SPSR Nellore
-
మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్
మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఆరు పదులు దాటిన వయస్సులో కూడా బిడ్డలపై ఆధార పడకుండా ఆ దంపతులు చిరు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. కావలి– ఉదయగిరి రోడ్డుకు సుమారు ముప్పై అడుగుల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకుని అందులోనే చిన్నపాటి ఫలసరుకుల దుకాణం నిర్వహించుకుంటున్నారు. ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. తమ ఇంట్లోనే ఉంటున్న ఆ దంపతులపైకి ఊహించని మృత్యువులా మినీ వ్యాన్ దూసుకొచ్చింది. దంపతుల శరీర భాగాలు నుజ్జునుజ్జుగా మారి చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తే.. దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. -
ప్రైవేట్ గుప్పెట్లోకి ప్రభుత్వ వైద్యం
నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ వైద్య రంగాన్ని పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్ (పీపీసీ) పేరుతో ప్రైవేట్ యాజమాన్యాల చేతికి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంటోందని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎంవీ రమణయ్య, కామేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల అనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు నిర్మించిందన్నారు. వీటిలో గత ప్రభుత్వం ప్రారంభించిన నూతన వైద్యకళాశాలలతోపాటు నిర్మాణంలో చివరి దశలో ఉన్న వైద్యకళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ వారికి అప్పగిస్తామని కూటమి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించడం దారుణమన్నారు. ఇదే జరిగితే పేదలకు సరైన వైద్యం అందదన్నారు. ప్రజలు వైద్యం కోసం ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వ వైద్యులు కాపాడితే కార్పొరేట్ వైద్యులు తాళాలు వేసుకున్నారని, కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు రూ.కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన విధానం మార్చుకోకపోతే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసి మెడికల్ సీట్లు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. పేద, అణగారిన వర్గాల వారికి సీట్లు దక్కవన్నారు. రిజర్వేషన్లు కూడా అమలు జరగవన్నారు. కర్ణాటక, ముంబైలో పీపీపీ మోడ్లో నడుస్తున్న ప్రభుత్వ వైద్యశాలలు విఫలమయ్యాయన్నారు. అలాంటి వ్యవస్థను రాష్ట్రంలో బలవంతంగా అమలు చేయొద్దన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్లో 50 శాతం సీట్లు ప్రభుత్వమే అమ్ముకునేందుకు వీలు కల్పించే జీఓ నంబర్ 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీడీపీలో వైద్య రంగానికి 6 శాతం నిధులు కేటాయించాలని, నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానంలోనే వైద్య కళాశాలలు, ఆస్పత్రులను నడపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సులకు మేధావులు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు పంపామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులను కొనసాగిస్తామని సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు జూలై నుంచి శ్రీకారం చుట్టుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు కామయ్య పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణం వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి పీపీసీ పేరుతో ప్రైవేట్కు అప్పగిస్తే ఊరుకునేదిలేదు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు -
ఫీడింగ్ ఖర్చు తగ్గించుకునేందుకు..
ప్రాణాంతక వ్యాధులు వస్తాయి చికెన్ వ్యర్థాల్లో పలు రకాల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు, వైరస్లు ఉంటాయి. తగిన విధంగా ప్రాసెస్ చేయకుండా, చేపలకు నేరుగా ఆహారంగా వేయడం వల్ల ఈ–కొలీ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని వల్ల చేపలతోపాటు మనుషులకు ప్రమాదకరమైన జబ్బులు కలిగిస్తాయి. చేపలను శుభ్రపరిచేటప్పుడు వాటిని తాకిన మనుషులకు అలెర్జీలు, టైఫాయిడ్ జబ్బులు రావొచ్చు. వ్యర్థాల్లో ఉండే అమ్మోనియా నీటిలో కలుషి తం కావడం వల్ల ఆర్సెనిక్, లెడ్ వంటి విష పూరితమైన మూలకాలు నీటిలో కలిసే ప్రమాదం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడంతోపాటు, నరాల బలహీనతలు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, సీనియర్ వైద్యుడు, పీపీసీ చేపలు.. అదీ నెల్లూరు చేపల పులుసు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఫేమస్. వీటిల్లోని ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు నెల్లూరు చేపలు తింటే గుండె, కిడ్నీ, జీర్ణాశయం జబ్బులతోపాటు ప్రధానంగా కేన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. చేపల పెంపకందారులు వీటికి కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తుండడమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నీరు, ఆహారం కలుషితం చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా గుంతల్లో వేసినప్పుడు నీరు కలుషితమవుతోంది. పాత నీటిని వదిలి కొత్త నీటిని గుంతల్లోకి వదిలే క్రమంలో ఒక చోట నుంచి మరో చోటుకు కలుషితమైన నీరు చేరడం ద్వారా మానవులకు చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. ఇలాంటి చేపలను తినడం ద్వారా మనుషులకు సులభతరంగా జబ్బులు అంటుకుంటున్నాయి. చేపల్లో చేరిన సీసం ద్వారా మనుషుల్లో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల చికెన్ వ్యర్థాలను చేపల గుంతల్లో వేయడం మంచిది కాదు. – డాక్టర్ వై.గంగాధర్, ఎండీ, ఫిజీషియన్, లీడ్ హాస్పిటల్, నెల్లూరు ● జీర్ణాశయం, గుండె, కిడ్నీ వ్యాధులు వస్తాయని వైద్యుల హెచ్చరిక ● కేన్సర్ కూడా రావొచ్చని చెబుతున్న డాక్టర్లు ● వీటికి చికెన్ వేస్టే ఫీడింగ్ ● కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వినియోగం ● నిత్యం పట్టుబడుతున్న చికెన్ వ్యర్థాల వాహనాలు ● కట్టడి చేయలేకపోతున్న అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాన్వెజ్ ఫుడ్లో ఆరోగ్యానికి చేపలు మంచివని వైద్యులు సూచిస్తుంటారు. సంప్రదాయంగా చెరువులు, వాగులు, జలాశయాల్లో పెరిగే చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తుండగా, జిల్లాలో వేలాది ఎకరాల్లో కృత్రిమంగా పెంచుతున్న చేపలు తింటే మాత్రం చేటు తప్పదని అదే వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో అరకొర మంది చేపల ఉత్పత్తిదారులు ఇలాంటి చికెన్ వ్యర్థాలను చాటుమాటున వినియోగిస్తుంటే.. కూటమి ప్రభు త్వం వచ్చాక విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కోవూరు షాడో ఎమ్మెల్యే నేతృత్వంలో ‘చికెన్ వేస్ట్ మాఫియా’ ఏర్పాటైంది. కోవూరు నియోజకవర్గంలో అన్ని మండలాలతోపాటు, ఆత్మకూరు, సర్వేపల్లి మండలాల్లో కొన్ని గ్రామాల్లో చేపల పెంపకం జరుగుతోంది. ఈ మాఫియా కనుసన్నల్లోనే అన్ని ప్రాంతాలకు కుళ్లిన చికెన్ వ్యర్థాలను తెచ్చి వినియోగిస్తున్నారు. నెలకు రూ.కోట్లల్లో ఈ వ్యాపారం జరుగుతుంటే ఏ స్థాయిలో వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి తమ జేబులు నిండితే చాలన్నట్లుగా టీడీపీ నేతలు కాసులు పిండుకుంటున్నారు. పోలీసులు, మత్స్యకార అధికారుల సహకారంతో ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో డంపింగ్ యార్డులు పర్యావరణాన్ని కాపాడే చర్యల్లో భాగంగా చేపలు, రొయ్యలకు మేతగా కుళ్లిన మాంసాన్ని వేయడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్రత్యేక జీఓ కూడా తెచ్చింది. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు చికెన్ వేస్ట్ను నిర్వీర్యం చేస్తూ చర్యలు చేపట్టడంతో ఇది జిల్లాలో కూటమి నేతలకు వరంగా మారింది. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కొందరు మాఫియాగా తయారయ్యారు. ఇందు కోసం బెంగళూరు, చైన్నె, కేరళ ప్రాంతంలో కోళ్ల వ్యర్థాల సేకరణకు ప్రత్యకంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లో చికెన్ నుంచి వ్యర్థాల సేకరణ చేస్తున్నారు. కేజీ రూ.5 వంతున సేకరించి డంపింగ్ యార్డుల్లోకి చేర్చుకుని అక్కడి నుంచి రాత్రి వేళల్లో లోడింగ్ చేసి నెల్లూరుకు రవాణా చేస్తున్నారు. నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఈ వాహనాలు రాష్ట్రాల చెక్పోస్టులు, జిల్లాలోని టోల్గేట్లు దాటుకుని వస్తున్నప్పుడు వాటిని కట్టడి చేసే అవకాశం ఇటు పోలీసులకు, అటు మత్స్యశాఖ అధికారులు పెద్ద కష్టమేమి కాదు. వీటిని గుర్తించి కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీస్ శాఖకు ఒక్కో వాహనానికి రూ.10 వేలు వంతున నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే నెలకు వంద వాహనాలు తిరిగితే నెలకు ఒక్కో స్టేషన్కు రూ.10 లక్షలు ఇస్తారు. సర్కిల్, డీఎస్పీ స్థాయి అధికారులతోపాటు మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేకంగా మామూళ్లు ఇస్తారనే ఆరోపణలున్నాయి. బెంగళూరు నుంచి కడప సరిహద్దు ప్రాంతం నుంచి వాహనాలు వస్తాయి. చైన్నె, కేరళ నుంచి జాతీయ రహదారి నుంచే వాహనాలు వస్తాయి. ఆయా ప్రాంతాల్లో ప్రతి స్టేషన్కు, సర్కిల్కు నెలవారీ మామూళ్లు ఇస్తుండడంతో ఏ అధికారి ఆ వాహనాల జోలికి వెళ్లడం లేదు. అడపాదడపా రోడ్డు ప్రమాదాలు, వాహనం పాడైతే మాత్రం వ్యర్థాల రవాణా వెలుగులోకి వస్తున్నాయి చేతులెత్తేసిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చికెన్ వ్యర్థాల మాఫియా బరితెగించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చికెన్ వ్యర్థాల విషయంపై పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల తర్వాత కట్టడి చేస్తామని, క్రాప్ మధ్యలో ఉందని చెప్పారు. కానీ ఎక్కడా ఎమ్మెల్యే ఆదేశాలు అమలు చేయడం లేదు. అడపాదడపా పోలీసులు వాహనాల పట్టివేత చూపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరు మండంలోని వాసిలి ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన కార్యకర్తలు చికెన్ వ్యర్థాల డంపింగ్ కేంద్రాన్ని చూపించి పోలీసులకు పట్టించారు. ఇంత జరుగుతున్నా.. పాలకులకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.జిల్లాలో ప్రధానంగా కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, విడవలూరు, ఆత్మకూరు రూరల్, సంగం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లో వేల ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతోంది. అయితే చేపలకు వినియోగించే ఫీడ్ (ఆహారం) ఖరీదు కావడంతో వీటి పోషణ రైతులకు భారంగా మారింది. సాధారణంగా చేపలు ఒక కేజీ పైబడి పెరగడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతోంది. రైతుల దగ్గర వ్యాపారులు చేపలను కేజీ రూ.80 నుంచి రూ.90లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అదే కోళ్ల మేతగా బ్రాండెడ్ ఫీడ్కు బదులు, ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగించడంతో నాలుగు నెలలకే కేజీ, అంతకు మించిన బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు కోళ్ల వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి కోళ్ల వ్యర్థాలు జిల్లాకు తెచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కేజీకి ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15లకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా నెలకు సుమారుగా రూ.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్చేశారు. మంగళవారం నెల్లూరు బాలాజీనగర్ పోలీస్స్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. బాలాజీనగర్ వైకే ఆచారి స్కూల్ వీధిలో ఎల్.విజయచంద్ర, శైలజ (46) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. విజయచంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి ఆస్తి కోసం చైన్నె కోర్టులో కేసు వేసి ఓడిపోయింది. కేసుకు సంబంధించి ఆమె భర్తచే రూ.40 లక్షలకు పైగా అప్పు చేయించింది. దీని కారణంగా విజయచంద్ర పిల్లల ఫీజులు సైతం కట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే శైలజ భర్తపై అనుమానం పెంచుకుని వేధించసాగింది. విధులకు వెళ్లినా వీడియో కాల్స్ చేస్తుండేది. వేధింపులు తాళలేని విజయచంద్ర భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 14వ తేదీన అతను కుమారులను భోజనం తీసుకురావాలని ఇంటి నుంచి బయటకు పంపాడు. పథకం ప్రకారం భార్య గొంతుకు టవల్ బిగించి చంపేందుకు యత్నించాడు. ఆమె చావకపోవడంతో రోకలిబండతో బలంగా తలపై కొట్టాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకున్న అనంతరం విజయచంద్ర పరారయ్యాడు. మృతురాలి పెద్దకుమారుడు ఎల్.శ్యామ్సాత్విక్ ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ఇన్స్పెక్టర్ సోమవారం అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
పేలుడు సామగ్రి స్వాధీనం
ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో మంగళవారం అటవీ, పోలీసు శాఖ సిబ్బంది స్పందించారు. దుర్గంపైకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దుర్గంపైన ఉన్న రామ బుగ్గ, కరీమ్ బుగ్గ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకందారులు వదిలివెళ్లిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 16 జిలెటిన్ స్టిక్స్తోపాటు విద్యుత్ వైర్లు, పేలుడుకు ఉపయోగించే స్టార్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ముఠా కొన్నిరోజులనుంచి దుర్గంపైనే మకాం పెట్టి భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. విలువైన సంపదను కూడా ఈ తవ్వకందారులు తీసుకెళ్లి ఉంటారనే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి ఉదయగిరిలోని దిలావర్భాయి వీధికి చెందిన పలువురు యువకులు పార్టీ చేసుకునేందుకు దుర్గంపైకి వెళ్లారు. వారిని గమనించి గుప్తనిధుల తవ్వకందారుల ముఠా పరారైనట్లు తెలుస్తోంది. -
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని పంచేడు గ్రామంలో చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి గ్రామం మీదుగా చికెన్ వ్యర్థాలతో వాహనం వెళ్తుండగా స్థానికులు దుర్గంధం భరించలేక అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. రాత్రి వేళల్లో చికెన్ వ్యర్థాల వాహనాలు పదుల సంఖ్యలో తమ గ్రామం మీదుగా వెళ్తున్నాయని, పోలీసులు నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. నూతన రహదారితో ప్రజలకు ఉపయోగంఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి మర్రిపాడు మండలం డీసీపల్లి మీదుగా వెన్నవాడ, గండ్లవేడులను తాకుతూ వింజమూరు మండలం నల్లగొండ్ల వరకు పీఎంజీఎస్వై పథకంలో నిర్మిస్తున్న రహదారి మూడు మండలాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ అశోక్ పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులను తన శాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్లవేడు – నల్లగొండ్ల మధ్య నిర్మించిన తారు, సిమెంట్ రోడ్లతోపాటు వెన్నవాడ బొగ్గేరు వద్ద నూతనంగా నిర్మించిన కాజ్వే పనులను ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. అనంతరం డీసీపల్లి – రామస్వామిపల్లి మధ్యలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, తారురోడ్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఈ రహదారుల నిర్మాణాలను పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే వెన్నవాడ వద్ద సుమారు 250 మీటర్ల మేరకు స్థానికులు రహదారి నిర్మాణానికి ఇబ్బందులు కల్పిస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్ విభాగం డీఈ సుధాకర్రెడ్డి, ఏఈ ప్రసాద్, గండ్లవేడు స్థానిక నాయకుడు కొల్లి దొరస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. సాగునీరు విడుదలసైదాపురం: కండలేరు 2ఏ, 2బీ బ్రాంచ్ కెనాళ్లకు సాగునీరు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడగారు పంటలకు సైదాపురం మండలానికి వచ్చే ప్రధాన కాలువలైన 2ఏ, 2బీ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. దీంతో మండలంలోని తుమ్మల తలుపూరు, కలిచేడు, ఓరుపల్లి, మలిచేడు, కట్టబడిపల్లి, దేవరవేమూరు, తురిమెర్ల, ఊటుకూరు, గిద్దలూరు, జోగిపల్లి, పోక్కందల, ఆదూరుపల్లి, మొలకలపూండ్ల, సైదాపురం, రామసాగరం, పెరుమాళ్లపాడు, పరసారెడ్డిపల్లి చెరువులకు 2ఏ బ్రాంచి కెనాల్ ద్వారా సాగు నీరు వస్తోంది. సుమారు 16వేల మాగాణి భూములకు సాగునీరు అందనుండటంతో రైతులు పంటల సాగు చేపట్టనున్నారు. అలాగే 2బీ కాలువ ద్వారా చీకవోలు, అన్నంరాజుపల్లి, రాజులెరుగుంటపాళెం, పోతేగుంట, చాగణం, రాగనరామాపురం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, కమ్మవారిపల్లి, గంగదేవిపల్లి, అనంతమడుగు, పాలూరు, తోకలపూడి, వేములచేడు గ్రామాల్లో సుమారు 14,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. -
వెంగమాంబ బ్రహ్మోత్సవం
అంగరంగ వైభవం..దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు మూడురోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వెంగమాంబ – గురవయ్య దంపతుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయ సన్నిధిలో సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడ్డారు. ఆలయం నుంచి గ్రామోత్సవం కనుల పండువగా ప్రారంభమై నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం మీదుగా సాగింది. అంతకుముందు నర్రవాడలో ఉత్సవ విగ్రహాలకు వేదపండితుల ఆధ్వర్యంలో చక్రస్నానం నిర్వహించారు. వెంగమాంబ దంపతులకు ఏటా పులివర్తి వంశీయులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ ఏడాది ఆటంకం రావడంతో వారి తరఫున మల్లపాటి చెన్నయ్య – సునీత దంపతులు, నెల్లూరు మహానందం – తిరుపతమ్మ దంపతులు పట్టువ స్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు ప్రత్యేకాలంకరణ చేసి పూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. నేడు ప్రధాన ఘట్టాలు ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధాన ఘట్టాలు నిర్వహిస్తారు. ఉదయం వడ్డిపాళెం నుంచి నర్రవాడ వరకు పసుపు, కుంకుమ ఉత్సవం, అనంతరం వెంగమాంబ – గురవయ్య దంపతుల కల్యాణోత్సవం, రాత్రి ప్రథానోత్సవం జరుగుతాయి. వీఐపీలతోపాటు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. -
నిషాలో నేరాలు
కొందరు రాత్రి సమయంలో మద్యం తాగి ఉంటారు. దారిలో వెళ్లే వారిని అడ్డగించి బెదిరించి నగదు దోచుకుంటారు. ఒకప్పుడు ఇలాంటివి ఎక్కడో జరిగితే వినేవాళ్లం. నేడు నిత్యకృత్యమయ్యాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.నెల్లూరు(క్రైమ్): కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. మద్యం, గంజాయి విచ్చలవిడి విక్రయాలతోపాటుగా ఇతర మత్తు ఉత్ప్రేరకాలు అందుబాటులో ఉంటుండటంతో నిషా మత్తులో నేరాలు అధికమయ్యాయి. ప్రశాంత సింహపురి నేరపురిగా మారుతోంది. పాతనేరస్తులు, వ్యసనాలకు బానిసైన కొందరు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కత్తులు, మారణాయుధాలను చేతబూని రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని బెదిరించి, దౌర్జన్యం చేసి నగదు, సెల్ఫోన్లు దోచుకెళుతున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు వెనుకాడటం లేదు. ఇంకొందరు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ప్రజలపై దాడులు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని లేకుండా అన్నిచోట్లా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరికొందరు భయంతో పోలీస్స్టేషన్ వరకు వెళ్లడం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. భయంతో.. ఏ వేళలో అయినా ప్రజలు నిర్భయంగా నగరంలో రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగవుతోంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు దాడి చేస్తారోనన్న భయంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నేర నియంత్రణకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ పాతనేరస్తులు, ఆకతాయిల భరతం పడుతున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పురావడం లేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి. మత్తులోనే నేరాలు అధికంగా జరుగుతుండటంతో మద్యం అనధికార విక్రయాలు, గంజాయి విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఒంటరిగా కనిపిస్తే అంతే.. కత్తులతో బెదిరించి నగదు, సెల్ఫోన్ల దోపిడీ వరుస ఘటనలతో భయం గుప్పిట్లో జనం పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలంటున్న నగరవాసులు -
ఇటీవల జరిగిన ఘటనలు
● పొట్టేపాళేనికి చెందిన ఓ యువకుడు నగరంలోని మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పనిముగించుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతడిని అడ్డగించి కత్తులతో బెదిరించి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లారు. ● ఐపీఎల్ ఫైనల్స్ రోజు అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో జాతీయ రహదారిపై వీరంగం చేశారు. వాహన రాకపోకలకు అంతరాయం కలిగించడంతోపాటు ప్రజలపై దౌర్జన్యం చేశారు. ● రంగనాయకులపేటకు చెందిన ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి రూ.1,500 దోచుకెళ్లారు. ● ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్ఫోన్లను దోచుకెళ్లారు. ● మూడురోజుల క్రితం బీవీనగర్కు చెందిన ఓ యువకుడు ఇంటికి వెళుతుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు అడ్డుకున్నారు. చంపుతామని బెదిరించి అతడి వద్దనున్న సెల్ఫోన్ను దోచుకెళ్లారు. -
లోగ్రేడ్ పొగాకును ప్రభుత్వమే కొనాలి
కందుకూరు: లోగ్రేడ్ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూల వెంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పామూరు రోడ్డులోని వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. కిలో గరిష్ట ధర రూ.280 వేస్తున్నారని, లోగ్రేడ్ ఒకటి, రెండు బేళ్లకు మాత్రమే రూ.180 వేస్తున్నారని చెప్పారు. మిగిలిన వాటిని నోబిడ్ వేయడం వల్ల రైతులు తిరిగి వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకుడు ముప్పరాజు కోటయ్య మాట్లాడుతూ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు రంగంలోకి దిగి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీసీ లాంటి సంస్థలతో లాలూచి పడకుండా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలేటి కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు ఎస్ఏ గౌస్, జి వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, తానికొండ రమణయ్య, రైతులు వలేటి నరశింహం, అల్లం సుమతి, బ్రహ్మయ్య, మాదాల మాధవ, మామిళ్లపల్లి మాధవ, దామా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 20వ తేదీ ఒంగోలులో రాష్ట్ర స్థాయి సదస్సు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఒంగోలులోని మల్లలింగయ్య భవన్లో నిర్వహించే రైతు సదస్సును జయప్రదం చేయాలని కార్యవర్గ సభ్యుడు కె.వీరారెడ్డి కోరారు. మంగళవారం కందుకూరులోని ఒకటి, రెండు వేలం కేంద్రాలను సీపీఐ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్ను సాకుగా చూపి ధరలు తగ్గిస్తున్నాయని ఆరోపించారు. గతేడాది హై గ్రేడ్ను క్వింటా రూ.36 వేలకు కొనుగోలు చేస్తే ఈ ఏడాది రూ.28 వేలకు కొంటున్నారన్నారు. మీడియం గ్రేడ్ను రూ.35 వేలకు గతేడాది కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక లోగ్రేడ్ను కొనడమేలేదని వివరించారు. ప్రస్తుతం సరాసరి ధర రూ.243.51 మాత్రమే ఉందని అంటే రోజు రోజుకు ధరలు పతనమవుతున్నట్లు అర్థమవుతుందన్నారు. సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోలో నుంచి జారిపడి..
● 108 ఉద్యోగి మృతి సీతారామపురం: మండలంలోని బసినేనిపల్లి గ్రామం వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగి ఓంకారం వెంకటనారాయణ రాజు (38) ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సోమవారం 108లో నైట్ డ్యూటీ చేసిన వెంకటనారాయణరాజు మంగళవారం ఉదయం తన బంధువులు అనారోగ్యానికి గురికావడంతో వారిని ఉదయగిరిలోని ఆస్పత్రిలో చూపించేందుకు ఆటోలో బయలుదేరాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజు మార్గమధ్యలో నిద్రమత్తులో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి రోడ్డుపై పడి గాయాలపాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉదయగిరికి తరలించారు. -
కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ రేపు
నెల్లూరు(లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ నెల్లూరు ఐదో అదనపు జిల్లా జడ్జి (ప్రత్యేక ఎస్సీ ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి సరస్వతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై పోలీసుల తరఫున స్పెషల్ పీపీ వాదనలు వినిపించాల్సి ఉంది. కాగా పీపీ అత్త మృతిచెందగా వాదనలను మరోరోజుకు వాయిదా వేయాలని కోరుతూ కేసులోని దర్యాప్తు అధికారి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై వాదనల కొనసాగింపును బుధవారానికి వాయిదా వేశారు. ● గోవర్ధన్రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణను ఈనెల 19వ తేదీకి వేయిదా వేస్తూ నెల్లూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ – సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కాకాణి దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణను ఈనెల 19కు వాయిదా వేస్తూ నెల్లూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.కలెక్టర్ను కలిసిన ఐఏఎస్ అధికారులునెల్లూరు(అర్బన్): శిక్షణలో భాగంగా ఏపీ దర్శన్ కింద ఏడుగురు ఐఏఎస్ అధికారులు సోమవారం నెల్లూరుకు వచ్చారు. వీరు కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ను కలెక్టరేట్లో కలిశారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ఆనంద్ వివరించారు. వీరికి ఉదయగిరి ఉడెన్తో చేసిన వస్తువులను బహూకరించారు. యువ ఐఏఎస్లు కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి పాల్గొన్నారు. చికెన్ వ్యర్థాల పట్టివేత● టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం ఆత్మకూరు రూరల్: మండలంలోని వాశిలి చెరువుకట్టపై చికెన్ వ్యర్థాలను జనసేన నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నాయకులు పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు బండి అనిల్ రాయల్, డబ్బుకొట్టు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా చేపల పెంపకం చేసే చెరువుల్లో కర్ణాటక నుంచి వచ్చే చికెన్ వ్యర్థాలు వాడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ తంతు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్పీ వేణుగోపాల్కు ఫిర్యాదు చేశామన్నారు. వాశిలి గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో ఉన్న టీడీపీ, కూటమి నాయకుల ప్రమేయంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చికెన్ వ్యర్థాల రవాణాకు అండగా ఉన్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు. రెండు వాహనాలను పట్టించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులే పనివాళ్లు● పుస్తకాలు మోస్తున్న వైనం ఆత్మకూరు: విద్యార్థులను కూలీలుగా మార్చేసిన వైనమిది. మండల కేంద్రమైన అనుమసముద్రంపేట మెయిన్ పాఠశాలకు ఎంఈఓ నేతృత్వంలో పాఠ్యపుస్తకాలు వారంరోజుల క్రితం చేరాయి. తొలి రెండురోజులు పుస్తకాలను కొన్ని బడులకు ఎంఈఓ–2 నేతృత్వంలో సరఫరా చేశారు. ఇంకా మరికొన్నిచోట్లకు పుస్తకాలను సరఫరా చేసేందుకు సోమవారం గ్రామాల్లోని స్కూళ్ల ఉపాధ్యాయులు మండల కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులచే పుస్తకాలను మోటార్బైక్ వరకు మోయించారు. దీనిని చూసిన పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయమై డిప్యూటీ డీఈఓ ఎన్వీ జానకీరామ్ను సంప్రదించగా తనకు ఇప్పుడే సమాచారం తెలిసిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
జిల్లాలో చెలరేగిపోతున్న పచ్చ మాఫియా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో గ్రావెల్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో కొండలను పిండి చేయడంతో పాటు పొలాలు, చెరువులను అగాధాలుగా మారుస్తున్నారు. ప్రకృతిని ధ్వంసం చేసి కోట్లాది రూపాయలను దోచుకుని జేబులు నింపుకొంటున్నారు. అదే సామాన్యుడు సొంత అవసరాల కోసం తట్టమట్టి కూడా తోలుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో గ్రావెల్ దందా జరిగిందని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ప్రస్తుతం అదే దోపిడీ కొనసాగిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్నాయి. జిల్లా అధికారులు సైతం సహజ వనరుల దోపిడీని గుడ్లప్పగించి చూస్తున్నారే తప్పా నిలువరించే ప్రయత్నాలు చేయడం లేదు.కావలిలో ఆగని దందాజాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం కావలి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పగలు, రాత్రి తవ్వకాలు సాగిస్తున్నారు. కావలి పెద్దచెరువుతో పాటు రుద్రకోట, అల్లూరు మండలం నార్తుఆములూరు, దగదర్తి మండలం ఉలవపాళ్ల, తదితర ప్రాంతాల్లో గ్రావెల్దందా నిర్విరామంగా సాగుతోంది. కావలి మండలం కొత్తపల్లి, తాళ్లపాళెం, చలంచర్ల చెరువులను సైతం గుల్ల చేస్తున్నారు.సర్వేపల్లిలో భారీ ఎత్తున..సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో అధికార పార్టీ నాయకులు గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఫిర్యాదులు అందితే కొద్దిరోజులు ఆపి ఆ తర్వాత యథావిధిగా కొనసాగిస్తున్నారు. వెంకటాచలం మండలంలో భారీ ఎత్తున గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారు. సర్వేపల్లి పంచాయతీ నాగబొట్లకండ్రిక నుంచి అదానీ కృష్ణపట్నం పోర్టుకు స్వయంగా ప్రధాన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార ఒత్తిళ్లతో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇరిగేషన్ చెరువులే లక్ష్యంగా..కందుకూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. అధికార పార్టీ అండదండలతో ఇష్టారీతిన గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధానంగా ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాళెం, కందుకూరు మండలాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఉలవపాడు మండలంలోని ఇరిగేషన్ చెరువుల నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎల్.రాజుపాళెం చెరువులో గ్రావెల్ తవ్వకాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు పెద్దఎత్తున మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీని గురించి ఇరిగేషన్ అధికారులు సమాచారం ఉన్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చెరువుల్లోనూ ఇష్టారీతిన తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి మట్టిమాఫియాకు అండదండలు అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కందుకూరు మండలం కొండికందుకూరులోని కుంట నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. స్వయంగా సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్ననాథుడు లేడు. అలాగే లింగసముద్రం మండలం మాలకొండరాయునిపాళెం చెరువు నుంచి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తాను వేస్తున్న రోడ్డుకు భారీగా మట్టి తవ్వకాలు జరిపాడు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి విక్రయించుకుంటున్నారు. అయినా ఇరిగేషన్శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై..ఉదయగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపైన గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. పేదలు తమ కనీస అవసరాల కోసం గ్రావెల్ తోలుకోవాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం రేయింబవళ్లు అనుమతులు లేకుండా లేఅవుట్లకు గ్రావెల్ను తరలిస్తూ దోచేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయితీకి గండిపడుతోంది. ఉదయగిరిలోని చెరువుల నుంచి ఇటుకబట్టీలు, లేఅవుట్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. దుత్తలూరుతోపాటు నందిపాడు, తదితర గ్రామాల్లో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. వింజమూరు మండలం పాతూరు, యర్రబల్లిపాళెం చెరువుల నుంచి పెద్ద మొత్తంలో గ్రావెల్ను లేఅవుట్ల కోసం తరలిస్తున్నారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెం, కమ్మవారిపాళెం, తదితర ప్రాంతాల్లో లేఅవుట్ల కోసం గ్రావెల్ను తరలిస్తున్నారు. వరికుంటపాడు మండలంలో పిల్లాపేరు బ్రిడ్జికి అతి సమీపంలో గ్రావెల్ను తరలిస్తుండటంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడి వంతెన మనుగడ ప్రమాదకరంగా మారింది. -
విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు
జిల్లాలో మాంటిస్సోరి, శాటిలైట్ ఫౌండేషన్ల పేరుతోనో.. మరొక పేరుతోనో ఎల్కేజీ, యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ పాఠశాలలు 500 వరకు ఉన్నాయి. వాటిలో కేవలం ఏడు మాత్రమే విద్యాశాఖ గుర్తింపు పొందాయి. మిగతావాటిని గుర్తింపు లేకుండా అక్రమంగా నడుపుతున్నారు. విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. అదనపు గంటలతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. సమాచార హక్కు చట్టంతో ఆధారాలు తీసుకుని సమర్పిస్తున్నాం. పిల్లలను శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాలి. – శిఖరం నరహరి, కోట శ్రీనివాసులురెడ్డి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాసరావు, పేరెంట్స్ అసోసియేషన్ -
ఎంపీపీపై చర్యలు చేపట్టాలంటూ..
