breaking news
Mancherial
-
పోలీసులపై దాడి కేసులో ఒకరి అరెస్టు
ఇచ్చోడ: మండలంలోని కేశవపట్నంలో గత నెలలో ముల్తానీలు పోలీసులపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. మండలంలోని చెలుకగూడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటే క్రమంలో కేశవపట్నం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి ప్రధాన నిందితుడు అల్తాఫ్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో స్థానిక ఎస్సైతో పాటు ఐదుగురు స్పెషల్ పార్టీ పోలీసులు గాయాల పాలయ్యారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అల్తాఫ్ను గురువారం సిరిచెల్మలో అరెస్ట్ చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. కాగా నిందితుడిపై ఇప్పటికే 8 కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. మంచిర్యాలలో నకిలీ సిగరేట్లు!మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో నకిలీ సిగరేట్లు కలకలం రేపాయి. ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజి లెన్స్ అధికారులు గురువారం పట్టణంలోని పలు కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కృష్ణ జనరల్ స్టోర్స్, పవన్ కిరాణ స్టోర్స్లో నకిలీ గోల్డ్ఫ్లాక్ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో విజిలెన్స్ అధికారులు నాగేశ్వర్రావు, రమాకాంత్, స్థానిక ఎస్సై తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. పొచ్చెర జలపాతంలో రివర్ రాఫ్టింగ్బోథ్: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొచ్చెర జలపాతం వద్ద గురువారం రివర్ రాఫ్టింగ్ నిర్వహించారు. పొచ్చెర నుంచి కుప్టి వరకు సు మారు 6 కిలోమీటర్ల దూరాన్ని ఒకటిన్నర గంటల వ్యవధిలో ట్రయల్ రాఫ్టింగ్ చేశారు. వర్షాకాలంలో రాఫ్టింగ్ నిర్వహించేందుకు అటవీ అధికారులు చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం జరగబోయే టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ జిల్లా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉందని అఽధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎఫ్ఆర్వో ప్రణయ్, ఇంద్రవెల్లి ఎఫ్ఆర్వో సంతోష్, కోయినా అడ్వెంచర్ టీమ్, రివర్ రాఫ్టింగ్ సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు
జన్నారం: మండల కేంద్రంలోని స్లేట్ ఎక్స్లెంట్ పాఠశాలలో గురువారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–17 జిల్లాస్థాయి బాలుర వాలీబాల్ ఎంపిక పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు అక్టోబర్లో ఆదిలాబాద్లో నిర్వహించనున్న జోనల్స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో విజయ్కుమార్, ఎస్సై గొల్లపెల్లి అనూష, ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్, స్లేట్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు సుభాష్రెడ్డి, చైర్మన్ ఏనుగు శ్రీకాంత్రెడ్డి, ఫణిరాజు, ఎస్జీఎఫ్ నాయకులు బెల్లం శ్రీనివాస్, గాజుల శ్రీనివాస్, సిరంగి గోపాల్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రోజీ వరకుమారి, సాగర్, పీడీలు సంతోష్, నగేష్, తదితరులు పాల్గొన్నారు. జోనల్ స్థాయికి ఎంపికై ంది వీరే.. జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన 18 మంది జోనల్ స్థాయికి ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకూబ్ తెలిపారు. ఎంపికై న వారిలో రాకేశ్, ప్రణయ్ (ముల్కళ్ల), కార్తీక్, అనిల్ (కొత్తపల్లి), సాయి ప్రదీప్ (మంచిర్యాల), సాయి దీక్షిత్ (మంచిర్యాల), ఇలియాజ్ఖాన్ (తాళ్లపేట్), విగ్నేశ్ (రెబ్బనపల్లి), ఘనతేజ, అరుణ్ (లక్సెట్టిపేట), అఖిలేశ్, రుతిన్(బెల్లంపల్లి), భానుచందర్, దిలీప్ (జన్నారం), అజయ్ (చింతగూడ), ప్రణయ్కుమార్ (జైపూర్) అధ్వైత్ (గర్మిళ్ల), వర్షిత్ (వెంకటపూర్) ఉన్నారు. -
అవకాశాలను అంది పుచ్చుకోవాలి
చెన్నూర్రూరల్: విద్యార్థులు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ఆచార్య రాజేంద్రసింగ్ అన్నారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వి.పట్వర్దన్, వైస్ ప్రిన్సిపాల్ ఎం.కిశోర్కుమార్, అధ్యాపకులు చక్రపాణి, కృష్ణారెడ్డి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గడ్డెన్నవాగు’కు భారీ ఇన్ఫ్లో
భైంసా పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టుకు 13,277 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేశారు. సాయంత్రం ఇన్ఫ్లో తగ్గడంతో ఒక గేటును మూసి, ఒక గేట్ ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లకుగానూ ప్రస్తుతం 358.40 మీటర్ల నీటినిల్వ ఉంది. – భైంసాటౌన్ -
40 శాతం లాభాల వాటా చెల్లించాలి
శ్రీరాంపూర్: సింగరేణి గడిచిన ఆర్థిక సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం నస్పూర్ కాలనీలోని ఆ యూనియన్ కార్యాలయంలో మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ లాభాల లెక్క తేల్చలేదన్నారు. కార్మికులు కష్టపడి పని చేస్తేనే లాభాలు వచ్చాయని, వాటా పంచడానికి జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్రెడ్డి, నాయకులు రాగం రాజేందర్, మంద కమలాకర్, మేకల స్వామి తిరుపతి, మోతే ఓదెలు, రాజు, చెల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిది నెలలుగా జీతాల్లేవ్!
లక్ష్మణచాంద: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిఽథి అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది డిసెంబర్ మాసం నుంచి వారికి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని వేతనాలతో... జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు చాలీచాలని వేతనాలతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పీరియడ్కు రూ.390 చొప్పున నెలకు 72 పీరియడ్లు విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. నెలలో 72 పీరియడ్లు బోధిస్తే రూ.28,080 వేతనం వస్తుంది. రెగ్యులర్ అధ్యాపకులకు సరిసమానంగా పనిచేస్తున్నా అరకొర వేతనాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణకు అప్పులు గతేడాది డిసెంబర్ నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇతరుల వద్ద అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే తమకు రావాల్సిన ఎనిమిది నెలల వేతనాలు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే దసరా పండుగకు తమ కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా గెస్ట్ లెక్చరర్లు నిర్మల్ 55 ఆదిలాబాద్ 69 ఆసిఫాబాద్ 61 మంచిర్యాల 40 మొత్తం 225 -
నర్సాపూర్లో అధికారుల విచారణ
ఎఫెక్ట్..ఇచ్చోడ: ‘ఇందిరమ్మ ఇల్లు ఒకరికి.. బిల్లు మరొకరికి’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదిలాబాద్ డీపీవో రమేశ్, డీఎల్పీవో ఫణిందర్రావు నర్సాపూర్ గ్రామంలో విచారణ చేపట్టారు. ఇందిరమ్మ ఇల్లు మంజురైన లబ్ధిదారు ముస్లే నందబాయి భర్త సంతోష్, బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మించుకున్న ముస్లే నందబాయి భర్త మారుతిని విచారించారు. గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడారు. నివేదికను కలెక్టర్ రాజర్షిషాకు అందజేయనున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి చేతివాటం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరులో పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ చేతి వాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ముస్లే నందబాయి (భర్త సంతోష్)కు జూన్ 2న ఇందిరమ్మ ఇల్లు మంజురైంది. కానీ సంతోష్ దుబాయ్లో ఉండడంతో అతను వచ్చాక ఇంటినిర్మాణ పనులు చేపట్టే విధంగా కుటుంబ సభ్యులు ప్లాన్ వేసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లే నందబాయి (భర్త మారుతి)కి మంజూరు కాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి సునీల్నాయక్ రంగంలోకి దిగి మీరు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, మంజూరు విషయం తాను చూసుకుంటానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో వారు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. నెల రోజులక్రితం దుబాయ్లో ఉంటున్న సంతోష్ స్వగ్రామానికి వచ్చి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఇంతలో బేస్మెంట్ నిర్మాణ బిల్లు రూ.లక్ష ముస్లే నందబాయి (భర్త సంతోష్) బ్యాంక్ అకౌంట్లో జమకావడంతో పంచాయతీ కార్యదర్శి వారిని నమ్మంచి వారి అకౌంట్ నుంచి నందబాయి (భర్త మారుతి) అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. దీంతో కార్యదర్శిని నిలదీయడంతో వారం రోజుల్లో లక్ష రూపాయలు తిరిగి ఇస్తానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. ఇల్లు మంజూరైన బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత అసలు నిజాలు బయటపడతాయని నర్సాపూర్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నలుగురిపై కేసు
ఆదిలాబాద్టౌన్: ఇంటి భవనానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని గంజ్రోడ్ ప్రాంతానికి చెందిన సురేష్ మకాడియా 2002లో కన్నలాల్ నుంచి భవనాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుని ఆధీనంలో ఉన్నప్పటికీ వినియోగంలో లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన రంగినేని దీపక్ ఫోర్జరీ పత్రాలు సృష్టించి మున్సిపాలిటీలో పన్ను చెల్లించాడు. అనంతరం రిజిస్ట్రేషన్ అధికారులను పక్కదోవ పట్టించి తన బావ అయిన నరేందర్ దీపక్ దడిగెలవార్ పేరిట 2023లో రిజిస్ట్రేషన్ చేయించాడు. సాక్షులుగా ఆకులవార్ నగేష్, ఆదర్శ్ ఉన్నారు. దీంతో బాధితుడు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. అటవీ భూమి సాగుచేస్తున్న ఇద్దరిపై..కుంటాల: కుంటాల బీట్ పరిధిలోని రాయపాడ్ శివారు రిజర్వు ఫారెస్ట్లో బుధవారం రాత్రి అక్రమంగా అటవీభూమి సాగు చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు ట్రా క్టర్ను సీజ్ చేసినట్లు ఎఫ్ఆర్వో రాథోడ్ రమేశ్ తెలిపారు. అంబకంటి తండాకు చెందిన ఆడే సత్యవన్, ఆడే దత్తురాం అనుమతి లేకుండా ట్రాక్టర్తో అటవీ ప్రాంతంలో దుక్కి దున్నుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డీఆర్వో రేష్మ, ఎఫ్బీవో సంజయ్ పాటిల్, హరిలత, పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికజైపూర్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన కావేరి పార్దు జాతీయ స్థాయి మినీ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కోల నాగేశ్వర్రావు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్లో జరిగే జాతీయస్థాయి మినీ హ్యాండ్బాల్ పోటీల్లో రాష్ట్రజట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదరు విద్యార్థిని పీడీ సంతోశ్, పీఈటీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, వైస్ ప్రిన్సిపాళ్లు స్రవంతి, మహిపాల్ అభినందించారు. -
భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య
బెల్లంపల్లి: భార్య కాపురానికి రావడం లేదని ఉరేసుకుని భర్త ఆత్మహత్య చే సుకున్న సంఘటన పట్ట ణంలో చోటు చేసుకుంది. టూటౌన్ ఎస్సై సీహెచ్ కిరణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని రడగంబాల బస్తీకి చెందిన కుజ్జూర్ పృథ్వీరాజ్ (37)కు తాళ్లపల్లి సుప్రియతో 2018లో వివాహమైంది. అప్పటి నుంచి పృథ్వీరాజ్ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడేవాడు. దీంతో సుప్రియ గత జూన్లో మంచిర్యాలకు వెళ్లిపోయింది. ఇంటికి రావాలని పలుమార్లు కోరినా నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని తల్లి కుజ్జూర్ కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
జోర్డాన్లో అంబకంటి యువకుడు మృతి
కుంటాల: మండలంలోని అంబకంటికి చెందిన బొల్లపల్లి రవికుమార్ (34) పదేళ్లక్రితం ఉపాధి కోసం జోర్డాన్ వెళ్ళి అక్కడి ఎర్బిడ్ పట్టణంలో క్లాసికల్ ఫ్యాషన్ అప్పరిల్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే ఇదే గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహంకాగా ఐదు నెలల క్రితమే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. లుకోమియా వ్యాధితో బాధపడుతుండగా అదే కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన రాంగోపాల్ను తోడుగా ఇచ్చి ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఆగస్టు 30న స్వగ్రామానికి వస్తుండగా షార్జాలో ఫ్లైట్ మార్చే క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో షార్జాలోని అల్ క్వాసిమి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ షాక్తో రైతు మృతిదహెగాం: విద్యుత్షాక్తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ఉత్తం తెలిపిన వివరాల మేరకు పీకలగుండం (చర్చిగూడ)కు చెందిన రైతు గోమాస పోశం (60) గురువారం మధ్యాహ్నం భార్య లాంచుబాయితో కలిసి పొలానికి వెళ్లాడు. మోటర్ ఆన్చేస్తుండగా షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గోమాస అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..కుభీర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు పార్డి(కె) గ్రామానికి చెందిన మహార్ శ్రీనివాస్ (30) బుధవారం రాత్రి పుస్పూర్లో ఉన్న అత్తగారింటికి బైక్పై వెళ్లివస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపక్కన చెట్టుకు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం పల్సి గ్రామానికి చెందిన వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పార్డి(కె) వాసి శ్రీనివాస్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య ప్రేమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో 14 రోజుల రిమాండ్ చోరీ కేసులో నిందితుడి అరెస్టుసోన్: మండల కేంద్రంలోని బ్రాహ్మణమఠంలో ఇటీవల చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మండల కేంద్రానికి చెందిన శివరాత్రి సేనాపతి జల్సాలకు అలవాటుపడ్డాడు. ఇటీవల బ్రాహ్మణమఠం తాళం పగులగొట్టి అందులో ఉన్న అతి పురాతనమైన వంటసామగ్రిని ఎత్తుకెళ్లాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకునేవాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు. -
అపోహలను తొలగించే జానపద ప్రచారాలు
చెన్నూర్: జానపద ప్రచారాలు అపోహలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎంహెచ్వో అనిత అన్నారు. స్థానిక సీహెచ్సీలో ఎస్ఎన్ఎస్పీఏ కార్యక్రమంలో భాగంగా బుధవారం హెచ్ఐవీ, ఎయిడ్స్ కోసం సమీకృత వ్యూహం, అవగాహన సదస్సు నిర్వహించారు. జానపద కళాకారులు పాటల ద్వారా హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ సాంప్రదాయ జానపద మీడియా ద్వారా నృత్యం, కళారూపాలను వినియోగించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. పీవో సుధాకర్నాయక్ మాట్లాడుతూ మొబైల్ పరీక్షలు, కౌన్సెలింగ్ సేవలపై జానపద పదర్శనలతో పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, రోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు
చెన్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక సీహెచ్సీలో డీఎంహెచ్వో అనితతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సీ్త్ర.. శక్తివంతమైన కుటుంబం కోసం జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణులు మహిళలు, యువతులు, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పర్యవేక్షకులు కోటేశ్వర్రావు, జిల్లా సంక్షేమాధికారి రౌవూఫ్ఖాన్, వైద్యులు సత్యనారాయణ, ప్రపాద్, కృపాబాయి, భీష్మ, శ్రీధర్, సుధాకర్నాయక్, హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ఈఎంటీలకు అవార్డులు చెన్నూర్ 108 అంబులెన్స్ ఈఎంటీ పోచన్న, వేమనపల్లి ఈఎంటీ జాడి స్వరూప, మంచిర్యాల 102 సర్వీసులో పని చేస్తున్న కెప్టెన్ శంకర్లకు బుధవారం చెన్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉత్తమ అవార్డులు అందజేశారు. రాష్ట్రంలోనే 108 సేవల్లో చెన్నూర్, వేమనపల్లి మండలాలు ప్రథమ స్థానంలో నిలిచాయని కలెక్టర్ తెలిపారు. అవార్డులు అందుకున్న ఈఎంటీలను రాష్ట్ర 108 కార్యాలయ ప్రధానాధికారి కిశోర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, మంచిర్యాల కార్యనిర్వహణాధికారి సంపత్, వైద్యులు అభినందించారు. -
ప్రబలుతున్న డెంగీ జ్వరాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రాంతంలో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పంజా విసురుతున్నాయి. పారిశుద్ధ్యం లోపించి, వర్షాలతో నీరు స్థిరంగా నిలిచి దోమలు వృద్ధి చెందడం వల్ల జ్వరాలు వ్యాపిస్తున్నాయి. గత రెండు నెలలో వ్యవధిలో నిర్వహించిన డెంగీ ర్యాపిడ్ టెస్టులో 28మందికి పాజిటివ్ రాగా, మరో 25మంది మలేరియా బారిన పడ్డట్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించుకోగా బయటపడిన కేసులు కాగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారి సంఖ్య ఇంతకు రెట్టింపుగా ఉన్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్సెంటర్, బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రబలే డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజలకు కనీస అవగాహన కల్పించకపోవడం, ముందస్తు చర్యలపై శ్రద్ధ వహించకపోవడం వల్ల వ్యాధులు విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య శిబిరాలపై నిర్లక్ష్యం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రికార్డు అవుతున్న డెంగీ, మలేరియా జ్వరాల గణాంకాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గత జూలైలో బెల్లంపల్లి టేకులబస్తీలో ఓ చిన్నారికి డెంగీ పాజిటివ్ రాగా బస్తీలో వైద్య శిబిరం నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జ్వరాల కేసులునెల డెంగీ ర్యాపిడ్ మలేరియా పాజిటివ్జూలై 17 15 ఆగస్టు 10 6 సెప్టెంబర్ 1 4 (15వ వరకు)భయభ్రాంతులకు గురికావద్దువర్షాలు విస్తారంగా కురుస్తుండడం వల్ల ఇళ్లు, పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, డ్రమ్ములు, కూలర్లలో దోమలు వృద్ధి చెంది జ్వరాల వ్యాప్తికి కారణమవుతాయి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. డెంగీ పాజిటివ్ నిర్ధారణ జరిగితే వెంటనే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దు. – డాక్టర్ సుధాకర్నాయక్, డెప్యూటీ డీఎంహెచ్ఓ, బెల్లంపల్లి -
యూరియా కోసం ఆందోళన
వేమనపల్లి: యూరియా కోసం నీల్వాయిలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. 660 యూరియా బస్తాలు రాగా ఏఓ వీరన్న రైతులకు ఒక్కో బస్తా పంపిణీ చేశారు. ఏడుగురు రైతులకు కూపన్లు ఇచ్చిన యూరియా బస్తాలు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లో మళ్లీ యూరియా వస్తుందని, అందజేస్తామని అధికారులు చెప్పడంతో శాంతించారు. ఎస్సై కోటేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యవసాయాధికారి పరిశీలన మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం పడ్తనపల్లి పీఏసీఎస్లో రైతులకు విక్రయిస్తున్న యూరియా నిల్వలను జిల్లా వ్యవసాయాధికారి సురేఖ పరిశీలించారు. రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ మామిడి కృష్ణ, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్, ఏఓ కృష్ణ పాల్గొన్నారు. -
వాస్తు శిల్పి పితామహుడు విశ్వకర్మ
● ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు మంచిర్యాలఅగ్రికల్చర్: వాస్తు శిల్పి, ప్రతిమ శాస్త్ర పితామహుడు విరాట్ విశ్వకర్మ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం, విజయ్కుమార్, రమేష్, కస్తూరి శ్రీనాథ్చారి, రావుల హరీష్చారి, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ సదస్సు విజయవంతం చేయండి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్లో రెండ్రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు విజయవంతం చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ అన్నారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలను సందర్శించిన సందర్భంగా సద స్సు కరపత్రాలను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. కళాశాల యాజమాన్యం సమస్యలు, ప్రస్తుత అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఐరన్ మ్యాన్స్ విజినరీ లీడర్షిప్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే.కిషన్ ఓజా, సెమినార్ కన్వీనర్ డాక్టర్ కే.రాజయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నరేందర్రెడ్డి, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.గంగయ్య, స్టాఫ్ క్లబ్ సెక్రెటరీ గోపాలకృష్ణ, ఎన్సీసీ కమాండర్ జాడి మహేష్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఘనంగా సాయుధ పోరాట వార్షికోత్సవం
రామకృష్ణాపూర్: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం ఆ నాడు అసలు సిసలైన పోరాటాలు సాగించిన అమరవీరులకు నివాళులర్పిస్తూ వారిని స్మరించుకునేందుకు సాయుధ పోరాట దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని పలు ప్రధానకూడళ్లలోనూ జెండా ఆవిష్కరణలు చేశారు. కార్యక్రమంలో నా యకులు మిట్టపెల్లి శ్రీనివాస్, గోపి, ఇప్పకాయల లింగయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
అనతికాలంలోనే అభివృద్ధి
మంచిర్యాల అగ్రికల్చర్: అనతికాలంలోనే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమంతోపాటు అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..రేషన్కార్డులు పంపిణీజిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 26,510 నూతన రేషన్కార్డులు అందించడంతోపాటు 60,790మంది పేర్లు చేర్చాం. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. పోర్టబులిటీ విధానం ద్వారా ఏ ప్రాంతంలోనైనా రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునే వీలు కలిగింది.ఇందిరమ్మ ఇళ్లుఅర్హులైన నిరుపేదలను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 10,503 ఇళ్లు మంజూరు కాగా, 6,682 గ్రౌండింగ్, 3,464 బేస్మెంట్, 400 గోడలు, 107 స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. లబ్ధిదారుల ఖాతాలో రూ.33.39 కోట్లు జమ చేశాం.రాజీవ్ ఆరోగ్యశ్రీరాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. జిల్లాలో 28,280 మంది పేదలు చికిత్స పొందారు. ఇందుకు గాను రూ.63.71 కోట్లు ఖర్చు చేశాం.మహాలక్ష్మీ పథకంమహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. జిల్లాలో 2.36 కోట్ల మంది మహిళలకు రూ.85.83 కోట్లు లబ్ధి చేకూరింది. రూ.500కే వంటగ్యాస్ సరఫరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక భారం తగ్గించి, జిల్లాలో 1,22,837 మంది లబ్ధిదారులకు రూ.14.63 లక్షలు రాయితీ మంజూరు చేశాం.గృహజ్యోతి..200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా ప్రతీ నెల లక్ష నివాసాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఇప్పటివరకు 1,26,358 మంది వినియోగదారులకు రూ.81.50 కోట్లు లబ్ధి చేకూర్చాం.భూభారతిభూభారతి నూతన చట్టంపై ప్రతీ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. 51,503 దరఖాస్తులు రాగా 26,744 అంగీకరించి పరిశీలనలో ఉన్నాయి. గ్రామస్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసం 168 క్లస్టర్లకు గ్రామ పాలన అధికారులను నియమించాం.చేరువైన వైద్యం..జిల్లాలో ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తోంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల భవనానికి రూ.40 కోట్లు మంజూరు చేయగా పనులు సాగుతున్నాయి. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో అధునాతన వైద్య కళాశాల నిర్మాణం జరుగుతోంది.విద్యారంగం బలోపేతంజిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి మిగతా పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 40శాతం డైట్, 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంచి నూతన మెనూ అమలు చేస్తూ, సకాలంలో పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి జిల్లాలోని దండేపల్లి మండలం రెబ్బెనపల్లి, చెన్నూర్ మండలం సోమనపల్లి, బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. హాజీపూర్, దండేపల్లి, కన్నెపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో కేజీబీవీలను ఇంటర్మీడియెట్ కళాశాలలుగా నవీకరించాం.● జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ, నీటి పారుదల, ఖనిజ వనరులు జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి. గూడెం సత్యనారాయణస్వామి, వేలాల రాజరాజేశ్వరస్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవ్వాల్ అభయారణ్యం, గాంధారి ఖి ల్లా, గాంధారి వనం పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ ఎగ్గడి భాస్కర్, అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.మున్సిపాలిటీలుమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఐదు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పబ్లిక్ టాయిలెట్స్, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. మంచిర్యాలలో రూ.10.22 కోట్ల వ్యయంతో అత్యుత్తమంగా మహా ప్రస్థానం నిర్మించాం. అమృత్ 2.0 పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు రూ.275 కోట్లు మంజూరు చేసి పురోగతిలో ఉన్నాయి.రైతులకు రుణమాఫీరాష్ట్రంలో 25.35లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం మన రాష్ట్రం చేసి చరిత్ర సృష్టించింది. రైతుల విషయంలో రాజీలేని రుణవిముక్తులను చేసి అత్యధికంగా పంట పండించే దిశగా ప్రోత్సహిస్తోంది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12వేలు పెట్టుబడి సాయం, పరిమితి లేకుండా అందించాం. జిల్లాలో వానాకాలం పంటకు 1,52,162 మంది రైతులకు రూ.198.13 కోట్లు అందించాం. రైతు బీమా పథకం కింద 83,114మంది రైతులను చేర్చి ఇప్పటివరకు 347మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.17.35కోట్లు అందజేశాం. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేసి సన్నరకానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. -
ఘనంగా విమోచన దినోత్సవం
మంచిర్యాలటౌన్/చెన్నూర్: మంచిర్యాల, చెన్నూర్లోని బీజేపీ కార్యాలయాల్లో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాకట్టు పెట్టిన గొప్ప పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినో త్సవం అధికారికంగా నిర్వహిస్తామని అన్నా రు. చెన్నూర్లోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, కమలాకర్రావు, పట్టి వెంకటకృష్ణ, తుమ్మ శ్రీపాల్, నాయకులు పాల్గొన్నారు. -
చెన్నూర్లోనూ బాధితులు
చెన్నూర్: చెన్నూర్ పట్టణ ప్రజలు మొన్నటి వరకు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడగా.. ప్రస్తుతం డెంగీ ఫీవర్ వణికిస్తోంది. గత పక్షం రోజులుగా జ్వరాల బారిన పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని లైన్గడ్డ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితోపాటు మరో కుటుంబానికి చెందిన ఒకరికి డెంగీ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ముగ్గురు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలంలో దోమల నివారణ చేపట్టాల్సిన అధికారులు నామమాత్రంగా ఫాగింగ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. చెత్తకుప్పలు కుళ్లిపోతున్నా తొలగించడం లేదు.దళితవాడలను పట్టించుకోరుకాలనీలో మురికి కాలువలు నిండి కంపుకొడుతున్నా, ముళ్ల పొదలు పెరిగి దోమలు విజృంభిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేరు. మెయిన్ రోడ్లలో డ్రైనేజీలు శుభ్రం చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దళితవాడలను పట్టించుకున్న పాపాన పోలేదు. దళితవాడల్లో దోమల నివారణ చర్యలు చేపట్టి రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – తగరం అశోక్, ఇందిరనగర్ కాలనీచెత్త తీసేటోళ్లు లేరు..కాలనీల్లో చెత్త తీసేటోళ్లు వస్తలేరు. గతంలో ప్రతీరోజు చెత్త బండ్లు వచ్చేవి. ఆరు నెలల నుంచి వారానికి ఒక్క రోజు వచ్చిన దాఖలాలు లేవు. చెత్త తీయకపోవడంతో వర్షాలకు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పన్నుల వసూలుకు వత్తుండ్లు. ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తలేరు. అధికారులు స్పందించి కాలనీలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. – ఎస్డీ.జాకీర్, లైన్గడ్డ -
రాయితీ సిలిండర్లు పట్టివేత
వాంకిడి(ఆసిఫాబాద్): హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లను పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్కుమార్, శ్రీనివాస్ బు ధవారం తెలిపారు. వాంకిడి మండల కేంద్రంలోని తెలంగాణ హోటల్, నేచర్ టీ స్టాల్, రి యాజుద్దీన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫ్రెండ్స్ విల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, పాడ్యావర్చా చాహా టీ స్టా ల్లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగ రాయితీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మోటార్సైకిల్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
తాండూర్: మండలంలోని రేచిని–గోపాల్నగర్ మూలమలుపు వద్ద బుధవారం మోటార్సైకిల్ను స్కూల్బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్లోని సెయింట్ థెరి స్సా స్కూల్ బస్సు రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రా మం నుంచి విద్యార్థులను తీసుకొస్తుండగా రేచి ని–గోపాల్నగర్ మూలమలుపు వద్ద మోటార్సైకిల్ను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో గోపాల్రావుపేట గ్రామానికి చెందిన పోగుల నానక్క, పీరిట్ల మారుతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నానక్క(40) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కొడుకును పాఠశాలకు పంపేందుకు వచ్చి.. పోగుల నానక్క తన కుమారుడు అన్షిత్ను సెయింట్ థెరిస్సా పాఠశాలకు పంపేందుకు స్టేజీ వద్దకు వచ్చి బస్సు ఎక్కించి పంపించింది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన పీరిట్ల మారుతి యూరియా బస్తాల కోసం రేచినికి వెళ్తున్నాడు. విషయం తెలిసిన నానక్క తాను కూడా యూరియా కోసం వస్తానని మారుతి మోటార్సైకిల్పై వెళ్లింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే బస్సు మృత్యు శకటమై ఢీకొట్టింది. నానక్కకు భర్త మల్లేష్, కుమారుడు ఉన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం సెయింట్ థెరిస్సా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు పనితీరు, పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్కూల్ బస్సు డ్రైవర్ డ్రంకెన్డ్రైవ్లో పోలీసులకు చిక్కాడు. మద్యం సేవించి బస్సు నడుపుతున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహించినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
గోదావరిలో పెరుగుతున్న వరద
బాసర: ఎగువన కురుస్తున్న వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ పర్బాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో గోదావరినదిలోకి భారీ గా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో నదీతీరంలోని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు. ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల, రెవెన్యూ అధికారులు గోదావరి నది వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్లీ వరదనీరు బాసరలో 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓనీ, కౌట, సావర్గాం, సాలాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారులు గోదావరి బ్యాక్వాటర్తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి. -
ఇందిరమ్మ ఇల్లు ఒకరికి.. బిల్లు మరొకరికి
ఇచ్చోడ: ఇందిరమ్మ ఇల్లు ఒకరికి మంజూరైతే పంచాయతీ కార్యదర్శి బిల్లు మరొకరికి అందజేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లే నందబాయి భర్త సంతోష్కు ఇందిరమ్మ ఇల్లు మంజురైంది. జూన్ 2న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే గ్రామంలో ముస్లే నందబాయి భర్త మారుతికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ నిర్వాకం వల్ల బేస్మెట్ వరకు నిర్మాణం పూర్తయిన నందబాయి (భర్త మారుతి)కి వచ్చే బిల్లు ఇంకా పనులు ప్రారంభించని నందబాయి (భర్త సంతోష్) బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ అయ్యాయి. ఈ బిల్లు విషయంలో గ్రామంలో పక్షం రోజులుగా రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. కాగా, కార్యదర్శి తన తప్పు సరిదిద్దుకోవడానికి మరో తప్పు చేసి వివాదానికి తెరలేపాడు. డబ్బులు ఖాతాలో జమ కావాలంటే బ్యాంక్ వోచర్పై సంతకాలు పెట్టాల్సి ఉంటుందని నందబాయి, ఆమె భర్త సంతోష్ను ఇచ్చోడ బ్యాంక్కు పిలిపించాడు. ఈ నెల 3న వోచర్లపై సంతకాలు తీసుకొని ఆమె అకౌంట్లో జమ అయిన డబ్బులను నందబాయి భర్త మారుతి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించాడు. విషయం బయటకు పొక్కడంతో సంతోష్తో పాటు గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యదర్శిని నిలదీశారు. దీంతో కార్యదర్శి తన తప్పు ఒప్పుకొని వారం రోజుల్లో నందబాయి భర్త సంతోష్కు రూ.లక్ష ఇస్తానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో సంతోష్ రెండు రోజుల క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎంపీడీవో అనంద్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇద్దరు లబ్ధిదారుల పేర్లు ఒకేలా ఉండటంతో ఒకరికి వచ్చే బిల్లు మరొకరి అకౌంట్లో జమ అయినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
రేపు జీఎం కార్యాలయాల ముట్టడి
శ్రీరాంపూర్: సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 19న కంపెనీ వ్యాప్తంగా జీఎం కార్యాలయాలు ముట్టడించనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్లోని ఆర్కే 5, ఆర్కే న్యూటెక్, ఎస్సార్పీ ఓసీపీ గనులపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం మధ్య జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందాల అమలుపై ఉత్తర్వులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ 12న స్ట్రక్చరల్ సమావేశం బహిష్కరించినట్లు తెలిపారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ ప్రతినిధులు ప్రసాద్రెడ్డి, బద్రి బుచ్చయ్య, సంపత్, అద్దు శ్రీనివాస్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, ఫిట్ సెక్రెటరీ మోతె లచ్చన్న పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జైపూర్: మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన పత్తి రాజ్కుమార్(33) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించగా చిక్సిపొందుతూ గోదావరిఖని ఆస్పత్రిలో బుధవారం మృతిచెందాడు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ పని చేస్తూ జీవించే రాజ్కుమార్ కొన్ని రోజులుగా ఖాళీగా ఇంటి వద్ద ఉంటున్నాడు. పనికి వెళ్లాలని భార్య మానస, తల్లిదండ్రులు సూచించారు. ఇదే విషయంలో భార్యాభర్తల తరచూ గొడవలు జరిగేవి. గత నెల 20న భార్యతో గొడవపడి ఇంట్లో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్కు తరలించారు. అక్కడి నుంచి మళ్లీ ఈ నెల 10న గోదావరిఖని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య మానస, కూతురు శ్రీశ్వ, కుమారుడు శ్రీహాన్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఏస్సై హాబీబ్ తెలిపారు. -
‘కార్మికులను వేధిస్తున్న గని మేనేజర్’
మందమర్రిరూరల్: ఏరియాలోని కేకే–5 గనిలో ఇష్టానుసారంగా కార్మికులకు లెటర్లు పంపిణీ చేస్తూ గని మేనేజర్ వేధింపులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. బుధవారం కేకే–5 వద్దకు చేరుకున్న పలు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన కార్మికులను కలుసుకుని వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం గని సేఫ్టీ ఆఫీసర్ రమేష్తో మాట్లాడగా గని మేనేజర్ అందుబాటులో లేరని, వచ్చాక మాట్లాడుదామని నచ్చజెప్పడంతో కార్మికులు యధావిధిగా విధుల్లోకి వెళ్లారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎమ్మెస్ నాయకులు పాల్గొన్నారు. -
వీడని జంట మరణాల మిస్టరీ..!
