి జంక్షన్ వద్ద ఘటన జరిగింది. గూడ్స్ రైలుకు ఉన్న పాల ట్యాంకర్ ట్రాక్పై అడ్డంగా పడిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు చర్యలు చేపట్టారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
దుత్తలూరు: ఫ్యాన్కు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన బక్కా ప్రసాద్ (32)కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అతను తన బావమరిది కొసినపోగు మధు పెళ్లికి వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటకు ఆదివారం వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రికి కాలనీకి చేరాడు. ముందుగా తన ఇంటికి వెళ్లాడు. భార్య అదే కాలనీలోని పుట్టింట్లో ఉండటంతో సోమవారం తెల్లవారుజామున అక్కడికెళ్లాడు. కాసేపటికి ఏమైందో గానీ తలుపులు వేసుకుని లోపల గడియ పెట్టుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇంటి వెంటిలేటర్ నుంచి చూశారు. వెంటనే తలుపులు పగులగొట్టి ప్రసాద్ను కిందికి దించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబ కలహాలతోనే ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు. -
అయ్యా.. మా వినతులు చూడండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పోటెత్తిన అర్జీదారులునెల్లూరు(దర్గామిట్ట): ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతుల్ని పరిశీలించి పరిష్కారం చూపండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఆర్వో విజయ్కుమార్, నెల్లూరు ఆర్డీఓ అనూష, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 5 రకాల బస్సుల్లోనే ప్రయాణం అన్యాయం ఆర్టీసీ 16 రకాల బస్సులను నడుపుతున్నా దివ్యాంగ శక్తి పథకం కింద కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అన్యాయని వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్లా మోహన్ విమర్శించారు. డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సేవలకే పరిమితం చేయడం దివ్యాంగుల హక్కులను పరిమితం చేయడమేనన్నారు. సీఎం పథకం ప్రకటించిన సమయంలో అన్ని సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామన్నారు. ఇప్పుడు పరిమితం చేయడం దారుణమన్నారు. గతంలో ఉన్న 50 శాతం రాయితీపై మరో 50 శాతం కలిపి పూర్తి ఉచితం చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాగేంద్ర, సుబాన్బాషా, ప్రభు తదితరులు పాల్గొన్నారు. విచారణకు డిమాండ్ రాపూరు మండలం తెగచర్ల గ్రామ సంఘ బంధం నిధుల గోల్మాల్పై విచారణ చేపట్టాలని పొదుపు మహిళలు వినతిపత్రం అందజేశారు. సంఘ బంధ అధ్యక్షురాలు, రాపూరు ఏపీఎం సహకారంతో నిధులు గోల్మాల్ చేసిందన్నారు. విచారణ చేపట్టాలని కోరారు. రైతులను ఆదుకోవాలంటూ.. ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలంటూ భారత చైతన్య యువజన పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ నేతృత్వంలో నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. మిల్లర్లు, దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. డాక్టర్ గుంజి నరసింహారావు, వేల్పుల రామ్మోహన్, సోమ గోపాల్, హరినాథ్, కొణిదెల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి నిధుల స్వాహా
సీ్త్రనిధిలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినా.. డీఆర్డీఏ సిబ్బంది చేతివాటంతో పొదుపు మహిళలు లబోదిబోమంటున్నారు. అధికారులకు పలువురు వినతిపత్రమిచ్చారు. సంగం మండలం మర్రిపాడుకు చెందిన శ్రీవీరాంజనేయ, శ్రీహనుమాన్, శ్రీలక్ష్మి పొదుపు సంఘాలు సీ్త్రనిధి ద్వారా రూ.4 లక్షల చొప్పున రుణాలు పొందారు. శ్రీలక్ష్మి పొదుపు సంఘం వారు తమకు రూ.3 లక్షలు సరిపోతాయని, మిగిలిన రుణం తిరిగి చెల్లించి తీర్మానం కూడా చేసుకున్నారు. కానీ ఆ మొత్తాన్ని బకాయిగా చూపించడంతో వారు ఆవేదన చెందుతున్నారు. అలాగే శ్రీహనుమాన్ పొదుపు సంఘం వారు ప్రతినెలా నగదు చెల్లిస్తున్నా మరో మూడు నెలలు కట్టాలంటూ బకాయి చూపారు. మరో గ్రూపు పరిస్థితి ఇలాగే ఉంది. న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించారు. -
కలెక్టరేట్ ఎదుట బీటీఏ నిరసన
నెల్లూరు(దర్గామిట్ట): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీటీఏ జిల్లా శాఖ నెల్లూరు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గలేదని వాపోయారు. జిల్లా అధ్యక్షుడు మణి సుబ్బు, ప్రధాన కార్యదర్శి మాస ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
కన్నకొడుకు ఇంట్లో నుంచి గెంటేశాడు
● ఓ మహిళ ఫిర్యాదు ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): ‘చిన్న కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై నన్ను కొట్టడమే కాకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 126 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని బాధితులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.సత్యనారాయణ, మహిళా స్టేషన్, పీసీఆర్, ఎస్బీ 2 ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మా తండ్రి లారీ ఢీకొని మృతిచెందాడు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని వెంకటాచలానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.3.75 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకుండా మోసగించాడని వరికుంటపాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● వెంకయ్య అనే వ్యక్తి నా కుమార్తెను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని వెంటబడి వేధిస్తున్నాడు. ఆమైపె చెడుగా ప్రచారం చేస్తుండగా అడిగినందుకు నాపై, కుటుంబ సభ్యులపై దాడిచేసి గాయపరిచాడు. విచారించి న్యాయం చేయాలని బిట్రగుంట ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. ● భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను పట్టించుకోలేదు. ఇటీవల మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి గెంటేశాడని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు. ● భర్త, అత్తింటివారు ప్రతి చిన్న విషయానికి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వివాహిత కోరారు. -
తమ్ముళ్లూ.. ఇదేం పని?
● శిలాఫలకాన్ని టీడీపీ జెండా దిమ్మెగా మార్చి.. ● 3వ వార్డులో టీడీపీ నేతల అత్యుత్సాహం నెల్లూరు సిటీ: నగరంలోని మూడో డివిజన్ కిసాన్ నగర్లోని మధురా నగర్లో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల ప్రారం భోత్సవం నిమిత్తం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు శిలాఫలకానికి పచ్చరంగు వేశారు. జెండా కట్టి ఎగురవేశారు. శిలాఫలకాన్ని జెండా దిమ్మెగా మార్చడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతికలిగిరి: మండలంలోని అనంతపురం గ్రామంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై కాకునూరు వెంకటేశ్వర్లు (60) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటేశ్వర్లు ట్రాక్టర్ పైకి ఎక్కి గడ్డి దించే క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లను గమనించలేదు. వాటికి తగిలి షాక్ గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణం తీసిన ఈత సరదా దగదర్తి: సరదాగా స్నేహితులతో ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని చెన్నూరులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చెన్నూరు ఎస్సీ కాలనీకి చెందిన వరకుమార్ కుమారుడు గుర్రం సంతోష్ (17) బుచ్చిరెడ్డిపాళెంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పరీక్షలు రాశాడు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు స్నేహితులతో కలిసి కావలి కాలువలో ఈతకు వెళ్లాడు. కాలువలో ఉన్న గుంతలో సంతోష్ ఇరుక్కుపోవడంతో భయపడిన స్నేహితులు గ్రామంలోకి వెళ్లి బంధువులకు తెలిపారు. వారొచ్చి సంతోష్ మృతిచెందినట్లు గుర్తించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ‘పది’ పరీక్షలకు 228 మంది గైర్హాజరునెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షలకు సోమవారం జిల్లా వ్యాప్తంగా 228 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 28,002 మందికి గానూ 27,774 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 83 పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ బాలాజీరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ తనిఖీ చేశారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 202 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 1,198 మందికి గానూ 996 మంది హాజరయ్యారు. -
మైక్ లాక్కొని హంగామా.. టీడీపీలో పెరిగిన విభేదాలు!