● కలెక్టర్కు వైఎస్సార్సీపీ నాయకుల వినతి నెల్లూరు(అర్బన్): ఆత్మకూరులో శిథిలావస్థకు చేరిన పూర్వపు ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేత సందర్భంగా అక్రమంగా టేకు తదితర ఖరీదైన కలపను తరలించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) కేతా వేణుగోపాల్రెడ్డిపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నేతలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, బోలిగర్ల వెంకటేశ్వర్లు, బొమ్మిరెడ్డి రవికుమార్రెడ్డి కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవనాన్ని ఇటీవల రూ.1.68 లక్షలు ఖర్చుతో అధికారులు కూల్చివేయించారన్నారు. అందులో ఉన్న ఖరీదైన కలపను వేణుగోపాల్రెడ్డి అధికారుల అనుమతి లేకుండానే తన స్వగ్రామమైన చెర్లోయడపల్లికి తరలించాడన్నారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో తాము ఎంపీడీఓను ప్రశ్నించామన్నారు. దీంతో ఎంపీపీ గత సర్వసభ్య సమావేశంలో అనుమతి పొందారంటూనే కలప తన పరిధిలోనిది కాదని పంచాయతీరాజ్ ఏఈ పరిధిలోకి వస్తుందని తెలిపారన్నారు. దీనిపై మళ్లీ కథనాలు రావడంతో ఎంపీపీ కలపను ఈనెల 7వ తేదీన ఎంపీడీఓ కార్యాలయానికి తిరిగి చేర్చారన్నారు. అందులో ఖరీదైన 70 శాతం కలప మాయమైందని, 30 శాతం మాత్రమే తిప్పి పంపారన్నారు. ఈ కొంచెం కలపను ఈనెల 18న వేలానికి పెడుతున్నట్టు అధికారులు తెలిపారన్నారు. కలెక్టర్ స్పందించి మిగతా 70 శాతం కలపను రికవరీ చేయించాలని, అక్రమంగా తరలించిన ఎంపీపీపై, సహకరించిన ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈపై చర్యలు చేపట్టాలని, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. దీనికి ఆనంద్ సానుకూలంగా స్పందించారు. -
కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి
తల్లికి వందనం పథకం కోసం.. కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 2,500 మంది పారిశుధ్య, ఇంజినీరింగ్, ఏఎంఆర్ కార్మికులకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి. వీరంతా వివిధ సొసైటీలు, ఆఫ్కాస్ కింద కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ పద్ధతిలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోవడం దారుణం. అలాగే 8 నెలలుగా పారిశుధ్య కార్మికులకు చెల్లిస్తున్న విధంగానే ఇంజినీరింగ్ కార్మి కులకు జీఓ నంబర్ 36 ప్రకారం రూ.21 వేల నుంచి రూ.24 వేల వరకు జీతం చెల్లించాలి. తల్లికి వందనంతోపాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. – నాగేశ్వరరావు, కొండా ప్రసాద్, పెంచలనరసయ్య, శ్రీనివాసులు, సీఐటీయూ నాయకులు, నెల్లూరు ● అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిట నెల్లూరు(అర్బన్): సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో అధికారులు తిప్పుకొంటున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదు. నెల్లూరు కలెక్టరేట్కు వస్తే మళ్లీ మండలాధికారుల వద్దకే పంపుతున్నారు. వారు మళ్లీ మళ్లీ తిప్పుకొంటున్నారు. మీరైనా దయచూపి సమస్యలను తీర్చాలని బాధితులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి, జిల్లా సర్వే అధికారి నాగశేఖర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. 398 మంది ఆన్లైన్ అర్జీలను, మరో 40 మంది ఆఫ్లైన్లో సమర్పించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. -
పొలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు
మానాన్న కాలం నాటి నుంచి గ్రామంలోని ప్రభుత్వ శివాయి భూమి 2.50 ఎకరాలు మా సాగుబడిలో ఉంది. అప్పట్లోనే భూమి చదును, బాగు కోసం రూ.50 వేలు, మోటార్కు, బోరుబావికి మరో రూ.లక్ష ఖర్చు చేశాం. 30 ఏళ్ల నుంచి ఉలవలు, జామాయిల్ లాంటి పంటలు పండించాం. 17 ఏళ్ల నుంచి మామిడి తోట వేశాం. ప్రభుత్వ రీసర్వేలో సైతం సాగుబడి కింద మా పేర్లు నమోదు చేశారు. ఇటీవల వెలిచర్ల అంకమ్మ, వారి కుటుంబ సభ్యులు ఆ భూములు తమవంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో తమ భూములను 10 – 1 అడంగళ్లో ఎక్కించి పట్టాదారు పాస్పుస్తకాలు ఇప్పించాలని కలెక్టరేట్లో సంవత్సరం క్రితం అర్జీ ఇచ్చాను. కలెక్టర్ ఆ అర్జీని ఆర్డీఓకు పంపారు. ఆయన తిప్పుకొన్నారు. ఇప్పుడు బదిలీ అయ్యారు. నా భూమికి పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ ఇప్పటికే మూడు దఫాలు కలెక్టరేట్కు వచ్చి అర్జీలిచ్చాం. సమస్యకు పరిష్కారం చూపాలి. – చీదర్ల మాల్యాద్రి, లక్ష్మీకాంతమ్మ, కేశవరం గ్రామం, జలదంకి మండలం -
రామతీర్థం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కోవూరు: జిల్లాలోని శైవ క్షేత్రాల్లో అతిపురాతన, ఎంతో ప్రాశస్త్యం కలిగిన విడవలూరు మండలం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు విశేషాభిషేకాలు, పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవ వివరాలు 17న ధ్వజారోహణం, శేషవాహనోత్సవం, 18న చిలక వాహనం, 19న హంస వాహనం, 20న పులి వాహనం, 21న రావణసేవ, 22న నందిసేవ, 23న రథోత్సవం, 24న కల్యాణోత్సవం, గజవాహనోత్సవం నిర్వహించనున్నారు. 25న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), రాత్రికి తెప్పోత్సవం, అశ్వవాహన సేవ, 26న ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, కల్యా ణోత్సవం, తీర్థవాది ఘట్టాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఐఅండ్పీఆర్ డీడీగా శివశంకర్ నెల్లూరు(అర్బన్): జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్పీఆర్) డీడీగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ శివశంకర్రావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ ఆవరణంలోని ఐఅండ్ పీఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీడీగా పనిచేసిన సదాశివరావు విశాఖపట్నానికి బదిలీ అయ్యారు. నూతన డీడీ శివంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నకిలీ ఇళ్ల పట్టాలపై సమగ్ర విచారణ సీతారామపురం : మండలంలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పంపిణీ చేయడంపై సమగ్ర విచారణ చేపడుతున్నామని తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీతారామపురంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై‘సాక్షి’లో సోమవారం కథనం వెలువడిన విషయం తెలిసిందే. అందుకు స్పందించిన తహసీల్దార్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, సూత్ర, పాత్రధారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నకిలీ పట్టాలపై నిశితంగా విచారణ చేపడుతున్నామని, త్వరలోనే సూత్రధారులను పట్టుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారించి రహస్య విచారణ జరుపుతున్నామన్నారు. కార్యాలయ స్టాంపులు నకిలీ ఇళ్ల పట్టాలపై ఎలా వేశారన్న దానిపైన, ఈ వ్యవహారంలో కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు మాయగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు. ఫేక్కాల్స్ నమ్మి పన్నుల చెల్లింపులు చేయొద్దు నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పన్నులను క్యూఆర్ కోడ్ ద్వారా సులభతరంగా చెల్లించొచ్చు అంటూ కొందరు ఆగంతకులు ఫేక్కాల్స్ చేసి ప్రజలను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కాల్స్ను నమ్మి చెల్లింపులు చేసి మోసపోవద్దని కమిషనర్ వైఓ నందన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల పొగతోటలోని ఓ ఆస్పత్రిని ఆగంతకులు ఫేక్ కాల్ ద్వారా సంప్రదించి, ట్రేడ్ లైసెన్స్ను తాము పంపుతున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సులభతరంగా చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ఆస్పత్రి నిర్వాహకులకు అనుమానం వచ్చి తమ దృష్టికి తీసుకొచ్చారని కమిషనర్ వివరించారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన అన్ని పన్నులను ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక సచివాలయాల్లోనూ, అదేవిధంగా ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చని తెలిపారు. గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి క్యూఆర్ కోడ్ తదితర మాధ్యమాల ద్వారా చెల్లింపులు చేయమని డిమాండ్ చేస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 18004251113 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఉదయగిరి దుర్గంపై పేలుడు సామగ్రి
ఉదయగిరి రూరల్: ఉదయగిరి దుర్గంపై పేలుడు సామగ్రిని కొంతమంది యువకులు గుర్తించారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి. ఉదయగిరి పట్టణానికి చెందిన యువకులు శనివారం రాత్రి దుర్గంపై ఉన్న పెద్ద మసీదు వద్దకు నిద్రించేందుకు వెళ్లారు. వారు మసీదు వద్దకు వెళ్తున్న సమయంలో రామ్, కరీం బుగ్గ ప్రాంతంలో దీపాల వెలుతురు రావడం, వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరిస్తుండడాన్ని గమనించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లేందుకు యువకులు భయపడ్డారు. ఆదివారం తిరిగి ఇళ్లకు బయలుదేరారు. వచ్చే సమయంలో శనివారం రాత్రి దీపాలు వెలుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్లో పేలుడు సామగ్రి, భోజనం చేసే ప్లేట్లు తదితరాలను గుర్తించారు. రాత్రి ఆ ప్రాంతంలో ఉన్నది గుప్తనిధుల ముఠాయేనని నిర్ధారించుకుని అక్కడి నుంచి కిందకు పరుగులు తీశారు. గతంలో కూడా దుర్గం కొండపై గుప్తనిధుల తవ్వకాలు జరిపే సమయంలో పేలుడు సంభవించి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): చిత్తూరుకు చెందిన స్వరూప్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకుని మోసగించారని దగదర్తి పరిసర ప్రాంతాలకు చెందిన 23 మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. నెల్లూరు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 70 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచురామారావుకు అందజేశారు. వినతులను పరిశీలించిన ఆయన చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో లీగల్ అడైజ్వర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ– 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కోవూరుకు చెందిన రోహిత్ నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6 లక్షలు తీసుకుని మోసగించాడని కోవూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నా భర్త మరణానంతరం చిన్నకుమారుడు, కోడలు తిడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. కౌలు డబ్బులు, ఇంటి కాగితాలు తీసుకుని నా బాగోగులను పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలని కావలి రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ కోరారు. ● చెడు అలవాట్లకు బానిసైన నా భర్త నా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. నాతోపాటు నా పిల్లల బాగోగులను పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా భర్త మరణించాడు. ఇందుకూరుపేటకు చెందిన ఎ.శీనయ్య నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అసభ్యంగా తిడుతూ వేధిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. ● నా తమ్ముడు కొంతకాలం కిందట తప్పిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకూ ఆచూకీ తెలియజేయలేదు. తగిన చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 ఫిర్యాదులు -
చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
వెంకటాచలం: చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల కారణంగా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ఎమ్మెల్సీ మేరిగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ములాఖత్ ద్వారా సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం నారాయణస్వామి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనంతా అభివృద్ధిని విస్మరించి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టి, వేధించడంతోనే సరిపోయిందన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, నియంతృత్వ పోకడలతో పాలన సాగించడం సరైన పద్ధతి కాదన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై రోజుకొక కొత్త కేసు పెడుతుండడం దారుణమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందకుండా వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి నాయ కులు వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తామని చెబుతున్నారని, కానీ భవిష్యత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజాదరణ తగ్గలేదని చెప్పారు. ఆయనకు వస్తున్న జనాదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుచుకోవాలన్నారు. కాకాణిపై రోజుకొక కేసు పెట్టడం దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి -
వైభవంగా వెంగమాంబ గ్రామోత్సవం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నర్రవాడలోని ఆలయంలో వెంగమాంబ, గురవయ్య దంపతులకు విశేషాభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. రాత్రికి వెంగమాంబ పుట్టినిల్లు అయినా వడ్డిపాళెంలోని రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం వద్ద వెంగమాంబ దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం, తదితర గ్రామాల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హోమగుండంలో ఎండుకొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కూడా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇంటి వద్దకే రేషన్ రావకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డోర్ డెలివరీ చేయించాలి. నడవలేని వారికి ఉపకరణాలు ఇచ్చేందుకు వెంకటాచలంలోని ఆల్మెకో సంస్థ వద్దకు వెళ్లాలని కలెక్టర్ చెప్పడం అన్యాయం. మాకు దివ్యాంగుల శాఖ ఉంది. దాని ద్వారా గతంలోలానే ఉపకరణాలు ఇప్పించాలి. రెండేళ్లకు సంబంధించి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. తమకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. నకిలీ దివ్యాంగుల కోటాతో ఉద్యోగాలు పొందుతున్న వారి సర్టిఫికెట్లను కూడా రీ వెరిఫికేషన్ చేయించాలి. తమ సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులతో కూడిన (డీఎల్సీ) జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. – ఆవుల నాగేంద్ర, వీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, వెంకటరమణయ్య, చిట్టికుమార్, కాలేషాబాషా, సుజాత -
ఇళ్ల నిర్మాణంపై ప్రతి వారం సమీక్షలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్) : ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఎంపీడీఓలు ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషలాఫీసర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న ప్రజల అభిప్రాయాలను సచివాలయ సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రతి వారం కనీసం 70 శాతం పనులు తగ్గకుండా చూడాలన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ఆధార్కార్డులు అందేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, కార్పొరేషన్ కమిషనర్ నందన్, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ మోహన్రావు, హౌసింగ్, డ్వామా పీడీలు వేణుగోపాల్రావు, గంగాభవాని, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. -
రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు
● మంత్రి నారాయణనెల్లూరు(టౌన్): రొట్టెల పండగకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లపై ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి సీఎం రూ.5 కోట్లు మంజూరు చేశారన్నారు. 20 వేల మంది భక్తులు ఒకేచోట ప్రార్థన చేసేందుకు వీలుగా మందిరాన్ని నిధులతో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నుడా ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నగరంలో అండర్పాస్లు, ఓవర్ బ్రిడ్జిల వద్ద, ఓవర్ హెడ్ ట్యాంకులు వద్ద పెయింటింగ్ పనులు సంవత్సర కాలంగా కొనసాగుతుండటంపై సంబంధిత అధికారులు, పెయింటింగ్ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. 45 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో పెయింటింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. -
తల్లికి వందనం పఽథకానికి రకరకాల కొర్రీలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్క హామీని తుంగలో తొక్కుతోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత ఆ పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకానికి వీలైనంత మంది విద్యార్థులను తగ్గించేందుకు రకరకాల నిబంధనలు అమలులోకి తెచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా పేద విద్యార్థులను అనర్హుల జాబితాలో చేర్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ● 1 నుంచి ఇంటర్ వరకు 4.51 లక్షల మంది విద్యార్థులు ● జిల్లా వ్యాప్తంగా 2.42 లక్షల వరకు అర్హులు ● అనర్హుల జాబితాలోకి లక్షలాది పేద విద్యార్థులు ● ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని హామీ ● కానీ విద్యార్థి తల్లి అకౌంట్లో రూ.13 వేలే జమ ● స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో రూ.2వేలు ఎగవేత ● సచివాలయాల చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణలు నెల్లూరు (టౌన్): జిల్లా వ్యాప్తంగా 3,453 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 3.92 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్కు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 59 వేల మంది ఉన్నారు. మొత్తం దాదాపు 4.51 లక్షల మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15వేలు తల్లి అకౌంట్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పథకానికి విద్యార్థుల సంఖ్య తగ్గించుకునేందుకు రకరకాల నిబంధనలు ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. నెలకు 300 యూనిట్లు విద్యుత్తు వినియోగం, సొంతకారు ఉన్నా, కుటుంబ ఇన్కం పట్టణాల్లో నెలకు రూ.12వేలు, గ్రామాల్లో రూ.10 వేలు, మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు మించకూడదని, పట్టణాల్లో 1000 చదరపు అడుగులు మించి స్థలం ఉండకూడదని, ఇన్కం టాక్స్ చెల్లించినా, పాఠశాలలో హాజరు 75 శాతం ఉండాలని తదితర నిబంధనలను కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2.40 లక్షల మందికే తల్లికి వందనం ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తేమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 4.51 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాల్లో అర్హుల, అనర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 2.42 లక్షల మంది విద్యార్థులకే తల్లికి వందనం అమలు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరికే అకౌంట్లలో డబ్బులను జమ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల కారణంగా దాదాపు మరో లక్ష మందికి పైగా పేద విద్యార్థులు ఈ పథకానికి దూరం అవుతున్నారని తెలుస్తోంది. అర్హులై ఉండి అనర్హుల జాబితాలో పేరు ఉంటే అందుకు సంబంధించిన పత్రాలను ఈనెలాఖరులోగా అప్లోడ్ చేయాలని సూచిస్తున్నారు. అకౌంట్లో రూ.13వేలు జమ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అయితే రూ.13 వేలు మాత్రమే జమ చేస్తున్నారు. మిగిలిన రూ.2వేలు స్కూల్ మెయింటినెన్స్కు కట్ చేశారని చెబుతున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.1000 తగ్గించి మిగి లిన రూ.14వేలు అకౌంట్లో జమ చేస్తే అప్పుడు చంద్రబాబునాయుడు, లోకేశ్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ.2వేలు ఎందుకు తీసుకుంటున్నా రని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతు న్నారు. నిబంధనల పేరుతో కొంతమందికే డబ్బులు జమచేసి మిగిలిన వారికి మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అమ్మ ఒడి నగదు ఈ నెలాఖరులోపు పత్రాలు అప్లోడ్ చేయాలి తల్లికి వందనం పథకంలో భాగంగా అర్హులు, అనర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శించారు. అనర్హుల జాబితాలో ఉన్న వారు ఎందుకు అలా ప్రకటించారో పక్కన కారణాన్ని స్పష్టంగా చూపించారు. అర్హులై ఉండి అన్ని పత్రాలు అప్లోడ్ చేయని వారు ఈ నెలాఖరు లోపు ఆ పత్రాలను సచివాలయంలో అప్లోడ్ చేస్తే వారికి కూడా వారి అకౌంటులో డబ్బులు జమ చేస్తారు. – బాలాజీరావు, డీఈఓ -
నేత్రపర్వంగా శేష వాహనోత్సవం
సంగం:మండలంలోని దువ్వూరులోని గంగా పార్వతి సమేత కోటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శని వారం అర్ధరాత్రి స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవేరులను శేషవాహనంపై కొలువుదీర్చి పూలతో విశేషంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. బలిజ సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కాకాణి కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పోలీసులు పలు అక్రమ కేసులను బనాయించారు. కనుపూరు చెరువులో మట్టిని కాకాణి తన మనుషుల ద్వారా అక్రమంగా తరలించినట్టు వెంకటాచలసత్రం పోలీసులు క్రైమ్ నంబర్ 103/2025తో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో గోవర్ధన్రెడ్డి తరుఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, సిద్దన సుబ్బారెడ్డి నెల్లూరు నాల్గో అదనపు జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అసోసియేషన్ పేరిట చెక్పోస్ట్ పెట్టి తన అనుచరుల ద్వారా వాహనాల యాజమానుల నుంచి అక్రమ పద్ధతిలో నగదు వసూలు చేశారని ముత్తుకూరు పోలీసులు కాకాణిపై క్రైమ్ నంబర్ 167/2025తో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, సిద్దన సుబ్బారెడ్డి నెల్లూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు కేసులు సోమవారం విచారణకు రానున్నాయి. వెంకటంపేటలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం దుత్తలూరు: మండలంలోని వెంకటంపేటలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు ధ్వంసం చేశారు. వైఎస్సార్ విగ్రహం ఎడమచేతిని విరగ్గొట్టారు. విగ్రహం వద్ద మద్యం బాటిళ్లు ఉండడంతో మద్యం మత్తులో కావాలనే దుశ్చర్యకు పాల్పడినట్లుగా గ్రామస్తులు భావిస్తున్నారు. కాగా వైఎస్సార్ విగ్రహ ధ్వంసానికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. 21 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు, జూలై 1న ఆప్షన్లలో మార్పులు, చేర్పులు, 3న సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని వివరించారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్, టీసీ, ఆన్లైన్లో చెల్లించిన ఫీజు రసీదు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని సూచించారు. నేడు పెంచలకోనలో మెగా యోగాంధ్ర నెల్లూరు (టౌన్): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెంచలకోన క్షేత్రంలో సోమవారం మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాల్లో మెగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే నెల్లూరు, మైపాడుబీచ్, ఉదయగిరిలో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. ఉదయం 7 గంటలకు పెంచలకోనలో నిర్వహించే మెగా యోగాంధ్ర కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయా లని కోరారు. -
ఆరోగ్య రంగం నిర్వీర్యం
నెల్లూరు(అర్బన్): ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ డాక్టర్ విరించి అన్నారు. నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సు ఆదివారం జరిగింది. జనవిజ్ఞానవేదిక, డాక్టర్ రామచంద్రారెడ్డి ఆస్పత్రి, ప్రజారోగ్యవేదిక, మెడికల్ రెప్స్ యూనియన్, యూటీఎఫ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – పర్యవసానాలు అనే అంశంపై విరించి మాట్లాడారు. పేదలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా తెస్తున్న 12 వైద్య కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని బహిరంగంగా ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. ఇదే జరిగితే సామాన్య పిల్లలు వైద్యవిద్యను ఎక్కడ అభ్యసించాలని ప్రశ్నించారు. ● భారత రాజ్యాంగం పూర్వాపరాలు, సవాళ్లు అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగ మూలస్తంభాలపైనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఎలక్షన్ కమిషన్, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో అసమానతలు పెంచుతూ తమ అధికారాన్ని కాపాడుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణయ్య, సతీష్, మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఉదయగిరి దుర్గంపై కూంబింగ్
ఉదయగిరి: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో ఉన్న ఉదయగిరి దుర్గంపై ఆదివారం అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. శనివారం రాత్రి దుర్గంపై ఉన్న పెద్దమసీదు ప్రాంతంలో దీపాలు వెలుగుతూ కనిపించడంతో గుప్తనిధుల ముఠా సంచరిస్తుందనే అనుమానంతో కూంబింగ్ చేపట్టారు. స్థానిక అటవీ శాఖ అధికారులతో పాటు సైక్లింగ్ఫోర్స్ కలిసి దుర్గంపైకి వెళ్లారు. చిన్నమసీదు, పెద్దమసీదు, గుర్రపుశాలలు, మెట్ల మార్గం తదితర ప్రాంతాలలో పరిశీలన జరిపారు. ఎలాంటి తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు లేవని అటవీ సిబ్బంది తెలిపారు. కాగా స్థానికులు కొందరు దుర్గంపైన ఉన్న పెద్దమసీదు వద్ద శనివారం రాత్రి లైట్లు ఏర్పాటు చేసి విందు భోజనాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
వైభవంగా వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఆదివారం నిలుపు కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వేదపండితులు వెంగమాంబ, గురవయ్య దంపతులను పూలతో విశేషంగా అలంకరించి గణపతిపూజ, సహస్రనామార్చన, కుంకుమార్చన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు నవగ్రహ పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం కలశపూజ నిర్వహించారు. తొలిరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు సంతానం కోసం అమ్మవారి వద్ద వరపడ్డారు. అట్టహాసంగా నిలుపు వెంగమాంబ పుట్టినిల్లు వడ్డిపాళెంలోని దేవర ఇంట్లో ఆదివారం రాత్రి నిలుపు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం రేణుకా ఎల్లమ్మ గుడిలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మండపారాధన, వెంగమాంబ, రేణుకా ఎల్లమ్మకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి పచ్చవ వంశస్తులు పసుపు దంచే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వెంగమాంబ ఉత్సవాల్లో పసుపు దంచితే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన ముత్తైదువులు పసుపు దంచేందుకు పోటీపడ్డారు. అనంతరం పసుపు, కుంకుమను అమ్మవారి దేవస్థానం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిలుపు కార్యక్రమం పసుపు దంచేందుకు పోటీపడిన ముత్తైదువులు -
నకిలీ ఇళ్ల పట్టాల కలకలం
సీతారామపురం: ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమాయకులకు అంటగడుతున్న వైనం సీతారామపురంలో వెలుగులోకొచ్చింది. గ్రామంలోని సర్వే నంబర్ 240లోని ప్రభుత్వ భూమికి ఓ ప్రబుద్ధుడు నకిలీ నివేశన పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగట్టాడు. ఒక్కొక్కరికీ 3 సెంట్లు చొప్పున 40 మందికి నివేశన పట్టాలను తయారుచేసి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.25 వేలు చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా పలువురి నుంచి అతను సుమారు రూ.10 లక్షల మేరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇంటి నివేశన పత్రం ఉదయగిరి మండలానికి సంబంధించినది కాగా,ఆ పత్రంపై వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఉన్నాయి. స్టాంపులు మాత్రం సీతారామపురం తహసీల్దార్ కార్యాలయానివి వేసి ఉన్నారు. నకిలీ పట్టాల విషయం ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో నివేశన పట్టాలు నకిలీవని తెలుసుకున్న పలువురు బాధితులు సదరు వ్యక్తిని నిలదీయగా పట్టా కాగితాలు తిరిగి ఇచ్చేయండి, మీ నగదు మీకు చెల్లిస్తానంటూ బుకాయిస్తున్నట్లు సమాచారం. మండలంలో ఇలాంటి మాయగాళ్లు నిత్యం మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వారి దర్పాన్ని ప్రదర్శిస్తూ రెవెన్యూ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి ఈ తతంగం సాగిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, పోలీసులు ఈ నకిలీ పట్టాలపై నిగ్గుతేలిస్తే మాయగాళ్ల లీలలు మరెన్నో బయటకు వచ్చే అవకాశం ఉంది. సీతారామపురంలో 40 మందికి పంపిణీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలో నెల్లూరు – ముంబై రహదారి నుంచి ఏఎస్పేట అడ్డరోడ్డుకు మలుపు తిరుగుతున్న కారును ఆత్మకూరు నుంచి నెల్లూరు మార్గంలో వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ వేగంగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై ఎస్కే జిలానీ, ఏఎస్సై శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. తెలంగాణకు చెందిన ఓ కుటుంబం కారులో నెల్లూరు నుంచి ఏఎస్పేట దర్గా వద్దకు వస్తోంది. అదే క్రమంలో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి గిరిజనకాలనీకి చెందిన పెంచలయ్య, యాకసిరి శ్రీనివాసులు అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్పై వేగంగా వస్తూ మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టారు. దీంతో పెంచలయ్య ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లినట్లు ఎస్సై జిలానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అవును.. అతను కుర్చీ వదలడు
అంతా నా ఇష్టం11 ఏళ్లుగా ఒకే సీటులో సీనియర్ అసిస్టెంట్ ● నెల్లూరులోనే 30 ఏళ్లుగా విధులు ● అధికార పార్టీ అండదండలతోనే.. ● ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సీటు మార్చని అధికారులు ● నేటి నుంచి పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో బదిలీల ప్రక్రియ● ఆస్పత్రిలో పనిచేసే సుమారు 20 మంది స్టాఫ్ నర్సులు ఆపరేషన్లలో పాల్గొన్నందుకు ఆరోగ్యశ్రీ కింద రూ.4 వేల నుంచి రూ.7 వేలు వరకు ఒక్కొక్కరికి 2023లో ఇన్సెంటివ్స్ రావాలి. ఆ నిధులను నర్సుల బ్యాంక్ ఖాతాల్లో వేశామని ఆ సీనియర్ అసిస్టెంట్ చెబుతున్నారు. బ్యాంక్ వారు తమకు వేయలేదని అంటున్నారు. మరి ఆ డబ్బులు ఎవరు తిన్నారో తెలియదు. బ్యాంకు ఖాతాకు జమ చేసి ఫెయిలైతే అకౌంట్ వివరాలు తీసుకుంటే సరిపోతుంది. అది కూడా చేయలేదు. నాలుగు నెలల నుంచి నర్సులు తమకు సంబంధించిన నగదు గురించి అడుగుతున్నా సమాధానం లేదు. ● గతంలో బినామీ ఏజెన్సీ పేరుతో ఇంటర్నెట్ బిల్లులు భారీగా చెల్లించారనే ఆరోపణలున్నాయి. ● ఒకటికి మూడు కంపెనీల సెల్ టవర్లు ఆస్పత్రి ఆవరణలో ఉన్నాయి. ఏళ్ల తరబడి వాటికి ఆయా కంపెనీలు ఒక్క రూపాయి అద్దె చెల్లించలేదు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో–ఆర్డినేటర్ లక్ష్మీసునంద ఈ విషయమై పోరాడి కొంతవరకు సెల్టవర్ కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేయించారు. అధికారం మారాక బ్యాలెన్స్ డబ్బులు నేటికీ జమ కాలేదు. ● తనకు లంచం ఇవ్వకపోయినా.. తనకు నచ్చకపోయినా ఆ సీనియర్ అసిస్టెంట్ తీవ్ర ఇబ్బందులు పెడతారు. అందులో భాగంగా సూపరింటెండెంట్కు కారు అద్దెకు పెట్టిన కాంట్రాక్టర్కు 9 నెలలుగా అద్దె చెల్లించలేదు. దీంతో అతను కలెక్టర్కు అర్జీ పెట్టారు. దీంతో కాంట్రాక్టర్కు ఇచ్చిన చెక్కులో అంకెలు కరెక్ట్గా వేసి అక్షరాల్లో ఒకచోట తప్పు రాశారు. ఆ చెక్కును బ్యాంక్లో జమ చేయగా చెల్లలేదు. మళ్లీ కాంట్రాక్టర్ విషయం తెలుసుకుని చెక్కును తెచ్చి ఆ సీనియర్ అసిస్టెంట్కు ఇచ్చి సరి చేయమని కోరారు. ఇందుకు ఇన్చార్జి సూపరింటెండెంట్ కూడా త్వరగా లోపాన్ని సరి చేయమని పదేపదే చెప్పినా ఆ సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్టర్ను ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆఫీసులో కూర్చోబెట్టుకున్నాడు. తీరా రిజిస్టర్ కనబడలేదు. సంతకం చేయాలి. రేపు రావాలని చెప్పాడు. దీంతో కాంట్రాక్టర్ అక్కడి నుంచి కదలకపోవడంతో సాయంత్రం 6 గంటలకు చెక్కు ఇచ్చారు. ● ఆరోగ్యశ్రీకి సంబంధించిన రెండు చెక్కుల్లో కూడా ఇలాగే అంకెలు కరెక్ట్గా వేసి, అక్షరాల్లో మధ్యలో ఒకచోట తప్పు రాశాడు. ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయినా ఆయన్ను అక్కడి నుంచి కదిలించేందుకు అధికారులు సిద్ధపడటం లేదు. నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యశాఖలో ఇప్పటికే సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో అధికార పార్టీ నేతల సిఫార్సులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సోమవారం నుంచి జిల్లా సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి), ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రక్రియ ప్రారంభమవుతోంది. అయితే ఒకరిద్దరు ఏళ్ల తరబడి తమ సీటు వదలడం లేదు. అధికారులు వారిని బదిలీ చేయలేకపోతున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 11 ఏళ్లుగా ఓ సీనియర్ అసిస్టెంట్ సీటుకు అతుక్కుపోయారు. అధికార పార్టీ అండదండలు, లంచాలతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన తన ఉద్యోగకాలంలో గతంలో నగరంలోని టీబీ ఆస్పత్రిలో 20 ఏళ్లు పనిచేశాడు. టీబీ ఆస్పత్రిని పెద్దాస్పత్రిలో కలిపేశాక 11 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. అంటే తన సర్వీసులో నెల్లూరును వదిలి పెట్టలేదు. ఆరోపణలెన్నో.. ప్రభుత్వాస్పత్రిలో పేరుకే సీనియర్ అసిస్టెంట్. అయితే మొత్తం పనులన్నీ ఆయనే చక్కబెడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఆఫీసులో ఏ ఫైలు కదలాలన్నా ముందుగా ఆ సీనియర్ అసిస్టెంట్ చేయి తడపందే పనులు కావనే ఆరోపణలున్నాయి. లంచాలిస్తే ఆ ఫైల్కు తక్కువ సమయంలోనే మోక్షం కలుగుతుంది. లేకుంటే ఇబ్బంది పెడుతారనే విమర్శలున్నాయి. మెడికల్ బిల్లులు, ఉద్యోగులకు మెడికల్ సర్టిఫికెట్లు డబ్బులిస్తే చేస్తారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా సొంత స్టాఫ్ విషయంలో, డాక్టర్ల విషయంలో పనులు జరగవనే ప్రచారం ఉంది. లేఖ తెచ్చుకుని.. ఆ సీనియర్ అసిస్టెంట్ తనను బదిలీ చేయకుండా అసోసియేషన్ తరఫున సిఫార్సు లేఖ తెచ్చుకున్నారు. ప్రస్తుతం జీఓ ప్రకారం అది పనికి రాదు. అయినా దానిని అడ్డుపెట్టుకుని, అధికార పార్టీ నాయకుల అండతో కదిలేందుకు సిద్ధపడటం లేదు. అధికారులు కనీసం సీటు కూడా మార్చడం లేదు. ఇలాంటి లోపాలతో ఉన్న వారిని మార్చకుండా ఎలా పారదర్శకంగా బదిలీలు చేస్తారో వేచి చూడాల్సిందే. ప్రభుత్వ పెద్దాస్పత్రి -
మామిడికి పురుగుపోటు
కవర్ కడితే.. ఉలవపాడు: ఫలరాజుకు పురుగు పట్టింది. దీంతో ఎంతో ఇష్టంగా తినే ఉలవపాడు మామిడి ప్రస్తుతం ప్రజలకు చేదైంది. కోతకు వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో కాయల్లో పురుగులు వచ్చాయి. గతంలోనూ పండుఈగ తాకిడి ఉండగా అది కేవలం 5 శాతంలోపే. అయితే వానల వల్ల కాయల్లో నేడు పురుగులు వస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 30 శాతం తోటల్లో ఈ పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. ఇబ్బందికరంగా.. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఉలవపాడు మామిడి రుచిలో అద్భుతమని జనం చెబుతారు. చాలామంది తమ మిత్రులకు, బంధువులకు, అధికారులకు బాక్స్ల్లో కాయలు పంపిస్తుంటారు. ప్రస్తుతం వాటిలో పురుగులున్నాయని చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గింది. తొలుత కాయల రేట్లు అధికంగా ఉన్నాయి. తర్వాత పురుగుల తాకిడి వల్ల కాస్త తగ్గాయి. ప్రస్తుతం టన్ను రూ.40 వేలు పలుకుతోంది. కానీ స్థానిక మార్కెట్లో మాత్రం కేజీ రూ.80 ఉంది. ప్రధానంగా ఇసుక నేలల్లో ఉన్న తోటలకు అధికంగా పురుగు వ్యాపించింది. ఎర్రనేలల్లో తక్కువగా ఉంది. పురుగులు తగలని తోటల్లో రేట్లు భారీగా ఉన్నాయి. పెద్ద తోటల్లో వేర్వేరు చెట్లలోని కాయలను పరిశీలిస్తున్నారు. పురుగు పట్టిందా? లేదా? అని పరిశీలించి అప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ పురుగు లేకపోతే అధిక రేటుకు కొంటున్నారు. పురుగు తగలని కొంత భాగం ఎర్రనేల కాయలను కొనుగోలుదారులు కేజీ రూ.100 పైనే తీసుకుంటున్నారు. ఉలవపాడు మామిడికి ఎంతో పేరుంది. దీనిని ఇష్టంగా తినేవారు ఎందరో ఉన్నారు. స్థానికంగా ఉండే వారు బంధుమిత్రులకు పంపుతుంటారు. అయితే పురుగుల వల్ల ప్రస్తుతం కాయలపై అయిష్టత ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. ఉలవపాడు ఫలరాజుకు పండుఈగ కష్టాలు వర్షాల వల్లే ఈ పరిస్థితి 30 శాతం తోటల్లో అంతే..పురుగుల నివారణ కోసం కవర్ కట్టిన కాయలకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. రైతులు చాలా తోటల్లో కట్టారు. ఈ కాయలు నాణ్యతగా ఉంటాయి. అయితే ఎండ, వడగాలి తగలదు కాబట్టి రుచి కాస్త తక్కువగా ఉంటుంది. ఈ కాయలకు డిమాండ్ అధికంగా ఉన్నా అందరూ కొనుగోలు చేయడం లేదు. రుచి కోరుకునే వారు ఎండ తగిలే కాయలనే తీసుకుంటున్నారు. కానీ పురుగులు తగలకుండా నాణ్యమైన కాయలను కావాలనుకునే వారు మాత్రం ఈ కవర్ కట్టిన వాటిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత కాయలకు పురుగులు రావడంతో కవర్ కట్టిన కాయలకు కాస్త డిమాండ్ ఉంది. కేజీ రూ.100 పైనే అమ్ముతున్నారు. టన్ను రూ.60 వేలకు ఎగుమతులు చేస్తున్నారు. -
స్వర్ణాల చెరువు ఆక్రమణకు యత్నం
నెల్లూరు సిటీ: స్వర్ణాల చెరువుపై తెలుగు తమ్ముళ్ల కళ్లు పడ్డాయి. నెల్లూరులో ప్రతిష్టాత్మకమైన ఈ చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలిసినా అధికార పార్టీ నేతలు కావడంతో మిన్నకుండిపోయారని విమర్శలున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్లో ప్రగతినగర్ ఏబ్లాక్ 10వ వీధి చివర స్వర్ణాల చెరువు విస్తరించి ఉంది. దాదాపు 400 అంకణాల చెరువు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేత రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా రెండు రోజుల నుంచి 100 అంకణాల స్థలంలో పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. మట్టి తోలించి చదును చేయిస్తున్నారు. ఇష్టారాజ్యంగా.. జేసీబీతో చదును చేస్తున్న వారిని స్థానికులు ప్రశ్నించగా మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని, టీడీపీ ముఖ్య నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాధానమిచ్చారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని సదరు నేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్లాట్లు చేసి విక్రయాలు చెరువు స్థలాన్ని చదును చేసి 9 అంకణాల లెక్కన ప్లాట్లుగా వేసి విక్రయాలు చేసేందుకు టీడీపీ నేత స్కెచ్ వేశారని ప్రచారం ఉంది. అధికార పార్టీ కావడంతో అడిగేవారు లేరని బరితెగిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రంగంలోకి టీడీపీ నేత జేసీబీతో పిచ్చిమొక్కల తొలగింపు చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు -
మోటార్బైక్ దగ్ధం
కలువాయి(సైదాపురం): మండల కేంద్రమైన కలువాయి బస్టాండ్ సెంటర్లో సీఎస్సీ సెంటర్ నిర్వహిస్తున్న కరిముల్లా అనే వ్యక్తి మోటార్బైక్ ఆదివారం దగ్ధమైంది. వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే బైక్ కాలిపోయింది. ఆదివారం కదా.. అందుకే రాలేదు!ఉదయగిరి: ఉదయగిరి మండలం గండిపాళెంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఒక్క స్టాఫ్ నర్సు మినహా మిగతా సిబ్బంది ఎవరూ లేరు. ఈ పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండగా ఒక్కరు కూడా విధులకు హాజరుకాలేదు. ల్యాబ్ టెక్నీషియన్ది కూడా ఇదే పరిస్థితి. దీంతో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ గదుల తలుపులు తెరుచుకోలేదు. ఒక్క స్టాఫ్నర్సు మాత్రమే విధుల్లో ఉండి వచ్చిన రోగులకు మందులిచ్చి పంపించారు. ఆదివారం వచ్చిందంటే గండిపాళెం పీహెచ్సీకి సెలవే. ఇది 24 గంటలు పనిచేయాల్సిన ఆస్పత్రి. అయితే ఆరోజు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. కసుమూరు దర్గాలో నటుడు అలీ ప్రార్థనలువెంకటాచలం: సినీ నటుడు అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కసుమూరు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అలీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు చేసింది. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికగూడూరు రూరల్: గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు దీపిక, కౌసల్య జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు మాధవీలక్ష్మి తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. బాలికలు కాకినాడలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన కబడ్డీ ఫెడరేషన్ చాంపియన్షిప్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు రాజస్థాన్లో జూలై 10 నుంచి 13వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆమె, పీడీ విజయలక్ష్మి, విద్యార్థినులను అభినందించారు.వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలుపెళ్లకూరు: మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన మధుసూదన్రెడ్డి, కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద కారు అదుపుతప్పి ఐరన్ డివైడర్ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి, అలాగే తిరుపతి నుంచి నెల్లూరుకు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ చిల్లకూరు వడ్డిపాళెం వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్కు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కండలేరులో 36.955 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 36.955 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి ఈఈ రామచంద్రమూర్తి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,480, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.32 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం అనే విషయం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్ధమైందని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పుస్తకాన్ని నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనం ఆరుణమ్మ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు పాలన ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 143 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేశారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాల ఫలితంగా చంద్రబాబు తూతూ మంత్రంగా ఒకటిరెండు పథకాలను అమలు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్, తల్లికి వందనం పథకాల్లో పారదర్శకత లోపించిందన్నారు. ఓటు వేసిన ప్రజలను కించపరిచేలా వారి నాలుక కోస్తామని చంద్రబాబు మాట్లాడాన్ని వారు అసహ్యంచుకుంటున్నారని అన్నారు. 18 నుంచి 59ఏళ్లలోపు మహిళలు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయమని కోరుతుంటే ఇవ్వకుండా పీ–4తో అనుసంధానం చేస్తామని కబుర్లు చెప్పడంపై మండిపడ్డారు. నిరుద్యోగభృతిని పీ–4కు అనుసంధానం చేస్తామని యువతను మభ్యపెట్టడం దారుణమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్ అమలు ఊసే లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను దగా చేస్తున్న క్రమంలో జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు. ఈ పుస్తకం చంద్రబాబు పాలనను గుర్తుచేస్తుందన్నారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న పోరాటాలకు భయపడిన చంద్రబాబునాయుడు తల్లికి వందనం పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారన్నారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులందరికీ తల్లికి వందనం అందకపోవడం బాబు మోసపూరిత శైలికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెట్టడాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, సీనియర్ నాయకులు దాసరి భాస్కర్గౌడ్, సాయిమోహన్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నీట్లో మనోళ్లు సత్తా చాటారు
నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 4వ తేదీన నీట్ను ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో మొత్తం 10 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,913 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించారు. ఎస్ఇ.కవిన్ 161వ ర్యాంకు, శ్రీరామ్ 253, యోగేష్ కార్తీక్ 323, వెంకట శ్రీనివాస్ 515, వైష్ణవ్కుమార్ 546, లలిత్ శ్రీహాస్ 563, సుభాష్ శంకర్ 804, విశ్వక్ 955, కత్రివేల్ 962 ర్యాంకులు సాధించారు. అదే విధంగా జాహ్నవి 588 మార్కులు భానుశ్రీసులోచన 543, హరిణి 542, చేతన్ 531 మార్కులు సాధించారు. రేడియాలజీ చేస్తా స్థానిక ఉస్మాన్సాహెబ్పేటలో విశ్వక్ నివాసం ఉంటున్నారు. తండ్రి వంశీకృష్ణ, తల్లి లావణ్య ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఉత్తమ మెడికల్ కళాశాలలో సీటు సాధించి రేడియాలజిస్టుగా పనిచేయడమే లక్ష్యంగా విశ్వక్ చెబుతున్నారు. – ఎం.విశ్వక్ (955 ర్యాంకు) న్యూరాలజిస్టునవుతా స్థానిక భక్తవత్సలనగర్లో జాహ్నవి నివాసం ఉంటున్నారు. తండ్రి రవికుమార్, తల్లి శ్రీలక్ష్మి. మంచి మెడికల్ కళాశాలలో పీజీ చేసి న్యూరాలజిస్టుగా పనిచేయాలన్నదే లక్ష్యంగా జాహ్నవి చెబుతోంది. – జాహ్నవి (2505 ర్యాంకు) వైద్య సేవే లక్ష్యం స్థానిక హరనాథపురంలో లలిత్శ్రీహాస్ నివాసం ఉంటున్నారు. తండ్రి రాజశేఖర్, తల్లి శ్రీలక్ష్మి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మెడిసిన్ చదివి ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమని లలిత్శ్రీహాస్ చెబుతున్నారు. – లలిత్ శ్రీహాస్ (563 ర్యాంకు) -
గంజాయి విక్రేతల అరెస్ట్
● మూడు కేజీల గంజాయి, బైక్ స్వాధీనంనెల్లూరు(క్రైమ్): చెడు వ్యసనాలకు బానిసలై ఒడిస్సా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో విక్రయాలకు పాల్పడుతోన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి, యాక్టివా బైక్ను స్వాధీనం చేసకున్నారు. ఈ మేరకు సంతపేట పోలీస్స్టేషన్లో ఎస్సై జి.బాలకృష్ణతో కలిసి ఇన్స్పెక్టర్ జి.దశరథరామారావు శనివారం నిందితుల వివరాలను వెల్లడించారు. మూలాపేట కోనేటిమిట్ట ప్రాంతానికి చెందిన పి.రాజేష్ తన స్నేహితులైన చైన్నె అశోక్నగర్, జాఫర్ఖాన్పేటకు చెందిన ఎ.జేమ్స్, నెల్లూరు గుప్తాపార్కు సెంటర్కు చెందిన పి.వెంకట హరీష్ అలియాస్ హరీష్ ద్వారా గత కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలో గంజాయిని కేజీ రూ.2,300 చొప్పున కొనుగోలు చేసి నెల్లూరు నగరానికి తీసుకొచ్చేవారు. అనంతరం వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. దీనిపై పోలీసులు గత కొంతకాలంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా శుక్రవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రం సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న రాజేష్, జేమ్స్, హరీష్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి, యాక్టివా బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం గంజాయి విక్రేతలుగా మారారని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బంది శ్రీహరి, లావణ్యకుమార్ రాజా, అల్లాభక్షు, సురేంద్రబాబు, గోపి, కేవీ సుదర్శన్, తిరుపతి తదితరులను ఎస్పీ అభినందించారు. -
పోలీసుల అదుపులో ఐదుగురు?