మంచిర్యాలక్రైం: జిల్లాలో సంచలనం సృష్టించిన నా నమ్మ, మనవరాలి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పోలీసులు పలు కోణాల్లో విచారణ చే స్తున్నా కొలిక్కి రావడం లేదని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణాలకు కారణం ఏమిటనేది తెలిసే అవకాశం ఉంది. మంచిర్యాలలోని గోపాలవాడ శివారు రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇంట్లో ఖమ్మంలోని 3వ టౌన్ ప్రాంతానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష(4) ఈ నెల 10న మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను విచారించినట్లు సమాచారం. ఇల్లు అమ్మడానికి వచ్చి.. ఖమ్మంలోని 3టౌన్ ప్రాంతానికి చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, ట్రాన్స్జెండర్గా మారిన శిరీష ఉన్నారు. ట్రాన్స్జెండర్ శిరీష రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఇల్లు నిర్మించుకుంది. 2022 జనవరి 4న అనుమానాస్పద స్థితిలో ఇదే ఇంట్లో చనిపోయింది. కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో స్థానిక ఉండే ఓ ఆర్ఎంపీతో సత్యవతి కుటుంబ సభ్యులకు పరిచయం ఏర్పడింది. సత్యవతి ఆర్ఎంపీతో కాస్త చనువుగా ఉండేదని, ఇంటి మరమ్మతులకు రూ.50వేలు ఇంట్లో ఎవరికీ తెలియకుండా అప్పుగా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో ఆరు నెలల క్రితం ఆర్ఎంపీతో సత్యవతి భర్త చంద్రయ్యకు మధ్య గొడవ జరిగింది. ట్రాన్స్జెండర్ శిరీష ఇంటిని కొనడానికి పార్టీ సిద్ధంగా ఉందంటూ ఆర్ఎంపీ పిలిపించడంతో ఈ నెల 8న సత్యవతి, కుమారుడు గంగోత్రి, ఇతడి కూతురు గీతశిరీష కలిసి వచ్చారు. వచ్చిన రోజు ఆర్ఎంపీ స్పందించకపోవడంతో మరుసటి రోజు సత్యవతి, గీతశిరీష ఇక్కడే ఉండగా.. గంగోత్రి వెళ్లిపోయాడు. సాయంత్రం సత్యవతి తన కుమారుడు గంగోత్రికి ఫోన్ చేసి తనకు పాపకు విరేచనాలు, వాంతులు అవుతాయని చెప్పింది. 10న తెల్లవారే సరికి ఇద్దరూ మృతిచెంది ఉండడం కలకలం రేపింది. అన్నీ అనుమానాలే..! సత్యవతి, గీతశిరీష ఎలా మృతిచెందారు..? హత్య, ఆత్మహత్యా..? ఒకవేళ ఆత్మహత్య అయితే కారణాలు ఏంటి.. హత్య అయితే ఎవరు చేసి ఉంటారు.. ఎందుకు.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలంలో తెల్లకల్లు ప్లాస్టిక్ బాటిల్, పాల డబ్బా, వాటర్ బాటిల్, వండుకున్న ఎగ్ కర్రీ, వైట్ రైస్, ఛాయ్ లభించడంతో పోలీసులు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. సత్యవతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక వేళ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ఏ పాపం తెలియని పసిపాప శిరీష ఏం చేసింది. వాంతులు, విరేచనాలు తగ్గేందుకు స్థానికంగా ఉండే ఆర్ఎంపీని సంప్రదిస్తే ఇద్దరికీ వైద్యం అందించాడా..? ఒకవేళ అదే జరిగితే వైద్యం వికటించిందా..? లేదా రాత్రి వంట చేసుకొని తిన్నారు. సత్యవతి తెల్ల కల్లు తాగింది. కల్లులో గానీ ఎగ్ కర్రీలో గానీ ఎవరైన విష పదార్థాలు కలిపారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఫుడ్ ఫాయిజన్ అయినా కావాలి. విష ప్రయోగమైనా జరిగి ఉండాలి. వైద్యం వికటించి అయినా జరగాలి. గీతశిరీష మృతదేహం రంగు మారడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా పోస్ట్మార్టం నివేదికపై ఆధారపడి ఉందని పోలీసులు చెబుతున్నారు. -
సాయుధులై పోరుబాట..!
బెల్లంపల్లి: నిజాం నిరంకుశ, రాచరిక పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటంలో జిల్లా వాసులూ కీలకపాత్ర పోషించారు. బెల్లంపల్లికి చెందిన కమ్యూనిస్టు నాయకులు అగ్రభాగాన నిలిచారు. పీడిత ప్రజల విముక్తి కోసం తుపాకి పోరాటం సాగించారు. సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధులు బాశెట్టి గంగారాం, జే.కుమారస్వామి, పోతుగంటి పోశెట్టి సాయుధ పోరులో రహస్య జీవితాన్ని గడిపారు. ఆదివాసీలు, అట్టడుగు ప్రజలతో మమేకమై దొరలు, భూస్వాములు, నైజాం పోలీసులు, రజాకార్ల దాష్టీకాలపై నిప్పురవ్వలై చెలరేగారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రత్యేక కథనం. మెరుపుదాడుల్లో ప్రత్యేకతసాయుధ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు యోధులు జన్నారం, ఉట్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ), చెన్నూర్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించారు. ప్రజాకంఠకులైన దొరలు, భూస్వాముల గడీలపై ఎన్నోమార్లు కరువుదాడులు చేసి ధాన్యం, ఎండుమిర్చి, పప్పు తదితర నిత్యావసర వస్తువులను పేదలు, గిరిజనులకు పంచి పెట్టారు. నిజాం పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరించి భూస్వాములు, దొరలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. భూస్వాముల భూముల దస్తావేజులను మంటల్లో ఆహుతి చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. బాశెట్టి గంగారాం నాయకత్వంలోని దళం మెరుపుదాడులు సాగించడంలో ప్రత్యేకత ఏర్పర్చుకుంది. తిర్యాణి ప్రాంతంలోని గిన్నెధరి, రోంపల్లి, గంగాపూర్ తదితర ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించింది. భూస్వామిగా భ్రమపడిఆసిఫాబాద్కు చెందిన భూస్వామి పైకాజీని అంతం చేయాలని కమ్యూనిస్టు సాయుధ దళం నిర్ణయించింది. తాండూర్ మండలం రాంపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో రాత్రివేళ సేదదీరడానికి భూస్వామి పైకాజీ వస్తున్న సమాచారం అందడంతో దళం అప్రమత్తమైంది. ఆ ఇంటి వద్ద మంచంపై నిద్రిస్తున్నట్లుగా తెలుసుకుని దళం దాడి చేసి హతమార్చింది. ఆ రోజు భూస్వామికి పైకాజీకి బదులు అతడి గుమాస్తా వచ్చి దళం చేతిలో హత్యమయ్యాడు. ఈ ఘటన ఆ రోజుల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచార లోపంతో జరిగిన ఘటనపై దళం విచారం వ్యక్తం చేసింది. ‘భీమ్’ను పట్టిచ్చిన ఇన్ఫార్మర్ను హతమార్చిన దళంజల్, జంగల్, జమీన్ కోసం పోరాటం సాగించిన గోండు వీరుడు కుమురంభీం నిజాం పోలీసులకు ప్రధాన లక్ష్యంగా మారాడు. భీమ్ను లక్ష్యంగా చేసుకుని పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మడావి కొద్దు అనే ఇన్ఫార్మర్ ఇచ్చిన పక్కా సమాచారంతో నిజాం పోలీసులు కుమురంభీమ్ను కాల్చి చంపినట్లు ప్రచారంలో ఉంది. దీంతో తెలంగాణ సాయుధ గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు దిగ్గజాలు రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వర్రావు, పుచ్చలపల్లి సుందరయ్య, రాజ్బహదూర్గౌర్, దేవూరి శేషగిరిరావు తీవ్రంగా స్పందించి ఇన్ఫార్మర్ను మట్టుబెట్టాలని తిర్యాణి ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న బాశెట్టి గంగారాం నాయకత్వంలోని దళానికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇన్ఫార్మర్ మడావి కొద్దును కాల్చి చంపారు.లంబాడితండాలో ఆశ్రయంఆదివాసీ ప్రాంతాల్లో దాడులు సాగించిన కమ్యూనిస్టు దళాలు పోలీసుల నిఘా పెరిగి గాలింపు చర్యలు తీవ్రమైన ప్రతీసారి బెల్లంపల్లి శివారు లంబాడితండా గ్రామంలో ఆశ్ర యం పొందేవారు. గ్రామస్తులు దళాలకు ఆశ్రయం కల్పించి అండగా నిలిచారు. పోలీ సు బలగాలకు దళ నాయకుల గుట్టు తెలి యకుండా కాపాడుకున్నారు. ఓసారి పోలీ సులు గ్రామంలోకి రాగా.. ఆ సమాచారం క్షణాల్లో షెల్టర్ ఇంట్లో ఉన్న దళ నాయకుడు కుమారస్వామికి కొరియర్లు చేరవేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో కుమారస్వామి మహిళగా వేషం మార్చుకుని పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. కమ్యూనిస్టు సాయుధ దళాలకు సుకాసి బాలయ్య, సుకాసి పోశం, సల్లం పోశం ప్రధాన కొరియర్లుగా వ్యవహరించారు. చెన్నూర్ తొలి ఎమ్మెల్యే..1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నూర్కు చెందిన స్థానికుడు తొలి ఎమ్మెల్యేగా సూరికి పేరుంది. 1952 నుంచి 57 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. నాటి నుంచి నేటి వరకు స్థానికుడు, చెన్నూర్ పట్టణానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయ్యింది విశ్వనాథ సూరి మాత్రమే. -
అవసరం మేరకు యూరియా పంపిణీ
భీమారం/జైపూర్: జిల్లాలో సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భీమారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులతో మా ట్లాడారు. మండలంలో గత ఏడాది 14 మెట్రిక్ ట న్నుల యూరియా వినియోగించారని, ఈ ఏడాది ఇ ప్పటికే 11 టన్నులు పంపిణీ చేశామని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో పీఏసీఎస్, జిల్లా మార్కెటింగ్ సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భీమారం, జైపూర్లోని కస్తూర్భాగాంధీ విద్యాలయాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. జైపూర్లో తరగతి గదులు, రిజిష్టర్లు, వంటసామగ్రి పరిశీలించారు. గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షించాలి మంచిర్యాలటౌన్: గోదావరి నదిలో వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో గోదావరి నది వరద ఉధృతిని మంగళవారం ఆయన తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్తో కలిసి పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బందిని నియమించి, నీటి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. పాతమంచిర్యాలలో ఇందిరా మహిళా భవన్ నిర్మాణ పనులు పరిశీలించారు. -
అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధి
రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయా వార్డుల్లో నెలకొ న్న సమస్యలు తెలుసుకుని రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ అమృత్ స్కీం ద్వా రా నియోజకవర్గంలో రూ.100 కోట్లతో మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే జనవరి నాటికి పూర్తవుతాయని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజు, పార్టీ నాయకులు పల్లెరాజు, రఘునాథ్రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా చెన్నూర్/చెన్నూర్రూరల్: కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం మంత్రి పట్టణంలోని పలు వీధుల్లో మార్నింగ్ వాక్ చేశారు. 2.0 వాటర్ ట్యాంక్లు, అంబేడ్కర్ భవన నిర్మాణాలు పరిశీలించారు. మండలంలోని కిష్టంపేట గ్రామంలో బోరును ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
● నిజాం సర్కారు గుండెల్లో ఫిరంగుల మోత ● అప్పటి గవర్నర్ బస ● సర్ధార్ వల్లభాయ్ పటేల్ సందర్శించినట్లు ప్రచారం
చెన్నూర్: నాడు నిజాం సర్కారు నియంతృత్వ పాలనను అంతమొందించేందుకు మిలిటరీ దళాలు మహారాష్ట్రలోని సిరొంచలో ఉన్న అద్దాల మేడను స్థావరంగా చేసుకున్నాయి. ఇక్కడి నుంచే ఫిరంగుల మోత మోగించాయి. కోటపల్లి మండలం రాపన్పల్లికి మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాణహిత నది అవతలి ఒడ్డున సిరొంచలో అద్దాల మేడ ఉంది. 1901లో బ్రిటీష్ కాలంలో అప్పటి కలెక్టర్ గ్లాస్ ఫోర్డ్ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని సిరొంచ ప్రాణహిత నది ఒడ్డున నిర్మింపజేశారు. ఇండియన్ మిలిటరీ సైనికులు అద్దాల మేడను స్థావరంగా చేసుకుని నిజాం సర్కారుపై పోరాటం సాగించారు. ఆనాడు నిజాంపై పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు అద్దాల మేడలో తలదాచుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచే మిలిటరీ సైనికులు హైదరాబాద్లోని నిజాం సర్కారుపై పోరాటానికి వ్యూహారచన చేశారని చెప్తుంటారు. ఆనాడు కలెక్టర్, గవర్నర్ బంగ్లాగా అద్దాలమేడను వినియోగించేవారు. జిల్లా కేంద్రంగా..ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సిలో అప్పర్ గోదావరి జిల్లా కేంద్రంగా సిరొంచా ఉండేది. సిరొంచా జిల్లా పరిధి అప్పటి ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం, ఖమ్మం, ఏటూరునాగారం, కరీంనగర్, మరోవైపు జన్నారం, లక్సెట్టిపేట వరకు విస్తరించి ఉంది. స్వాతంత్య్రం అనంతరం రాష్ట్రాల విభజన తర్వాత భద్రాచలం, ఖమ్మం, ఏటూరునాగారం, కరీంనగర్, జన్నారం, లక్సెట్టిపేట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సిరొంచ మహారాష్ట్రలో భాగమైంది.ఇవీ విశేషాలు..గవర్నర్ బస..1947లో మద్రాసు గవర్నర్ పట్టాభి సీతారామయ్య ఈ భవనంలో బస చేశారు. హైదరాబాద్ నిజాం సర్కార్తో చర్చలు జరపడానికి అప్పటి హోంశాఖ మంత్రి వల్లభాయ్ పటేల్ అద్దాల మేడకు వచ్చినట్లు సమాచారం. పీవీ నరసింహారావు సైతం అద్దాల మేడను సందర్శించిన ప్రముఖల్లో ఉన్నారు. ఉద్యమ కేంద్రంగా ప్రధాన భూమిక పోషించి మరాఠీ, హిందీ, తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిన ఈ అద్దాలమేడ నేడు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మిలిటరీ స్థావరం.. అద్దాల మేడ -
నేడు ప్రజాపాలన దినోత్సవం
మంచిర్యాలఅగ్రికల్చర్/నస్పూర్: జిల్లా కేంద్రంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు హాజరు కానున్నారు. మంగళవారం రాత్రి శ్రీరాంపూర్లోని సింగరేణి గెస్ట్హౌస్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ కుమార్ దీపక్ స్వాగతం పలికారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏసీపీ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు కలెక్టరేట్కు చేరుకుంటారు. 10 గంటలకు జాతీయ జెండావిష్కరణ, తదితర కార్యక్రమాలు ఉంటాయి. -
పాలకవర్గాలు రద్దు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లాలో 11 పీఏసీఎస్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లను తొలగిస్తూ వారి స్థానంలో పర్సన్ ఇన్చార్జీలుగా సహకార సంఘ అధికారులను నియమించారు. జిల్లాలో 20 పీఏసీఎస్లు ఉండగా.. 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం గత ఆగస్టుతోనే ముగిసింది. ప్రభుత్వం సొసైటీలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా పాలకవర్గాలను యధాతథంగా వచ్చే ఫిబ్రవరి వరకు పొడగించింది. దీంతో గత ఆగస్టుకు ఐదేళ్లు పూర్తయి కొత్త పాలకవర్గాల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా నిలిచిపోయాయి. పలు సొసైటీల నిర్వహణలో చైర్మన్లు, ఇతర సభ్యులు, సీఈవోలపై ఆరోపణలు రావడంతో చివరికి పాలకవర్గాలనే రద్దు చేసింది. రుణాలు, నిధుల దుర్వినియోగంగత ఐదేళ్ల కాలంలో పలు చోట్ల పాలకవర్గాల చైర్మ న్లు అవినీతికి పాల్పడ్డారు. రైతులకు రుణాల మంజూరు, మాఫీ సమయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా సొసైటీ నిర్వహణలో సీఈ వోలు, ఇతర సిబ్బంది అక్రమాలు సైతం వెలుగులో కి వచ్చాయి. ఇటీవల ఎరువుల పంపిణీలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు గతంలో విజిలెన్స్, శాఖ పరమైన విచారణలు జరిగాయి. ముఖ్యంగా చైర్మన్లు, ఇతర సభ్యులు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించకపోవడం వంటివి ఉన్నా యి. ఈ ఆరోపణలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స హకార శాఖ అధికారులు గత కొద్దిరోజులుగా విచా రణ చేపట్టారు. నిజమేనని తేలడంతో రద్దు చేశారు. ఆదాయం లేక అవస్థలుగ్రామీణ ప్రాంతాల్లో రైతులకు స్వల్పకాలిక పంట రుణాలు, ఎరువులు, యంత్రాలు, ఇతర సబ్సిడీ పంపిణీలో సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. కానీ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలు కనీస ఆదాయం లేక కొట్టుమిట్టాడుతున్నా యి. రైతులకు రుణాల పరపతి పెంచుతున్నా, సొ సైటీ రోజువారీ కార్యకలాపాలకు నిధులు లేని పరి స్థితులు ఉన్నాయి. నెలవారీగా పాలకవర్గాలకు గౌర వ వేతనం సైతం అందడం లేదు. కొన్ని చోట్ల చైర్మ న్లు సొంతంగా డబ్బు ఖర్చు చేస్తున్నవారు ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో చైర్మన్, వైస్ చైర్మన్ కోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేశారు. డైరెక్టర్లను క్యాంపులకు తరలించి ప్రత్యర్థులపై నెగ్గారు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికై న వారు ఉన్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బుతో చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. జిల్లాలో పాలకవర్గాల్లో గత బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే మొదట అధికంగా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రద్దయినవి ఇవే..పాలకవర్గాలు రద్దయిన వాటిలో మంచిర్యాల, జెండా వెంకటాపూర్, నెల్కివెంకటాపూర్, పడ్తనపల్లి, గూడెం, చెన్నూరు, కోటపల్లి, జైపూర్, మందమర్రి, భీమిని, నెన్నెల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. -
‘పటేల్’తోనే తెలంగాణ ప్రజలకు విముక్తి
ఇచ్చోడ: సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17న విముక్తి కలిగిందని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు బ్రిటీష్ పాలనలోనే ఉన్నారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా ఘనంగా జరుపుకోవాలని కోరారు. దేశంలో జీఎస్టీ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కౌన్సిల్ ఏర్పాటు చేసి స్లాబ్లు తగ్గించడం ద్వారా అనేక రకాల వస్తువులపై ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఎంతో మందికి ప్రయోజనం కలిగిందని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం, జిల్లా ఉపాధ్యక్షుడు మాధవ్ అమ్టె, కౌన్సిల్ సభ్యుడు తాటిపెల్లి రాజు, అసెంబ్లీ కన్వీనర్ కదంబారావు, మండలాధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
వేమనపల్లి: రాస్తారోకో చేస్తున్న రైతులు తాండూర్: రైతువేదిక వద్ద కూపన్ల కోసం నిరీక్షణవేమనపల్లి/భీమారం/తాండూర్/కాసిపేట: వేమనపల్లి మండలం నీల్వాయి పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. అధికార పార్టీ నాయకులు అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత నెల 28న యూరియా వచ్చిందని, ఇప్పటికీ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సింగిల్ విండో చైర్మన్ కుబిడె వెంకటేశం తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, మాజీ సర్పంచ్లు కొండగొర్ల బాపు, రాజలింగు తదితరులు పాల్గొన్నారు. -
గిన్నీస్ రికార్డు లక్ష్యంగా దేశ పర్యటన
మంచిర్యాలటౌన్: కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ బెంగళూరుకు చెందిన దివాకర్రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణ, మొక్కల పెంపు లక్ష్యంగా మోటారుసైకిల్పై దేశ పర్యటన చేపట్టారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 2023 నవంబర్ 1న పర్యటన ప్రారంభించి ఇప్పటి వరకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 806 జిల్లాలు చుట్టొచ్చినట్లు తెలిపారు. రెండు లక్షల కిలోమీటర్ల వరకు ప్రయాణించాలని లక్ష్యం పెట్టుకున్నానని, గతంలో 1.40 లక్షల కిలోమీటర్లు బైక్పై దేశపర్యటన చేసిన గిన్నీస్ రికార్డును అధిగమిస్తానని తెలిపారు. 92 వేల కిలోమీటర్ల ప్రయాణం పూర్తయిందని, రూ.9 లక్షల వరకు ఖర్చు కాగా, తన లక్ష్యం నెరవేరేందుకు దేశంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. -
అడవులతోనే మనుగడ
దండేపల్లి: అడవులతోనే మానవాళికి మనుగడ ఉంటుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ అన్నారు. మండలంలోని తాళ్లపేట అటవీ సెక్షన్ పరిధి కుంటలగూడ గిరిజన గ్రామంలో అడవుల రక్షణపై మంగళవారం అవగాహన కల్పించారు. సాగు కోసం కొన్ని చోట్ల కొంతమంది అడవులను పాడు చేస్తూ ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. అడవులతోపాటు అందులో జీవించే వన్యప్రాణులకు కూడా హాని కలిగించొద్దని తెలిపారు. అడవులు, వన్యప్రాణులకు హాని చేస్తే కఠినమైన కేసులుంటాయని తెలిపారు. వైల్డ్ లైఫ్ ఇన్స్పెక్టర్ ఆది మల్లయ్య, తాళ్లపేట డీఆర్వో సాగరిక, ఎఫ్బీవో పద్మజరాణి, క్షేత్ర జీవశాస్త్రవేత్త ఎల్లం తదితరులు పాల్గొన్నారు. -
కడ్తాల్ పెద్ద చెరువుకు గండి
సోన్: మండలంలోని కడ్తాల్ గ్రామ సమీపంలోగల పెద్ద చెరువు కట్ట మంగళవారం తెగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువు తూము వద్ద క ట్ట బలహీనపడింది. దీనికి తోడు సోమవారం రాత్రి కురిసిన వర్షానికి తూము వద్ద బుంగ ఏర్పడి కట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో చెరువులోని నీరంతా దిగువనున్న పంట పొలాల్లోకి వెళ్తోంది. గ్రామస్తులు వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. గత ప్రభుత్వంలో రూ.78లక్షలతో మిషన్ కాకతీయ కింద చెరువు పూడికతీత పనులు చేపట్టినప్పటికీ కట్టను పటిష్టం చేయలేదని ఆరోపించారు. భారీగా కురిసిన వర్షానికి చెరువు పూర్తిగా నిండి తెగిపోయి రైతులకు నష్టం చేకూర్చిందని పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ ఈఈ అనిల్, ఏఈ మధుకర్ను సంప్రదించగా, సోమవారం రాత్రి కురిసిన వర్షంతో భారీగా చెరువులోకి నీరు వస్తోందని, వరద ఉధృతి తగ్గిన వెంటనే గండిని పూడ్చివేస్తామని తెలిపారు. అంతకుముందు తహసీల్దార్ మల్లేశ్రెడ్డి గండిని పరిశీలించారు. -
బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
మందమర్రిరూరల్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తితో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్నగర్కు చెందిన పిట్టల లక్ష్మి (65) కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతోంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3గంటలకు మృతురాలి భర్తకు మెలకువ రావడంతో లక్ష్మి మంచం వద్దకు వెళ్లి చూడగా ఆమె కనిపించలేదు. సమీపంలో వెతకగా బావిలో మృతదేహం కనిపించింది. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వడ్డీ వ్యాపారి వేధింపులకు ఒకరు ఆత్మహత్యఇంద్రవెల్లి: వడ్డీ వ్యాపారి వేధింపులకు ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్ధనగర్కు చెందిన దహికాంబ్లే రాము (40) మండల కేంద్రంలో బైక్ మెకానిక్గా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 10న సాయంత్రం పని ముగించుకున్న తర్వాత పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లాడు. ఇంటి వద్ద వాంతులు చేసుకుంటుండగా అతడి భార్య సంఘమిత్ర గమనించింది. ఏమైందని అడిగితే తాను వ్యాపారం నిమిత్తం జవహర్లాల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నానని తెలిపాడు. ప్రతీ వారం రూ.1,500 చొప్పున చెల్లిస్తున్నానని, ఆర్థిక ఇబ్బందులతో మూడు వారాలుగా చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇష్టారీతిన తిట్టడంతో అవమానంతో పురుగులు మందు తాగినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృత్యుడికి భార్యతోపాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. కాగా, ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు కాలేదు. దీంతో ఎస్పీ అఖిల్ మహాజన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సై సాయన్నకు సంప్రదించగా.. ఈ నెల 10న ఫిర్యాదు అందినమాట వాస్తవమేనని, మంగళవారం ఉదయమే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించాలిఆదిలాబాద్: ఆర్టీసీ కార్మికులపై పనిభారం త గ్గించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజి యన్ అధ్యక్షుడు సర్పే భీమ్రావు కోరారు. ఆది లాబాద్ డిపో ఎదుట మంగళవారం ఫెడరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిలోమీటర్ల పెంపు, ఓటీలు తగ్గించడం, రన్నింగ్ టైం కుదించడంతో కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. వీటన్నింటినీ ఎ దుర్కోవాలంటే ఫెడరేషన్ను మరింత బలోపే తం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నా రు. కార్మికుల హక్కుల సాధనకు పోరాడటాని కి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి మిట్టపల్లి భీంరావు, డిపో కార్యదర్శి ఆశన్న, వెంకటేశ్, రవి, సాయన్న, రాజేందర్, ప్రకాశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
108లో ప్రసవం
ఇంద్రవెల్లి: ఓ నిండు గర్భిని 108 అంబులెన్స్లో ప్రసవించింది. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ముత్నూర్ సమీపంలో జరిగింది. నార్నూర్ 108 అంబులెన్స్ ఈఎంటీ ప్రదీప్కుమార్, పైలెట్ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (యూ) మండలంలోని పుల్లార గ్రామానికి చెందిన పర్చకి మారుబాయికి సోమవారం రాత్రి పురుటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను ఉట్నూర్ సీహెచ్సీకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రిమ్స్కు రెఫర్ చేశారు. 108 అంబులెన్స్లో ఆదిలాబాద్ రి మ్స్కు ఆమెను తరలిస్తుండగా ముత్నూర్ సమీపంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ను రోడ్డు పక్కనే ఆపి ఈఎంటీ ప్రదీప్ పురుడుపోశారు. మారుబాయి మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వారిని రిమ్స్కు తరలించారు. 108 సిబ్బందిని పలువురు అభినందించారు. -
ఎద్దుకు సాయం చేయబోయి..
