Mancherial
-
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
బెల్లంపల్లిరూరల్: మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలో మంగళవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు రూరల్ సీఐ అఫ్జలొద్దీన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పెద్దదుబ్బ గ్రామ శివారులో తాళ్లగురిజాల ఎస్సై రమేశ్, మండల వ్యవసాయాధికారి ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన మాకినేని వెంకటనారాయణ ఇంట్లో తనిఖీ చేయగా 25 కిలోల పత్తి విత్తనాలు పట్టుబడినట్లు తెలిపారు. వాటి విలువ రూ.90 వేల వరకు ఉంటుందన్నారు. చిలకలూరిపేటకు చెందిన జగన్ వద్దనుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. విత్తనాలను సీజ్ చేసి నిందితునిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
మాటల్లో పెట్టి.. మట్టి చేతిలో పెట్టారు..!
● రెండు తులాల బంగారం అపహరించిన కేటుగాళ్లు భైంసాటౌన్: పట్టణంలోని బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ దంపతులను అధికారులమని నమ్మించి వారి వద్ద ఉన్న బంగారంతో ఉడాయించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు కుంటాల మండలం అంబకంటికి చెందిన రాజవ్వ, గోవింద్ భైంసాలోని పిప్రికాలనీలో ఉన్న బంధువుల ఇంటికి బస్సులో బయలుదేరారు. పిప్రికాలనీ బస్టాప్ వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వారిని బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు తాము అధికారులమని పరిచయం చేసుకున్నారు. ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయని, ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసి జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. దుండగుల్లో ఒకరు తన ఒంటిపై ఉన్న చైన్, ఉంగరాలు తీసి మిగతా ఇద్దరికి ఇవ్వగా వారు పేపర్ పొట్లం ప్యాక్ చేసి ఇచ్చినట్లు నటించారు. వారిని నమ్మిన రాజవ్వ సైతం తన ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు గొలుసు తీసి సంచిలో పెట్టుకుంటుండగా, వారిలో ఒకడు తాను పేపర్లో పొట్లం కట్టిస్తానని తీసుకున్నాడు. వారిని మాటల్లో పెట్టి వారి వద్ద ఇదివరకే ఉన్న మరో పొట్లం రాజవ్వకు ఇచ్చారు. కొద్దిసేపటికి వారు బైక్పై వెళ్లిపోయారు. కొద్దిదూరం వెళ్లిన తరువాత రాజవ్వ పొట్లం విప్పి చూడగా అందులో మట్టి, చిన్నపాటి కంకర కనిపించడంతో తాము మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గోపినాథ్ తెలిపారు. మహిళను బురిడీ కొట్టించి గొలుసు అపహరణ నిర్మల్టౌన్: మహిళను బురిడీ కొట్టించి రెండు తులాల గొలుసు అపహరించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు శాస్త్రినగర్ కాలనీకి చెందిన లక్ష్మి అదే కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. పోలీసులమని పరిచయం చేసుకున్నారు. చోరీలు అధికంగా జరుగుతున్నాయని, మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి సంచిలో పెట్టుకోవాలని సూచించారు. ఆమె చైన్ తీసిఇవ్వగా పేపర్లో కట్టి ఇస్తామని చెప్పి వారు ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మట్టిపెట్టిన కవర్లు ఆమెకు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన మహిళ పొట్లం తీసి చూడగా చైన్కు బదులు చిన్నచిన్న రాళ్లు కనిపించాయి. వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
అడ్రస్ లేని అత్యవసర సేవలు
● పుణ్యక్షేత్రం, ట్రిపుల్ ఐటీ ఇక్కడే.. ● రైలు, బస్సు మార్గంలో నిత్యం వందల మంది రాకపోకలు ● అయినా ఎమర్జెన్సీ సేవల కల్పనపై నిర్లక్ష్యం ● గోదావరిలో కానరాని రెస్క్యూ టీం ● వైద్యం కోసం 30 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిందే.. ● ఇదీ బాసరలో పరిస్థితి భైంసా: అమ్మ చెంత అత్యవసర సేవలు అందడం లేదు. ఆదివారం జరిగిన సంఘటనలో ఐదుగురు యువకులు గోదావరిలో నీట మునిగి మృత్యువాత పడ్డారు. బాసరలో ఏ సంఘటన జరిగినా అత్యవసర వైద్యసేవలు అందే పరిస్థితి లేదు. పక్క జిల్లా నిజామాబాద్ వెళ్లాలన్నా 31 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. భైంసాకు రావాలన్నా 32 కిలోమీటర్లు ప్రయాణం చేయకతప్పదు. బాసర రెండు జిల్లాలకు సరిహద్దు. తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దు కూడా. సరిహద్దులో ఉన్న బాసరలో అ త్యవసర వైద్యసేవలు అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రసిద్ధిగాంచిన ఆలయం.. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం బాసరలో ఉంది. పిల్లల అక్షరాభ్యాసానికి దేశ నలుమూలల నుంచి అనునిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూనే ఉంటారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. సరస్వతీ అమ్మవారిచెంత తమపిల్లల నామకరణాలు, పుట్టుపంచలు, శుభకార్యాలు జరిపిస్తారు. జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుభకార్యాలు చేయించుకోవడం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనా లు చేసేందుకు ఇక్కడికే వస్తారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గామాతలను కూడా బాసర గోదావరినదిలోనే నిమజ్జనం చేస్తారు. రెస్క్యూటీం లేదు... బాసర ఆలయంలో ఇప్పటికీ రెస్క్యూటీం లేదు. ప్రమాదాలు సంభవిస్తే కాపాడే ఒక్క టీం కూడా అందుబాటులో లేదు. ఆలయానికి వచ్చే భక్తులు, గోదావరి నది నీటిలో చిక్కుకున్న సందర్భంలో ప్రాణాలే పోతున్నాయి. బాసర వచ్చే పర్యాటకులకు భరోసా కల్పించలేకపోతున్నారు. ఆస్పత్రి నిర్మిస్తే... భైంసా పట్టణంలాగే బాసరలోనూ 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని ఎన్నో రోజులుగా ఆ ప్రాంతవాసులు విన్నవిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి ఉంటే ట్రిపుల్ఐటీ విద్యార్థులకు, బాసర మండలవాసులకు, భక్తులకు, రైల్వే యాత్రికులకు నిరంతరం వైద్య సేవలు అందుతాయి. ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు. బాసరను కలుపుతూ ధర్మాబాద్ మీదుగా నాందేడ్ వరకు ఒకహైవే, బిలోలిని కలుపుతు దెగ్లూర్ వరకు మరోహైవే, భైంసా పట్టణం గుండా నిర్మల్–లక్సెట్టిపేట్ కలుపుతూ హైవేలు ఉన్నాయి. బాసర మీదుగా నిజామాబాద్కు ప్రధాన రోడ్డు మార్గం ఉంది. తాజాగా బోధన్ పట్టణం మీదుగా జహీరాబాద్, మెదక్లను కలుపుతూ హైదరాబాద్ వరకు మరోహైవే నిర్మాణంలో ఉంది. ఇన్ని ప్రధాన రహదారులను కలిపే బాసరలో అత్యవసర సేవలపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. ట్రిపుల్ఐటీ, రైలు మార్గం... రైలు మార్గం ద్వారా అనేక మంది యాత్రికులు బాసరకు రాకపోకలు చేస్తారు. 9 వేల మంది విద్యార్థులు ఇక్కడి ట్రిపుల్ఐటీలోనే చదువుతుంటారు. వేలాది మంది రాకపోకలతో నిత్యం జనంతో రద్దీగా ఉండే బాసర మండల కేంద్రంలో అత్యవసర సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా, పాముకాటుకు గురైనా, స్నానఘట్టాలపై భక్తులు నీటిలో జారిపడినా, రైల్వే ప్లాట్ఫాంపై కిందపడ్డా ఇక్కడ వైద్య సేవలు అందవు. బాసరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. ఆలయానికి వయస్సు పైబడినవారు వచ్చి అస్వస్థతకు గురైతే వైద్యసేవలు అందే పరిస్థితిలేదు. నిఘా కరువు.. బాసర రైల్వే స్టేషన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. దొంగలు భక్తుల జేబులు కత్తిరిస్తున్నారు. మెడలో బంగారు ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. రైలుమార్గం ద్వారా మహారాష్ట్ర నుంచి గంజాయి, దేశీదారు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టం చేస్తే ఇలాంటి వాటిని కట్టుదిట్టం చేయవచ్చు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు భరోసా ఇచ్చేలా బాసరలో నిఘా వ్యవస్థ పటిష్టం చేసి, ఆస్పత్రిని నిర్మించి, ఆపద సమయంలో ఆదుకునేలా రెస్క్యూ బృందం అందుబాటులో ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. -
పీఈసెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్: ఫిజికల్ ఎ డ్యుకేషన్ కామన్ ఎంట్ర న్స్ టెస్టు (పీఈ సెట్) ఫలితాల్లో ఉమ్మ డి జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరి చారు. ఆది లాబాద్ జి ల్లా గుడిహత్నూర్ మండలం కొల్హరి గ్రామానికి చెందిన పెందూర్ సక్కు రాష్ట్ర స్థాయిలో 22వ ర్యాంకు, నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బ్ర హ్మగావ్ గ్రామానికి చెందిన దేవుగొండ తరంగిణి 87వ ర్యాంకు, కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ గ్రామానికి చెందిన నూనావత్ రాణి 101 ర్యాంకులతో సత్తా చాటారు. వీరంతా ఆది లాబాద్ జిల్లా కేంద్రంలోని వీజీఎస్ డిఫెన్స్ అ కాడమీలో శిక్షణ పొందారు. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయంఉట్నూర్రూరల్: ఈ నెల 12న పిడుగుపాటుతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గాదిగూడ మండలం పిప్రి గ్రామానికి చెందిన రంభాబాయి, పెందూర్ సంజన, మంగం భీంబాయి, పెందూర్ మాధవ్రావు, బేల మండలంలోని కోవ సునీత, నందిని కుటుంబ సభ్యులకు రూ.25 వేల చొప్పున మంజూరైనట్లు పీవో పేర్కొన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
బాసర: బాసర గోదావరి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి తెలిపారు. ఇటీవల గోదావరి వద్ద ఐదుగురు యువకులు మృతి చెందడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి పుష్కర ఘాట్ నుంచి రెండో పుష్కర ఘాట్ వరకు మెట్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి క్లోరినేషన్ చేయించారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు నది లోపలికి వెళ్లకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులను, నీటిలో ఇరువైపులా జాలీలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఆర్డీవో సమావేశమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో అశోక్ కుమార్, ఎస్సై శ్రీనివాస్, ఆలయ కార్య నిర్వహణ అధికారి సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భూకబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు
● ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డిఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు సృష్టించి భూమి కబ్జాకు పాల్పడిన ఐదుగురు ముఠా సభ్యులపై కేసు నమోదు కాగా ఏడాది నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్ను మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. 1970లో రాష్ట్ర ప్రభుత్వం కై లాస్నగర్లో 20 ఎకరాల స్థలాన్ని నాన్ గెజిటెడ్ అధికారులకు సొసైటీ కోసం కేటాయించగా 1977లో 225 ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించారు. అందులో 8 ప్లాట్లను సొసైటీ సభ్యులు ప్రాంత అభివృద్ధి, పార్కు, ఇతర అవసరాల కోసం వదిలేశారు. అయితే ఇందులోని రెండు ప్లాట్లను కబ్జా చేసేందుకు షేక్ అర్బజ్, షేక్ సమీ, సయ్యద్ ఇమ్రాన్, పర్వీన్ బేగం, షేక్ నూర్జహాన్ నకిలీ పత్రాలు సృష్టించారు. ఇదిలా ఉండగా ప్రధాన నిందితుడు షేక్ అర్బాజ్ను దస్నాపూర్ వద్ద మావల ఎస్సై ముజాహిద్ అరెస్టు చేసినట్లు వివరించారు. షేక్ అర్బాజ్ 2002లో సొసైటీలోని 4, 5 నంబర్లు గల రెండు ప్లాట్లు కబ్జా చేసేందుకు తహసీల్దార్ జారీ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటి ఆధారంగా మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్లు తీసుకుని వాటికి ఓపెన్ ప్లాట్ ట్యాక్స్ చెల్లిస్తున్నాడు. మొదట సయ్యద్ షమీ, పర్వీన్ బేగంలపేరిట రెండు ప్లాట్లకు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించాడు. తన ముఠా సభ్యులైన సయ్యద్ ఇమ్రాన్, షేక్ నూర్జహాన్లపై సేల్డీడ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీనిపై 2024లో సొసైటీ సభ్యుడు లోక ప్రవీణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలిపారు. ఇదివరకే షేక్ అర్బాజ్పై వివిధ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొడ్డల శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను సృష్టించి సర్వే నం.68లో భూ ఆక్రమణలు చేయడంతో సోమవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
భైంసారూరల్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కూనేరు ఈరన్న (35) కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మనస్తాపంతో యువతి..పెంబి: మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘట న మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై అజ య్ తెలిపిన వివరాల మేరకు గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన దాత్తురోళ్ల పోశెట్టి–నర్సవ్వ దంపతుల కుమార్తె గౌరి(22) ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం సాయంత్రం గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి నర్సవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిలక్సెట్టిపేట: ఒంటరితనం భరించలేక ఏప్రిల్ 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెంది నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన వెల్తెపు బుచ్చయ్య (49) భార్య గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు కు ఇటీవల వివాహం చేసి అత్తారింటికి పంపించా డు. ఒంటరితనం భరించలేక ఏప్రిల్ 30న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందించారు. గత నెల 31న ఆరోగ్యం క్షీణించడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కోటపల్లి: మండలంలోని పంగిడి సోమారం అటవీ ప్రాంతంలో ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అద్దరపల్లి అశోక్ (25) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అ దుపుతప్పి కిందపడడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. నెన్నల మండలం ఖర్జీకి చెందిన అశోక్ కోటపల్లి ఆటవీశాఖలో బేస్క్యాంప్లో విధులు నిర్వహిస్తున్నాడు. నగల బ్యాగు అప్పగింతమంచిర్యాలక్రైం: రైల్లో నగలు బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడికి మంచిర్యాల జీఆర్పీ పోలీసులు బ్యాగును అందించి నిజాయతీ చాటుకున్నారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన వంశీకృష్ణ మంగళవారం కుటుంబంతో కలిసి విజయవాడ నుంచి జీటీ ఎక్స్ప్రెస్లో మంచిర్యాలకు వచ్చాడు. స్టేషన్లో దిగి నగల బ్యాగును రైలులో మర్చిపోయాడు. జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదే రైలులో ప్రయాణిస్తున్న జీఆర్పీ పోలీసు శ్రీనుకు సమాచారం అందించారు. అతని ద్వారా బ్యాగును మంచిర్యాల జీఆర్పీ పోలీసులకు అందజేశాడు. అనంతరం నగల బ్యాగును స్థానిక జీఆర్పీ పోలీసులు వంశీకృష్ణకు అందజేశారు. బ్యాగులో 10 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. -
భయంగుప్పిట్లో మనోళ్లు..?