నెల్లూరు జిల్లా: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని ఉన్న తమకు అన్యాయం జరుగుతోందంటూ ఒక్కసారిగా వ్యాఖ్యానించడంతో పరిస్థితులు హీటెక్కాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవమే దీనికి వేదికైంది. సముదాయించకుండా.. అడ్డుకొని..! పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత బొమ్మ సుబ్బారెడ్డి మైక్ పట్టుకొని తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారనీ.. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి వరకు పార్టీ కోసం రక్తాన్ని ధారపోస్తే, ఇప్పుడు కనీస మర్యాద కరువైందంటూ కంటతడి పెట్టారు. ఈ తరుణంలో అక్కడే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆయన్ను సముదాయించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో పలువురు విస్తుపోయారు. స్టేజీపై అలా మాట్లాడొద్దంటూ నోరు నొక్కేందుకు యతి్నంచారు. మైక్ లాక్కొని.. సీనియర్లను తోసేసి అసమ్మతి గళాన్ని వినిపిస్తే తట్టుకోలేని తమ్ముళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. సుబ్బారెడ్డి తన బాధ చెప్పుకొంటుండగానే, నేత కోడూరు కమలాకర్రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పెద్దాయన చేతిలోని మైక్ను బలవంతంగా లాక్కున్నారు. అనామకుడినా నేను..? ఇంత అవమానిస్తారా అంటూ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. మరో సీనియర్ నేత బషీర్ సైతం వేదికపైనే అసంతృప్తిని వెళ్లగక్కారు. రెండేళ్లుగా తనను ఏ కార్యక్రమానికీ పిలవడం లేదని, పార్టీలో సీనియర్లను ఏ మాత్రం లెక్కచేయడంలేదంటూ బాహాటంగానే విమర్శించారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉంటే బయట నుంచి వచ్చిన నేతలు తమపై పెత్తనం చేయడమేమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి బుచ్చిరెడ్డిపాళెం సాక్షిగా జరిగిన ఈ రచ్చ, టీడీపీలో ఐక్యత లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. -
న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయం
● అంకయ్య, రాజేంద్రప్రసాద్ నెల్లూరు(లీగల్): న్యాయవాదుల సంక్షేమమే ధ్యే యంగా పనిచేస్తామని సీనియర్ న్యాయవాదులు సత్తు అంకయ్య, సుంక రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి కల్యాణ మండపంలో ఐలు, న్యాయవాదుల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ హెల్త్కార్డులు, స్టైఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, యూనియన్ జాతీయ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసా ద్ మాట్లాడుతూ పౌర సమాజానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా గెలుపొందామన్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి మరింత బాధ్యతతో పనిచేస్తామన్నారు. ఐలు రాష్ట్ర నాయకులు బీవీ రమణరెడ్డి, నల్లారి మాధవరావు, నర్రా శ్రీనివాసరావు, ఐక్యవేదిక నాయకులు కుడుమల రవికుమార్, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుందరయ్య యాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో గంజి దయాకర్, కృష్ణుడు, రేఖారాణి, సాయికుమార్, కిరణ్, కొండల రావు, సుధీర్, దీక్షత్ పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?
● కూటమి అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెబుతారు ● వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డివెంకటగిరి(సైదాపురం): ‘మున్సిపాలిటీలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగిసింది.. మరో రెండురోజుల్లో పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉందా’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మళ్లీ రాజధానికి భూములు కావాలంటూ రైతులను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. పెన్నానదిని తవ్వేస్తూ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై గ్రీన్ ట్రిబ్యునల్కు పిటిషన్ దాఖలు చేస్తున్నామన్నారు. బాహాటంగా పెన్నానదిలో అక్రమంగా రోడ్లు వేసి ఇసుకను తవ్వేసి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంకటగిరిలో జాతీయ రహదారి పక్కనే ఇసుకను డంపింగ్ చేసి దోచుకుంటున్నారన్నారు. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బాబు సర్కార్కు డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదన్నారు. ప్రత్యేకాధికారుల పాలనను ఏర్పాటు చేసి మరింత దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతోందన్నారు. సమావేశంలో ఎస్ఈసీ సభ్యుడు బొలిగర్ల మస్తాన్యాదవ్, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ముఖ్యనేత చిట్టేటి హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు బాలయ్య, ఆరి శంకరయ్య, పేర్నేటి సుబ్బారావు, ఆటంబాకం శ్రీనివాసులు, గోపాలకృష్ణ, పూజారి లక్ష్మి, ఉమామహేశ్వరి, కందాటి కల్యాణి, సుభావలి, విజయలక్ష్మి, మల్లీశ్వరి, కన్వీనర్లు ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మన్నారపు రవికుమార్, వెందోటి కార్తీక్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
కలువాయి(సైదాపురం): అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాజుపాళెంలో ఏకంగా పెన్నానదిలోకి రహదారి నిర్మించి యథేచ్ఛగా టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగురాయపురం, రాజుపాళెం నుంచి రోజుకు వందల లారీల్లో ఇసుక తరలివెళ్తోంది. దీనివల్ల పెన్నానది ప్రవాహానికి ముప్పు ఏర్పడుతుందని తెలిసినా ఆపేందుకు ఏ అధికారి సాహసించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కుల్లూరు హైవే పక్కన ఇసుక డంపింగ్ యార్డ్ అనధికారికంగా ఏర్పాటు చేశారు. అంతేగాక హైవేపై టిప్పర్ల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నామని జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఉదయం 8 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. డ్రోన్ ద్వారా పేకాట స్థావరం గుర్తింపు ● ఆరుగురి అరెస్ట్ పొదలకూరు: మండలంలోని నందివాయ అటవీ ప్రాంతంలో పోలీసులు ఆదివారం డ్రోన్ను ఎగురవేసి పేకాట స్థావరాన్ని గుర్తించారు. ఎస్సై హనీఫ్ ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. తల్లిదండ్రులు మందలించారని.. ● పదో తరగతి విద్యార్థి బలవన్మరణం సోమశిల: పరీక్షల నేపథ్యంలో చదువుపై దృష్టి పెట్టమని తల్లిదండ్రులు మందలించి నందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం అనంతసాగరం మండలంలోని ఆమనిచిరివెళ్ల వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గౌరవరం గ్రామానికి చెందిన చెలిక పెంచల య్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు చెలిక కుశ్వంత్ (15) మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ సమయంలో విద్యపై దృష్టి పెట్టమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కుశ్వంత్ ఆమనిచిరివెళ్ల వద్ద ఉత్తర కాలువలో దూకాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికుల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా సమీపంలోనే కుశ్వంత్ మృతదేహం లభ్యమైంది. చిన్న కారణానికి ఎంత పని చేశావురా అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గౌరవరంలో విషాదం నెలకొంది. 2న జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నెల్లూరు(టౌన్): శాప్లీగ్స్ – 2026లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన స్వర్ణాల చెరువులో జిల్లా స్థాయి శాప్లీగ్స్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాల్లో బాలురు, బాలికలకు కేనోయింగ్, కయాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈవెంట్స్ల్లో పాల్గొనే వారు ఉదయం 8 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు శాప్ అధికార వెబ్సైట్ www. sports. ap. gov. in శాప్ లీగ్స్ పోర్టల్లో లేదా క్రీడా యాప్లో ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు 88622 38444 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,040 మంది స్వామిని దర్శించుకున్నారు. 31,606 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.18 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
మొక్కే కదా.. మేసేద్దాం