బెల్లంపల్లిరూరల్: మూగజీవికి సాయం చేయడానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధాకుర్థు గ్రామానికి చెందిన జంగపల్లి రాజారాం (69) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం ఓ పని నిమిత్తం ఇంటి నుంచి రవీంద్రనగర్కు కాలినడకన బయలుదేరాడు. రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఓ ఎదు ముక్కు తాడు విడిపోయి ఇబ్బంది పడడాన్ని గమనించాడు. ఎద్దు దగ్గరికి వెళ్లి ముక్కుతాడు సరి చేస్తుండగా అది రాజారాంను పొట్ట భాగంలో కొమ్ములతో పొడిచింది. అంతటితో ఆగకుండా కొమ్ములతో అతడిని లేపి విసిరి వేసింది. దీంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా కొట్టుకున్న రాజా రాంకు తీవ్ర గాయాలై రక్తస్రావం కాగా కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజారాం మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎదుకు సాయం చేయబోయి రాజారాం ప్రాణాలు పోగొట్టుకోగా గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నేత్రదానంజంగపల్లి రాజారాం నేత్రాలను సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేకరించి ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు పంపించారు. కార్యక్రమంలో వైద్యుడు సతీశ్, జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీశ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పటిక, బెల్లం పట్టివేత
దండేపల్లి: మండలంలోని నె ల్కివెంకటాపూర్లో అత్తె గంగా ధర్ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వచేసిన 240 కిలోల పటిక, 60 కిలోల నల్లబెల్లం పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉమ్మడి జిల్లా సీఐ గంగారెడ్డి తెలిపారు. షాపు నిర్వాహకుడు గంగాధర్ను అదుపులోకి తీసుకుని, పటిక బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం లక్సెట్టిపేట ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం బైండోవర్ చేసినట్లు లక్సెట్టిపేట ఎకై ్సజ్ ఎస్సై మౌనిక వెల్లడించారు. -
అతిథి అధ్యాపకుల అరిగోస
నిర్మల్ఖిల్లా: నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులకు గౌరవవేతనం అందక దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా పారి తోషికం చెల్లించలేదు. నిర్మల్ జిల్లా ముధోల్, భైంసా, నిర్మల్ ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు న్నాయి. భైంసాలో 13మంది, నిర్మల్లో 12మంది, ముధోల్లో 12మంది, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 12 మంది, చెన్నూర్లో ఆరుగురు, మంచిర్యాలలో 7, లక్సెట్టిపేటలో 10 మంది అతిథి అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీనెల గరిష్టంగా 72 పీరియడ్లకు గాను రూ.28,080 గౌర వ వేతనంగా చెల్లిస్తున్నారు. గెస్ట్ లెక్చరర్లుగా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. వేతనాలు మాత్రం సరైన సమయానికి రాక కుటుంబ పోషణ అస్తవ్యస్తంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. మూడు నెలలకోసారి బడ్జెట్ విడుదలై బిల్లులు చేసి వీరికి చెల్లించే సరికి మరింత జాప్యం జరుగుతోంది. సమస్యలతో సతమతం అతిథి అధ్యాపకులకు పీరియడ్ల వారీగా నెలసరి వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతవిద్యాశాఖ నిర్ణయించగా దసరా, సంక్రాంతి తదితర సెలవుల నేపథ్యంలో మాత్రం ఆ వేతనంలోంచి కోత విధిస్తున్నారు. పరీక్షల సమయంలోనూ వేతనం చేతికందదు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి అనేకమంది పేద బడుగు బలహీన వి ద్యార్థులకు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రక్రియ చే పట్టడంలో అతిథి అధ్యాపకులదే కీలక పాత్ర. స మాన పనికి సమాన వేతనం పేరిట ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చి రూ.50వేలు, కన్సాలిడేటెడ్ పేగా ఉద్యోగ భద్రత కల్పించేందుకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం హామీ నెరవేర్చడంలో జాప్యం జరుగుతోందని, తమ సేవలను గుర్తించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నట్లు వారు వాపోతున్నారు. -
ఇంద్రవెల్లిలో డెంగీ కేసు నమోదు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ప్రబుద్ధనగర్లో ఓ బాలుడికి డెంగీ పాజిటివ్ వచ్చింది. వివరాలు.. మండల కేంద్రంలోని ప్రబుద్ధనగర్కు చెందిన గా యక్వాడ్ సచిన్, సంజీవన దంపతుల మూడేళ్ల కు మారుడు సంఘర్శ్కు వారం రోజులుగా జ్వరం వ స్తోంది. కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ప లు ఆస్పత్రుల్లో వైద్యం అందించినా తగ్గలేదు. రెండురోజుల క్రితం ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ గా నిర్ధారించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరి స్థి తి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. మంగళవారం విషయం తెలుసుకున్న ఎంపీడీవో జీవన్రెడ్డి, గ్రామపంచాయతీ ఈవో సంజీవ్రా వు, అధికారులు ప్రబుద్ధనగర్ను సందర్శించారు. గాయక్వాడ్ సచిన్ ఇంటి పరిసర ప్రాంతాన్ని పరిశీ లించారు. పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టారు. -
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
ఆదిలాబాద్టౌన్/ఇచ్చోడ/నేరడిగొండ: పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ హెచ్చరించారు. మంగళవారం నేరడిగొండలోని కేజీబీవీ, ఇచ్చోడలోని జెడ్పీఎస్ఎస్, అడిగామ(కే)లోని అంగన్వాడీ కేంద్రం, జిల్లాకేంద్రంలోని శిశుగృహ, సఖీ కేంద్రం, బంగారిగూడలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, బోధన తీరు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. శిశుగృహలో ముగ్గురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలున్నారని, ఇందులో ఇద్దరు పిల్లలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపారు. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శిశుగృహ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సఖీ కేంద్రంలో కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యుడు సమీరుల్లా ఖాన్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, ఉష్కం తిరుపతి, ఐసీపీఎస్ అధికారి రాజేంద్రప్రసాద్, ఆదిలాబాద్రూరల్ సీడీపీవో నర్సమ్మ, సాధికారత కోఆర్డినేటర్ యశోద, ఎస్సీపీసీఆర్ కన్సల్టెంట్ మధురవాణి, శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మి, కౌన్సిలర్ స్వప్న, స్వామి తదితరులున్నారు. -
‘ఆదర్శ’ విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో స్వర్ణం
కాసిపేట: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి జక్కు ల అశ్విన్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి స్వర్ణ పతకం సాధించినట్లు ప్రిన్సిపాల్ అబ్ధుల్ ఖలీల్ మంగళవారం తెలిపారు. జనగామ జిల్లా కూనూర్లో నిర్వహించిన అండర్–14 విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థి, పీఈటీ శ్రీనివాస్ను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక మోడల్ స్కూల్కు చెందిన ఇంటర్ ఫస్టియర్ బీ సాయినాథ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఖలీల్ తెలిపారు. ఈనెల 15న పా ఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో బె ల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన అండర్–19 విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థా యికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరిని ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు. -
జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచాలి
ఆదిలాబాద్: జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలకు ఎంపికై న జిల్లాకు చెందిన ఫిజి కల్ డైరెక్టర్ (పీడీ)లు ప్రతిభ కనబరచాలని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ (పెటా) జిల్లా అధ్యక్షుడు పార్థసారథి సూచించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న పీడీలు జీ.నాందేవ్ (జెడ్పీఎస్ఎస్, సుంకిడి), జాదవ్ రవీందర్ (జెడ్పీఎస్ఎస్, భరంపూర్)ను జిల్లా కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాందేవ్ 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించగా, జాదవ్ రవీందర్ లాన్ టెన్నిస్ క్రీడలో ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. ఇరువురు నవంబర్లో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. పెటా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికుమార్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్, కోశాధికారి శ్రీనివాస్, గోపాల్, రాము, రవీందర్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని నెత్తుటి త్యాగాల ధార
బెల్లంపల్లి: విప్లవోద్యమ చరిత్రలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. పోరాటాల పురిటిగడ్డగా ప్రసిద్ధిగాంచింది. బొగ్గు గనుల క్షేత్రమైన ఈ ప్రాంతం నుంచి ఎందరో యువకులు విప్లవోద్యమంలో చేరి ఏళ్ల తరబడి నుంచి అసువులు బాస్తున్నారు. నేటికీ అదే ఒరవడి కొనసాగుతోంది. విప్లవమే జీవితాశయంగా ఎంచుకుని సాయుధ గెరిల్లా పోరాట పంథాలో సాగుతూ పోలీసు ఎదురుకాల్పులు, అనారోగ్య సమస్యలతో ఒక్కొక్కరుగా కన్నుమూస్తున్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ త్యాగాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ఆ అమరుల నెత్తుటి త్యాగాలతో నల్ల నేల ఎరుపు వర్ణాన్ని పులుముకుంటోంది. అజ్ఞాతంలోకి వెళ్లి దండకారణ్యానికి ఉద్యమబాటలు వేసిన విప్లవకారుల్లో ఈ ప్రాంత అమరుల భాగస్వామ్యం ఎంతో ఉంది. త్యాగాల నెత్తుటి సాళ్లలో మొలకెత్తిన ఆ విప్లవ బీజాలు ప్రస్తుతం కానరాకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దౌర్జన్యాలు, దాష్టీకాలు సహించలేక.. విప్లవ పోరాటానికి ఆకర్శితులైన యువకుల్లో అత్యధిక మంది నిరుపేద, కార్మిక బిడ్డలే. సింగరేణి కార్మికులపై గని అధికారులు సాగిస్తున్న వేధింపులు, దోపిడీ, దౌర్జన్యాలు, అట్టడుగు వర్గాల ప్రజలు, బస్తీల్లో మహిళలపై గూండాలు సాగిస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ప్రజాకంఠకులుగా మారిన గూండాలు, రౌడీలను అంతమొందించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) తరపున గని అధికారుల దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించి విప్లవమార్గంలో పయనించారు. పీపుల్స్వార్, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నిర్మాణంలో కార్మిక, నిరుపేద వర్గాల బిడ్డలు భాగస్వాములై రహస్య జీవితంలోకి వెళ్లారు. ఆద్యులు ఆ ముగ్గురు సింగరేణి కార్మిక బిడ్డలైన గజ్జెల గంగారాం, పెద్ది శంకర్, కటకం సుదర్శన్ విద్యార్థి దశలో రాడికల్ విప్లవోద్యమాలకు ఆకర్శితులయ్యారు. విప్లవోద్యమ చరిత్రలో వీరు ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. వీరి అడుగుజాడల్లో ఎందరో యువకులు పోరు బాటపట్టారు. దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతూ ఎన్కౌంటర్లో అమరులవుతున్నారు. ఎక్కడ జరిగిన అక్కడ బెల్లంపల్లి బిడ్డ ఎవరో ఒకరు నేలకొరగడం ఈ ప్రాంత ప్రజలను, విప్లవ సానుభూతిపరులను తీవ్రంగా కలిచివేస్తోంది. తొలి అమరుడు పెద్ది శంకర్ బెల్లంపల్లి విప్లవకారుల్లో తొలి అమరుడిగా పెద్ది శంకర్ చరిత్ర పుటలకెక్కారు. 1980లో మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా మోయిన్బిన్పేట వద్ద జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో ఆయన మృతి చెందాడు. ఆయుధాలను పరీక్షిస్తుండగా వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గ్రేనేడ్ పేలి 1981లో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. 1985లో పులి మధునయ్య సిర్పూర్ తాలూకా లోడ్పల్లి వద్ద, 1987లో బుయ్యారం వద్ద ముద్దు నారాయణ, ఈట శంకర్, మురళీ, 1999లో నస్పూర్ కాలనీలో సికాస అగ్రనేత గెల్లి రాజలింగు, 2000లో తిర్యాణి మండలం లోవగుట్ట వద్ద ఇద్దరు ఆదివాసీ దళసభ్యులతోపాటు శనిగారపు రాంచందర్, 2002లో పులిపాక లక్ష్మణ్ను హైదరాబాద్లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గజ్జెల గంగారాం సోదరి గజ్జెల సరోజ దండకారణ్యంలో అనారోగ్యంతో 2013లో అమరురాలైంది. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగిన కటకం సుదర్శన్ 2023 మే 31న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ్ బస్తర్ అడవుల్లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. 2024లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో కాసరవేణి రవి మృతి చెందగా తాజాగా ఈనెల 11న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబండ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన జాడి వెంకటి అసువులు బాశాడు. -
‘చలో భద్రాచలం’ విజయవంతం చేయండి
ఆదిలాబాద్రూరల్: ఈనెల 28న నిర్వహించే చలో భద్రాచలం కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసీలు విజయవంతం చేయాలని మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాల రాష్ట్రస్థాయి రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సోయం బాపూరావు, జిల్లాకు చెందిన ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొని చలో భద్రాచలం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోయం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 9న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ, ఆ తర్వాత ఢిల్లీలో సభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో 9 తెగల సంఘాల నాయకులు, అడ్వొకేట్ సంఘం, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: మండలంలోని గురిజాల రైతువేదికలో జూలై 3న జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు రెండు నెలలకు దొంగలను పట్టుకున్నారు. పోలీసుస్టేషన్లో బెల్లంపల్లి రూరల్ సీఐ చందవోలు హనోక్ ఆదివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. గురిజాల రైతు వేదికలో రూ.1.90 లక్షల విలువ గల వీడియో కాన్ఫరెన్స్కు ఉపయోగించే ఎల్ఈడీ టీవీ, ఇతర సామగ్రి చోరికి గురైనట్లు వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. కన్నెపల్లి మండలం జన్కాపూర్కు చెందిన మహమ్మద్ నసీమ్ బేగ్, బెల్లంపల్లి అశోక్నగర్కు చెందిన వర్మ శైలేష్లు జూలై 3న అర్థరాత్రి ఆటోలో వచ్చి బండరాయితో తాళం పగులగొట్టి ఎల్ఈడీ టీవీ, సౌండ్ బాక్స్లు, సీపీయూ, ఆంఫ్లీఫయార్, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఆ సామగ్రిని బెల్లంపల్లిలో విక్రయించేందుకు వస్తున్నారు. తాళ్లగురిజాల పోలీసులు శనివారం వాహనాల తనిఖీలో ఆటోలో ఎల్ఈడీ టీవీ, సామగ్రి అనుమానస్పదంగా కనిపించడంతో సదరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఇద్దరు నిందితులను బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాళ్లగురిజాల ఎస్సై బండి రామకృష్ణ, ఏఎస్సై అలీ, సిబ్బంది అరుణ్, మురళీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్లో ఆదిలాబాద్ సత్తా
జఫర్గఢ్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలా బాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజా మాబాద్ జట్టు నాలు గో స్థానంలో నిలిచా యి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. మారుమూల ప్రాంతమైన కూనూర్లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పో టీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అ సోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరా వు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తి రుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. -
అంబులెన్స్కు దారి కష్టాలు
బెల్లంపల్లి: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జాడి వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్కు దారి కష్టాలు ఎదురయ్యాయి. బంధువులు వెంకటస్వామి, జనార్దన్, గ్రామస్తుడు దామోదర్గౌడ్లు శనివారం రాత్రి వెంకటి మృతదేహంతో చంద్రవెల్లికి తిరుగుపయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో బురదలో చిక్కుకుంది. రెండు గంటలు శ్రమించిన బయటకు రాకపోవడంతో కిలోమీటరు దూరాన గ్రామానికి చేరుకుని ఓ ట్రాక్టర్ను, కొంతమందిని తోడ్కోని వచ్చి బయటకు తీశారు. వార్దా నది బ్రిడ్జి పై నుంచి నీటి ఉధృతి కారణంగా వెనక్కి మళ్లీ మరో దారిని ఎంచుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరుకు అక్కడి నుంచి కౌటాల, కాగజ్నగర్ మీదుగా సాయంత్రం 4 గంటలకు చంద్రవెల్లికి చేరుకున్నారు. అమరుల బంధుమ్రితుల కమిటీ శ్రేణులు, గ్రామస్తులు, బఽంధువులు ఊరి పొలిమేరల నుంచి వెంకటి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటి మృతదేహానికి వవెళ్లిన అంబులెన్స్కు దారికష్టాలుబెల్లంపల్లి: ఛత్తీస్గఢ్లోని గరియాబండ్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జాడి వెంకటి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన అంబులెన్స్కు దారి కష్టాలు ఎదురయ్యాయి. బంధువులు వెంకటస్వామి, జనార్దన్, గ్రామస్తుడు దామోదర్గౌడ్లు శనివారం రాత్రి వెంకటి మృతదేహాంతో చంద్రవెల్లికి తిరుగుపయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజాము మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో బురదలో చిక్కుకుంది. రెండు గంటలు శ్రమించిన బయటకు రాకపోవడంతో కిలోమీటరు దూరాన గ్రామానికి చేరుకుని ఓ ట్రాక్టర్ను, కొంతమందిని తోడ్కోని వచ్చి బయటకు తీశారు. వార్దా నది బ్రిడ్జి పై నుంచి నీటి ఉధృతి కారణంగా వెనక్కి మళ్లీ మరో దారిని ఎంచుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరుకు అక్కడి నుంచి కౌటాల, కాగజ్నగర్ మీదుగా సాయంత్రం 4 గంటలకు చంద్రవెల్లికి చేరుకున్నారు. అమరుల బంధుమ్రితుల కమిటీ శ్రేణులు, గ్రామస్తులు, బఽంధువులు ఊరి పొలిమేరల నుంచి వెంకటి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
జోహార్ వెంకటి
బెల్లంపల్లిరూరల్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు ఒడిశా (ఏవోబీ) రాష్ట్ర టెక్నికల్ టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జాడి వెంకటి అలియాస్ విమల్ అలియాస్ సురేష్ అలియాస్ మంగన్న (56) అంత్యక్రియలు ఆదివారం చంద్రవెల్లిలో ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. గ్రామ శివారు చేరుకున్న మృతదేహానికి నివాళులర్పించేందుకు ప్రజాసంఘాలు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం, వివిధ పార్టీల నాయకులు, జనం భారీగా తరలివచ్చారు. ఎర్రని జెండాతో బాణాసంచా కాల్చుతూ విప్లవగీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ స్వగృహానికి తీసుకువచ్చారు. సంఘాల నాయకులు మృతదేహం వద్ద ఎర్రని జెండా కప్పి, పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ శివారులోని వెంకటికి చెందిన స్థలం వరకు అంతిమయాత్ర చేపట్టారు. అమరుడా లాల్ సలామ్, జోహార్ కామ్రేడ్ వెంకటి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చెల్లెలు రామటెంకి సుజాత అన్న వెంకటికి తలకొరివి పెట్టింది. అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, కార్యదర్శి శాంతక్క, సభ్యులు సత్తక్క, కవిత, అనిత, రైతు హ క్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి రామడగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు వెంకటస్వామి, పూర్ణిమ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చాంద్పాషా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ప్రవీణ్, మాజీ జెడ్పీటీసీ రాంచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ నాయకులు శంకర్, స్వామి, ప్రజా కళా మండలి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆడెపు సమ్మయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, అభిమానులు ఆయనకు విప్లవ జోహర్లు అర్పించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని అమవీరుల బంధుమిత్రల కమిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి, రాష్ట్ర కార్యదర్శి శాంతక్క డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్పై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదన కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. -
అ‘పూర్వ’ కలయిక
14ఎంసీఎల్256: 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు, గురువులుమంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్సోమాని, గుండా సుధాకర్, అనిల్కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. – మంచిర్యాలఅర్బన్మంచిర్యాలఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973–74 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారందరూ ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. వీరి అపూర్వ కలయికకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులు నర్సయ్య, కాంతయ్య, డి.నారాయణరావు, ఎస్.సూర్యనారాయణలను సన్మానించారు. పూర్వవిద్యార్థులు మంగీలాల్సోమాని, గుండా సుధాకర్, అనిల్కుమార్, సుబ్రహ్మణ్యం, జుబేర్ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
కొండచిలువ హల్చల్
నిర్మల్ఖిల్లా: జిల్లాకేంద్రంలోని శాంతినగర్ చౌరస్తా సమీపంలో శనివారం అర్ధరాత్రి 9 అడుగుల భారీ కొండచిలువ హల్చల్ చేసింది. నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహాదారి డివైడర్ మధ్యలో కనిపించడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండచిలువను బంధించే ప్రయత్నం చేశారు. స్నేక్ క్యాచర్ అనిల్ చాకచక్యంగా కొండచిలువను బంధించాడు. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్యదస్తురాబాద్: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గ్రామానికి చెందిన కొంపెల్లి నర్సయ్య(45) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నిరోజుల క్రితం పెద్దకుమార్తెకు వివాహం చేయడంతో కుటుంబంలో తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో శనివారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాజెక్టులో మునిగి ఒకరి మృతి
భైంసారూరల్: మండలంలోని కోతల్గాం సమీపంలోని చెక్డ్యాం వద్ద పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో మునిగి పవార్ రాజు(36) మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహాగాం గ్రామానికి చెందిన పవార్ రాజు గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికిన ఆచూకీ దొరకలేదు. కోతల్గాం సమీపంలోని చెక్డ్యాం వద్ద ప్రాజెక్టు వాటర్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భార్య కవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతిరెబ్బెన: మండలంలోని వంకులం స మీపంలో పెద్దవా గు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఒకరు అక్కడికక్క డే మృతి చెందా డు. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం రాపెల్లికి చెందిన సు నార్కర్ ఆనంద్రావు (47) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం కాగజ్నగర్ నుంచి బైక్పై రాపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో ఆయన తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరోబైక్పై ప్రయాణిస్తున్న ఎన్నం తిరుపతి, ఎన్నం కృష్ణకుమార్కు గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో కా గజ్నగర్ తరలించారు. మృతుడికి భార్య, ఇ ద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య సురేఖ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్షాక్తో ఒకరు..మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధి యాపల్ ప్రాంతంలోని జీఎం ఆఫీస్ సమీపంలో ఆదివారం విద్యుత్ షాక్తో ఛత్తీస్గఢ్కు చెందిన సుకులాల్ యాదవ్వ్ (31) మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల క్రితం సుకులాల్ కుటుంబంతో జీవనోపాధి కోసం మందమర్రికి వచ్చారు. కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం పనికి వెళ్లడానికి వేడి అన్నం పెట్టుకున్నాడు, చల్లార్చుకోడానికి కూలర్ స్విచ్ ఆన్చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమీపంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. సుకులార్ మృతదేహాన్ని చత్తీస్గఢ్ తరలించేందుకు హిందూ శ్మశానవాటిక కేకే–ఓసీ కమిటీ సభ్యులు విరాళాలు సేకరించి రూ.70 వేలను కుటుంబసభ్యులకు అందించారు. -
వామ్మో...దోమ!