● ఇజ్రాయెల్ దేశంలో ఉమ్మడిజిల్లా వాసుల భయాందోళనలు ● యుద్ధ వాతావరణంతో కుటుంబ సభ్యుల్లో అలజడి ● బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడి.. నిర్మల్ఖిల్లా: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొ న్నిరోజులుగా దాడులు, ప్రతిదాడులతో భయానక యుద్ధ వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ ప్రాంతంవారు అధిక సంఖ్యలో ఉన్న టెల్అవీవ్ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లినవారు ఎలా ఉన్నారోనని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకెట్లు, లాంచర్ల దాడిలో వందలాది మంది మృతి చెందుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో సమాచారం వెలువడుతున్న దృష్ట్యా ఇక్కడి ప్రవాస భారతీయ కుటుంబ సభ్యుల్లో అలజడి చెలరేగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్, మంచిర్యాల, తదితర ప్రాంతాల నుంచి ఆయా దేశాలకు వెళ్లిన 500 మందికి పైగా పారిశ్రామిక, నిర్మాణ తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. వారంతా దాడులు జరుగుతున్న ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో పనులు నిర్వర్తిస్తున్నారు. బాంబుదాడులతో భయాందోళన ఉపాధి నిమిత్తం వెళ్లిన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కంకెట గ్రామానికి చెందిన పుస్పుర్ సారంగధర్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆకస్మిక దాడులతో ఇజ్రాయెల్ దేశంలోని మన పౌరులు ఉలిక్కిపాటుకు గురవుతున్న మాట వాస్తవమేనన్నారు. మూడు, నాలుగు రోజులుగా బాంబుదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తమ బృందం బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వివరించారు. యుద్ధ సైరన్ మోగగానే కార్మికుల బృందం బంకర్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఏదైనా యుద్ధ రాకెట్, మిస్సైల్ వంటివి దూసుకొస్తున్న కొద్ది నిమిషాల ముందు సైరన్ మోగుతుందని, వెంటనే అక్కడి సమీప ప్రాంతవాసులంతా అప్రమత్తం కావాల్సి ఉంటుందన్నారు. తాము నివసించే ప్రతీ అపార్ట్మెంట్నందు యుద్ధ సమయంలో సురక్షితంగా తలదాచుకునేందుకు బంకర్ సదుపాయం ఉంటుందని, ప్రస్తుతం వాటిని వినియోగించుకుంటూ క్షేమంగాానే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ బంకర్ల సదుపాయం అన్నిచోట్ల లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లోని వారికి ప్రమాదం పొంచిఉండే అవకాశం ఉంటుందన్నారు. కార్మికులు పని చేసే సగటు రోజుల సంఖ్య ఏడు నుంచి నాలుగుకు తగ్గింది. కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30వరకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినట్లు తెలిపారు. విమానాశ్రయాలు సైతం మూతపడటంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. -
చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
బెల్లంపల్లి: చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్లైన్ సెంటర్లో ఈసెట్–25 కౌన్సెలింగ్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు స్వయం క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ విస్తరణ, ఆడిటోరియం నిర్మాణం వంటి అభివృద్ధి పనులు సత్వరంగా పూర్తి చేయిస్తానని తెలిపారు. అనంతరం ఈసెట్–25లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన 20 మంది విద్యార్థులు, వివిధ సెమిస్టర్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణం పరిశీలించారు. ఎమ్మెల్యేను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ మారం దేవేందర్, అధ్యాపకులు శాలువాతో సత్కరించారు. ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే వినోద్ అందజేశారు. ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా అధికారులు చేపట్టారని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన బెల్లంపల్లిలో రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే వినోద్ శంకుస్థాపన చేశారు. రూ.2కోట్లతో గాంధీ విగ్రహం నుంచి పోశమ్మ చౌరస్తా వరకు బీటీ రోడ్డు, కన్నాల బస్తీలో రూ.కోటి అంచనాతో సిమెంట్ రోడ్ పనులు, మున్సిపల్ కార్యాలయం నుంచి ఏఎంసీ చౌర స్తా వరకు రూ.2 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించారు. బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ -
మంచిర్యాలలో ప్రైవేట్ కాలేజీ మూత..!
● విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం ● సర్టిఫికేట్ల కోసం కళాశాల చుట్టూ ప్రదక్షిణ ● నోటీసులు జారీ చేసిన డీఐఈవో మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలకు తాళం పడింది. 2025–26విద్యాసంవత్సరం ప్రారంభమైనా తెరవకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు సెకండియర్ చదు వు కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక.. సెకండియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం కళాశాల చుట్టూ తిరుగుతున్నారు. నిర్వాహకులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. సర్టిఫికేట్లు ఇప్పించాలని వి ద్యార్థులు డీఐఈవోకు మొరపెట్టుకోగా.. యాజమాన్యంపై చర్యల్లో భాగంగా మంగళవారం కళాశాల ఎదుట గోడకు డీఐఈవో అంజయ్య నోటీసులు అతికించారు. సెకండియర్ విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ ఉన్నత చదువులకు వెళ్లాలంటే టీసీ, మెమో తప్పనిసరి. కౌన్సెలింగ్కు వెళ్లడానికి సర్టిఫికేట్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నా రు. కళాశాల మూసివేస్తే నిర్వాహకులు డీఐఈవోకు సమాచారం ఇవ్వడంతోపాటు విద్యార్థుల టీసీలు, మెమోలు, ఇతర సర్టిఫికేట్లు అందించాల్సి ఉంటుంది. కళాశాల తెరవకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల మూసి వేయలేదని, సర్టిఫికేట్లు, ఇతరత్రా పుస్తకాలు తమ పరిధిలోనే ఉ న్నాయంటూ నిర్వాహకులు ఇంటర్మీడియెట్ అధికా రులకు చెప్పినట్లు తెలుస్తోంది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నా రు. ఈ విషయమై డీఐఈవో అంజయ్య స్పంది స్తూ.. ప్రతిభా జూనియర్ కాలేజీ తెరవడం లేదని త మ దృష్టికి వచ్చిందని, మొబైల్ఫోన్లోనూ అందుబాటులో లేరని తెలిపారు. సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు తమ కార్యాలయాన్ని సంప్రదించగా.. మూ డు రోజుల పనిదినాల్లో కళాశాల తెరిచి విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వాలని కళాశాల గోడకు నోటీసులు అతికించినట్లు తెలిపారు. -
మండల కార్యాలయానికి ఎన్నికల సామగ్రి
భీమారం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి చేరింది. మండలంలో 11గ్రామ పంచాయతీలు, 94వార్డులు, 5ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్స్తోపాటు నామినేషన్ పత్రాలు, కవర్లను ఎన్నికల సంఘం తరలించింది. మండల పరిషత్ కార్యాలయంలోని వివిధ గదుల్లో భద్రపర్చారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉన్నామని ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. -
‘పరిషత్’ల్లో ముఖ గుర్తింపు హాజరు
● కార్యాలయాలకు చేరిన పరికరాలు ● రెండ్రోజుల్లో ప్రారంభించే అవకాశాలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఫేసియల్ రికగ్నిషన్ హాజరుకు కసరత్తు జరుగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో 26మంది, జిల్లాలోని 16 ఎంపీడీవో కార్యాలయాల్లో 170మంది వరకు అధికారులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమయ పాలన, విధుల్లో పారదర్శకతకు ఫేసియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు సృజన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచే అమలు చేయాల్సి ఉండగా.. ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ పరికరాల కొనుగోలు, బిగింపులో జాప్యం జరుగుతోంది. జిల్లా పరిషత్ కార్యాలయానికి మంగళవారం పరికరాలు చేరుకోగా.. ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పరికరాలు ఏర్పాటు, ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేసి రెండ్రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి. బయోమెట్రిక్ స్థానంలో..కార్యాలయాల్లో గతంలో బయోమెట్రిక్(వేలిము ద్ర) హాజరు విధానం అమలులో ఉంది. బయోమెట్రిక్ సక్రమంగా పని చేయకపోవడం, కొన్ని ప్రాంతాల్లో అడ్డదారిలో హాజరు నమోదుకు తప్పటడుగులు వేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఆ పరికరాలు ఉపయోగంలో లేకపోవడంతో మూలనపడ్డా యి. ప్రస్తుతం ఆఫ్లైన్ విధానంలోనే హాజరు కొనసాగుతుండగా.. విధుల్లో నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం, విధుల్లో లేకున్నా సంతకాలు చేయడం వంటివి వెలుగుచూశాయి. ఈ క్రమంలోనే ఫేసియల్ రికగ్నిషన్ హాజరు విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల కొరతజిల్లా, మండల పరిషత్ కార్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 5శాతం జిల్లా పరిషత్కు, 10శాతం మండల పరిషత్కు, 85శాతం గ్రామ పంచాయతీల కు కేటాయిస్తారు. ఇందులో నుంచే 6శాతం నిధులు విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచి చెల్లింపులన్నీ ఆగిపోయాయి. మండల పరిషత్లకు సంబంధించి గత రెండేళ్లుగా ఎంపీడీవోల వాహనాల అద్దె చెల్లింపులు, ఇంటర్నెట్, కరెంటు బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిధులు లేక నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సమయపాలన.. పారదర్శకత జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో పారదర్శకత ఉండేలా ఈ ఫేసియల్ రికగ్నిషన్ హాజరు అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల వివరాల సేకరణ పూర్తయ్యింది. విధులకు హాజరు, ఇంటికి వెళ్లే సమయాల్లో ఉద్యోగులు, సిబ్బంది అంతా హాజరు వేయాల్సి ఉంటుంది. జీపీఎస్కు అనుసంధానం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో అవకాశాలు ఉన్నాయి. సేవలు పారదర్శకంగా లభిస్తాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఫేసియల్ రికగ్నిషన్ హాజరు పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ గణపతి తెలిపారు. -
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
● డ్రెయినేజీల్లో పూడిక తీయని వైనం ● రోడ్లపై పారుతున్న మురికి నీరు ● వంద రోజుల ప్రణాళికపై పట్టింపేది..? మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు కురిసేలోపే డ్రెయినేజీల్లో పూడిక తీయడం, వర్షపు నీరు వెళ్లేలా చెత్తాచెదారం తొలగించడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ పనులు చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది. పలు వార్డుల్లో రోజువారీగా సేకరిస్తున్న చెత్తను కుప్పలుగా పోసి కాలుస్తుండడంతో సమీప ప్రాంత ప్రజలు దుర్వాసన, పొగ పీల్చి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 2నుంచి సెప్టెంబర్ 10వరకు వంద రోజులపాటు సమస్యలు లేని పట్టణాలుగా మార్చడంతోపాటు వార్డుల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. డ్రెయినేజీలు, కాలువల్లో పూడికతీత పనులు ఈ నెల 8వరకు పూర్తయ్యేలా కార్యాచరణలో పేర్కొన్నారు. కానీ నగరంలో వంద రోజుల కార్యాచరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా కనిపించడం లేదు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం కల్పించాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండగా, వ్యాధులకు కారణం అవుతున్న మురుగునీరు, చెత్తపై నగరపాలక సంస్థ దృష్టి సారించడం లేదు. ఆండాళమ్మ కాలనీ డంపింగ్యార్డులో చెత్త పేరుకుపోయి, చెత్త వేసేందుకు స్థలం లేకుండా పోయింది. పలు కాలనీల్లో చెత్తను సమీపంలోని ఇళ్ల మధ్యనే ఉంచి ఎక్కువైన తర్వాత కాల్చి వేస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వెనుక ఉన్న సీసీ రోడ్డు వినియోగంలో లేకపోవడంతో ఆసుపత్రి చెత్తతోపాటు స్థానికంగా సేకరించిన చెత్తను అక్కడే వేసి మూడు నాలుగు రోజుల అనంతరం కాలుస్తున్నారు. దీంతో సమీపంలో నివాసం ఉండే ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సేకరిస్తున్న చెత్తలో బయోవేస్టేజ్ను కూడా కలిపి ఇస్తుండగా, అలా సేకరించిన చెత్తను కాలేజీరోడ్డులోని ఖాళీ ప్రదేశాల్లో పడేసిన కొద్దిరోజులకు కాలుస్తున్నారు. వంద రోజుల కార్యాచరణలోనైనా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పేలా లేవు. -
పీఎఫ్ గోల్మాల్!