● స్టేషన్లో భద్రపరిచిన రూ.3.05 కోట్ల నగదు ● వివరాలు గోప్యంగా ఉంచుతున్న పోలీసులు మర్రిపాడు: మండలంలోని బాట సమీపంలో అనుమానాస్పద రీతిలో గుర్తించిన కారుకు సంబంధించిన కేసులో ఐదుగురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలో ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు ఈ కేసు విషయమై పరిశీలన చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రూ.3.05 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని, పోలీస్స్టేషన్లో భద్రపరిచారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన సమాచారంపై పోలీసులు ధ్రువీకరించకపోవడం గమనార్హం. అసలు కారులోనే నగదు దొరికిన విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. అనుమానితుల నుంచి మొత్తం నగదు రాబట్టారా, అసలైన వారు దొరికారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి స్టేషన్ వద్ద పదుల సంఖ్యలో వాహనాలు చూసిన మండల వాసులు ఏం జరుగుతుందోనన్న ఉత్సుకతలో ఉన్నారు. కత్తితో దాడి ఘటనలో నిందితుడి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరానికి చెందిన కృష్ణ మూలాపేట రావిచెట్టు సెంటర్లో బైక్ మెకానిక్షాపు నిర్వహిస్తున్నారు. ఇరుగోళ్లమ్మ సంఘానికి చెందిన వేణు ఈనెల 12వ తేదీ బైక్ రిపేర్ చేయించుకునేందుకు అక్కడికి వచ్చారు. వస్తువులు తెచ్చుకోమని కృష్ణ సూచించగా అతనితో గొడవపడ్డాడు. షాపులో ఉన్న కృష్ణ బావమరిది వెంకటేష్, మరో వ్యక్తి వేణుని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత వేణు అక్కడికి వచ్చి కత్తితో కృష్ణపై దాడిచేయబోగా వెంకటేష్ అడ్డుకోవడంతో అతనిపై దాడిచేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. ఎస్సై మాహబూబ్బాషా శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్ వీరంగం మర్రిపాడు: మండలంలోని నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కోనసముద్రం వద్ద శనివారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ కారును ఢీకొన్న ట్రాక్టర్ డ్రైవర్ అంతటితో ఆగకుండా ఏకంగా కారు డ్రైవర్పై దాడికి యత్నించాడు. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి అక్కడ ఆగడంతో ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న హైవే మొబైల్ పోలీస్ సిబ్బంది పరారైన ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ కాసేపు అక్కడ కూడా వీరంగం సృష్టించాడు. -
జీవనోపాధి కోసం వెళ్లి..
● గాయపడిన బొగ్గు కూలీ మృతి మదనపల్లె రూరల్: జీవనోపాధి కోసం నెల్లూరు జిల్లా నుంచి మదనపల్లెకు వలస వచ్చి బైక్ ప్రమాదంలో బొగ్గుకూలీ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన ఎం.అంకయ్య(30) భార్య ప్రశాంతి, కుటుంబంతో సహా ఉపాధి నిమిత్తం కలకడ సమీపంలోని మల్లిగుట్టపల్లెకు వచ్చి రెండేళ్లుగా ఉంటున్నారు. స్థానికంగా కలప కాల్చి బొగ్గు తయారీ కూలీగా పనిచేస్తున్నారు. 11వ తేదీ బుధవారం కలప కోసేందుకు వినియోగించే యంత్రం మరమ్మతుకు గురికావడంతో రిపేరు చేసుకునేందుకు గుర్రంకొండకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తూ వాహనం అదుపుతప్పి మార్గమధ్యలో రోడ్డుపక్కన ఉన్న బోర్డును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయడంతో కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే గురువారం ఒంట్లో నలతగా ఉంటే మదనపల్లెకు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ప్రమాదం లేదని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయితే లోపలి గాయాలు తిరగబెట్టడంతో శనివారం తీవ్రంగా కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సొసైటీ కాలనీలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరుపతికి తీసుకెళ్లాలని రెఫర్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 108 అంబులెన్స్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని సూచించడంతో, అంకయ్యను సాయంత్రం అక్కడికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించినా అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. అంబులెన్స్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగానే అంకయ్య మృతిచెందాడు. కాగా మృతునికి ముగ్గురు కుమార్తెలు పవిత్ర, కళావతి, గౌతమి ఉన్నారు. -
వరండాలో నిద్రిస్తుండగా ఇంట్లో చోరీ
● 15 సవర్ల బంగారంతో పాటు రూ.50 వేల నగదు అపహరణ వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 15 సవర్ల బంగారంతో పాటు రూ.50 వేలు నగదును దోచేశారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆమర్లపూడి మాల్యాద్రి– వరలక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి వరండాలో ఆరుబయట నిద్రకు ఉపక్రమించారు. అయితే ఇంటి ప్రధాన తలుపునకు తాళం వేయకుండా గడిపెట్టి వదిలేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ దొంగలు ఎత్తుగా ఉన్న ప్రహరీ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించారు. ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లారు. బెడ్రూమ్లో ఉన్న బీరువాను కట్టర్తో కటింగ్ చేసి అందులో ఉన్న 15 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును దొంగతనం చేశారు. కాగా అర్ధరాత్రి వేళలో ఇంటిలో శబ్ధం వచ్చినట్లు భార్య వరలక్ష్మి భర్తను లేపి చెప్పింది. నిద్రమత్తులో ఉన్న అతను ఫ్యాన్ శబ్ధం కావచ్చు అంటూ లేవలేదు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మాల్యాద్రి లేచి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉండడం, వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు స్వీకరించింది. కాగా ఆ రాత్రి దొంగలు ముందుగా ఓ రేకుల ఇంట్లో ప్రవేశించి వెతికారు. ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న మాల్యాద్రి ఇంట్లో దొంగతనం చేశారు. ఎస్సై వీరప్రతాప్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఓ సారి కొద్ది రోజులు క్రితం ఇదే గ్రామంలో పట్టపగలు దొంగలు ఓ ఇంట్లో ప్రవేశించి పెద్ద మొత్తంలో బంగారంతో పాటు నగదు అపహరించిన ఘటన మరువక ముందే మరోసారి చోరీ జరగడంతో గ్రామస్తులు అందోళన చెందుతున్నారు. -
వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నరవ్రాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఆదివారం నిలుపు కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి. అందుకు తగ్గట్లు వ్యవస్థాపక ధర్మకర్తల మండలి, దేవదాయశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం ఎదురుగా ఉన్న యాగశాలలో ఆదివారం ఉదయం హోమం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం వెంగమాంబ, గురవయ్య దంపతులను ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహిస్తారు. రాత్రికి అమ్మవారి పుట్టినిల్లు అయిన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో పచ్చవ వంశస్తులు పసుపును దంచి లాంఛనంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఈ పసుపు దంచే కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటారు. దేవస్థానం వద్ద భక్తుల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. నిలుపుతో నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం -
భర్త చేతిలో భార్య హతం
● అనుమానం, వేధింపులే కారణం నెల్లూరు(క్రైమ్): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో దాడిచేసి హతమార్చాడు. ఈ ఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్ గౌడహాస్టల్ సమీపంలో ఎల్.విజయ్చంద్ర, శైలజ(46) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు. విజయ్చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. శైలజ తండ్రి చైన్నెలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద ఎత్తున నగదు ఖర్చు పెట్టించింది. దీంతో విజయ్చంద్ర అప్పులపాలయ్యారు. ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకున్నారు. ఆయన విధులకు వెళ్లినా వీడియో కాల్ చేసి వేధించేది. ఆమె మానసిక పరిస్థితి సరిగా ఉండేదికాదు. నిత్యం భర్తతో గొడవపడుతూ ఉండేది. కుమారులు అడిగితే వారిపై సైతం గొడవపడేది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం విజయ్చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకురమ్మని బయటకు పంపించారు. ఈక్రమంలో దంపతుల నడుమ మరోమారు గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. డయల్ 112 ద్వారా సమాచారం అందుకున్న నగర ఇన్చార్జి డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పెద్దకుమారుడు శ్యామ్ సాత్విక్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోకలిబండతో భార్యను కొట్టి చంపిన భర్త
నెల్లూరు(క్రైమ్): భార్య చీటికి మాటికి గొడవపడుతుండడంతో విసిగిపోయిన భర్త రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన నెల్లూరులో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు బాలాజీనగర్ గౌడహాస్టల్ సమీపంలో ఎల్.విజయ్చంద్ర, శైలజ(46) దంపతులు నివసిస్తున్నారు. వారికి బీటెక్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులున్నారు.విజయ్చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి చెన్నైలో ఉంటూ మృతిచెందారు. ఆయనకు చెందిన ఆస్తులు తమకు రావాలంటే కొంత నగదు ఖర్చు చేయాలని ఆమె భర్తకు చెప్పి అతనిచేత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేయించింది. దీంతో విజయ్చంద్ర అప్పులపాలయ్యాడు.ఈ క్రమంలోనే భర్తపై ఆమె అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం భర్తతో గొడవపడుతుండేది. కుమారులు ప్రశి్నస్తే వారితోనూ గొడవపడేది. శనివారం మధ్యాహ్నం విజయ్చంద్ర ఇంట్లోనే ఉన్నారు. కుమారులను భోజనం తీసుకురమ్మని బయటకు పంపించారు. ఈక్రమంలో దంపతుల నడుమ మరోమారు గొడవ జరిగింది.ఆగ్రహానికి గురైన భర్త పక్కనే ఉన్న రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. పెద్దకుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
నెల్లూరు జైల్లో కాకాణిని పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: కాకాణి గోవర్థన్రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం.. జైల్లో కాకాణిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా రాజకీయ నేతలకు పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు. చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. -
రూ.4.50 కోట్లతో ఉడాయింపు
● పరారీలో డ్రైవర్, గుమస్తా ● జీపీఎస్ కట్ అవడంతో అనుమానించిన వ్యాపారి ● వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ● అదుపులో నలుగురు అనుమానితులు? ● రూ.కోట్లల్లో రికవరీ మర్రిపాడు: కారులో తరలిస్తున్న రూ.4.50 కోట్లతో కొందరు ఉడాయించారు. ఈ ఘటన శుక్రవారం మర్రిపాడు సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని దాదాపు రూ.3 కోట్లకుపైగా రికవరీ చేసినట్లు సమాచారం. సేకరించిన సమాచారం మేరకు.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.కోట్లల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఢిల్లీలో రూ.4.5 కోట్ల నగదును తన కారు డ్రైవర్, గుమస్తాకు ఇచ్చి చైన్నెలో అందజేయాలని సూచించారు. దీంతో కారు డ్రైవర్, గుమస్తా నగదుతో చైన్నెకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, కర్నూలు మీదుగా చైన్నెకు వెళ్లాల్సి ఉంది. కారుకు జీపీఎస్ ఏర్పాటు చేసి ఉండడంతో ప్రతి క్షణం కారును పర్యవేక్షిస్తున్నారు. అయితే డ్రైవర్ రూట్ మార్చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీపంలోని పెద్దపోలుకుంట మీదుగా మర్రిపాడు మండలం సింగనపల్లి వద్దకు వచ్చే సరికి సిగ్నల్ కట్ అయింది. దీంతో సదరు వ్యాపారి కారు డ్రైవర్కు, గుమస్తాకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్లో ఉండడంతో ఆయన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు బాట వద్ద వ్యాపారికి చెందిన కియో కారును స్వాధీనం చేసుకుని మర్రిపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. వ్యాపారి హుటాహుటిన మర్రిపాడు పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే నగదు దోపిడీ? కారు డ్రైవర్ పథకం ప్రకారం స్నేహితులతో కలిసి నగదు కాజేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున నగదును తరలిస్తున్నామని డ్రైవర్ ఎప్పటికప్పుడు తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వారందరూ కలిసి నగదు కాజేసి కారును అక్కడే వదిలి పరారయ్యారు. అయితే వారికి ఈ ప్రాంతంపై అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో పోలీసులకు దొరికినట్లు సమాచారం. అతనిచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3 కోట్లపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పోలీసు అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. మొత్తం మీద గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు చేధించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
హేచరీ యాజమాన్యంపై కేసు
● బాల కార్మికుడికి గాయాలవడంతోనే.. ఉలవపాడు: హేచరీలో పనిచేస్తున్న బాల కార్మికుడికి గాయాలవడంతో యాజమాన్యంపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా వయకరంపల్లి మండలం ఈదటం గ్రామానికి చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అతడి స్నేహితుడు నాగేష్ ఉలవపాడు మండల పరిధిలోని అలగాయపాళెం వద్ద ఉన్న శ్రీనివాస హేచరీలో పనిచేస్తున్నాడు. అతడితోపాటు సెలవుల్లో పని చేయడానికి బాలుడు మే 3వ తేదీన వచ్చాడు. 27వ తేదీన రొయ్య పిల్లలు పెంచే ట్యాంక్లు శుభ్రం చేసి యాసిడ్ బకెట్తో నిచ్చెన దిగుతున్న సమయంలో బాలుడు కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. బకెట్లో ఉన్న యాసిడ్ కళ్లలో పడి మంటలు రావడంతో యాజమాన్యం కందుకూరులోని పంటవారిపాళెంలో చూపించి ఇంటికి పంపించింది. తల్లిదండ్రులు బాలుడిని తుని హాస్పిటల్లో చూపించగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. తుని వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా లేబర్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎస్సై అంకమ్మ వెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 18 ఏళ్లలోపు బాలుడిని పనిలో పెట్టుకున్నందుకు హేచరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరైనా బాల కార్మికులు ఉన్నారా అని తనిఖీ చేశారు. -
మోటార్బైక్ను తప్పించబోయి..
వెంకటాచలం: ఎదురుగా వచ్చిన మోటార్బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీ మల్లుగుంటసంఘం వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు వరినాట్లు వేసేందుకు ఆటోలో జోసఫ్పేటకు బయలుదేరారు. ఆటో మల్లిగుంటసంఘానికి చేరుకోగానే బైక్ ఎదురుగా అడ్డు వచ్చింది. ఆటో డ్రైవర్ బైక్ను తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడి పడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మల్లి లక్ష్మీదేవమ్మ (55)తోపాటు, మరో ఆరుగురు మహిళలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే ట్రాక్టర్లో సర్వేపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. లక్ష్మీదేవమ్మకు తీవ్ర రక్తగాయాలు కావడంతో మృతిచెందింది. గాయాలపాలైన మహిళలు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. లక్ష్మీదేవమ్మ మృతిచెందిందనే విషయం తెలియడంతో ఆమె భర్త తిరుపాలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సర్వేపల్లికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతి ఆరుగురికి గాయాలు -
కొనసాగుతున్న టీచర్ల బదిలీలు
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుండడంతో ఆ ప్రాంతంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు తిష్ట వేశారు. పాయింట్లు, ప్లేస్ చూపకపోవడం వంటి సమస్యలపై పోటా పోటీగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియ కు తరుచూ అంతరాయం కలుగుతోంది. బదిలీ జరుగుతున్న జెడ్పీ పాఠశాలలో తగినన్ని బల్లలు, కుర్చీలు లేకపోవడంతో ఉపాధ్యాయులు వరండాల్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. బదిలీల ప్రక్రియ ప్రతి రోజూ రాత్రి పొద్దుపోయే వరకు జరుగుతుండడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ అసిస్టెంట్లకు సంబంధించి క్లస్టర్ వేకెన్సీలు కేటాయించకపోవడంతో వారికి అన్యాయం జరిగిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. లాంగ్వేజ్ పండిట్లకు అన్యాయం జరుగుతుందంటూ ఎక్కువ సంఖ్యలో పండిట్లు ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్పీ తెలుగు, హిందీ సబ్జెక్ట్లకు సంబంధించి జిల్లాలో ఉన్న 95 శాతం ఖాళీలను గూడూరు డివిజన్లో చూపించారని ఆవేద న వ్యక్తం చేశారు. కావలి, నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లకు సంబంధించి ప్రతి మండలంలో 3 ఖాళీలను అదనంగా చూపించి న్యాయం చేయాలని కోరారు. ఓ పక్క బదిలీలు, మరో పక్క తరగతులు స్థానిక దర్గామిట్టలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ గందరగోళంగా మారింది. ఒక పక్క బదిలీలు జరుగుతుండడంతో ఆప్షన్లు పెట్టుకోవాల్సిన ఉపాధ్యాయులతోపాటు ఆయా యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మరో పక్క పాఠశాలల పునః ప్రారంభం కావడంతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. బదిలీల జరుగుతున్న నేపథ్యంలో అన్యాయం జరిగిందంటే ఉపాధ్యాయులతోపాటు యూనియన్ సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. కౌన్సెలింగ్ సెంటర్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు మోహరింపు చిన్నచిన్న సమస్యలపై అభ్యంతరాలు బదిలీ ప్రక్రియకు అవాంతరాలతో జాప్యం -
డీలర్ టు మిల్లర్
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత ● కోవూరు అడ్డాగా చెలరేగుతున్న రేషన్ మాఫియా ● జిల్లా వ్యాప్తంగా నెలకు 9 వేల మెట్రిక్ టన్నుల అక్రమ రవాణా ● బుచ్చిరెడ్డిపాళెం, చంద్రశేఖరపురం రైస్మిల్లుల్లో నెలకు 2 వేల టన్నులు రీపాలిష్ ● చైన్నె మార్కెట్తోపాటు పోర్టుల ద్వారా విదేశాలకు తరలింపు ● షాడో ఎమ్మెల్యేకు వాటాగా నెలకు రూ.10 లక్షలు ● పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు నియోజకవర్గం అన్ని రకాల మాఫియాలకు అడ్డాగా మారింది. సహజ వనరుల దోపిడీ నుంచి పేదల బియ్యం వరకు షాడో ఎమ్మెల్యేల కనుసన్నలో మాఫియా గాళ్లు దోచుకుంటున్నారు. ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్ మాఫియాలతోపాటు బుచ్చిరెడ్డిపాళెం, చంద్రశేఖరపురం, నెల్లూరులోని శెట్టిగుంటరోడ్డు కేంద్రాలుగా రేషన్ బియ్యం మాఫియా చెలరేగిపోతుంది. ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గంతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న రైస్మిల్లుల్లో రీపాలిష్ చేసి చైన్నె మార్కెట్కు తరలించి రూ.కోట్లు గడిస్తోంది. అందుకు నజరాగా మాఫియా నెలనెలా వాటాలు పంచుతున్నారు. నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత కోవూరు ఎమ్మెల్యేకు కీలక అనుచరుడిగా, షాడో ఎమ్మెల్యేగా ఉంటూ రేషన్ మాఫియాకు రింగ్లీడర్గా వ్యవహరిస్తున్నాడు. స్మగ్లర్తోపాటు మరో ఇద్దరు కలిసి రేషన్ బియ్యం దందాకు తెరతీశారు. కోవూరుతోపాటు ఇతర నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు ఓ ప్రత్యేక ముఠానే తయారు చేశాడు. డీలర్లతో కుమ్మకై ్క వారి నుంచి కేజీ రూ.16 వంతున కొనుగోలు చేసి బుచ్చిరెడ్డిపాళెంలోని నాగామాంబపురం విలియన్స్పేటలో ఉన్న ఓ రైస్ మిల్లు, కొడవలూరు మండలంలోని రాజుపాళెం, చంద్రశేఖరపురంలో ఉన్న రైస్ మిల్లులకు, నెల్లూరు సిటీలోని శెట్టిగుంటరోడ్డు రైస్మిల్లుకు చేర్చి అక్కడ పాలిష్ పట్టించి బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి తమిళనాడు మార్కెట్కు తరలిస్తున్నారు. నెలకు 2 వేల మెట్రిక్ టన్నుల వ్యాపారం జిల్లాలో మొత్తంగా నెలకు సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే.. అందులో ఒక్క కోవూరు నియోజకవర్గం నుంచి దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం వ్యాపారం జరుగుతుందంటే ఇక్కడి రేషన్ మాఫియా రేంజ్ అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంతోపాటు సమీపం నియోజకవర్గాల మండలాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు పాలిష్ పట్టించి రీసైక్లింగ్ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ నడుస్తోంది. ఆయా మిల్లుల్లో రేషన్ బియ్యం పాలిష్ పట్టడం తప్ప.. ధాన్యం కొనుగోలు చేసి మరపడుతున్నట్లు రికార్డుల్లేవు. ఆయా మిల్లులకు ప్రతి నెలా వేలల్లో వచ్చే కరెంట్ బిల్లులే రేషన్బియ్యం పాలిష్ పడుతున్నారనే దానికి అద్దం పడుతోంది. షాడో ఎమ్మెల్యేకు నెలకు రూ.10 లక్షలు రేషన్ మాఫియా నెలకు రూ.కోట్లల్లో సంపాదిస్తుంటే.. షాడో ఎమ్మెల్యేకు నెలకు రూ.10 లక్షల వాటాలుగా ఇస్తున్నారనే సమాచారం. ఇక పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు ఇచ్చుకుంటూ పోతుండడంతో ఎవరిపైనా చర్యలు తీసుకుంటున్న దాఖాలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యం ● జలదంకి మండలం చామదలకు చెందిన డీలర్లు వెంకటసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి దుకాణాల నుంచి గత మంగళవారం అర్ధరాత్రి 11 బస్తాల బియ్యం అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ జరిగిన అసలు ట్విస్ట్ ఏమిటంటే.. మరో లారీలో భారీగా రేషన్ బియ్యాన్ని ఇంకో రూట్లో తరలించడమే. ● కొడవలూరు మండలం చంద్రశేఖర్పురం వద్ద లక్ష్మీ నరసింహస్వామి రైస్మిల్లులో వారం రోజుల కిందట రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా పౌరసరఫరా శాఖ డీటీ సారంగపాణి పట్టుకున్నారు. 32 టన్నుల రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి చైన్నె మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే రేషన్ దందాలో కోవూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తోంది. కోవూరు షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. ఎండీయూ వాహనాల ద్వారానే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసి, డీలర్లకు కట్టబెట్టిన పదమూడు రోజుల్లో నాలుగు చోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలు పట్టుబడ్డాయి. దొరకకుండా తప్పించుకున్న వాహనాలైతే లెక్కే లేదు. ఏ దుకాణం నుంచి వస్తున్నాయో తెలిసినా ఆ డీలర్పై 6ఏ కేసులు నమోదు చేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, వారి షాడోలు రేషన్ మాఫియా లీడర్లుగా వ్యవహరిస్తూ నెలవారీగా వాటాలు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు ఇచ్చుకోవడం అక్రమ రవాణాపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.సంగం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంతోపాటు వాహనాన్ని శుక్రవారం సంగం వద్ద పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై వాహనంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో వాహనాన్ని సంగం పోలీసులు వెంబడించారు. బుచ్చి టోల్ ప్లాజా మధ్యలో పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చేజర్ల మండలం నాగులవెల్లటూరు నుంచి బుచ్చిరెడ్డిపాళెం సమీపంలో ఉన్న ఓ రైస్మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి విచారణ చేపట్టి దోషులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. -
కలెక్టర్ సారూ.. దృష్టి పెట్టండి
అనుమతులు లేకున్నా.. జిల్లాలో గ్రావెల్ మాఫియా బరితెగించింది. కావలి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. ప్రధానంగా దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి మండలాల్లో చెరువులతోపాటు ప్రభుత్వ భూముల్లో రేయింబవళ్లు వందలాది యంత్రాలు పెట్టి వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను తరలిస్తున్నారు. వెంకటాచలం మండలం నాగబోట్లకండ్రికలో అయితే ఒక ఉద్యమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. ఆ అక్రమార్కులకు మైనింగ్ కార్యాలయం నుంచి పూర్తి సహకారం అందిస్తూ అందుకు నజరాలు అందుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ● అనుమతులతో పనిలేకుండానే విచ్చలవిడిగా మైనింగ్ ● పర్మిట్లు లేకుండానే తరలివెళ్తున్న క్వార్ట్ ్జ మెటల్ ● పెన్నాను కుళ్లపొడుస్తున్నా పట్టించుకోని వైనం ● చెరువులు, ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ దోపిడీ జిల్లాలో దాదాపు 13 కంకర క్వారీలున్నాయి. నాలుగేళ్లుగా పర్మిట్లు రిలీజ్ చేయలేదు. అయినా కంకర క్వారీలు యథేచ్ఛగా నడిపిస్తున్నారు. పర్మిట్లు లేకుండానే జిల్లాలో జరిగే అభివృద్ధి పనులకు నిత్యం వందల టిప్పర్లలో కంకర తరలివెళ్తోంది. కానీ మైనింగ్ అధికారులు క్వారీలపై ఎన్నడూ కూడా దాడులు చేసి అక్రమ రవాణాను అడ్డుకున్న ఉదంతాలు ఏడాది కాలంలో ఎక్కడా జరగలేదు. సాక్షి, టాస్క్ఫోర్స్: జిల్లాలో పెన్నా గర్భం ఇసుక అక్రమ తవ్వకాలతో శోకిస్తోంది. మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో భూతల్లి గుండెకోతకు గురవుతోంది. మైకా, క్వార్ట్ ్జమెటల్ అక్రమ మైనింగ్తో భూగర్భం రోదిస్తోంది. కూటమి నేతలు సహజ వనరులను దోపిడీ చేసేందుకు తమకు అనుకూలంగా ఉండేందుకు పక్క జిల్లాలో ఏడీ స్థాయి అధికారిని జిల్లాలో ఇన్చార్జి డీడీ సీట్లో కూర్చోబెట్టారు. దీంతో అధికార పార్టీ నేతల దోపిడీకి, అక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటూ విశ్వాసం చూపిస్తూ స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడు. ప్రభుత్వం ఏర్పాటుతోనే మైనింగ్ శాఖ అధికారిగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. కానీ ఆయన కూటమి నేతల ఆజ్ఞానుసారంగా పనిచేయకపోవడంతో ఆయన్ను చిన్న కారణం చూపించి కలెక్టర్తో ప్రభుత్వానికి సరెండర్ చేయించారు. అప్పటి నుంచి ఆ స్థానంలోకి ఫుల్చార్జి అధికారిని రానివ్వకుండా ఇన్చార్జి పేరుతో ఈ అవినీతి అధికారిని ఆ సీట్లో కూర్చోబెట్టి కూటమి నేతలు తమ కార్యకలాపాలు సాగించుకుంటున్నారు. సైదాపురంలో గనుల లీజుల వ్యవహారంలో తాము చెప్పినట్టే తలాడిస్తాడని తిరుపతి జిల్లా మైనింగ్ శాఖలో ఏడీ స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఆయన్ను తీసుకువచ్చి నెల్లూరు జిల్లా డీడీ స్థానంలో ఇన్చార్జిగా అధికారం కట్టబెట్టి కూర్చోబెట్టారు. గత ప్రభుత్వంలో ఆయన జిల్లా మైనింగ్ శాఖ విజిలెన్స్ వింగ్లో పనిచేశారు. లీజుల వ్యవహారం నుంచి అన్నింటిపై అవగాహన ఉండడంతోపాటు కూటమి నేతల కనుసన్నల్లోనే బాధ్యతలు నిర్వహించేలా ఒప్పందంతో తీసుకువచ్చి ఈ సీటులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి ఆయన కూటమి నేతల అండతో చెలరేగిపోతున్నాడు. మైనింగ్శాఖ కార్యాలయాన్ని కూటమి నేతల ప్రైవేట్ అడ్డాగా మార్చేశాడు. గత ప్రభుత్వం పెనాల్టీలను బూచిగా చూపి.. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వార్ట్ ్జ గనుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో గత ప్రభుత్వం దాదాపు 30 మైన్స్కు రూ.250 కోట్ల వరకు పెనాల్టీలు విధించింది. ఆయా పెనాల్టీలను సాకుగా క్వార్ట్ ్జ మైన్స్ యజమానులతో బేరసారాలు నడిపి వసూళ్లు చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. పాత క్వార్ట్ ్జ గనులకు లీజుల పునరుద్ధరణ, పర్మిట్ల రిలీజ్కు కూడా రూ.కోట్లల్లో చేతులు మారుతున్నాయని సమాచారం ఉంది. గ్రావెల్ దందాకు సహకారం సహజ వనరులు దోచిపెడుతూ.. కాసులు పిండుకుంటున్న అధికారి ఇసుక దందాలో.. జిల్లాలో ఉచిత ఇసుక విధానం ముసుగులో దందా నడుస్తోంది. పెన్నానదిని అడుగడుగునా కుళ్లబొడుస్తున్నారు. అనధికారికంగా ఓపెన్ రీచ్ల పేరుతో భారీ యంత్రాలతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతోంది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా.. మీడియాలో కథనాలు వస్తున్నా.. మైనింగ్ అధికారిగా ఆ వైపే కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం స్టాక్ యార్డుల్లో ఇసుక మాయం అవుతున్నా.. ఆ లెక్కలు అడిగే దిక్కులేకుండా పోయింది. పర్యావరణ నిబంధనల మేరకు జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు పెన్నానదిలో ఇసుక తవ్వకాలు నిలిపి వేశారు. ప్రజా అవసరాల కోసమని ఎనిమిది యార్డుల్లో 2.19 లక్షల టన్నుల ఇసుక ఉంచినట్లు అధికారిక గణాంకాలు చూపిస్తున్నారు. వాస్తవంగా అందులో లక్ష టన్నుల కూడా లేదు. అధికారికంగా పెన్నానదిలో ఇసుక తవ్వకాలు ఆపేసినట్లు చెబుతున్నా.. రాత్రి వేళల్లో నది నుంచే లోడింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మైనింగ్ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అక్రమార్కులతో చేతులు కలిపారన్న ఆరోపణలున్నాయి.. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి.. జిల్లా మైనింగ్ శాఖలో ఓ అక్రమార్కుడు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే స్థాయిలో చెలరేగిపోతున్నాడు. మట్టి నుంచి మైకా వరకు, ఇసుక నుంచి క్వార్ట్ ్జ వరకు కూటమి నేతలకు దోచిపెడుతూ తన జేబులు నింపుకుంటున్నాడు. జిల్లాకు సూపర్ బాస్ కలెక్టర్ అయితే.. అంతకు మించిన అధికారాన్ని చెలాయిస్తున్నాడు. అక్రమ మైనింగ్కు, పర్మిట్లు లేకుండానే క్వార్ట్ ్జ మెటల్ను విదేశాలకు తరలించేందుకు అధికార పార్టీ నేతల పట్ల విశ్వాసంగా ఉంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం సహజ వనరుల దోపిడీపై మీడియా ఘోషిస్తున్నా.. ధ్రుతరాష్టుడి పాత్ర పోషిస్తున్నాడు.అత్యధిక ఆదాయం వచ్చే శాఖలో మైనింగ్ ఒకటి. కానీ ఆ శాఖకు పట్టిన అవినీతి చెద ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచి సొంత ఆదాయం పెంచుకుంటోంది. బినామీ పేర్లతో రూ.కోట్లల్లో ఆస్తులు పెంచుకుంటున్నారు. అవినీతి భరతం పడతామంటూ బీరాలు పలికే అవినీతి నిరోధక శాఖ సైతం ఇటువంటి అవినీతి పరుల వైపు కన్నెత్తి చూడకపోవడం విచారకరం. ఈ శాఖలో పనిచేసే ఏ అధికారిపై కొన్నేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఏసీబీ శాఖ పనితీరును ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వంలో జిల్లా పరిపాలనాధికారులు సైతం నేతల కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తోంది. జిల్లాకే బాస్ అయిన కలెక్టర్ కూడా మైనింగ్ అక్రమాలు తెలిసీ మౌనంగా ఉంటున్నారు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. అధికారులు బాధ్యతలు విస్మరిస్తే... రేపు వారి మెడకే చుట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికై నా మైనింగ్శాఖలో జరిగే అవినీతికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ను జిల్లా ప్రజానీకం కోరుతోంది. -
బాతులు మేపేందుకు చిన్నారుల కిడ్నాప్
● మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): బాతులు మేపేందుకు ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసిన మహిళను నెల్లూరు నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన కె.శీనమ్మ, కృష్ణ దంపతులకు తొమ్మిదేళ్ల కుమార్తె చంద్రమ్మ, కుమారుడు సూర్య అనే పిల్లలున్నారు. ఈనెల 8వ తేదీన శీనమ్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని మైపాడు బీచ్కు వెళ్లింది. మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి తిరిగి నెల్లూరుకు చేరుకున్నారు. శెట్టిగుంటరోడ్డు వద్ద ఆటో కోసం వేచి ఉండగా చిన్నారులు అదృశ్యమయ్యారు. బాధిత తల్లి గాలించగా జాడ తెలియకపోవడంతో నవాబుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చిన్నారులను తీసుకెళ్లింది కావలికి మండలం చలంచర్ల గ్రామానికి చెందిన పి.జాలమ్మగా గుర్తించారు. శుక్రవారం కావలి జేబీ కాలేజ్గేటు వద్ద ఆమెను అదుపులోకి తీసుకుని చిన్నారులను సంరక్షించారు. అనంతరం ఆమెను స్టేషన్కు తరలించి విచారించగా బాతులు మేపేందుకు చిన్నారులను తీసుకెళ్లినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. చిన్నారులను బాధిత తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్, ఎస్సై రెహమాన్, సిబ్బంది బీవీ నరసయ్య, ఎన్.ప్రసాద్, ఆర్వీ రత్నయ్య, టి.మస్తాన్రావు, ఎం.వేణు, జి.మస్తానయ్య, ఎస్కే గౌస్బాషాలను ఎస్పీ అభినందించారు. -
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): పుంగనూరు ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తిరుపతిలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డితో చంద్రశేఖర్రెడ్డి పలు విషయాలపై చర్చించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. కాకాణి బెయిల్ పిటిషన్ 16కు వాయిదా నెల్లూరు (లీగల్): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగించడానికి ఈ నెల 16కు వాయిదా వేస్తూ నెల్లూరు 5వ అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ కోర్టులో తమ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పీపీ విజయమ్మ తమ వాదనలు పూర్తి కాలేదని, మరికొన్ని వాదనలు వినిపించడానికి సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో కోర్టు న్యాయమూర్తి సరస్వతి బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగింపును సోమవారానికి వాయిదా వేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి సస్పెన్షన్ ఉదయగిరి: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని శకునాలపల్లి అటవీ బీట్ అధికారి పి.భానుతేజను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీశాఖాధికారి కదిరి మహబూబ్బాషా ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రేంజ్ అధికారి కుమారరాజా ఆ ఉత్తర్వు ప్రతిని భానుతేజకు అందజేశారు. శకునాలపల్లి అటవీ బీట్లో అక్రమంగా జామాయిల్ నరికి సొంతంగా అమ్మకొని నగదు కాజేసిన విషయమై స్థానిక వనసంరక్షణ సమితి సభ్యులు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో జిల్లా అధికారి అదేశాల మేరకు రేంజ్ అధికారి విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు పంపారు. దీంతో భానుతేజను సస్పెండ్ చేశారు. కొత్తపల్లి బీట్ అఽధికారి చిన్నప్పరెడ్డిని శకునాలపల్లి బీట్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరొకరికి కరోనా నెల్లూరు (అర్బన్): జిల్లాలో మరొకరికి కరోనా నిర్ధారణ అయింది. నగరానికి చెందిన 30 ఏళ్ల యువకుడు జ్వరం, జలుబు, గొంతు సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడ కరోనా పరీక్ష చేయగా శుక్రవారం కోవిడ్ నిర్ధారణ అయింది. అతనికి కూడా స్వల్ప లక్షణాలుండటంతో హోం ఐసోలేషన్లో ఉంచారు. ఇప్పటి వరకు జిల్లాలో 12 కరోనా కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో ఎక్కడ చూసినా జ్వరాలు ఎక్కువగా ప్రబలి ఉన్నాయి. ఎక్కువ మందికి పరీక్షలు చేస్తే మరిన్ని కరోనా కేసులు నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా వైద్యశాఖ పరీక్షలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
హైదరాబాద్-తిరుపతి వందే భారత్లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన రైలు
సాక్షి, నెల్లూరు: హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, వందే భారత్ రైలు నెల్లూరులో నిలిచిపోయింది. వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు నిలిపిపోయింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కారు అద్దాలు పగులగొట్టి..