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో దోమలను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో మంచిర్యాల 36 వార్డులతో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ప్రతీ వార్డులో నెలకు రెండుసార్లు ఫాగింగ్ చేయడంతో పాటు, పారిశుద్ధ్య పనులు చేపట్టి, బ్లీచింగ్ పౌడర్ చల్లేవారు. ప్రస్తుతం కార్పొరేషన్గా మారడం నస్పూర్తో పాటు, హాజీపూర్ మండలంలోని 8 గ్రామాలు విలీనం కావడంతో 60 డివిజన్లుగా మారింది. పరిధి పెరగడం, ఫాగింగ్ యంత్రాలు సరిపడా లేకపోవడం, ఉన్న వాటిని వినియోగించక పోవడంతో నెలల తరబడి పలు డివిజన్లలో ఫాగింగ్ చేపట్టడం లేదు. ఫలితంగా కార్పొరేషన్ పరిధిలో ఇంటికో జ్వర బాధితులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దగ్గు, జలుబు, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టాల్సిన పనులను పట్టించుకోక పోవడంతో ప్రజలు డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. ఫాగింగ్ యంత్రాలేవి?మంచిర్యాల నగరపాలక సంస్థకు అవసరమైన ఫాగింగ్ యంత్రాలను సమకూర్చుకోవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. 60 డివిజన్లకు కేవలం మూడు ఫాగింగ్ యంత్రాలే ఉండగా అందులో ఒకటి పనిచేయడం లేదు. రెండు యంత్రాలతో 60 డివిజన్లలో ఫాగింగ్ చేసినా నెలకు కేవలం ఒక్కసారి మాత్రమే ఒక డివిజన్లో చేసేందుకు అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో కనీసం ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయని డివిజన్లు సగానికి పైగా ఉన్నాయి. శివారు ప్రాంతాలు, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న కాలనీల్లో వారంలో కనీసం ఒక్కసారైనా ఫాగింగ్ చేస్తేనే దోమలను నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల గోదావరి వరద పోటెత్తి మంచిర్యాలలోని ఎన్టీఆర్నర్ కాలనీ, రాంనగర్, పద్మశాలి కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. కనీసం ఆయా ప్రాంతాల్లోనైనా ఫాగింగ్ చేయాల్సి ఉన్నా కేవలం బ్లీచింగ్ పౌడర్ చల్లి వదిలేశారు. దీంతో ఈ కాలనీల్లో దోమల బెడద గతంలో కంటే మరీ ఎక్కువగా ఉందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఏటా రూ.లక్షల్లో నిధులు వెచ్చిస్తున్నా ప్రజలకు మాత్రం వాటి బెడద తప్పడం లేదు. ప్రధానంగా డ్రెయినేజీలు, ఖాళీ స్థలాలు, ముళ్ల పొదలు, వ్యర్థాలు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల స్వైరవిహారంప్రస్తుతం నగరంలోని ఏ వీధికి వెళ్లినా దోమల గురించే మాట్లాడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నగరవాసుల్ని ఎడాపెడా కుట్టేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ఈగల సైజులో ఉన్న దోమలు స్వైరవిహారం చేస్తూ జనం రక్తాన్ని పీల్చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే నగరపాలక సంస్థ అధికారులు, ప్రత్యేక అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. గతంలో పాలక వర్గం ఉన్నప్పుడు వార్డుల్లోని ప్రజలు కౌన్సిలర్లతో మాట్లాడి ఫాగింగ్ చేపట్టేలా చేసుకునేవారు. పాలకవర్గం గడువు తీరడంతో ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోగా పొద్దంతా ఎండ, ఉక్కపోత, సాయంత్రం చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు దోమలు జనం మీద దండెత్తుతున్నాయి. వర్షాకాలానికి ముందే గతంలో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జూన్ నెలలోనే డ్రెయినేజీల్లోని పూడికతీత చేపట్టేవారు. ఈ ఏడాది మాత్రం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక పేరిట పారిశుద్ధ్యంతో పాటు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి, డ్రెయినేజీల్లోని పూడికతీత, ఖాళీ స్థలాల్లోని పిచ్చి మొక్కల తొలగింపు, నిల్వ నీటిని తొలగించే పలు కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. కానీ మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలో ఈ వంద రోజుల ప్రణాళిక పేరిట ఎలాంటి కార్యక్రమాలను చేపట్టక పోవడం కూడా దోమలు వృద్ధి చెందేందుకు దోహదంగా మారింది. ఫాగింగ్ చేపడతాం మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ఫాగింగ్ చేపడుతున్నాం. అన్ని డివిజన్లలోనూ ఫాగింగ్ చేసేలా చూస్తాం. దోమల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. చెత్తను తొలగించడంతో పాటు డ్రెయినేజీల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలం పూర్తయ్యే వరకు నిరంతరం ఫాగింగ్ చేపడుతాం. – సంపత్ కుమార్, కమిషనర్, మంచిర్యాల -
● చారిత్రక సాక్ష్యాలు.. ఈ నిర్మాణాలు
వరదలను తట్టుకుని నిలిచిన ‘కడెం’కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్ట్. 18 గేట్లున్న దీని పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం దీని సామర్థ్యం 4.699 టీఎంసీలు మాత్రమే. కుడి, ఎడమ కాలువల ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట్, హాజీపూర్ మండలాల్లోని 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తుంది. గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై 1949లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 1958లో 9 జర్మనీ టెక్నాలజీ గేట్లతో నిర్మాణం పూర్తయింది. 1958 ఆగష్టులో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్ తెగిపోయింది. అవుట్ఫ్లో సామర్థ్యం పెంచేందుకు 1969లో మరో 9 ఇండియన్ గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 1995, 2022, 2023లో ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి భారీ స్థాయిలో(5లక్షల క్యూస్కెకులకు పైగా) ఇన్ఫ్లో వచ్చి గేట్లపై నుంచి వరద పారినా ఏమీ కాలేదు. అప్పటి ఇంజినీర్ల నైపుణ్యంతో నేటికీ కడెం ప్రాజెక్ట్ చెక్కుచెదరకుండా నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి అండగా నిలుస్తోంది. నిర్మాణ కౌశలం.. నిమ్మల ఉమ్మడి జిల్లాలో నిజాం, నిమ్మల రాజుల హయాంలో నిర్మించిన పలు కట్టడాలు చారిత్రక సాక్ష్యాలు గా దర్శనమిస్తున్నాయి. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరని ఆ నిర్మాణాలు నాటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నాయి. భారీ వరదలను సైతం తట్టుకుని నిలిచిన కడెం ప్రాజెక్టు ఇందులో ప్రత్యేకం. ఇక ఆదిలాబాద్లోని మావల చెరువు గ్రావిటీ స్పెషల్గా.. ఖానాపూర్లోని సదర్మాట్ ఆనకట్ట వారసత్వ కట్టడంగా నిలుస్తున్నాయి. నిర్మల్ బురుజులు, కోటలు, నస్పూర్లోని గడి, ఆసిఫాబాద్లోని జిల్లా జైలు నాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే.. కడెం చాలా పురాతన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసిన ఆనాటి ఇంజినీర్ల ప్రతిభతో నేటికీ ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. భారీ వరదలనూ తట్టుకుని నిలవడం అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే. – ప్రవీణ్, ఈఈ, కడెం -
120 ఏళ్ల ‘నస్పూర్ గడి’
నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణ పరిధిలోని విలేజ్ నస్పూర్లో 120 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక గడి నాటి పాలనకు సాక్ష్య ంగా నిలుస్తోంది. 1905లో నిజాం హయాంలో నస్పూర్కు చెందిన జీవీ వంశీయులు ఇనుము, కాంక్రీట్ వాడకుండా కేవలం డంగుసున్నంతో రెండంతస్తుల భవనం నిర్మించారు. చుట్టూ నాలుగెకరాల ప్రహరీ సైతం డంగుసున్నంతోనే నిర్మించడం ప్రత్యేకత. ఈ గడి కేంద్రంగా నిజాం సంస్థానాధీశులు లక్సెట్టిపేట, ఇందారం, జన్నారం, తపాలాపూర్, మంథని, పెద్దపల్లి, భూపాలపల్లి, మహారాష్ట్రలోని సిరొంచ, చంద్రపూర్, మధ్యప్రదేశ్లోని బస్తర్ వరకు ఇక్కడి నుంచే పాలన కొనసాగించే వారు. స్వాతంత్య్రానంతరం ఈ కట్టడం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. కొద్ది నెలల క్రితం హెరిటేజ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. -
మావల @ గ్రావిటీ స్పెషల్
కై లాస్నగర్: నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణానికి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసేలా చేపట్టిన పైపులైన్, ఫిల్టర్బెడ్ నిర్మాణాలు నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా నిజాం హయాంలో ఆదిలాబాద్ వాసుల దాహా ర్తి తీర్చేందుకు పట్టణానికి పది కిలోమీటర్ల దూ రంలో గల మావల అటవీ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. 1925లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1948లో అందుబాటులోకి వచ్చింది. భారీ వరదలు, తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడేలా కట్టను నిర్మించారు. ఇప్పటికీ చిన్నపాటి లీకేజీలు సైతం లేకపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా చెరువు నుంచి ఫిల్టర్బెడ్ వరకు భూగర్భంలో నిర్మించిన ఫైపులైన్ ఔరా అనిపిస్తోంది. గ్రావిటీ ద్వారా వచ్చే చెరువు నీరు ఆదిలాబాద్ పట్టణంలోని 25 శాతం జనాభాకు తాగునీటి ఇబ్బందులను దూరం చేస్తోంది. ఫిల్టర్బెడ్ మావల చెరువు నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసేలా కలెక్టరేట్ పక్కన పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫిల్టర్బెడ్ సైతం ప్రత్యేకంగా నిలుస్తోంది. చెక్డ్యాంల ద్వారా మూడు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని పంప్హౌస్ నుంచి పట్టణంలోని ట్యాంకులకు విడుదల చేస్తారు. వాటి ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది. దీనిని లండన్కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ 1947లో నిర్మించడం గమనార్హం. ఆదిలాబాద్లోని ఫిల్టర్బెడ్ గ్రావిటీ ద్వారా నీరందించే మావల చెరువు -
నేడు మంత్రి వివేక్ ఇంటి ఎదుట ధర్నా
బెల్లంపల్లి: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివే క్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు భానుమ తి, ప్రధాన కార్యదర్శి రాజమణి తెలిపారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ నిర్వహించాలని, పీఎంశ్రీ ని ధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశా రు. అంగన్వాడీలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కో రారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.రంజిత్, బెల్లంపల్లి మండల కన్వీనర్ సీహెచ్ దేవదాస్, తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థినికి బంగారు పతకం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హైదరాబా ద్లోని గాంధీ మెడికల్ కళాశాల ఫార్మేషన్ డే సందర్భంగా జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని గడియారం అక్షయ బంగారు పతకం అందుకుంది. మైక్రో బయోలజీ సబ్జెక్ట్లో కళాశాల టాపర్గా నిలిచిన అక్షయ ఆదివారం డాక్టర్ రాజారెడ్డి చేతుల మీదుగా బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకుంది. ప్రస్తుతం గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హౌజ్సర్జన్గా చేస్తున్న డాక్టర్ అక్షయ బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు పల్లవి, శ్రీహరి సంతోషం వ్యక్తం చేశారు. -
నిజాం నాటి ఆసిఫాబాద్ జైలు
ఆసిఫాబాద్: 1916లో అప్పటి జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లో గల జన్కాపూర్లో ఐదెకరాల్లో జైలు నిర్మించారు. నిజాం హయాంలో దీనిని పూర్తిగా డంగుసున్నంతో నిర్మించారు. ఇందులో మూడు బారక్లు ఉన్నాయి. సుమారు 200 మంది ఖైదీలు ఉండేలా భవన నిర్మాణం చేపట్టారు. అనంతరం కొన్నేళ్లపాటు మూసి ఉండగా మరమ్మతులు చేసి 1991 మార్చి 15న అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఎంజీ గోపాల్ తిరిగి ప్రారంభించారు. 17 ఏళ్లపాటు తిరిగి జిల్లా జైలుగా కొనసాగగా అనంతరం ఆసిఫాబాద్ జిల్లా జైలును 2008లో ఆదిలాబాద్కు తరలించి, ఇక్కడి జైలును స్పెషల్ సబ్ జైలుగా మార్చారు. -
మంచిర్యాల
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.7లాభాల వాటా ఇప్పించేందుకు కృషి సింగరేణి కార్మికులకు వారం రోజుల్లో లాభాల వాటా ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు తెలిపారు. 9లోu జోహార్ వెంకటి ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు జాడి వెంకటి అంత్యక్రియలు చంద్రవెల్లిలో ఆశ్రునయనాల మధ్య ముగిశాయి. 8లోu -
మున్నూరుకాపులు ఐక్యం కావాలి
జైపూర్: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరుకాపు కులస్తులంతా ఐక్యం కావా లని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పిలుపునిచ్చారు. ఆదివారం ముసాయిపేట్లో ఏర్పాటు చేసిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చెన్నూర్ నియోజకవర్గం నుంచి పెద్దింటి పున్నంచంద్, పిల్లి సమ్మయ్య, ఆర్నే సమ్మయ్యతో పాటు పలు వురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ అత్యధిక జనాభా కలి గిన మున్నూరుకాపులకు రాజకీయంగా, ఉద్యోగ రంగాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, దీని కోసం అన్ని గ్రామాల్లో ఉన్న ము న్నూరుకాపులను చైతన్యం చేయాలన్నారు. -
బకాయిలు విడుదల చేయాలి
ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు నాలుగేళ్లుగా (ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్) ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని హుకుం జారీ చేస్తున్న ప్రభుత్వం బకాయిలు మాత్రం చెల్లించడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. భవనాల అద్దె, అధ్యాపకుల వేతనాలు, ఇతర బిల్లులు చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు బంద్ కొనసాగిస్తాం. – ఎస్వీ రమణ, టీపీడీపీఎంఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
జిల్లాలో 29.6 మి.మీల వర్షం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 29.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నెన్నెలలో 93.7, మందమర్రిలో 66.4, కాసిపేటలో 56, హాజీపూర్లో 45.8, బెల్లంపల్లిలో 44.1, చెన్నూర్లో 31.6, వేమనపల్లిలో 28.4, కోటపల్లిలో 26, జన్నారంలో 22.9, దండేపల్లిలో 12.7, మంచిర్యాలలో 19.6, తాండూర్లో 17, నస్పూర్లో 13.8, భీమారంలో 13.9, కన్నెపెల్లిలో 12.5, లక్సెట్టిపేటలో 10.4, భీమినిలో 9.2, జైపూర్లో 8.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 848.9 మి.మీ కురవాల్సి ఉండగా 865.3 మి.మీ నమోదైంది. -
మహిళల భద్రతకు షీ టీమ్ భరోసా
మంచిర్యాలక్రైం: మహిళల భద్రతకు షీ టీమ్ భరోసా కల్పిస్తుందని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం డీసీపీ కార్యాలయంలో షీ టీమ్, భరోసా కేంద్రాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 114 ఫిర్యాదులు రాగా అందులో 18 క్రిమినల్, ఏడు పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. 89 ఫిర్యాదులకు కౌన్సిలింగ్లు నిర్వహించామన్నారు. గత ఆగస్టు వరకు 81 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. కళాశాలలు, స్కూళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, పబ్లిక్ ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇబ్బందిగా ఉంటే 63039 23700 లేదా 87126 59385 వాట్సాప్ నంబర్లు లేదా డయల్ 100 డయల్కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేష్ కుమార్, షీ టీమ్ ఇన్చార్జి ఎస్సై ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు. షీ టీమ్ అదుపులో నలుగురు జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ఉద్యానవనం వద్ద ఈవ్టీజింగ్కు పాల్పడిన నలుగురిని శనివా రం అదుపులోకి తీసుకున్నట్లు షీ టీమ్ ఇన్చార్జి ఎస్సై ఉషారాణి తెలిపారు. సదరు యువకులు బా లికలతో ఆసభ్యంగా ప్రవర్తిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
ఎల్ఐసీ ఎడ్యుకేషన్ సెమినార్
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయిచంద్ర ఫంక్షన్ హాల్లో శనివారం ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవోఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ్ హాజరై మాట్లాడారు. ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ సెక్టార్లో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు. పలుమార్లు ఐఆర్డీఏ కార్యాలయం, ఢిల్లీలోని జంతర్ మంతర్, అన్ని డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టామన్నారు. అనంతరం బ్రాంచ్ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు, డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 3,572 కేసులు పరిష్కారం
మంచిర్యాలక్రైం: జిల్లాలోని వివిధ కోర్టు ప్రాంగణాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదా లత్లో 3,572 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని లక్సెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. 3,100 సైబర్ క్రైమ్, 339 క్రిమినల్, 30 సివిల్, 15 వాహనాల పరిహారం, 43 ఫ్రీ లిటిగేషన్, 45 ఇతర కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జీలు కవిత, నిరోష, కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్గొన్నారు. న్యాయదేవత సాక్షిగా మళ్లీ ఒక్కటయ్యారు.. జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు క్షణికావేశంలో పోలీస్స్టేషన్ మెట్టెక్కారు. పోలీస్ అధికారులు, కులపెద్దలు శతవిధాలుగా ప్రయత్నించినా ససేమి రా అంటూ విడిపోవాల్సిందేనని కోర్టు మెట్లెక్కారు. మూడేళ్లపాటు కోర్టుచుట్టూ తిరిగారు. చివరికి శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో జిల్లా జడ్జి వీరయ్య కౌన్సిలింగ్ ఇవ్వడంతో న్యాయదేవత సాక్షిగా మళ్లీ ఒక్కటయ్యారు. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. -
రబీ సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రబీ సీజన్కు సంబంధించి సీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, పౌరసరఫాల శాఖ అధికారి బ్రహ్యరావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి సీఎంఆర్ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024 రబీ సీజన్కు సంబంధించి సీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31 వరకు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమలో అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో డీసీపీ ఏ.భాస్కర్తో కలిసి ఈ నెల 12న దండేపల్లి మండలం దమ్మన్నపేట, మామిడిగూడలో జరిగిన ఘటనపై గిరిజనులతో మాట్లాడారు. సమస్య శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకెళ్లాలని సూచించారు. గిరిజనల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజనులు అర్థికంగా ఎదిగేందుకు చేయూత అందించడం జరుగుతుందని, సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్ల ప్పుడూ అండగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు. -
● ఒక్క బస్తా కోసం మూడు గంటలు నిరీక్షణ ● అధికారులపై రైతుల ఆగ్రహం
నెన్నెల/చెన్నూర్రూరల్: జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తీరడంలేదు. నెన్నెల సహకార సంఘానికి శనివారం 222 యూరియా బస్తాలు రావడంతో ఏవో సృజన, పీఏసీఎస్ సిబ్బంది నందులపల్లి, గొల్లపల్లి, గన్పూర్ గ్రామాల రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. మూడుగంటల పాటు క్యూలో నిలబడి టోకెన్ పొందారు. ముందు వరుసలో ఉన్నవారికే టోకెన్లు అందగా మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. అనంతరం ఒక్క యూరియా బస్తా కోసం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంకు వెళ్లారు. గంటల తరబడి క్యూలో ఉండి ఇబ్బంది పడ్డారు. తీరా ఒక్కోబస్తా చొప్పున ఇవ్వడంతో సరిపోదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా యూరియా ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చెన్నూర్ మండలంలోని ఆస్నాద, నాగాపూర్ గ్రామాలకు 222 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయి. నాగాపూర్లో పోలీసు పహారా మధ్య బ్యాగులు పంపిణీ చేశారు. ఆస్నాద రైతు వేదిక వద్ద పంపిణి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 600ల మంది రైతులు వచ్చి యూరియా కావాలని ఆందోళన చేపట్టడంతో పంపిణీని నిలిపి వేశారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
పాతమంచిర్యాల: మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో మద్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాలుగో మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నెలల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, 25 ఏళ్లుగా పని చేస్తున్న కా ర్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, పింఛన్ సౌకర్యాలు కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ బిల్లులు చెల్లించని పక్షంలో ఈ నెల 15 నుంచి ఎంఈవో కార్యాలయాల ఎదుట ధర్నా చేపడతామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, జన్నారం మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
నమ్మకమైన మోసాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుత్తడి ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మోసాలు సైతం అదే తీరుగా పెరుగుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసాలతో సర్వత్రా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమేర్పడింది. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తున్న బ్యాంకుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కొందరు బ్యాంకు ఉద్యోగుల తీరుతో ఆయా సంస్థల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారంపై రుణాలు పొందాలన్నా, రుణ సంస్థలపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారంతో పాటు విలువైన ఆస్తులు, బ్యాంకుల్లో తనఖా పెట్టేముందు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కొన్నిచోట్ల మోసం ఆదిలోనే బయటపడుతుండగా మరికొన్ని చోట్ల నెలలతరబడి జరుగుతోంది. నమ్మకమున్న చోటనే.. ప్రజల్లో బ్యాంకులపై నమ్మకానికి మారుపేరుగా విశ్వాసం ఉంది. అయితే కొంతమంది సిబ్బంది తప్పటడుగులతో అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సాధారణంగా బ్యాంకులు, ప్రైవేటు రుణసంస్థల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు, బంగారం వంటి లావాదేవీల్లో క్షుణ్నంగా పరిశీలనలు, తనిఖీలు ఉంటాయి. ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ప్రతీస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుంది. అంతేకాక కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది. లావాదేవీల విషయంలో ప్రతీది అత్యంత భద్రత మధ్య సాగుతుంటాయి. అయితే అలాంటి నమ్మకున్న చోటనే ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్రమత్తమైన బ్యాంకులు, సంస్థలు చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచి–2 వ్యవహారంతో బ్యాంకర్లు, రుణసంస్థలు అప్రమత్తమై తమ సంస్థల్లోని అన్ని బ్రాంచీల్లో బంగారం నిల్వలు, రుణాల లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ ఆడిట్లతో పాటు ఈ ఘటనల తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖాతాదా రులు సైతం కుదవపెట్టిన బంగారం, రుణాలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడికక్కడ రుణాలపై క్షుణ్నంగా పరిశీలనలు చేస్తూ తమసంస్థల పరిధిలో ఉన్న సిబ్బందిపైనా కఠిన పర్యవేక్షణ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.ఇటీవల జరిగిన ఘటనలు -
పనులు పెండింగ్ లేకుండా చూడాలి
లక్సెట్టిపేట: కార్యాలయంలో ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు 14 మంది జీపీవోలను ప్రభుత్వం నియమించిందని, ఇక సిబ్బంది కొరత ఉండదని, ఎలాంటి పనులను పెండింగ్ లేకుండా ప్రజలకు సేవలందించాలన్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, డిజిటల్ సంతకాల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టాలన్నారు. భూభారతిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, డీటీ శ్రావణి, సీనియర్ అసిస్టెంట్ నవనీత్, సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తపై కులవివక్ష
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలం చిన్న బెండార గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న ఇగురపు లక్ష్మిపై గ్రామస్తులు కుల వివక్ష చూపుతున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం చిన్న బెండార గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపారు. ఐదేళ్ల క్రితం చిన్న బెండారకు అంగన్వాడీ టీచర్ ఇగురపు లక్ష్మి అనే దళిత మహిళ బదిలీపై వచ్చిందన్నారు. అప్పటి నుంచి అడపాదడపా ఆమైపె స్థానికులు కొందరు కుల వివక్ష చూపుతున్నా పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. పి ల్లల కోసం వండిన అన్నం కూడా తినకుండా బహిష్కరిస్తున్నారని తెలిపారు. గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించి సహపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నివేదికను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు, అట్రాసిటీ కమిటీ సభ్యుడు రేగుంట కేశవ్రావు, భారతీయ బౌద్ద మహాసభ జిల్లా అధ్యక్షుడు, అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సబ్యుడు అశోక్ మహోల్కర్, నాయకులు గోపాల్నాయక్, ఇగురపు గణేష్, శ్యాంరావు, పొన్నాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ పేరిట మొక్క.. పచ్చదనం పక్కా
నిర్మల్ఖిల్లా: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, ‘ఏక్ పేడ్ మాకే నామ్ పే’ పేరుతో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలనే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా పాల్గొని పాఠశాల ఆవరణలతోపాటు గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ కృషి చేస్తోంది. ప్రత్యేక కార్యాచరణ.. కార్యక్రమం అమలు కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించింది. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, తల్లి పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది. ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. నాటిన మొక్కలను పరిరక్షించేందుకు కూడా తగిన కార్యాచరణ చేపడుతున్నారు. సమష్టిగా.. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా పాల్గొంటే ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 లక్షలకు పైగా మొక్కలు నాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొక్కలు గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆధ్వర్యంలో పంపిణీకి అందుబాటులో ఉన్నాయని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. మొక్క నాటి.. పోర్టల్లో అప్లోడ్.. తల్లి పేరిట మొక్క నాటిన సందర్భంలో విద్యార్థులు ఫొటో తీసి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని www. ecoclubs. eduvation. gov. in పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ పోర్టల్లో పాఠశాల వివరాలు, యుడైస్ కోడ్, విద్యార్థి పేరు, తండ్రి పేరు వంటి వివరాలను నమోదు చేసి, మొక్క నాటే సమయంలో తీసిన ఫొటోను జతచేయడం ద్వారా విద్యార్థి పేరిట ధ్రువీకరణ పత్రం, ప్రశంసాపత్రం జనరేట్ అవుతుంది. పర్యావరణ పరిరక్షణ.. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల ఆవరణలు, గ్రామాలు పచ్చదనంతో కళకళలాడనున్నాయి. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతోపాటు, సమాజంలో పచ్చదనం విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా పాఠశాలలు విద్యార్థుల సంఖ్య నిర్మల్ 842 1,12,300 ఆదిలాబాద్ 1,279 1,23,900 మంచిర్యాల 847 1,05,600 కుమరంభీమ్ 1,148 1,18,200 -
గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
గుడిహత్నూర్: ఆదిలాబాద్ను గంజాయి రహిత జి ల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ అఖి ల్ మహజన్ అన్నారు. మండలంలోని తోషం గ్రా మ శివారులో పట్టుకున్న గంజాయి మొక్కలకు సంబంధించి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీఎస్, ఇచ్చోడ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి తోషం శివారులో మర్సకోల దేవురావు అనే రైతు చేనులో పత్తిలో అంతర పంటగా సాగు చేస్తున్న 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.62.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. గంజాయి సాగు, విక్రయాలపై పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు వారికి రివార్డు అందజేస్తామన్నారు. అనంతరం ఆయన స్థానిక ఠాణాలో రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, సీసీఎస్ సీఐ పి.చంద్రశేఖర్, ఇచ్చోడ సీఐ రాజు, ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. నార్నూర్లో ఒకరి అరెస్టు.. నార్నూర్: గంజాయి సాగు చేస్తున్న ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాదిగూడ మండలం పర్సువాడ పంచాయతీ పరిధిలోని సారుగూడకు చెందిన మార్సుకోల జంగు తన పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈమేరకు గురువారం సాయంత్రం దాడులు జరిపి 16 మొక్కలను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. -
సొంతింటికే కార్మికుల మొగ్గు
శ్రీరాంపూర్: కార్మికులు సొంతింటి పథకానికే మొగ్గు చూపుతున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. కార్మికులకు కంపెనీ క్వార్టర్ కావాలా? సొంతింటి పథకం కావాలా అనే దానిపై గురు, శుక్రవారాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా గనులపై బ్యాలెట్ పత్రాలతో కార్మికుల అభిప్రాయాలు సేకరించారు. శ్రీరాంపూర్ ఏరియా బ్యాలెట్ పత్రాలను శుక్రవారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో లెక్కించారు. 60శాతం మంది కార్మికులు బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇందులో 4543 మంది సొంతింటి పథకం కావాలని, 31 మంది కంపెనీ క్వార్టరే కావాలని ఓటేశారని తెలిపారు. కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో వచ్చిన అభిప్రాయాలను యాజమాన్యానికి త్వరలోనే సమర్పిస్తామని తెలిపారు. 40ఏళ్లు కంపెనీలో సర్వీసు చేసిన కార్మికులు రిటైర్డ్ తర్వాత సొంతిళ్లు కూడా కట్టుకోలేకపోతున్నారన్నారు. యూనియన్ బ్రాంచీ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, నాయకులు వెంగళ శ్రీనివాస్, తోడే సుధాకర్, పెర్క సదానందం, శ్రీపతి బానేశ్, కిషన్రెడ్డి, వెంకట్రెడ్డి, మిడివెల్లి రాజ్కుమార్ పాల్గొన్నారు. -
బాలుడి అప్పగింత
కాగజ్నగర్టౌన్: ఇంటి నుంచి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి జిల్లాకు వచ్చిన మైనర్ బాలుడిని జిల్లా బాలల సంరక్షణ అధికారి బొల్ల మహేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కాగజ్నగర్ స్టేషన్లో ఓ రైలులో బాలుడిని గుర్తించి విచారించారు. సికింద్రాబాద్లోని పార్శిగుట్ట ప్రాంతం నుంచి అతడు వచ్చినట్లు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని బాల రక్షభవన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడి తండ్రిని పిలిపించి అప్పగించారు. డీసీపీవో మహేశ్ మాట్లాడుతూ పిల్లల పై నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ ఉన్నారు. -
అజ్ఞాతంలోనే ముగిసిన వెంకటి ప్రస్థానం
బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్: విప్లవ సిద్ధాంతానికి ఆకర్షితుడైన బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ భిమల్ అలియాస్ సురేష్(56) విప్లవ ప్రస్థానం అజ్ఞాతంలోనే ముగిసింది. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబండ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన పది మంది మావోయిస్టుల్లో వెంకటి ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు. 30ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా విప్లవ కార్యకలాపాలు సాగించాడు. 1996 ప్రాంతంలో అజ్ఞాతంలోకి వెళ్లి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ప్రింటింగ్ ప్రెస్, ఇతర కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయుధాల సామగ్రిని వివిధ ప్రాంతాల నుంచి రవాణా చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. తెలంగాణలో కార్యకలాపాలు సాగించకపోవడం, హింసాత్మక కార్యకలాపాల్లో వెంకటి భాగస్వామ్యం అంతంత మాత్రం కావడంతో ఆయన పేరు స్థానిక పోలీసు రికార్డుల కెక్కలేదు. 15ఏళ్ల క్రితం ఝార్ఖండ్ రాష్ట్రం రూర్కేలాలో ఓసారి పోలీసులకు పట్టుబడ్డాడు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకే వెళ్లాడు. ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. ఎన్కౌంటర్లో మృతితో రహస్య జీవితం ముగిసింది. వెంకటిపై ఆయా రాష్ట్రాల్లో రూ.10లక్షల రికార్డు ఉంది. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పీపుల్స్వార్ సానుభూతి పరుడిగా... బెల్లంపల్లి బస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(అద్దాలబడి)లో వెంకటి పదో తరగతి వరకు చదివాడు. 1985లో తన గ్రామానికి చెందిన పుష్పను ప్రేమించి శివాలయంలో పెళ్లి చేసుకున్నాడు. గ్రామ సుంకరిగా పని చేస్తూనే వ్యవసాయం చేసేవాడు. పీపుల్స్వార్, సికాస సానుభూతి పరుడిగా ఉన్న అతడిపై పోలీసులు ప్రత్యేక నిఘాతో వేధింపులకు గురి చేశారనే ప్రచారం ఉంది. దీంతో ఏడాదిపాటు బెల్లంపల్లి అంబేడ్కర్నగర్లో మకాం పెట్టాడు. అయినా పోలీసుల వేధింపులు ఆగకపోవడంతో భార్య పుష్పతో కలిసి దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆమె టెక్నికల్ టీంలోనే సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు జాడి పోశమ్మ, ఆశయ్య దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు కుమార్తెలు రామక్క, సుజాత, కుమారుడు వెంకటి ఉన్నారు. వీరిలో రామక్క కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో, తల్లిదండ్రులు 15ఏళ్ల క్రితం వృద్ధాప్యంతో చనిపోయారు. తల్లిదండ్రులు మృతిచెందిన సమయంలోనూ అంత్యక్రియలకు రాలేదు. తల్లిదండ్రులు నివాసం ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయింది. ఆశయ్య సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పనిచేశాడు. -
రెవెన్యూ శాఖలో పనులు త్వరగా పూర్తి చేయాలి
దండేపల్లి/జన్నారం: రెవెన్యూ శాఖలో పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శుక్రవారం ఆయన దండేపల్లి, జన్నారం మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా విధుల్లో చేరిన గ్రామ పాలనాధికారులతో మాట్లాడారు. విధుల్లో అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా నిర్వర్తించి మంచి పేరుతెచ్చుకోవాలని అన్నారు. భూభారతి దరఖాస్తులు వివరాలు తెలుసుకున్నారు. సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన, నోటీసుల జారీ తదితర పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో దండేపల్లి డీటీ మాధవి, ఆర్ఐ భూమన్న, జన్నారం తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, డీటీ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘సాత్నాల’ పరవళ్లు..