నెల్లూరు(బారకాసు): సిటీ నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 42, 43, 44, 47 డివిజన్లలో మొక్కలు నాటేందుకు వీలుకాని పరిస్థితి. వాటిని మినహాయించి ఒక్కో డివిజన్లో 700 నుంచి 900 మొక్కలు చొప్పున మొత్తం 24 డివిజన్లలో 20 వేల మొక్కలు నాటాలని కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే తెలుగు తమ్ముళ్ల కోసమే నారాయణ ఈ ప్లాన్ వేశారని ఆరోపణలున్నాయి. మొక్కలు నాటే పనులను ఆయా డివిజన్ టీడీపీ ఇన్చార్జిలకే కట్టబెట్టారు. ఇష్టారాజ్యంగా.. టీడీపీ ఇన్చార్జిలు ఇష్టానుసారంగా మొక్కలు నాటిస్తున్నారు. ఏ డివిజన్లో ఎన్ని మొక్కలు నాటారో తెలియని పరిస్థితి. అంతేకాకుండా తమ ఇళ్ల ముందున్న రోడ్లు ధ్వంసం చేసేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసిన కొందరు తమ్ముళ్లు పలువీధుల్లో చెట్లు ఉన్నప్పటికీ కూడా వాటి పక్కనే గుంతలు తీసి మొక్కలు నాటేస్తున్నారు. ప్రధానమైన వీధుల్లో అయితే అసలు నాటిన పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి ప్రతి 15 అడుగులకు ఒక మొక్క నాటాలి. కానీ అలా కాకుండా డివిజన్ల ఇన్చార్జిలు వారికిచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత కార్పొరేషన్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అంత ఖర్చా? మొక్కలు నాటేందుకు కార్పొరేషన్ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. వీటిని టీడీపీ నేతలే దక్కించుకున్నారు. ఒక మొక్కను నాటి దానికి నెలరోజులపాటు నీళ్లు పోసి సంరక్షించేందుకు రూ.3,600 చొప్పున చెల్లించేలా నగరపాలక సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో మొక్క ఖరీదు రూ.625. సిమెంట్ రోడ్డును కటింగ్కు, ఆ తర్వాత గుంత కోసం డ్రిల్ వేయడం, మట్టిని లోడి మొక్కను నాటి పూడ్చడం అనంతరం దానికి గ్రీన్గార్డ్ను ఏర్పాటు, నెలరోజు లపాటు నీరు పోసి సంరక్షించేందుకు రూ.2,975 చెల్లించడం జరుగుతుంది. మొత్తం 24 డివిజన్లకు కలిపి సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనులు చేపట్టిన ఒక్కో టీడీపీ ఇన్చార్జికి సుమారు రూ.10 లక్షలు మిగిలే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు తమ్ముళ్లకు దోచి పెట్టేందుకు మంత్రి నారాయణ తీసుకున్న చర్య లపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ ప్లాన్ మొక్కల పెంపకం పేరుతో నిధుల స్వాహా టీడీపీ డివిజన్ ఇన్చార్జీలకే పనులు నగరంలో 20 వేల మొక్కలు నాటేందుకు రూ.8 కోట్లు ఒక్క మొక్కకు ఖర్చు రూ.3,600 అధికార పార్టీ దోపిడీపై ప్రజల ఆగ్రహంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో నిధుల స్వాహాకు తెరతీశారు. నగరంలో మొక్కల పెంపకం చేపట్టి గ్రీన్సిటీ గా మార్చి చూపిస్తానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. కానీ ఇది తెలుగుదేశం నేతలకు దోచిపెట్టేందుకే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కల్వర్టును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
● డ్రైవర్ మృతి కావలి: ఆయిల్ ట్యాంకర్ కల్వర్టును ఢీకొట్టి గుంతలో పడటంతో డ్రైవర్ మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం కావలి రూరల్ పరిధిలోని తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జంగారెడ్డిగూడెం నుంచి ఆయిల్ లోడ్తో కృష్టపట్నం పోర్టుకు ట్యాంకర్ వెళ్తోంది. ఇది కావలి తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని కల్వర్టును ఢీకొట్టి అదుపుతప్పి గుంతలో పడిపోయింది. దీంతో డ్రైవర్ పి.అంకయ్య (55) మృతిచెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
మహిళా చట్టాల అమల్లో ప్రభుత్వాలు విఫలం
నెల్లూను(వీఆర్సీసెంటర్): శ్రామిక మహిళా చట్టాలను అమలు చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, సీఐటీయూ జిల్లా కార్యదరి గోగుల శ్రీనివాసులు, ఐద్వా జిల్లా జిల్లా కన్వీనర్ మస్తాన్బీ అన్నారు. నెల్లూరులోని డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం శ్రామిక మహిళా జిల్లా సమన్వయ కమిటీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లు దశలవారీ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనట్లు ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.3 వేలు సకాలంలో రావడం లేదన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా కూలీలు ఇవ్వడం లేదన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, మద్యం విక్రయాలు అధికమైనట్లు చెప్పారు. దీంతో యువత చెడుమార్గాల వైపు పయనిస్తోందన్నారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో శ్రామిక మహిహిళా సంఘం జిల్లా కన్వీనర్గా మరోసారి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ, శ్రామిక మహిళా సంఘం, ఐద్వా, అంగన్వాడీ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు టీవీవీ ప్రసాద్, శేషమ్మ, మధుసూదన, సుజాతమ్మ, మేరీ, ప్రభావతి, ఈశ్వరమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
కలిగిరి: గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. జెడ్పీ నిధులతో కలిగిరి పంచాయతీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జెడ్పీటీసీ పాలూరు మాల్యాద్రిరెడ్డి, ఉప సర్పంచ్ పాలూరు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. కలిగిరిలోని మసీదు వద్ద నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మండలానికి రూ.కోటికిపైగా నిధులను కేటాయించామని, మరికొంత మంజూరు చేయనున్నామని వెల్లడించారు. అనంతరం మాల్యాద్రిరెడ్డి నివాసంలో అరుణమ్మను పలువురు సర్పంచ్లు, నేతలు సత్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కాటం రవీంద్రరెడ్డి, సర్పంచ్ రాగి దివ్య, నేతలు హజరత్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రియాజ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రఘురామిరెడ్డి, తిరుపాల్, మస్తాన్రెడ్డి, మహేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హార్బర్ మత్స్యకారుల ఆస్తి
● అన్యాయం జరిగితే సహించేదిలేదు● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి, హక్కు అన్నారు. ప్రాణాలకు తెగించి వారు పట్టుకున్న నాలుగు బోట్లను అధికారులు, నేతలు కుమ్మకై ్క వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఇవి తరలివెళ్లాయని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారానని ప్రశ్నించారు. మత్స్యకారుల అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. బోట్లను వెనక్కి తెప్పించి, తమ చిత్తశుద్ధిని టీడీపీ నేతలు నిరూపించుకోవాలని హితవు పలికారు. బోట్ల మాయం విషయంలో బీఎమ్మార్ పేరును తాము ప్రస్తావించలేదని, ఇస్కపల్లి కాపు తోటయ్యే వాంగ్మూలంలో చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. తనకు ఆయన ఫోన్ చేసి.. రూ.10 లక్షల చొప్పున ఇస్తానని.. బోట్లను వదిలేయమన్నారని.. రెండు నెలల నుంచి ఇది జరుగుతోందని తోటయ్యే చెప్పారన్నారు. బీఎమ్మార్ ప్రమేయం లేకపోతే ఆయన ఒక్కరి పేరునే ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. విడ్డూరంగా రవిచంద్ర వ్యాఖ్యలు పాండిచ్చేరిలోని కారైకల్.. తమిళనాడు బోట్లకు సంబంధమేమిటంటూ బీద రవిచంద్ర మాట్లాడారని విమర్శించారు. అక్కడ్నుంచి తమిళనాడు బోట్లను నడపొచ్చా, లేదాననే విషయం నెట్లో కొడితే తెలిసిపోతుందన్నారు. కారైకల్ ఫిషింగ్ హార్బర్ ద్వారా తమిళనాడు బోట్లు ఆపరేటవుతుంటాయని, వాస్తవాలను దాచిపెట్టి వక్రీకరించేలా కూటమి నేతలు యత్నిస్తున్నారనే విషయం ఈ ప్రెస్మీట్ ద్వారా అర్థమైందని చెప్పారు. మత్స్యకారులపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, తమ పార్టీ నేతలకే ఉందని తెలిపారు. ఆదేశాలిచ్చింది వాస్తవం కాదా..? నెల్లూరుకు మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి బోట్లు విడుదల చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చిన మాట వాస్తవం కాదానని ప్రశ్నించారు. రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి వీటిని ఏ విధంగా తరలించాలో ప్రణాళికలను రచించిన విషయం నిజం కాదానని నిలదీశారు. ఈ ఉదంతంలో సీఐను మాత్రమే సస్పెండ్ చేసి మిగిలిన వారిని వదిలేశారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే పాండిచ్చేరిలో ఉన్న బోట్లను తీసుకొచ్చి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పెట్టాలని డిమాండ్ చేశారు. మాటలు నీటిమూటలేనా..? గస్తీ బోటొస్తుందని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారెవర్నీ రానీయమంటూ కలెక్టర్ ఇటీవల చెప్పారని, అయితే వాకాడు సమీపంలోని శ్రీనివాసపురం తీరానికి వేరే రాష్ట్రం నుంచి బోట్ వచ్చి 100 మీటర్ల దూరంలో వేటాడి, మన మత్స్య సంపదను ఈ నెల 27న దోచుకుపోయింని ఆరోపించారు. దీనికి జిల్లా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు మత్స్యకారులకు సంబంధించిన స్థలాలివ్వడం, హార్బర్లో కొంత భాగాన్ని కేటాయించడం పెద్ద తప్పన్నారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకే వ్యతిరేకమని చెప్పారు. జువ్వలదిన్నెకు జగన్మోహన్రెడ్డి రావాల్సి ఉందని, అయితే వరుసగా పండగలు రావడంతో ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు కొంత అంతరాయం ఏర్పడిందన్నారు. ఏప్రిల్ రెండో వారం లేదా ఆ తర్వాత వచ్చి మత్స్యకారుల సమస్యలను తెలుసుకొని, వారికి అండగా నిలుస్తారని చెప్పారు.టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఎవరు నిర్మించారో జిల్లా ప్రజలు, మత్స్యకార కుటుంబాలకు తెలుసునని చెప్పారు. తట్టెడు మట్టి, ఒక్క రాయి పెట్టి కట్టకుండానే తామే నిర్మించామంటూ టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలను అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూటమి నేతలకు కనిపించడంలేదానని ప్రశ్నించారు. నేలటూరులో ఫిషింగ్ జెట్టి నిర్మాణాన్ని ప్రారంభించారని, దీనికి ఎంత అవసరమైనా అదానీ కృష్ణపట్నం పోర్టు భరించి పూర్తి చేయాలని చెప్పారన్నారు. అయితే ప్రస్తుతం సోమిరెడ్డికి కమీషన్లు రాకపోవడంతో వీటిని అర్ధాంతంగా నిలిపేయించారని ధ్వజమెత్తారు. ప్రతి పనికీ వసూలు చేస్తూ అవినీతి సొమ్మును జేబులో వేసుకుంటున్నారని మండిపడ్డారు. -