● రూ.8.90 లక్షల చోరీ ఆత్మకూరురూరల్: ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి రిజి స్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన అనుమసముద్రంపేట గ్రామానికి చెందిన చిలకపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి రూ.8.90 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఆత్మకూరు ఎస్సై జిలానీ కథనం మేరకు.. రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన బాధితులు కారులో నగదు ఉంచి తాళాలు వేసి కార్యాలయంలోకి వెళ్లాడు. తిరిగి వచ్చేలోపు కారు అద్దాలు పగులగొట్టి బ్యాగ్లోని నగదును అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
14, 15 తేదీల్లో జాతీయ పన్ను సదస్సు
నెల్లూరు(టౌన్): నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15 తేదీల్లో నెల్లూరులోని డీఆర్ ఉత్తమ్ హోటల్లో జాతీయ పన్ను సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. గురువారం నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో సదస్సుకు సంబంధించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సుకు సంస్థ జాతీయాధ్యక్షుడు సమీర్ జానీ, హైకోర్టు న్యాయమూర్తి ఎన్.జయసూర్య, స్టేట్ జీఎస్టీ కమిషనర్ రవిశంకర్, అదనపు కమిషనర్ జేవీఎం శర్మ తదితరులు హాజరవుతారన్నారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆడిటర్లు, కల్సల్టెంట్లు, ట్యాక్స్ అడ్వకేట్లు తదితరులు రిజిస్టర్ చేసుకుని సదస్సులో పాల్గొనాలన్నారు. సీనియర్ సీఏ పప్పు మధుసూధన్, సీనియర్ ట్యాక్స్ అడ్వకేట్ పాండురంగయ్య, సీనియర్ ఆడిటర్ కోట సూర్యప్రకాశంను సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఎం.సుబ్బారావు, కోటసునీల్కుమార్, వెంకటేశ్వరరావు, ఏవీఎస్ కృష్ణమోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం వెంకటాచలం: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని తాటిపర్తిపాళెం సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. తాటిపర్తిపాళె ం గ్రామానికి చెందిన గుమ్మా వెంకటరమణయ్య (48) బైక్పై వస్తుండగా.. తాటిపర్తిపాళెం సమీపంలో గోశాల నుంచి వస్తున్న టిప్పర్ వేగంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంకటరమణయ్యకు భార్య సుభాషిణి, ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లల్ని పాఠశాలలకు పంపాలి
నెల్లూరు(పొగతోట): బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా స్కూళ్లకు పంపి చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని డీఆర్వో ఉదయ్భాస్కర్ అన్నారు. గురువారం ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీనిని డీఆర్వో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల చేత పని చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను తప్పనిసరిగా పంపాలన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఏడీ గౌస్బాషా, ఐసీడీఎస్ పీడీ అనూరాధ, సీడీపీఓ అరుణ, బాలల సంరక్షణాధికారి సురేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అప్పుల బాధ తాళలేక..
● యువకుడి ఆత్మహత్య ఇందుకూరుపేట: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండంలోని కొరుటూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొరుటూరుపాళేనికి చెందిన ముత్యాల మనోహర్ (29)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను వివిధ కారణాలతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం సముద్రం ఒడ్డున పురుగు మందు తాగాడు. కొంతసేపటికి భయపడిన మనోహర్ తాను ఆత్మహత్యకు యత్నించానని నోటి నుంచి నురగలు కక్కుకొంటూ అటుగా వెళ్తున్న స్థానికులకు చెప్పాడు. దీంతో వారు చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం చనిపోయాడు. కేసు నమోదు చేసిన ఎస్సై నాగార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 2,613 పాఠశాలల్లో కిట్స్ పంపిణీ నెల్లూరు(టౌన్): విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా జిల్లాలోని 2,613 ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్ కిట్స్ను పంపిణీ చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఏపీసీ చేతుల మీదుగా కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడతలో ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీలు అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్బాబు, సీఎంఓ పెంచలయ్య, ఏపీఓ ప్రసాద్, ఎంఈఓ మురళీధర్, స్కూల్ హెచ్ఎం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ నేడు నెల్లూరు(లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. రేపటి నుంచి రెగ్యులర్ ఐదో అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ,) న్యాయమూర్తి సరస్వతి కోర్టుకు హాజరు అవుతున్నందున ఇన్చార్జి కోర్టు న్యాయమూర్తి సుమ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
నెల్లూరు రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): అనారోగ్యంతో గుర్తుతెలియని వ్యక్తి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నంబర్ 4పై గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగి నలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ టీషర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీసీఏఓగా తిరుపాల్రెడ్డి నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లా సహకార ఆడిట్ అధికారిగా కె.తిరుపాల్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీసీఏఓగా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య నరసరావుపేటకు బదిలీ కావడంతో కావలి డివిజనల్ సహకార అధికారిగా పనిచేస్తున్న తిరుపాల్రెడ్డిని నియమించారు. దీంతో ఆయన డీసీఓ గుర్రప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. -
పరిశ్రమల పేరిట.. పొలాలు లాక్కుంటారా..?
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కందుకూరు: పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను లాక్కోవడం దారుణమని.. వీటిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహార చెల్లింపులోను అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రామాయపట్నంలో గురువారం పర్యటించిన ఆయన భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం మేరకు రైతుల నుంచి భూమిని సేకరించాలంటే సబ్ రిజిస్ట్రార్ నిర్ణయించిన ధర ప్రామాణికంగా పరిహారాన్ని నాలుగురెట్లను చెల్లించాలని చెప్పారు. గ్రామసభలను నిర్వహించి రైతులు, రైతు కూలీలు, ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినకుండా భూసేకరణ జరపాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ చట్టాన్ని సీఎం చంద్రబాబు సవరించి, పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఆమ్ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడారు. భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారని, దీని వల్ల దేశానికే తలమానికంగా ఉన్న ఉలవపాడు పరిసర ప్రాంతాల మామిడితోటలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ ప్రాజెక్టు కోసం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని గ్రామాల రైతులు జేఏసీగా ఏర్పడి తమ అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, కొద్ది మంది రాజకీయ నేతల మాటలు నమ్మి భూములను కోల్పోవద్దని సూచించారు. చెప్పేదొకటి.. చేసేదొకటి నాడు అమరావతిలో ఏకపక్షంగా భూములను సేకరిస్తుంటే అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని, ఆపై విస్తృత స్థాయిలో చర్చించి సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్ పేర్కొన్నారు. రామాయపట్నంలో అమాయక ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా భూసేకరణ జరుగుతోందని ఆరోపించారు. పచ్చని చెట్లు పెంచండి అంటూ ఉపన్యాసాలిస్తూ.. మరోవైపు ప్రసిద్ధి గాంచిన మామిడితోటలను సీఎం నరికేయిస్తున్నారని విమర్శించారు. సీపీఐ మహిళా నేత అరుణ, రైతు నేతలు చుండూరి రంగారావు, సామాజిక ఉద్యమకారుడు వెంకటేశ్వర్లు, సీపీఐ నేతలు వీరారెడ్డి, పాలేటి కోటేశ్వరరావు, సురేష్ పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనపై ప్రజల చీదరింపు
● వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నాగార్జున నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా.. హామీల అమల్లో విఫలమైన సీఎం చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున పేర్కొన్నారు. రామ్జీనగర్లోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డితో కలిసి విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఓటేసి గెలిపించిన ప్రజలను టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హామీ నీటమూటగా మిగిలిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసెత్తడంలేదని ఆరోపించారు. వలంటీర్లు, ఎండీయూ వాహనాల సిబ్బందిని తొలగించి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ ఎక్కువయ్యాయని చెప్పారు. మహిళల భద్రతపై ఎన్నికలకు ముందు ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రస్తుతం ఇవేవీ కనిపించడంలేదానని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ బూటకపు హామీలు, అకృత్యాలను ప్రశ్నించే తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నిరసన ర్యాలీ నేడు కూటమి ఏడాది దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని శుక్రవారం చేపట్టనున్నామని వెల్లడించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీని ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించి, కలె క్టర్కు వినతిపత్రాన్ని అందజేయనున్నామని చెప్పారు. యువత, విద్యార్థులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రిత్రెడ్డి మాట్లాడారు. యువగళంలో ఇచ్చిన హామీలను లోకేశ్ విస్మరించి, యువతను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఫీజులను చెల్లించలేక.. తమ సర్టిఫికెట్లను కళాశాల నుంచి తెచ్చుకోలేక విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తల్లికి వందనంపై బంతాట
తల్లికి వందనంలో భాగంగా విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యాయనే ప్రచారంతో పాఠశాలలకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులను ఆరాతీయగా, సచివాలయాల్లో అడగాలని సెలవిచ్చారు. అక్కడికెళ్లినా నిరాశే ఎదురైంది. తమకెలాంటి సమాచారం లేదని వారు చెప్పడంతో అటూ.. ఇటూ ప్రదక్షిణలు చేశారు. దీనిపై జీఓను రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం జారీ చేసినా, అందులో దరఖాస్తు నమోదు అనే అంశంపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పథకంలో భాగంగా ప్రతి బిడ్డకూ రూ.15 వేలను అందజేస్తామని చెప్పినా, ప్రస్తుతం రూ.13 వేలనే ఇచ్చి, పాఠశాలల నిర్వహణకు మిగిలిన మొత్తాన్ని మినహాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. -
అగచాట్ల ఆహ్వానం
నాణ్యత లేక.. ఇళ్ల నుంచే ఆహారం విద్యార్థుల కేరింతలు.. చూడముచ్చటైన పాఠశాలలు.. పండగ వాతావరణం.. ఇదంతా గతం. నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో సర్కారీ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. నాడు – నేడుతో ఆయన చేపట్టిన చర్యలతో సరస్వతీ నిలయాలు కళకళలాడి.. అందులో చేరే విద్యార్థుల సంఖ్యా ఎక్కువగా ఉండేది. అమ్మఒడి పేరిట తల్లుల ఖాతాల్లో నగదును ఠంచనుగా జమచేసేవారు. విద్యాసంవత్సర ప్రారంభ రోజునే స్టూడెంట్స్కు అన్నీ సమకూరేవి. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో అకడమిక్ ఇయర్ ప్రారంభ రోజున విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. అధ్వానంగా మారిన టాయ్లెట్లు.. తరగతి గదులను చూసి బేజారెత్తడం వారి వంతైంది.జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తూతూమంత్రంగా అమలు చేశారు. వెజిటబుల్ రైస్, బంగాళదుంపు కూర, ఉడికించిన గుడ్డును అందజేశారు. జిల్లావ్యాప్తంగా 52,899 మందికి గానూ 51,696 మందికి దీన్ని అందజేశామని విద్యాశాఖ అధికారులు లెక్కలు చెప్తున్నారు. అయితే చాలా చోట్ల భోజనం చేయకపోయినా, జరిగిందనే రీతిలో లెక్కలు చూపారని సమాచారం. మరోవైపు నాణ్యత, రుచి లేకపోవడంతో చాలా మంది తమ ఇళ్ల నుంచే క్యారేజీలను తెచ్చుకున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. స్టూడెంట్స్ కిట్లు.. అరకొరగా.. -
విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి
కోవూరు: అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై.. అందులో ప్రయాణిస్తున్న వారు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లోని మెడికల్ కళాశాల మెస్పై కూలి మెడికోలూ మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.హృదయవిదారకంఆత్మకూరు రూరల్: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం హృదయ విదారకరమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది, కూలిన చోట 20 మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి మనస్సును కలిచి వేస్తోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతినెల్లూరు (స్టోన్హౌస్పేట): అహ్మదాబాద్లో విమానం కూలి ప్రయాణికులు మృతి చెందడం తనకు కలిచివేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనలో స్థానిక మెడికల్ కళాశాల విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.‘పది’ సప్లిమెంటరీలోనూ అంతే..● 13వ స్థానంలో జిల్లా● 77.55 శాతం ఉత్తీర్ణతనెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ జిల్లా వెనుకంజలోనే నిలిచింది. 13వ స్థానాన్ని దక్కించుకొని.. 77.55 శాతం ఉత్తీర్ణతకే పరిమితమైంది. ఫలితాలను గురువారం విడుదల చేశారు. గత నెల 19 నుంచి 28 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4690 మంది హాజరుకాగా, 3637 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 74.97.. బాలికలు 81.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.2.25 లక్షల ఎకరాలకు సాగునీరుసంగం: జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాలకు ఎడగారులో సాగునీటిని అందించనున్నామని ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ తెలిపారు. సంగం బ్యారేజీ వద్ద నీటిమట్టాన్ని గురువారం పరిశీలించిన అనంతరం అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సాగునీరు వృథా కాకుండా తనిఖీలను చేపడుతున్నామని చెప్పారు. పెన్నాకు సోమశిల నుంచి పది టీఎంసీలను విడుదల చేశామని వివరించారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2023కు సంబంధించిన జీతాలను చెల్లించనున్నామని తెలిపారు. డీఈ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.సిటీ ప్లానర్ బాధ్యతల స్వీకరణనెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంలో సిటీ ప్లానర్గా హిమబిందు బాధ్యతలను గురువారం స్వీకరించారు. ఏసీపీ వేణుతో పాటు సూపరింటెండెంట్ మునిరత్నం తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలను తెలియజేశారు. -
సారీ తప్పయింది..
ఉదయగిరి: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో 12 ఏళ్ల బాలికతో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ ప్రశాంత్ అసభ్యకరంగా ప్రవర్తించారనే ఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఉదంతంలో వైద్యుడిపై దౌర్జన్యం చేసి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తాజాగా దీనికి సంబంధించి స్థానిక సీహెచ్సీలో బాలిక తల్లిదండ్రులు, బంధువులు, వైద్యుడితో కలిసి విలేకరుల సమావేశాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా, బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించలేదనే విషయం స్పష్టమవడంతో వైద్యుడికి క్షమాపణలను తెలియజేశారు. బాలిక చెప్పిన మాటలకు పొరబడి తాము దురుసుగా ప్రవర్తించామని, దీన్ని మనస్సులో పెట్టుకోకుండా విధులకు హాజరుకావాలని కోరారు. ఘటన సమయంలో కొంతమంది వ్యక్తులు జోక్యం చేసుకొని దురుసుగా ప్రవర్తించారని వారు తెలిపారు. విచారణకు కమిటీ ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చేందుకు గానూ ఓ కమిటీని జిల్లా వైద్యాధికారి ఏర్పాటు చేశారు. రెండ్రోజుల్లో విచారణ జరిపి నివేదికను సమర్పించనున్నారు. కాగా ఈ ఉదంతంపై ఎస్సై ఇంద్రసేనారెడ్డిని సంప్రదించగా, విచారణ కొనసాగుతోందని బదులిచ్చారు. అసభ్య ప్రవర్తనలో వైద్యుడికి క్లీన్చిట్ తామే పొరపడ్డామని అంగీకరించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు -
ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
ఉదయగిరి: మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో అడవి పేరంటాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండలాగుడు పోటీలను చివరి రోజు గురువారం నిర్వహించారు. ఇందులో కడప జిల్లాకు చెందిన ఎడ్లు సత్తా చాటాయి. బద్వేలు మండలం కుమ్మరికుంటకు చెందిన వినుకొండ రసూల్ ఎడ్లు నిర్దేశించిన సమయంలో 1862 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో.. అదే జిల్లా రొక్కువారిపల్లెకు చెందిన ఓబుల్రెడ్డి ఎడ్లు 1515.5 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి వరుసగా రూ.35 వేలు, రూ.25 వేల నగదు బహుమతిని ఆలయ కమిటీ అందజేసింది. బందోబస్తును ఎస్సైలు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు ఏర్పాటు చేశారు. -
చిన్న కాంట్రాక్టర్లపై కక్షెందుకు..?
నెల్లూరు (పొగతోట): పెద్ద కాంట్రాక్టర్లకు రూ.కోట్లల్లో బిల్లులను సకాలంలో ఇస్తున్నా, చిన్న కాంట్రాక్టర్లకు రూ.లక్ష బిల్లులను చెల్లించేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని, ఫలితంగా వారు నష్టపోతున్నారని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. త్వరితగతిన చెల్లించేలా చూడాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. వినతులు స్వీకరిస్తున్నా, పరిష్కారమేదీ..? సమస్యల పరిష్కారానికి అధికారులు వినతులను స్వీకరిస్తున్నా, పరిష్కారం చూపడంలేదన్నారు. జెడ్పీటీసీలు సమర్పించిన వినతులకే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఎంపీ నిధులను ఏడాది క్రితం మంజూరు చేయించినా, పనులను నేటికీ ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేవారు. నెల్లూరు రూరల్ మండలం సౌత్మోపూరులో పాఠశాల అభివృద్ధికి జెడ్పీ ద్వారా నిధులను కేటాయించామని, శంకుస్థాపన సమయంలో ప్రొటోకాల్ను పాటించలేదని చెప్పారు. దీనికి సంబంధించి పీఆర్ ఏఈపై చర్యలు చేపట్టాలని కలెక్టర్కు మూడు నెలల క్రితం విన్నవించినా, నేటికీ ఎలాంటి సంజాయిషీ లేదన్నారు. చర్యలకు డిమాండ్ ఆత్మకూరులో బ్రిటిష్ కాలం నాటి భవనాన్ని నేలకూల్చి రంగూన్ టేకును మాయం చేశారని, మంత్రికి సమాచారమివ్వకుండానే ఎలా కూలుస్తారని.. దీనికి అనుమతులను ఎవరిచ్చారని ప్రశ్నించారు. కలప సగానికిపైగా మాయమైందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కూలీలకు పనులు కల్పించాలి ఉపాధి పనులకు సంబంధించిన పేమెంట్లను సకాలంలో చెల్లించి కూలీలకు వర్కులను కల్పించాలని సూచించారు. నూతన గృహాలను ప్రస్తుతం మంజూరు చేయడంలేదని, దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్తే లాగిన్లు పనిచేయడంలేదన్నారు. సమావేశాలకు అధికారులు సమయపాలన పాటించడంలేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించాలని కోరారు. దయనీయంగా రైతుల పరిస్థితి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పుట్టి ధాన్యం రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయించడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారని, అయితే ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో పంటల సాగుకు రైతులు పూర్తిస్థాయిలో ముందుకు రావడం లేదని వ్యవసాయాధికారులు నివేదికలివ్వడంపై చైర్పర్సన్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఖర్చు చేసుకోకుండా.. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు పొందాలని కోరారు. నిధులను మంజూరు చేసినా అంగన్వాడీ భవనాలను నిర్మించలేదని, జిల్లాలో ఇలా అద్దె భవనాల్లో ఎన్ని కేంద్రాలను నిర్వహిస్తున్నారు.. ఎంత ఖర్చు చేస్తున్నారు.. సొంత బిల్డింగులను నిర్మించుకోరానని ఐసీడీఎస్ అధికారులను ప్రఽశ్నించారు. గ్రామాల్లో జెడ్పీటీసీలు పర్యటించి, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్, ఇతర సంక్షేమ శాఖల ద్వారా అవసరమైన వారికే పథకాలను మంజూరు చేయించుకుంటూ, అర్హులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. బిల్లులు రాక తీవ్రంగా నష్టపోతున్నారు పెద్ద వారికేమో సకాలంలో రూ.కోట్లల్లో చెల్లింపు ప్రొటోకాల్ పాటించని ఏఈపై చర్యలేవీ..? జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
బాలికతో వైద్యుడి అసభ్య ప్రవర్తన?
ఉదయగిరి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ పన్నెండేళ్ల బాలికతో వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆమె తల్లి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. ఉదయగిరికి చెందిన ఓ మహిళ తన పన్నెండేళ్ల కుమార్తెకు చెవి నొప్పిగా ఉందని వైద్యం చేయించేందుకు స్థానిక సీహెచ్సీలోని వైద్యుడు ప్రశాంత్ దగ్గరకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో వైద్యుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. బాలిక తరఫు బంధువులు కూడా వైద్యశాల వద్దకు చేరుకుని వైద్యుడిపై దాడికి యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పి వైద్యుడు ప్రశాంత్ను స్టేషన్కు తీసుకెళ్లారు.ఆరోపణలకు విరుద్ధంగా సీసీ కెమెరా దృశ్యాలు అయితే ఈ వ్యవహారంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొన్నేళ్ల నుంచి వైద్యులు, సిబ్బంది మధ్య విభేదాలు ఉన్నాయి. ఇదే వైద్యశాలలో పనిచేసే ఓ సీనియర్ వైద్యుడు అక్కడ ఉన్న కొంత మంది సిబ్బందితో చేతులు కలిపి డీడీఓ బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడు ప్రశాంత్ను ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినప్పుడు బాలిక బంధువులు చేసే ఆరోపణలకు, సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలకు పొంతన కనిపించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిని సంప్రదించగా బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. -
అవకాశాలతో యువత ఆర్థికంగా ఎదగాలి
నెల్లూరు రూరల్: ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉన్నటు వంటి అపార అవకాశాలను వినియోగించుకుని గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి శ్రీనివాసులు కోరారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డీఆర్డీఏ, మెప్మా క్షేత్రస్థాయి సిబ్బందికి ఆహార శుద్ధి కార్యకలాపాలపై సాంకేతిక శిక్షణ అందించారు. ఆయన మాట్లాడుతూ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ విధానంలో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా, ఆహార శుద్ధి రంగంలో ఉన్నటు వంటి అపార అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను ఫార్మలైజ్ చేయడం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం మౌలిక సదుపాయాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, నైపుణ్యాభివృద్ధి అందించడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చన్నారు. ఈ పథకంలో 30 శాతం సబ్సిడీ అందిస్తున్నారని వివరించారు. వృద్ధి కోసం ఆర్థిక సహాయం అందించడం, గ్రూపులుగా ఏర్పడిన ఉత్పత్తిదారులకు, స్వయం సహాయ సంఘాలకు మౌలిక వసతులు కల్పించడం, వాటికి బ్రాండింగ్, మార్కెటింగ్ మద్దతు కల్పించడమే కాకుండా వ్యాపార నైపుణ్యాలు, ఫుడ్ హ్యాండ్లింగ్ శిక్షణ ఇచ్చి కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లకు మద్దతు అందిస్తారన్నారు. -
అసంపూర్తిగా నాడు–నేడు పనులు
రెండో విడత నాడు–నేడులో భాగంగా జిల్లాలో 1,356 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటితోపాటు అంగన్వాడీలు, డైట్, బీఈడీ కళాశాలను కూడా ఎంపిక చేశారు. వీటిల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.466.94 కోట్లు నిధులు మంజూరు చేశారు. రూ.190.45 కోట్లు నిదులు విడుదల చేశారు. ఈ నిధులతో కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలను పూర్తి చేయగా కొన్నింట్లో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ పనులకు నిధులు ఉన్నప్పటికీ ఇంకా 554 టాయిలెట్స్కు తలుపులు బిగించలేదు. 250 కిచెన్ షెడ్లు, 485 తరగతి గదులు, 319 టాయిలెట్స్, 220 ఇంగ్లిష్ ల్యాబ్లు, పనిచేయని మెజార్టీ ఆర్వో ప్లాంట్లు తదితర వాటిల్లో అసంపూర్తిగా పనులు మిగిలిపోయాయి. కనీసం మరమ్మతులకు గురైన వాటిని కూడా బాగు చేయని పరిస్దితి ఉంది. పాఠశాలలను పునః ప్రారంభిస్తే విద్యార్థులకు చెట్లు కింద తరగతి గదులు నిర్వహించాల్సి ఉంటుంది. అరకొరగా స్టూడెంట్స్ కిట్స్ పాఠశాలల పునః ప్రారంభం తర్వాత విద్యార్థులకు అందించాల్సిన స్టూడెంట్స్ కిట్స్ జిల్లాకు అరకొరగానే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో తొలిరోజే విద్యార్థులకు విద్యాకానుక అందజేసిన పరిస్థితి ఉంది. నేటికి యూనిఫాం, బూట్లు, సాక్స్లు ఒకటి కూడా జిల్లాకు రాని పరిస్థితి ఉంది. కొన్ని అరకొరగానే వచ్చాయి. పాఠశాలల పునః ప్రారంభం రోజును విద్యార్థులకు పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ కిట్స్ను అందజేసే పరిస్థితి లేదు. -
పొట్టకూటి కోసం వచ్చి..
● మినీలారీ, మిల్లర్ మధ్య నలిగిన ప్రాణంసీతారామపురం: పొట్టకూటి కోసం వచ్చిన బండారు సురేష్ (27) అనే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలొదిలిన ఘటన సీతారామపురం బస్టాండ్ సెంటర్లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బస్టాండ్ సెంటర్లో గల కేరళ ఇంగ్లిష్ మీడియం స్కూల్ స్లాబ్ పనుల నిమిత్తం బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం గ్రామ వడ్డెరాజు నగర్ ప్రాంతం నుంచి కూలీల బృందం మినీలారీలో కాంక్రీట్ మిల్లర్తో సహా చేరుకుంది. కూలీలు కిందకు దిగి కాంక్రీట్ మిల్లర్ను పాఠశాల ఆవరణలోకి ర్యాంప్ పైనుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సాధ్యపడలేదు. సురేష్ కర్ర సాయంతో మినీలారీ చేత మిల్లర్ను నెట్టించే క్రమంలో కర్ర కాస్తా విరిగిపోయింది. దీంతో మిల్లర్ను పైకి లాగుతున్న కూలీలు ఒక్కసారిగా దాన్ని వదిలేయడంతో వేగంగా వెనక్కు వచ్చింది. ఈ క్రమంలో మిల్లర్, మినీలారీ మధ్య సురేష్ నలిగిపోయాడు. సహచర కూలీలు అతి కష్టంపై క్షతగాత్రుడిని బయటకు తీసి 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించే లోపు మార్గమధ్యలో కురప్రల్లి వద్దకు వచ్చేసరికి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరికి తరలించారు. -
కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
నెల్లూరు (లీగల్): నెల్లూరు ఐదో అద నపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ)కోర్టులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. అయితే పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ తమ వాదనలు వినిపించడనికి వాయిదా కోరారు. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు ఇన్చార్జి కోర్టు న్యాయమూర్తి సోమశేఖర్ కేసు విచారణ గురువారానికి వాయిదా వేశారుఐఅండ్పీఆర్ డీడీ బదిలీనెల్లూరు (అర్బన్): జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావును ప్రభుత్వం విశాఖపట్నంకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏప్రిల్ 2023లో విజయవాడ నుంచి నెల్లూరుకు బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. 2 ఏళ్ల 2 నెలల కాలం ఇక్కడ వివాదారహితుడిగా పనిచేశారు. సదారావు అధికారులు, జర్నలిస్టులతో స్నేహ పూర్వక సంబంధాలతో కలిసిపోయారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.పంచాయతీ పూర్వ కార్యదర్శి సస్పెన్షన్● డక్కిలి ఈఓపీఆర్డీ ప్రస్తుతం విధులుపొదలకూరు : పొదలకూరు మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఎస్కే అల్లాభక్షును పంచాయతీరాజ్శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. అల్లాభక్షు 2023 వరకు ఇక్కడ పనిచేసి ఉద్యోన్నతిపై తిరుపతి జిల్లా డక్కిలి ఈఓపీఆర్డీగా బదిలీపై వెళ్లారు. ఇక్కడ పనిచేసిన సమయంలో అక్రమ లే –అవుట్లకు అనుమతులతోపాటు భవనాల నిర్మాణానికి అక్రమంగా పంచాయతీ అనుమతులిచ్చారని ఆరోపణలపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలునెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్రావు తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశాలు జరుగుతాయన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.విద్యుత్ క్రీడాకారులఎంపిక రేపునెల్లూరు (వీఆర్సీ సెంటర్): ఏపీ ట్రాన్స్కో ఇంటర్ సర్కిల్ బాల్బ్యాడ్మింటన్, బ్రిడ్జ్ పోటీలు విశాఖపట్నంలోని గాజువాకలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామివేలు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఏపీఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉగ్యోగులు, జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 ఉద్యోగులు అర్హులని తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించే సెలక్షన్స్లో పాల్గొనాలని, ఇతర వివరాలకు 90308 02038, 98660 70775 నంబర్లలో సంప్రదించాలని కోరారు.11 బస్తాల రేషన్ బియ్యం పట్టివేతజలదంకి: కూటమి ప్రభుత్వం డీలర్ల వ్యవస్థను ప్రకటించిన పదిరోజులకే అక్రమంగా రేషన్ బియ్యం దందా బయటపడింది. చామదలకు చెందిన డీలర్లు వెంకటసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి దుకాణాల నుంచి మంగళవారం అర్ధరాత్రి రేషన్ బస్తాలను ఆటోలో తరలిస్తుండగా జలదంకి పోలీసులు ఆటోను పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఆటోలో 11 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో అక్రమంగా తరలిస్తున్న మరో లారీని అక్రమ దందా నిర్వాహకులు వేరే రూట్లోకి మళ్లించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ లారీలో భారీగా అక్రమ రేషన్ బియ్యం తరలివెళ్లినట్లు సమాచారం. ఎస్సై లతీఫున్నీసా మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి ఆటోను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. ఆటోడ్రైవర్ సత్తిబాబుతో పాటు ఇద్దరు డీలర్లపై కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించామన్నారు. రెవెన్యూ అధికారులు బుధవారం చామదలలోని రేషన్ దుకాణాల వద్ద తనిఖీలు చేపట్టి 6ఏ కేసు నమోదు చేశారు. అనంతరం అక్రమ రేషన్ బియ్యాన్ని మద్దూరుపాడులోని స్టాక్ పాయింట్కు తరలించారు. -
బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి తోటపల్లిగూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలో చిన్నచెరుకూరు సమీపంలో జరిగింది. ఎస్సై వీరేంద్రబాబు కథ నం మేరకు.. ఇందుకూరుపేట గ్రామానికి చెందిన వెంపులూరు సతీష్ (30) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను చిన్నపాటి కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పనుల విషయమై మంగళవారం రాత్రి ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలో కూలీలతో మాట్లాడాడు. బుధవారం వేకువజామున స్వగ్రామమైన ఇందుకూరుపేటకు మోటార్బైక్పై బయలుదేరాడు. కాకుపల్లి సెంటర్ – చిన్నచెరుకూరు మార్గమధ్యలో కల్వర్టును బైక్ ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న పంటకాలువలో సతీష్ పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీయించి శవపరీక్ష నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. వివాహిత బలవన్మరణంనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కల్లూరుపల్లిలో ఆర్డీటీ కాలనీకి చెందిన బాషా, మరియమ్మల కుమార్తె రజియ (23)కు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలానికి భర్త నుంచి విడిపోయి తల్లి వద్ద ఉంటోంది. రజియకు కుమారుడు ఉన్నాడు. కాగా తల్లి తిట్టిందని రజియ మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్కు తరలించారు. అప్పటికే రజియ మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
అల్లూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన అల్లూరు పాత మటన్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరు దళితవాడకు చెందిన గంటా సురేష్ (26) సెంట్రింగ్ పను లకు వెళ్తుంటాడు. అతను తన అవ్వ వద్ద ఉంటున్నాడు. మంగళవారం రాత్రి పాత మటన్ మార్కెట్ ప్రాంతంలో తన ఇద్దరి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. బుధవారం ఉదయం చూసే సరికి చనిపోయి రక్తపుమడుగులో పడి ఉండగా స్థానికులు అల్లూరు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘట నా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. మద్యం మత్తులో పడి మృతిచెందాడా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని ఎస్సై కిశోర్బాబు తెలిపారు. సురేష్ను హత్య చేసి ఉంటారని అను మానం ఉందని అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్రాధ్యక్షుడు ఎల్లు సాల్మన్రాజ్ తెలియజేశారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. గుంతల్ని తప్పించబోయి..● కారు బోల్తా కలువాయి(సైదాపురం): రోడ్డుపై ఉన్న గుంతల్ని తప్పించబోయి కారు బోల్తా పడిన ఘటన కలువాయి మండలంలోని కోటూరుపల్లి జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెంచలకోనకు చెందిన శేషు కుటుంబ సభ్యులతో కనిగిరి నుంచి కలువాయి వైపు వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న గుంతల్ని తప్పించబోయి కారు అదుపు తప్పిందని క్షతగాత్రులు తెలియజేశారు. -
పసుపు ధరలు పతనం
ఉదయగిరి రూరల్: ఆరుగాలం కష్టపడి, అప్పులు తెచ్చి రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండించిన పసుపు రైతుల కంట కన్నీరు కారుతోంది. పంటకు ఆశించిన మేర దిగుబడి రాక, మద్దతు ధర లేక ఎలా బతకాలి బాబూ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలం కొండకింద పల్లెల్లో సుమారు 50 ఏళ్ల నుంచి ఆయా గ్రామాల్లో అత్యధికంగా రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. వరికుంటపాడు, వింజమూరు, సీతారామపురం, ఇందుకూరుపేట, అనంతసాగరం తదితర మండలాల్లో కూడా కొంత మేర పసుపు పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 500 ఎకరాలకుపైగా పసుపు పంట సాగు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పంట తొమ్మిది నెలలకు చేతికొస్తుంది. గతంలో మార్కెట్లో పసుపు ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది ఎక్కువ మంది పసుపు సాగు వైపు దృష్టి సారించారు. ఎకరా పసుపు పంట సాగుకు అన్ని ఖర్చులు కలుపుకుని సూమారు రూ.1.50 నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతోంది తగ్గిన దిగుబడులు.. దిగజారిన ధరలు సాధారణంగా ఎకరాకు పసుపు పంట 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు కారణంగా తెగుళ్ల ప్రభావం అధికంగా ఉండడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు వాపోతున్నారు. భూసారాన్ని బట్టి కొంత మంది రైతులకు 40 క్వింటాళ్ల లోపు దిగుబడులు రాగా, అత్యధిక మంది రైతులకు సగటున ఎకరాకు 30 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది పసుపు ధరలు రికార్డు స్థాయిలో క్వింటా రూ.15 వేల నుంచి రూ. 16 వేలు పలికింది. ఈ ఏడాది క్వింటా రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పడిపోయింది. అంటే దాదాపు సగానికి సగం ధరలు పతనం కావడంతో, దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులకు కనీసం పెట్టుబడి కాదు కాదా.. కూలీ పాటు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేని పసుపు రైతాంగం కన్నీటి పర్యంతం అవుతోంది. ఏడాదికేడాదికి పెరుగుతున్న ఖర్చులు పసుపు సాగుకు ఏడాదికేడాదికి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరాకు దుక్కి దున్నడం దగ్గర నుంచి కోత వరకు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కూలీల ఖర్చులు పెరిగాయి. పసుపు పంట సాగుకు పలువురు రైతులు పెట్టుబడికి అప్పుగా తెచ్చి పెట్టి సాగు చేస్తున్నారు. పంట సాగు సమయంలో ధరలు ఓ మోస్తరుగా ఉన్నా.. పంట చేతికొచ్చే సమయానికి పూర్తిగా తగ్గిపోతుండడంతో రైతులు పెట్టుబడి రాక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఎరువులు, విత్తనపు పసుపు, పురుగు మందులు ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రస్తుతం ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. విస్మరించిన ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో ప్రత్యేక బోర్డులు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. పక్క రాష్ట్రం తెలంగాణలో సైతం పసుపు బోర్డును ఏర్పాటు చేస్తే.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు. మార్కెట్లో వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కనీసం స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని రైతులు వాపోతున్నారు. ఇక్కడ పండించిన పంటను దుగ్గిరాల యార్డుకు తరలించి విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అదే స్థానికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే.. రవాణా ఖర్చులైనా మిగులుతాయని రైతాంగం డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వ విఫల పాలనలో తాజాగా పసుపు రైతులు బాధితులయ్యారు. కేంద్రం ప్రత్యేకించి పసుపు కొనుగోలు బోర్డు ఏర్పాటు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. మిర్చి, ధాన్యం, పత్తి, పొగాకు ధరలు గతేడాదితో పోల్చితే సగానికి సగం పతనం కావడంతో ఇప్పటికే రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ పంటకై నా మార్కెట్లో ధరలు పతనమైతే వెంటనే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించడంతో తిరిగి ధరలు పుంజుకుని గిట్టుబాటు ధరలు లభించిన పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని పంటలు సాగు చేసే రైతులను గాలికి వదిలేసింది. గతేడాది క్వింటా రూ.15 వేల నుంచి రూ.16 వేలు ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.9 వేలే ఎకరాకు రూ.2 లక్షల పెట్టుబడి దిగుబడులకు వాతావరణ ప్రతికూలతలు 45 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్లకు తగ్గిన దిగుబడి గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి పసుపు రైతులు కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. గిట్టుబాటు, మద్దతు ధర లేక రైతులు అల్లాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. పండించిన పంటను సమీపంలో మార్కెట్ సౌకర్యం లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో పసుపు పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. మార్కెట్ సౌకర్యం కూడా కల్పించాలి. ప్రస్తుతం పసుపు ధరలు తగ్గడంతో పెట్టుబడి వచ్చే పరిస్థితి కానరావడం లేదు. పంటను కళ్లాల్లోనే అమ్ముకోవాల్సి వస్తోంది. – కాకు వెంకటయ్య, రైతు సంఘం నాయకుడు, ఉదయగిరి -
మీడియాపై దాడి హేయమైన చర్య
నెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పత్రిక రంగంపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని, మరి ముఖ్యంగా సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం 44వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో ఏనాడూ ఇలాంటి దారుణ ఘటనలు జరగలేదని, పత్రికా రంగాన్ని స్వేచ్ఛగా బతికేలా చేశారన్నారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇద్దరూ సాక్షి మీడియాపై తమ అక్కసు వెళ్లగక్కడం సరైన పద్ధతి కాదన్నారు. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయగలుగుతారన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉందని, యువత అందరూ జగన్మోహన్రెడ్డి అండగా నిలుస్తున్నారని అందుకు ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం యువతను మోసం చేయడమేనన్నారు. -
తొలుత మోడల్ ప్రైమరీ స్కూల్స్కు ప్రాధాన్యత
తొలుత మోడల్ ప్రైమరీ స్కూల్స్కు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. ఒక్కో స్కూల్లో 5 గదులు, ఐదుగురు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఒక వేళ ఆ పాఠశాలలో 5 గదులు లేకుంటే వరండాను పార్టీషన్ చేసి తరగదిగా నిర్వహిస్తాం. లేకుంటే 500 మీటర్ల లోపు ఉన్న పాఠశాల ఉంటే అక్కడ కొన్ని తరగతులును నిర్వహిస్తాం. వీటితో హైస్కూల్స్గా అప్గ్రేడ్ అయిన యూపీ పాఠశాలలను తీసుకోనున్నాం. అసంపూర్తిగా నిలిచిన నాడు–నేడు పనులు, టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాలను గూగుల్ ఫాంలో అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. – వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష షెడ్యూల్ ప్రకారం అయితే బదిలీలు పూర్తయ్యేవి తొలుత ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే పాఠశాలల పునః ప్రాంరభం నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేసేవారు. ఉపాధ్యాయులు పట్టుబట్టి మాన్యువల్ కౌన్సెలింగ్ కావాలనడంతో ఎస్జీటీల బదిలీలు ఆలస్యమయ్యాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తాం. – బాలాజీరావు, డీఈఓ ● -
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం
● పూర్తి కాని ఉపాధ్యాయ బదిలీలు ● అసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్స్ నిర్మాణాలు ● పూర్తిస్థాయిలో రాని స్టూడెంట్స్ కిట్స్ ● యూనిఫాం, బూట్లు, సాక్స్లు పెండింగ్ ● 9 వేలకు పైగా బ్యాగుల కొరత ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు ● ఉపాధ్యాయుల దృష్టంతా బదిలీల పైనే ● పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు నెల్లూరు (టౌన్): వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులు, అసంపూర్తి భవనాలు, పని చేయని మినరల్ వాటర్ ప్లాంట్లు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తవుతోంది. పాఠశాలలకు దాదాపు 50 రోజులు వేసవి సెలవులిచ్చినా.. ఆయా పాఠశాలల్లో పెండింగ్లను పూర్తి చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. మరో వైపు జిల్లాకు పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ కిట్స్ రాలేదు. ఇంకో వైపు టీచర్ల బదిలీలు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ ఎప్పటికో పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాఠశాలల పునః ప్రారంభం రోజే విద్యార్థులందరికీ విద్యాకానుకను అందించేవారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి సిద్ధం చేసిన పరిస్థితి ఉండేది. -
పెంచలకోనలో శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం
రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీరసింహస్వామి దేవస్థానంలో బుధవారం జ్యేష్టాభిషేక వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ట మాసంలో జ్యేష్ట నక్షత్రం, పౌర్ణమి, ఒకేరోజు వచ్చిన సందర్భంగా వైష్ణవ దేవస్థానాల్లో హోమం, అభిషేకాలు, నిర్వహించడం ఆచారమని ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి వెల్లడించారు. 5 గంటలకు సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవ, నరసింహ హోమం నిర్వహించారు. 10 గంటలకు శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో స్నపనపీఠంపై నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవిల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చారు. వాటి ముందు 81 కలశాలను ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ కలశాల్లోని జలాలతో స్వామి, అమ్మవార్లకు వేదపండితులు స్నపన తిరుమంజనం జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. -
ఆత్మకూరులో కార్డన్ సెర్చ్
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు పట్టణంలోని తిప్ప ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 300 కుటుంబాల్లో తనిఖీలు చేసి సరైన పత్రాల్లేని 25 మోటార్బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది స్థానికేతరులను గుర్తించి వేలిముద్రలు సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఏరివేత లక్ష్యంగా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు సెర్చ్ నిర్వహించామన్నారు. పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, బంగారు, వెండి వంటి చోరీ సొత్తు, రికార్డుల్లేని వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడమే సెర్చ్ ముఖ్య ఉద్దేశమన్నారు. సీఐలు గంగాధర్, వేమారెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని 8 మంది ఎస్సైలు, 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలంటూ..
● సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు సక్రమంగా అందించాలని కోరుతూ సీపీఎం రూరల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్, సీపీఎం సీనియర్ నాయకుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా పెద్దాస్పత్రికి ప్రభుత్వం న్యూరో, గుండె, కేన్సర్, యూరాలజీ లాంటి పలు సూపర్ స్పెషాలిటీ విభాగాలను మంజూరు చేయడమే కాకుండా డాక్టర్లను నియమించిందన్నారు. అయితే ఆయా విభాగాల్లో డాక్టర్లు సక్రమంగా ఉండటం లేదని ఆరోపించారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే శుద్ధి చేసిన నీటిని రోగులకు అందించాలని కోరారు. డయాలసిస్ రోగులకు ఆస్పత్రిలోనే మందులు ఉచితంగా అందించాలన్నారు. కొన్ని రకాల మందులను బయటకు డాక్టర్లు రాసివ్వడం సరికాదన్నారు. పరిశుభ్రతను మెరుగుపరచాలని కోరారు. వీటిపై తక్షణమే అధికారులు స్పందించి మెరుగైన వసతులు, సేవలు రోగులకు అందించాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కొండా ప్రసాద్, నాయకులు అరిగెల రమమ్మ, షాహీనా బేగం, అజీజ్, సుధాకర్, షమీం, పెంచల నరసయ్య, ఒంగోలు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై అభ్యంతరం
కొండాపురం: మండలంలోని మర్రిగుంటలో ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై సర్పంచ్ దార్ల గోపీ, ఉపసర్పంచ్ జెజవాడ విఘ్నేష్, మరికొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీడీఓ ఎస్.ఆదినారాయణను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ గ్రామంలో 220 జాబ్కార్డులున్నాయని తెలిపారు. చిన్న గ్రామమైన మర్రిగుంటలో ఫీల్ట్ అసిస్టెంట్గా అంకబాబు అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు అవకతవకలు జరగలేదన్నారు. సోషల్ ఆడిట్లో కూడా రికవరీ లేదన్నారు. అయితే అధికార పార్టీ నాయకుల మాటలు విని గ్రామానికి చెందిన మరో వ్యక్తికి రెండో లాగిన్ ఇచ్చి పనులు చేయిస్తున్నారని వాపోయారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫీల్ట్ అసిస్టెంట్ను తొలగించాలని కోరారు. రెండో వ్యక్తికి లాగిన్ ఇవ్వడంపై ప్రభుత్వ జీఓ ఉంటే ఇవ్వాల్సిందిగా ఎంపీడీఓను అడిగారు. తనకు లాగిన్ ఇచ్చే అధికారం ఉందని, జీఓ కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోవాలని ఆయన అన్నారు. మొదటి వ్యక్తి సరిగా విధులు నిర్వర్తించకపోవడంతోనే రెండో వ్యక్తికి లాగిన్ ఇచ్చి పనిచేయిస్తున్నట్లు సమాధానమిచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఎంపీడీఓ అన్నారు. -
కరోనా కేసు మరొకటి నమోదు
● వెంకటగిరి యువకుడికి పాజిటివ్ నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ పెద్దాస్పత్రి (సర్వజన ఆస్పత్రి)లో మంగళవారం కరోనా కేసు మరొకటి నిర్ధారణ అయింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతూ పెద్దాస్పత్రికి వచ్చాడు. ఇక్కడ అనుమానంతో కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ఆ యువకుడికి స్వల్ప లక్షణాలుండటంతో హోం ఐసోలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించి ఇంటికి పంపారు. ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో చేసిన పరీక్షల్లో 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. అందులో ఐదుగురు నగర వాసులు, మరో ఇద్దరు గ్రామాలకు చెందిన వారు. ఇంకో ఇద్దరు తిరుపతి జిల్లా వాసులు. ఆస్పత్రికి వచ్చిన అనుమానితులకు మాత్రమే ఇక్కడ కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అలా చేయించుకోకుండా జలుబు, జ్వరం, గొంతులో నసతో బాధపడే వారు జిల్లాలో ఎంతోమంది ఉన్నారు?, వారందరికీ పరీక్షలు చేస్తే ఎంతోమంది బాధితులుగా ఉంటారని డాక్టర్లు పేర్కొంటున్నారు. వైద్యశాఖ ఇప్పటికై నా స్పందించి పెద్దఎత్తున పరీక్షలు నిర్వహించడంతోపాటు వ్యాధి నిర్ధారణ అయిన వారి ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పేదల కడుపు కొట్టేందుకు ‘కూటమి’ యత్నం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో కూటమి సర్కారు పేదల కడుపు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని పలువురు నాయకులు అన్నా రు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని డా.జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పేదల ఆహార భద్రతపై నగదు బదిలీ ప్రభావం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చి వాహనాల ద్వారా రేషన్ ఇస్తున్న విధానాన్ని తొలగించి ప్రజలు షాపుల వద్దకు వెళ్లి తెచ్చుకునేలా చేశారని మండిపడ్డారు. సబ్సిడీపై నేడు నాలు గు రకాల వస్తువులు మాత్రమే ఇస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాదిరిగా 16 రకాల వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ బియ్యాన్ని అధికార పార్టీ నా యకులు, పెత్తందారులు పాలిష్ చేసి బయట రాష్ట్రాలకు అఽధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించా రు. సమావేశంలో నేతలు పుల్లయ్య, వెంగయ్య, దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, తిరుపాలు, శ్రీరాములు, రమణ య్య, చండ్ర రాజగోపాల్, రమణ, రఘురామయ్య, రాధయ్య, షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కప్పరాళ్లతిప్పలో పోలీసుల తనిఖీలు
బిట్రగుంట: బోగోలు మండలం కప్పరాళ్లతిప్పలో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 72 మంది సిబ్బందితో కప్పరాళ్లతిప్ప, అల్లిమడుగు సంఘం ప్రాంతాల్లోని సుమారు 400 ఇళ్లలో తనిఖీలు చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్షీట్ ఉన్న వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి పాత నేరస్తులు, అనుమానితుల కద లికలు, బయటి వ్యక్తుల రాకపోకలపై ఆరా తీశారు. సరైన పత్రాల్లేని 33 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. పాత నేరస్తులు, ఇతర రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉండి నేరాలకు పాల్పడుతున్న స్థానికుల వివరాలు, నాటుసారా తయారీదారుల గురించి ఆరా తీశారు. నేరాల నియంత్రణలో భాగంగా నిఘా ముమ్మరం చేశామని, ఎటువంటి పొరపాట్లు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, నేరాలకు దూరంగా ఉండి శాంతియుత జీవనం గడపాలని సూచించారు. తనిఖీల్లో సీఐలు బి.పాపారావు, జి.రాజేశ్వరరావు, ఎండీ ఫిరోజ్, ఎస్సైలు భోజ్యా, కిశోర్బాబు, జంపాని కుమార్, బాజీ బాబు, గౌస్బాషా, వెంకటేశ్వర్లు, లతీఫ్ ఉన్నీసా, సిబ్బంది పాల్గొన్నారు. -
టీచర్లకు తప్పని ఇక్కట్లు
నెల్లూరు(టౌన్): టీచర్లకు బదిలీ ఇక్కట్లు తప్పడం లేదు. హెడ్మాస్టర్ల నుంచి ఎస్జీటీల వరకు ఇబ్బందులు పడిన పరిస్థితి. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. తొలిరోజు 250 మంది హాజరుకావాలని మెసేజ్లు పంపించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని చెప్పిన జిల్లా విద్యాశాఖాధికారులు రాత్రి 8 గంటలకు ప్రక్రియను చేపట్టారు. సీనియారిటీ లిస్ట్ను పలుసార్లు మార్పులు చేపట్టి ఫైనల్ లిస్ట్ను ప్రకటించడంతో కౌన్సెలింగ్ను ప్రారంభించారు. ఇది పూర్తయ్యే సరికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం కౌన్సెలింగ్కు వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కట్లు పడ్డారు. అనేకమంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కూర్చొనేందుకు కనీసం కుర్చీలు కూడా లేని పరిస్థితి. బయట చెట్ల కింద, వరండాలో ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. సీనియారిటీ జాబితాపై సరైన అవగాహన లేకపోవడంతో కౌన్సెలింగ్ ఆలస్యమవుతున్నట్లు టీచర్లు మండిపడుతున్నారు. బుధవారం నుంచైనా ఉదయాన్నే ప్రక్రియ ప్రారంభించి సాయంత్రానికల్లా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ తొలిరోజు 250 మందికి.. మధ్యాహ్నం 3 గంటలకు రావాలని ఆదేశాలు రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ -
చైన్నెకి గంజాయి తరలిస్తుండగా..
● వ్యక్తి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): ఒడిశా నుంచి చైన్నెకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని తిరుపతి జిల్లా గూడూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఒడిశా, విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లలో మత్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి రైల్వే పోలీస్లు ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం కావలి, నెల్లూరు, గూడూరు రైల్వేస్టేషన్లు, ప్లాట్ఫారంలపై తనిఖీలు నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దేవదాస్ టాటా నగర్ – ఎర్నాకుళం రైల్లో ప్రయాణిస్తూ గూడూరు రైల్వేస్టేషన్లో దిగి హడావుడి బయటకు వెళ్తుండగా ఇన్చార్జి రైల్వే ఎస్సై వై.చెన్నకేశవరావు అదుపులోకి తీసుకున్నారు. దాస్ బ్యాగ్లో మూడు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి చైన్నె పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు వెళ్తున్నట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో ఇన్చార్జి ఎస్సై జి.మాలకొండయ్య, ఆర్పీఎఫ్ ఏఎస్సై సీకేఎన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మీడియాపై కక్ష సాధింపుతో ఎమర్జెన్సీ పరిస్థితులు
వైఎస్ జగన్పై, కుటుంబంపై నిత్యం విషం నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీడియాపై కక్ష సాధింపులతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండి పడ్డారు. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక ప్రకారం వివాదాస్పదం చేసి, సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు కొమ్మి నేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం చూస్తుంటే పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారనే విషయం అర్థమవుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి మీడియా చానల్ సమకాలీన మేధావులతో లైవ్ డిబేట్ల ద్వారా ప్రజా సమస్యలపై జరిపే చర్చల్లో కొన్ని సందర్భాల్లో విశ్లేషకులు అసందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెంటనే సరిచేసుకోవడం, కొన్ని సందర్భాల్లో వాటికి క్షమాపణలు చెప్పడం కూడా చూస్తున్నామన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 6న సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఉటంకిస్తూ మాట్లాడిన మాటలను కొమ్మినేని వారించారన్నారు. అయితే కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తుండడంతో సాక్షి టీవీ యాజమాన్యం, ఇటు వైఎస్సార్సీపీ కూడా ఖండిస్తూ మహిళలపై తమకు ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా వెల్లడించాయన్నారు. పథకం ప్రకారం రాద్ధాంతం సృష్టి టీవీ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడిన మాటలను మరుసటి రోజు నుంచి రెచ్చగొట్టే ధోరణితో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసేందుకు తెగబడిందన్నారు. మంత్రి లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం, టీడీపీ ఆందోళనకు దిగడం జరిగాయన్నారు. దీంతో అదే రోజు తాను చేసిన వ్యాఖ్యలపై కృష్ణంరాజు క్షమాపణలు చెప్పినా టీడీపీకి చెందిన సోషల్ మీడియా ఈ అంశాన్ని సాక్షి టీవీ యాజమాన్యానికి, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతికి ఆపాదిస్తూ అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నారు. ఆ వెంటనే చంద్రబాబు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించడం, డిప్యూటీ సీఎం పవన్ ప్రెస్నోట్ రిలీజ్ చేయడం చూస్తే పథకం ప్రకారమే జరుగుతున్నట్లు అర్థమవుతుందన్నారు. సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందని, సాక్షి కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారన్నారు. ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంకు ప్రజాస్పందన రావడంతో, ఏడాది పాలనపై సంబరా లు చేసుకుందామన్న కూటమి పార్టీల పిలుపును ప్రజ లు తిరస్కరించారని, దానిని డైవర్ట్ చేసేందుకే సాక్షి మీడియాపై ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతిభద్రతలు పట్టవా? అనంతపురం జిల్లాలో గిరిజన బాలిక తన్మయిని దుండగులు బీరు బాటిళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్పై ఆరు రోజుల కిందట ఫిర్యాదు అందినా, పోలీసులు పట్టించుకోలేదన్నారు. చివరికి దారుణమైన స్థితిలో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. సత్యసాయి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని, కేసు పెట్టేందుకు వచ్చిన బాధితులను బెదిరిస్తే వారు ఊరు వదిలి వెళ్లిపోయారన్నారు. శాంతిభద్రతల విషయంలో విఫలమైన ఇటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, హోంమంత్రి వంగలపూడి అనితను కీలుబొమ్మ మంత్రిగా మారారన్నారు. నారా లోకేశ్ డిఫాక్టో హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీ పలువురు మహిళా ప్రజాప్రతినిధుల గురించి గతంలో టీడీపీ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మరిచిపోయారా? సీఎంగా ఉన్న వైఎస్ జగన్పై టీడీపీ నాయకులు వాడిన భాష ఎలాంటిది? వంగలపూడి అనిత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఎలాంటి మాటలు మాట్లాడారు, కిరాక్ ఆర్పీ, సీమరాజా, కిరణ్ వంటి వారు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేశారో ప్రజలందరికీ తెలుసునని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారికి టీడీపీ కొమ్ముకాస్తోందన్నారు. రాష్ట్రంలో శ్రుతిమించిన రెడ్బుక్ రాజ్యాంగం కొమ్మినేని అరెస్ట్ పత్రికా స్వేచ్ఛపై దాడి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై నిత్యం విషపూరితమైన ప్రచారం చేశారో అందరికీ తెలుసునని, టీడీపీ అనుకూల పత్రికల్లో దారుణమైన కథనాలను ప్రచురించారన్నారు. అయినా ఏ ఒక్కరిపైనా ఆయన కక్ష సాధింపులకు పాల్పడేందుకు ప్రయత్ని ంచలేదన్నారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తోందన్నారు. చివరికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని వంటి వారిని అరెస్ట్ చేయడం ద్వారా పత్రికలను, మీడియాను కూడా వదలి పెట్టమనే సంకేతాన్ని ఇచ్చారన్నారు. -
‘సాక్షి’ కార్యాలయాలపై దాడులను ఆపాలి
నెల్లూరు సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై చేస్తున్న దాడులను ఆపాలని నెల్లూరు రూరల్ ఎస్సై ప్రసాద్రెడ్డికి మంగళవారం ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అంశం మీద సంబంధం లేని విషయాన్ని ‘సాక్షి’కి ఆపాదిస్తూ కొందరు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడం సరికాదన్నారు. ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడాదిగా నానా ఇబ్బందులు పెట్టారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కొన్ని పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు కూటమి నేతల రెడ్బుక్ రాజ్యాంగానికి గులాంగిరి చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉందనే ధీమాతో స్టేషన్లోనే సెటిల్మెంట్లు, దందాలు నిర్వహిస్తూ కలెక్షన్ కింగ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక, గ్రావెల్, చివరకు చికెన్ వేస్ట్ మాఫియా వరకు కొందరు పోలీసులే నిర్వహిస్తున్నారంటే వారి చీకటి దందా ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్థమవుతోంది. ఉన్నతాధికారులు రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేయొద్దని పదేపదే హెచ్చరిస్తున్నా.. కింది స్థాయి అధికారులు వారి ఆదేశాలను పెడ చెవిన పెడుతున్నారు. సెటిల్మెంట్ దందాలు, అక్రమ కేసులపైనే దృష్టి సారించి జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతోనే వైఎఎస్సార్సీపీ నేతలపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. టీడీపీ అక్రమాలకు అండగా బాధితులపై కిరాయి రౌడీల్లా దౌర్జన్యాలు, పంచాయితీలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు రోజునే అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతల దమనకాండ మొదలైంది. వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడడంతోపాటు రైతులపై రౌడీషీట్లు తెరిపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి గొంతులను నొక్కేస్తున్నారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఇప్పటికే పది అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. కావలిలోనూ అదే రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ అయిన నన్ను స్థానిక టీడీపీ నేతలు నానా ఇబ్బందులు పెట్టారు. ప్రతి విషయంలో, ప్రతి కేసులో నా పేరు నమోదు చేసి నాపై ఎఫ్ఐఆర్లు చేయించారు. ఇటీవల నా కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు చేయించారు. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎస్సీ కులానికి చెందిన నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ గ్రామంలో లేకుండా తరిమేయాలని చూస్తున్నారు. – దార్ల గోపి, మర్రిగుంట సర్పంచ్ -
వైఎస్ జగన్తో ప్రసన్న భేటీ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కోవూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజయ్కుమార్రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల ప్రసన్న చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ప్రసన్నకుమార్రెడ్డిని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రసన్నకుమార్రెడ్డితో, రజత్కుమార్రెడ్డితో జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ పర్యటనకు హెలిప్యాడ్ పరిశీలన వెంకటాచలం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో మండలంలోని కాకుటూరు సమీపంలో హెలిప్యాడ్ను వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు రానున్నారు. మంగళవారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి పి అనిల్కుమార్యాదవ్, పేర్నేటి శ్యాంప్రసాద్రెడ్డి తదితరులు హెలిప్యాడ్ను పరిశీలించారు. డ్వామా అడిషనల్ పీడీగా స్వరూప్ నెల్లూరు (పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అడిషనల్ పీడీగా స్వరూప్ని నియమిస్తూ పంచాయతీరాజ్శాఖ రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కోనసీమ జిల్లా డ్వామా కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న స్వరూప్ను నెల్లూరు అడిషనల్ పీడీగా నియమించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులును కందుకూరు క్లస్టర్ ఏపీడీగా నియమించారు. జెడ్పీలో 65 మంది ఉద్యోగుల బదిలీలు నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు, సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్లను బదిలీ చేశారు. మొత్తం 183 మంది అధికారులు, ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న 45 మందిలో 32 మందిని, ఽరిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగుల్లో 33 మందిని మొత్తం 65 మందిని వివిధ ప్రాంతాలకు బదిలీలు చేశారు. ఇందులో ఐదుగురు పరిపాలనాధికారులు, ఒకరు సీనియర్ సహాయకులు, 12 మంది జూనియర్ సహాయకులు, ఒక టైపిస్టు, 25 మంది రికార్డు, ల్యాబ్ అసిస్టెంట్లు, 21 మంది ఆఫీస్ సబార్డినేటర్లు ఉన్నారు. నిబంధనల మేరకే బదిలీలు చేశామని జిల్లా పరిషత్ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్రావు తెలిపారు. గురుకులాల కో ఆర్డినేటర్గా ప్రభావతమ్మ నెల్లూరు (స్టోన్హౌస్పేట): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్గా డాక్టర్ ప్రభావతమ్మను నియమిస్తూ మంగళవారం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఉత్తర్వులిచ్చారు. విశాఖపట్నంలో పనిచేస్తున్న ప్రభావతమ్మను జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాలో కో ఆర్డినేటర్గా పనిచేస్తున్న పద్మజను చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు. గోవర్ధన్రెడ్డికి 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ నెల్లూరు (లీగల్): సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై గుంటూరు సీఐడీ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీవారెంట్పై సీఐడీ పోలీసులు మంగళవారం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి కాకాణిని గుంటూరు 6వ అదనపు మున్సిఫ్ (ప్రత్యేక సీబీసీఐడీ) న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్కు ఉత్తర్వులిచ్చారు. గోవర్ధన్రెడ్డి తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరంగోవర్ధన్రెడ్డిని గుంటూరు నుంచి నెల్లూరు కేంద్రకారాగారానికి తరలించారు. గుంటూరు న్యాయస్థానం వద్ద గోవర్ధన్రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. -
కీచక సైకోలను కఠినంగా శిక్షించాలి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రంలో టీడీపీ నేతలే కీచకులుగా మారడంతో మహిళల మానప్రాణాలకు భద్రత కొరవడిందని, ఇటువంటి కీచకలను కఠినంగా శిక్షించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న టీడీపీకి చెందిన సైకోలను కఠినంగా శిక్షించే విధంగా సీఎం చంద్రబాబుకు, హోంమంత్రి అనితకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని నేరాలు, ఘోరాలు మైనర్ బాలికలపై జరుగుతున్నాయన్నారు. మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించలేని, పచ్చకీచకులను శిక్షించలేని అసమర్థ ప్రభుత్వం, మహిళలను కించపరిచారంటూ సాక్షిపై ఆగమాగం చేయడం సిగ్గు చేటన్నారు. హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికి రాజకీయ ప్రేరేపిత కేసులపై ఉన్న శ్రద్ధ సాధారణ మహిళలపై జరుగుతున్న అన్యాయపు కేసులను పట్టించుకోవడం లేదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా బాలికపై యాసిడ్ దాడి జరిగిన వెంటనే తీసుకున్న చర్యలు, జగన్మోహన్రెడ్డి దిశా చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు ఇచ్చిన రక్షణ తదితర అంశాలను గుర్తు చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను అక్రమ కేసులు, అరెస్ట్లు పెట్టి బెదిరించడానికి తప్ప రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు వినియోగించడం లేదన్నారు. మహిళలను అన్ని విధాలుగా అణగదొక్కుతూ సాధారణ మహిళలను, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులను ఎవరిని లెక్కచేయకుండా మహిళలనే కనికరం చూపకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. మద్యపానం, గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మద్యం షాపులు ఎక్కువయ్యాయన్నారు. మంచీ చెడు తెలియని వయస్సులో చెడు వ్యసనాలకు అలవాటు పడి పసిపిల్లలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని, తమ ఇళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళపై ఉందన్నారు. ఆత్మకూరు జెడ్పీటీసీ, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ ‘సాక్షి’ టీవీలో జరిగిన ఒక డిబెట్లో మాట్లాడిన వ్యక్తి మాటలకు అంత విలువనిచ్చి రచ్చ చేస్తున్న టీడీపీ నాయకులకు ప్రభుత్వానికి గత వారంలోనే దాదాపు 10 మంది చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలు కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో పట్టపగలు కూడా మహిళలు బయట తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయిందని, అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు గురి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతల దారుణాలు హత్యలు, ‘హత్యా’చారాలతో మహిళలకు భద్రత కొరవడింది పచ్చ కీచకపర్వాలపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన సీఎం, హోంమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతి -
కలిగిరిలో ప్రేమజంటపై దాడి
● యువకుడికి గాయాలు కలిగిరి: మండలంలోని కలిగిరిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో యువకుడు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన సాయి, పూజిత వీఆర్ లా కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. యువతికి వేరే వ్యక్తితో వివాహం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి, పూజిత స్నేహితుల సహకారంతో బైరవకోనకు వెళ్లి వివాహం చేసుకున్నారు. తిరిగి నెల్లూరుకు కారులో బయలుదేరారు. కలిగిరిలో టీ తాగేందుకు ఆగారు. వారిని మోటార్బైక్లపై యువతి బంధువులు వెంబడించారు. ఈ క్రమంలో పూజితను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. సాయి అడ్డుకోవడంతో వారు దాడి చేసి గాయపరిచారు. హైస్కూల్లో క్రికెట్ ఆడుతున్న యువకులు, స్థానికులు అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. పోలీసులు ప్రేమజంటను స్టేషన్కు తీసుకెళ్లి మాట్లాడారు. -
ఏదో చేశారంతే..
● మొక్కుబడిగా షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవం ● మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల డుమ్మా ● 284 మంది పది, ఇంటర్ విద్యార్థులకు అవార్డులు ● తల్లిదండ్రులకు సన్మాన విషయం మరిచిన అధికారులునెల్లూరు(టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం జిల్లాలో మొక్కుబడిగా సాగింది. దీనికి మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పదో తరగతి, ఇంటర్మీడియట్కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదుతోపాటు మెడల్, సర్టిఫికెట్ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపారు. అయితే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఇంకా నగర మేయర్ స్రవంతి వచ్చారు. కలెక్టర్ ఆనంద్ సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు డుమ్మా కొట్టారు. నియోజకవర్గ పరిధిలో కార్యక్రమం జరుగుతున్నా శ్రీధర్రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా ప్రతిభ చూపిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొంతమందిని ఎంపిక చేసి కేవలం వారితో మాట్లాడించడానికి పరిమితమయ్యారు. జిల్లాలో 284 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో పదో తరగతికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల నుంచి 95 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 155 మంది, ఇంటర్కు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఆరుగురు, ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి 28 మందికి రూ.20 వేల చొప్పున నగదు, మెడల్, సర్టిపికెట్లను ముఖ్యఅతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఉన్నత లక్ష్యాలు సాధించాలి క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. జిల్లాలోని భవిత కేంద్రాల్లో పదిలో ఉత్తమ మార్కులు సాధించిన అంధ విద్యార్థులకు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉన్నత విద్యకు తమవంతు సహాకారం అందిస్తామన్నారు. ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఒకటి నుంచి 10 వరకు విద్యార్థులకు రెండు వేల స్టూడెంట్ కిట్స్ను సిద్ధం చేశామన్నారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో సుమారు 3,200 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, 38 భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఈకార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, డీవీఈఓ మధుబాబు, ఆర్ఐఓ వరప్రసాదరావు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి విక్రయిస్తుండగా..
● ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): గంజాయిని విక్రయించేందుకు కారులో సిద్ధంగా ఉన్న ముగ్గురు నిందితులను నెల్లూరు వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం వేదాయపాళెం పోలీస్స్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం తల్పగిరి కాలనీలోని సాయిబాబా మందిరం సమీపంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఇన్స్పెక్టర్కు పక్కా సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కారులో గంజాయిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కానూరు రాజుపాళేనికి చెందిన ఈ.సాయికిరణ్, నెల్లూరు నవాబుపేట రామచంద్రాపురానికి చెందిన దిలీప్, తిరుపతి జిల్లా వెంకటగిరి నెహ్రూనగర్కు చెందిన జనార్దన్ను అరెస్ట్ చేశారు. 400 గ్రాముల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
అర్జీల వెల్లువ
● నెల్లూరులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● అధికారుల దృష్టికి 383 వినతులునెల్లూరు రూరల్: సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వో ఉదయభాస్కర్రావు, డ్వామా పీడీ గంగా భవాని, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, జిల్లా సర్వే అధికారి నాగశేఖర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 132, మున్సిపల్ శాఖవి 35, సర్వేవి 28, పంచాయతీరాజ్ శాఖవి 34, పోలీస్ శాఖవి 63, సివిల్ సప్లయ్స్వి 16, ఇతర శాఖలకు సంబంధించి 383 వినతులందాయి. తండ్రిని మభ్యపెట్టి.. నాకు రావాల్సిన ఆస్తిని సోదరుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నా తల్లి చనిపోయాక నాన్న రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నాలుగు భాగాలుగా అగ్రిమెంట్ రాసుకున్నాం. నాకు తెలియకుండా సోదరుడు తండ్రిని మభ్యపెట్టి ఫోర్జరీ సంతకాలతో ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన పోకూరు కార్తీక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్ను పునరుద్ధరించాలి ఆరోగ్య సమస్యలతో మూడు నెలలు హైదరాబాద్లో చికిత్స తీసుకున్నా. ఆ సమయంలో పెన్షన్ తీసుకోలేదు. దీంతో పింఛన్ ఇవ్వడం ఆపేశారు. మధుమేహ వ్యాధితో కాళ్లు, చెయ్యి తీసేశారు. పింఛన్ను పునరుద్ధరించి ఆదుకోవాలని బోగోలు మండలం జువ్వలదిన్నె నివాసి వదినాల నాగరాజు కోరారు. వసతి గృహాన్ని పునఃప్రారంభించాలంటూ.. సర్వేపల్లి ప్రభుత్వ బాలుర హాస్టల్ను పునః ప్రారంభించాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు శేషం సుదర్శన్ వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ హాస్టల్ మూసివేతపై జిల్లా ప్రజా సంఘాల నేతలతో సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం.. నెల్లూరు నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నేతలు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సునీల్, కార్యదర్శి షారుక్ తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరులో యోగాంధ్ర ర్యాలీ
నెల్లూరు(బారకాసు): నగరంలోని ముత్తుకూరు సెంటర్ నుంచి చిల్డ్రన్్స్ పార్క్ వరకు జిల్లా స్థాయి యోగా ర్యాలీని సోమవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధికారులు, మెప్మా మహిళలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలోని చిట్టచివరి గ్రామానికి సైతం చేరేలా అందరూ కృషి చేయాలని సూచించారు. ర్యాలీలో కమిషనర్ నందన్, జెడ్పీ సీఈఓ విద్యారమ, వివిధ శాఖల అధికారులు వెంకటరమణ, విజయన్, గంగాధర్, గంగా భవాని, గురప్ప పాల్గొన్నారు. కాగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డు, గ్రామ సచివాలయ పరిధిల్లో ర్యాలీలను నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి గురై..