దిగువకు వెళ్తున్న వరదనీరు సాత్నాల: మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు శుక్రవారం 2,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ఈ మేరకు రెండు గేట్లు ఓపెన్ చేసి 2,380 క్యూసెక్కులను దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.24 టీఎంసీ కాగా, ప్రస్తుతం 1.046 టీఎంసీగా ఉన్నట్లు వెల్లడించారు. ఉరకలేస్తున్న వరద నీరు దూకిన ‘మత్తడి’ తాంసి: మండలంలోని వడ్డాడి సమీపంలో గల మత్తడివాగు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. శుక్రవారం ఇన్ఫ్లో 1494 క్యూసెక్కులు ఉండగా ఒక గేటు ఎత్తి అంతే మొత్తంలో ఔట్ఫ్లో దిగువకు వదిలినట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు. ప్రస్తుతం 277 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉండేలా స్థిరీకరిస్తున్నట్లు వెల్లడించారు. -
రక్షణలో ఆదర్శంగా నిలవాలి
శ్రీరాంపూర్: రక్షణలో ఆదర్శంగా నిలవాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. 55వ రక్షణ పక్షోత్సవాల్లో ద్వితీయ బహుమతి సాధించిన ఆర్కే న్యూటెక్ గని ఉద్యోగులను ఆయన అభినందించారు. శుక్రవారం గనిపై నిర్వహించిన ఈ అభినందనలో ఆయన మాట్లాడారు. గని ఉద్యోగులు రక్షణలో ముందున్నారని, ఇతర గనులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా సాధించడం మరో మైలు రాయిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, గ్రూప్ ఏజెంట్ కే.రాజేందర్, గని మేనేజర్ కురుపాటి శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, రక్షణ అధికారి కొట్టే రమేష్, సీనియర్ సంక్షేమ అధికారి పాల్ సృజన్ పాల్గొన్నారు. -
విధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై దాడి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్లో అటవీ, బేస్క్యాంపు సిబ్బందిపై దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని తాళ్లపేట ఎఫ్ఆర్వో సుష్మారావ్ తెలిపారు. పక్కా ప్రణాళికతో కారంచల్లి కర్రలతో దాడి చేశారని, దీంతో భయభ్రాంతులకు గురైన తమ సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారని పేర్కొన్నారు. దాడికి గురైన వారిలో ఎఫ్ఎస్వో బాలకృష్ణ, బీట్ ఆఫీసర్ పరమేశ్వర్, బేస్క్యాంపు వాచ్మెన్ రాజేందర్ ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దండేపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కేజీబీవీ పనులు పూర్తిచేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి: కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ పరిధిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ పరిధిలో చేపట్టిన అదనపు గదులు, మూత్రశాలల పనులను ఎంపీడీవో మహేందర్తో కలసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, మధ్యాహ్న భోజన వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు, ఎలర్జీ ఇతర లక్షణాలు కనిపిస్తే సమీప వైద్యశాలలో చికిత్స అందించాలని సూచించారు. ఏఈ వినయ్కుమార్ పాల్గొన్నారు. -
యూడైస్ ప్లస్కు ఆటంకాలెన్నో..!
మంచిర్యాలఅర్బన్: యూడైస్ ప్లస్ పోర్టల్లో విద్యార్థుల వివరాల నమోదుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సమాచార పారదర్శకత.. అన్ని రాష్ట్రాల స్టూడెంట్ సెంట్రల్ గవర్నమెంటు ఒకే పోర్టల్లో ఉండాలని యూడైస్ ప్లస్ ఆన్లైన్ నమోదు ప్రక్రియ చేపట్టింది. ప్రతీ పాఠశాలలోని ప్రతీ విద్యార్థి వివరాలు నమోదు చేయాల్సి ఉంది. నమోదు చేయకపోతే విద్యార్థులకు స్కాలర్షిప్, సర్టిఫికేట్ జారీ, పలు సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యాశాఖలో ఎన్ని యాప్లు వచ్చినా ఆన్లైన్ నమోదు ప్రక్రియ అంతంతగానే ఉంది. విద్యార్థుల వివరాలు నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాల్సి ఉండగా నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 1,25,683 మంది విద్యార్థులకు గాను 1,19,354 మంది ఆధార్కార్డులు సమర్పించగా.. 6329 మంది ఆధార్కార్డులు సమర్పించలేదు. కారణాలు అనేకం..? విద్యార్థుల వివరాలు పోర్టల్లో నమోదు కాకపోవడానికి అనేక కారణాలున్నాయి. కొత్తగా చేరిన విద్యార్థుల్లో చాలామంది వివరాలు ఆధార్కార్డు, సర్టిఫికేట్లో వేర్వేరుగా ఉండడం కూడా ఇబ్బందిగా మారుతోంది. ఇదివరకు ఎల్కేజీ, యూకేజీలో ఆధార్కార్డు లేకపోయినా విద్యార్థుల వివరాలు పోర్టల్ నమోదుకు అవకాశం ఉండేది. ఆధార్ తప్పనిసరి కావడంతో ఎంట్రీ కావడం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వివరాల నమోదులో అనాసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో ఎలాంటి వివరాలు అందుబాటులో లేని విద్యార్థులు అడ్మిషన్లు పొందడం.. ఇతర జిల్లాలకు చెందిన వారు కావడం కూడా నమోదు ప్రక్రియకు అవాంతరంగా మారినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ఓ సర్కారు పాఠశాలలో 830 మంది, మందమర్రిలో 651 మంది విద్యార్థులు ఆధార్డుకార్డులు సమర్పించలేదంటే నమోదు ఏవిధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకేచోట అన్ని వివరాలు.. విద్యార్థుల పూర్తి సమాచారం తెలిసే యూడైస్ ప్లస్ డాటా ఎంట్రీపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాఠశాల పేరు, మండలం, విద్యార్థి పూర్తి పేరు, తల్లిదండ్రులు, కులం, మాట్లాడే భాష, పుట్టిన ఊరు, ప్రస్తుత నివాసం, పుట్టినతేదీ, ప్రస్తుత పాఠశాల, పూర్వ పాఠశాల, ఏ సంవత్సరం ఎక్కడ చదివారు, మాధ్యమం, బ్లడ్గ్రూప్, ఎత్తు, బరువు, పాఠశాల ఇంటికి ఎంత దూరం, విద్యార్థుల బ్యాంకుఖాతాలతోపాటు పలు అంశాలను పొందుపర్చాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలు చూపుతూ ప్రైవేట్ యాజమాన్యాలు తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కళాశాలలు యాజమాన్యాలు పాఠశాలలకు సంబంధించినదంటూ తప్పించుకుంటున్నారు. యూడైస్ నంబరు ఆధారంగానే స్కాలర్షిప్లు కూడా మంజూరయ్యే వీలుంది. యూడైస్ ప్లస్ సెంట్రల్ పోర్టల్ నమోదు చేయడం వల్ల విద్యార్థి ఎక్కడ చదువుతున్నది ఇట్టే తెలిసిపోనుంది. తద్వారా సర్టిఫికేట్లు జారీ కూడా సులువు కానుంది. ఆధార్కార్డులేని విద్యార్థులకు ఆధార్కార్డులు ఇప్పించడం.. యూడైఎస్ప్లస్ పోర్టల్లో నమోదుపై అధికారులు, టీచర్లు దృష్టి సారిస్తేనే విద్యార్థులకు మేలు జరుగనుంది. ఆధార్ సమర్పించని విద్యార్థులు బెల్లంపల్లి మండలంలో 436 మంది, భీమినిలో 184, భీమారంలో 143, చెన్నూర్లో 452, దండేపల్లిలో 258, హాజీపూర్లో 152, జైపూర్లో 208, జన్నారంలో 533, కన్నెపల్లిలో 311, కాసిపేటలో 219, కోటపల్లిలో 528, లక్సెట్టిపేటలో 278, మంచిర్యాలలో 830, మందమర్రిలో 651, నస్పూర్లో 255, నెన్నెలలో 280, తాండూర్లో 368, వేమనపల్లిలో 243మంది ఉన్నారు. -
యూరియా కొరత లేకుండా చేస్తున్నాం
● మంత్రి వివేక్వెంకటస్వామి లక్సెట్టిపేట: జిల్లాకు యూరియా కొరత లేకుండా చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మంచిర్యాలకు వెళ్తున్న ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తేనీరు తాగి కాసేపు మాట్లాడారు. యూరియా కొరత కేంద్రం వల్లనే ఏర్పడిందని, తక్కువ స్టాకును పంపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు యూరియాను ఎక్కువగా తెప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దమ్మ సునీల్, శాంతికుమార్, రవి, కిషన్, రవీందర్, మల్లేష్, తిరుపతి పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని న్యాయవాదులు, ఉద్యమ సంఘాల నాయకులు తెలిపారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగడం, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రజల పక్షాన పని చేసే జర్నల
బెల్లంపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం పత్రిక రంగం. పత్రికల్లో నిరాధారణమైన, అసత్యమైన వార్తా కథనాలు వస్తే వివరణ కోరవచ్చు. సదరు పత్రిక బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలు, అణిచివేత విధానాలకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్పై అక్రమ కేసులు పెట్టడం సరైన విధానం కాదు. ఏదైనా సరే చట్టానికి లోపాడి వ్యవహరించాలి. కానీ వేధింపులకు గురి చేసే ధోరణి ఏమాత్రం మంచిది కాదు. పత్రిక స్వేచ్ఛను కాలరాయలనుకోవడం అవివేకం అవుతుంది. – అంకెం శివకుమార్, బెల్లంపల్లి బార్అసోసియేషన్ అధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛను కాలరాయొద్దు -
ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతం
మంచిర్యాలటౌన్: ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలోపేతం దిశగా రాష్ట్ర, జాతీయ నాయకత్వం ముందుకు వెళ్తోందని, అందులో భాగంగానే మంచిర్యాలకు చెందిన రఘునాథ్ వెరబెల్లిని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమై మొదటిసారిగా శుక్రవారం మంచిర్యాలకు వచ్చిన రఘునాథ్కు ఆ పార్టీ నాయకులు ఇందారం వద్ద ఘన స్వాగతం పలికారు. నగరంలో ర్యాలీ అనంతరం కాలేజీరోడ్డులోని పద్మనాయక ఫంక్షన్హాల్ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లనే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందని విమర్శించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని, దళారులతో బ్లాక్ మార్కెట్కు తరలించి రైతులను దోచుకుంటోందని ఆరోపించారు. రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ బీజేపీ పోరాట ఫలితంగానే మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ కల్పించారని, స్థానిక ఎంపీ తనే చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేత, గోనె శ్యాంసుందర్రావు, కొయ్యల ఏమాజి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, పెద్దపల్లి పురుషోత్తం, మున్నారాజా సిసోడియా, గాజుల ముఖేశ్గౌడ్, జోగుల శ్రీదేవి, ముత్తె సత్తయ్య, కమలాకర్రావు, పట్టి వెంకటకృష్ణ, అక్కల రమేశ్, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
వయోజనులు చదవాలి.. రాయాలి
కోటపల్లి: ప్రతి ఒక్కరూ కనీస విద్యాజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఉల్లాస్ పథకంలో భాగంగా వయోజన విద్యాశాఖ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనుంది. నవభారత్ సహకారంతో ఈ కార్యక్రమం దసరా వరకు ప్రారంభం కానుంది. డీఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులు, మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి నివేదిక అందజేశారు. జిల్లాలో 15ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్యలో 30,636మంది నిరక్షరాస్యులను గుర్తించారు. శిక్షణ ఇవ్వడానికి 3,064మంది వాలంటీర్లను ఎంపిక చేసి మండలాల వారీగా శిక్షణ కూడా పూర్తి చేశారు. విధి విధానాలను సెర్ప్ అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రతీ గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరు రిసోర్స్పర్సన్లు, ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వగా స్వచ్ఛందంగా బోధనకు ముందుకొచ్చే వారికి శిక్షణ ఇస్తారు. సామాజిక సాధికారతలో భాగంగా చదువురాని వారికి చదవడం, రాయడం నేర్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో 50శాతం మంది మాత్రమే సంతకం చేస్తున్నారని, మిగతా వారు వేలిముద్ర వేస్తున్నారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. దీంతో వయోజన మహిళలకు చదువు నేర్పడమే కాకుండా మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి నేరుగా ఓపెన్ పది, ఆసక్తి ఉంటే ఓపెన్ ఇంటర్, డిగ్రీ వరకు చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్మెంటు టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. బ్యాకింగ్ రంగంలో అర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర ఆంశాలు నేర్పిస్తారు. వాలంటీర్ల బోధన స్వచ్ఛందంగా బోధన చేసేవారి వీలు ఆధారంగా మండలంలో ఎంచుకున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, పంచాయతీలు, కమ్యూనిటీ భవనాలు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తారు. 15నుంచి 20మంది చొప్పున గ్రూపులు ఏర్పాటు చేస్తారు. మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన వారిని ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న సభ్యులకు చదవడం, రాయడం వచ్చే వరకు చదువు చెప్పే బాధ్యత వాలంటీర్లకు అప్పగించారు. విద్యాశాఖ పుస్తకాలతోపాటు ఉపాధ్యాయుల ద్వారా సహకారం అందిస్తారు. తల్లి చదవడం ద్వారా అ కుటుంబంలో వెలుగు నిండుతుంది. తద్వారా బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్ తగ్గి బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. గ్రామంలో అక్షరాస్యులు ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధిలో పయనించేందుకు దోహదడపతుంది. -
ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
దండేపల్లి/లక్సెట్టిపేట: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన లక్సెట్టిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. దండేపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల స్కూల్కాంప్లెక్స్ సమావేశాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనలో డిజిటల్ వ్యవస్థ పెరిగిపోతున్నందున ఉపాధ్యాయులు ఆ దిశగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో లక్సెట్టిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, కాంప్లెక్స్ హెచ్ఎం సంగర్స్ రాజేశ్వర్రావు, రీసోర్స్పర్సన్లు అప్పాల మనోహర్, వేణుగోపాల్, శ్రీనివాస్, సైన్స్ ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేత లక్సెట్టిపేట మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారని యూఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, సహాయ కార్యదర్శి గీతాంజలి ఆర్జెడీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
స్వేచ్ఛను హరించడమే..