● సింగరేణిలో ఓబీ కాంట్రాక్టర్ల అవకతవకలు ● కార్మికులకు ‘సీఎంపీఎఫ్’ బదులు ‘ఈపీఎఫ్’ ● తమ వాటా చెల్లింపుల్లో భారీగా అక్రమాలు ● శ్రీరాంపూర్లో రూ.6కోట్లుపైనే ఎగ్గొట్టిన ఓ సంస్థసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి కంపెనీలో ఓబీ కాంట్రాక్టర్ల తీరుతో కార్మికులు నష్టపోతున్నారు. ఓసీపీల్లో వర్క్ ఆర్డర్ పొందుతున్న ఆయా సంస్థల్లో తాత్కాలికంగా వందలాది మంది పని చేస్తున్నారు. అధికారికంగా తక్కువ లెక్కలు చూపిస్తూ పీఎఫ్తో సహా అనేక సౌకర్యాలు పొందకుండా చేస్తూ సొమ్ము మిగుల్చుకుంటున్నారు. నిబంధనల ప్రకారం బొగ్గు ఆధారిత పనుల్లో ప్రైవేటు, రెగ్యులర్తో సంబంధం లేకుండా సీఎంపీఎఫ్(కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) చెల్లించాలి. కానీ అవుట్ సోర్సింగ్ తరహాలోనే ఈపీఎఫ్(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) చెల్లిస్తున్నారు. అందులోనూ పారదర్శకత పాటించడం లేదు. సీఎంపీఎఫ్ కట్టని సంస్థలుబొగ్గు పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగుల్లో ప్రైవేటు, రె గ్యులర్ తేడా లేకుండా వేతనంలో 19శాతం సీఎంపీఎఫ్ చెల్లించాలి. పీఎఫ్, పింఛన్ల్లో ప్రైవేటు కార్మికులకు లాభదాయకంగా ఉంటుంది. కానీ ఇతర ఉ ద్యోగుల మాదిరిగానే పీఎఫ్ కడుతున్నారు. ఈపీఎఫ్ కార్మిక, ఉద్యోగులకు వేతనం నుంచి భవిష్య నిధి ఉద్యోగి, సంస్థ సమపాళ్లలో కట్టేది. నెల వేతనంలో 12శాతం చొప్పున చెల్లిస్తే కంపెనీలు 12శాతం కలిపి జమ చేయాలి. ఇందులో 8.33శాతం పింఛన్కు వెళ్తే.. మరో 3.67శాతం భవిష్య నిధికి వెళ్తుంది. కంపెనీలు ప్రతినెలా ఈ మొత్తాన్ని తగ్గించుకునేందుకు తప్పుడు లెక్కలు చూపుతున్నాయి. పట్టించుకోని యాజమాన్యంసంస్థలో పని చేస్తున్న ప్రైవేటు కార్మికులపై యాజమాన్యం పట్టింపు కరువైంది. ప్రైవేటు సంస్థలు కావడంతో ఎవరూ ప్రశ్నించడం లేదు. కంపెనీ నుంచి తొలగిస్తారనే భయంతో మిన్నకుండిపోతున్నారు. ఆయా సంస్థలను నిత్యం పర్యవేక్షిస్తూ, వెల్ఫేర్, పీవో, ఫైన్సాన్ అండ్ అకౌంట్స్, ఆడిట్ శాఖల అధికారులు సదరు సంస్థ పరిధిలో ఇవన్నీ చూడకుండానే ఎలా బిల్లులు చెల్లిస్తున్నారనేది ప్రశ్నగా మారింది. మరోవైపు ఈపీఎఫ్పైనా కట్టడంపై పలు ఫిర్యాదులు వెళ్లి, సీఎంపీఎఫ్ అధికారులు నోటీసులు ఇస్తున్నా కాంట్రాక్టు సంస్థల నుంచి స్పందన ఉండడం లేదు. రూ.6కోట్లు తప్పించుకుని..శ్రీరాంపూర్ ఓసీపీలో 2016లో మట్టి తవ్వకాల పనులు దక్కించుకున్న ఓ సంస్థ ఆరేళ్లు వర్క్ ఆర్డర్ పొందింది. తర్వాత మరో ఆరు నెలలు పొడగించగా.. 78నెలలు పని చేసింది. ఈ సమయంలో తమ పరిధిలో ఉన్న సిబ్బంది కంటే తక్కువగా చూపిస్తూ పీఎఫ్ కట్టకుండా ఎగవేసింది. ఆ సంస్థ డీజీఎంఎస్కు పంపిన నివేదికకు, వాస్తవ సిబ్బందికి వ్యత్యాసం కనిపించింది. మొత్తం వెయ్యి మంది వరకు పని చేస్తూ 715మంది(ఆయా నెలల్లో వేర్వేరుగా ఉంది) వరకే పని చేస్తున్నట్లు లెక్కల్లో చూపింది. అందులోనూ 283మంది వరకే పీఎఫ్ చెల్లించింది. మిగతా 432మందికి పీఎఫ్ డబ్బులు కట్టలేదు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1800 కట్టాలి. అలా నెలకు లెక్కిస్తే రూ.7.77లక్షల చొప్పున మొత్తం 78నెలలపాటు చెల్లించకుండా ఎగ్గొట్టింది. దీంతో రూ.6.06కోట్లు కార్మికులకు పీఎఫ్ కట్టలేదు. కార్మికులు సైతం తమవంతు పీఎఫ్ కూడా చెల్లించకపోవడంతో ఈ మొత్తాన్ని నష్టపోయారు. ప్రస్తుతం కొత్తగూడెంలో ఈ సంస్థ పని చేస్తోంది. మరోవైపు శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ పనులు చేస్తున్న మరో కంపెనీ సైతం తమ వద్ద పని చేసే సిబ్బంది వేతనం తక్కువగా చూపిస్తూ పీఎఫ్ తక్కువగా కట్టేలా చేసింది. వేతనాలు నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఉన్నా అంతకంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నట్లుగా చూపించి జమ చేసే పీఎఫ్ తగ్గించుకుని సొమ్ము మిగుల్చుకుంది. గత ఆగస్టు వరకు ఇదే తీరుగా చూపిస్తూ రూ.8లక్షలు పొదుపు చేసుకుంది. -
క్షయవ్యాధి సత్వర నిర్ధారణ.. నివారణకు మార్గం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): క్షయ వ్యాధి త్వరగా నిర్ధారణ జరిగితే నివారణకు మార్గం లభిస్తుందని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. రోగులు, స్థానికులతో మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయవ్యాధిగా అనుమానించాలని అన్నారు. జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ, తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, హైపటైటిస్ బీ, సీ, టీబీ పరీక్షలు నిర్వహించారు. వైద్యులు లహరి, సాయిప్రసన్న, సౌమ్య, రజిత, రాము, హెచ్ఈఓలు నాందేవ్, రఘుపతి, ఆరోగ్య పర్యవేక్షకురాలు పద్మ, సీహెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సురేందర్, ఐసీటీసీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే కోటేజీ కృష్ణార్జునరావు, ప్రవీణ దంపతుల చిన్న కూతురు అక్షయ సెకండియర్ గణితం ఫెయిల్ కాగా సప్లిమెంటరీ పరీక్ష రాసింది. సోమవారం వెలువడిన ఫలితాల్లోనూ పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ ఫ్యాన్కు ఉరేసుకుంది. తండ్రి గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్తండా గ్రామానికి చెందిన గుగులోతు కవిత–సూర్యనాయక్ దంపతుల రెండవ కుమార్తె హారిక (17) హనుమకొండ జిల్లా వంగర గురుకులంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాటనీ సబ్జెక్ట్లో ఫెయిలైంది. తిరిగి సప్లిమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రాయికోడ్ మండలం మహబత్పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ కుమారుడు వెంకటరమణ(18)ఆర్ఎల్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లోనూ ఒక సబెక్టులో ఫెయిల్ కావడంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతులకు చేరువలో ప్రభుత్వం
● ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిమంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతునేస్తం ద్వారా ప్రభుత్వం రైతులకు మరింత చేరువ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వర్చువల్ విధా నం ద్వారా రైతువేదికల్లో రైతునేస్తం–రైతుభరోసా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. హాజీపూర్ మండలం ముల్కల్ల రైతువేదికలో కలెక్టర్ కుమార్దీపక్ అధికారులు, రైతులు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ ప్రతీ మంగళవారం రైతువేదికల ద్వా రా రైతుల సమస్యలు తెలుసుకుంటూ సాగుపై సూ చనలు చేసేలా కార్యక్రమాలు ఉంటాయని తెలి పారు. మరో తొమ్మిది రోజుల్లో రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, రేషన్ కార్డుల జారీ, సన్నరకం బియ్యానికి బోనస్ అమలు జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కుమార్దీపక్ మాట్లాడుతూ సాగులో మెళకువలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సూచనలు అందేలా చూస్తామని తెలిపారు. డీఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, ఏఓ కృష్ణ, ఏఈఓ మౌనిక, ఆత్మ చైర్మన్ మురళి పాల్గొన్నారు. కిష్టంపేటలో.. తాండూర్: మండలంలోని కిష్టంపేట రైతువేదికలో సోమవారం రైతునేస్తం సీఎం వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా వ్యవసాయ అధికారి కల్పన హాజరయ్యారు. ఏవో సుష్మ, డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వా జి మహేందర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
‘మోదీ పాలనలో దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: దేశ ప్రధానిగా 11 ఏళ్ల సుపరిపాలనతో దేశం ఎంతో అభివృద్ధి చెందింద ని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిని పైకి తీ సుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అ న్నారు. సోమవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో నరేంద్రమోదీ విజయాలు, అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రా రంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ దేశప్రజల రక్షణతోపాటు అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా పాలన ఉందని కొని యాడారు. మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, ఆకుల అశోక్వర్ధన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
● రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మనుమడు దుర్మరణం ● ఉట్నూర్లోని బీర్సాయిపేట వద్ద చెట్టును ఢీకొట్టిన కారు ● మరో చిన్నారి పరిస్థితి విషమం
దైవ దర్శనానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్న ఆ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరికాసేపట్లో ఇంటికి చేరుకునే క్రమంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొంది. అప్పటివరకు సంతోషంగా గడిపిన వారంతా చెల్లాచెదురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు తనువు చాలించారు. ఈ ఘటనలో అమ్మమ్మ, మనుమడు మృతి చెందగా మనవరాలి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్టౌన్/ఉట్నూర్రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఈర్ల రాజు డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో అతని భార్య సృజనిత, కుమారుడు సాహర్శ్(15), కుమార్తె ఆద్యశ్రీతో పాటు సృజనిత తల్లి గంట విజయ(55)తో కలిసి దైవదర్శనం చేసుకునేందుకు శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి కారులో బయల్దేరి వెళ్లారు. కాళేశ్వరం, ధర్మపురి, ఇతర దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం బెల్లంపల్లిలో నివాసం ఉంటున్న సృజనిత అక్క ఇంటికి వెళ్లారు. ఆదివారం అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. మార్గమధ్యలో ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట్ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సాహర్శ్, విజయ సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఆద్యశ్రీ తలకు తీవ్రగాయాలయ్యా యి. ముందుగా రిమ్స్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు పేర్కొన్నా రు. రాజు, సృజనిత గాయాలతో బయటపడ్డారు. కారు డ్రైవర్ రాజుకు కునుకు రావడంతోనే ఈ ప్రమా దం జరిగి ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఉట్నూర్ ఎస్సై మనోహర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మిన్నంటిన రోదనలు.. రోడ్డు ప్రమాదం విషయం తెలియడంతో బాధిత కుటుంబీకులు, బంధువులతో పాటు కాలనీవాసులు అధికసంఖ్యలో రిమ్స్ ఆస్పత్రితో పాటు వారి ని వాసానికి చేరుకుని చేసిన రోదనలు మిన్నంటాయి. ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. బడులు ప్రారంభం కావడంతో పిల్లలు తరగతులు నష్టపోతారని హడావుడిగా తీసుకువస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాహర్శ్ జిల్లా కేంద్రంలోని రిజోనెన్స్ పాఠశాలలో పదో తరగతి, ఆద్యశ్రీ అదే పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం, తోటి స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. పలువురి పరామర్శ.. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కిసాన్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సంఘటన స్థలంలో కూతురితో సృజనిత -
సైబర్ బాధితులకు నగదు అందజేత
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఈ నెలలో పది కేసుల్లో సైబర్క్రైమ్ బాధితులకు తిరిగి డబ్బులు అందించామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఐదుగురు బాధితులు ఎస్పీని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యాపల్గూడకు చెందిన నర్సింగ్ గతేడాది రూ.16,901 కేవైసీ అప్డేట్ లింక్ ఓపెన్ చేయడంతో పోగొట్టుకున్నారని, జైనథ్ మండలానికి చెందిన లింగారెడ్డి గూగుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ సర్వీస్ ఫేక్ నంబర్ ఓపెన్ చేసి రూ.2లక్షల 15వేలు పోగొట్టుకోవడంతో రూ.లక్షా 30వేలు తిరిగి అకౌంట్లో వేయించామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన జి.రమేశ్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్లో సైబర్ నేరగాళ్లు రూ.లక్షా 59వేలు కాజేయగా రూ.60వేలు ఇప్పించామన్నారు. మావలకు చెందిన మితిలి అనే మహిళ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ద్వారా స్నేహితుడిగా సహాయం కోరిన వెంటనే రూ.25వేలు పంపించడంతో తిరిగి వాటిని సైతం ఇప్పించినట్లు తెలిపారు. ఉట్నూర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.3లక్షలు పోగొట్టుకోగా రూ.50 వేలు కోర్టు ద్వారా అందించినట్లు వివరించారు. సైబర్ క్రైమ్కు గురైన బాధితులు వెంటనే 1930, పోలీస్స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
భక్తుల భద్రత గోదావరిలో దీపమే!