● వ్యక్తి మృతి మనుబోలు: విద్యుతాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని మడమనూరు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొణితం మస్తానయ్య (40) ఆదివారం అర్ధరాత్రి నిద్రలేచి మూత్రవిసర్జన కోసం ఆరుబయటకు వెళ్లాడు. అప్పటికే గాలికి అక్కడ కరెంట్ తీగ తెగిపడి ఉంది. దీనిని మస్తానయ్య గమనించలేదు. దీంతో విద్యుత్ తీగ కాలికి తగిలి షాక్కు గురై కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివరాకేష్ సోమవారం మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతినెల్లూరు(క్రైమ్): నెల్లూరు బృందావనంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించి సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి జీజీహెచ్ మార్చురికి తరలించారు. 46వ డివిజన్ వీఆర్వో శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సంతపేట పోలీస్స్టేషన్, 94407 00017 నంబర్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీ సీఈఓ బదిలీ నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సీఈఓ విద్యారమ బదిలీ అయ్యారు. శ్రీకాళహస్తిలోని శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. బుచ్చిరెడ్డిపాళెం ఎంపీడీఓ శ్రీహరి వెస్ట్ గోదావరి సీఈఓగా బదిలీ అయ్యారు. -
స్వగ్రామానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కలిగిరి: మండలంలోని బిమ్మరాజుచెరువు – నాగిరెడ్డిపాళెం మధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలంపాడు గ్రామానికి చెందిన దామంచర్ల హజరత్తయ్య (50) మృతిచెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పోలంపాడు గ్రామానికి చెందిన హజరత్తయ్య ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. అత్తగారి ఊరైన వింజమూరు మండలం రావిపాడుకు ఆదివారం వెళ్లాడు. తిరిగి రాత్రి భార్య అరుణతో మోటార్బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగి ఉన్న బైక్ను ప్రమాదవశాత్తు ఢీకొనగా భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు. హజరత్తయ్య తీవ్రంగా, అరుణ స్వల్పంగా గాయపడ్డారు. వారిని కలిగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషయంగా ఉండటంతో హజరత్తయ్యను నెల్లూరుకు తరలించారు. ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కలిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి అన్నారు. సోమవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదించి, పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కూటమి ప్రభుత్వం వేసిన ఎత్తుగడను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మహిళలను గౌరవించడం, మహిళా సాధికారత కోసం అనుక్షణం తపించే నాయకుడు జగన్ అని చెప్పారు. ఆయన పాలనలో వారి కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేశారన్నారు. 32 లక్షల మంది మహిళల పేరుపై ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. రక్షణ కోసం దిశ యాప్ను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళల రక్షణ కల్పించడంలో విఫలమైన రాష్ట్ర హోంమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తన్మయి హత్య ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు గౌరి -
కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ రేపు
నెల్లూరు (లీగల్): నెల్లూరు ఐదో అదనపు (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టులో బెయిల్ పిటిషన్ను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమమహేశ్వర్రెడ్డి రెండు గంటల పాటు వాదనలను సోమవారం వినిపించారు. పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ హాజరయ్యారు. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ను ఫైల్ చేసి తమ వాదనలను వినిపించేందుకు వాయిదా కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న ఇన్చార్జి న్యాయమూర్తి సుమ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. రిమాండ్ పొడిగింపు కాకాణిపై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ గడువు సోమవారంతో ముగిసింది. జైలు అధికారులు వర్చువల్గా ఆయన్ను హాజరుపర్చారు. రిమాండ్లో ఈ నెల 23 వరకు ఉంచాల్సిందిగా ఉత్తర్వులను ఇన్చార్జి న్యాయమూర్తి సుమ జారీ చేశారు. ఆయన్ను తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ను పోలీసులు దాఖలు చేశారు. మాన్యువల్ కౌన్సెలింగ్కు డిమాండ్ నెల్లూరు (టౌన్): ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్నే నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయ ఎదుట రిలే దీక్షలను సోమవారం నిర్వహించిన అనంతరం పలువురు మాట్లాడారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అనేక సమస్యలొస్తున్నాయని, దీనిపై విద్యాశాఖ కమిషనర్ ఎవరి మాట వినడంలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులను బెదిరింపులకు గురిచేసి ఆప్షన్లు పెట్టించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు పిచ్చిబాబు, అనిల్కుమార్, చలపతిశర్మ, నరసింహులు, హజరత్తయ్య, కృష్ణారెడ్డి, మధుసూదన్రావు, శివశంకర్రెడ్డి, పద్మజ, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లా పీహెచ్డీ ఎంట్రన్స్లో ఐదో ర్యాంక్ నెల్లూరు (టౌన్): ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లా పీహెచ్డీ ఎంట్రన్స్లో 76 మార్కులతో ఐదో ర్యాంక్ను నగరానికి చెందిన సనాతన భారత్ సాధించారు. లాకు సంబంధించిన నేషనల్ ఎలిజిబుల్టీ టెస్ట్ (నెట్)లో 92 శాతం, ఏపీ, తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్టీ టెస్ట్లో అర్హత సాధించారు. జిల్లా కోర్టు, సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం ఏఓఆర్ లా ప్రాక్టీస్ చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ సూపరింటెండెంట్ సరెండర్ నెల్లూరు(స్టోన్హౌస్పేట): సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ లూకాస్ను తాడేపల్లి డైరెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఎదుర్కొంటున్న పలు ఆరోపణల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు రావడం చర్చనీయాంశమైంది. రైతులను నట్టేట ముంచిన ధాన్యం దళారి మనుబోలు: మాయమాటలు చెప్పి అధిక ధరలకు ధాన్యం కొనుగోలు చేసిన ఓ దళారి ఆ తర్వాత పత్తాలేకుండాపోయారు. బాధితుల వివరాల మేరకు.. వెంకటాచలం మండలం పూడిపర్తికి చెందిన రామారావు, తాటిపర్తిపాళేనికి చెందిన పెంచలయ్య ఎక్కువ ధర చెల్లిస్తామని నమ్మబలికి సుమారు 600 పుట్ల ధాన్యాన్ని సేకరించారు. మండలంలోని చెర్లోపల్లి, జట్ల కొండూరు, మడమనూరుకు చెందిన పలువురి నుంచి ధాన్యం సేకరించారు. ఆపై వీరు ఆఽ దాన్యాన్ని వెంకటాచలం మండలం ఎర్రగుంటకు చెందిన దళారి వేముల శీనయ్యకు విక్రయించారు. రైతులకు రూ.90 లక్షలకుపైగా నగదు రావాల్సి ఉండగా, కాలయాపన చేస్తూ వచ్చారు. 20 రోజులు గా అందుబాటులో లేకపోవడంతో మోసపోయా మని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గుట్టుచప్పుడు కాకుండా జామాయిల్ కర్ర అమ్మకం
ఉదయగిరి: కంచె చేను మేసిన చందంగా మారింది అటవీ శాఖ తీరు. అందులోని ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా దోచేసి తమ జేబులు నింపుకొంటూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారు. ఉదయగిరి రేంజ్ పరిధిలో కొన్నేళ్లుగా ఈ తంతు సాగుతున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇదే అదునుగా ఇంటి దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమార్కులకు ఆ శాఖలో పనిచేసే అధికారుల అండదండలుండటంతో అవినీతి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. కొంతమంది వీఎస్సెస్ సభ్యులు ధైర్యం చేసి ఓ అధికారి అక్రమాల బాగోతాన్ని బయటపెట్టారు. దీన్ని తొక్కిపెట్టేందుకు యత్నించినా, అదే శాఖలో పనిచేసే మరో ఉద్యోగి రాజీకి అంగీకరించకపోవడంతో ఎట్టకేలకు విచారణ జరుపుతున్నారు.జరగాల్సిందిలా..ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని ఉదయగిరి వెస్ట్ బీట్లో గల శకునాలపల్లిలో 20 హెక్టార్లల్లో జామాయిల్ను వీఎస్సెస్ కమిటీ పర్యవేక్షణలో కొన్నేళ్ల క్రితం నాటారు. వీటిని కమిటీలు సంరక్షించసాగాయి. అయితే ఇటీవల మొక్కలు పెద్దవి కావడంతో కటింగ్కు వచ్చాయి. వేలం ద్వారా విక్రయించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. టన్నును రూ.8100కు కొనుగోలు చేసేందుకు ఒక సంస్ధ ముందుకొచ్చింది. చెట్లు నరికి ఆ ధర లెక్కన విక్రయించి నగదును ఖజానాకు జమ చేస్తారు. నరకడం.. లారీల్లో లోడ్ చేయడం.. ఎన్ని టన్నులున్నాయనే వివరాల నమోదు.. వాటికి పర్మిట్ల జారీ.. అక్రమాలు జరగకుండా అన్ని జాగ్రత్తలను ఆ బీట్లో విధులు నిర్వర్తించే ఫారెస్ట్ ఆధికారి, ఎఫ్బీఓ పాటించాలి.అక్రమాలకు పాల్పడిన ఎఫ్బీఓశకునాలపల్లి ఎఫ్బీఓ భానుతేజ గుట్టుచప్పుడు కాకుండా కొంతమేర జామాయిల్ను నరికించారు. తనకు అనుకూలమైన వ్యక్తి ద్వారా రాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా దొంగచాటుగా తరలించి బద్వేల్ సమీపంలోని ఓ కంపెనీలో విక్రయించారు. విషయం తెలుసుకున్న వీఎస్సెస్ కమిటీ సభ్యులు సదరు ఎఫ్బీఓ నిర్వాకాన్ని ఫారెస్ట్ అధికారి చినవెంకటయ్యకు ఈ నెల నాలుగున తెలియజేశారు. దీంతో భానుతేజను సదరు అధికారి ప్రశ్నించగా, వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన తన మెడకెక్కడ చుట్టుకుంటుందోననే భయంతో కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ పొందనున్న సదరు ఫారెస్ట్ ఆధికారి విషయాన్ని రేంజర్ దృష్టికి తీసుకెళ్లారు.కుదరని సంధిఈ క్రమంలో రాజీ కుదిర్చేందుకు ఆ శాఖలో పనిచేసే భానుతేజ అనుచరులు యత్నించారు. అయితే వ్యవహారం వీఎస్సెస్ సభ్యులకు తెలియడంతో, నేరుగా వారు డీఎఫ్ఓ, ఉన్నతాధిధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విధిలేక దుత్తలూరు డీఆర్వోను విచారణాధికారిగా రేంజర్ నియమించారు. ఇందులో వాస్తవాలు వెలుగుచూశాయి. అయినా ఘటన తీవ్రతను తగ్గించి తూతూమంత్రంగా నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపేందుకు యత్నిస్తున్నారని వీఎస్సెస్ సభ్యులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు.కార్యాలయంలో విచారణ వీఎస్సెస్ సభ్యులు, అక్రమాలకు పాల్పడిన తేజ, కర్రను ట్రాక్టర్ ద్వారా తరలించిన దేవమ్మ చెరువుకు చెందిన సుబ్బారాయుడ్ని స్థానిక అటవీ రేంజ్ కార్యాలయంలో రేంజర్ కుమార్రాజా సోమవారం విచారించారు. అక్రమాలు జరిగాయనే అంశాన్ని తేల్చి, వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. గతంలోనూ రూ.లక్షల విలువజేసే అటవీ సంపద ఇంటి దొంగలే కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై రేంజర్ను సాక్షి సంప్రదించగా, అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని బదులిచ్చారు. -
న్యాయం జరగలేదంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఇంటి విషయమై సమీప బంధువులతో ఎనిమిది నెలలుగా గొడవ జరుగుతున్నా, పోలీస్స్టేషన్లో తనకు న్యాయం దక్కలేదని.. సంగం సీఐ వేమారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చేజర్ల మండలం ఆదూరుపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి బంధువుల వివరాల మేరకు.. ఆదూరుపల్లిలోని సర్వే నంబర్ 590లో ఇంటి స్థలం, పట్టాను షరీఫాబీకి 2009లో ప్రభుత్వం అందజేసింది. అప్పటి నుంచి ఇంటి పన్నులు చెల్లిస్తూ, ఆమె తన పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆమె మృతి చెందగా, కుమార్తె జమీలా అదే ఇంట్లో ఉంటున్నారు. షరీఫాబీ చెల్లెలు మగ్బూల్కు సర్వే నంబర్ 490లో ఇచ్చిన పట్టాను 590గా ఫోర్జరీ చేసి ఆ స్థలం తనదంటూ కోర్టు నుంచి తాత్కాలిక ఇంజెక్షన్ ఆర్డర్ను పది నెలల క్రితం తెచ్చుకున్నారు. ఈ తరుణంలో జమీలా, కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో సామగ్రిని బయటపడేసి ఆక్రమించేందుకు యత్నించారు. గమనించిన జమీలా కుమారుడు హర్షద్ ప్రశ్నించగా, అతనిపై దాడి చేసి గాయపర్చారు. దీనిపై చేజర్ల పోలీసులు, సీఐకి ఫిర్యాదు చేశారు. అయితే కొందరు టీడీపీ నేతల మాటలను సీఐ విని జమీలా ఇంటికి తాళాలేసి తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసి ఆయన సూచనల మేరకు చేజర్ల తహసీల్దార్కు అర్జీని బాధితురాలు అందజేశారు. విచారణ జరిపి పట్టా మేరకు ఆ ఇల్లు షరీఫాబీకే చెందిందని, ఆమె వారసురాలైన జమీలాకు అక్కడ నివసించే హక్కు ఉందంటూ ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఈ విషయాలను ఎస్సై తిరుమలరావుకు బాధితురాలు తెలియజేశారు. దీంతో ఫోర్జరీపై మగ్బూల్, ఆమె కుటుంబసభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ తరుణంలో బాధితులు తమ ఇంట్లోకి వెళ్తుండగా, సీఐ సూచనలతో మగ్బూల్ ఆమె బంధువులు దాడి చేసేందుకు వచ్చారు. దీంతో తమ కుటుంబానికి రక్షణ లేదనే మనస్తాపంతో సూపర్ వాస్మాల్ 33 మందును సేవిస్తూ సెల్ఫీ వీడియోలో అన్యాయాన్ని వివరించారు. కొద్దిసేపటి అనంతరం ఆమె కుమారుడు, బంధువులు వచ్చి వైద్యం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. -
‘సాక్షి’పై రాజకీయ ప్రేరేపిత దాడులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పత్రిక స్వేఽచ్ఛపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సాక్షి పత్రిక, ఛానల్పై పగబట్టి రాజకీయ ప్రేరేపిత దాడులకు ఉసిగొల్పుతోంది. సాక్షి టీవీ డిబేట్లో అమరావతి రాజధానిపై సీనియర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే సాకు చూపి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మూకలు దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. నగరంలోని సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీని నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ మహిళా విభాగ నేతలు పలువురితో కలిసి సోమవారం నిర్వహించారు. పత్రిక ప్రతులను తగలబెట్టి.. ఓ దశలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ప్రధాన గేట్కు తాళాలేసినా, లోపలికెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. నెల్లూరు రూరల్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. కొవ్వొత్తులతో నిరసన రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ నెల్లూరు సాక్షి యూనిట్ ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. నెల్లూరు యూనిట్ కార్యాలయం వద్ద టీడీపీ నేతల రభస లోపలికి చొచ్చుకొచ్చేందుకు యత్నం -
మోసాలు.. ఎగవేతలు
నెల్లూరు (టౌన్): నెల్లూరు జీఎస్టీ డివిజన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా రంగాల్లో కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా.. చెల్లించే జీఎస్టీ రూ.వందల్లోనే ఉంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి క్రమం తప్పకుండా వసూలు చేసినా, ప్రభుత్వానికి మాత్రం పంగనామం పెడుతున్నారు. రూ.20 లక్షల్లోపు వ్యాపారం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదనే నిబంధనను బూచిగా చూపి ఎక్కువ మంది ఎగ్గొడుతున్నారు.నిబంధనలు బేఖాతర్వాస్తవానికి అమ్మకాలు రూ.200 దాటితే జీఎస్టీ నంబర్తో కూడిన బిల్లును ఇవ్వాలనే నిబంధన ఉన్నా, నెల్లూరు డివిజన్ పరిధిలో ఎక్కడా అమలు కావడం లేదు. జీఎస్టీకి సంబంధించిన రిటర్న్స్ను మూడు నెలలకోసారి వ్యాపారులు దాఖలు చేయాల్సి ఉన్నా, అదీ మొక్కుబడిగానే జరుగుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా, మామూళ్లతో మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి.వసూళ్లు 25 శాతం పతనంనెల్లూరు డివిజన్, జిల్లాకు సంబంధించిన జీఎస్టీ రాబడి తగ్గిందని తెలుస్తోంది. వాస్తవానికి దాదాపు రూ.1200 కోట్ల రెవెన్యూ రావాల్సి ఉండగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.900 కోట్లు దాటలేదని సమాచారం. ఈ లెక్కన వసూళ్లు 25 శాతానికిపైగా పతనమయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియసైందని సమాచారం. అయితే టార్గెట్, సాధించిన లెక్కలపై జీఎస్టీ అధికారులను ప్రశ్నిస్తే, బయటకు చెప్పకూడదనే సమాధానమిస్తున్నారు.ఎక్కువగా వసూలయ్యేది వీటి నుంచే..నెల్లూరు డివిజన్లో మోటార్ వెహికల్స్ నుంచి రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత వెజిటబు ల్ అయిల్, పోర్టు ఆధారిత అంశాలు, పొగాకు, ఎర్త్ మూవింగ్ పరికరాలు, జ్యువెలర్స్, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్ట్రానిక్స్, రెడీమేడ్ వస్త్రాలు, గ్రానైట్, హోటళ్లు, రియల్ ఎస్టేట్ తదితరాల నుంచి ఉంటుంది. అయితే ఎందులోనూ ఆశించిన స్థాయిలో రాబడి రాలేదు.నర్తకి సెంటర్లోని జీఎస్టీ కార్యాలయంజీఎస్టీలోకి వచ్చే డీలర్లు – 26 వేలకు పైగాకాంపోజిషన్ ట్యాక్స్ చెల్లింపుదారులు – 2400 మందికిపైగాజీరో దందాకు అడ్డుకట్టేదీ..? జిల్లాలో ఇలా.. జిల్లాలో లెక్క ఇదీ..నెల్లూరు డివిజన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. జిల్లాలో నెల్లూరు – 1, 2, 3, కావలి.. ప్రకాశం జిల్లాలో ఒంగోలు 1, 2, మార్కాపురం సర్కిళ్లున్నాయి.డివిజన్ పరిధిలో 26 వేల మందికిపైగా డీలర్లు జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఏడాదికి రూ.1.5 కోట్ల ఆదాయమొచ్చే డీలర్లు 21 వేల మందికిపైగా ఉన్నారు. వీరంతా ప్రతి నెలా రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఏడాదికి రూ.50 లక్షల్లోపు రాబడి వచ్చే వారిని కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్గా పరిగణిస్తారు. డివిజన్ పరిధిలో వీరి సంఖ్య ఐదు వేలకుపైగా ఉంటుంది. వీరు ప్రతి మూడు నెలలకోసారి రిటర్న్స్ను దాఖలు చేయాలి.జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. వినియోగదారుడు రూ.200కుపైగా ఏ వస్తువును కొనుగోలు చేసినా, జీఎస్టీ నంబర్తో కూడిన బిల్లును దుకాణ యజమాని తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు జిల్లాలోని అధిక శాతం హోటళ్లలో బిల్లులివ్వని పరిస్థితి నెలకొంది. నిజానికి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద తొమ్మిది శాతం చొప్పున 18 శాతాన్ని బిల్లులో వేస్తారు. లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా, వేలల్లోనే రిటర్న్స్ను దాఖలు చేస్తున్నారు. బిల్లుల్లేకుండానే చైన్నె, బెంగళూరు, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో బంగారు నగలను తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి జీఎస్టీని చెల్లించరు. ఈ విషయం అధికారులకు తెలిసినా, నెలవారీ మామూళ్లతో మిన్నకుండిపోతున్నారు. చిన్నస్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి నెలా ముట్టజెప్తున్నామని వ్యాపారులే చెప్తున్నారు. ఇలా వ్యాపారులు పెద్ద మొత్తంలో జీఎస్టీని ఎగ్గొట్టి ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు.రెవెన్యూ విషయాలు బయటకు చెప్పకూడదుజీఎస్టీకి సంబంధించిన లక్ష్యాలు, సాధించిన అంశాలను బయటకు చెప్పకూడదు. ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి సారించాం. రిటర్న్స్ను ప్రతి ఒక్కరూ దాఖలు చేయాల్సి ఉంది. అలా వ్యవహరించకపోతే చర్యలు చేపడతాం. తనిఖీల్లో బయటపడితే చర్యలు చేపడతాం.– రవీంద్రనాథ్రెడ్డి, జీఎస్టీ ఉప కమిషనర్ -
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
● డీఈఓ కార్యాలయ ముట్టడి నెల్లూరు (టౌన్): సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో జరిగిన అవకతవకలకు రివైజ్డ్ చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ను తప్పుల తడకగా నిర్వహించారని, క్లస్టర్ వేకెన్సీలకు ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కు వ పాయింట్లు వచ్చిన వారికి ఇచ్చారని చెప్పారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులు జనరల్ ఆప్షన్లు పెట్టినా ప్లేసులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. బాలికోన్నత పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను కేటాయించడం లాంటి పొరబాట్లు జరిగాయన్నారు. ఈ రీతిలో విఫలమైన వెబ్ కౌన్సెలింగ్ను ఎస్జీటీలపై బలవంతంగా రుద్ద డం దుర్మార్గపు చర్యన్నారు. ఇప్పటికై నా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఎస్జీటీలకు మాన్యు వల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సురేంద్రరెడ్డి, చలపతిశర్మ, అనిల్, నర సింహులు, హజరత్, కృష్ణారెడ్డి, మధుసూదనరావు, శివశంకర్రెడ్డి, ప్రసాద్, శ్రీనివాసులు, పద్మజ, మస్తాన్, మునీంద్ర, పిచ్చిబాబు, రాజగోపాలాచారి, శేషులు, దశరథరాము లు, అజయ్బాబు, డేవిడ్, సుబ్రహ్మణ్యం, సురేష్, సుజాత, రవి, రమేష్, నవకోటేశ్వరరావు, రియాజ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
రాడ్డు బెండింగ్ చేస్తుండగా..
● ఇనుప చువ్వ గుచ్చుకుని వ్యక్తికి తీవ్రగాయాలు సీతారామపురం: సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో భారతమాల ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఆదివారం రాడ్డు బెండింగ్ పనులు చేస్తున్న పశ్చిమ బెంగాల్కు చెందిన రాజు మండల్ అనే వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న రాజు మండేల్ రాడ్డు బెండింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ ఇనుప చువ్వ రాజు కంటి పక్కన గుచ్చుకుంది. ఇది లోతుగా దిగడంతో ముక్కు నుంచి రక్తస్రావం అధికమైంది. సహచర కార్మికులు క్షతగాత్రుడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యుత్షాక్కు గురైన విద్యార్థి మృతి నెల్లూరు(క్రైమ్): విద్యుత్షాక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందారు. పోలీసుల సమాచారం మేరకు.. విడవలూరుకు చెందిన ఎం.వెంకటరమణయ్య, పార్వతి దంపతుల చిన్న కుమారుడు హనీష్కార్తీక్(17) నెల్లూరు వెంకటేశ్వరపురం ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఉడ్కాంప్లెక్స్లోని ఓ ఇంటీరియర్ ఫ్యాక్టరీలో వెల్డర్ విభాగంలో అప్రెంటీస్గా చేస్తున్నారు. గతనెల 30వ తేదీన వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్షాక్కు గురయ్యారు. ఫ్యాక్టరీలోని వారు అతన్ని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హనీష్కార్తీక్కు బ్రెయిన్ డెడ్ అయిందని, బతకడం కష్టమని ఈనెల 4వ తేదీన వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే బతికే అవకాశం ఏదైనా ఉంటుందేమోనని అదేరోజు నెల్లూరు జీజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. మృతుని తండ్రి వెంకటరమణయ్య ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి మృతి సంగం: సంగంలోని ఎర్ర చెరువు సమీపంలో శనివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో గాయపడిన ఇద్దరిలో ఒకరు ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెన్నవరప్పాడుకు చెందిన ముత్యాలకోటయ్య (60) మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. చెన్నవరప్పాడు సర్పంచ్గా కోటయ్య గతంలో చేశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. కండలేరులో 38.687 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 38.687 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఇన్చార్జి ఈఈ రామచంద్రమూర్తి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,360, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. వ్యక్తి మృతిపై కేసు నమోదు ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై వాశిలి సమీపంలో గత నెల 26న రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జిలానీ తెలిపారు. వారి వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం కుప్పురుపాడుకు చెందిన రాగయ్య (51) నెల్లూరు–ముంబై రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందడంతో కేసు నమోదు చేసి ఢీకొన్న వాహనాన్ని గుర్తించనున్నట్లు ఎస్సై వివరించారు. -
భూవివాదంలో మహిళకు గాయాలు
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నరసాపురంలో 2.50 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఘర్షణ ఏర్పడి ఓ మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు వివరాల మేరకు.. అల్లంపాటి మాధవరెడ్డి, పల్లవి దంపతులకు వారి పెద్దల నుంచి భూమి వచ్చింది. అందులో తమకు 30 సెంట్లు రావాలని వారి దూరపు బంధువులు అంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సోమ్లానాయక్ గత బుధవారం రెవెన్యూ కోర్టు నిర్వహించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి రెవెన్యూ కోర్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి దంపతులకు తెలియకుండా వారి బంధువులు ఆదివారం జేసీబీ సాయంతో 30 సెంట్లలో జామాయిల్ చెట్లు తొలగించి ఫెన్సింగ్ వేశారు. విషయం తెలుసుకుని సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన మాధవరెడ్డి కుటుంబీకులపై వారు దాడికి పాల్పడ్డారు. ఇందులో పల్లవికి గాయాలయ్యాయి. -
సహజ ఎరువులతో ఆరోగ్యం
కొడవలూరు: సహజ సిద్ధమైన ఎరువులను వినియోగించి పంటలను సాగు చేయడం ద్వారా భూమి ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యకర ఉత్పత్తులు ప్రజలకు అందుతాయని భారతీయ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డీవీకే నాగేశ్వరరావు సూచించారు. మండలంలోని రామన్నపాళెంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు విచ్చేసి, మాట్లాడారు. భూసార పరీక్షలు తప్పనిసరని, ప్రతి రైతు గుర్తించుకోవాలన్నారు. తద్వారా భూమి ఆరోగ్యం తెలుసుకుని ఎరువులు వినియోగించుకోవచ్చన్నారు. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల శాస్త్ర విభాగం శాస్త్రవేత్త పి.మధుసూదన్ మాట్లాడుతూ మొక్కల్లో రోగ లక్షణాలను గుర్తించి తగిన మందులను మోతాదు మేరకు ఉదయం, సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలన్నారు. తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కేవీకే శాస్త్రవేత్త కె.కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ జీవన ఎరువులు వాడుకుని రసాయన ఎరువులను 25 శాతం వరకు తగ్గించుకోవాలని చెప్పారు. ఏఓ లక్ష్మి మాట్లాడుతూ నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిలకలు సకాలంలో వచ్చి దిగుబడి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వీఏఏ ఆర్.నిహారిక, రైతులు పాల్గొన్నారు. భారతీయ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త నాగేశ్వరరావు -
యోగా ర్యాలీలు నేడు
నెల్లూరు రూరల్: జిల్లాలో యోగా ర్యాలీలను సోమవారం నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. యోగాంధ్ర ర్యాలీ నిర్వహణపై జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆదివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కు వద్ద జిల్లా స్థాయి ర్యాలీని ఉదయం 7.30కు నిర్వహించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ఉదయగిరిలో మెగా యోగాంధ్ర కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఓపెన్ చెస్ టోర్నీ ప్రారంభం నెల్లూరు(స్టోన్హౌస్పేట): మినీబైపాస్లోని నక్షత్ర స్కూల్లో ఆలిండియా ఓపెన్ చెస్ పోటీలను ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, ఎస్వీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 234 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ క్రీడాకారులు 66 మంది ఉన్నారు. ఆరు రౌండ్లకు గానూ ప్రణవ్, శైలేష్, పవన్తేజ, రామకృష్ణ ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఫిడే మాస్టర్లు ప్రణవ్, మహేశ్వర్, నక్షత్ర స్కూల్ డైరెక్టర్ గాదిరాజు జీవన్కృష్ణ, చెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్, స్కూల్ డైరెక్టర్ సంధ్యారెడ్డి, నిర్వాహకులు వంశీ, సుధాశ్రీ, ఆర్బిటర్లు గోపీనాథ్, రామ్లక్ష్మణ్ పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షలకు 92 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): డీఎస్సీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 92 మంది అభ్యర్థులు ఆదివారం గైర్హాజరయ్యారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1252 మందికి గానూ 1160 మంది హాజరయ్యారు. -
కాకాణిపై ఆగని కక్షసాధింపు
నిర్దోషిగా బయటకొస్తారు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, అక్రమాలను నిత్యం ఎండగడుతున్నారనే అక్కసుతో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని కూటమి పెద్దలు టార్గెట్ చేశారు. ఆయన్ను కట్టడి చేయాలనే లక్ష్యంతో తప్పుడు కేసులకు తెరలేపారు. పేపర్ కటింగ్లను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారనే కారణం మొదలుకొని అక్రమ మైనింగ్, అట్రాసిటీ అంటూ ఏడు కేసులు బనాయించారు. అక్రమ మైనింగ్ కేసులో జైలుకు పంపారు. పాత కేసులను తిరగదోడి ఆయనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా, అందులో ఇరికించే కుట్ర జరుగుతోంది. తాజాగా మరో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసులతో కాకాణిని ముప్పతిప్పలు పెట్టడంతో పాటు ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో తలమునకలు రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో కొందరు పోలీసులు తలమునకలై ఉన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఫిర్యాదు అందడమే తరువాయిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరుతో ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కేసులు, అరెస్టులతో భయపడే ప్రసక్తేలేదని పార్టీ శ్రేణులు ఇప్పటికే తేల్చిచెప్పాయి. ప్రశ్నలతో వేధించి పైశాచికానందం జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డిని కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి పోలీసులు ఈ నెల ఆరున తీసుకున్నారు. విచారణలో రకరకాల ప్రశ్నలతో వేధించారు. కేసుల పరంపర ● గుంటూరు జిల్లాలోని తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గతేడాదిలో ప్రెస్మీట్ పెడితే ఆ వార్తను సాక్షి ప్రచురించింది. పేపర్ కటింగ్ను తన వాట్సాప్ గ్రూపులో ఫార్వార్డ్ చేశారనే నెపంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. ● వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్మీట్ పెడితే, ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారని మరో కేసుకు తెరలేపారు. ● స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టు పెట్టారంటూ ముత్తుకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించారు ● భవన నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలపడమే అపరాధంగా దర్గామిట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ● వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వీరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్త వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ● కావలి నియోజకవర్గం బోగోలు మండలం కోళ్లదిన్నెలో పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. గాయపడిన వారిని పరామర్శించి.. పోలీసుల తీరును ఎండగట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమకు బాధ కలిగించాయని టీడీపీ కార్యకర్తల కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ● పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్కు సహకరించారంటూ పొదలకూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. అనంతరం నాన్బెయిలబుల్ సెక్షన్లు జోడించి అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు.తెరపైకి మరో నాలుగు.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన కుటుంబసభ్యులను హేళన చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కాకాణి గోవర్ధన్రెడ్డి మరికొందరితో కలిసి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో దుష్ప్రచారాలు, వ్యంగ్య చిత్రాలను పోస్ట్ చేస్తున్నారంటూ శాసనసభ్యుడి ముఖ్య అనుచరుడు మేకల సురేంద్ర మంగళగిరిలోని సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై కేసు నమోదైంది. తాజాగా కోర్టు అనుమతితో నేడో, రేపో ఆయన్ను విచారించనున్నారు. సర్వేపల్లిలో గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారంటూ వెంకటాచలం పోలీసులు కాకాణితో పాటు వెంకటశేషయ్య, నిరంజన్రెడ్డిపై కేసును రెండు రోజుల క్రితం నమోదు చేశారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ను పెట్టి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిపై ముత్తుకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గత ఎన్నికల సందర్భంగా విరువూరు వద్ద మద్యం దొరకగా, అప్పట్లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీ ట్ను సైతం దాఖలు చేశారు. ఆ కేసును తిరగదోడి కాకాణి గోవర్ధన్రెడ్డి, సురేష్ పేర్లను చేర్చారు. ఇప్పటికే ఏడు అక్రమ కేసులు తాజాగా మరో నాలుగు వెలుగులోకి పరాకాష్టకు కూటమి వేధింపులు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రెడ్బుక్ రాజ్యాంగంతో విధ్వంసం సృష్టించడం, అక్రమ అరెస్టులకు తెగబడటమే లక్ష్యంగా సర్కార్ చెలరేగిపోతోంది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి.. తమ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతల గొంతుకులను నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ వికటాట్టహాసం చేస్తోంది. జిల్లాలో ఈ తరహా చర్యలు పరాకాష్టకు చేరాయి. నెల్లూరు(స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషి గా బయటకొస్తారని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పేర్కొన్నారు. డైకస్ రోడ్డులోని కాకాణి నివాసంలో ఆయన కుమార్తె పూజితను మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డితో కలిసి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురిచేసే పనులు చేయడం సబబు కాదని హితవు పలికారు. సుపరిపాలన అందించకుండా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి.. వారి అభివృద్ధి కోసం కృషి చేసిన కాకాణికి ఏమీ కాదని, కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. -
మరొకరికి కరోనా పాజిటివ్
● ఎనిమిదికి చేరిన కేసుల సంఖ్య నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఆదివారం నిర్వహించిన పరీక్షలో మరొకరికి కరోనా నిర్ధారణైంది. వనంతోపు సెంటర్కు చెందిన 61 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అనుమానమొచ్చిన డాక్టర్లు అదే ఆస్పత్రిలో పరీక్ష చేయగా, కరోనాగా కన్ఫర్మైంది. స్వల్ప లక్షణాలుండటంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎనిమిది కేసులు నమోదు కాగా, అందులో నగరంలోనే ఐదు ఉన్నాయి. కాగా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులను ధరించాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. గురుపరంపరతోనే సనాతన ధర్మ పరిరక్షణ నెల్లూరు(బృందావనం): ప్రపంచంలోనే భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైందని, దీన్ని కొనసాగించేందుకు గురుపరంపర ఎంతో ముఖ్యమని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అల్లీపురంలో విఘ్నేశ్వరాలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన మూలాపేటలోని శంకరమఠంలో బస చేశారు. మఠం ప్రాంగణంలోని కామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి హారతులిచ్చారు. భక్తులకు మంగళశాసనాలను అందజేసిన అనంతరం తిరుపతి పయనమయ్యారు. ఆశ వర్కర్లకు పనిభారం తగ్గించాలి నెల్లూరు(వీఆర్సీసెంటర్): పేదలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లతో సంబంధంలేని ఇతర పనులు చేయించకూడదని, వీరికి పనిభారాన్ని తగ్గించాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆమె మాట్లాడారు. వీరికి కనీస వేతనం అందడంలేదని, ఉద్యోగ భద్రత లేదని ఆరోపించారు. అనేక యాప్లను ఇచ్చి.. ఎలాంటి శిక్షణ నిర్వహించకుండానే పనిభారాన్ని పెంచుతున్నారని చెప్పారు. విజయలక్ష్మి, శిరీషా తదితరులు పాల్గొన్నారు. గరుడవాహనంపై లక్ష్మీనృసింహుడి విహారం రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి చందనాలంకారంలో ఆదివారం దర్శనమిచ్చారు. శ్రీవారి జన్మనరక్షత్రం స్వాతిని పురస్కరించుకొని అభిషేకం, పుష్పాలంకారం, శాంతి హోమం, కల్యాణాన్ని నిర్వహించారు. బంగారు గరుడవాహనంపై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కోన మాడవీధుల్లో ఊరేగించారు. -
భక్తిశ్రద్ధలతో ప్రదోషకాల పూజలు
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో నందీశ్వరుడు, మూలస్థానేశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం, అమ్మవారికి అర్చనలను ఆదివారం నిర్వహించారు. చిన్న వెండి నందివాహనంపై ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. ● నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గల మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో నందీశ్వరుడు, సుందరేశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకాలను నిర్వహించారు. ఈఓ కోవూరు జనార్దన్రెడ్డి పర్యవేక్షించారు. -
CBSE
ఇవీ నిబంధనలు.. సీబీఎస్ఈ పాఠశాలల ఏర్పాటుకు గానూ తొలుత జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంటారు. ఎంఈఓ లేదా డిప్యూటీ డీఈఓ వెళ్లి పరిశీలించాకే గుర్తింపును జారీ చేస్తారు. పాఠశాలల నిర్వహణ, సిలబస్, పరీక్షలు మా పరిధిలో ఉండవు. వీటిని బోర్డు అధికారులే చూసుకుంటారు. – బాలాజీరావు, డీఈఓ సీబీఎస్ఈ సిలబస్కు డిమాండ్ ఉంది. ప్రస్తుత పోటీ పరీక్షల్లో ఈ విద్యార్థులే ఎక్కువగా రాణిస్తున్నారు. వీరిలో సృజనాత్మకతా ఎక్కువగా ఉంటుంది. బట్టీ విధానం ఉండదు. ఈ విద్యార్థులకు అన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది. – గిరి, ప్రిన్సిపల్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల జిల్లాలోని కార్పొరేట్ విద్యాసంస్థలు రూటు మార్చాయి. ఇప్పటి వరకు స్టేట్ సిలబస్పై దృష్టి సారించిన వీరి కళ్లు.. తాజాగా సీబీఎస్ఈపై పడ్డాయి. ఐఐటీ, నీట్, సివిల్స్ తదితర పోటీ పరీక్షల్లో ఈ విధానం ద్వారా విద్యనభ్యసించిన వారే ర్యాంకులను సాధిస్తున్నారనే ప్రచారం జోరందుకున్న తరుణంలో దీనిపై మక్కువ నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా ఖర్చు ఎంతైనా తమ పిల్లలను ఇక్కడే చదివించేందుకు తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు సీబీఎస్ఈ స్కూళ్లు ఏర్పాటు చేసి చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. ●ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది సీబీఎస్ఈ సిలబస్పైనే ఫోకస్ పెడుతున్నారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఈ విధానమే ప్రధానం. ఫ్యాకల్టీ, బోధనపై ఆరాతీశాకే పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించాలి. దీన్ని చదివిన పిల్లలకే భవిష్యత్తులో ఉన్నతావకాశాలు ఉంటున్నాయి. – సుబ్రహ్మణ్యం, విశ్రాంత ప్రిన్సిపల్, వీఆర్సీ జిల్లాలో ఇలా.. స్కూళ్లు – 25కుపైగా విద్యార్థులు – దాదాపు 25 వేలు ఫీజులు – రూ.40 వేల నుంచి రూ.రెండు లక్షలు ● సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పాఠశాలల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతుంది. వీటి ఏర్పాటుకు తొలుత జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● కిండర్ గార్డెన్ నుంచి ప్లస్ టూ వరకు లేదా కిండర్ గార్డెన్ నుంచి పదో తరగతి వరకు బోధనకు దరఖాస్తు చేసుకోవాలి. ● పాఠశాలకు రెండెకరాల స్థలం తప్పక ఉండాలి. ఒకే కాంపౌండ్లో ఈ స్థలం ఉందనే అంశమై రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. విశాల మైదానం, గాలి, వెలుతురొచ్చేలా తరగతి గదులు, శానిటరీ, ఫైర్, స్ట్రక్చరల్ సౌండ్లెస్ తదితర సర్టిఫికెట్లను విధిగా పొందాలి. ● క్వాలిఫైడ్ టీచర్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ ల్యాబ్లు తప్పనిసరి. ఎంఈఓ లేదా డిప్యూటీ డీఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని పత్రాలున్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశాకే గుర్తింపును జారీ చేస్తారు. ● రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఎన్ఓసీ వచ్చాక మూడు నెలలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గానూ లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలను చలానా రూపంలో బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. తదనంతరం బోర్డు సభ్యులు వచ్చి తనిఖీలు నిర్వహించి అనుమతులను మంజూరు చేస్తారు. అంతా డొల్ల.. జిల్లాలో నాలుగైదు మినహా మిగిలిన సీబీఎస్ఈ పాఠశాలలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. రెండెకరాల స్థలం ఏ స్కూల్కూ లేదు. అపార్ట్మెంట్లలో వీటిని నిర్వహిస్తున్న పరిస్థితీ ఉంది. రిజిస్టర్లో మాత్రమే క్వాలిఫైడ్ టీచర్ల పేర్లుంటాయి. వాస్తవానికి ఇంటర్, డిగ్రీ, పీజీ అధ్యాపకులే ఉంటారు. బీఈడీ, ప్లస్ – 2కు ఎంఈడీ చేసిన అధ్యాపకులు ఉండాలనే నిబంధన ఉన్నా, ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. సరైన గాలి, వెలుతురు ఇలాంటివన్నీ మిథ్యే. తనిఖీల నిమిత్తం అధికారులొచ్చిన సమయంలో వారికి రూ.ఐదారు లక్షలను ముట్టజెప్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో అన్నీ సక్రమంగానే ఉన్నాయనే నివేదికను తయారు చేసి గుర్తింపును జారీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తనిఖీలేవీ..? సీబీఎస్ఈ పాఠశాలలను తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. వీటిని తనిఖీ చేసే అధికారం జిల్లా విద్యాశాఖ అధికారులకు లేదు. సెంట్రల్ బోర్డుకు ఫిర్యాదొస్తే తప్ప, వీటివైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. రెండేళ్లకో.. మూడేళ్లకోసారి వచ్చి ముడుపులు పుచ్చుకొని వెళ్తున్నారని సమాచారం. పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడింతే పాట అన్న చందంగా పరిస్థితి మారింది. జిల్లాలోని 25కుపైగా సీబీఎస్ఈ పాఠశాలల్లో కిండర్ గార్డెన్ నుంచి ప్లస్ – 2 వరకు 25 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. డిమాండ్ పెరగడంతో ఫీజును ఆమాంతంగా పెంచేశారు. పాఠశాలను బట్టి రూ.40 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారం తదితరాలకు అదనంగా గుంజుతున్నారు. కొన్ని పాఠశాలల్లో ఎన్సీఈఆర్టీ నుంచి వచ్చిన పుస్తకాలతో పాటు సొంత మెటీరియల్ను రూపొందించి అంటగడుతున్నారు. ఏటా 10 నుంచి 20 శాతం వరకు ఫీజులను అదనంగా వసూలు చేస్తున్నారు. ● ఇప్పుడు క్రేజంతా సీబీఎస్ఈపైనే ● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్కూళ్లు ● నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ ● ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు ● క్వాలిఫైడ్ ఫ్యాకల్టీలకు కరువు రూటు మార్చిన కార్పొరేటు నెల్లూరు(టౌన్): తల్లిదండ్రుల ఆశలు.. కొన్ని సీబీఎస్ఈ పాఠశాలల యాజమాన్యాలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండానే వీటిని నిర్వహిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. జిల్లాలో గతంలో ఈ స్కూళ్ల సంఖ్య అతి స్వల్పం. అయితే ప్రస్తుతం 25 పాఠశాలలను నిర్వహిస్తున్నారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీజులూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇదేమి ఫీజులు బాబోయ్.. -
ఏపీఈఏపీ సెట్లో ఉత్తమ ప్రతిభ
సాఫ్ట్వేర్లో స్థిరపడాలనేదే లక్ష్యం ● కందుకూరు విద్యార్థికి పదో ర్యాంక్నెల్లూరు (టౌన్): ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ (ఏపీఈఏపీ) సెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. గత నెల 19 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగంలో జిల్లాలో 8913 మంది దరఖాస్తు చేసుకోగా, 8558 మంది పరీక్షలకు హాజరయ్యా రు. వీరిలో 5993 మంది అర్హత సాధించా రు. అగ్రికల్చర్, పార్మసీ విభాగంలో 2647 మంది దరఖాస్తు చేసుకోగా, 2448 మంది పరీక్ష కు హాజరయ్యారు. 2263 మంది అర్హత సాధించా రు. ఇంజినీరింగ్ విభాగంలో కందుకూరుకు చెందిన బద్రిరాజు వెంకటమణిప్రీతమ్ 92.43 శా తం మార్కులతో రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచా రు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాప్ టెన్లో జిల్లాకు చెందిన ఒకరూ ర్యాంక్ను సాధించలేదు. కందుకూరులో నివాసం ఉంటున్న బద్రిరాజు వెంకట మణిప్రీతమ్ తండ్రి నారాయణమూర్తి, తల్లి రజిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఏపీఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ విభాగంలో 92.43 శాతం మార్కులను ప్రీతమ్ సాధించి రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంక్ను దక్కించుకున్నారు. జేఈఈ మెయిన్స్లో జాతీయస్థాయిలో 129.. జేఈఈ అడ్వాన్స్డ్లో 234వ ర్యాంక్ను సాధించారు. ఉత్తమ ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్లో స్థిరపడాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ● -
AP: ‘టీచర్లను ఎలా మోసం చేశారంటే...’