ఆదిలాబాద్టౌన్: రాజ్యాంగం కల్పించిన హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాయడం సరికాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను ప్రచురిస్తే ఎడిటర్పై కేసులు పెట్టడం సరికాదు. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – వెంకటేశ్, జేఏసీ కోకన్వీనర్ ఆసిఫాబాద్అర్బన్: మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మీడియాపై అణచివేతకు పాల్పడిన ఘటనలు లేవు. తప్పుడు వార్తలు రాస్తే వివరణ అడగాలి. అంతేగాని దౌర్జన్యానికి దిగడం సరికాదు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. సాక్షి పత్రిక ఎడిటర్పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. – రాపర్తి రవీందర్, ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. -
కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దినపత్రిక ఎడిటర్, బ్యూరో ఇన్చార్జి, విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దాడులను ఉపేక్షించొద్దు. దీని వెనుక రాజకీయ నాయకులు ఎవరున్నా విచారణ చేపట్టి శిక్షించాలి. ఏపీలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. – దుర్గం దినకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్న మీడియా గొంతు నొక్కడం సరికాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రిక ఎడిటర్పై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిచడం సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకం. – భగత్ మహేందర్, అడ్వకేట్ మీడియా గొంతు నొక్కడం సరికాదు -
అడవిపంది దాడిలో మహిళకు తీవ్రగాయాలు
కోటపల్లి: అడవిపంది దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని వెంచపల్లిలో బొల్లవేన మధునక్క ఇంటి సమీపంలోని స్థలంలో మొక్కజొన్న పంట వేసింది. గురువారం తెల్లవారుజామునే అడవి పందిని తరిమివేస్తుండగా వేగంగా దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చెన్నూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న మధునక్కను ఫారెస్టు అధికారులు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అడవిపంది మృతిచెందిందని తెలుసుకున్న అధికారులు పంచనామా నిర్వహించి ఖననం చేశారు. మధునక్కను గాయపర్చిన పంది అడవిపందినే అని గ్రామస్తులు తెలుపగా ఊర పంది అని ఫారెస్టు అధికారులు తెలపడం గమనార్హం. ఈ విషయమై ఫారెస్టు రేంజర్ సదానందంను వివరణ కోరగా గాయపర్చిన పంది ఊరపంది అని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పడం గమనార్హం. -
సొంతింటిపై అభిప్రాయ సేకరణ
శ్రీరాంపూర్: కార్మికులకు సొంతిల్లు కావాలా..? కంపెనీ క్వార్టర్ కావాలా..? అనే అంశంపై సీఐటీయూ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. కంపెనీ వ్యాప్తంగా రెండు రోజులపాటు చేపడుతున్న కార్యక్రమంలో తొలిరోజు గురువారం భూగర్భ గనుల్లో బ్యాలెట్ పద్ధతిలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. శ్రీరాంపూర్లోని భూగర్భ గనులపై ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆర్కే 7, ఆర్కే న్యూటెక్ గనిపై జరిగిన కార్యక్రమానికి ఆ యూనియన్ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్మికులు ఈ అంశంపై బ్యాలెట్ పేపర్పై టిక్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. మీడియా సమక్షంలో లెక్కించి దాని ఆధారంగా యజమాన్యానికి రిపోర్ట్ ఇస్తామని తెలిపారు. యూనియన్ బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కోశాధికారి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ శ్రీనివాస్, సాయిల శ్రీనివాస్, తిరుపతి, బానేష్, శ్రీధర్, తోడే సుధాకర్, నవీన్, పెరిక సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీ
ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్లో నర్సింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం చుట్టూ ఎలాంటి రక్షణగోడ లేకపోవడాన్ని గమనించిన గుర్తుతెలి యని వ్యక్తులు.. స్వామివారి విగ్రహంపై ఉన్న వెండినామాలు, ఇతర సామగ్రి, హుండీని పగులగొట్టి ఎత్తుకెళ్లారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కాగా, పట్టణంలోని గాంధీనగర్ శివారులో నల్లపోచమ్మ ఆలయం వద్ద ఓ దొంగ చోరీకి యత్నిస్తున్న విషయమై సీసీ ఫుటేజీ పరిశీలించిన అర్చకులు ఈశ్వర్, ఆలయకమిటీ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
అప్రమత్తంగా ఉండాలి
అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్క్రైమ్, ఆన్లైన్ గేమింగ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడడం, నిర్వహించడం చట్టరీత్యా నేరం. నిర్వహించినా, ఆడినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు ఉంటాయి. పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలు ఆడుతున్నారనేది తల్లిదండ్రులు గమనించాలి. ఎక్కడైనా నిషేధిత బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే నేరుగా పోలీసు అధికారులకు సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
‘మత్తడివాగు’ రెండు గేట్ల ఎత్తివేత
దిగువకు వెళ్తున్న వరదనీరు మండలంలోని వడ్డాడి సమీపంలో గల మత్తడివాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. ఇన్ఫ్లో ద్వారా 1290 క్యూసెక్కుల నీటిని రెండు గేట్లను ఎత్తి 3567 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 277.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. భారీవర్షాల నేపథ్యంలో మరిన్ని గేట్లు ఎత్తి నీటిని వదిలే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. – తాంసి -
ఆటగాళ్లు ఆగమాగం
మంచిర్యాలక్రైం: ఆకర్షించి.. అప్పుల పాలు చేసి ఆర్థికంగా దివాలా తీయిస్తున్న ఆన్లైన్ ఆటలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు–2025’ తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ యాప్ల ఉచ్చులో పడి బాలలు, యువత, మధ్య వయస్కుల వరకు ఎంతోమంది జీవితాలను అంధకారం చేసుకున్నారు. కొందరు ఆత్మహత్యకూ పాల్పడ్డారు. మరికొందరు ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు. రమ్మీ, సట్టా, ఫోకర్, కార్డ్గేమ్స్తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీ ఇలా డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే ఆటలు యువత జీవితాలను నట్టేట ముంచాయి. ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్కు బానిస కావడం వల్ల పలు కుటుంబాలు ఇబ్బందులకు గురయ్యాయి. ఇకపై ఆన్లైన్ గేమ్లు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలు లేదా రూ.కోటి జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు రెండు శిక్షలు విధిస్తారు. గేమ్లపై ప్రచారం చేసినా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.50లక్షల జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు రెండూ విధించవచ్చు. పోగొట్టుకున్న డబ్బు సంపాదించాలని ఇటీవల చెన్నూర్లోని బ్యాంకులో క్యాషియర్గా పనిచేసే రవీందర్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో రూ. 40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎలాగైనా ఆ డబ్బు సంపాదించాలని బ్యాంకుకే టోకరా వేశాడు. బ్యాంకులో పనిచేసే కొందరితోపాటు తనకు తెలిసిన మ రికొందరి సహకారంతో బ్యాంకులో ప్రజలు తాక ట్టుపెట్టిన 25.17 కిలోల బంగారునగలు, రూ.1.10 కోట్ల నగదు గోల్మాల్ చేశాడు. బయటపడడంతో ముగ్గురు ఉద్యోగులు కటకటాల పాలయ్యారు.ఆన్లైన్ గేమ్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆటలకు బానిసగా మారిన వాళ్లు ఆగమాగం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలో అధికంగా యువత మొదలుకుని ఉన్నత స్థాయిలో ఉన్న వారు సైతం ఆన్లైన్లో రమ్మీ, క్రికెట్ బెట్టింగ్, మనీగేమింగ్లకు బానిసైన వారు ఉన్నారు. మద్యం సేవిస్తూ ఆటలు ఆడుతూ కాలం గడిపేవారు. ప్రస్తుతం గేమింగ్ యా ప్లు ఓపెన్ కాకపోవడంతో మతిస్థిమితం తప్పినట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పిచ్చిలేస్తుందని, మైండ్ పని చేయడం లేదంటూ యువత వింతగా ప్రవర్తిస్తున్నట్లు తెలి సింది. మరికొందరు పేకాట వైపు వెళ్తున్నట్లు సమాచారం. శ్రీరాంపూర్కు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకి ఆన్లైన్ ద్వారా ఒక్క రోజులోనే 28 సార్లు బదిలీలు జరిగాయి. దీంతో బ్యాంకు అధికారులు ఖాతాను నిలిపి వేసి పిలిపించారు. ఇలా బ్యాంకు అధికారులు సైతం అధికంగా ఆన్లైన్లో పలుమార్లు డబ్బు బదిలీ జరిగే ఖాతాలపై దృష్టి సారించినట్లు సమాచారం.మంచిర్యాలలోని రెడ్డికాలనీకి చెందిన ఇప్ప వెంకటేష్(40) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో జీవనం సాగించేవాడు. 2024 సెప్టెంబర్లో ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై రూ.25లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు లోన్ యాప్ల ద్వారా రుణం తీసుకున్నాడు. లోన్యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక భార్య వర్షిణి(33), ఇద్దరు కుమారులు రిషికాంత్(11), విహాంత్(3)లను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఎస్వో, సెక్టోరియల్ అధికారిని సస్పెండ్ చేయాలి
నార్నూర్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ నాసిరకం సరుకులు వాడుతూ అన్నంలో పురుగులు వస్తున్నా పట్టించుకోని నార్నూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారి హిమబిందు, జిల్లా సెక్టోరియల్ (జీసీడీవో) అధికారి ఉదయశ్రీలను సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల ప్రధాన గేటు ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పులిహోరలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వారితో మాట్లాడటానికి వెళ్లిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులను అనుమతి లేదని ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఎస్సై అఖిల్తో వాగ్వాదానికి దిగారు. ఆదివాసీ గిరిజన విద్యార్థినులకు అన్యాయం జరిగితే ప్రశ్నించవద్దా? అంటూ నిలదీశారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు మాట్లాడుతూ ఎస్వో, జిల్లా సెక్టోరియల్ అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేసిన విద్యార్థినులతోపాటు ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని తెలిపారు. గతంలో ఆదిలాబాద్ రూరల్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ అయితే హిమబిందును ఏడాదిపాటు విధుల నుంచి తొలగించారని, పనిష్మెంట్పై నార్నూర్ పంపిస్తే ఇక్కడ అదే ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ సంతోష్, రాజ్ గోండు సేవా సమితి మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల కార్యదర్శి అర్క గోవింద్ ఉన్నారు. -
ఎస్బీఐ–2లో బంగారు ఆభరణాలు రికవరీ
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో జరిగిన భారీ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిగా రికవరీ చేయడంతో కథ ముగిసింది. బంగారం బ్యాంక్కు చేరడంతో ఆందోళనకు గురైన బాధితులకు ఊరటనిచ్చింది. గురువారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో గతనెల 23న క్యాషియర్గా పని చేస్తున్న నరిగే రవీందర్తోపాటు మరికొందరు 20.250 కిలోల బంగారు ఆభరణాలు మాయం చేశారని రీజినల్ మేనేజర్ రితేశ్కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గతనెల 31న ప్రధాన నిందితుడి, 44 మందిపై కేసు నమోదు చేసి 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝూ వెల్లడించారు. ఏ–1 నరిగే రవీందర్, ఏ4, కొంగండి బీరేశ్, ఏ5 కోదాటి రాజశేఖర్ను కస్టడీకి తీసుకుని విచారించాం. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ మంచిర్యాల, ముత్తూట్ ఫిన్క్రాప్ మంచిర్యాల, చెన్నూర్, మణప్పురం మంచిర్యాలలోని రెండు బ్రాంచ్లతోపాటు ముత్తూట్ మనీ బ్రాంచ్ చెన్నూర్లలో 5.250 కిలోల బంగారు నగలను రికవరీ చేశాం. గతంలో చేసినని, గురువారం రికవరీ చేసిన బంగారం పూర్తిస్థాయిలో 20.250 కిలోల నగలను రికవరీ చేశామని తెలిపారు. ఈ గోల్డ్ను కోర్టు డిపాజిట్ చేస్తుందని డీసీపీ తెలిపారు. త్వరలో బ్యాంక్ అధికారులు బాధితులకు అప్పగిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్, శ్రీరాంపూర్ సీఐలు దేవేందర్రావు, వేణుచందర్, ఎస్సైలు శ్వేత, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. పోలీసు అధికారులకు అభినందన చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో మాయమైన బంగారు నగలను 21 రోజుల్లో ఛేదించిన పోలీసులను సీపీ అంబర్ కిశోర్ఝా అభినందించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు దేవేందర్రావు, బన్సీలాల్, వేణుచందర్, బాబురావు, ఎస్సైలు సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోశ్, లక్ష్మీప్రసన్న, కోటేశ్వర్, మధుసూదన్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుళ్లు రవి, రమేశ్, ప్రతాప్, తిరుపతి లింగమూర్తిలకు అభినందనలు తెలిపారు. -
స్నేహితుల సన్మాన పండుగ
లక్ష్మణచాంద: మహిళలకు తామేమి తక్కువ కాదన్నట్లుగా మగవాళ్లు కూడా ఈ మధ్యన స్నేహితుల సన్మానం పండుగ జరుపుకుంటున్నారు. మండలంలోని కనకాపూర్కు చెందిన 24 మంది యువకులు ఇటీవల జరుపుకోగా గురువారం పీచర గ్రామానికి చెందిన 14 మంది యువకులు వ్యవసాయ క్షేత్రంలో శాలువాలతో ఒకరినొకరు సన్మానించుకుని స్వీట్లు తినిపించుకున్నారు. తమ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు. డమ్మీ తుపాకీతో హల్చల్ చేసినవారిపై కేసునిర్మల్టౌన్: పట్టణంలో ఈనెల 7న జరిగిన గణేశ్ నిమజ్జనం సందర్భంగా డమ్మీ తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేసి హల్చల్ చేసినవారిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..స్థానిక నాయుడువాడలో భాగ్యనగర్ కాలనీకి చెందిన భక్తాంజనేయ గణేశ్మండలి విగ్రహం ముందు రంజిత్తోపాటు మరికొందరు డమ్మీ తుపాకీ పట్టుకుని డ్యాన్స్ చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. చుట్టుపక్కల ఉన్నవారిని, నిమజ్జన శోభాయాత్రలో భక్తులను భయంభ్రాంతులకు గురిచేశారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆపాలని చెప్పిన వినకుండా వారి విధులకు ఆటంకం కలిగిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికతలమడుగు: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో ఈనెల 9, 10వ తేదీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ ఎంపిక పోటీల్లో సుంకిడి ఉన్నత పాఠశాల పీడీ జి.నాందేవ్ సత్తాచాటి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు నవంబర్లో జరగనున్నాయి. హెచ్ఎం జైవర్ధన్రెడ్డి, ఉపాధ్యాయులు టి.శ్రీనివాస్ స్వామి, బి.గజానంద్, వై.రామ్రెడ్డి, పి.సుకుమార్, జి.సుజాత, సి.శ్రీనివాస్రెడ్డి, సంజీవరెడ్డి గురువారం ఆయన్ను అభినందించి సన్మానించారు. రేషన్బియ్యం పట్టివేతసిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్పేట్ సమీపంలో రైస్మిల్లులో తహసీల్దార్ రహీమొద్దిన్, ఎస్సై కమలాకర్ గురువారం అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించారు. సుమారు 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఘనంగా అటవీ అమరవీరుల దినోత్సవం
రామకృష్ణాపూర్: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి వనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అటవీ రక్షణ కోసం అసువులు బాసిన అమరవీరులకు జిల్లా అటవీ శాఖ అధి కారి శివ్ ఆశిష్ సింగ్, అధికారులు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి ప్రాణాలనే త్యాగం చేసిన వీరుల త్యాగం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. గాంధారి వనం నుంచి మంచిర్యాల అటవీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంచిర్యాల అటవీ మండలాధికారి సర్వేశ్వర్, రేంజ్ ఆఫీసర్ రత్నాకర్, నిఘా విభాగం అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై ‘కూటమి’ కుట్ర
పాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ భయానక పరిస్థితులు సృష్టిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతికదాడులతోపాటు పోలీసు కేసులతో తీవ్ర అణచివేతకు గురి చేస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో చేస్తున్న జాప్యం, మోసాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మికులు, మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల పక్షాన వార్తల రూపంలో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. తాజాగా ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్ కాన్ఫరెన్స్ వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లలో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ పత్రికాస్వేచ్ఛను హరిస్తూ, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతులను నొక్కేస్తున్న అప్రజాస్వామిక చర్యలను జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. -
చెన్నూర్ డివిజన్ కలేనా..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్ను నూతన రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే నియోజకవర్గవాసుల కల నెరవేరడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్లు ఉండగా.. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు చెన్నూర్ నియోజకవర్గ పరిధిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 2023 అక్టోబర్ 4న కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలతోపాటు చెన్నూరు మండలం ఆస్నాద, కోటపల్లి మండలం పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఆ మేరకు సరిహద్దులు, జనాభా, భౌగోళిక వివరాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ ప్రక్రియ మొదలై రెండేళ్లు పూర్తవుతోంది. కానీ ఇప్పటివరకు ఆ డివిజన్ ఏర్పాటు కాలేదు. దీంతో కొత్త డివిజన్ ఏర్పాటు ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు సైతం ఖరారయ్యాయి. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే మండలాలకు పరిషత్ల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోనుంది.దూరభారంతో ఇబ్బందులుచెన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. దీంతో రెవెన్యూ, పరిపాలన సంబంధించిన పనులకు మంచిర్యాలకు రావాల్సి వస్తోంది. మంచిర్యాల నుంచే భూ సంబంధిత, ఇతర రెవెన్యూ వ్యవహారాలు పర్యవేక్షణ జరుగుతోంది. ఇక కోటపల్లి, చెన్నూరు మండలాల్లోని పలు గ్రామాలకు మంచిర్యాల దూరభారంగా మారింది. గతంలో కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో చెన్నూరును కొత్తగా ఏర్పాటు చేయాలంటూ స్థానికుల నుంచి డిమాండ్లు వచ్చాయి. దీంతో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో మరుగునపడింది. తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపు కరువవడంతో డివిజన్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చేర్యాల, ధర్మపురి, వర్దన్నపేట, బోథ్, జడ్చర్ల, ఖానాపూర్, మక్తల్, ఆత్మకూర్ డివిజన్లు ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది. అయితే ప్రతిపాదిత చెన్నూరు ఈ జాబితాలో కనిపించలేదు.ప్రతిపాదిత కొత్త మండలాలుఅస్నాద: అస్నాద, గంగారం, కొమ్మెర, పొక్కూర్, పొన్నారం, సోమన్పల్లి, నాగపూర్, బీరెల్లి, సుందరశాల, నర్సక్కపేట, దుగ్నపల్లిపారుపల్లి: పారుపల్లి, ఆయాపల్లి, పుల్లగా మ, సిర్సా, ఎదుల్లబంధం, లింగన్నపేట, అలుగామ, ఎర్రాయిపేట, బొరంపల్లి, కావర్కొత్తపల్లి, అన్నారం, అర్జునగుట్ట, రాజారాం, రాంపూర్, కొల్లూర్, రాపన్పల్లి, దేవులవాడ, పిన్నారం, రొయ్యలపల్లి.మంత్రిపైనే ఆశలుప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుపై ఆశలు నెలకొన్నాయి. నియోజకవర్గ వాసుల ఏళ్ల నాటి కలను సాకారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ముమ్మాటికీ కక్ష పూరితమే..
ఏపీలో కూటమి సర్కారు చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత చర్యలే. తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని జర్నలిస్టు సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం. – ఆర్.ప్రకాష్రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొంతు నొక్కడం సరికాదుమంచిర్యాలటౌన్: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేలా రాస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలే గానీ, ఆయా జర్నలిస్టులపై కేసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్తోపాటు జర్నలిస్టులపై పోలీసు కేసులు నమోదు చేయడం, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతునొక్కడంను మా సంఘం ఖండిస్తుంది. – మిట్టపల్లి మధు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీయూడబ్ల్యూజేఎస్) జిల్లా అధ్యక్షుడుకక్షసాధింపు చర్యలు సరికాదు ఆసిఫాబాద్అర్బన్: ఏపీలో సాక్షి దినపత్రిక ప్రజల పక్షాన నిజాలు వెలికి తీస్తుంటే అది భరించలేక దినపత్రిక యాజమాన్యం, జర్నలిస్టులపై దాడులు చేయడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడడం పత్రిక స్వేచ్ఛను హరించడమే అవుతుంది. అక్కడి కూటమి ప్రభుత్వం దినపత్రికపై కక్ష సాధించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. దాడులు, కక్ష సాధింపు చర్యలు మానకపోతే జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. – గణపురం మహేష్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు -
బడి నిర్వహణ నిధులొచ్చాయ్
మంచిర్యాలఅర్బన్: ప్రస్తుత విద్యాసంవత్సరం 2025–26కు సంబంధించి బడుల నిర్వహణకు నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, క్రీడా పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల(జీరో ఎన్రోల్మెంటు, పీఎంశ్రీ స్కూళ్లు మినహాయించి)కు కంపోజిట్ స్కూల్ గ్రాంట్లు వచ్చాయి. విద్యాసంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సిన నిధులు 50శాతానికి రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా బడుల నిర్వహణకు గ్రాంట్లు మంజూరులో జాప్యం వల్ల ప్రధానోపాధ్యాయులకు ఇక్కట్లు తప్పలేదు. మరుగుదొడ్ల శుభ్రతకు కావాల్సిన సామగ్రితోపాటు చాక్పీస్లు, గదుల శుభ్రతకు కావాల్సిన చీపుర్లు, చిన్నపాటి వసతుల కల్పనకు నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పాఠశాలలకు స్వచ్ఛత కిట్ల కింద ఏడు రకాల వస్తువులు అవసరం ఉంటాయి. బకెట్, రెండు మగ్గులు, సర్ఫ్, బ్రష్లు, చీపుర్లు, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు నిధులు మంజూరు చేయకపోవడంతో తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 619 పాఠశాలలకు సంబంధించిన రూ.1,40,20,000 నిధులకు గాను మొదటి విడతలో 50శాతం రూ.70,10,000 మంజూరు చేయడం ఊరట కలిగిస్తోంది. ఇలా.. ప్రతీ సంవత్సరం పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక గ్రాంట్లు మంజూరవుతాయి. 1 నుంచి 30 వరకు విద్యార్థులు ఉంటే రూ.10వేలు, 31 నుంచి 100 వరకు రూ.25వేలు, 101 నుంచి 250 లోపు రూ.50వేలు, 251 నుంచి 1000 మంది వరకు రూ.75వేలు, వెయ్యికిపైగా ఉంటే రూ.లక్ష చొప్పున ఇస్తారు. వీటితో మరుగుదొడ్ల శుభ్రతకు అవసరమైన సామగ్రి కొనుగోలు, విద్యుత్, తాగునీరు, చిన్నపాటి మరమ్మతులు, స్టేషనరీ, ప్రయోగ సామగ్రి, సుద్దముక్కలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జాతీయ పండుగల నిర్వహణ, కంప్యూటర్లు, ప్రొజెక్టర్ల నిర్వహణ, ఇంటర్నెట్, డిజిటల్ తరగతుల వరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది.మొదటి దఫా నిధులు(రూ.లలో)పాఠశాల సంఖ్య రావాల్సినవి మంజూరైనవిపీఎస్ 415 72,10,000 36,05,000 యూపీఎస్ 89 18,45,000 9,22,500 ఉన్నత 115 49,65,000 24,82,500 -
యూరియా కోసం తిప్పలు
వేమనపల్లి/చెన్నూర్రూరల్/మందమర్రిరూరల్: యూరియా కోసం రైతులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వేమనపల్లి మండలం లక్ష్మిపూర్ హాకా సెంటర్ వద్ద గురువారం పొద్దంతా పడిగాపులు కాశారు. నీల్వాయిలోని పీఏసీఎస్కు 222 యూరియా బస్తాలు రాగా వాటిని హాకా సెంటర్ వద్ద రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను ఏవో వీరన్న ఆధ్వర్యంలో అందజేశారు. మరో 80మందికి దొరకకపోవడంతో వెనుదిరిగారు. చెన్నూర్ మండలం పొక్కూరు గ్రామంలో పీఏసీఎస్కు 222 బస్తాలు యూరియా రాగా రైతులకు ఒక్కో బస్తా అందజేశారు. మందమర్రి పాతబస్టాండ్ ఏరియాలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద గురువారం యూరియా పంపిణీ ఉందన్న విషయం తెలుసుకుని క్యాతన్పల్లి, మందమర్రి రైతులు ఉదయమే బారులు తీరారు. 220 బస్తాల యూరియా ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయడంతో చాలామందికి దొరకలేదు. -
‘ట్రాన్స్ఫర్ పాలసీ రద్దు చేయాలి’
శ్రీరాంపూర్: కంపెనీ నూతనంగా తీసుకువచ్చిన ట్రాన్స్ఫర్ పాలసీని రద్దు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం, 13న జేసీసీ సమావేశంలో కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం వద్ద చర్చిస్తామని అన్నా రు. సొంతింటి వంటి ప్రధాన డిమాండ్పై వేసిన కమిటీ నివేదికను సమావేశంలో సమర్పి స్తారని తెలిపారు. ఈ సమావేశంలో యూని యన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వైవీ రావు, ఉపాధ్యక్షుడు ఎల్.ప్రకాష్, కార్యదర్శి జూపాక రామచందర్, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
రుణం మాఫీ చేసి నగలు అప్పగించాలి
చెన్నూర్: బ్యాంక్లో బంగారు నగలు తనఖా పెట్టి తీసుకున్న అప్పును మాఫీ చేసి నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్బీఐ బ్రాంచి–2 బాధితులు గురువారం మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఎస్బీఐపై నమ్మకంతో అవసరాల నిమిత్తం అభరణాలు పెట్టి అప్పు తీసుకుంటే మోసపూరితంగా మాయం చేసి మానసిక వేదనకు గురి చేశారని పేర్కొన్నారు. సుమారు 20 రోజులైనా అభరణాలు ఎప్పుడిస్తారో సరైన సమాధానం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని నగలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్బీఐ గోల్డ్లోన్ బాధితులు పాల్గొన్నారు. -
పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తికి క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.8,100గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ జిల్లాలో లక్షా 61,193 ఎకరాల్లో పత్తి సాగైందని, 13,33,811 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశామని తెలిపారు. సీసీఐ నాలుగు, 11 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదించామని అన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి 31 వరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతువేదికల్లో పత్తి కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి, పోలీసుశాఖ అధికారి, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతులు పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాలి చెన్నూర్: రెండేళ్లలో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూర్ గోదావరి నది వద్ద గతంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మహాత్మా జ్యోతిభా పూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, విద్యాబోధన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఆర్ఐ ఆజీజ్, ఏఈలు పాల్గొన్నారు. -
బొమ్మల బడి.. చదువుల ఒడి
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగ పిల్లలకు భరోసానిచ్చే భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలో 18 కేంద్రాలుండగా ఐదింటికి పక్కా భవనాలున్నాయి. మిగతావి ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో కొనసాగుతున్నాయి. ర్యాంపులు, రైలింగ్తోపాటు మరమ్మతు పనులు, కార్యకలాపాల గది నిర్మాణం, పిల్లలకు అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం పెయింటింగ్ పనుల కోసం జిల్లాకు రూ.37,54,768 నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఒక్కో కేంద్రానికి పెయింటింగ్ కోసం రూ.1.50లక్షల కేటాయించారు. ఈ నిధులను సద్వినియోగం చేసి కేంద్రాలను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. భవిత కేంద్రాల్లో గీసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సులువుగా అర్థమయ్యేందుకే..జిల్లాలోని 18 భవిత కేంద్రాల్లో 196 మంది ప్రత్యేకావసరాలు కలిగిన చిన్నారులున్నారు. 92 మంది ఇంటి వద్ద ఉంటూ సేవలు వినియోగించుకుంటున్నారు. ఒక్కో కేంద్రానికి ఇద్దరు ఐఆర్పీల చొప్పున 36 మందికిగాను 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. మానసిక దివ్యాంగులు, చెవిటి, మూగ, అంధత్వం ఇలా 21రకా ల వైకల్యంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల ను గుర్తించి సేవలందిస్తున్నారు. ఆటాపాటలతో బోధిస్తే అర్థం చేసుకోవటంతో పాటు ఇట్టే గుర్తు పెట్టుకునే అవకాశముంటుంది. భవిత కేంద్రాల్లో తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు అ నుగుణంగా బొమ్మలు గీయిస్తున్నారు. బొమ్మలు చూసే చిన్నారులు వాటిని మననం చేసుకునే వీలుంటుంది. తరగతి గది గోడలపై గీసిన బొమ్మలు వీరిని ఆలోచింపజేస్తున్నాయి. పరిసరాలు అందంగా.. ఆహ్లాదంగా ఉండటమే కాకుండా విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. గోడలపై అక్షరాలు, అంకెలు, పలు రకాల చి త్రాలు, మానవ శరీర భాగాలు, వివిధ రకాల ఆకారాలు, బొమ్మలు వారికి కనువిందు చేస్తున్నాయి. పెయింటింగ్ పనులు అన్ని కేంద్రాల్లో పూర్తి కావస్తున్నట్లు, పక్కా భవన నిర్మాణాలు కొనసాగుతున్నట్లు సెక్టోరల్ అధికారి చౌదరి తెలిపారు. తరగతి గదిలో కూరగాయలు, పండ్ల చిత్రాలు మంచిర్యాల కేంద్రం వరండా గోడలపై బొమ్మలు -
నిరంకుశ చర్యలు సమంజసం కాదు
పత్రిక స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి గీటురాయి లాంటిది. పత్రికలు నిర్భయంగా వాస్తవాలు వెల్లడిస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఏపీలో సాక్షి పత్రికపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంకుశ చర్యలు సమంజసం కాదు. ఒక రాజకీయ నాయకుడి సమావేశం వివరాలను ప్రచురిస్తే తప్పు ఎలా అవుతుంది. ఎవరికై నా ఇబ్బంది ఉంటే పరువునష్టం కేసు సదరు నాయకుడు వేసుకోవచ్చు. కానీ పత్రికను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదు. బుధవారం తెలంగాణ హైకోర్టు వెలువరించిన నల్ల బాలు కేసు తీర్పు అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. – రంగు రాజేశం, తెలంగాణ సామాజిక న్యాయవేదిక కన్వీనర్ కేసులు ఎత్తివేయాలిఆసిఫాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్ప డడం సిగ్గుచేటు. నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదు. కథనాలపై అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ కోరాలి. కానీ అక్రమ కేసులు పెట్టడం సరికాదు. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించి సాక్షి ఎడిటర్పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. లేనిపక్షంలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉద్యమిస్తాం. – అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు -
విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(వరంగల్) సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం మంచిర్యాల డీసీఈబీ కార్యాలయంలో డీఈవో యాదయ్యతోపాటు ఎంఈవోలతో పాఠశాలల్లో కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటి ఫలాలు ప్రతీ విద్యార్థికి అందేలా చూడాల్సిన బాధ్యత ఎంఈవోలపై ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏఎక్స్ఎల్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్వాలా, డిజిటల్ లెర్నింగ్ ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఎంఈవోలు ప్రతీరోజు రెండు పాఠశాలలు సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ వేణుగోపాల్, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, విజయలక్ష్మీ, సత్యనారాయణమూర్తి, ఏఎస్సీ రాజ్కుమార్, డీఎస్వో రాజగోపాల్ పాల్గొన్నారు. -
‘గిరి’ ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు
మంచిర్యాలఅర్బన్: స్థానిక సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 7గంటల వరకు హాస్టల్ నిర్వహణ, లోపాలు, రికార్డుల పరిశీలనలో ఏసీబీ బృందానికి జిల్లా లీగల్ మెట్రాలజీ, సీనియర్ ఆడిటర్, సానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ సహకరించారు. సరుకులు, బియ్యం తూకం క్షుణ్ణంగా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నీరు, ఆహార నాణ్యత, పరిమాణం, సానిటేషన్ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, పాఠశాల రికార్డులు పరిశీలించారు. వాటర్ ఫ్యూరికేషన్ ట్యాంకు పనిచేయ డం లేదని, సానిటేషన్, వసతిగృహ నిర్వహణ లోపాలను గుర్తించామని, ప్రభుత్వానికి నివేది స్తామని ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపారు. కాగా, ఏసీబీ అధికారుల తనిఖీతో ఇతర వసతిగృహ నిర్వాహకులు అప్రమత్తం అయ్యారు. -
పోలీసుల పహారాలో యూరియా పంపిణీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/చెన్నూర్రూరల్: హాజీపూర్ మండలం పడ్తనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాల పంపిణీ కొనసాగింది. మంగళవారం యూరియా కోసం రోడ్డెక్కిన రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున బుధవారం అందజేశారు. ఉదయం 5 గంటలకే వచ్చిన రైతులు యూరియా కోసం చాలా సమయం నిరీక్షించారు. రైతుల తోపులాటలు జరగకుండా హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వరస క్రమంలో 222 మంది రైతులకు 444 యూరియా బస్తాలు పంపిణీ చేశారు. 110 రైతులకు మరుసటి రోజు కోసం ముందస్తుగా టోకెన్లు అందజేశారు. చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలోని పీఏసీఎస్కు 222 యూరియా బస్తాలు వచ్చాయి. వ్యవసాయశాఖ అధికారులు రైతు వేదిక వద్ద ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా పంపిణీ చేశారు. -
అణచివేతను ప్రశ్నించిన వీరవనిత ఐలమ్మ
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్తోపాటు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంఘాల నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు. పనులు వేగవంతం చేయాలి మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలటౌన్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ తెలిపారు. బుధవారం ఆయన గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల, కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ డీఈ సజ్జత్భాషా, ఈఈ లక్ష్మీనారాయణ, ఏఈఈ అనూష, కళాశాల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు పాల్గొన్నారు. పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి లక్సెట్టిపేట: మండల కేంద్రంలో 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం స్థానిక గోదావరి నదీ తీరం, పుష్కరఘాట్ పరిశీలించారు. తహసీల్దార్ దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్, మేనేజర్ రాజశేఖర్ పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల కోసం నిరసన దీక్ష
పాతమంచిర్యాల: బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు బుధవారం స్థానిక గాంధీ పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడు తూ కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను సవరించి 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిందని, బీసీలు రిజర్వేషన్లు కల్పించాల ని అడిగితే కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గజెళ్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, అంజన్న, లంక సతీష్ పాల్గొన్నారు. -
ఆస్పత్రి కిక్కిరిసి..