● ప్రాణాలు పోతున్నా పట్టింపేది? ● కానరాని కనీస రక్షణ చర్యలు ● ఇప్పటికీ ఏర్పాటు చేయని ఇనుప కంచె ● హామీలు నీటి రాతలే! భైంసా: బాసర వద్ద గోదావరిలో నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరింది. దీంతో కొన్నిరోజులుగా భక్తులు స్నానఘట్టాల వద్ద కాకుండా నది పొడవున స్నానాలు చేస్తున్నారు. నదిలో అక్కడక్కడ లోతైన ప్రాంతాలు ఉన్నాయని తెలియక స్నానం చేసేందుకు అందులోకి దిగి మృత్యువాత పడుతున్నారు. బాసర వద్ద గోదావరి నదిలో లోతు తెలిపే హెచ్చరిక బోర్డులు లేవు. భక్తులను అప్రమత్తం చేసే సిబ్బంది కూడా ఉండరు. దీంతో భక్తులు గోదావరినదిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలు పదేళ్ల కాలంలో 127కు పైగా భక్తులు బాసర వద్ద గోదావరిలో నీటమునిగి మృతి చెందారు. 2021లో 10, 2022లో 12, 2023లో 11, 2024లో 10, 2025లో 8 మంది నీట మునిగి మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ అధికారులు తేరుకోవడంలేదు. నదిలో నీటి ప్రవాహం తగ్గిన సమయాల్లోనూ మృత్యువాత పడడం కలచివేస్తుంది. భారీ వర్షాలతో నీటి ప్రవాహం పెరిగిన సమయాల్లో నదిలోకి వెళ్లేందుకు ఎవరైనా జంకుతారు. నీటి సామర్థ్యం తగ్గినప్పుడు స్నానాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈనెల 15న ఆదివారం ఆరుగురు యువకులు ఇసుక తెన్నెల నుంచి లోపలికి వెళ్లి స్నానాలు చేశారు. అందులో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడగా రాకేశ్, భరత్, మదన్, వినోద్, రితిక్ అనే యువకులు మృతి చెందారు. ఆరు నెలలైనా... గోదావరి నదిలో జరుగుతున్న ప్రమాదాలపై జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అప్పట్లో స్పందించారు. గతేడాది డిసెంబర్ 18న భైంసా ఏఎస్పీ అవినాశ్తో కలిసి బాసర వంతెన, నది పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. వంతెనలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు పర్యవేక్షించేలా సిబ్బందిని నియమిస్తామన్నారు. రెండు జిల్లాల పోలీసుల సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, బ్లూ కోర్టు సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఆరునెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ వంతెనపై ఇనుప కంచె ఏర్పాటు చేయలేదు. స్థానిక యువకులు విన్నవించినా... దక్షణ భారతావనిలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర. అందుకే ఇక్కడికి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించాలని 2022లోనే మిషన్ బాసర యువకులు, మేధావులు, యువజన సంఘాలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి అప్పటి ప్రభుత్వానికి, బాసర ఆలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ గోదావరి నదిలో ఏర్పాట్లను ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. ఈ ఏర్పాట్లపై దృష్టి సారించాలి ● నదిలోతును తెలిపే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ● ప్రమాదాలు జరిగితే అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్సు, వైద్యులు అందుబాటులో ఉండాలి. ● నది నీటిలో నీళ్లు మింగి ఊపిరాడని పరిస్థితిలో ఉన్న వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాలతో బయట పడొచ్చు అనే విషయాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. ● గోదావరి నదిలో అన్ని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించవద్దు. ● నది నీటిలోతు తెలుసుకుని ఇనుప కంచెలు ఏర్పాటు చేయాలి. ● బాసర ఆలయంతో పాటు ఆలయ అధికారులు గోదావరి నది సమీపంలో వచ్చే భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించాలి. ● ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించాలి. ● బాసర నదికి వెళ్లే మార్గంలో, ఘాట్లకు వెళ్లే ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశాల్లో, రాత్రి సమయాల్లోనూ కనిపించేలా వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. భక్తులంతా నదివద్దే... బాసరకు వచ్చే భక్తులంతా ఎక్కువ సమయం గోదావరి నది వద్దే గడుపుతారు. నదిలో స్నా నాలు ఆచరించడం, గంగమ్మ తల్లికి పూజలు చేయడంతో పాటు రెండు వంతెనల పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకే ఇష్టపడుతారు. వచ్చిన వారంతా నదిలో కాసేపు విహరించాలని అనుకుంటారు. నదులు ఉన్న పుణ్యక్షేత్రాల్లో వచ్చే భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లు ఉంటే బాసరలో పరీవాహక ప్రాంతాల్లో శుభ్రత పనులు కూడా కనిపించవు. వసంత పంచమి ఏర్పాట్లలో ఘాట్లు, గోదావరి నదీ తీరం అపరిశుభ్రంగా ఉండడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యకర్తలతో వెళ్లి శుభ్రత పనులు చేపట్టారు. ఇక భక్తులకు కావాల్సిన కనీస వసతులు దేవుడెరుగు. ఆహ్లాదం పంచే గోదావరి నదిలో ఆదివారం వరకు బోట్లు తిప్పారు. లైఫ్ జాకెట్లు లేకుండా భద్రత విషయాలు పరిగణలోకి తీసుకోకుండా బోట్లను నదిలోకి పంపారు. ఈ బోట్లలోనే ఆరుగురు యువకులు నీటిలో నుంచి ఇసుక తెన్నెలకు వెళ్లి ప్రమాదాల భారిన పడ్డారు. ఒకే రోజు ఐదుగురు యువకులు గోదావరి నదిలో మృతి చెందడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆదేశాలతో భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నుంచి బోటింగ్ను నిలిపివేశారు. బాసర గోదావరిని పరిశీలించిన ఎస్పీబాసర: బాసర గోదావరినదిని ఎస్పీ జానకీ షర్మిల సోమవారం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్నానఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. పుష్కర ఘాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సిర్పూర్(యూ) మండలం పాములవాడకు చెందిన పెందూర్శంకర్ తమ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయాలని, రెబ్బెన మండలం గోలేటికి చెందిన లక్ష్మి తనకు పట్టా ఇప్పించాలని, ఆసిఫాబాద్ మండలం కమ్మర్గావ్కు చెందిన పృథ్విరాజ్ తనకు గురుకులంలో అడ్మిషన్ ఇప్పించాలని కోరారు. ఇంకా వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, డీడీ అంబాజీరావు, పీహెచ్వో సందీప్, ఏడీఎంఅండ్హెచ్వో మనోహర్, ఏవో దామోదర స్వామి, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో స్టాండ్ స్థలం కోసం ధర్నా
బెల్లంపల్లిలోని ఆటో యూనియన్ స్థలాన్ని ఇతరులకు కేటాయించొద్దని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ ఆదీనంలోని జీఎం కార్యాలయం పక్కన, మార్కెట్ ఏరియా స్థలంలో 25ఏళ్లుగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థకు కేటాయిస్తూ బెల్లంపల్లి ఆర్డీవో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆటోలు నిలిపేందుకు స్థలం ఇప్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ, వివిధ గ్రామాల ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. -
15 వేలకు చేరిన దరఖాస్తులు
భైంసా: ఆర్జీయూకేటీలో ప్రవేశానికి గత నెల 31 నుంచి టీఎస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 15,015 దరఖాస్తులు వచ్చినట్లు వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1500 సీట్లను కేటాయించింది. జూన్ 21 వరకు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింతఆదిలాబాద్టౌన్: బోథ్ మండల కేంద్రానికి చెందిన అంకుష్ గౌరు (90) వృద్ధాప్యంతో ఆదివారం మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు నారాయణ వృత్తిరీత్యా కండక్టర్ కాగా నిర్మల్లో నివాసం ఉంటున్నాడు. తల్లి నిర్మల్లో మృతి చెందడంతో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారం నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం మృతదేహాన్ని అప్పగించారు. అవయవదానం, శరీర దానం చేస్తే మెడికోలకు ప్రాక్టీస్తో పాటు పేద ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘పరిషత్’ ఎన్నికల సందడి
● మంత్రి ‘పొంగులేటి’ ప్రకటనతో జోష్ ● జిల్లాలో 129 ఎంపీటీసీ, 16 జెడ్పీటీసీ స్థానాలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటన ఇటు అధికార పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీల్లో జోష్ నింపింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో పోటీకి ఎదురుచూస్తున్న ఆశావహులు పావులు కదుపుతున్నారు. పూర్తయిన ఏర్పాట్లు ఇప్పటికే పరిషత్ ఎన్నికల సామగ్రి జిల్లాకు చేరగా.. మండలాల వారీగా సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. పార్టీ గుర్తుపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. గత ఏడాది జూలై 2తో ఎంపీటీసీలు, 3వ తేదీతో జెడ్పీటీసీల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇక పంచాయతీల్లోనూ ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. 129 ఎంపీటీసీ.. 16 జెడ్పీటీసీ.. ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలనే నిబంధనతో పునర్విభజన చేపట్టగా.. జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గణాంకాల ప్రకారం రెండు స్థానాలు పెరిగిన మంచిర్యాల మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణతో హాజీపూర్ మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలు విలీనం అయ్యాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన గ్రామ పంచాయతీ ఓటరు జాబితా ప్రకారం పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా.. 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 745 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గడం, 700 మంది ఓటర్లకు ఒక కేంద్రం ఏర్పాటుతో పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 3,777 బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో ఆశావహులు ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
నిర్మల్ రూరల్: నిర్మల్ మండలం చిట్యాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం....భైంసా పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన దివిటికర్ గంగుబాయి ఆమె భర్త బాబు, పింగువ అశోక్, సాయిపుత్ర ప్రజావాణిలో అర్జీలు అందజేసేందుకు ఆటోలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు బయలుదేరారు. చిట్యాల బ్రిడ్జి వద్దకు రాగానే నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టి పంట పొలాల్లో పడిపోయింది. ఆటోలో ఉన్న గంగుబాయి, అశోక్, బాబు, డ్రైవర్ సాయిపుత్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. ఎస్సై లింబాద్రి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ డ్రైవర్ చేతన్ ప్రకాష్ మీనన్ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఊరిలోనే విత్తనోత్పత్తి
● నకిలీ విత్తనాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు ● గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి శ్రీకారంచెన్నూర్రూరల్: ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో కల్తీ విత్తనాల సమస్య రైతులకు పెను సవాల్గా మారింది. కల్తీ విత్తనాలతో పంట దిగుబడి గణనీయంగా తగ్గడమే కాకుండా, రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా ‘గ్రామీణ విత్తనోత్పత్తి పథకం’ను అమలు చేస్తూ రైతులను స్వయం విత్తనోత్పత్తిలో ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను తయారు చేసుకోవడమే కాకుండా, వాటిని ఇతర రైతులకు అందజేస్తూ కల్తీ సమస్యను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పథకం లక్ష్యాలు ఈ పథకం ప్రధాన ఉద్దేశం నూతన వంగడాల(రకాల) విత్తనాలను త్వరితగతిన ఉత్పత్తి చేయడం, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం. పంటల సరళిని అనుసరించి విడుదలైన నూతన రకాలను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. రైతులు స్వయంగా విత్తనాలను ఉత్పత్తి చేయడంతో కల్తీ విత్తనాల మోసాల నుంచి రక్షణ పొందడమే కాకుండా, నాణ్యత హామీతో పంట సాగు చేయవచ్చు. అమలు ఇలా.. వ్యవసాయ శాఖ కేవీకే సహకారంతో ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద రైతులకు వరి, పెసర పంటలకు సంబంధించిన విత్తనాలను 100 శాతం సబ్సిడీపై అందజేశారు. జిల్లాలో 650 బస్తాల 10 కిలోల వరి విత్తనాలు, 350 బస్తాల 3 కిలోల పెసర విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. వీటిని అందించేందుకు జిల్లాలోని ఆయా మండలాల్లోని రెవెన్యూ గ్రామాల నుంచి ముగ్గురు రైతుల చొప్పున ఎంపిక చేశారు. మూడు దశల్లో శిక్షణ.. ఎంపిక చేసిన రైతులకు విత్తనోత్పత్తిపై శిక్షణ ఇస్తారు. విత్తనోత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల విత్తే దూరం, సాగు పద్ధతులు తెలియజేస్తారు. పూత దశలో కలుపు మొక్కలను గుర్తించి తొలగించడం, సస్యరక్షణ పద్ధతులు, కోత పద్ధతులపై శిక్షణ ఇస్తారు. కోత తర్వాత విత్తనాలను ఇతర పంటలతో కలపకుండా తయారు చేయడం, నిల్వ పద్ధతులపై శిక్షణ ఇస్తారు. -
పెండింగ్ అర్జీల వివరాలు ఇవ్వండి