గ్రావెల్ గుంతలో పడి చిన్నారి మృతి
● మంగళంపాడు గిరిజనకాలనీలో విషాదం వెంకటాచలం: గ్రావెల్ గుంతలో ప్రమాదవశాత్తూ జారిపడి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ పరిధిలో గల మంగళంపాడు గిరిజనకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబసభ్యుల వివరాల మేరకు.. వ్యవసాయ పనులకు మానికల గజేంద్ర వెళ్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయన చిన్న కుమార్తె సాత్విక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. తోటి బాలికలతో కలిసి గిరిజన కాలనీని ఆనుకొని ఉన్న కోనచెరువు వద్దకెళ్లింది. చెరువులో గ్రావెల్ తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ జారిపడిపోవడంతో, మిగిలిన చిన్నారులు అక్కడ్నుంచి భయంతో గిరిజన కాలనీకి పరుగులు తీశారు. కొద్దిసేపటికి విషయాన్ని అక్కడి వారికి చెప్పడంతో, అందరూ కలిసి 108కు సమాచారమిచ్చారు. గ్రావెల్ గుంత వద్దకెళ్లి సాత్వికను బయటకు తీశారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించగా, అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను గ్రావెల్ గుంత బలితీసుకోవడంతో తల్లిదండ్రులు గజేంద్ర, శ్రావణి గుండెలవిసేలా రోదించారు. -
మా ప్రాణాలను కాపాడండి
● రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ఎదుట పెయ్యలపాళెం గ్రామస్తుల ఆందోళన కొడవలూరు: కాలుష్యం భారీ నుంచి మా ప్రాణాలను కాపాడంటూ మండలంలోని పెయ్యలపాళెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలోని రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ (కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్) ఎదుట గ్రామస్తులు శనివారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి ఆనుకొనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, ఈ ఫ్యాక్టరీలో పేడ, గడ్డి ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్దాలు వస్తూ దుర్వాసన చిమ్ముతోందన్నారు. శబ్ద కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం గ్రామాన్ని కమ్మేస్తుందన్నారు. వీటితోపాటు అప్పుడప్పుడు దుర్వాసనతో కూడిన గ్యాస్ను బయటకు వదలడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. రాత్రిళ్లు శబ్దాలకు పిల్లలు చదవ లేకపోతున్నారన్నారు. వాయు కాలుష్యంతో గ్రామస్తులు అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఈ నెల 18న గ్రామ సర్పంచ్ పెనాక అనూష ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటి అధికారులూ ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడలేదని విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్ పెనాక అనూష మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పంచాయతీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామం తరఫున కాలుష్యం విషయమై ప్రశ్నిస్తే వైట్ కేటగిరీ పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నామని, అందువల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని ఫ్యాక్టరీ ఇన్చార్జ్ సతీష్ తెలిపారన్నారు. తీరా చూస్తే వివిధ రకాల పొల్యూషన్లతో గ్రామాన్ని చిదిమేస్తోంది. నిర్లక్ష్యంగా ఫ్యాక్టరీ ప్రతినిధి వైఖరి ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలుపుతున్న గ్రామస్తులతో మాట్లాడేందుకు వచ్చిన ఫ్యాక్టరీ ప్రతినిధి శ్రీనివాసన్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వెళ్లారు. గోడు చెప్పుకొంటుంటే ఏమీ పట్టనట్లు ప్రతినిధి నిర్లక్ష్యంగా వ్యవహరించడం గ్రామస్తులకు మరింత ఆవేదన కలిగించింది. -
వీఆర్కు సీఐ పాపారావు
● కావలి కొత్త సీఐగా శివశంకర్ కావలి: కావలి రూర ల్ సీఐ పాపారావును వీఆర్కు పంపిస్తూ శుక్రవారం అర్ధరాత్రి గుంటూర్ రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశా రు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో తమిళ బోట్లు మాయమైన ఘటన నేపథ్యంలో ఆయన్ను వీఆర్కు పంపినట్లుగా సమాచారం. ఆయన స్థానంలో శివశంకర్ను నియమించారు. శనివారం బాధ్యతలు స్వీకరించిన శివశంకర్ నెల్లూరులో ఎస్పీ అజిత వేజెండ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. హార్బర్ భూములు ప్రైవేట్ సంస్థకు కేటాయించడం దారుణం బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలోని ఫిషింగ్ హార్బర్ భూములను కొంత మేర సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయించడం దారుణమని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ ప్రతినిధులు ఖండించారు. జువ్వల దిన్నెలోని హార్బర్ను, సాగర్ డిఫెన్స్ సంస్థకు కేటాయించనున్న భూములను స్థానిక మత్స్యకారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హార్బర్ భూ ములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో సముద్ర తీరాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రతిపాదనలు విరమించుకొని, తక్షణమే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలని కోరారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు ఏపీ తీరంలో వేట సాగించకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల జువ్వలదిన్నెలో బోట్లు విడిపించుకు వెళ్లిన ఘటనలో బాధ్యులపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణపై ఏపీ తీరంలోని మత్స్యకారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. -
కామాంధులకు దేవాలయాల్లో పదవులా?
● తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామస్తుల మండిపాటు నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వంలో కామాంధులకు దేవస్థానాల చైర్మన్, కమిటీ మెంబర్ల పదవి ఇచ్చి ఆలయాల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని చిల్లకూరు మండలం తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామస్తులు మండిపడ్డారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన కోదండరామస్వామి ఆలయం చైర్మన్గా కోట సతీష్యాదవ్ను ఆరు నెలల క్రితమే నియమించారన్నారు. పదవి దక్కినప్పటి నుంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. మహిళలతో రాసలీలలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునే రీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలు, గ్రామ ప్రజలు ఈ కమిటీని అసహ్యించుకుంటున్నారని, ఆలయ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి నీచులకు ఒక క్షణం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా దేవాలయాలు చైర్మన్లు ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతుంటే ప్రజల్లో దైవచింతన ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వంటి వారిపై చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వర్లు, ఎస్ సుబ్రహ్మణ్యం, బి సుబ్రహ్మణ్యం, ఏ వెంకటేశ్వర్లు, ఎం శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
అశ్రునయనాల నడుమ..
పొదలకూరు: పట్టణంలోని వెంకటేశ్వరనగర్లో నివాసం ఉంటున్న ముత్తంగి వెంకటేశ్వర్లు అంత్యక్రియలను అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన అవశేషాలను నివాసానికి ఉదయం 11.30కు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి అచ్చెమ్మ, భార్య మమత, పిల్లలు భార్గవి, స్వాతి, శ్రీనాథ్, సోదరి సంపూర్ణ, సోదరుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు మండల స్థాయి అధికారులు, పోలీసులు హాజరయ్యారు. తహసీల్దార్ శివకృష్ణయ్య, ఎంపీడీఓ నరసింహరావు, సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై హనీఫ్ దగ్గరుండి అంత్యక్రియలను పూర్తి చేయించారు. అధికారుల రాకను చూసి మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున రోదించి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసి
కలిగిరి/ఉదయగిరి: ప్రమాదంలో తండ్రి పూర్తి గా కాలిపోయి మాంసం ముద్దలా మారి.. ఆయన వివరాల కోసం రెండు రోజులు నరకయాతన అనుభవించి.. అవశేషాలను ఇంటికి తీసుకొచ్చాక పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరైన ఆత్మకూరి రేష్మ పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయారు. మార్కాపురం వద్ద సంభవించిన ప్రమాదంలో నాగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఆత్మకూరి చిన్నయ్య (45) మృతి చెందిన విషయం విదితమే. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి గుర్తించేందుకు సైతం వీల్లేకుండాపోయింది. ఆయనకు ఐదుగురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అంజలి ఇటీవల ఇంటర్ పూర్తి చేయగా, రెండో కుమార్తె రేష్మ.. వింజమూరులో పదో తరగతి పరీక్షలను రాస్తోంది. తండ్రి అవశేషాలను చూసి పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. అంత దుఃఖంలోనూ వింజమూరులోని నేతాజీ హైస్కూల్లో సైన్స్ పరీక్షను రేష్మ రాసింది. ఆమెను ఉపాధ్యాయులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఓదార్చారు. -
కడచూపూ కరువాయె బిడ్డా..