మంచిర్యాలటౌన్: స్థానిక ఐబీ చౌరస్తాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) రోగులతో కిక్కిరిసిపోతోంది. 250 పడకలతో ఆస్పత్రి నిర్వహిస్తుండగా.. వర్షాకాలంలో ఏటా ముంపు భయంతో మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను ఇక్కడికే తరలిస్తుండడంతో నిర్వహణకు అదనంగా 150 పడకలు కేటాయించాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందించేందుకు సరిపడా పడకలు, వార్డుల్లో ఖాళీ లేకపోవడంతో వరండాల్లోనే 200 వరకు మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. వర్షాకాలం కావడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. నిత్యం 300 వరకు ఓపీ ఉండగా ప్రస్తుతం 600కు పైగా వస్తుండడం, 200 మందికి పైగా రోగులు ఇన్పేషెంట్గా చేరుతున్నారు.ఏటా తిప్పలే..మంచిర్యాలలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లోకి వర్షాకాలంలో గోదావరి నది వరద నీరు రావడం, వరద ముప్పు పొంచి ఉండడంతో ప్రతియేటా ఎంసీహెచ్లోని గర్భిణులు, బాలింతలను జీజీహెచ్కు తరలించాల్సి వస్తోంది. జనరల్ ఆసుపత్రి భవనం పాతది కావడం, వర్షానికి తడిసి స్లాబ్ పెచ్చులు ఊడుతుండడం భయాందోళనకు గురి చేస్తోంది. వరండాల్లోనే పడకలు వేయడంతో వైద్యులు, సిబ్బంది, రోగులు నడిచేందుకు ఇబ్బందిగా మారుతోంది. ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోతతోనే రోగులు అవస్థలు పడుతున్నారు. జీజీహెచ్లో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉండగా ప్రతీరోజు 15కు పైగా ప్రసవాలు, 10కి పైగా వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ఎంసీహెచ్ను ఇక్కడి తరలించడంతో రోగుల సంఖ్య పెరిగి ఆపరేషన్ థియేటర్ వద్ద ప్రసవం, ఇతర శస్త్రచికిత్సకు రోజంతా వేచి చూడాల్సి వస్తోంది. ఎంసీహెచ్కు ప్రత్యామ్నాయంగా ఐబీ ఆవరణలో నూతన భవనం నిర్మిస్తున్నా పూర్తయ్యేందుకు మరో రెండేళ్ల సమయం పట్టనుంది. జనరల్ ఆస్పత్రి శిథిలావస్థకు చేరడంతో కాలేజీరోడ్డులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో భవనం నిర్మిస్తుండగా.. పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టనుంది. -
కార్పొరేషన్పై పీఎఫ్ భారం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్లు చేసిన నిర్లక్ష్యం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నెత్తిన ఆర్థిక భారమై పడింది. బకాయిల కింద నగరపాలక సంస్థ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయింది. మళ్లీ ఖాతా పునరుద్ధరణకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో 128మంది కార్మికులకు అప్పటి కమిషనర్లు సకాలంలో ఈపీఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి) చెల్లించలేదు. దీంతో బకాయిలు ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. చెల్లించే మొత్తంపై వడ్డీ, జరిమానాలతో బల్దియాకు మరింత ఆర్థిక నష్టంగా మారింది. దీనిపై పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్లు నాలుగేళ్లుగా పలుమార్లు నోటీసులు ఇచ్చారు. గతేడాది నస్పూర్ మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. రూ.5లక్షల వరకు జప్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరో బ్యాంకు ఖాతాతో కార్యకలాపాలు సాగించినప్పటికీ సమస్యకు పరిష్కారం వెతకలేదు. ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్లో విలీనం కావడంతో ఆ మున్సిపాలిటీ ఆస్తులు, అప్పులు, సిబ్బంది తదితరవన్నీ బదిలీ అయ్యాయి. దీంతో రూ.కోట్ల బకాయి కార్పొరేషన్ నెత్తిన పడింది. ఇటీవల బ్యాంక్ ఖాతా స్తంభింపజేయగా, కార్పొరేషన్ నుంచి పీఎఫ్ ఖాతాకు రూ.30లక్షలు చెల్లించారు. మిగతావి కడతామని పీఎఫ్ అధికారులకు తెలియజేశారు.వేల నుంచి రూ.కోట్లకు చేరిగత ఆరేళ్లుగా నస్పూర్ సిబ్బంది నెలవారీగా రూ.వేలల్లో ఉండే పీఎఫ్ కట్టడంలో నాటి అధికారులు నిర్లక్ష్యం వహించారు. 2018 నుంచి 2021 వరకు రూ.1.05కోట్లు బకాయిలు ఉన్నట్లు తేలింది. 2021నుంచి 2025వరకు మరో రూ.1.50కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. మొత్తంగా రూ.2.50కోట్లపైనే బకాయి ఉండనుంది. వీటిపై జరిమానా, వడ్డీతో కలిపి ఇంకా రూ.50లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. వీటిలో రూ.14లక్షలు, రూ.5లక్షల వరకు పీఎఫ్ కమిషన్ అధికారులు అకౌంట్లను ఫ్రీజ్ చేసుకుని తీసుకున్నారు. తాజాగా మరో రూ.30లక్షలు కార్పొరేషన్ చెల్లించింది. మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈపీఎఫ్ అనేది ఉద్యోగులకు యాజమాన్యం, ఉద్యోగులు సంయుక్తంగా నెలవారీ జీతంలో 12శాతాన్ని పీఎఫ్ కింద జమ చేయాలి. అయితే నస్పూర్లో పని చేసినప్పుడు సిబ్బందికి జీతం మాత్రమే ఇస్తూ పీఎఫ్ వాటా చెల్లించలేదు. కానీ సిబ్బంది నుంచి మాత్రం వారి నెల జీతం నుంచి వాటా తీసుకున్నారు. ఏళ్ల తరబడి కార్మికులకు చెల్లించకపోవడంతో పీఎఫ్ కమిషన్ మున్సిపాలిటీపై విచారణ జరిపి చర్యలు ఉపక్రమించింది.రికవరీ ఉంటుంది..నస్పూర్ పరిధి సిబ్బంది పీఎఫ్ బకాయిలపై బాధ్యులను గుర్తించి వారి నుంచి రికవరీ ఉంటుంది. కార్పొరేషన్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తే పునరుద్ధరణకు పీఎఫ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. సిబ్బందికి నెలవారీగా పీఎఫ్ జమలో జాప్యం లేకుండా చర్యలు తీసుకున్నాం. – కె.సంపత్కుమార్, కమిషనర్, నగరపాలక సంస్థ మంచిర్యాల ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలిగత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సిబ్బందికి పీఎఫ్ చెల్లించక, బకాయి, వడ్డీ, జరిమానాలు కట్టాల్సి వస్తోంది. ఆ అధికారులపై చర్యలు తీసుకుని ఇప్పటికై నా సకాలంలో పీఎఫ్ జమ చేయాలి. – నయిం పాషా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మంచిర్యాలఆర్థిక భారంగత అధికారులు చేసిన తప్పిదం ప్రసుత కార్పొరేషన్పై ఆర్థిక భారం పడింది. మరోవైపు దీనికి బాధ్యులు ఎవరనేదానిపై విచారణ మొదలైంది. కార్మికుల వివరాలతోపాటు ఆ సమయంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లను బాధ్యులను చేస్తూ వారి నుంచి వసూళ్లు చేసే అవకాశం ఉంది. ఇక కార్పొరేషన్లో విలీనమయ్యాక సిబ్బందికి కొత్తగా పీఎఫ్ ఖాతాలు తెరిచి నెలవారీగా జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. -
నాలుగు నెలలుగా వేతనాల్లేవ్..
పాతమంచిర్యాల: ఉపాధిహామీ కూలీలకు 15రోజులకోసారి వేతనాలు అందించాలనే నిబంధన అమలుకు నోచుకోవడంలేదు. నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. నిత్యావసర వస్తువులకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా అఽధికారులు నిర్దేశించిన ప్లాంటేషన్, క్యాటిల్షెడ్లు, ఇంకుడుగుంతలు, రోడ్డు నిర్మాణ పనులకు వెళ్తున్నామని తెలిపారు. రోజంతా కష్టపడ్డా కూలి రూ.300–రూ.307 మాత్రమే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నారు. వచ్చే తక్కువ వేతనం కూడా సకాలంలో రాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి నెలనెలా వేతనాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను సంప్రదించగా కూలీల వేతనాలు వారి ఆధార్కార్డు ఆధారంగా ఖాతాల్లోనే ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. ప్రతీనెల వేతనాల కోసం నివేదికలు తయారు చేసి పంపిస్తున్నామని పేర్కొన్నారు. కూలీలు 2,37,997జాబ్ కార్డులు 1,21,208 -
ఎన్నికల షెడ్యూలే తరువాయి
● తుది ఓటర్ల జాబితా ప్రదర్శన ● ‘పరిషత్’ల్లో 3,76,676 మంది ఓటర్లు మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాలను బుధవారం ప్రదర్శించారు. జిల్లా, మండల స్థాయిల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించిన విషయం తెలిసిందే. అందరి ఆమోదం మేరకు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జెడ్పీ సీఈఓ గణపతి, డీపీఓ వెంకటేశ్వర్రావు పర్యవేక్షణలో జిల్లా, మండల స్థాయి అధికారులు తుది ఓటరు జాబితాను కార్యాలయాల్లో ప్రదర్శించారు. పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి చేశారు. రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 16 మండలాల్లో జెడ్పీటీసీ 16, ఎంపీటీసీ స్థానాలు 129 ఉండగా, 713 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 వేల వరకు బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. మహిళా ఓటర్లు 1,91,015 మంది, పురుష ఓటర్లు 1,85,646 మంది, ఇతర ఓటర్లు 15 మందితో కలిపి మొత్తంగా 3,76,676మంది ఓటర్లు ఉన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న హైకోర్టు జడ్జి
మామడ: మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడు మంగళవారం కనకాపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం నల్దుర్తి గ్రామంలో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తమ నివాసంలో సహాయకుడిగా పనిచేసే ఉదయ్ అంత్యక్రియలకు హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు దంపతులు హాజరయ్యారు. తమ కుటుంబంలో ఒకరిగా మెదిలిన ఉదయ్ భౌతికకాయం చూడగానే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లిదండ్రులు లేని ఉదయ్ కొన్నేళ్లుగా తమ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటున్నాడని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఇన్సాస్ రైఫిల్ తస్కరించిన నేవీ కానిస్టేబుల్
పెంచికల్పేట్(సిర్పూర్): ముంబయిలో ఓ నేవీ కానిస్టేబుల్ తస్కరించిన ఇన్సాస్ రైఫిల్ను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆ నగర క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన డుబ్బుల రాకేశ్ రెండేళ్ల క్రితం నేవీలో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి ఫిబ్రవరి వరకు ముంబయిలో విధులు నిర్వర్తించాడు. ఇటీవల కేరళలోని ఎర్నాకుళంకు బదిలీపై వెళ్లాడు. కాగా, ఈ నెల 6న రాకేశ్ తన అన్న డుబ్బుల ఉమేశ్తో కలిసి ముంబయి నేవీ కేంద్రానికి వెళ్లాడు. సెంట్రీ స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్తోపాటు, 40 తూటాలు, మూడు మ్యాగ్జిన్లను వారు దొంగిలించారు. ఆయుధంతో ఇద్దరు సోదరులు స్వగ్రామం ఎల్కపల్లికి చేరుకున్నారు. నేవీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిందితులను మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయుధం, తూటాలు, మ్యాగ్జిన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ముంబయి క్రైం బ్రాంచ్కు సహకరించిన కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, పెంచికల్పేట్ ఎస్సై అనిల్కుమార్ను ఎస్పీ అభినందించారు. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తిస్తున్న యువకుడు పక్కా ప్రణాళిక ప్రకారం ఆయుధాన్ని దొంగలించి, సొంత గ్రామానికి తీసుకురావడంలో కుట్ర కోణం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండెల రమేశ్కు చెందిన ఏడు గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందాయి. వివరాలు.. బుధవారం రమేశ్ ఏడు గొర్రెలను ఇంటిలోని ఓ షెడ్డులో కట్టేసి మిగతా వాటిని మేతకు తీసుకువెళ్లాడు. అతడి భార్య కూలీ పనికి వెళ్లిపోయింది. ఈక్రమంలో ఇంటి పరిసరాలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు గొర్రెలపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా అవి మృతి చెందాయి. రమేశ్ దంపతులు ఇంటికి తిరిగి వచ్చి మృతి చెందిన గొర్రెలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
లక్ష్మణచాంద: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వడ్యాల్ తండా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వడ్యాల్ తండాకు చెందిన దరావత్ నందు (25) గత నెల 30న తన భార్యతో కలిసి నిర్మల్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ జాతీయ రహదారిపై ఇతని ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ముందు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి, ఆ తరువాత హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
ఒకరి అనుమానాస్పద మృతి
లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మురిమడుగుల మల్లయ్య (58) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈనెల 9న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చోగా నోటి నుంచి నురగలు వచ్చాయి. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, తన తండ్రి మల్లయ్య మృతికి పాము కాటా.. లేదా అనారోగ్యమా? అనేది తెలియడం లేదని మృతుడి కుమారుడు అరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిపై కేసు
వాంకిడి: పత్తి చేసులో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆర్లీ గ్రామ శివారులోగల పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పెరకవాడకు చెందిన ఆకిరెడ్డి పోచయ్య అనే వ్యక్తి చేనులో ఎనిమిది గంజాయి మొక్కలు, ఆర్లి గ్రామానికి చెందిన కావుడె బాజీరావు చేనులో 11 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. మొక్కలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు బిప్లబ్కుమార్ జీనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రం బలేశ్వర్ జిల్లా జమల్పూర్కు చెందిన నిందితుడు ఈనెల 8న అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని పంజాబ్చౌక్లోగల డీబీఎస్ ఏటీంలో చోరీకి యత్నించినట్లు తెలిపారు. గడ్డపారతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా అలారం మోగడంతో పారిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ఎస్పీ వన్టౌన్, టూటౌన్ సీఐలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. 2011 నుంచి 2015 వరకు ఆదిలాబాద్ పట్టణంలోని పలు హోటళ్లలో నిందితుడు పనిచేసినట్లు తెలిపారు. దొంగతనానికి యత్నించిన సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న వన్టౌన్ సీఐ సునీల్కుమార్, టూటౌన్ సీఐ నాగరాజు, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు. -
ఎస్బీఐ కేసును ఛేదించిన పోలీసులు?
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్లో గత నెల 23న అపహరణకు గురైన 20కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేసినట్లు సమాచారం. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు 10రోజుల వ్యవధిలోనే ప్రధాన నిందితునితోపాటు ఈ ఘటనలో భాగస్వామ్యమున్న మరో 46 మందిపై కేసు నమోదు చేశారు. 43మందిని రిమాండ్కు పంపించారు. గత నెల 31న 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ వెల్లడించిన విషయం తెలిసిందే. చెన్నూర్ ఎస్బీఐ కేసులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో చెన్నూర్ సీఐ దేవేందర్రావు ఆధ్వర్యంలో రోజురోజుకూ పురోగతి సాధించారు. ఈ నెల 31నుంచి బంగారు నగల రికవరీని ప్రారంభించారు. వివిధ ఫైనాన్స్ కంపెనీలు, గోల్డ్లోన్ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థల నుంచి 18కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గత మంగళవారం తెల్లవారుజామున చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్లోని సేఫ్టీ లాకర్లో భద్రపరిచారు. ఈ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరించి గోల్డ్లోన్ బాధితులకు అడుగడుగునా భరోసానిస్తున్నారు. ఏక కాలంలో మంచిర్యాల మణప్పురం, ముత్తూట్ ఫిన్ క్రాప్ల నుంచి మరో రెండు కిలోల బంగారు ఆభరణాలు స్వాఽధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు పోలీసులు పూర్తిస్థాయిలో బంగారు నగలు రికవరీ చేసినట్లు తెలిసింది. నేడు వివరాలు వెల్లడించనున్న పోలీసులు! బంగారు ఆభరణాల రికవరీ విషయాన్ని గురువారం పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం. 20రోజులుగా ఆందోళనకు గురవుతున్నా గోల్డ్లోన్ బాధితులకు పూర్తి భరోసా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. వివిధ ఫైనాన్స్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను త్వరగా కోర్టుకు అప్పగించి బ్యాంక్ ద్వారా బాధితులకు ఇచ్చేలా చర్యలు వేగవంతం చేసినట్లు సమాచారం. ఏదేమైనా రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఎస్బీఐ బ్రాంచ్ నుంచి బంగారు ఆభరణాల అపహరణ కేసును రామగుండం సీపీ ఆధ్వర్యంలో మంచిర్యాల డివిజన్ పోలీసులు అనతికాలంలో ఛేదించడం విశేషం. -
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
ఇంద్రవెల్లి: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మండలంలోని దనోరా (బీ) గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, 108 పైలట్ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్కు చెందిన సంతోష్ తన స్నేహితుడు బాలాజీతో కలిసి ద్విచక్రవాహనంపై దనోరా నుంచి గుడిహత్నూర్ వైపు వెళ్లడానికి ప్రధాన రహదారి ఎక్కుతున్నాడు. ఇదే క్రమంలో ఎదురుగా గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వైపు కుటుంబ సభ్యులతో వస్తున్న ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన టిత్రే అర్జున్ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మన్నూర్కు చెందిన సంతోష్కు ఎడమ చేయికి తీవ్ర గాయాలు కాగా, తోడుగా ఉన్న బాలాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన అర్జున్కు తలకు తీవ్ర గాయాలు కాగా, అతడి భార్య శారద కుడి చేతికి గాయాలయ్యాయి. పెద్ద కొడుకు కార్తి క్కు ముక్కు, తలకు, చిన్న కొడుకు రితిక్కు ఎడమ కాలుకు తీవ్ర గాయాలైనట్లు వారు తెలిపారు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్లో వారిని ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
దాడి కేసులో ఇద్దరి రిమాండ్
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లికి చెందిన గిన్నె సతీశ్పై దాడి చేసి గాయపరిచిన ఘటనలో బుధవారం ముద్రకోల్ల రాజా, ఆవుల రాజేందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27న ముత్యంపల్లి మాడల్స్కూల్, పోచమ్మ గుడి సమీపంలో మోటార్ సైకిల్పై వేగంగా వెళ్తున్న వారిని సతీశ్ మందలించాడు. దీంతో బూతులు తిడుతూ దాడిచేసి బండరాళ్లపై తోయడంతో తీవ్రగాయాలైనట్లు తెలిపారు. బాధితుడి సోదరి లత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో చోరీఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ఇద్దరు మహిళల వద్ద నగదు చోరీకి గురైంది. మండలంలోని ఎర్వచింతల్కు చెందిన శివస్మితకు చెందిన రూ.5వేలతో పాటు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి చెందిన సాయమ్మకు చెందిన రూ.20వేలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. జగిత్యాల బస్సు ఎక్కే క్రమంలో జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో దొంగలు ఇదే అదనుగా చేతివాటం ప్రదర్శించారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని తనిఖీ చేశారు. ఇద్దరికి ఆరునెలల జైలుఉట్నూర్రూరల్: ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ ఆదేశాల మేరకు మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పాత కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జైలుకు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపా రు. బైండోవర్ ప్రక్రియలో భాగంగా నిర్ణీత కాలంలో తగిన ష్యూరిటీలు అందించనందున వారిని ఆరునెలల జైలు శిక్షలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఒకరికి ఐదేళ్లు.. మందమర్రిరూరల్: మందమర్రి పట్టణానికి మేసినేని కార్తిక్కు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నిర్మల ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్లు ఎస్పై రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఊరు మందమర్రికి చెందిన కార్తిక్ చిన్నతనంలోనే తలిదండ్రులను కోల్పోయి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈక్రమంలో కార్తిక్ తన చిన్నమ్మ మేసినేని భీమక్కను మద్యం కోసం డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తలపై బండరాయితో దాడి చేశాడు. భీమక్క కుమారుడు సంజీవ్ తన తల్లిపై జరిగిన దాడి విషయంపై కార్తిక్ను మందలించాడు. తనను సంజీవ్ మందలించాడనే విషయాన్ని మనసులో పెట్టుకుని 23 ఫిబ్రవరి 2020న సంజీవ్ ఇంట్లో ఉన్నప్పుడు గొడ్డలితో తలపై దాడి చేశాడు. దీంతో సంజీవ్ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేయగా తర్వాత ఎస్సై భూమేశ్ దర్యాప్తు చేపట్టారు. కేసు ట్రయల్ సమయంలో కోర్టు కానిస్టేబుల్ సురేందర్ ముఖ్య సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్ విచారణలో కీలకపాత్ర పోషించారు. నిందితునికి విచారణ అనంతరం ఐదేళ్ల శిక్షఽ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా నిందితునికి శిక్ష పడేలా చేసిన ఎస్సై, కానిస్తేబుల్, పీపీ తదితరులను డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్రెడ్డి అభినందించారు. వ్యాపారిని బెదిరించిన వ్యక్తిపై కేసు ఇంద్రవెల్లి: ఎడ్లు తరలిస్తున్న వ్యాపారిని ఆపి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని చించోలి గ్రామానికి చెందిన ఎండీ సాదిక్ అనే వ్యాపారి మంగళవారం రాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి వెళ్లి రెండు ఎడ్లను కొనుగోలు చేసి ఆటోలో ఇచ్చోడకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఇంద్రవెల్లి మార్కెట్ వద్ద తగ్రే ఇందల్తోపాటు మరికొందరు ఆటో ఆపి ఎడ్లకు సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బులు డిమాండ్ చేసి ఘర్షణకు దిగారు. దీనిపై ఎండీ సాదిక్ ఫిర్యాదు మేరకు తగ్రే ఇందల్ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని ఉట్నూర్ కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఉదారి నారాయణకు కీర్తి పురస్కారం
ఆదిలాబాద్టౌన్: జిల్లాకు చెందిన కవి, రచయిత ఉదారి నారాయణ 2024 సంవత్సరానికి కీర్తి పురస్కారానికి ఎంపికై నట్లు తెలుగు యూనివర్సిటీ వీసీ సురవరం ప్రతాప్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ యాసలో తనదైన శైలిలో కవితలు రాస్తున్నందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. అవార్డు కింద రూ.5,116 నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు వివరించారు. ఆయన ఎంపిక కావడంపై పలువురు కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. గుడుంబా పట్టివేతభీమిని: మండలంలోని మల్లీడి గ్రామానికి చెందిన కోట ఇస్తారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు లీటర్ల గుడుంబాను శనివారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. పట్టుబడిన గుడుంబా విలువ రూ.2వేలు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటమాని హెచ్చరించారు. విద్యార్థులకు విద్య, వైద్యం అందించాలి ఉట్నూర్రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయ చాంబర్లో ఉమ్మడి జిల్లాల ఉపసంచాలకులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులతో ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణపై సమీక్ష నిర్వహిచారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆశ్రమ పాఠశాలలకు సరుకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన సహాయ సంక్షేమ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రిన్సిపల్ గది, స్కూల్ ఆవరణలోని సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి జిల్లాల గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు అంబాజీ, రమాదేవి, ఏటీడీవోలు, ఏసీఎంవోలు, అదనపు వైద్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పవర్ ప్లాంట్లో సింగరేణి డైరెక్టర్జైపూర్: మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో బుధవారం సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు పర్యటించారు. ముందుగా ఆవరణలో మొక్క నాటారు. అడ్మిన్ కార్యాలయంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీని వాసులు, అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. విద్యుదుత్పత్తి, పనితీరుపై అధికా రులు వివరించారు. ఉత్పత్తిలో దేశస్థాయిలో ఇప్పటివరకు 50కిపైగా అవార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తంజేశారు. ఇదేస్ఫూర్తితో 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. శిక్షణ కేంద్రంలో ప్రవేశాలుమంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ఖేలో ఇండియా బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు స్వీకరిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంతరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న 10–20 ఏళ్లలోపు బాలబాలికలు వివరాలకు కోచ్ రాజేశ్ను 9963539234 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మిస్సింగ్ కేసు నమోదు
తానూరు: మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన పన్నెవాడ్ లక్ష్మణ్ (56) ఆ చూకీ లభించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జుబేర్ బుధవారం తెలిపారు. ఆ యన తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ గత నెల 31న తన కుమారుడు గణేశ్తో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లాడు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనోత్సవాలు చూసి వస్తానని కుమారుడికి చె ప్పి వెళ్లిపోయాడు. 10 రోజులైనా తిరిగి రాలే దు. కుటుంబ సభ్యులు వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మంగళవారం రాత్రి అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
నానమ్మ, మనవరాలు అనుమానాస్పద మృతి
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడ రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ఖమ్మం పట్టణానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష (4) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇదే ఇంట్లో మూడేళ్ల క్రితం సత్యవతి చిన్న కుమారుడు శిరీష (24) ట్రాన్స్జెండర్ సైతం అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రస్తుతం నానమ్మ, మనవరాలు మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 3టౌన్కు చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, వెంకటేశ్ ఉండగా.. చిన్న కుమారుడు వెంకటేశ్ ట్రాన్స్జెండర్(శిరీష)గా మారి మంచిర్యాలలో స్థిరపడింది. గోపాలవాడ శివారులో రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇల్లు నిర్మించుకుని జీవనం సాగించింది. 2022 జనవరి 4న అనుమానాస్పదంగా మృతిచెందింది. అప్పటి నుంచి ట్రాన్స్జెండర్ శిరీష కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఈ నెల 8న గంగోత్రి తన తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషతో కలిసి ట్రాన్స్జెండర్ శిరీష ఇల్లు విక్రయించడానికి మంచిర్యాలకు వచ్చారు. 9న తనకు అస్తమా సమస్య వచ్చిందంటూ గంగోత్రి తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషను ఇక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటి వారికి సమాచారం అందించాడు. స్థానికులు వెళ్లి ప రిశీలించగా తలుపులు తీయకపోవడంతో ‘డయల్ 100’కు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా సత్యవతి, గీతశిరీష విగతజీవులుగా కనిపించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు పలుసార్లు గంగోత్రికి సమాచారం ఇచ్చి రావాలని సూచించినా రాకపోవడంతో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యా..? ఆత్మహత్యా..? సత్యవతి, గీతశిరీష మృతి హత్యా..? ఆత్మహ త్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిని విక్రయించడానికి వచ్చిన ముగ్గురిలో ఇద్ద రు ఇక్కడే ఉండడం, ఒక్కరే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏం జరిగిందనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. -