సారూ.. కొడుకు బువ్వ పెడుతలేడు ‘‘నా కొడుకు బువ్వ పెడుతలేడు సారు. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. సాయిబాబ గుడికాడ దాతలు అన్నం పెడుతుంటే అక్కడ కూడా బువ్వ పెట్టొద్దని నా చిన్న కొడుకు బెదిరించిండు.. కరీంనగర్లో నా బిడ్డ దగ్గర ఉంటున్న. అల్లుడు చనిపోయిండు. బిడ్డకు కష్టంగానే ఉంది. నేను ఎక్కడ బతుకుడు సారు.. తిండి పెట్టేలా చూడండి సారూ..’’ అంటూ మంచిర్యాలకు చెందిన గడుప బాణమ్మ కలెక్టర్ కుమార్ దీపక్ను వేడుకుంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో రోదిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. తనకు ఇద్దరు కుమారులు రాజేందర్, క్రిష్ణ, కూతురు ఉన్నారని తెలిపింది. భర్త పోషం పదేళ్ల క్రితం చనిపోయాడని, చిన్న కొడుకు చిన్నప్పుడు దత్తత పోయి మళ్లీ తమ దగ్గరికి వచ్చాడని పేర్కొంది. ఉన్న ఆస్తి కొడుకులకు ఇచ్చామని, అన్నదమ్ముల మధ్య గొడవతో పెద్ద కొడుకు హైదరాబాద్లో కిరాయికి ఉంటున్నాడని తెలిపింది. చిన్న కొడుకు మంచిర్యాలలో ఉంటున్నా బువ్వ పెట్టకుండా గెంటేశాడని, తల్లివి కావు, దగ్గరికి రావొద్దంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధురాలి కొడుకును పిలిపించి మాట్లాడాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావును కలెక్టర్ ఆదేశించారు. మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి, సీఎం ప్రజావాణికి జిల్లా నుంచి అందిన అర్జీల పెండింగ్, పరిష్కార వివరాలన్నీ ఎంపీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు మంగళవారం సాయంత్రంలోగా అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతిపత్రాలు అందజేశారు. జన్నారం మండలం పొనకల్ గ్రామ శివారులో ఊరచెరువు భూమి కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ముల్కల్ల ప్రభాకర్ కోరాడు. విచారణ అధికారిని మార్చండి మంచిర్యాల జిల్లా టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై విచారణ అధికారిగా జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జి.హన్మంతరెడ్డిని నియమించారని, ఆయనను మార్చి ఇతర జిల్లాకు చెందిన అధికారిని నియమించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు కలెక్టర్ను కోరా రు. ప్రస్తుత విచారణ అధికారి గతంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రెటరీగా పని చేశారని, ఆ సమయంలో 195నంబరు ప్లాంటు పొందా రని, అదే కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి విక్రయించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. వేరే జిల్లా వ్యక్తిని విచారణ అధికారిగా నియమించి ని ష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఆలస్యం చేయకుండా పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు -
ఉపాధికి ఐటీఐ బాటలు
● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● జిల్లా వ్యాప్తంగా 1328 సీట్లు ● ఈ నెల 21 తుది గడువుమంచిర్యాలఅర్బన్: తక్కువ సమయంలోనే కొలు వులు సాధించి స్థిరపడాలనుకునే యువతకు పారి శ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) బాటలు వేస్తోంది. పారిశ్రామిక నైపుణ్యంతో అత్యున్నత స్థాయికి చేరుకునే వీలుంది. మరోవైపు ప్రభుత్వం ఐటీఐల్లో అ డ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ల(ఏటీసీ) ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. పదో తరగతి విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరంలో ఐటీఐ కోర్సుల్లో చేరికకు దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 21వరకు తుది గడువు విధించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 13,28 సీట్లు ఉండగా.. ఇందులో ప్రభుత్వ ఐటీఐల్లో 732, ప్రైవేటు ఐటీఐల్లో 596సీట్లు ఉన్నాయి. మంచిర్యాలలో 264, మందమర్రిలో 284, శ్రీరాంపూర్లో 96, జన్నారంలో 88 సీట్లు ఉన్నాయి. ఏడాది కోర్సులు డీజిల్ మెకానిక్, కంప్యూటర్, వెల్డర్, కోపా, సోలార్ టెక్నీషియన్, రెండేళ్ల కోర్సులు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్ మెన్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, మోటార్ మెకానిక్ కోర్సులు ఉన్నాయి. పదో తరగతి మెమో, ఆధార్కార్డు, ఎస్ఎస్సీ బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం, టీసీతో వెబ్సైట్ https://iti.telangana.gov.in/లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటీసీ కోర్సులు ఇలా.. గత ఏడాది మందమర్రి ప్రభుత్వ ఐటీఐలో ఏటీసీ ప్రారంభించారు. శ్రీరాంపూర్, మంచిర్యాల, జన్నారంలో ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మందమర్రిలో ఆరు కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అడ్వాన్స్ సీఎన్సీ మెకానిక్ టెక్నీషీయన్ 24, ఆర్టీషియిన్ యూజింగ్ అడ్వాన్స్, టూల్ 20 సీట్లు, బేసిక్ డిజైన్ అండ్ పర్చువల్ వెరి ఫైర్ 24 సీట్లు, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజి టల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషీయన్ 40 సీట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 40 సీట్లు, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ 24 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మంచిర్యాల ఐటీఐ భవనం ఎన్నో అవకాశాలుఐటీఐ శిక్షణతో ఎన్నో ఉద్యోగాలు సాధించవచ్చు. సొంతంగా వర్క్షాప్లు పెట్టుకుని ఉపాధి కల్పించవచ్చు. తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపుతుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పుష్కలమైన అవకాశాలున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్, రైల్వే, ఆర్టీసీ, బీహెచ్ఈఎల్, డీఆర్డీవో, ఇస్రో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్ వంటి రక్షణ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ(టామ్కామ్) ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు సాధించారు. – రమేష్, ఐటీఐ ప్రిన్సిపాల్, మంచిర్యాల -
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తవ్వకాలు
కడెం: మండలంలోని దోస్త్నగర్ సమీపంలో కొండపై వెలసిన శ్రీనల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. దస్తురాబాద్కు చెందిన అర్చకుడు నరేశాచార్యులు సోమవారం భక్తులు, అర్చకులతో కలిసి ఆలయానికి వెళ్లగా పరిసరాల్లో విరగగొట్టిన ద్వార మూర్తి విగ్రహం, అరబిక్ భాషతో కూడిన ఇత్తడి కడ్డీలు, తట్ట, పార కనిపించాయి. పడేసిన విగ్రహాలకు సంప్రోక్షణ, శాంతిపాఠం, నారసింహా పారాయణం జరిపించి పునఃప్రతిష్టించారు. ఒకటి రెండు రోజుల వ్యవధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు భావించారు. క్రికెట్ జట్టు ఎంపిక పోటీలుమంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంచిర్యాల పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం నిర్వహించారు. రెడ్, గ్రీన్ టీంలకు 50 ఓవర్ల మ్యాచ్ను కోచ్ ప్రదీప్, సీనియర్ క్రికెటర్లు గోదావర్తి, చందు ప్రారంభించారు. గ్రీన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 13.4 ఓవర్లలో 60 పరుగులు చేసి ఆలౌట్ కాగా రెడ్ జట్టు కేవలం 1 వికెట్ను కోల్పోయి 11.1 ఓవర్లలో 61 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
● రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా, డీఆర్వోగా.. ● జెడ్పీ, కార్పొరేషన్, మున్సిపాల్టీల ప్రత్యేక అధికారి ● పాలనలోనూ తప్పని అదనపు పనిభారం ● కలెక్టర్గా కుమార్ దీపక్ ఏడాది పాలన పూర్తి
అదనపు బాధ్యతలు తీరేనా?జిల్లాకు ఐఏఎస్ స్థాయి అధికారులు ఇద్దరిని కేటాయిస్తే అదనపు కలెక్టర్ల కొతర తీరుతుంది. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న జిల్లా రెవె న్యూ అధికారి(డీఆర్వో) ఇక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కే అదనంగా ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులుగా పని చేయాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరితే ఈ అదనపు బాధ్యతలు తప్పే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నత స్థానాల్లో ఖాళీలు లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కలెక్టర్కు పది బాధ్యతలు.. అవును. మీరు చదివింది నిజమే. సా ధారణంగా కలెక్టర్ అంటేనే జిల్లాకు బాస్. అంటే అ న్ని ప్రభుత్వ శాఖలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. పా లన పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకా లు, ప్రజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాత్రం కొద్ది రోజులు గా పది మంది అధికారులు నిర్వర్తించే బాధ్యతలు ఒక్కరే నిర్వర్తిస్తుండడం గమనార్హం. అదనపు కలెక్టర్లు లేక.. కీలకమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆ ర్వో(జిల్లా రెవెన్యూ అధికారి) పోస్టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటోంది. ఈ పోస్టులోనూ అదనపు క లెక్టరే బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇక జిల్లా పరి షత్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికా రిగా ఉన్నారు. అంతేగాక జిల్లాలోని లక్సెట్టిపేట, చె న్నూర్, క్యాతనపల్లి, మందమర్రి, బెల్లంపల్లి ము న్సిపాల్టీలకు పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. నిత్యం బిజీగా.. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్గా అన్ని శాఖలను సమన్వ యం చేస్తూ.. కలెక్టర్ హోదాలో పలు కమిటీలకు బాధ్యులుగా ఉంటారు. ప్రతీవారం ప్రజాఫిర్యాదు ల విభాగం నిర్వహించాలి. నిత్యం శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ సమీక్షించాలి. ఇక జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అమలు చే యాల్సి ఉంటుంది. జిల్లాలో అమలు అవుతున్న ఆ యా పథకాలు, కార్యక్రమాల నివేదికను పై అధికా రులకు పంపించాలి. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, భూ భారతి అమలు, రేషన్కార్డుల జారీ సన్నబియ్యం పంపిణీ, మొన్నటివరకు ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ వీటితోపాటు విద్యాసంవత్సరం ఆరంభం, ప్రభుత్వ, వసతిగృహాలపై పర్యవేక్షణ, వైద్యం, వానాకాలంలో అప్రమత్తం తదితరవన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఏడాదిపూర్తి గతేడాది జూన్ 16న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కుమార్ దీపక్ పాలనకు సోమవారంతో ఏడాది పూర్తయింది. ఆయన కంటే ముందు ఇక్కడ బదావత్ సంతోష్ కలెక్టర్గా పని చేశారు. ఇక్కడికే శిక్షణ కలెక్టర్గా వచ్చి మొదటిసారి ఓ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఇన్చార్జి ఎంఈవోలు ఇంకెన్నేళ్లు?
● పీజీ హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు ● ఏడేళ్లుగా ఇదే పరిస్థితి.. ● విద్యా ప్రమాణాలపై ప్రభావంచెన్నూర్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా మండలాల్లో పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఇన్చార్జీలే చూసుకోవాల్సిన పరిస్థితి. గత ఏడేళ్లుగా జిల్లాలో రెగ్యులర్ మండల విద్యాధికారుల(ఎంఈవోల) నియామకాలు జరగడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఇన్చార్జి ఎంఈవోలే చూసుకోవాల్సి వస్తోంది. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు గతేడాది సీనియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ హెడ్మాస్టర్ల(పీజీ హెచ్ఎంల)ను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమించారు. అయితే పనిభారం పెరిగి వారు సతమతం అవుతున్నారు. అదనపు బాధ్యతలతో ఇబ్బందులు.. పీజీ హెచ్ఎంలు తమ సొంత పాఠశాలల నిర్వహణతోపాటు మండలస్థాయిలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించాల్సి ఉంది. నూతన విద్యా విధానం అమలు, మధ్యాహ్న భోజన కార్యక్రమం, హరితహారం వంటి పథకాల నిర్వహణ, ప్రతీ సోమవారం ప్రజావాణి, మండల పరిషత్ సమావేశాలు, కలెక్టర్, డీఈవోల సమీక్షలకు హాజరు కావడం వంటి బాధ్యతలు వారిపై ఉన్నాయి. ఈ బాధ్యతల మధ్య విద్యార్థుల సంఖ్య, ప్రభుత్వ పథకాల అమలు తీరు వంటి సమాచారాన్ని సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ పనిభారంతో పాఠశాలల పర్యవేక్షణ సక్రమంగా జరగక, విద్యా నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. తల్లిదండ్రుల ఆందోళన పాఠశాలల ప్రారంభం నుంచి విద్యార్థులకు కనీస సామర్థ్యాల సాధన, గుణాత్మక విద్య, స్మార్ట్, డిజిటల్ క్లాస్ల నిర్వహణ వంటి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంది. అయితే, ఇన్చార్జి ఎంఈవోలపై అధిక బాధ్యతలు ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ సరిగా జరగడం లేదు. ఉత్తమ ఫలితాలు రావడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఎంఈవోల నియామకానికి వినతి.. ప్రభుత్వం ఏడేళ్లుగా రెగ్యులర్ ఎంఈవోలను నియమించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. పాఠశాలల బలోపేతం, విద్యా నాణ్యత పెంపు కోసం రెగ్యులర్ మండల విద్యాధికారులను నియమించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ఈ చర్య విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. రెగ్యులర్గా నియమిస్తే..ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగుతున్నాం. పాఠశాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం రెగ్యులర్ మండల విద్యాధికారులను నియామిస్తే పీజీ హెచ్ఎంలపై పనిభారం తప్పుతుంది. – కొమ్మెర రాధాకృష్ణమూర్తి, ఇన్చార్జి ఎంఈవో చెన్నూర్ -
న్యాయం కోసం ఊరంతా ఏకమై..