దుత్తలూరు: కడచూపునకూ నోచుకోలేదు బిడ్డా.. ఎలాంటి మృత్యువు సంభవించింది.. ఈ కష్టం పగవాడికీ రాకూడదు.. మేమెలా బతికేదంటూ బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో మందాలనాయుడుపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గుండ్లపల్లి వెంకటేష్ మాంసపు ముద్దను అంబులెన్స్ ద్వారా గ్రామానికి తీసుకొచ్చారు. ఆపై అంత్యక్రియలను పూర్తి చేశారు. తల్లిదండ్రులు, భార్యను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. చిన్నపిల్లలను చూసిన ప్రతి ఒక్కరి మనస్సు చలించిపోయింది. తహసీల్దార్ యనమల నాగరాజు, ఎస్సై ఆదిలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జున నివాళులర్పించారు. -
నిరుద్యోగులకు కూటమి ద్రోహం
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి ద్రోహం చేసిందని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 14వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. కాకాణి మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై మొదటి సంతకం అని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం చేసిన చాలా నెలల తర్వాత దగా డీఎస్సీగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ కాకి లెక్కలేనన్నారు. చంద్రబాబు, లోకేశ్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ సచివాలయ పరిధిలో ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో జాబితాను ధైర్యంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను కారు చౌకగా తమ అనుయాయులు కట్టబెడుతూ దోపిడీకి ప్రయత్నిస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల సృష్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఊహించని విధంగా సచివాలయ వ్యవస్థను తెచ్చి 1.50 లక్షల ఉద్యోగోలు ప్రత్యక్షంగా కల్పించారని, పరోక్షంగా 2.50 లక్షల వలంటీర్లకు ఉద్యోగ ఉపాధి కల్పించారని కాకాణి గురు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కార్మికుల భద్రతకు, సంక్షేమానికి పెద్ద పీట వేశారని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించి అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమీక్షలు గానీ, కార్మికుల భద్రత పట్ల శ్రద్ధ గానీ లేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కార్మికుల భద్రత గాలిల్లో ఉందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో నినదించిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కార్మికులతో అగౌరవంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని యూనిట్లు ఒక్కొక్కటిగా మూత పడుతుంటే.. రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూటమి నేతల దోపిడీని చూసి పారిపోతున్నాయన్నారు. కంపెనీల వారీగా ఎక్కడెక్కడ ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో జాబితా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్సీపీ కార్మికుల కోరికల సాధన కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం ముందుంటామన్నారు. నెల్లూరు సిటీ కార్యాలయంలో... నగరంలోని రాంజీనగర్లో ఉన్న వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ కాంగ్రెస్ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్టీయూసీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కేక్ కటింగ్ నిర్వహించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్టీయూసీ ముందుండాలని చంద్రశేఖర్ రెడ్డి సూ చించారు. వైఎస్సార్టీయూసీ కార్మికులకు అండగా పోరాటాలకు వేదిక కావాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లేవ్ పరిశ్రమల పేరుతో భూముల దోపిడీ తప్ప మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఘనంగా వైఎస్సార్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం -
హైస్పీడ్ బోటుతో తీరంలో గస్తీ
● మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం ● కొత్త బోటు కొనుగోలుకు నిధులు మంజూరు ● మరో బోటును అద్దెకు ఏర్పాటు చేయాలని సూచననెల్లూరు (దర్గామిట్ట): జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లో మత్స్యకారుల భద్రతకు, తమిళ జాలర్లు ఆగడాలను అరికట్టేందుకు సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 450 హెచ్పీ సామర్థ్యం గల హైస్పీడ్ బోటును తక్షణమే కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివా రం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మత్స్యశాఖ అధికారులు, తీర ప్రాంతంలోని 9 మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రెండు బోట్లతో గస్తీ నిర్వహిస్తున్నాయని, వీటిని హైస్పీడ్ బోట్స్గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. కొత్త బోటులో వీడియో రికార్డింగ్ సదుపాయం కలిగిన రెండు బైనాక్యూలర్లు, అధిక సామర్థ్యం గల తాళ్లు, అగ్నిమాపక నిరోధక సిలిండర్లు, రెండు ఫ్లాష్ లైట్లు, రెండు మెడికల్ కిట్లు వంటి అవసరమైన అన్ని భద్రతా పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొత్త హైస్పీడ్ బోట్ వచ్చే వరకు ఒక హైస్పీడ్ బోట్ను అద్దెకు రెండు రోజుల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ శాంతి, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్బాషా పాల్గొన్నారు. -
గూడు చెదిరి.. గుండె పగిలి
కోవూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయా ల్సింది పోయి, ఉన్న గూడును కూలగొడుతున్నారు కూటమి నేతలు. దశాబ్దాలుగా కాలనీల్లో తలదాచుకుంటున్న నిరుపేదలపై పచ్చమూక కక్షగట్టింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడు పంచాయతీ స్టౌ బీడీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. సుమారు 50 ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే నివాసముంటున్న తమను ఒక్క నిమిషంలో రోడ్డున పడేశారని మహిళలు బోరున విలపించారు. ‘మా సామాన్లు సర్దుకునే లోపు ఇళ్లను కూల్చేశారు. ఇప్పుడు మేం ఎక్కడికెళ్లాలి’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం ఊసు లేదు. పునరావాసం కల్పించే ఆలోచనే లేదని, కేవలం రాజకీయ కక్షతోనే ఇలా చేశారని వారు ధ్వజమెత్తారు. రోడ్డున పడిన బాధితులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తిరిగిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. గెలిచిన తర్వాత కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చెప్పుకొందామని ఎమ్మెల్యే ఇంటికి నాలుగుసార్లు వెళ్లినా, ఆమె కనీసం కనిపించలేదని వాపోయారు. ప్రజల కష్టాలు వినే తీరిక లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తమకు ఇళ్ల స్థలాలిచ్చి ఆదుకుందని బాధితులు గుర్తు చేసుకున్నారు. ‘ప్రశాంతిరెడ్డి.. మా కడుపు కొట్టొద్దు. బతకడమే భారమైన మాకు అద్దె ఇళ్లలో ఉండే స్థోమత లేదు. ఒక్కసారి మా బతుకులు వచ్చి చూడండి’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్యాయంగా ఇళ్లను కూల్చిన చోటే బాధితులు ధర్నాకు దిగారు.పేదలపై కక్ష సాధింపు నోటీసులు ఇవ్వలేదు పునరావాసం ఊసే లేదు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తీరుపై బాధితుల ఆగ్రహం -
వసతుల కల్పనకు అరకు ఎంపీ నిధులు
● రూ.10 లక్షల కేటాయింపు● కృతజ్ఞతలు తెలిపిన ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విన్నపించారు. ఆమె సానుకూలంగా స్పందించి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. దీనిపై ప్రసన్న శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కొడవలూరు మండలంలోని నార్తురాజుపాళెంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, విడవలూరు మండలంలోని చౌకిచర్ల గిరిజన కాలనీలో సిమెంట్ రోడ్డు పనుల నిమిత్తం రూ.3 లక్షలు, దంపూరు ఎస్సీ కాలనీలో సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.2 లక్షలను ఎంపీ కేటాయించారు. నిధుల కేటాయింపుంపై కోవూరు నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. -
గ్యాస్ గండం.. ప్రజలకు తిప్పలు
ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కొందరు హోటళ్లను మూసివేయగా.. మరికొందరు కట్టెలతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా గృహ వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు లభ్యం కాకపోవడంతో కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, నెల్లూరు -
ఎన్నాళ్లీ కష్టాలు