నెల్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కరా్ ప్రహాసనంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయలోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కు రెడ్బుక్పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వన్నంగా మారిందని ధ్వజమెత్తారు. తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మ్యానువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 48 గంటల్లో ఆన్లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ, ఒక్కో టీచర్ 2500 ఆప్షన్స్ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్ట్రంలో 1.20 లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్ఎం పదోన్నతులు లేకుండా చేశారు. మరోవైపు 48 గంటల్లో ఒక్కో టీచర్ 2500 ఆన్లైన్ బదిలీ అప్షన్స్ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.టీచర్లను ఎలా మోసం చేశారంటే...టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్లు పెట్టి మ్యానువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేస్తానని చెప్పి నమ్మించారు. తరువాత అసెంబ్లీలో మాత్రం మ్యాన్వల్కు బదులు ఆన్లైన్ కౌన్సెలింగ్ చేస్తామని చట్టం తీసుకువచ్చారు. దీనిపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు చట్టంలో ఉన్న దానిని పక్కకుపెట్టి మ్యాన్వల్ బదిలీలనే చేస్తామని హామీ ఇచ్చారు. గత మే నెలలో ఆన్లైన్ బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండటంతో డీఈఓ కార్యాలయాల ముందు మే 25న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనితో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీచర్ యూనియన్లతో ఒక మీటింగ్ పెట్టి చట్టప్రకారం ఆన్లైన్ బదిలీలు ఉన్నా కూడా, దానిని పక్కకు పెట్టి మ్యానువల్ బదిలీలే చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్ యూనియన్లు ఆందోళనను విరమించుకున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం మే 25న బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీఓ 22లో ఖచ్చితంగా ఆన్లైన్ బదిలీలే చేస్తామని స్పష్టం చేసింది. ఇంతకంటే మోసం ఎక్కడైనా ఉంటుందా? దీనిపై టీచర్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పొరపాటుగా ఆ జీఓ జారీ చేశామని, మ్యానువల్ బదిలీలే చేస్తామంటూ టీచర్ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు హటాత్తుగా బదిలీలపై తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా పదేపదే టీచర్లను నమ్మించి, నిలువుగా దగా చేస్తూనే ఉన్నారు.బదిలీల ప్రక్రియ అస్తవ్యస్తంగత ప్రభుత్వం జారీ చేసిన 117 జీఓను రద్దు చేసి, కూటమి ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూల్స్ను తీసుకువచ్చింది. బదిలీల కోసం వెబ్ అప్షన్స్లో ఫౌండేషన్, బేసిక్, మెడల్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అనే నాలుగు ఆప్షన్స్ కనిపించాల్సి ఉంది. కానీ కేవలం ఎంపీపీ, యుపీ స్కూల్స్ అని మాత్రమే పెట్టారు. దీనితో టీచర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాము ఆప్షన్ ఇచ్చే స్కూల్ ఏ కేటగిరిలోకి మార్పు చెందిందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రేపు సాయంత్రంతో వెబ్ అప్షన్స్ గడువు ముగుస్తోంది. తొమ్మిదిరకాల స్కూల్స్గా మార్చిన నేపథ్యంలో కొన్ని మండలాల్లో బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా పెడితే, మరికొన్ని మండలాల్లో ఫౌండేషన్ స్కూల్స్ను ఎక్కువగా పెట్టారు. ఎక్కడా హేతుబద్దత అనేది లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు చెప్పినట్లుగా స్కూల్స్ కేటగిరిని మార్చారు. ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓలతో సంబంధం లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ఏ స్కూల్ ఏ కేటగిరిలో ఉండాలని నిర్ణయించకుండా, టీడీపీ నాయకులు సూచించినట్లుగా స్కూల్స్ను మార్చేశారు. టీచర్లు ఎన్ని సంవత్సరాలు, ఎంత దూరంలో పనిచేశారనే దానిపై పాయింట్స్ ఇస్తారు. దాని ప్రకారమే బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ పాయింట్స్ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని చూపి టీచర్లను భయపెట్టాలని అనుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్ళతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. ఎనిమిది అకడమిక్ ఇయర్స్ పూర్తయితే బదిలీ చేస్తామనే నిబంధనలు ఉంటే, ఎనిమిది క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదంటూ సాకులు చూపి పాయింట్స్ ఇవ్వడం లేదు. అలాగే దాదాపు 4000 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మారిపోయారు. వారిని నిబంధనలకు విరుద్దంగా ప్రైమరీ స్కూల్కు కేటాయిస్తున్నారు. ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉన్న స్కూల్ అసిస్టెంట్ను కూడా పీఎస్ హెచ్ఎంగా మోడల్ స్కూల్స్కు పంపడం దారుణం. దీనివల్ల ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం పదోన్నతి రాకుండా పోయింది.పదో తరగతి మూల్యాంకనంతో పరువు పోయిందిమంత్రి నారా లోకేష్ అసమర్థత కారణంగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చూసిన నిర్లక్ష్యంతో విద్యాశాఖ పరువు పోయింది. పదోతరగతి పరీక్షలు విద్యార్ధుల భవిష్యత్తుకు తొలి మెట్టు. అటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగాయో అందరికీ తెలుసు. నెల్లూరుకు చెందిన విద్యార్థిని సాయి కుందనకి అన్ని సబ్జెక్ట్ల్లో తొంబైకి పైగా మార్కులు వస్తే, హిందీ సబ్జెక్ట్లో 34 మార్కులు వచ్చాయి, బాలికను ఫెయిల్ చేశారు. ఆమె రీవాల్యుయేషన్ పెట్టకుంటే 90 మార్కులు వచ్చాయి. నెల రోజుల పాటు ఆ విద్యార్ధి ఎంత వేదన చెంది ఉంటారో అర్థం చేసుకోవాలి. బొర్రా శిశింద్రారెడ్డికి గణితంలో 32 మార్కులు వేశారు. అన్నింటిలో మంచి మార్కులు వచ్చిన ఈ విద్యార్ధి తిరిగి రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 72 మార్కులు వేశారు. దీనిపైన మళ్ళీ రీకౌంటింగ్ చేయించుకుంటే 78 మార్కులు వచ్చాయి. ప్రొద్దుటూరుకు చెందిన గంగిరెడ్డి మోక్షితను సోషల్ లో 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవాల్యుయేషన్లో 84 మార్కులు వచ్చాయి. ఇలా అనేక మంది విద్యార్ధుల జవాబుపత్రాలను తీసుకువస్తే, ఎంత దారుణంగా వాల్యుయేషన్ చేశారో అర్థమవుతుంది. ఒక సబ్జెక్ట్ను దిద్దడానికి పదిరోజులు సమయం ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆరు రోజుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు’ అని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
వ్యక్తిగత పూచీకత్తుపై నిరంజన్రెడ్డి విడుదల
నెల్లూరు (లీగల్): గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో అభియోగం ఎదుర్కొంటున్న నిరంజన్రెడ్డి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2021లో అప్పటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకం ఫోర్జరీ చేసి సర్వేపల్లి జలాశయం నుంచి గ్రావెల్ తరలించారనే ఆరోపణలపై వెంకటాచలం పోలీసుస్టేషన్లో ఉదయ్కుమార్రెడ్డి, శ్రీధర్రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఆ కేసులో వీరి పేర్లు తొలగించి, ఆ స్థానంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోపాటు ఆయన ముఖ్య అనుచరుడైన నిరంజన్రెడ్డి పేర్లను నమోదు చేసిన సిట్ అధికారులు శుక్రవారం బెంగళూరులో ఉన్న నిరంజన్రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం మాగుంటలేఅవుట్లోని సెకండ్ ఏజేఎఫ్ఎంసీ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి పాలమంగళం వినోద్ ఇంటి వద్ద హాజరు పరిచారు. సిట్ తరఫున స్పెషల్ పీపీ, నిరంజన్రెడ్డి తరఫున న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై నిరంజన్రెడ్డిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ముందే రేషన్ దోపిడీ?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జూన్ 1వ తేదీ.. జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద పండగ వాతా వరణం ప్రతిబింబించేలా షామియానాలు, కుర్చీ లు, ఫ్లెక్సీలు, పూల తోరణాలతో డెకరేషన్ చేశా రు. రేషన్ పంపిణీ ప్రక్రియ తమ చేతికే వచ్చిందని డీలర్లు పండగ చేయడం చూస్తే.. ఇక తమ అక్రమ దందాకు అడ్డు తొలగిపోయిందనే సంతోషం వెల్లివెరిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యేలే రేషన్ మాఫియాగా అవతరించారనేది జగద్వితమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ప్రతి రేషన్ దుకాణానికి నూరు శాతం రేషన్ బియ్యం నెలాఖరు రోజుకే చేరేవి. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం 8 గంటలకే ఎంఈయూ వాహనాలు కార్డుదారుల ఇళ్ల ముందుకే వచ్చేవి. ప్రతి కార్డుదారుడు బియ్యం తీసుకెళ్లేవారు. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు, కేసులు నమోదు చేసినట్లు ఎక్కడా లేకపోవడం గమనార్హం. కూటమి అధికారంలోకి వచ్చాక 5వ తేదీ వరకు ఎండీయూ వాహనాలు వచ్చిన పరిస్థితి లేదు. వచ్చినా.. అరకొర మందికి ఇచ్చి మళ్లీ వస్తామంటూ చెప్పుకొచ్చారు. ఒకటి..రెండు నెలలు అయితే వాహనాలే రాని పరిస్థితి ఉంది. ప్రతి నెలా అరకొర మందికే.. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అరకొర మందికే రేషన్ సరుకులు సరఫరా అయ్యాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్నట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ.. వాస్తవానికి ఆ బియ్యం అంతా నేరుగా రైస్ మిల్లులకు వెళ్లాయని కొందరు సివిల్ సప్లయీస్ శాఖాధికారులు అంగీకరించారు. గత రెండు నెలల క్రితం దగదర్తి మండల కేంద్రంలో, కోవూరు సమీపంలో చైన్నె–కోల్కత్తా హైవేలో రెండు లారీల్లో వెళ్తున్న సుమారు 900 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడినా.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆగమేఘాల మీద వదిలేసిన విషయా లు తెలిసిందే. నిజంగా కార్డుదారులకు బియ్యం చేరి ఉంటే.. ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణాకు ఎక్కడ ఆస్కారం ఉంటుందనే ప్రశ్నలకు అధికారులు కానీ, కూటమి నేతలు కానీ, పచ్చ మీడియా సమాధానం చెప్పరు. తాజాగా నెల్లూరు రూరల్ పరిధిలో బియ్యం మాఫియా బరితెగించి దుకాణాల్లో ఉన్న బియ్యాన్ని రాత్రికి రాత్రే తరలించేశారు. జూన్ 1వ తేదీ రేషన్ దుకాణాల దగ్గరే రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటన చేసినా ఇరుకుల పరమేశ్వర్నగర్లో ముందు రోజు రాత్రే దుకాణం తెరిపించి, అర్ధరాత్రి వేళ బియ్యాన్ని అక్రమ రవాణా చేశారు. ఇది స్థానికులు వీడి యో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయినా సంబంధిత దుకాణంలో బియ్యం స్టాక్ తనిఖీ చేయడం కానీ, విచారణ జరపడం కానీ చేయలేదు. 80 శాతంపైనే విదేశాలకు ఎగుమతి జిల్లాలో ఉన్న 7.22 లక్షల రేషన్ కార్డులకు నెలకు సుమారు 10,923 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో 15 నుంచి 20 శాతం మాత్రమే కార్డుదారులు కొని తీసుకెళ్తున్నారు. మిగిలిన 80–85 శాతం బియ్యం కావలి, నెల్లూరులోని సౌత్రాజుపాళెం, శెట్టిగుంటరోడ్, బుచ్చిరెడ్డిపాళెం–రాజుపాళెం రహదారిలో ఉన్న రైస్ మిల్లు, పోతిరెడ్డిపాళెం, అల్లీపురం, నెల్లూరు రూరల్ పరిధిలోని గుడిపల్లిపాడు, చెముడుగుంట, కందుకూరు నియోజకవర్గంలోని పెదపవనిలో ఉన్న రైస్మిల్లులకు చేర్చి పాలిష్ పట్టించి కృష్ణపట్నం, చైన్నె పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నెలకు రూ.27 కోట్ల రాబడి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు డీలర్లే సూత్రధారులు. కార్డుదారులకు ఇచ్చిన బియ్యాన్ని కేజీకి రూ.10లకు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఒక్కొక్క రేషన్ డీలర్ వద్ద 250 నుంచి 300 బినామీ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు బియ్యం సరఫరా చేసినట్లు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రేషన్ దుకాణం నుంచి 80 – 85 శాతం అంటే దాదాపు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్కు చేరుతోంది. అంటే ప్రతి నెలా సగటున 90 లక్షల కేజీలు అక్రమ రవా ణా జరుగుతుందని అంచనా. తాజాగా బియ్యం మాఫియా ఆయా రేషన్ దుకాణాలకు చేరాల్సిన బియ్యాన్ని నేరుగా రైస్మిల్లులకు తరలిస్తున్నా రు. డీలర్కు కేజీకి రూ.20 లెక్కన ఇస్తున్నారు. మార్కెట్లో కేజీ బియ్యం రూ.60 నుంచి రూ.65ల కు అమ్ముతున్నారు. ఈ లెక్కన రవాణా ఖర్చులు, పాలిష్ తరుగు, సివిల్ సప్లయీస్ అధికారులకు మామూళ్లకు కేజీకి రూ.10 ఖర్చు పోయినా.. కేజీకి నికరంగా రూ.30 మిగులుతోంది. 90 లక్షల కేజీలకు.. కేజీకి రూ.30 లెక్కన దాదాపు రూ.27 కోట్ల మేర మాఫియాకు రాబడి వస్తోంది. మొత్తం రేషన్ షాపులు 1,513 బియ్యం కార్డులు 7.22 లక్షలు నెలకు సరఫరా అయ్యే బియ్యం 10,923 మెట్రిక్ టన్నులు కార్డుదారులకు చేరేది 15-20 శాతమే అక్రమ రవాణా అంచనా 9,000 మెట్రిక్ టన్నులు ఉలవపాడు: రేషన్ షాపుల వ్యవస్థ ప్రారంభమైన వెంటనే అక్రమార్కుల హవా మొదలైంది. మండలంలో ప్రతి రేషన్ షాపునకు 50 బస్తాలు తక్కువగా రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు సమాచారం. మండలంలో 31 రేషన్ షాపులు ఉండగా మూడు షాపులు తప్ప మిగిలిన అన్ని షాపులకు 50 బస్తాలు కోత విధించడంతో.. మొదటి నెలలోనే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని రేషన్ డీలర్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఈ విషయమై తహసీల్దార్ టి.శ్రీనివాసులు వివరణ కోరగా బస్తాలు తగ్గించిన విషయం నాకు తెలియదు, డీలర్లు అధికారులతో మాట్లాడి విచారణ జరిపి తెలుసుకుంటామని తెలిపారు. -
గందరగోళంగా ఉపాధ్యాయుల బదిలీలు
రెండు రోజుల క్రితం కొంత మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్లుగా పదోన్నతులు కల్పించారు. శుక్రవారం రాత్రి అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చారు. అయితే ఈ కౌన్సెలింగ్ శనివారం తెల్లవారుజాము వరకు జరిగింది. ఎస్జీటీలకు పూర్తిగా ఆఫ్లైన్లోనే కౌన్సెలింగ్ ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెబ్ ఆప్షన్లు బాయ్కాట్, డీఈఓ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్జీటీల కౌన్సెలింగ్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. -
రైస్మిల్లులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
● సుమారు 12.5 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి రైస్మిల్లులో పాలిష్ పట్టి.. మేలు రకం బియ్యంగా మార్చిన సుమారు 12.5 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం(500 బస్తాలు)ను శనివారం రాత్రి అధికారులు పట్టుకొన్నారు. ఇదే రైస్మిల్లులో గత నెల 3వ తేదీన 200 బస్తాల రేషన్ బియ్యం పట్టుకోవడం తెలిసిందే. చంద్రశేఖరపురంలోని రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతోందని శనివారం రాత్రి రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో డీటీ సారంగపాణి, వీఆర్వో సురేష్, ఎస్సై కోటిరెడ్డి మిల్లుకు చేరుకున్నారు. నిర్వాహకులు రైస్మిల్లుకు తాళాలు వేసి కొంత సేపు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎస్సై జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు తలుపులు తెరవడంతో అధికారులు లోనికి వెళ్లారు. భారీ ఎత్తున రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యంను, పదుల సంఖ్యలో కూలీలతో ప్లాస్టిక్ సంచుల్లో నింపి లారీకి లోడు చేస్తుండడాన్ని గుర్తించారు. రైస్ మిల్లును లీజుకు తీసుకుని రేషన్ బియ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి రేషన్ బియ్యం గోతాలు మిల్లులో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాదాపు అన్నింటినీ ప్లాస్టిక్ బస్తాల్లో నింపారు. 25 కేజీల బస్తాలు సుమారు 500 బస్తాలు 12.5 మెట్రిక్ టన్నులు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మిల్లులో గింజ ధాన్యం కొని ఆడించిన దాఖలాల్లేవని, ఇక్కడ కేవలం రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాత్రమే జరుగుతోందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రీసైక్లింగ్ చేసి మేలి రకం బియ్యం కింద విక్రయించే వ్యాపారం చేస్తున్న క్రమంలో అన్నీ 25 కిలోల ప్లాస్టిక్ బస్తాల్లో నింపుతున్నారు. మరో వంద బస్తాల దాకా నింపాల్సిన బియ్యం ఉన్నాయని తెలిపారు. తగినంత సిబ్బంది అందుబాటులో లేనందున ఆదివారం బస్తాలన్నింటినీ లెక్కించి కచ్చితంగా నిర్ధారిస్తామన్నారు. పేదల బియ్యంతో భారీగా కాసులు కురిపించుకొంటున్న వ్యాపారులు ఎన్ని పర్యాయాలు పట్టుకొన్నప్పటికీ అక్రమ వ్యాపారాన్ని ఆపడం లేదంటే ఇందుకు జిల్లా స్థాయిలో అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలోనే రేషన్ బియ్యం పట్టుబడితే మిల్లును సీజ్ చేయకపోవడంతోనే తిరిగి ఆ వ్యాపారం చేయడానికి అవకాశం ఏర్పడినట్లు తెలుస్తోంది. -
కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పాలన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కార్మిక వ్యతిరేక పాలనను కూటమి ప్రభుత్వం సాగిస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు ఆరోపించారు. నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, కృష్ణపట్నం పోర్టులో కార్మికులను తొలగించడం మినహా ఎలాంటి పరిశ్రమలను స్థాపించిన దాఖలాల్లేవని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు దాసోహంగా ఉంటూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. సంక్షేమ బోర్డులోని రూ.వెయ్యి కోట్ల నిధులను దారి మళ్లించడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. జూలై తొమ్మిదిన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, అజయ్కుమార్, నగర కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ను అందించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య ఆదేశించారు. విద్యుత్ భవన్లోని స్కాడా కార్యాలయంలో నెల్లూరు రూరల్ డివిజన్ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. లో ఓల్టేజీ ఉన్న ప్రాంతాలను గుర్తించి అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం బుజబుజనెల్లూరు సబ్స్టేషన్ను సందర్శించి.. సరఫరా, రికార్డులను పరిశీలించారు. ఎస్ఈ విజయన్, రూరల్ ఈఈ సోమశేఖర్రెడ్డి, సూర్యఘర్ నోడల్ అధికారి శేషాద్రిబాలచంద్ర, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప
ఆత్మకూరు రూరల్: రంగూన్ కలపను కొట్టేసేందుకు యత్నించిన స్కెచ్ బెడిసికొట్టింది. ‘రంగూన్ కలపను కొల్లగొట్టే ప్లాన్’ అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైన నేపథ్యంలో అధికారుల్లో చలనమొచ్చింది. పట్టణంలోని పాత సమితి కార్యాలయం, ప్రస్తుత పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో ఉన్న పురాతన భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూలగొట్టి అందులోని కలపను మండలంలోని చెర్లోయడవల్లికి చెందిన ఓ టీడీపీ నేత ఇంటికి తరలించిన అంశం బహిర్గతం కావడంతో ఆగమేఘాలపై అధికారులు స్పందించారు. తరలించిన టేకు కలపలో కొంత భాగాన్ని ఎంపీడీఓ కార్యాలయం వద్దకు తరలించారు. అయితే మిగిలిన వాటిని పూర్తిగా రాబట్టడంలేదనే విమర్శలున్నాయి. -
సాంఘిక సంక్షేమ శాఖలో ఫెవికాల్ ఉద్యోగులు
● 14 ఏళ్లుగా ఒకే స్థానంలో తిష్టవేసిన కొందరు ఉద్యోగులు ● బదిలీల ప్రక్రియలో చక్రం తిప్పుతున్న లీడర్లు ● ఎక్కడి వారు అక్కడే ● నిబంధనలు పాటించకుండా తయారు చేసిన బదిలీల ఫైల్ తిరస్కరించిన డీఆర్ఓ నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియలో ఉద్యోగ సంఘాల నేతలు చక్రం తిప్పుతున్నారు. పారదర్శకంగా జరగాల్సిన బదిలీలకు మసిపూసి మారేడు కాయ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను పాటించకుండా ఎక్కడి వారు అక్కడే ఉండేలా, లేదంటే అటూ.. ఇటూ మార్పులతో జాబితాను తయారు చేశారు. దీంతో ఈ ఫైల్ను డీఆర్వో తిరస్కరించారు. దీంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అసంబద్ధ జాబితాతో బదిలీల కోసం వేచి చూస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐదేళ్లు ఒకే స్థానంలో పని చేసిన వారిని కచ్చితంగా అక్కడి నుంచి బదిలీ చేయాల్సి ఉంది. ఇందులో ఒక ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండేవారు, భార్యాభర్తలు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన పిల్లల ఉన్న వారికి ఈ బదిలీల్లో మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ఈ నిబంధనలకు నీళ్లొదిలారు. ఖాళీల జాబితాలను ముందుగా ప్రకటించకుండానే కొందరు ఉమ్మడి జిల్లాలో పనిచేసే ఉద్యోగులు ఈ జిల్లాలో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరు ఈ జిల్లాకు సంబంధించిన వారు కాదని తిరుపతి జిల్లాకు చెందిన వారిని చెప్పుకొచ్చారు. అయితే నెల్లూరు జిల్లాలోనే మరి కొంత మందిని తిరుపతి జిల్లాకు చెందిన వారిని ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బదిలీల జాబితాను డీఆర్ఓ తిరస్కరించారని ఉద్యోగులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో యూనియన్ నాయకులుగా చెలామణి అవుతున్న సుమారు 12 మంది 14 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పని చేస్తున్నప్పటికీ, వారిని మళ్లీ అదే స్థానాల్లో కొనసాగించేలా జాబితాను తయారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల మేరకు ఉద్యోగ సంఘాల్లో పనిచేసే నేతలు 9 ఏళ్ల పాటు ఒకేచోట పనిచేసేలా మినహాయింపు ఉంది. ఆ తర్వాత కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను సైతం పక్కన పెట్టి యూనియన్ నాయకులు వారి బదిలీలతోపాటు వారికి ఇష్ట మొచ్చిన వారికి, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి, బదిలీల కోసం డబ్బులు పెట్టుకునే వారికి అండగా ఉంటూ ఇష్టమొచ్చినట్లు బదిలీలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ జీఓలను పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియను చేస్తుండడం వల్ల ఉమ్మడి జిల్లాలో పురుష ఉద్యోగులతోపాటు మహిళా ఉద్యోగులు సైతం నష్టపోతున్నారు. యూనియన్ నేతలకు ఇష్టమైన వారికి అనుకూలంగా, వ్యతిరేకులు అయితే మరో రకంగా వ్యవహరిస్తూ బదిలీల జాబితా చేయడం, లోకల్ పాయింట్లను పట్టించుకోక పోవడం ఆరోపణలకు తావిస్తోంది. ఇదే సమయంలో బదిలీల ఫైల్ను డీఆర్ఓ తిరస్కరించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్లు అయింది. ఈ నెల 2 నుంచి బదిలీల ప్రక్రియను 9వ తేదీ వరకు పొడిగించడంతో సాంఘిక సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియలో నిబంధనలకు అతీతంగా ఎన్ని లీలలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.. డీఆర్వో వద్ద బీసీ సంక్షేమ శాఖ ఫైలు నా సీటుకు ఢోకా లేదు..!జిల్లా బీసీ సంక్షేమ శాఖకు చెందిన వార్డెన్ల బదిలీలకు సంబంధించిన ఫైలుకు డీఆర్వో వద్ద బ్రేక్ పడింది. యూనియన్ నేతల అండ ఉన్న వారికి కోరిన చోటుకు పోస్టింగ్ ఇచ్చేందుకు ఫైల్ను సిద్ధం చేసుకుని బేరసారాల కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కొంత మేర యూనియన్ నాయకులు చెప్పిన పేర్లకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ ఫైల్ డీఆర్వో వద్ద బ్రేక్ పడడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. తాము ఉన్న చోటే ఉంటామని సంబరపడిన వార్డెన్లు సైతం తమను ఎక్కడికి బదిలీ చేస్తారోనని బెంబేలెత్తుతున్నారు. ఈ నెల తొమ్మిది వరకు బదిలీలకు గడువు ఉండడంతో మౌనంగా ఉన్నారు. మే నెల 31న క్లాస్– 4 ఉద్యోగుల బదిలీలు జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో హడావుడిగా జరిగాయి. అక్కడ కూడా యూనియన్ నేతలు జిల్లా అధికారి చాంబర్లోనే ఉండి మంతనాలు జరిపినట్లు సమాచారం. యూనియన్ నాయకుల బేరసారాలు ఫలితాలిస్తాయా, పారదర్శకంగా బలీలు జరుగుతాయా అనే విషయం కూడా ఈ నెల 9 వరకు వేచి చూడాలి. -
మా బాధలు పట్టించుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగే పేద మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్న 102 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న మాకు అతి తక్కువగా జీతం రూ.7,870 ఇస్తున్నారు. జీతాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్లకు వినతి పత్రాలు ఇచ్చాం. కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశాం. ఇంత వరకు కూటమి ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోలేదు. – సునీల్రెడ్డి, పైలెట్, 102 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు -
క్రమక్రమంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్ వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదల చేయలేదు. జిల్లాలో 132 ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇటీవల నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో కొంత వరకు నిధులు విడుదల చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచారు. అయితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు సేవలందించి తర్వాత ఆరోగ్యశ్రీ పరిధి అయిపోయిందంటూ బయటకు పంపుతున్నారు. గత ఐదేళ్లలో అందిన సేవలు ప్రభుత్వ వైద్యం అంతంత మాత్రమే జిల్లాలో ఒక సర్వజన ఆస్పత్రి, 52 పీహెచ్సీలు, 10 సీహెచ్సీలు, 28 యుపీహెచ్సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ఈ ఆస్పత్రుల్లో పలువురు డాక్టర్లు సమయానికి వచ్చి థంబ్ వేసి వెళ్లిపోతున్నారు. సొంత క్లినిక్ల్లో సేవల్లో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు వైద్యం గగనమవుతోంది. కొన్ని రకాల దగ్గుమందులు, షుగర్కు ఇన్సులిల్ అందుబాటులో ఉండటం లేదు. మరికొన్ని యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులో ఉండడం లేదు. కూటమి ప్రభుత్వంలో రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్కు గండం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న పేద మహిళలను ఉచితంగా భద్రంగా ఇంటి వద్ద వదిలి పెట్టేందుకు 102 (తల్లీ, బిడ్డ ఎక్స్ప్రెస్)ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. పది వాహనాలను ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేసింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ముగ్గురు, నలుగురు కాన్పులు అయ్యేదాక ఉండి అందరినీ ఒకే వ్యానులో ఎక్కించుకుని పైలట్ వెళ్లేవారు. అయితే పేద రోగుల ఇబ్బందులు తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక జిల్లాలో అప్పటి వరకు ఉన్న 10 వాహనాలను 19కి పెంచారు. తల్లి,బిడ్డ, మరో కుటుంబ సభ్యుడిని తీసుకుని ఇంటి దగ్గర క్షేమంగా వదిలి వచ్చేలా ఏర్పాటు చేశారు. పెద్దాస్పత్రిలో రోజుకు 14 నుంచి 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మూడు నెలలుగా ఏజెన్సీకి నిధులివ్వకపోవడంతో ఆ వాహనాలు ఆపేశారు. జిల్లాలో తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్లు 19 ఉండగా కేవలం 13 మంది పైలట్లు మాత్రమే ఉన్నారు. 108 వాహనాలు.. ఆప సోపాలు చంద్రబాబు కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20 వాహనాలు మాత్రమే ఉండేవి. వాటిలో కూడా 7 వాహనాలు ఎప్పుడూ రిపేర్లకు గురవుతూ ఉండేవి. టైర్లు అరిగి పోయి ఏక్షణాన పేలిపోతాయో అనే పరిస్థితి ఉండేది. అయితే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాత వాహనాల స్థానంలో కొత్తవాహనాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున జిల్లాలో 38 వాహనాలు ఏర్పాటు చేశారు. వారికి ఏజెన్సీ ద్వారా సకాలంలో జీతాలు వచ్చేవి. అయితే చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాక వారికి కష్టాలు తప్పడం లేదు. గత రెండు నెలలుగా జీతాలు రాలేదు. అప్పులతో గడుపుతున్నారు. -
నీకు భర్త లేడని రుజువేది?