● కారోబార్పై దాడిచేసిన వారిని శిక్షించాలని కొండాపూర్లో ఆందోళన ● పోలీస్స్టేషన్ సమీపంలో రాస్తారోకోదండేపల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామ పంచాయతీ కారోబార్ ప్రభాకర్పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆది వారం ఆందోళన చేశారు. న్యాయం కోసం ఊరంతా ఏకమై నాలుగు ట్రాక్టర్లలో దండేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దాడి ఘటన వివరాలు కొండాపూర్ గ్రామానికి చెందిన బారతపు సత్తవ్వతో అదే గ్రామానికి చెందిన బారతపు లింగయ్య, కు మారస్వామి, అమృత, గంగలక్ష్మి భూమి విషయంలో శనివారం గొడవకు దిగారు. సత్తవ్వపై దాడి జరుగుతుండగా, ఆమె మరిది, గ్రామ పంచాయతీ కారోబార్ ప్రభాకర్ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయి తే, నిందితులు ఇనుప రాడ్తో ప్రభాకర్పై దాడి చే యడంతో అతని తల, చేతికి తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల నిరసన నిందితులను రిమాండ్ చేయకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దండేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రహదారిపై బైఠాయించి, నిందితులను జైలుకు పంపాలని డి మాండ్ చేశారు. ఈ నిరసన కారణంగా రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ప్రభాకర్కు న్యాయం చేయాలని పట్టుబట్టారు. పోలీసుల స్పందన ఈ ఘటనపై దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, గ్రామస్తులతో చర్చించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెడికల్ రిపోర్టు రానందున నిందితులను రిమాండ్ చేయలేదని తెలిపారు. ఎస్సై వివరణపై అసంతృప్తి చెందిన గ్రామస్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు. అనంతరం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఘటనా స్థలా నికి చేరుకుని, కేసు నమోదు చేసినట్లు, విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. -
లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో డీఐజీ పూజలు
జైనథ్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో డీఐజీ తరుణ్ జోషి ఆదివారం పూజలు చేశారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది శాలువాతో సత్కరించారు. స్వామి వారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అ డ్డి రాకేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అ శోక్ రెడ్డి, నాయకులు జగదీశ్రెడ్డి, బద్దం సురేష్ రె డ్డి, రాజన్న, వెంకటి, బండి పోచన్న, పాల్గొన్నారు. జాతీయ సమావేశాలకు తపస్ నేతలుమంచిర్యాలటౌన్: సిమ్లాలో జరుగుతున్న అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్విక్ మహాసంఘ్ జాతీయ కా ర్యకారిణి సమావేశాలకు మంచిర్యాలకు చెందిన తె లంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నా యకులు హాజరయ్యారు. జిల్లా నుంచి బండి రమేశ్, తెల్కలపల్లి పెంటయ్య హాజరై విద్యారంగా నికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని కోరారు. -
తేమ లేకుండానే విత్తనం
● ఖరీఫ్ పనులు ముమ్మరం ● పొడి దుక్కిలోనే విత్తనాలు వేస్తున్న రైతులు ● అదును దాటుతోందని ఆందోళన మంచిర్యాలఅగ్రికల్చర్: రుతుపవనాలు వచ్చినా తొలకరి వర్షాలు పలకరించనేలేదు. ఈనెల 8న ఆదివారం మృగశిర కార్తె (మిరుగు) ప్రారంభం కావడంతో రైతులు ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్తె వ్యవసాయ పనులకు శుభసూచకంగా భావించి విత్తనాలు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన రైతులు చేలల్లో పత్తి విత్తనాలు వేస్తూ.. దుక్కులు దున్నుతూ.. సేంద్రియ ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. వ్యవసాయ సామగ్రి, విత్తనాలు సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. భూమిలో తేమ లేకున్నా పొడిదుక్కిలోనే విత్తనాలు వేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మొలక వచ్చే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు కురిస్తే విత్తనం భూమిలో మురిగిపోయే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ జూన్ నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు నైరుతి కాలంగా వర్షపాతాన్ని లెక్కించడం ప్రారంభిస్తుంది. జూన్ 1 నుంచి 15 వరకు జిల్లా సగటున సాధారణ వర్షపాతం 62.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 24.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటున 62 శాతం లోటుగా నమోదైంది. కొద్ది రోజులుగా మబ్బులు పడుతూ చిరుజల్లులకే పరిమితం అవుతోంది. ఒకటి రెండు భారీ వర్షాలు కురిసి నేలలో 60 నుంచి 70 శాతం తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసుకోవాలని కేవీకే శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పొడిలోనే విత్తనం.. ఈ ఏడాది రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన భారీ వర్షాలు కురియలేదు. గత నెలలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు వేగవంతం చేశారు. కానీ జూన్లో వర్షాలు కురియడం లేదు. వానాకాలం సాగు పంటలు విత్తుకునేందుకు మిరుగు కార్తె ప్రారంభంగా భావించి వానలు పడుతాయనే ఆశతో రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. గతేడాది కూడా ప్రథమార్థంలో వర్షాలు కురిసినా.. తర్వాత పంట ఎదిగే సమయంలో ముఖం చాటేయడంతో ఆశించిన దిగుబడి రాక రైతులు నష్టపోయారు. ఈసారి కూడా నైరుతి రుతుపవానాలు ముందుస్తుగానే వచ్చినా ఇంకా వర్షాలు రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. 3,33,565 ఎకరాల్లో సాగు అంచనా జిల్లాలో ఈ ఏడాది పత్తి 1,58,753 ఎకరాలు, వరి 1,58,161, కందులు 1,054, మొక్కజొన్న 531, పెసలు 116, మినము 69 ఎకరాలు, ఇతర పంటలు 14,881, మొత్తం 3,33,565 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువుల ప్రణాళిక రూపొందించారు. గతేడాది పత్తికి మద్దతు ధర రూ.7,521 ఉండగా ఈ ఏడాది రూ.8,110 చెల్లించాలని నిర్ణయించారు. రూ.589 మద్దతు ధర పెరగడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువగా పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు. కాగా పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి పత్తి సాగు చేస్తుండగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఖరీఫ్ రైతులకు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమయం ఉంది.. ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. ప్రస్తుతం నేలలో వేడిఎక్కువగా ఉండడం వలన విత్తనం చెడిపోయే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసి నేలలో ఫీట్ లోపలి వరకు నీరుచేరి 60 నుంచి 70 శాతం తేమ ఉంటే విత్తనం వేసుకోవచ్చు. తేలికపాటి వర్షాలకు తొందరపడి విత్తనం వేసుకుంటే మొలక దెబ్బతినే ప్రమాదం ఉంది. – రాజశేఖర్, కేవికే శాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
బాసరలో భక్తుల రద్దీ
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు క్యూలో వేచి ఉన్న భక్తులు చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. 1000 రూపాయల ప్రత్యేక అక్షరాభ్యాసం 378 టికెట్లు, సాధారణ అక్షరాభ్యాసం 150 రూపాయల టికెట్లు 824, అద్దెగదులు, చండీ హోమం, శ్రీ సత్యనారాయణ పూజ, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.12,07,210 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వణాధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. – బాసర -
హైదరాబాద్లో యువకుడి ఆత్మహత్య
● ముల్కల్లలో ఉద్రిక్తత ● మహిళ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన ● పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం మంచిర్యాలరూరల్(హాజీపూర్):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటకు చెందిన దేవి ప్రశాంత్ (27) హైదరాబాద్లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. దేవి ప్రశాంత్ బీటెక్ పూర్తి చేసి అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ముల్కల్లకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. మూడు నెలల క్రితం వివాహిత తన కుమారుడితో కలిసి హైదరాబాద్ వెళ్లగా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో కుమారుడిని అప్పగించింది. పంచాయితీ తర్వాత ఇరువురూ విడివిడిగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో చాటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారం క్రితం ఇరువురూ మరోసారి హైదరాబాద్ వెళ్లారు. దీంతో వివాహిత కుటుంబ సభ్యులు హాజీపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రశాంత్ సోదరుడు రాజశేఖర్ సహాయంతో వివాహిత గురువారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ప్రశాంత్ హాజీపూర్, మంచిర్యాల ప్రాంతాల్లో తిరిగి, చివరకు హైదరాబాద్కు వెళ్లాడు. ఆత్మహత్యపై అనుమానాలు శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి రాజశేఖర్కు ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి చూడగా ప్రశాంత్ విగతజీవిగా కనిపించాడు. అతని మృతిపై కుటుంబ సభ్యులు బలమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదివారం పోస్ట్మార్టం అనంతరం అంబులెన్స్లో ప్రశాంత్ మృతదేహాన్ని గుడిపేటకు తీసుకొచ్చారు. అంబులెన్స్ డ్రైవర్ల ర్యాలీ.. ప్రశాంత్ సహచర అంబులెన్స్ డ్రైవర్లు సంతాప సూచకంగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివాహిత కుటుంబ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు వివాహిత తల్లిదండ్రుల ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆందోళన నిర్వహించారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ప్రశాంత్ సోదరుడు రాజశేఖర్ తమ్ముడి మరణం ఆత్మహత్య కాదని, వివాహిత కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తున్నాడు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇవ్వడంతో వివాదం సద్దు మణిగింది. -
● 2022లో మంచిర్యాల కళాశాలకు అనుమతి ● ఇప్పటికీ కానరాని వసతులు ● ఈ ఏడాది మెడికల్ సీట్ల పెంపు లేనట్లే?
అనుమతులు వచ్చేలా కృషిమెడికల్ కళాశాలకు అవసరమైన అన్ని వసతులతో కూడిన సొంత భవన నిర్మాణ పనులు, ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మరో మూడు నెలల్లో కాలేజీ భవనం, ఐదు నెలల్లో ఆస్పత్రి భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ఎంసీ నుంచి అభ్యంతరాలు వచ్చినా, భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉండడంతో, ఈ ఏడాది ఎంబీబీఎస్లో సీట్లకు అనుమతులు వచ్చేలా కృషి చేస్తున్నాం. భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వచ్చే ఏడాది ఎన్ఎంసీ 150 సీట్లకు అనుమతిచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ ఎండీ.సులేమాన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్మంచిర్యాలటౌన్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విస్తరణలో భాగంగా 2022లో మంచిర్యాలలో నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. అదే ఏడాది ఎంబీబీఎస్ మొద టి సంవత్సరంలో 100 సీట్లు కేటాయించింది. వాటిని భర్తీ చేశారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొ త్త మెడికల్ కాలేజీలకు 150 సీట్లు కేటాయించాల్సి ఉండగా, మంచిర్యాల కాలేజీలో పూర్తిస్థాయి వసతులు లేక మూడేళ్లుగా 100 సీట్లతోనే కొనసాగుతోంది. మార్కెట్ యార్డులో కాలేజీ.. మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న వ్య వసాయ మార్కెట్ యార్డును మెడికల్ కాలేజీ కో సం కేటాయించారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తు ల నిల్వ కోసం రేకులతో నిర్మించిన గోదాములను తరగతి గదులు, ల్యాబ్లు, కాన్ఫరెన్స్ హాల్, ప్రిన్సి పల్, స్టాఫ్ గదులుగా 2022 మార్చిలో కాలేజీని ప్రా రంభించారు. కాలేజీకి అనుబంధంగా జిల్లా ఆస్పత్రిని 200 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 150 పడకలతో అనుబంధంగా కొనసాగిస్తున్నారు. ఎన్ఎంసీ తనిఖీల్లో లోపాలు బహిర్గతం.. 2023లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ముందు ఎన్ఎంసీ నిర్వహించిన తనిఖీల్లో కాలేజీ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. రేకుల గోదాముల్లో కాలేజీ నిర్వహణ, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన వా ర్డులు, ల్యాబ్లు, మౌలిక వసతుల లేమిపై ఎన్ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలి తనిఖీల్లోనూ ఇవే లోపాలను గుర్తించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 18న ఢిల్లీలో జరిగే విచారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు, యూజీఎంఈబీ డైరెక్టర్ హాజరు కావాలని ఎన్ఎంసీ ఆదేశించింది. మంచిర్యాల కాలేజీ ప్రిన్సిపాల్, డీన్ వర్చువల్గా విచారణలో పాల్గొననున్నారు. నిర్మాణ పనులలో జాప్యం.. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని గుడిపేట్లో కొత్త మెడికల్ కాలేజీ భవన నిర్మాణం, కాలేజీ రోడ్డులో 450 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మా ణం రూ.500 కోట్లతో 2023లో ప్రారంభమైంది. అయితే, ఈ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో భవనాలు అందుబాటులోకి రాలేదు. ఈ ఆలస్యం ఎన్ఎంసీ అసంతృప్తికి కారణమైంది. వసతుల లేమి..ప్రస్తుత కాలేజీలో అధ్యాపకులు, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు, సీసీటీవీ వంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమై న ప్రాక్టికల్ శిక్షణకు తగిన రోగులు, మృతదేహాలు, వివిధ విభాగాలకు చెందిన వైద్య సౌకర్యాలు లేవు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు, ఆర్థో సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల వ్యాధులపై ప్రాక్టికల్ అవగా హన కోసం అవసరమైన సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల విద్యను ప్రభావితం చేస్తోంది. మరో ఆరు నెలలు.. వచ్చే ఏడాది కల్లా కొత్త భవనం, 450 పడకలతో ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రి పూర్తయితే ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ నిర్వహణ సాధ్యమవుతుంది. అయితే, నూతన భవనం అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలలకుపైగా సమ యం పట్టనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్ల కే టాయింపుపై ఎన్ఎంసీ అభ్యంతరాలు వ్యక్తంచేసే అవకాశం ఉంది. అధికారులు సీట్ల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, వసతుల ఏర్పాటు వరకు సవాళ్లు తప్పేలా లేవు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
● రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా మంచిర్యాలక్రైం: లోక్ అదాలత్తో సత్వర న్యా యం జరుగుతుందని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కమిషనరేట్ పరి ధిలో ఈ నెల 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో 13,048 కేసులు పరిష్కారమయ్యాయని తెలి పారు. 80 సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు రూ.17,66,264 లక్షలు తిరిగి అందించినట్లు పేర్కొన్నారు. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది పెండింగ్లో ఉన్న కేసులు, విపత్తు నిర్వహణ, ఈ–పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరాల కేసుల్లోని కక్షిదారులను పిలింపించామని వివరించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చేలా కృషి చేసిన అధికారులను అభినందించారు. -
గోదావరిలో మృత్యు ఘోష