● గూడూరులో కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఏజెన్సీలు ● అవస్థలు పడుతున్న ప్రజలు ● మూతపడుతున్న హోటళ్లుచిల్లకూరు: గూడూరులో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు శుక్రవారం పండగ పూట వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరో రెండు నెలలు వరకు గ్యాస్, పెట్రో ఉత్పత్తులకు ఎలాంటి ఢోకా లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ స్థానికంగా ఉండే ఏజెన్సీలు, పెట్రోల్ దుకాణాల నిర్వాహకులు కృతిమ కొరతను సృష్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్యాస్ సిలిండర్లను బ్లాక్మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికరేటు పెట్టి బ్లాక్లో కొనలేని కొందరు హోటళ్లను మూసివేశారు. గూడూరులో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా, చిరు వ్యాపారాలు చేసే ఎందరో పేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలు తమ సిబ్బందితో ఒక సిలిండర్ను రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బారులు తీరి.. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల ఎదుట వినియోగదారులు సిలిండర్లతో బారులు తీరుతున్న పరిస్థితులున్నాయి. గంటలకొద్దీ వేచి చూస్తుండగా నిర్వాహకులు అరకొరగా సిలిండర్లను అందించి చేతులు దులుపుకొన్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లయీస్ అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయడం లేదని ఆరోపణలున్నాయి. వారికి భారీస్థాయిలో ముడుపులు ముడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతంలోని టిడ్కో ఇళ్ల వద్దకు ఏజెన్సీ సిబ్బంది వచ్చి అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తున్నారని ఓ రెవెన్యూ అధికారికి ఫిర్యాదు అందింది. అంత దూరం తీసుకుని వచ్చి ఇవ్వడమే అదృష్టమని అధికారి అనడంతో వినియోగదారుడు నివ్వెరపోయాడు. గూడూరు ఆర్డీఓ గ్యాస్ ఏజెన్సీలపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. -
బ్రిడ్జి పైనుంచి పడిన ట్రాక్టర్
● వ్యక్తి మృతి మర్రిపాడు: ట్రాక్టర్ బ్రిడ్జి పైనుంచి కేతామన్నేరు వాగులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై కదిరినాయుడుపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (48), ఆత్మకూరు చందు ట్రాక్టర్లో ఫెన్సింగ్ స్తంభాలను వేసుకుని కావలి నుంచి పడమటినాయుడుపల్లి మజారా గ్రామమైన అనంతపురం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. దీంతో వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతిచెందగా, చందుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు, ఏఎస్ఐ నజీర్ చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఒక బాబు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా నాకాబందీ● డ్రంక్ అండ్ డ్రైవ్పై 33 కేసులు నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హైవే ప్రవేశం తదితర ప్రాంతాల్లో 1,502 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసులు నమోదు చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 19 కేసులు పెట్టారు. రహదారి నిబంధనల ఉల్లంఘనులపై 39 కేసులు నమోదు చేసి రూ.1,41,450ల జరిమానా విధించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే డయల్ 112, పోలీస్ కంట్రోల్రూమ్ నంబర్ 9392903143కు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
అక్రమ సంత నిర్వహణపై విచారణ జరపాలి
● సర్వేపల్లిలో అవినీతి కొత్త పుంతలు ● సోమిరెడ్డి అక్రమాలపై రాజీలేని పోరాటం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: అధికారాన్ని అడ్డంపెట్టుకొని గొలగమూడి రోడ్డు వద్ద నిర్వహించిన పశువుల సంతపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని గొలగమూడి రోడ్డు వద్ద నిర్వహిస్తున్న పశువుల అక్రమ సంతను పరిశీలించేందుకు గానూ చలో గొలగమూడి రోడ్డు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పార్టీ నేతలు, గో ప్రేమికులతో కలిసి సంతను నిర్వహించిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డంపెట్టుకొని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తూ, ప్రజల ఛీత్కారానికి గురవుతున్నారని విమర్శించారు. నిబంధనల్లేకుండా ప్రైవేట్ స్థలంలో సంత పెట్టి అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రతి నెలా అక్రమంగా వసూళ్లు సంత నిర్వాహకుల నుంచి రూ.పది లక్షలను సోమిరెడ్డి ప్రతి నెలా అక్రమంగా వసూలు చేసి.. గోవులు, గేదెలను చైన్నె పరిసరాల్లోని వధశాలలకు తరలించడం దౌర్భాగ్యమన్నారు. గోవులను ప్రేమించే ఎంతో మంది మనోభావాలను గాయపరుస్తూ, ఇలా తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతుల్లేకుండా, పంచాయతీకి ఎలాంటి సమాచారమివ్వకుండా భారీ పశువుల సంతను నిర్వహిస్తుంటే జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. తాను కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సంతను నిర్వాహకులు ఎత్తేశారని చెప్పారు. తమ హయాంలో మనుబోలులో ప్రభుత్వ అనుమతులతో సంత నిర్వహణకు వేలం నిర్వహించిన అంశాన్ని గుర్తుచేశారు. తద్వారా పంచాయతీకి రూ.18 లక్షల నుంచి రూ.32 లక్షలు జమ కావడంతో ఆ నిధులను తాగునీటి అవసరాలకు వెచ్చించామని వివరించారు. అయితే దీనికి విరుద్ధంగా సంతను సోమిరెడ్డి ఏర్పాటు చేయించి రూ.లక్షలను దోచుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంత నిర్వహణ ద్వారా మీరు చేసే పాపాలను లెక్కిస్తున్నామని, వీటిపై విచారణ జరిగిన రోజున భూ యజమాని బయటకొస్తారని, సంతను నిర్వహించిన వ్యక్తిని పట్టుకుంటే ఎవరెవరికి ఎంతెంత డబ్బులిచ్చారో చెప్తారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, జిల్లా నేతలు కొణిదెన విజయభాస్కర్నాయుడు, బాలయ్యనాయుడు, వెలిబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్కుమార్, మందా కృష్ణ, దూడల మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తేలుస్తారా.. తొక్కేస్తారా..!
సాక్షి, టాస్క్ఫోర్స్: సర్వేపల్లి ముఖ్య నేత అండదండలతో వెంకటాచలం మండలంలోని కాకుటూరులో సాగుతున్న భూ ఆక్రమణలపై కలెక్టర్ ఆరాతీస్తున్నారు. వీటిపై నివేదిక పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఓ వైపు సర్వేపల్లి ముఖ్య నేత, మరోవైపు నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ కీలక నేతల కార్యాలయాల నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లొస్తున్న క్రమంలో అక్రమలపై నిగ్గు తేలుస్తారా.. లేక తొక్కేస్తారాననే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వెంటనే నివేదిక పంపండి వెంకటాచలం మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకొని రూ.రెండు కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత దర్జాగా కజ్జా చేశారు. ఈ విషయమై భూమ్..ఫట్ అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితమైంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై కలెక్టర్ ఆరాతీశారని సమాచారం. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న విలువైన భూములు కబ్జాకు గురవుతుంటే, ఏమి చేస్తున్నారని.. దీనిపై నివేదికను పంపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఆక్రమణల జోలికెళ్లొద్దు కలెక్టర్ ఆదేశాలతో మండల రెవెన్యూ అధికారుల్లో కదలికొచ్చింది. ఆక్రమిత భూముల్లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కబ్జా చేసిన నెల్లూరు నగరానికి చెందిన టీడీపీ నేత.. సర్వేపల్లి ముఖ్య నేతను ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు. వీరి నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏమి జరుగుతోందో పరిశీలించేందుకు సైతం గ్రామానికి వెళ్లేందుకు వీరు జంకుతున్నారు. మండిపడుతున్న గ్రామస్తులు గ్రామంలో అంగన్వాడీ.. పాల కేంద్రాలు, లైబ్రరీ నిర్మాణాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఇతరులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలను చేపట్టడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీలకతీతంగా ఏకమై కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. నివేదిక పంపాలనే కలెక్టర్ ఆదేశాలు ఓ వైపు.. ఆక్రమణల జోలికెళ్లొద్దంటూ టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాకుటూరులో భూ ఆక్రమణలపై నివేదికకు కలెక్టర్ ఆదేశాలు రెవెన్యూ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ఆగని నిర్మాణ పనులు -
పెద్దల 'కుట్ర'..!