వెంకటాచలం: భర్త లేని ఒంటరి మహిళకు ఏడేళ్లుగా సామాజిక భద్రత పింఛన్ను ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఆమైపె కక్ష గట్టిన టీడీపీ నేతలు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి జూన్ నెల నుంచి పింఛన్ ఆపేశారు. నీకు భర్త లేడని రుజువేదని, సర్టిఫికెట్ తెచ్చి ఇస్తే పింఛన్ ఇస్తామంటూ సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని వెంకటాచలానికి చెందిన గిరిజనురాలు దాసరి రాధ ఆవేదన వ్యక్తం చేసింది. ఒంటరి మహిళ అయిన తనకు చాలా ఏళ్ల నుంచి పింఛన్ వస్తుండగా, ఆ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. జూన్ నెల పింఛన్ ఇవ్వకపోవడంతో గ్రామ సచివాలయం వద్దకు వెళ్లగా సర్టిఫికెట్ తీసుకు వస్తేనే పింఛన్ ఇస్తామని, లేదంటే టీడీపీ నేతలను కలిసి వారితో చెప్పించాలని చెప్పారని పేర్కొంది. స్థానిక టీడీపీ నాయకులు కొందరు రాజకీయ కక్షతోనే తనకు పింఛన్ ఇవ్వకుండా సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చి నిలిపివేయించారని ఆరోపించింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు పింఛన్ నగదు ఇప్పించాలని కోరుతోంది. ఈ విషయంపై ఎంపీడీఓ కల్పనతో సంప్రదించగా, తన దృష్టికి ఈ విషయం రాలేదని, విచారణ జరుపుతామని తెలిపారు. ఒంటరి గిరిజన మహిళకు పింఛన్ నిలిపివేత ఏడేళ్లకు పైగా ఇస్తున్నారని.. టీడీపీ నేతల ఒత్తిడితోనే ఇప్పుడు ఆపేశారంటూ ఆవేదన -
కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280
కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 461 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 312 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 149 బేళ్లను తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి టి. ఇషాక్స్వర్ణదత్ మాట్లాడుతూ కనిష్ట ధర రూ.180 పలకగా, సగటు ధర రూ.238.49 లభించిందన్నారు. వేలంలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. డీసీపల్లిలో 515 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 515 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 764 బేళ్లు రాగా 515 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 66686.8 కిలోల పొగాకును విక్రయించగా రూ.14995278.60 వ్యాపారం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా కనిష్ట ధర రూ.180 లభించింది. సగటున రూ.224.86 ధరగా నమోదైంది. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఎకై ్సజ్శాఖ డీసీ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(క్రైమ్): జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్స జ్ శాఖ డిప్యూటీ కమిషనర్గా ఎం. శంకరయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ పి. దయాసాగర్, డీపీఈఓ ఎ. శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్ జే రమేష్, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు డీసీని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీ జిల్లాలో ఎకై ్సజ్ నేరాలు, నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా డీఎస్సీ పరీక్ష ● తొలిరోజు 117 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): డీఎస్సీ పరీక్ష తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 5 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్లో జరిగాయి. ఈ పరీక్షకు ఉదయం 679 మందికి 63 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 675 మందికి 54 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు అనుమతించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పిల్లలతో కలిసి పరీక్ష కేంద్రానికి వచ్చారు. డీసీసీబీ, డీసీఎమ్మెస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎమ్మెస్) చైర్మన్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీబొమ్మ సెంటర్లోని డీసీసీబీ కార్యాలయంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డి, స్టోన్హౌస్పేటలోని డీసీఎమ్మెస్ కార్యాలయంలో గంగోటి నాగేశ్వరరావు బాధ్యతలు వేదపండితుల ఆశీర్వచనాలతో చేపట్టారు. ఈ సందర్భంగా మెట్టుకూరు మాట్లాడుతూ తాను రెండోసారి డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. షేర్ హోల్డర్స్కు, బ్యాంకు ఉద్యోగులకు బోనస్ అందించేలా కృషి చేస్తానన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ శ్రీనివాసరావు, డీసీఓ గుర్రప్ప, డీసీఏఓ తిరుపతయ్య, డీఎల్ సీఓ తిరుపాల్రెడ్డి, బ్యాంకు సీజీఎం సరిత, డీజీఎం ఉషారాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
డీఈఓ ఆఫీసు ముందు ఏపీటీఎఫ్ నిరసన
● ఎస్ఏ బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు పలువురు ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ తొలుత నుంచి ఒక ప్రహసనంగా మారిందన్నారు. తాజాగా విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో సీనియర్ టీచర్లకు అన్యాయం జరిగిందన్నారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన ఉపాధ్యాయులకు దూర ప్రాంతాలు, తక్కువ పాయింట్లు వచ్చిన వారికి దగ్గర్లో ఉన్న క్లస్టర్ వేకెన్సీలు కేటాయిండం దుర్మార్గపు చర్యన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు పీఎస్ హెచ్ఎం పోస్టులు మాదిరి క్లస్టర్ పోస్టులకు విల్లింగ్ ఇచ్చి ఆప్షన్లు పెట్టుకున్న వారికి క్టస్టర్ వేకెన్సీలు కేటాయించి వుంటే బాగుండేదన్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులకు జనరల్లోకి వచ్చి ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉన్నా వారికి ప్రిఫరెన్షియల్ స్ధానాలు మాత్రమే కేటాయించారన్నారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో జరిగిన అవకతవకలు రివైజ్ చేసి సీనియర్ టీచర్లకు న్యాయం చేయాలన్నారు. ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లకు స్వస్తి చెప్పి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, నాయకులు ఆలీ, రియాజ్, వెంకటేశ్వర్లురెడ్డి, గురవయ్య, రామ్మోహన్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రంగూన్ కలప కొల్లగొట్టే ప్లాన్
ఆత్మకూరు: పురాతన కట్టడాలను ఆయా ప్రాంతాల్లో స్మారక చిహ్నాలుగా ఉంచడం పరిపాటి. అయితే ఐదు రోజుల క్రితం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని శిథిలమైందన్న సాకుతో ఎలాంటి ప్రొసీజర్లు పాటించకుండా కూల్చి వేసి రూ.5 లక్షల విలువైన రంగూన్ టేకు కలపను రాత్రికిరాత్రి పట్టణం దాటించేశారు. మంత్రి అండదండలతో టీడీపీ నాయకులు ఈ కార్యక్రమం పూర్తి చేశారేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు శిథిలమైతే వాటికి మరమ్మతులు చేయాలన్నా, తొలగించాలన్నా సంబంధిత ఇంజనీరింగ్ విభాగం వారు ఎస్టిమేషన్ వేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపి వారి ఆమోదం మేరకు తొలగించాల్సి వస్తే పేపరులో ప్రకటించడం, టెండర్లు నిర్వహించడం చేయాలి. కూల్చివేసే భవనాల్లో విలువైన టేకు లేదా కొయ్య పరికరాలు ఉంటే వాటిని సంబంధిత ఏఈ ఆధ్వర్యంలో భద్రపరచాలి. వాటిని అమ్మాలన్నా, ఎస్టిమేషన్లు వేసి ఉన్నతాధికారుల ఆదేశాలతో వేలం నిర్వహించాలి. ఇదంతా ఓ ప్రొసీజర్. అయితే ఆత్మకూరులో కూల్చివేసిన ఆ బ్రిటీష్ కాలం నాటి భవనం విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆరు నెలల క్రితం తీర్మానం చేసి, కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి. కలప ఏదీ...? ఈ కూల్చివేసిన భవనంలో లక్షలాది రూపాయల విలువైన రంగూన్ టేకు ఉందని పలువురు పేర్కొంటున్నారు. వాటిని సంబంధిత పంచాయతీరాజ్ ఏఈ ఆధీనంలో సురక్షితంగా ఉంచాలి. కానీ వారి కార్యాలయంలోగానీ, ఆయన ఆధీనంలోగానీ ఈ టేకు కొయ్యలు లేకపోగా, మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో ఉంచినట్లు సమాచారం. అసలు ఎంత కలప వచ్చింది పరిశీలించేందుకు భవనం తొలగించే క్రమంలో సంబంధిత ఏఈ పర్యవేక్షించలేదని సమాచారం. కాగా ఈ విషయమై పంచాయతీరాజ్ డీఈఈ, ఏఈలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇన్ఛార్జి ఎంపీడీఓను సంప్రదించగా డేవిడ్ను సంప్రదించగా తాను ఇటీవలే ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించానని, ఈ ఏడాది జనవరిలో మండల పరిషత్ సమావేశంలో పాడుబడిన ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చివేయాలని పీఆర్ ఏఈ రూ.1.68 లక్షలకు కూల్చివేతకు ఎస్టిమేషన్ వేసి రికార్డులో నమోదు చేసినట్లు తెలిపారు. భవనంలో వచ్చిన పాత కలపను సేకరించి ఏఈ ఆధ్వర్యంలో భద్రపరచాలని, దానిని వేలం వేస్తే రూ.1.96 లక్షల విలువ తగ్గకుండా వేయవచ్చునని ఏఈ తెలిపినట్లు ఇన్చార్జి ఎంపీడీఓ వివరించారు. ప్రస్తుతం ఏఈ ఆధీనంలో కలప ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీడీఓ భవనం కూల్చివేత గుట్టుచప్పుడు కాకుండా పనిపూర్తి రాత్రికి రాత్రే కలపను టీడీపీ నేత ఇంటికి తరలించిన వైనం -
యోగ జీవితంలో భాగం కావాలి
● ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ నెల్లూరు(స్టోన్హౌస్పేట): మానసికంగా, శారీరకంగా అద్భుత ప్రయోజనాలు కలిగించే యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన రెసిడెన్షియల్ థీమాటిక్ రాష్ట్రస్థాయి సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్ హాజరుకాగా, జ్యోతి ప్రజ్వలనతో యోగాసనాలను ప్రారంభించారు. యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో చిన్నారులు సాధన్, దివ్య వేసిన యోగాసనాలు అందరినీ ఔరా అనిపించాయి. ప్రతి ఆసనానికి తగిన విధంగా శరీరాకృతిని అవలీలగా మారుస్తూ వేసిన ఆసనాలు ప్రత్యేకతను చాటాయి. ప్రజలందరూ కూడా యోగాను ఒక దినచర్యగా మార్చుకోవాలనేది ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కలెక్టర్ చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లాలో 2వేల ప్రదేశాల్లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, జిల్లా క్రీడాప్రాధికారసంస్థ అధికారి యతిరాజ్, జిల్లా ఆయూష్ అధికారి గోవిందయ్య, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. -
డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర
నెల్లూరు (టౌన్): ఆదిశంకర గ్రూపు ఆప్ ఇన్స్టిట్యూట్కు డీమ్డ్ యూనివర్సిటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు లభించిందని ఆ విద్యాసంస్థల గ్రూపు చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. స్థానిక దర్గామిట్టలోని మినర్వా గ్రాండ్లో డీమ్డ్ యూనివర్సిటీ లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ జోన్లో డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు పొందింది కేవలం ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల మాత్రమేనని చెప్పారు. 2001లో కేవలం 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంజినీరింగ్ కళాశాల నేడు 8వేల మంది విద్యార్థులతో ఉందన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం వద్ద కొత్తగా ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలను 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిందు మధ్వాచార్య, ప్రొఫెసర్లు వేణుమాధవ్, ధనుంజయ, ఏఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పడారుపల్లి సుందరయ్యకాలనీ సమీపంలో జాతీయ రహదారిపై గరువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు ఇస్కాన్సిటీకి చెందిన చెంచయ్య చిన్ను(28) అవివాహితుడు. ఆయన వేదాయపాలెంలోని ఓ పొక్లయిన్ కంపెనీలో స్పేర్ పార్ట్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన గురువారం అర్ధరాత్రి బుజబుజనెల్లూరులో స్నేహతుడిని వదిలిపెట్టి జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. పడారుపల్లి సుందరయ్యకాలనీ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో రెయిలింగ్ మీద పడ్డారు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద ఘటనపై సమాచా రం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్ఐ మాల్యాద్రి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని అన్న రవి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో కరోనా కేసు నమోదు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో చాపకింద నీరులా కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం ఒక్క రోజే 6 మందికి కరోనా నిర్ధారణ కాగా, శుక్రవారం దర్గామిట్టలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో 27 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా మరొకరికి కరోనా నిర్ధారణ అయింది. నెల్లూరు మూలాపేటకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా నిర్ధారణ కావడం, అతనికి స్పల్ప లక్షణాలుండడంతో హోం ఐసోలేషన్లో ఉంచారు. ఇప్పటికి మొత్తం 7 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఎక్కడ? జిల్లాలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీలు) 2 ఏరియా ఆస్పత్రులు, ఆత్మకూరులో ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వీటిల్లో ఎక్కడా కరోనా పరీక్షలు చేయడం లేదు. నెల్లూరులోని పెద్దాస్పత్రిలో మాత్రమే అనుమానం వస్తేనే కరోనా పరీక్షలు చేస్తున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 2020 మార్చి 8న రాష్ట్రంలోనే తొలిసారిగా నెల్లూరులో కరోనా కేసు వెలుగు చూసింది. నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టింది. అప్పట్లో కరోనా కేసులు వెలుగు చూసిన చోట ప్రతి రోజు వైద్యశాఖ సిబ్బంది వారికి తగిన మందులు ఇచ్చి రోజూ పర్యవేక్షించేవారు. ఇప్పుడు కరోనా సోకిన వారి సంగతి పట్టించుకోవడం మానేశారు. ఇకనైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెద్దాస్పత్రిలో మినహా కరోనా పరీక్షలు ఎక్కడ? ఇక్కడ కూడా అనుమానం వస్తేనే.. లేదంటే అంతే జిల్లాలో 7కి చేరిన కేసులు -
పోలీసుల దౌర్జన్యం
కందుకూరు: గ్రామదేవత అంకమ్మతల్లి దేవాలయం ప్రాంగణంలోని షాపుల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ కందుకూరు పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ పూలకొట్టు తొలగింపు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రఫీని బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఆలయ ప్రాంగణంలో 24 షాపులను నిర్మించి అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు వేలం ప్రక్రియను చేపట్టారు. ఈనెల 7వ తేదీన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేయనున్నారు. ఇందులో భాగంగా ఓవీ రోడ్డు వైపున్న షాపులను, తోపుడు బండ్లను తొలగించే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న రఫీ పూలకొట్టును తొలగించే విషయంలో పోలీసు లు దౌర్జన్యానికి దిగారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సాంబశివయ్యలు షాపును తొలగించాలని కోరారు. సమయం ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు తొలగించాలంటే ఎలా కుదురుతుందని రఫీ అడిగారు. శుక్రవారం సాయంత్రానికి తీసేస్తానని చెప్పా రు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటికే సమాచారం ఇచ్చామని, షాపును తొలగించాల్సిందేనంటూ పట్టుపట్టారు. దీంతో ఇరువు రు వర్గాల మధ్య వాగ్వాదం జరి గింది. దీంతో రఫీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా పట్ట ణ పోలీస్స్టేషన్కు తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సా ర్సీపీ శ్రేణులు స్టేషన్కు చేరుకుని రఫీని పరామర్శించాయి. పూలకొట్టు తొలగింపు విషయంలో ఉద్రిక్తత వైఎస్సార్సీపీ నేతను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు -
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో పలు ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. నోటిఫికేషన్ తరువాత తగినంత సమయం ఇవ్వక పోవడం, అర్హత మార్కులను పెంచి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 700కు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు ఉంటే డీఎస్సీ అభ్యర్థులకు ఎక్కడ నుంచి పోస్టులు ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 117 ఎస్జీటీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు క్వాలిఫైయింగ్కు అర్హతైన ఇంటర్లో 50 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు క్వాలిఫైయింగ్కు అర్హతైన డిగ్రీలో 50 శాతం మార్కులు నిబంధనలను అమలు చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అర్హత శాతాన్ని 45 నుంచి 40 వరకు తగ్గించారు. ఈ నేపథ్యంలో మాకు కూడా తగ్గించాలని ఓపెన్ కేటగిరి అభ్యర్థులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే కొంతమంది అభ్యర్ధులకు సూదూర ప్రాంతాల్లో సెంటర్లు కేటాయించారు. చైన్నె, తిరుపతి, ఒంగోలు తదితర సెంటర్లు కేటాయించారు. ఒక్కో అభ్యర్థి నాలుగైదు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంతో ఒకే రోజు, ఒకే సమయానికి రెండు పరీక్షలు రాయాల్సిన పరిస్ధితి ఉంది. ఈ రీతిలో డీఎస్సీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో వేలాది మంది అభ్యర్థుల్లో పోస్టుల ఆందోళన నెలకొంది. నార్మలైజేషన్పై ఆందోళన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో నార్మలైజేషన్పై పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఎస్జీటీలు అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఒక సబ్జక్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని చెబుతున్నారు. ఒక సబ్జక్టు లేదా ఎజ్జీటీలకు ఎక్కువ రోజులు పరీక్ష నిర్వహించడం వల్ల ప్రశ్నాపత్రంలో మార్పు వస్తుందన్నారు. ఒకరోజు సులభంగా మరొక రోజు కష్టంగా రావడంతో యావరేజి తీసుకోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు నష్టపోతారని చెబుతున్నారు. ఒక్కో పోస్టుకు 46 మంది పోటీ నేటి నుంచే పరీక్షలు నేటి నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు ఉమ్మడి జిల్లాలో 8 సెంటర్లలో పోస్టులు 673.. దరఖాస్తులు 31,221 జిల్లాలో 700కు పైగా స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఉద్యోగం సాధించినా పోస్టింగ్పై అనుమానాలు డీఎస్సీ పరీక్షలు ఈనెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోటలోని ఎన్బీకేఆర్లో రెండు సెంటర్లు, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల నెల్లూరు, గూడూరు, పొట్టేపాలెంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, కోవూరులోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, కావలిలోని ఆర్ఎస్ఆర్, పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 31,221 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. పకడ్బందీగా పరీక్షలు శుక్రవారం నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలను పకడ్భందీగా నిర్వహిస్తాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లును పూర్తి చేశాం. హాల్టికెట్లో పుట్టిన తేది, జన్మస్థలం, పేరు తదితర వాటిల్లో పొరబాట్లు ఉంటే పరీక్ష రోజున సెంటరులో చీఫ్ సూపరింటెండెంట్ వద్ద నున్న నామినల్ రోల్స్ సరిచేసుకోచ్చు. హాల్ టికెట్లో ఫొటో లేకుంటే రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, గుర్తింపు కార్డును తీసుకురావాలి. అభ్యర్థులు వారికి కేటాయించిన సెంటర్లకు సకాలంలో చేరుకోవాలి. – ఆర్.బాలాజీరావు, డీఈఓ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 673 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని జిల్లా పరిషత్తు, ప్రభుత్వ, మున్సిపాల్టీ, మండల ప్రజా పరిషత్తులో 668 పోస్టులు, మిగిలిన 5 పోస్టులు ట్రైబల్ ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. మొత్తం 673 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. ఒక్కో పోస్టుకు 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే జిల్లాలో 700కు పైగా స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉన్నట్లు జిల్లా అధికారులు లెక్కలు తేల్చారు. ఎజ్జీటీ పోస్టులు కూడా కేవలం 117 ఖాళీలు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. దీంతో డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎక్కడ నుంచి పోస్టులు తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు. -
జగన్ను మోసం చేసిన చరిత్ర మీది
కోవూరు: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మీకు చాలా గౌరవం ఇచ్చారు. అటువంటి మనిషిని మోసం చేసిన చరిత్ర మీది’ అంటూ వీపీఆర్ దంపతులపై వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఫైరయ్యారు. కోవూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వీపీఆర్కు ఇచ్చిన గౌరవం మరెవరికీ ఇవ్వలేదన్నారు. అయినా వెన్నుపోటు పొడవడంలో వారు డాక్టరేట్ పొంది ఉన్నారన్నారు. వెన్నుపోటు దినం విజయవంతం కావడంతో దానిని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. బుధవారం బుచ్చిరెడ్డిపాళెంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వైఎస్సార్సీపీపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన వారిని లక్షలాది రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేసుకుని మీ వెనుక తిప్పుకోవడం జరిగిందన్నారు. అసలు వెన్నుపోటుదారులను మీ వెనుక పెట్టుకుని మాట్లాడటం సరికాదన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ అభిమానులను పక్కనపెట్టి నెల్లూరు నుంచి నలుగురు బ్రోకర్లను వెనుక వేసుకుని తిరుగుతున్నట్లు చెప్పారు. అసలైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు తీవ్ర అవమానం జరుగుతుందన్నారు. వెన్నుపోటు దినంలో రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు రావడం జరిగిందన్నారు. దానిని చూసి ఓర్చుకోలేకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్కు వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు. వేమిరెడ్డిని చంద్రబాబు ఏ విధంగా అవమానించారో మీరు మరిచిపోయినా మేము మరచిపోలేమన్నారు. మీ చుట్టూ ఉన్న వారంతా మా పార్టీ వాళ్లే కదా.. మా పార్టీలో గెలిచి నీ డబ్బులకు అమ్ముడుపోయారన్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతి మాట్లాడుతూ వెన్నుపోటు దినం విజయవంతం కావడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైందన్నారు. జన సముహాన్ని చూసి వీపీఆర్ కుటుంబానికి చలిజ్వరం పట్టుకుందన్నారు. అసలు వెన్నుపోటుదారులు వీపీఆర్ దంపతులన్న విషయం రాష్ట్రం మొత్తం తెలుసన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. వీపీఆర్ దంపతులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టించుకోకుండా తమ సొంత నిధులతోనైనా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో నాయకులు రాధాకృష్ణారెడ్డి, అనూప్రెడ్డి, సతీష్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, నరసింహులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, దినేష్రెడ్డి, మల్లికార్జున్, ఆదినారాయణరెడ్డి, లక్ష్మీకుమారి, జ్యోతి, ఉమ తదితరులు పాల్గొన్నారు. వీపీఆర్ దంపతులపై ప్రసన్న ఫైర్ -
చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
● మినీలారీల పట్టివేత ● ఆగని సరఫరా కొడవలూరు: చేపల గుంతలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న మినీలారీని కొడవలూరు ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి గురువారం పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. మండలంలోని ఆలూరుపాడు చేపల గుంతలకు గురువారం వ్యర్థాలను తరలిస్తున్నారు. దీనిపై అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు ఎస్సై కోటిరెడ్డి వాహనాన్ని పట్టుకున్నారు. గుంత తీయించి వ్యర్థాలను పూడ్చివేశారు. సీజ్ చేసిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేది లేదని, వ్యర్థాల అక్రమ రవాణాను నిలిపివేయాలని ఎస్సై హెచ్చరించారు. ● విడవలూరు: మండలంలోని తుమ్మగుంట గ్రామంలో చికెన్ వ్యర్థాల వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేష్ కథనం మేరుకు.. బెంగళూరు నుంచి మినీలారీలో వ్యర్థాలను వావిళ్ల వైపు తరలిస్తున్నట్లు ఫిషరీ అసిస్టెంట్ కడిబేటి నాగరాజుకు గురువారం సమాచారం అందింది. దీంతో పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీలు చేసి వ్యర్థాలను గుర్తించారు. గుంత తీయించి పూడ్చిపెట్టారు. వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి, యజమాని దంపూరుకు చెందిన ఏటూరు మురళిపై కేసు నమోదు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రకృతిని కాపాడుకుందాం
● ఇన్చార్జి కలెక్టర్, కమిషనర్ నెల్లూరు(బారకాసు): ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అంశంపై అవగాహన ర్యాలీని గురువారం ఉదయం నిర్వహించారు. స్థానిక వీఆర్ కళాశాల కూడలి నుంచి ర్యాలీని కార్తీక్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న వారితో కలెక్టర్ ప్రతిజ్ఞను చేయించారు. నార సంచులను పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, నడక పోటీలు, మారథాన్ వంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ర్యాలీలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్కుమార్, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామ/వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆశపెట్టి మోసం చేశారు
సున్నా వడ్డీకి ఎగనామం ఈమె పేరు డి.నాగలక్ష్మి. ఊరు వెంకటాచలం మండలం సర్వేపల్లి. చాలా ఏళ్లుగా సర్వేపల్లి పొదుపు సంఘంలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఎన్నో పర్యాయాలు పొదుపు సంఘం తరఫున బ్యాంకులో రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదిగారు. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలకు ఠంచనుగా సున్నావడ్డీ సొమ్ము బ్యాంకులో పొదుపు రుణాలకు జమయ్యేది. కూటమి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకం అమలు చేయడం లేదని నాగలక్ష్మి వాపోతున్నారు. నెల్లూరు (స్టోన్హౌస్పేట): బూటకపు మాటలతో ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీఠమెక్కాక తుంగలో తొక్కారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉంటే అంత మంది ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.1,500 చొప్పున అందిస్తా. బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానంటూ చంద్రబాబు వేదికలెక్కి ఉపన్యసిస్తూ ఊగిపోయారు. చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది మరోసారి రుజువైంది. గతంలో అధికారంలోకి రాక ముందు ప్రతి పొదుపు మహిళ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అన్నగా నేనే చెల్లిస్తానంటూ సెంటిమెంట్తో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత కర్రుకాల్చి వాత పెట్టారు. ఒక్కొక్క మహిళ అప్పట్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పొదుపు బకాయిలు ఉంటే పూర్తిగా ఎగ్గొట్టి ఎన్నికల ముందు రూ.10 వేలు పసుపు కుంకుమ అంటూ మోసం చేశారు. ఈ ఏడాదిలో రూ.1,098 కోట్లు నష్టపోయిన మహిళలు చంద్రబాబు ఎన్నికల హామీల్లో ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు 6.10 లక్షల మంది ఉన్నారు. హామీ అమలు చేయకపోవడంతో మహిళలకు ప్రతి నెలా రూ.91.50 కోట్లు, ఏడాదికి రూ.1098 కోట్లు జిల్లాలోని మహిళలు నష్టపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి రుణాలు, సున్నా వడ్డీ, చేదోడు, చేయూత, జగనన్న తోడు, తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.8,143.45 కోట్ల అందజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట జిల్లాలో 4.10 లక్షల మంది స్వయం సహాయక గ్రూపు మహిళలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొదుపు మహిళలే కాదు.. ప్రతి మహిళకు పెద్దపీట వేసింది. ప్రతినెలా ఏదోక సంక్షేమ కార్యక్రమంతో మహిళలకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లాలో ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో అమలు చేశారు. ఇంటి పట్టాలు, ఇతర రుణాలు, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి వారి అభివృద్ధికి పెద్దపీట వేసింది. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమల స్థాపనకు భారీ స్థాయిలో ప్రోత్సహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు అందిన సాయం రూ. 8,143.45 కోట్లు చంద్రబాబు మోసానికి నెలనెలా మహిళలు నష్టపోతున్న మొత్తం – రూ.91.50 కోట్లు కూటమి పాలన: బాబూ షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అంటూ అబద్ధపు ప్రచారంతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మహిళలకు తీరని అన్యాయం చేసింది. బాబు బురిడీతో మహిళల భవిష్యత్ ఛిన్నాభిన్నమైంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం అందిస్తానని, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పిన హామీలు నెరవేర్చకపోగా, పొదుపు, సీ్త్ర నిధి రుణాలకు కొర్రీలు పెట్టారు. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఇక గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారు. సకాలంలో పొదుపు చెల్లించిన మహిళలకు సున్నావడ్డీ ఊసే లేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ పీ–4 పథకంలో కొత్త గారడీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లు మహిళలకు కొత్త రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నారు. వైఎస్సార్సీపీ పాలన: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పటి వరకు పొదుపు మహిళల రుణం మొత్తాన్ని నాలుగేళ్లలో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేశారు. గతంలో టీడీపీ చేసిన మోసానికి డీఫాల్టర్లు అయిన పొదుపు గ్రూపులకు బ్యాంకుల ద్వారా తిరిగి రుణాలిప్పించి.. ఆ గ్రూపుల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చేసేందుకు విస్తృతంగా పొదుపు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు కల్పించి అత్యధిక మంది జీవితాలను మెరుగుపర్చారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడు వంటి పథకాలతో వారి ఆర్థిక స్వాతంత్యానికి దన్నుగా నిలిచారు. అమ్మఒడి వంటి పథకాన్ని కూడా వారి ఖాతాల్లోనే జమ చేశారు. ప్రతి కుటుంబానికి జగనన్న కాలనీల్లో రూ.లక్షల విలువైన ఆస్తిని సొంతం చేశారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసి నెలకు రూ.1,500 వంతున ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. పైగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికీ ఇస్తామని నమ్మబలికారు. ఆశ పెట్టి ఇవ్వకుండా చేయడం మోసం చేసినట్టే. ఇకనైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. రూ.వేల కోట్ల అప్పులు తెస్తున్నా.. మహిళలకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత వాగ్దానాలుగా మారిపోతున్నాయి. – పిడుగు నీలవేణి, సీతారామపురం -
ప్రశ్నించే వారిపై కేసులా?
వెంకటాచలం: హామీలను అమలు చేయడంలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. చెముడుగుంట వద్ద నున్న జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ఆయన, వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి గురువారం ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం విక్రమ్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉన్నవారిపై, ప్రజా సమస్యలపై బలంగా పోరాడే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల స్పందన చూస్తే, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందన్నారు. రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ నేర్పుతున్న విద్యలే భవిష్యత్లో పునరావృతం అవుతాయనే విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలో పని చేసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా భయపడే పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి రాజగోపాల్రెడ్డితో కలిసి కాకాణితో ములాఖత్ -
వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అందించిన ఆర్థిక సహకారంతో ఎంతో మంది వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తలుగా మారారు. సుమారు 1.20 లక్షల మంది మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కూటమి సర్కార్ నయవంచన వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేది. ప్రస్తుతం కూటమి పాలనలో ఏడాది నుంచి మహిళలకు ఎటువంటి నగదు అందడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంత మహిళలు సూక్ష్మ సంస్థలో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ● చేజర్లకు చెందిన ప్రమీలమ్మ 14 ఏళ్లుగా పొదుపు గ్రూపులో సభ్యురాలిగా ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శిక్షణ తీసుకుని బ్యాంకు రుణం ద్వారా ఊరగాయ పచ్చళ్ల పరిశ్రమ స్థాపించారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు పది మందికి ఉపాధి కల్పిస్తోంది. ● రాపూరుకు చెందిన ప్రసన్నలక్ష్మిది నిరుపేద కుటుంబం. పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి పొదుపు చేసుకుంటూ వచ్చిన నగదుతో పిల్లలను చదివించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో శిక్షణ పొంది బ్యూటీ పార్లర్ స్థాపించారు. ప్రస్తుతం దాని ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని అభివృద్ధి చెందుతున్నారు. -
పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
● ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ నెల్లూరు రూరల్: డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసి, బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని డీఎంఅండ్హెచ్వోకు సూచించారు. విద్యుత్కు అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఉదయభాస్కర్రావు, డీఈఓ బాలాజీరావు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సుజాత, కావలి, నెల్లూరు ఆర్డీవోలు వంశీకృష్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో 42 మందికి స్థానచలనం నెల్లూరు (టౌన్): జిల్లా విద్యాశాఖలో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగులు బదిలీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 మంది అధికారులు, ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన ఉద్యోగులు వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ కావాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖాధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న బి.పద్మకుమారిని ప్రకాశం జిల్లా ఒంగోలు విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. అక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వి.విజయకుమార్ నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏపీ ఓపెన్స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్కే అసదుల్లాఖాన్ కర్నూలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా బదిలీ అయ్యారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది సీనియర్ అసిస్టెంట్లు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, ఐదుగురు ఆఫీసు సబార్డినేటర్లు, గార్డెనర్–1, వాచ్మన్–1 వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. డీసీపల్లిలో 506 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో గురువారం 506 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 622 బేళ్లు రాగా వాటిలో 506 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 65174.7 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,52,29,337.80 వ్యాపారం జరిగింది. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280 కాగా కనిష్ట ధర రూ.180 లభించింది. మొత్తం మీద సగటు ధర రూ.233.67గా నమోదయింది. వేలంలో 9 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. 9న జెడ్పీ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈనెల 9వ తేదీన బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విద్యారమ తెలిపారు. ఐదేళ్లు పైబడిన ఉద్యోగుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఏఓలు, పరిపాలనాధికారులు, సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు, ల్యాబ్ లైబ్రరీ సహాయకులు, ఆఫీసు సబార్డినేటర్లను బదిలీలు చేయనున్నారు. దీనికి సంబంధించి సీనియార్టీ జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఉద్యోగులందరూ కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాలని, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్కాకుల పెంచలయ్య, ప్రసన్నకుమార్లు కోరారు. ప్లీజ్.. కంకర క్వారీకి లీజ్ వద్దు ఉదయగిరి రూరల్: మండలంలోని తిరుమలాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండను కంకర క్వారీకి లీజుకు ఇవ్వవద్దని గురువారం పలువురు గ్రామస్తులు తహసీల్దార్ సుభద్రకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 178 సర్వే నంబరులోని 123.50 ఎకరాల విస్తీర్ణం గల కొండ పోరంబోకు భూమిని ప్రభు త్వం కంకర క్వారీ తవ్వకానికి లీజుకు ఇచ్చేందుకు గ్రామంలో ఏ–1 నోటీసు జారీ చేసిందన్నారు. కొండకు దగ్గరగా నివాస గృహాలు ఉన్నాయని, లీజు ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
పూర్తయ్యే పరిస్థితి లేదు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను చిన్నచూపు చూస్తోంది. దీంతో వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులకు వేసవిలో శ్రీకారం చుట్టారు. అయితే మేనెల అయిపోయినా తూతూమంత్రంగా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమైన వసతులను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. అక్కడక్కడా ప్యాచ్ వర్కులను చేసి, మరుగుదొడ్లకు తలుపులను బిగించి మమ అనిపించేశారు. చేరడానికి వచ్చిన విద్యార్థులు ఏవో కారణాలు చెప్పి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 12 కళాశాలల హాస్టళ్లు, 59 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో మరమ్మతులను వేసవి సెలవుల్లో ప్రారంభించారు. 64 ప్రభుత్వ భవనాల కోసం రూ.9.38 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నెల్లూరు నగరంలోని పది వసతి గృహాల్లో వివిధ పనుల కోసం రూ.87.15 లక్షల నిధులిచ్చారు. ఏప్రిల్ నెలలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. అయితే సెలవులు అయిపోయి కళాశాలలు తెరవడంతో హాస్టళ్లకు విద్యార్థులు రావడం మొదలు పెట్టారు. పనులు పూర్తి కాకపోవడంతో చాలామంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మద్రాస్ బస్టాండ్ వద్దగల హాస్టళ్ల కాంప్లెక్స్లో ఆరు వసతి గృహాలున్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన పని చేయాల్సి ఉంది. అయితే వారికి అందుబాటులో ఉండే పూత పనులు, చిన్న చిన్న సిమెంట్ పనులు, మరుగుదొడ్ల తలుపులు మార్చడంను చేశామంటే చేశామన్నట్లు వ్యవహరిస్తున్నారు. వసతి గృహాల్లో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి సకాలంలో పూర్తికాని మరమ్మతులు ఇళ్లకు వెళ్లిపోతున్న వైనం పట్టించుకోని అధికారులు ఈనెల 12వ తేదీన ప్రీ మెట్రిక్ విద్యార్థులు హాస్టళ్లలో చేరాల్సి ఉంది. అయితే పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సాంఘిక సంక్షేమ శాఖాధికారులు గత నెలాఖరులోపు పనులు అయిపోవాలని చెబుతున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం జూన్ నెలంతా కూడా తాము పనులు చేసుకోవచ్చని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా సాంఘిక సంక్షేమ శాఖాధికారులు, వార్డెన్లు, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ప్రణాళికాబద్ధంగా మరమ్మతులు చేయలేకపోవడంతో ఏ హాస్టళ్లలో ఏ మేరకు పనులు జరిగాయో ఎవరికీ తెలియని పరిస్థితి. దీనికితోడు ఏ పనులు జరుగుతున్నాయో బయట చెప్పొద్దంటూ హుకుం జారీ చేశారని ప్రచారం ఉంది. ప్రస్తుతం వసతి గృహాల్లో నెలకొన్న పరిస్థితులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. -
గంజాయి అక్రమ రవాణాపై దాడులు
● నలుగురు నిందితుల అరెస్ట్ ● 48 కేజీలు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): తిరుపతికి గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ దయాసాగర్ ఆదేశాల మేరకు గురువారం ఎకై ్సజ్ నెల్లూరు – 2 ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కాలేషావలీ తమ సిబ్బందితో కలిసి వెంకటాచలం టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి తిరుపతికి వెళ్తున్న కారును తనిఖీ చేశారు. డిక్కీలో మూడు ప్లాస్టిక్ సంచుల్లో 48 కేజీలున్న 192 గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరికి చెందిన శివప్రసాద్ మిషాల్, బంధువులు పూజా మిషాల్, కాన్హు ప్రసాద్ మిషాల్, స్నేహితుడు బుడుపంగిని అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ నెల్లూరు – 2 స్టేషన్కు తరలించి విచారించారు. నిందితులు ఒడిశా రాష్ట్రం ఇంగాలి గ్రామానికి చెందిన బలరామ్ దాలి వద్ద రూ.50 వేలకు గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఎకై ్సజ్ అధికారులు నలుగురు నిందితులతోపాటు బలరామ్ దాలిపై కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి రూ.5 వేల నగదు, మూడు సెల్ఫోన్లు, గంజాయి, కారును సీజ్ చేశారు. తనిఖీల్లో పాల్గొన్న ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మునీర్ అహ్మద్, శకుంతల, సిబ్బందిని ఏసీ దయాసాగర్ అభినందించారు. కళాశాలపై విచారణ కందుకూరు రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో గాయత్రి జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల జవాబుపత్రాలు ట్యాంపరింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ కమిటీని నియమించింది. పరీక్ష కేంద్రమైన శ్రీవివేకా జూనియర్ కళాశాలలో గురువారం కమిటీ విచారణ చేపట్టింది. విచారణాధికారిగా ఉన్న బోర్డు డిప్యూటీ సెక్రటరీ జయలక్ష్మి కళాశాల యాజమాన్యాన్ని, ఇన్విజిలేటర్ను విచారించారు. బాధిత విద్యార్థులైన ఎం.అవినా ష్బాబు, టి. సాయితేజస్వినిని, తల్లిదండ్రులు, గాయత్రి కళాశాల యాజమాన్యం నుంచి స్టేట్మెంట్ తీసుకు న్నారు. ఈ కళాశాలకు చెందిన ఇషాక్, ప్రజ్ఞ అనే విద్యార్థులు కూడా మార్కులు తగ్గాయని, తమ జవాబుపత్రాలు కూడా ట్యాంపరింగై ఉంటాయ నే అనుమానం ఉందని పరిశీలించాలని ఫిర్యాదు చేశారు. -
ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం
కూటమి ఏడాది వెన్నుపోటు పాలనపై సింహపురి.. జనభేరి మోగించింది. అసమర్థ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించబోమని రణన్నినాదం చేసింది. ఊరూవాడాల్లో పెల్లుబుకిన ప్రజాగ్రహం.. ఉద్యమ కెరటమై గర్జించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాల్గొని అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలకు ఆటంకాలు సృష్టించారు. సర్వేపల్లిలో అయితే ఏకంగా తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎంపీలనే అడ్డుకున్నారు. ప్రచార రథం డ్రైవర్ను బెదిరించి ముందుకు కదలనీయకుండా ఆపేశారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వినూత్నంగా నల్లబెలూన్లతో భారీ సంఖ్యలో ఎండీయూ వాహనాలు, కూటమి హామీల మోసాలపై ఫ్లకార్డుల బాక్స్లతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. కోవూరు: ఈవీఎంలతో గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించి తీరుతామని, ఏడాదిలోనే ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ట్రైలర్ మాత్రమే అని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన అంతా కుట్రలు, కుతంత్రాలతోనే పూర్తయిందని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలు వెన్నుపోటు పొడిచిన కూట మి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోవూరులో ‘వెన్నుపోటు దినం’ దిక్కులు పిక్కటిల్లేలా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రసన్న మాట్లాడారు. ఏడాది కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిగ్గులేని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దళితులు, మహిళలు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. పవన్ కళ్యాణ్.. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయ్ డీసీఎంగా పవన్కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదని, గత ఎన్నికల ప్రచార సమయంలో 30 వేల మంది మహిళలను వలంటీర్లు కిడ్నాప్ చేశారని తప్పుడు ప్రచారం చేశారని, ఏడాదైనా వారిని తిరిగి రప్పించలేకపోయాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాపు ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయిస్తే ఆ సమస్యలపైన పోరాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వీరి చలపతిరావు, రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, అనూప్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, శ్రీనివాసులురెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శేషగిరిరావు, సతీష్రెడ్డి, షాహుల్, వైస్ ఎంపీపీ నరసింహులురెడ్డి, దినే‹Ùరెడ్డి, అహమ్మద్ తదితరులు ఉన్నారు. మోసం చేయడంలో దిట్ట ∙మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్సిక్స్ పథకాలకు మంగళం పాడుతూ ఏడాదిలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాదిలోనే ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వీటి గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేస్తున్నారని, ప్రజలు చంద్రబాబుకు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.నమ్మించి నట్టేట ముంచాడు∙కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి (జలదంకి): ఏడాది కూటమి పాలన అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు, దగా, దౌర్జన్యాలతో సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కావలి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నిరసన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఆయన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. బాబును నమ్మిన ప్రజలకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్ట్లు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని తెలిపారు.వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబు∙బుర్రా మధుసూదన్యాదవ్ కందుకూరు: వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని బుధవారం కందుకూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఎన్నికల్లో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ పల్లెకు, గ్రామానికి, వార్డుకు వెళ్లినా చంద్రబాబునాయుడు నమ్మించి మోసం చేశారంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగతున్న అరాచకపాలనపై ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్తులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెడుతుందని బుర్రా అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఎంతో మంది నియంతలు సైతం కనుమరుగైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్సిక్స్ హామీలను అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సబ్కలెక్టర్ తిరుమాణి శ్రీపూజకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్తో పాటు, ఇతర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రజలకే పంగనామాలు∙ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (అర్బన్): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో ఏఓ విజయకుమార్కు వినతి పత్రం ఇచ్చారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నా రు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి నేతలు ఖలీల్ అహ్మద్, అంజాహుస్సేని, మొయిళ్లగౌరి, సురేష్, సమీర్ఖాన్, అబ్దుల్ మస్తాన్, సిద్దిఖ్, నేతాజీ సుబ్బారెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఊటుకూరు నాగార్జున, అశ్రిత్రెడ్డి, చీదెళ్ల కిషన్, కొణిదెల సు«దీర్, కోటేశ్వరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. వంచన ఆయన నైజం ∙మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: బిడ్డనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఉదయగిరిలో బుధవారం పార్టీ జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో జనాన్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు. ఏడాది అయినా ఒక్క హామీ అమలు చేయలేదు. రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను హించిస్తూ తప్పడు కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. -
పట్టణ ప్రజలపై ఇంటి పన్నుల భారం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలపై ఇంటి పన్నుల భారం మోపారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు మాత్రం నెరవేర్చలేపోయారు’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు, పట్టణ నివాస ప్రాంతాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని బాలాజీనగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలపై 20 శాతం ఇంటి పన్నులు పెంచటంతోపాటు, విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి పీక్ అవర్స్లో అదనపు చార్జీలు వేస్తోందన్నారు. ఇంటి పన్ను విధానాన్ని గతంలోలా రెంటల్ పద్ధతిలో అమలు చేయాలని చూస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతామన్నారు. అనంతరం ‘స్మార్ట్ మీటర్లు వద్దు.. కరెంట్ చార్జీలు తగ్గించాలి’ స్టిక్కర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సింహపురి పౌరసమాఖ్య నగర కార్యదర్శి అత్తిమూరు శ్రీనివాసులు, నాయకులు సూర్యనారాయణ, ఆసిఫ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా మెగా డీఎస్సీ పరీక్షలు
నెల్లూరు రూరల్: జిల్లాలో మెగా డీఎస్సీ – 2025 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో ఉదయభాస్కర్రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాల్లో 31,221మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. వైద్యశిబిరాలను పెట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్రాలకు అభ్యర్థులు సమయానికి చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలన్నారు. హెల్ప్డెస్క్ ఏర్పాటు డీఎస్సీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు సందేహాలుంటే 62817 04160, 81219 47387, 81250 46997, 93988 10958, 79956 49286, 79957 89286, 99630 69286, 70138 37359 ఫోన్ నంబర్లను సంప్రదించాలని డీఈఓ బాలాజీరావు తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళెం వద్ద గల డిజిటల్ జోన్, కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కావలిలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్డులో ఉన్న నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న విద్యానగర్లో ఉన్న ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఎన్బీకేఆర్ సైన్స్, ఆర్ట్స్ కళాశాలలు, గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అమనుతించరని చెప్పారు. నిర్దిష్ట సమయానికి కంటే గంట ముందు అభ్యర్థులను లోనికి అనుమతిస్తామని, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో విద్యుత్, వైద్యం, పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 8 కేంద్రాల ఏర్పాటు 31,221 మంది అభ్యర్థులు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్రావు -
బైక్ల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
● పది వాహనాల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీఐ శివరామకృష్ణారెడ్డి మనుబోలు: చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీ కోసం మోటార్బైక్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను మనుబోలు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. మనుబోలు మండలం పిడూరుపాళెం గ్రామానికి చెందిన యల్లంటి మౌళి కృష్ణ, కావలి రూరల్ మండలం బుడంగుంట గ్రామానికి చెందిన ఎస్కే కరిముల్లా చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. నేరాలు చేస్తూ వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లారు. అక్కడ స్నేహితులుగా మారారు. జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక ఈజీ మనీకి అలవాటుపడి బైక్లు దొంగతనం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మనుబోలుతోపాటు కొడవలూరు, విడవలూరు, గూడూరు తదితర ప్రదేశాల్లో పార్కింగ్ చేసి ఉన్న పది వాహనాలను మారు తాళాలతో చోరీ చేశారు. మంగళవారం రాత్రి మనుబోలు హైవేపై ఎస్సై శివరాకేష్ వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్పై తిరుగుతున్న వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల దొంగతనం విషయం బయటపడింది. దీంతో బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వాహనాల విలువ సుమారు రూ.3.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో చొరవ చూపిన ఎస్సైతోపాటు ఏఎస్సై తిరుపాల్, సిబ్బంది మాధవరావు, వేణు, ఖాజాహుస్సేన్, శ్రీనివాసులు, సురేష్, మణి తదితరులను సీఐ అభినందించారు.