వరుస ఘటనలతో..బాసరలో ఇటీవలి కాలంలో ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నా పట్టింపు కరువైంది. మే 26న మహారాష్ట్ర నుంచి వచ్చిన కులదీప్బాబాసాహెబ్ అనే బాలుడు, నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్కు చెందిన యువకుడు బొల్లమల రాజు పుణ్యస్నానాల కోసం గోదావరిలోకి దిగి నీట మునిగి ఇదే ప్రాంతంలో మృతి చెందారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో మృతిచెందినా రక్షణ చర్యలు కరువయ్యాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదు. లోతు, బురద ప్రాంతాల్లోనూ బోట్లు తిప్పుతున్నా నియంత్రించడంలేదు. స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే భక్తులు అవగాహన లేకుండా గోదావరిలోని లోతైన ప్రాంతాలకు స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల రక్షణ చర్యలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.భైంసా/భైంసాటౌన్/బాసర: బాసర గోదావరి నది ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన యువకులను పరలోకాలకు పంపింది. వివరాలు.. హైదరాబాద్లో స్థిరపడిన రాజస్థాన్కు చెందిన వ్యాపారి ప్రేమ్రాంకు భరత్(16), మదన్(18), రాకేశ్(20) ముగ్గురు సంతానం. వీరిని హైదరాబాద్లో చదివిస్తున్నాడు. ప్రేమ్రాం తన మరదలి కొడుకై న వినోద్(19)కు హైదరాబాద్లోనే ఎస్సార్ నగర్లో నీట్ కోచింగ్ ఇప్పించాడు. విద్యాసంవత్సరం ఆరంభంలో ప్రేమ్రాం ఎప్పటిలాగే తన భార్య సోనుతో ముగ్గురు కొడుకులతోపాటు మరదలి కొడుకై న వినోద్, బంధువుల కుమారుడు రుతిక్(22)ను ఆదివారం రైలులో సరస్వతీ అమ్మవారి దర్శనానికి బాసరకు పంపించాడు. బాసరకు చేరుకున్న వీరు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలాచరించేందుకు వెళ్లారు. స్నాన ఘట్టాల వద్ద నీరు మురికిగా ఉందని గోదావరినది మధ్యలో తేలిన ఇసుక తిన్నెల వద్ద స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి బోటులో వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లోతు తెలియక ప్రేమ్రాం–సోను దంపతుల ముగ్గురు కొడుకులతో పాటు మరదలి కుమారుడు వినోద్, మరో యువకుడు రుతిక్ నీట మునిగి విగతజీవులయ్యారు. వీరి మృతదేహాలను భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రేమ్రాం–సోను కుమారుల మృతదేహాలతోపాటు వినోద్ మృతదేహాన్ని రాజస్థాన్కు పంపించారు. బంధువుల కుమారుడైన రుతిక్ మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాసర ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. తల్లడిల్లిన తల్లి హృదయం తన ముగ్గురు కొడుకులను కోల్పోయిన తల్లి సోను కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆస్పత్రిలో కొడుకుల మృతదేహాలపై రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ముగ్గురు కొడుకులను కోల్పోయిన తాను ఇక బతికుండలేనని గుండెలవిసేలా రోదించింది. ఏదైనా వాహనం కింద పడి చనిపోతానని బయటకు పరుగెత్తింది. సమీప బంధువులు ఓదార్చి ఆమెను పక్కకు తీసుకెళ్లారు. ఫాదర్స్ డే రోజునే ఘటన ఫాదర్స్ డే రోజే ఐదుగురు యువకులు దుర్మరణం చెందడం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని చెప్పి రైలెక్కిన ముగ్గురు కొడుకులు తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని ప్రేమ్రాం జీర్ణించుకోలేకపోతున్నాడు. తన కొడుకులతోపాటు మరదలి కొడుకు, బంధువుల కుమారుడి మృతి వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి భైంసా ఏరియాస్పత్రికి చేరుకున్నాడు. విగతజీవులైన కొడుకులను చూసి బోరున విలపించాడు. జవాబు లేని ప్రశ్నలు ఆదివారం బాసర గోదావరిలో యువకులను పోగొట్టుకున్న కుటుంబీకులు ఆవేదనతో అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి. నీటిలో మునుగుతున్న తమ పిల్లలను కాపాడాలని ప్రాధేయపడ్డా ఎవరూ దగ్గరికి రాలేదని వాపోయారు. నది నీటిలో మునిగి కొన ఊపిరితో ఉన్న తమ పిల్ల లను కాపాడాలని అరిచినా గోదావరి పరిసరాల్లో ఓ వైద్యుడు, సిబ్బంది కనిపించలేదన్నారు. సీపీఆర్ చేసినా, అత్యవసర వైద్య సేవలు అక్కడే అంది ఉంటే పిల్లలు బతికేవారని బాధిత కుటుంబీకులు వాపోయారు. నీటి లోతు తెలిపే హెచ్చరించే బోర్డులు కూడా ఎక్కడా లేవని, అంబులెన్స్లో ఆస్పత్రికి వచ్చినా సరైన సేవలు అందలేదని ఆరోపించారు. ఇలా బాధిత కుటుంబీకులు భైంసా ఏరియాస్పత్రిలో మీడియా ఎదుట అడిగిన ప్రశ్నలు జవాబులు లేనివిగా మిగిలాయి. నీట మునిగి ఐదుగురు మృతి మృతులంతా 22 ఏళ్లలోపు వారే నిర్మల్ జిల్లా బాసర వద్ద ఘటన మృతుల్లో ముగ్గురు అన్నదమ్ములు మిన్నంటిన తల్లిదండ్రుల రోదన ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం -
చెరువులో నీటమునిగి ఒకరు మృతి
బాసర: ప్రమాదవశాత్తు చెరువులో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన బలగం రాజు (38) మూడు రోజులుగా మైలాపూర్ గ్రామంలోని చెరువులోకి దిగి కమలం పూలు తెచ్చుకుని విక్రయిస్తున్నాడు. ఆదివారం పూలకోసం చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు
మందమర్రిరూరల్: మండలంలోని పలు గ్రా మాలకు చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల మంజూ రు పత్రాలు ఆదివారం అందించారు. శంకర్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సండ్రోన్పల్లె కేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పేదలకు బంగారు భవిష్యత్ను అందించేదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సొంతస్థలం ఉండి, ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఏరియా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు మంత్రిని కలిశారు. శాలువాలు కప్పి సన్మానించారు. -
సొంతింటి కల నెరవేరుస్తాం
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల చిరకాల కోరిక అయిన సొంత ఇంటి పథకం అమలు చేస్తామని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపల్లి సమ్మయ్య తెలిపారు. నస్పూర్లోని ప్రెస్క్లబ్లో ఆదివారం మాట్లాడారు. కార్మికుల ప్రధాన డిమాండ్లను తమ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి సమస్యలు వివరించినట్లు తెలిపారు. సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. సింగరేణి సొంతంగా ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్లో కంపెనీ సూపర్ స్పెలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి కార్మికులు, వారి కుటుంబాలకు చికిత్స అందించాలని విన్నవించినట్లు తెలిపారు. కార్మికుల అలవెన్స్లపై ఆదాయ పన్ను కంపెనీ రీయింబర్స్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఘనంగా భట్టి జన్మదిన వేడుకలు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేట్ కట్చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, కేంద్ర ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్, భీంరావు, గరిగె స్వామి, ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్రెడ్డి, కేంద్ర నాయకులు తిరుపతిరాజు, రామ్శెట్టి నరేందర్, అశోక్, మోహన్ పాల్గొన్నారు. -
కత్తులతో పోస్టు పెట్టిన ఒకరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: సోషల్ మీడియాలో కత్తులతో పోస్టుపెట్టిన ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త కుమ్మరవాడకు చెందిన దన్గట్ సుధీర్ మూడు నెలల క్రితం మావలలో పశువుల వాహనాన్ని అడ్డుకుని సదరు యజమానిని చంపుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేసి దౌర్జన్యం చేసిన కేసులో పరారీలో ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కత్తులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా పోస్టులు పెట్టినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అతనిపై పోలీస్స్టేషన్లో తొమ్మిది కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లపల్లిలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి సోషల్ మీడియాలో పెట్టిన కత్తి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో వన్టౌన్, మావల సీఐలు సునీల్ కుమార్, కె.స్వామి పాల్గొన్నారు. -
‘ఇన్చార్జి మంత్రిగా సీతక్కను కొనసాగించాలి’
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ ముద్దుబిడ్డ, రాష్ట్ర మంత్రి సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. ఆదివారం మావల మండలంలోని కుమురం భీం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీల ఆశాజ్యోతి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారన్నారు. ప్రజల మన్ననలు పొందారన్నారు. ముఖ్యంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు ఆదివాసీ చట్టాలు, హక్కులు, సమస్యలపై పూర్తిగా అవగాహన ఉందన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మంత్రిని మార్చడం ఆదివాసీలను అవమానపర్చడమే అవుతుందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సీఎం సైతం దత్తత తీసుకున్నారన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుకా, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా, డివిజన్ కమిటీ ఉపాధ్యక్షురాలు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ ముకుంద్రావు, తొడసం ప్రకాశ్, గోవింద్రావు, గేడం గణేశ్, గేడం శ్యాంరావు, మనోహర్, దశరథ్, వెట్టి బాలు, సిడాం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడిగా బండి రమేశ్
శ్రీరాంపూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా బండి రమేశ్ నియమితులయ్యారు. నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి హాజరై మాట్లాడారు. యూనియన్ బైలాస్ ప్రకారం నూతన ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. కార్మికవర్గ ప్రయోజనాలే లక్ష్యంగా టీబీజీకేఎస్ పని చేస్తుందన్నారు. గు ర్తింపు సంఘంగా సింగరేణి చరిత్రలో నిలి చిపోయేలా హక్కులు సాధించామన్నారు. సింగరేణిలో నేడు రాజకీయ జోక్యం పెరిగిందని త ద్వారా సంస్థ అభివృద్ధి కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ వార్షిక లాభా లను వెంటనే ప్రకటించి అందులో నుంచి కా ర్మికులకు 35 శాతం వాటా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఆ యూనియన్ సెంట్రల్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీని యర్ ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, జాయింట్ సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పొగాకు రమేశ్, నాయకులు అన్వేశ్రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి గోగుల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
భీమారం: మండలంలోని పోలంపల్లి, భీమారం గ్రామాల సమీపంలో ఆదివారం రెండు చోట్ల దాడులు నిర్వహించి నాలుగు కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పోలంపల్లి సమీపంలో నకిలీ పత్తి విత్తనాలతో వెళ్తున్న రేషవేని సత్యనారాయణను పట్టుకున్నట్లు తెలిపారు. భీమారం సమీపంలోని బాల్క సుమన్ రోడ్డులో ఒక సంచితో అన్నవేని నర్సయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాలు లభించాయన్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారి సుధాకర్తో పరీక్షలు నిర్వహించగా గ్లైసిడ్ విత్తనాలు అని తేలిందన్నారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కడెం ఎడమ కాలువ సిల్ట్ తొలగింపుకడెం: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ గేట్ల వద్ద పేరుకుపోయిన సిల్ట్ను తొలగించేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నాలుగు రోజు లుగా పొక్లెయిన్ సహాయంతో సిల్ట్ను తొలగిస్తూ కాలువ నీరు చివరి ఆయకట్టుకు సక్రమంగా చేరేలా మరమ్మతు పనులు చేస్తున్నట్లు ఈఈ విఠల్ పేర్కొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులుతాంసి: మండలంలోని వడ్డాడిలో మత్తడివాగు ప్రాజెక్టు వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఆదివారం తాంసి పోలీసులు కాపాడారు. తాంసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ప్రభాకర్ కుటుంబ సమస్యలతో పాటు మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్య చేసుకునేందుకు సాయంత్రం ప్రాజెక్టు వద్దకు వచ్చాడు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు 100కు డయల్ కాల్ చేయడంతో అప్రమత్తమైన పెట్రోలింగ్ సిబ్బంది వికాస్ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు సైతం మత్తడివాగు ప్రాజెక్టు వద్దకు ఆత్మహత్యకు పాల్పడటానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. -
‘సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలి’
ఆదిలాబాద్అర్బన్: కార్మిక సమస్యలపై పోరాటా లకు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రీజియన్ మహాసభను సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యా ప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా చర్చించారు. యాజమాన్యం తగ్గి స్తున్న ఓటీల గురించి, కార్మికుల వేధింపులు, డబల్ డ్యూటీపై చర్చించారు. ప్రతి డిపోలో కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నా రు. ఈ సమస్యలు పరిష్కారించాలని, లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. జూలై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలన్నారు. అనంతరం ఆదిలాబాద్ రీజియన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.భీమ్రావ్, కార్యదర్శిగా ఎం.భీమ్రావ్, కోశాధికారిగా నారాయణ, ప్రచార కార్యదర్శిగా ఎం.పొచ్చన్నతో పాటు ఎనిమిది మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
● సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డినస్పూర్: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గ స భ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. మండల మహాసభలను పట్టణంలోని నర్సయ్య భవన్లో ఆదివారం నిర్వహించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు షిర్కే చౌరస్తా నుంచి నర్సయ్య భవన్ వర కు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మూడు గ్యారెంటీలను మాత్రమే అమలు చేసిందన్నారు. రైతులకు, కా ర్మికులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపి మావోయిస్టులతో చ ర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థాని క సంస్థల ఎన్నికల్లో సీపీఐ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఆగస్టు 22, 23 తేదీల్లో మేడ్చల్లో పార్టీ రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్లో చంఢీఘర్లో జాతీయ మహాసభలు జరుగుతాయని వెల్ల డించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మేకల దాసు, జోగుల మల్లయ్య, లింగం రవి రేగుంట చంద్రశేఖర్, ము స్కె సమ్మయ్య, ఎస్కె బాజీసైదా, రేగుంట చంద్రకళ, దొడ్డిపట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మండల కార్యదర్శిగా జోగుల మల్లయ్య మండల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శిగా లింగం రవి ఎన్నికయ్యారు. మొత్తం 69 మందిని కౌన్సిల్ సభ్యులుగా, 23 మందిని నూతన కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
ఆలయంలో చోరీ నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని చౌడేశ్వరి మాతా ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ సమీర్ వారం రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలై వచ్చాడు. గంజాయికి బానిసైన ఆయన శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో క్రాంతినగర్కు చెందిన షేక్ అయ్యాన్, మహరాష్ట్రకు చెందిన రాహుల్తో కలిసి చౌడేశ్వరి మాతా ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. వాచ్మెన్ గంగయ్యను కత్తితో బెదిరించి రూ.3వేల నగదు, బీరువాలో ఉన్న ముక్కుపుడకను దొంగిలించి పరారయ్యారు. ఆదివారం వడ్డెర కాలనీలో చోరీకి ప్రయత్నించాడు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి గంజాయి సేవించే పరికరం, రూ.వెయ్యి నగదుతో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
డీసీసీబీ డైరెక్టర్ హరీష్రావు కిడ్నాప్..!