గంగపుత్రులకు అధికార టీడీపీ పెద్దలు వెన్నుపోటు పొడిచారు. తమిళనాడు జాలర్లతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం స్థానిక మత్స్యకారుల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఐదు నెలల కింద స్వాదీనం చేసుకున్న పాండిచ్చేరి (కరైకల్) బోట్లను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఉంచారు. ఇటీవల టీడీపీ కీలక మంత్రులు వచ్చి వెళ్లాక వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మత్స్యకార గ్రామాలు రగిలిపోతున్నాయి. ఈ కుట్ర వెనుక సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు అండగా నిలవకుండా తెరవెనుక లాలూచీకి పాల్పడ్డారంటూ కూటమి నేతల కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సింగరాయకొండ: తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో మన తీర ప్రాంతంలో చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్లడంతోపాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీనిపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొంత వరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకుకెళ్లినా ప్రయోజనం లేదు. సోనాబోట్ల ఆగడాలతో విసిగిపోయిన మత్స్యకారులు వాటిని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాంత మత్స్యకారులు ఏకమై ఒక సైన్యంలా ఏర్పడ్డారు. ప్రాణాలకు తెగించి తీరానికి వచ్చిన సోనాబోట్లను వెంబడించారు. తమిళనాడు జాలర్లను తరమికొట్టారు. నాలుగు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు. వాటిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్లో భద్రపరిచారు. ఎనిమిది నెలల కిందట జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్లను తమ భద్రతలో ఉంచుకున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడిలు వచ్చినా వదిలేందుకు మత్స్యకారులు ససేమిరా అన్నారు. మీ అంతుచూస్తామంటూ బెదిరింపులు ‘‘మా బోట్లను నిర్బంధించి, 8 నెలల పాటు ఇబ్బందులకు గురిచేస్తారా మీ అంతుచూస్తాం’’ అంటూ కరైకల్ మత్స్యకారులు బెదిరింపులకు దిగుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తీరానికి దగ్గరగా చేపల వేట సాగిస్తూ లక్షలాది రూపాయల విలువైన వలలు తెంచేస్తూ స్థానికులు కనబడితే దాడులకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. చివరకు వారు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.జువ్వలదిన్నెలో ఆ రాత్రి ఏం జరిగింది.. ఇటీవల జువ్వలదిన్నెకు మంత్రులు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు వచ్చి వెళ్లాక హార్బర్ నుంచి మత్స్యకారులు స్వాదీనం చేసుకున్న సోనాబోట్లు మాయమయ్యాయి. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతనే మంత్రులు వచ్చి ఈ మంత్రాంగం అంతా నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు వచ్చిన కార్యక్రమానికి టీడీపీకి అనుకూలంగా ఉన్న మత్స్యకారులను మాత్రమే అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో కరైకల్ ప్రాంతంలోని సోనాబోట్లకు చెందిన మత్స్యకారులు కూడా హార్బర్లోకి ప్రవేశించి అక్కడ నిర్బంధంలో ఉన్న నాలుగు బోట్లకు డీజిల్ నింపారు. ఒక్కో సోనాబోటుకు సుమారు 10 వేల లీటర్ల సామర్ధ్యమున్న డీజిల్ ట్యాంకు ఉంటుంది. ఈ ప్రకారం నాలుగు సోనాబోట్లకు సుమారు ఒకటిన్నర డీజిల్ ట్యాంకర్ సుమారు 15 వేల లీటర్లు నింపారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తరువాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బోట్లను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు బోట్లకు చెందిన ఇంజన్లు పనిచేయగా, ఒక బోటు ఇంజన్ మాత్రం మొరాయించింది. దీంతో ఆ బోటును మిగతా వాటికి కట్టుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానిక మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే తమిళనాడు రాష్ట్రం కడలూరుకు చెందిన సోనాబోట్లలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన వారిని అప్రమత్తం చేశారు. వారు ఆ బోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరమ్మతులకు గురైన బోటును వదిలేసి మిగతావాటితో పరారయ్యారు. వారు వదిలేసిన బోటును స్థానిక మత్స్యకారులు వెనక్కి తీసుకొస్తుండగా కరైకల్కు చెందిన మత్స్యకారులు సుమారు 12 బోట్లలో చుట్టుముట్టారు. దాడికి యత్నించారు. బోటును ఢీకొట్టారు. దౌర్జన్యానికి దిగి మరమ్మతులకు గురైన బోటును తీసుకెళ్లిపోయారు. బోటును ఢీకొట్టడంతో లోపలిభాగం ధ్వంసమైంది. దానిని మరమ్మతులు చేయాలంటే సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెర వెనకున్నదెవరు..? జువ్వలదిన్నె హార్బర్లో మెరైన్ పోలీసుల పర్యవేక్షణలో ఉన్న నాలుగు బోట్లను కరైకల్ మత్స్యకారులు తరలించుకుపోవటంపై భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఈ పని జరిగే అవకాశం ఉందా అని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక కుట్రలు చేసి బోట్లను వదిలేసి నేడు దానిని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు అండగా ఉంటామంటూ ప్రకటనలు చేయడం సరికాదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కుట్రదారులెవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తుŠాన్నరు. 15 వేల లీటర్ల డీజిల్ ఎక్కడ నుంచి వచ్చిందో బహిర్గతం చేయాలని నిలదీస్తున్నారు.మెరైన్ పోలీసుల రక్షణలో ఉన్న నాలుగు బోట్లు ఎలా వెళ్లాయో ప్రకటించాలని వారు ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. త్వరలో 164 గ్రామాల మత్స్యకారుల సమావేశం కరైకల్ బోట్ల వ్యవహారంపై శ్రీకాకుళం నుంచి తడ వరకు ఉన్న 164 మత్స్యకార గ్రామాల ప్రజలు సమావేశమై తదుపరి కార్యాచరణకు సమాయత్తమవుతున్నారు. వీరు త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారని స్థానిక మత్స్యకారుడు వివరించారు.ఐదు నెలలుగా ఎటువంటి భయం లేకుండా చేపల వేట సాగించామని, ఇప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కరించకుండా మరింత సమస్యను సృష్టించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తల్లీకుమారుడిపై కత్తితో దాడి
కావలి: తల్లీకుమారుడిపై కత్తితో దాడిచేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి జలదంకి మండలం చామదాలలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. గతేడాది వినాయకచవితి సమయంలో పందిటి పోలమ్మ, ఆమె కుమారుడిపై అదే గ్రామానికి చెందిన పందిటి పోలయ్య, హరికృష్ణ దాడి చేశారు. ఈ విషయమై అప్పట్లో జలదంకి పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంగళవారం వారి మధ్య మాటామాటా పెరిగింది. పలువురు సర్దుబాటు చేయడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. పోలయ్య, హరికృష్ణ, అమ్ములు అర్ధరాత్రి మారణాయుధాలతో తమపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని పోలమ్మ, ఆమె కుమారుడు తెలిపారు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని కావలి ఏరియా హాస్పిటల్కు తరలించారు. బాధితులు మాట్లాడుతూ గతంలో దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ విషయమై బుధవారం జలదంకి ఎస్సై లతీఫున్నీసా మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. కొద్దిరోజుల క్రితం నిందితులుగా ఉన్నవారిపై బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. హరి, పోలయ్య, అమ్ములుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. -
మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులు నిర్ణయించారు. నెల్లూరు కలెక్టరేట్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆన్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ సమావేశం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. సరఫరా, డిమాండ్ తగ్గింపు, అవగాహన, పునరావాసం అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా గుర్తించి ధ్వంసం చేసే దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాల తనిఖీలు కట్టుదిట్టం చేయడం, అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం, అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రోడ్లు, రైల్వేలు, సముద్ర మార్గాల్లో తనిఖీలను తప్పనిసరి చేస్తామన్నారు. అంతర్రాష్ట స్మగ్లింగ్పై ముఖ్యంగా విశాఖపట్నం మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నామన్నారు. అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం, డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తరించడం, స్థానిక మీడియా ద్వారా ప్రచారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీటీఏ నిరసన
నెల్లూరు(టౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలంటూ బీటీఏ నేతలు బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేడి రమేష్ మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఇంతవరకు బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలవుతున్నా ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో నేతలు మాస ప్రసాద్, మనోజ్కుమార్, శ్రీనివాసులు, రవి, శంకరయ్య, శ్రీనివాస్, విజయమ్మ, మల్లికార్జునరావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. -
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలని డీఎంహెచ్ఓ సుజాత ఆదేశించారు. బుధవారం మాతాశిశు మరణాల సబ్ కమిటీ సమావేశం నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రస్తుత మార్చి నెల వరకు ఒక మాతృ, ఏడుగురు శిశువులు మరణించారని ఇందుకు గల కారణాలు తెలపాలని కోరారు. ఏఎన్ఎం నిర్లక్ష్యం వల్ల మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళ గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించి రిజిస్టర్లో ఆమె వివరాలను నమోదు చేసుకుని ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. రక్తహీనత ఉందా?, బీపీ ఉందా అని పరీక్షించాలన్నారు. ఆస్పత్రిలో సుఖ ప్రసవం జరిగే వరకు ఏఎన్ఎంతోపాటు డాక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పుట్టిన పిల్లలకు తక్షణమే పురిటిపాలు ఇప్పించాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ టీకాలు షెడ్యూల్ ప్రకారం వేయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ పరిమళ, డీఐఓ డా.ఉమామహేశ్వరి, గైనకాలజీ డాక్టర్ మేరీస్నిగ్ధ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శోభారాణి, జీజీహెచ్ అనస్థీషియా హెచ్ఓడీ డాక్టర్ శ్రీనివాసరావు, డా.గ్రేస్ ప్రియాంక, బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాజ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. సీపీఐ కార్యాలయంలో వారు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని రైస్మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతుల్ని ఆదుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిరాజ్, లీలామోహన్, సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
టచ్ చేసి చూడు..