నానమ్మ, మనవరాలు అనుమానాస్పద మృతి
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడ రైల్వే ఏ క్యాబిన్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ఖమ్మం పట్టణానికి చెందిన బెజ్జాల సత్యవతి(55), ఆమె మనవరాలు గీతశిరీష (4) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇదే ఇంట్లో మూడేళ్ల క్రితం సత్యవతి చిన్న కుమారుడు శిరీష (24) ట్రాన్స్జెండర్ సైతం అనుమానాస్పదంగా మృతిచెందడం అప్పట్లో కలకలం రేపింది. ప్రస్తుతం నానమ్మ, మనవరాలు మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 3టౌన్కు చెందిన బెజ్జాల చంద్రయ్య, సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు గంగోత్రి, వెంకటేశ్ ఉండగా.. చిన్న కుమారుడు వెంకటేశ్ ట్రాన్స్జెండర్(శిరీష)గా మారి మంచిర్యాలలో స్థిరపడింది. గోపాలవాడ శివారులో రైల్వే ఏ క్యాబిన్ వద్ద ఓ ఇల్లు నిర్మించుకుని జీవనం సాగించింది. 2022 జనవరి 4న అనుమానాస్పదంగా మృతిచెందింది. అప్పటి నుంచి ట్రాన్స్జెండర్ శిరీష కుటుంబ సభ్యులు తరచూ వచ్చి వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఈ నెల 8న గంగోత్రి తన తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషతో కలిసి ట్రాన్స్జెండర్ శిరీష ఇల్లు విక్రయించడానికి మంచిర్యాలకు వచ్చారు. 9న తనకు అస్తమా సమస్య వచ్చిందంటూ గంగోత్రి తల్లి సత్యవతి, కూతురు గీతశిరీషను ఇక్కడే వదిలి ఖమ్మం వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటి వారికి సమాచారం అందించాడు. స్థానికులు వెళ్లి ప రిశీలించగా తలుపులు తీయకపోవడంతో ‘డయల్ 100’కు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా సత్యవతి, గీతశిరీష విగతజీవులుగా కనిపించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు పలుసార్లు గంగోత్రికి సమాచారం ఇచ్చి రావాలని సూచించినా రాకపోవడంతో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యా..? ఆత్మహత్యా..?సత్యవతి, గీతశిరీష మృతి హత్యా..? ఆత్మహత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటిని విక్రయించడానికి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు ఇక్కడే ఉండడం, ఒక్కరే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏం జరిగిందనేది పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. -
కేడర్ను కాపాడుకోవాలే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు జిల్లా నాయకులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు కార్యకర్తలు, ద్వితీ య శ్రేణి నాయకులు తమ చేయి జారకుండా చూ సుకుంటున్నారు. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ జిల్లా నాయకత్వానికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగానే మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని గత నెలలో ప్రకటనలు వెలువడిన సమయంలోనే ఎవరి దారి వారు చూసుకునే పని లో నిమగ్నమయ్యారు. కొందరైతే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతున్న కారణంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు జరిగే వరకు కేడర్ను కాపాడుకోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాల్టీలు, సహకార సంఘాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్ర మంలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాల్సి ఉంది. ఎక్కడికక్కడ అసమ్మతి మొదలైతే ఇబ్బంది అవుతుందని ఆయా నాయకులను పలు రకాలుగా దగ్గర పెట్టుకుంటున్నారు. పండుగల వేళ సతమతంఇటీవల వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు ప్రజాప్రతినిధులతోపాటు నాయకులను ఎంతో కొంత చందా రూపంలో ఇవ్వమంటూ వేడుకున్నారు. జిల్లాస్థాయి నాయకులతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జిల్లా, మండల స్థాయి నాయకులు తమకు తోచినంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ అనుచర వర్గం అసంతృప్తితో ఇబ్బంది పడాల్సి వస్తుందని తప్పని పరిస్థితుల్లో ఆయా మండపాల వద్ద పలు రకాలుగా సాయం అందించారు. ఇక బతుకమ్మ, దసరా పండుగ ముందు కూడా నాయకుల నుంచి కానుకలు ఆశిస్తున్నారు. నమ్మి వెంట తిరుగుతున్న నాయకులు తమకు ఏదైనా ఇస్తారనే ఆశతో ఉన్నారు. ఏటా పండుగ పూట మద్యం, మాంసం కోసం కార్యకర్తలకు డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతం కాస్త నగదు కూడా ఇస్తారనే ప్రచారం మొదలైంది. ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46మంది ఎంపిక చేసిన కార్యకర్తల శ్రమను గుర్తించి రూ.20వేల చొప్పున నగదు పంపిణీ చేయడంతో మిగతా కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. ఇక పండుగ వరకు ఇంకా కానుకలు అనేక మందికి పంచాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల దాకా కేడర్ను కాపాడుకోవడమే నియోజకవర్గ బాధ్యులకు ప్రధాన కర్తవ్యంగా మారింది. అంతర్గతంగా అసంతృప్తిఅధికార పార్టీలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారితోపాటు పార్టీ పదవులు, వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, చైర్మన్లు, కార్పొరేటర్, మేయర్ వరకు పోటీలో దిగాలని అనేకమంది ఆశావహులు క్యూలో ఉన్నారు. ఇప్పటికే తాము బరిలో ఉంటామని పలు కార్యక్రమాలు చేపడుతూ ఆసక్తిని వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల వద్ద పోటీలో ఉంటామని తెలియజేస్తున్నారు. దీంతో ఎక్కడ అసంతృప్తి వచ్చినా ఇబ్బంది అవుతుందని జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తాలు తమకు దొరకడం లేదని నాయకులు వాపోతున్నారు. అధికార పార్టీ కార్యకర్తలతోపాటు ప్రతిపక్ష పార్టీ నాయకులకూ ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. తమకు రెండు బస్తాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. స్టాక్ లేకపోవడం, సకాలంలో బస్తాలు ఇవ్వకపోతే రైతు కుటుంబాల నుంచి వ్యతిరేకత వస్తుందని కిందా మీద పడుతూ ఒత్తిడి అధికంగా ఉన్న చోట్ల పంపిణీ చేయిస్తున్నారు. -
బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారిగా భీమిని ఏడీఏ సురేఖ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్య వసాయాధికారి భూక్య ఛత్రునాయక్ ఆకస్మికంగా సెలవుపై ఈ నెల 30 తేదీ వరకు వెళ్లడంతో ఆయన స్థానంలో ఏడీఏకు బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ డీఏవో దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో సురేఖ రెండు నెలల పాటు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెగ్యుల్ డీఏవో రావడంతో భీమిని ఏడీఏగా కొనసాగుతున్నారు. తిరిగి మరోసారి ఇన్చా ర్జి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయ టెక్నికల్ ఏడీఏ గోపి, సూపరింటెండెంట్ వసంత్, టెక్నికల్ ఏవో శ్రీనివాస్, ఏవో కృష్ణ, ఏఈవో లు, కార్యాలయ సిబ్బంది సురేఖకు మొక్క అందజేసి స్వాగతం పలికారు. -
జాతీయ లోక్ అదాలత్పై సమీక్ష
మంచిర్యాలక్రైం: ఈ నెల 13న జిల్లాలోని అన్ని కో ర్టుల్లో నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్పై జి ల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ చైర్మన్ వీరయ్య మంగళవారం జిల్లా పో లీ స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, బ్యాంక్, చెక్బౌన్స్ కేసులు రాజీ కుదుర్చనున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు న్యాయవాదులు, పోలీస్ అధికారులు కృషి చేయాలని సూ చించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. డీసీపీ భాస్కర్, ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, సీఐలు, ఎస్సైలు, జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి నిర్మల ఉన్నారు. -
ఖాకీల ఓవరాక్షన్!
మంచిర్యాలక్రైం: వినాయక నిమజ్జనం వేళ పోలీస్ అఽధికా రుల తీరు వి వాదాస్పదమైంది. ఇందా రం వద్ద గోదా వరిలో విగ్రహా లు నిమజ్జనం చేస్తుండగా జీడీకే–11గని ఆపరేటర్ గాండు శ్రావణ్కుమార్ క్రేన్ ఆపివేయగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెన్నూర్ రూ రల్ సీఐ బన్సీలాల్ ఆగ్రహంతో అతడిపై చే యి చేసుకున్నాడు. దీనిపై సింగరేణి జీఎం ల లిత్కుమార్కు సింగరేణి కార్మికులు ఫిర్యాదు చేయగా అతడు సీపీ అంబర్కిషోర్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. సీపీ విచారణ చేపట్టాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ను ఆదేశించారు. అలాగే, లక్సెట్టిపేటలోని మహాలక్ష్మివాడలో ఈ నెల 8న నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఇతర విధుల్లో సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తౌసినొద్దీన్ సివిల్ డ్రెస్లో అ టువైపు వెళ్లారు. ఈ క్రమంలో శోభాయాత్రలో పాల్గొన్న వారిపై వారు చేయి చేసుకున్న ట్లు స్థానికులు ఆరోపించారు. శోభాయాత్రలో పోలీసులు, స్థానిక యువకులకు మధ్య వా గ్వాదం చోటు చేసుకుంది. దీంతో సీఐ తన చేతిలోని రివాల్వర్ చూపిస్తూ యువకులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వి షయమై సీఐ రమణమూర్తిని వివరణ కోరగా.. శోభాయాత్రకు, వీళ్ల గొడవకు సంబంధం లేదని తెలిపారు. ఇతర విధుల్లో హాస్పిట ల్ వైపు వెళ్తుండగా పాత బస్టాండ్ సమీపంలో మద్యం సేవించిన సుమారు 20మంది యువకులు గొడవపడుతున్నారని, వారిని నివారించే ప్రయత్నం చేయగా తమపైనే దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. శోభాయాత్రకు సంబంధించిన వ్యక్తులు కాదని తెలిపారు. -
యూరియా కోసం అన్నదాతల అరిగోస
కోటపల్లి: మండలంలోని సిర్సా గ్రామంలో యూరియా పంపిణీ రసాభాసగా మారింది. వివరాలు.. గ్రామంలో మంగళవారం యూరి యా పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. ముందుగా బస్తాలను ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో డంప్ చేయగా మరో వర్గంవారు దీనిని వ్యతిరేకించారు. దీనిపై పరస్పరం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామానికి డీఏవో సురేఖ వచ్చి అధికారులతో మాట్లాడుతుండగా.. రెండు వర్గాల వారు సమస్య చెప్పుకొన్నారు. ఈ క్రమంలో వాగ్వాదానికి దిగారు. యూరియాను ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఎలా డంప్ చేస్తారని ప్రశ్నించారు. బస్తాలు డంప్ చేసిన ఇళ్ల ముందు నిరసనకు దిగారు. వెంటనే అక్కడికి ఎస్సై రాజేందర్ చేరుకుని ఇరువర్గాల వారిని సముదాయించారు. అధికారులను అక్కడి నుంచి పంపించి యూరియా పంపిణీ సజావుగా సాగేలా చూశారు. -
గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్లో గల చందన్పూర్ పునరావాస కాలనీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ గురుకుల పాఠశాలలోని 16 మంది విద్యార్థులు సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కలెక్టర్ కుమార్దీపక్ ఆదేశాల మేరకు పాఠశాలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి 16 మందితో పాటు మిగతా విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని, తరగతి గదుల్లో దోమల మందు స్ప్రే చేయించడం వలన చిన్న అనారోగ్య సమస్య తలెత్తిందని, ఒక్క విద్యార్థికి మాత్రం కళ్లలో మంటలు ఉన్నందున చికిత్స అందించామని ఇన్చార్జి వైద్యాధికారి డాక్టర్ అనిత తెలిపారు. పాఠశాలను సందర్శించిన వైద్యాధికారి అస్వస్థతకు గురైన విద్యార్థులను చూసేందుకు జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి డాక్టర్ అనిత పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
ఆరోగ్య సిబ్బందికి హెపటైటిస్ వ్యాక్సిన్
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులందరికీ హెపటైటిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ అనిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఎంసీహెచ్, జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి హెపటైటిస్ బీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెపటైటిస్ వ్యాధి బారిన పడ్డ వారికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బందితోపాటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వ్యాక్సిన్ మొదటి విడతలో వేయనున్నట్లు తెలిపారు. హెపటైటిస్ ఉన్న వ్యక్తుల నుంచి రక్తం, చెమట ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉన్నందున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, సూపరింటెండెంట్ విశ్వేశ్వర్రెడ్డి, డాక్టర్ అనిల్, ఆర్ఎంవో డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, నాందేవ్, వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, పద్మ, డెమో వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇచ్చోడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వా యి వద్ద చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన ఏనుగు నర్సింహారెడ్డి (21) మూడురోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. తల్లిదండ్రులు సోమవారం రాత్రి ఇచ్చోడకు చేరుకోగా నర్సింహారెడ్డి అక్కడే ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున మేనబావ అయిన విశాల్రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి కారులో వస్తుండగా ఇందల్వా యి వద్ద రోడ్డు పక్కన ఆగి వున్న కంటెయినర్ను ఢీకొట్టా రు. ఘటనలో నర్సింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా కారు నడుపుతున్న విశాల్రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి తరలించారు. అంత్యక్రియల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు, అడ్డి భోజారెడ్డి, దామోదర్రెడ్డి పాల్గొన్నారు. -
ఉప్పొంగిన వాగు.. నిలిచిన రాకపోకలు
సాత్నాల: భోరజ్ మండలం తర్నం వాగు మంగళవా రం పొంగి పొర్లడంతో జాతీయ రహదారి 353 బిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోకిలోమీటర్ల మేర, ట్రాఫిక్ జామ్అయింది. వాగులో నీరు తగ్గకపోవడంతో వందలాది మందిగంటలతరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రూ.4.5 కోట్ల తో నిర్మించిన లోలెవల్ వంతెన ఉపయోగంలో లే కుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు.గణేశ్ చందా కాజేసిన వ్యక్తులపై ఫిర్యాదుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పాత గర్మిళ్ల హన్మన్ గుడి సమీపంలో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రుల ఉత్సవాల కోసం వసూల్ చేసిన చందా డబ్బులను కొందరు వ్యక్తులు కాజేశారని కమిటీ సభ్యుల్లో కొందరు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగ వెలుగులోకి వచ్చింది. కమిటీ సభ్యుల కథనం మేరకు ఎనిమిదేళ్లుగా వినాయకుడిని ప్రతిష్టిస్తుండగా ఏటా చందారూపంలో వచ్చిన డబ్బులు సుమారు రూ.10 లక్షల వరకు జమయ్యాయి. వీటికి సంబంధించిన లెక్కలు చెప్పాలని కమిటీ ప్రధాన సభ్యులను కోరగా చెప్పకుండా బెదిరింపులకు పాల్పడడంతో రామల్ల వెంకట్రెడ్డి, ఆకెనపెల్లి మధు, ఎగ్గెన శ్రీధర్, పుప్పాల హరిష్పై కమిటీ సభ్యులు రాములు, రవి, అశోక్, స్వామి, మరి కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఏఎస్సై వెంకన్నగౌడ్ను వివరణ కోరగ ఫిర్యాదు అందింది వాస్తవమేనని, ఇరు వర్గాల వారిని విచారించనున్నట్లు తెలిపారు. ‘3న దసరా సెలవు ఇవ్వాలి’శ్రీరాంపూర్: అక్టోబర్ 3న దసరా సెలవు ఇవ్వాలని కోరుతూ హెచ్ఎంఎస్ నాయకులు మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్ డీజీఎం(ఈఅండ్ఎం) రవీందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉందని, అదే రోజున దసరా పండుగ వచ్చిందన్నారు. కంపెనీ అక్టోబర్ 2న దసరా పండుగను గుర్తించడం వలన కార్మికులు పండుగ జరుపుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. డబ్యూసీఎల్ సంస్థలో దీన్ని మార్పు చేశారని సింగరేణిలో కూడా 3న దసరా సెలవుగా ప్రకటించాలని కోరారు. గోదావరిలో వివాహిత గల్లంతు..దండేపల్లి: మండలంలోని గూడెం గోదావరి నదిలో కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం తలండి గ్రామానికి చెందిన వివాహిత పోలోజు శృతి(42) గల్లంతైనట్లు పోలీసులు, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా శృతి మానసిక స్థితి బాగోలేదు. మంగళవారం పనిమీద బయటకు వెళ్లిన ఆమె భర్త వెంకటేష్ కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లగా శృతి కనిపించలేదు. ఆచూకీ కోసం వెతుకుతుండగా గూడెం గోదావరి వంతెన వద్ద బ్యాగు, చెప్పులు కనిపించాయి. నదిలో దూకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతదహెగాం: ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలించి రైస్మిల్లు వద్ద అన్లోడ్ చేస్తుండగా సోమవారం రాత్రి ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు రాజ్కుమార్, శ్రీనివాస్ పట్టుకున్నట్లు తహసీల్దార్ మునవార్ షరీఫ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్కాపూర్కు చెందిన వ్యాన్లో కన్నెపల్లి నుంచి 54 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలించి దహెగాంలోని వాసవి మోడ్రన్ రైస్ మిల్లులో అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బియ్యానికి పంచనామా నిర్వహించి దహెగాం రేషన్ దుకాణం–1కు అప్పగించినట్లు తెలిపారు. రైస్మిల్లు యాజమాని సూర సందీప్, గుమస్తా విఘ్నేష్, వ్యాన్ యాజమాని రాకేశ్, డ్రైవర్ అభిషేక్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫుట్బాల్ ఎంపిక పోటీలురామకృష్ణాపూర్: మందమర్రి మండలం పులిమడుగులోని హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్లో మంగళవారం అండర్–14, 17 జిల్లా స్థాయి బాల బాలికల ఫుట్బాల్ ఎంపిక పోటీలను మందమర్రి సీఐ శిశధర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, పరిశీలకులు పాల్గొన్నారు. -
కవి ‘తుమ్మల’కు కీర్తి పురస్కారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్ర ముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావును ప్రతిష్టాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధరంగాల్లో కృషి చేస్తున్న 48 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావు పురస్కార గ్రహీతల వివరాలను మంగళవారం వెల్లడించారు. ఈ నెల 23, 24 తేదీల్లో రూ.5,116 నగదు, పురస్కారంతో సత్కరించనున్నారు. దేవరావు తన పరిశోధనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 17 శాసనా లను వెలుగులోకి తీసుకొచ్చారు. 2000లో ‘నిర్మల్ జిల్లా కథలు’ పేరిట సుమారు 80 ధారావాహికలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యాయి. శాతవాహన రాష్ట్ర కోట, కాకతీయ, అసఫ్జాహీ, నిజాం, కళ్యాణి చాళక్యులకు సంబంధించిన అనేకమైన చారిత్రక అంశాలను నమోదు చేశారు. వీరి పరిశోధనలు గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం 2024 సంవత్సరానికిగానూ కీర్తి పురస్కారానికి ఎంపిక చేసింది. -
గంజాయి సాగు చేస్తున్న ఒకరి రిమాండ్
లింగాపూర్: గంజాయి సాగు చేస్తున్న ఒకరిని రిమాండ్కు తరలించినట్లు జైనూర్ సీఐ రమేశ్, లింగాపూర్ ఎస్సై గంగన్న తెలిపారు. లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ మహెబూబ్ తన పంటచేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడని తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లి తనిఖీ చేయగా 24 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడి కేసులో ముగ్గురు..లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్కు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. కాలనీకి చెందిన అక్షయ్కుమార్ అదే కాలనీకి చెందిన యువతిని ప్రేమపేరుతో వేధిస్తుండగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల తరువాత కేసులో రాజీ పడాలని నిందితుడు యువతిని బెదిరించడంతో మళ్లీ ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు తండ్రి రవీందర్పై నిందితుడు అతని సోదరులు సంజయ్, విజయ్లతో కలిసి దాడికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. అడ్వకేట్పై దాడిచేసిన మహిళపై కేసుఆదిలాబాద్రూరల్: మావల పోలీసు స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో అడ్వకేట్పై దాడిచేసిన మహిళపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కర్రె స్వామి తెలిపారు. కేఆర్కే కాలనీకి చెందిన మహిళకు నాన్ బెయిలెబుల్ నోటీసు అందజేయడానికి అడ్వకేట్ కమిషన్ ఠాకూర్ కౌషిక్ వెళ్లడంతో ఆయనపై సదరు మహిళ దాడికి పాల్పడింది. దీంతో కౌషిక్ ఫిర్యాదు మేరకు మహిళపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అయ్యప్ప ఆలయంలో చోరీతలమడుగు: మండలంలోని సుంకిడి అయ్య ప్ప ఆలయంలో చోరీ జరిగినట్లు ఇన్చార్జీ ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి హుండీని పగులగొట్టి రూ.20వేల నగదు, రూ.50వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలించారు. ఆలయ కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా అయ్యప్ప ఆలయంలో చోరీ జరగడం ఇది మూడవసారి. సైబర్ వలలో నిరుద్యోగిఆదిలాబాద్టౌన్: పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన ఓ నిరుద్యోగి సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కాడు. తన వాట్సాప్కు ఏప్రిల్ నెలలో హాయ్ అంటూ మెస్సేజ్ వచ్చింది. జాబ్ ఆఫర్స్ ఉన్నాయని తెలుపడంతో స్పందించాడు. ఆన్లైన్లో మొదట రూ.5వేలు పంపించాల్సి ఉంటుందని, ఇంటి వద్ద నుంచే పని చేయాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి వేతనం చెల్లించడం జరుగుతుందని సూచించారు. మొత్తం ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.98వేలు ఆన్లైన్లో సదరు యువకుడు చెల్లించినా ఎలాంటి ఉద్యోగం కల్పించలేదు. తీరా మోసపోయానని తెలియడంతో మంగళవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. నాందేడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆలస్యంఆదిలాబాద్: దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ రైల్వే డివిజన్ విభాగంలో జరుగనున్న లైన్ బ్లాక్ పనుల కారణంగా ఆదిలాబాద్–హజూర్ సాహెబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్ (17409) రైలు కొంత ఆలస్యంగా నడవనున్నట్లు నాందేడ్ రైల్వే డివిజన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 15న మాల్టెక్డీ స్టేషన్ వద్ద 80 నిమిషాల పాటు, 17, 18 తేదీల్లో లింబగావ్ స్టేషన్ వద్ద 40 నిమిషాల పాటు, 24, 25, 26 తేదీల్లో బోల్డా స్టేషన్ వద్ద 30 నిమిషాల పాటు నిలిపివేయబడుతుందని వివరించింది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకో వాలని విజ్ఞప్తి చేసింది. సంస్కృతి, సంప్రదాయాలపై టీచర్ల ప్రదర్శననిర్మల్ఖిల్లా: రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ప్రదర్శనలో ‘బోధనాభ్యసన ప్రక్రియలో పప్పెట్రీ (తో లుబొమ్మలాట)’ అనే అంశంపై 15 రోజులపా టు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. 13 రా ష్ట్రాల నుంచి 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. రాష్ట్రం నుంచి పది మంది ఉపాధ్యాయులు భాగస్వామ్యమవుతుండగా నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన మాదరి ఎల్లన్న పాల్గొన్నారు. మంగళవారం వివిధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేపట్టిన వీరి ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు..
సోన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కడ్తాల్ గ్రామానికి చెందిన డీకొండ ప్రసాద్ (40) సోమవారం నిర్మల్ గ్రామీణ మండలంలోని ముఠాపూర్లో గణేశ్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నాడు. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగివస్తుండగా కడ్తాల్ గ్రామ శివారులోని హరిత రిసార్ట్ వద్ద 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు. నీటిగుంతలో పడి వృద్ధుడు.. నెన్నెల: నీటిగుంతలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మారమ్మ వాడకు చెందిన జంబి చీకటి (74) సోమవారం ఉదయం నెన్నెల శివారులోని పత్తి చేనుకు కాపలా వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య పోసాని, కుమారుడు మల్లేశ్ వెతుకుతుండగా రోడ్డుపక్కన నీటిగుంతలో పడి మృతి చెంది కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చెరువులో పడి ఒకరు.. భైంసారూరల్: ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒక రు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన చిట్టెల్వార్ గంగారాం(64)సోమవారం ఉదయం పశువులు మేపేందుకు గ్రామ సమీపంలోకి వెళ్లాడు. పక్కనే ఉన్న చెరువులో పశువులు దిగడంతో వాటిని ఒడ్డుకు చేర్చేక్రమంలో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆచూకీ కోసం గాలించారు. మంగళవారం ఉదయం మృతదేహం నీటిపై తేలియాడడంతో పో స్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భారత్బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. లారీ ఢీకొని యువకుడు..లక్ష్మణచాంద: లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మామడ మండలంలోని నల్తూర్థికి చెందిన కొత్తపెల్లి ఉదయ్ కుమార్(23) కొంతకాలంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు వద్ద పనిచేస్తున్నాడు. మంగళవారం పనినిమిత్తం నల్తూర్థికి వెళ్లి నిర్మల్కు బైక్పై వస్తుండగా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బావ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వివాహిత అదృశ్యంఆదిలాబాద్టౌన్: ఉత్తర్ ప్రదేశ్కు చెందిన దంపతులు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడలో నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య మనస్పర్థాలు రావడంతో మంగళవారం ఉదయం చౌహాన్ పూజ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం వరకు రాకపోవడంతో ఆమె భర్త చౌహాన్ రాజేష్ టూటౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఏటీఎంలో చోరీకి విఫలయత్నంఆదిలాబాద్టౌన్: జిల్లా కేంద్రంలోని ఏటీఎం సెంటర్లో ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఒరిస్సాలోని బలేశ్వర్కు చెందిన బిప్లబ్ కుమార్ సోమవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని కిసాన్ చౌక్ ప్రాంతంలోని డీబీఎస్ ఏటీఎంలోకి చొరబడ్డాడు. గడ్డపారతో యంత్రాన్ని ధ్వంసం చేసి లాకర్ను పగులగొట్టేందుకు యత్నించాడు. ఆ సమయంలో అలారం మోగడంతో అక్కడి నుంచి పరుగులు పె ట్టాడు. అప్రమత్తమైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకొని రిమాండ్కు తరలించారు. చోరీకి యత్నించిన వీడియోలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. కాగా నిందితుడు వారం రోజుల క్రితం జిల్లా కేంద్రానికి రైలులో వచ్చినట్లు పేర్కొన్నారు. చోరీకి యత్నించగా పట్టుబడినట్లు సీఐ నాగరాజు వివరించారు.