అవినీతి అధికారికే అందలం ● ఆయన్ను సరెండర్ చేసే అధికారం నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈకి లేదంటూ స్పష్టీకరణ ● అక్కడే నియమిస్తూ ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ● చక్రం తిప్పిన సర్వేపల్లి ముఖ్య నేత ● ఇరిగేషన్ శాఖలో అవినీతి పారుదలకు లైన్ క్లియర్ ఇరిగేషన్ శాఖలోని నెల్లూరు సెంట్రల్ డివిజన్లో అవినీతి ముద్ర పడిన అధికారిని టచ్ చేస్తే.. స్థానిక అధికారులకు మడతైపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్వేపల్లి ముఖ్యనేత అండతో డిప్యుటేషన్పై డీఏఓ (డబ్ల్యూ) గ్రేడ్–1గా పాగా వేసిన ఓ అధికారి అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వరదల పనుల బిల్లుల్లో కమీషన్లు దండుకున్నాడు. అసలు పనులే చేయకుండా.. ఒకే పనికి మూడు పథకాల పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. కాంట్రాక్టర్ల నుంచి ఫోన్పే ద్వారా లంచాలు తీసుకుంటూ.. ఫైళ్లలో సంతకాలు చేస్తుండటంతో అదే శాఖలోని అధికారులే విచారణకు సిఫార్సు చేస్తే, రాజకీయ అండతో దీన్ని తొక్కి పెట్టించారు. సరెండర్ చేస్తే.. రెండు నెలలు తిరగకుండానే తిరిగి అదే సీటులో కూర్చొనే స్థాయిలో చక్రం తిప్పడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం అండతో అవినీతిలో కూరుకుపోయిన అధికార్నే అదే స్థానంలో అందలం ఎక్కిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఆయన్ను ఇక్కడి నుంచి సరెండర్ చేసే అధికారం స్థానిక అధికారికి లేదంటూ ఉత్తర్వుల్లోనే ఉటంకించడం చూస్తే.. ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థమవుతోంది. రెండు నెలల్లోనే తిరిగి అదే స్థానంలోకి రావడానికి ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖలోని కీలక అధికారులకు భారీగానే ముడుపులు అందించారనే ఆరోపణలు లేకపోలేదు. ఇరిగేషన్ శాఖలో నెల్లూరు సెంట్రల్ డివిజనల్ అకౌంటెంట్ అధికారిగా పని చేసే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ఆయన్ను ఇక్కడి నుంచి బదిలీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం రాగానే సదరు అధికారిని సర్వేపల్లి ముఖ్య నేత తన రాజకీయ పరపతితో రెగ్యులర్ బదిలీ కాకుండా.. డిప్యుటేషన్పై తిరిగి నియామకం చేయించారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు ఫ్లడ్ డ్యామేజ్ పనుల పేరుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని వాటాలు పంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతేడాది వచ్చిన మోంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న సాగునీటి కాలువల మరమ్మతులకు కలెక్టర్ ప్రతిపాదనలు మేరకు రూ.93.27 కోట్ల నిధులను మంజూరు చేయగా సర్వేపల్లిలో 316 పనులను రూ.5 లక్షల లోపు పనులుగా విభజించి నామినేషన్ పద్ధతిలో కొన్ని, టెండర్ ప్రక్రియలో తన అనుచరులకే పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఇందుకు సదరు డీఏఓ సంపూర్ణ సహాయ సహకారం అందించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు డివిజనల్ అకౌంటెంట్ అధికారి కాంట్రాక్టర్ల నుంచి తనతోపాటు, తన తనయుడు, సమీప బంధువుల ఫోన్పేలకు లంచాలు బదిలీ చేయించుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. సీఎంఓకు ఫిర్యాదులు చేసినా.. నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై అదే శాఖలోని ఓ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయానికి గతేడాది అక్టోబర్ 26న లేఖ రాశారు. ఆ శాఖ ఈఎన్సీతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కలెక్టర్కు ఆ లేఖ ప్రతులు పంపారు. సుమారు రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, గతంలో చేసిన పనులను ఎఫ్డీఆర్ (ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్లు), ఉపాధి హామీ, డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్స్, ఓఎంఎంలో బిల్లులు చేయించుకున్నారని, మోంథా తుపాన్ పనులు పూర్తిస్థాయిలో అవినీతి చోటు చేసుకుందని, ఆయా అక్రమాల్లో తమ శాఖ ఎస్ఈ ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు చేయడంతో స్పందించిన సీఎంఓ విచారణకు ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. అయితే తీగ లాగితే డొంక కదులుతుండడంతో ఓ సీనియర్ ఎమ్మెల్యే విచారణ అధికారిని మేనేజ్ చేసి నివేదికను తొక్కిపెట్టించారనే ఆరోపణలున్నాయి. విచారణలో జాప్యం అవుతుండడంతో ఆ ఫిర్యాదుపై శాఖ పరమైన నివేదిక ఇవ్వాలని నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఎస్ఈ, ఈఈలకు ఆదేశాలొచ్చాయి. సరెండర్ చేసిన రెండు నెలల్లోనే.. సదరు డీఏఓ అవినీతిపై సీఎంఓ నుంచి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ‘ఫోన్పేలో లంచం.. ఫైళ్లలో సంతకం’ ఇరిగేషన్లో అవినీతి జలగలనే శీర్షికతో ఈ ఏడాది జనవరి 2వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన నెల్లూరు ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అదే నెల 9న సంబంధిత శాఖలను పొందుపరిచి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే సర్వేపల్లి ముఖ్య నేత అండదండలతో చక్రం తిప్పడంతో సదరు డీఏఓను యథాస్థానంలో నియమిస్తూ రాష్ట్ర ఆర్థిక (పనుల ఖాతాలు) శాఖ డైరెక్టర్ బోగిరి ప్రేమకుమారి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం ఇరిగేషన్ నెల్లూరు సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అందాయి. ఇదిలా ఉండగా సదరు డీఏఓను బదిలీ/సరెండర్ చేసే అధికారం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు లేదంటూ పేర్కొనడం చూస్తే.. ఇకపై ఆయన్ను ఇక్కడి నుంచి కదిలించొద్దని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని ఆ శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సీఎంఓ విచారణ ఆదేశాలను తొక్కిపెట్టడం.. సరెండర్ను రద్దు చేయించడం డీఏఓకు సాధ్యపడేది కాదని, సర్వేపల్లి ముఖ్యనేతనే ఈ స్థాయిలో చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. సదరు అధికారిని అడ్డం పెట్టుకుని సర్వేపల్లిలో రూ.కోట్ల దోపిడీకి లైన్ క్లియర్ అయిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్ల ర్యాలీ
నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ఎల్ఐసీ డివిజన్ కార్యాలయం నుంచి కిమ్స్ ఆస్పత్రి, కేవీఆర్ పెట్రోల్ బంకు, ఆర్టీసీ మీదుగా తిరిగి సంస్థ కార్యాలయం వరకు ఎల్ఐసీ సిటీ బ్రాంచ్ 1, 2, సీఏబీ బ్రాంచ్ ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, పలువురు ఏజెంట్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ బి.ప్రసాద్రావు మాట్లాడుతూ బీమా రంగంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ మాత్రమేనన్నారు. ఎల్ఐసీ సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో రకాల పాలసీలను ప్రవేశపెట్టిందన్నారు. నవజీవన్శ్రీ సింగిల్ ప్రీమియం పాలసీకి ప్రజల నుంచి పెద్దఎత్తున ఆదరణ వస్తోందన్నారు. ఒక్కసారి ప్రీమియం చెల్లించి 5, 10, 15, 20 సంవత్సరాలపాటు టర్మ్ తీసుకునే సదుపాయం ఇందులో ఉందన్నారు. రాబడి, రిస్క్ కవర్, గ్యారెంటీ అడిషన్స్ కలిపిన పాలసీ ఈనెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రామకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.