● అర్ధరాత్రి ఇంట్లో నుంచి తీసుకువెళ్లిన దుండగులు ● తుఫ్రాన్ టోల్ప్లాజా వద్ద తప్పించుకున్న బాధితుడు నిర్మల్టౌన్: మామడ మాజీ ఎంపీపీ, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిక్యాల హరీష్ రావు కిడ్నాప్కు గురైన సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు మామడ మండలం పోన్కల్ గ్రామంలో హరీష్ రావు తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆయనను తన వాహనంలోనే కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ వైపు తరలించారు. వెళ్లే దారిలో భారీగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో హరీష్ రావు తన సన్నిహితులకు ఫోన్ చేసి కొంత నగదు కావాలని కోరినట్లు సమాచారం. తుఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద కారు ఆగిన సమయంలో హరీష్ రావు చాకచక్యంగా కారు దిగి తప్పించుకున్నారు. దీంతో దుండగులు ఆగకుండా టోల్ గేటును గుద్దేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. హరీష్ రావు జరిగిన విషయాన్ని టోల్ ప్లాజా సిబ్బందికి తెలియజేసి తుఫ్రాన్ పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులు హరీష్రావును ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ కార్యాలయానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హరీష్ రావు వద్ద గతంలో పనిచేసిన వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: మంచిర్యాల, రవీంద్రఖని రైల్వేస్టేషన్ల మధ్య ఈ నెల 13న రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (35) రైలు కిందపడి ఆత్మహ త్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్కా నిస్టేబుల్ సంపత్ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. రై లు కిందపడి ఒకరు చనిపోయిన ట్లు అందిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు, అడ్రస్ లభించలేదని తెలిపా రు. ఎడమ చేతిపై ‘ఇండియా’ అని ఇంగ్లిష్లో రాసిన పచ్చబొట్టు ఉంద ని, మృతుడి ఒంటిపై బ్లూకలర్ టీష ర్ట్, జీన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక ప్రభు త్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలకు 9701112343, 8328512176 నంబర్లలో సంప్రదించాలని హెడ్కానిస్టేబుల్ సూచించారు. -
పిల్లల కోసమే ప్రమోషన్ వదిలి..
వేమనపల్లి: మండలంలోని బుయ్యారం గ్రామానికి చెందిన అర్క పోచయ్య పిల్లల బాగోగుల కో సం ఉద్యోగ రీత్యా ప్రమోషన్ వదులుకుని వారి జీవితాలను తీర్చిదిద్దాడు. తన తండ్రి గంగయ్య గ్రామంలో భూస్వాములకు పాలేరుగా ఉండి పో చయ్యను 10 వతరగతి వరకు చదివించాడు. మంచిర్యాలలో డిగ్రీ, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశాడు. ఎల్ఐసీలో జూనియర్ అసిస్టెంట్గా చేరి న పోచయ్య ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్గా ప ని చేస్తున్నారు. మేనేజర్గా ప్రమోషన్ వచ్చినా కొడుకుల చదువులకు ఆటంకమేర్పడుతుందని వదులుకున్నాడు. ఉద్యోగరీత్యా మంచిర్యాలలో ఉంటున్నాడు. పెద్ద కొడుకు మనోజ్ గాంధీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ లో పీజీ చేస్తున్నాడు. రెండో కొడుకు మహర్షి బీటె క్ ‘సివిల్’ పూర్తి చేసి అల్ట్రాటెక్ కంపెనీలో పని చే స్తున్నాడు. మనీశ్ బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. -
నాన్నే.. రోల్మోడల్..
నిర్మల్: మానాన్న బీఎన్.సర్కార్. జార్ఖండ్ కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. మేం నలుగురం పిల్లలం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. మా అందరినీ నాన్న బాగా చదివించారు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మా గురించి ప్రతిరోజు ఆలోచించేవారు. అందుకు తగ్గట్లుగానే ఈరోజు అందరం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాం. న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చదివిన నాన్న మమ్మల్ని కూడా చదువులో ప్రోత్సహించారు. అందుకే పబ్లిక్ పాలసీలో డబుల్ మాస్టర్స్, సోషియాలజీలో మాస్టర్స్ చదివాను. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నాన్నే నాకు సూచించారు. ఐఏఎస్ సాధించడంలోనూ నాన్న అడుగడుగునా వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా విషయాల్లో నాన్నే రోల్మోడల్. – అభిలాష అభినవ్, కలెక్టర్, నిర్మల్ -
బాసర క్షేత్రంలో భక్తుల రద్దీ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనా నికి భక్తులు పోటెత్తారు. శనివారం సంకటచతుర్థి శు భ ముహూర్తం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మ హారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని ద ర్శించుకున్నారు. చిన్నారులతో అక్షరాభ్యాస మండపంలో అర్చకులతో అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరిపించారు. వివిధ అర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.9,14,500 ఆదాయం వచ్చినట్లు ఆల య కార్యనిర్వహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. గంజాయి పట్టివేతనస్పూర్: పట్టణ పరిధిలో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఉపేందర్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సీతారాంపల్లిరోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విద్యానగర్కు చెందిన నాధరి వంశీ వద్ద 99 గ్రాముల గంజాయి లభ్యమైంది. గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చౌడేశ్వరీ మాత ఆలయంలో చోరీ ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణ శివారులోని చౌడేశ్వరీ మాత ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం గేట్లకు వేసిన తా ళాలను పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు బీరువాలోని వస్తువులను చిందరవందర చేశారు. ఆల య సిబ్బంది శనివారం ఉదయం ఆలయానికి వ చ్చి చూడగా తాళం పగులగొట్టి సామగ్రి చిందరవందరగా ఉండగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీ సులకు సమాచారమందించారు. దీంతో టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పరిసరాలను తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. కాగా, ఓ ముక్కు పుడక కనిపించడం లేదని ఆలయ పూజారి తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో పడి చుక్కల దుప్పి మృతిదస్తురాబాద్: దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన చుక్కల దుప్పిని ఊరకుక్కలు తరమడంతో వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. ఎఫ్ఎస్వో కింగ్ఫిషర్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆకోండపేట గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో గ్రాస్ ప్లాంటేషన్లో భాగంగా గడ్డి పెంచుతున్నారు. సమీపంలో చెరువు ఉండటంతో గ్రాస్ ప్లాంటేషన్ ప్రాంతానికి తరచూ వన్యప్రాణులు మే త, నీటి కోసం వస్తుంటాయి. ఈ క్రమంలో శనివా రం ఇక్కడికి వచ్చిన చుక్కల దుప్పులను ఊర కుక్కలు తరిమాయి. ఈ క్రమంలో ఓ చుక్కల దుప్పి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో పడింది. స్థానికులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు తాళ్ల సాయంతో దానిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చుక్కల దుప్పికి పశువైద్యాధికారులు చికిత్స అందించినా మృతి చెందింది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి అటవీ ప్రాంతంలో దానిని ఖననం చేశారు. -
నాన్నే నాకు హీరో..
జైనథ్: ‘మాది జైనథ్ మండలంలోని కూర గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి మా నాన్న అల్లూరి నర్సింగ్రెడ్డి నన్ను, మా చెల్లె రిచాను ఎంతో కష్టపడి చదివించారు. ఎంత కష్టం వచ్చినా వ్యవసాయం మానుకోలేదు. అహర్నిశలు శ్రమిస్తూ మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. సాధారణ రైతు అయినప్పటికీ చదువు విలువ తెలిసి ఆయన నాకు చదువు ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రోత్సహించాడు. నేను ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. 2021లో కానిస్టేబుల్ ఉద్యోగం మూడు మార్కుల తేడాతో చేజారినప్పటికీ కుంగిపోలేదు. నాన్న ఇచ్చిన ఽధైర్యంతో 2023లో మరోసారి ప్రయత్నించి సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం భీంపూర్ మండలంలోని పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను. మమ్మల్ని ఇంతటివారిని చేసిన నాన్నే నాకు హీరో..’ అంటున్నాడు అఖిల్రెడ్డి -
రక్తదానానికి ముందుకు రావాలి
మంచిర్యాలటౌన్: రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న బ్లడ్బ్యాంకులో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల పోలీసుశాఖ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడేందుకు, తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఎక్కించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఏఎస్ఐ జి.నందయ్య, రెడ్క్రాస్ సెక్రెటరీ చందూరి మహేందర్, డాక్టర్ శరత్బాబు, రెడ్క్రాస్ కోశాధికారి కె.సత్యపాల్రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, యెడ్ల కిషన్, కే.సంతోశ్కుమార్, ఎం.సత్యనారాయణరెడ్డి, చుంచు శంకర్వర్మ, బి.సత్యనారాయణరావు, రక్తనిధి వైద్యులు డాక్టర్ ప్రియాంక సక్సేనా, డాక్టర్ కే.సురేశ్, డాక్టర్ స్పందన పాల్గొన్నారు. -
జన్నారం ఎఫ్డీవోగా రామ్మోహన్
● ఉత్తర్వులు జారీ చేసిన పీసీసీఎఫ్ ● 20 నెలల తర్వాత నియామకం జన్నారం: కవ్వాల్ టైగ ర్ రిజర్వులోని మంచి ర్యాల జిల్లా జన్నారం ఫారెస్టు డివిజల్ అధికా రి(ఎఫ్డీవో)గా ఎం.రా మ్మోహన్ను నియమి స్తూ రాష్ట్ర ముఖ్య అట వీశాఖ అధికారి(పీసీసీఎఫ్) సి.సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రామ్మోహన్ హైదరాబాద్లోని దూలపల్లి శిక్షణ అకాడమీలో రేంజ్ ఆఫీసర్ హోదాలో ఉంటూ కోర్సు డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10మంది సీనియర్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించగా.. ఇందులో రామ్మోహన్ను పదోన్నతితో ఎఫ్డీవోగా నియమించారు. గత 2023అక్టోబర్లో ఇక్కడ ఎఫ్డీవోగా పనిచేసిన ఎస్.మాధవరావును హైదరా బాద్లోని రాష్ట్ర ముఖ్య అటవీశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. అప్పటి నుంచి 20నెలలుగా మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆశిష్సింగ్ అ దనపు బాధ్యతలతో ఇన్చార్జి ఎఫ్డీవోగా ఉన్నారు. ఎట్టకేలకు రామ్మోహన్ను జన్నారం ఎఫ్డీవోగా నియమించారు. -
ఐదు సార్లు విఫలమైనా వెన్నుతట్టారు
మాది ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామం. నాన్న సత్యనారాయణ జర్నలిస్టు. చిన్నప్పటి నుంచి ఆయనే నాకు స్ఫూర్తి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను ఐఆర్ఎస్గా ఎంపికయ్యానంటే అది నాన్న అందించిన ప్రోత్సాహమే. చదువు ప్రాధాన్యతతో పాటు ఎన్నికష్టాలు ఎదురైనా లక్ష్యసాధనను మాత్రం వీడొద్దని ఆయన నుంచే నేర్చుకున్నా. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇంద్రవెల్లిలో చదివాను. 6నుంచి 10 వరకు కాగజ్నగర్ జవహర్ నవోదయలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్లో పూర్తిచేశా. ఐఐటీ గౌహతిలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్కు సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలో 12 మార్కులతో వెనుకబడ్డాను. రెండో ప్రయత్నంలో మెయిన్స్ కూడా రాలేదు. ఇలా ఐదు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఆరో ప్రయత్నంలో ఢిల్లీలో కోచింగ్ తీసుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అయినా నా చదువు, భవిష్యత్తు విషయంలో నాన్న ఎప్పుడూ రాజీ పడలేదు. అనునిత్యం నాలో ఆత్మవిశ్వాసం నింపుతూ ప్రోత్సహించారు. పరీక్షలు రాసే సమయంలో భోజనం కూడా చేయకుండా ఓపికగా సెంటర్ వద్దే బయట వేచి ఉండేవారు. ఆరో ప్రయత్నంలో 790వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం నాగ్పూర్లోని ఐఆర్ఎస్ శిక్షణ సంస్థలో ఇన్కంటాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా శిక్షణ పొందుతున్నా. ఇది ముమ్మాటికీ మా నాన్న అందించిన విజయమే. – శుభం రేకుల్వర్, ఐఆర్ఎస్ -
పెద్దగా చదువుకోకపోయినా..
సాత్నాల: భోరజ్ మండలం ఆకోలి గ్రామానికి చెందిన మునిగెల విఠల్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇంటర్ వరకు విద్యనభ్యసించాడు. తనకున్న బరువు, బాధ్యతలతో పైచదువులు కొనసాగించలేకపోయాడు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు శ్రీనివాస్, రెండోవాడు వినోద్. పిల్లలు ఉన్నత స్థానాల్లో చూడాలని తపించేవాడు. వారిని ప్రోత్సహించేవాడు. నాన్న కలను నెరవేర్చుతూ శ్రీనివాస్ జూనియర్ లెక్చరర్, వినోద్ డాక్టర్ అయ్యారు. ప్రోత్సాహం వెలకట్టలేనిదిమా నాన్న బాల్యం నుంచే చదువు ప్రాముఖ్యత, మంచి తనం, మానవత్వం, విలువల గురించి మాకు నేర్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే లెక్చరర్ ఉద్యోగం సాధించి ప్రస్తుతం ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్నాను. నాన్న ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్న. – మునిగల శ్రీనివాస్, జూనియర్ లెక్చరర్ నాన్న చూపిన బాటలో నడుస్తా మనం చదువుకున్న చదువు పదిమందికి ఉపయోగపడాలనేది నాన్న ఆశయం. ఆయ న చూపిన మార్గంలోనే కష్టపడి డాక్టరేట్ సాధించాను. పేద ప్రజలు, గ్రామస్తులకు ఉచిత వైద్యమందించాలనేది నాన్న కల. నాన్న చూపిన మార్గంలో నడుస్తూ చేతనైనంత సాయం చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం ఈ ఎస్ఐ రామచంద్రపురంలో పని చేస్తున్న. – డాక్టర్ వినోద్, ఎండీ జనరల్ మెడిసిన్ -
నిత్యస్ఫూర్తి..
నిర్మల్: మా నాన్న నాళం సాయన్న అంటే.. ఫిజిక్స్ లెక్చరర్గా అందరికీ తెలుసు. జూనియర్ లెక్చరర్గా సేవలందించి, ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా.. మా గురించి రోజూ ఆలోచించేవారు. తన తపనకు తగ్గట్లుగా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. నన్ను డాక్టర్ను చేసిన నాన్న ఇప్పటికీ ఆస్పత్రిలో నిత్యం సహకరిస్తున్నారు. నేను నా పిల్లలతో ఎలా ఉండాలోనన్న నిత్య స్ఫూర్తినిస్తున్నారు. – నాళం శశికాంత్, జనరల్ సర్జన్, నిర్మల్నాన్న స్ఫూర్తితోనే.. నిర్మల్: ‘మెదడుకు పదును’ అంటూ చిన్నప్పుడు నాన్న నాకిడి గంగన్న మాకు అందుబాటులో ఉంచిన పుస్తకాలు, తను చెప్పిన మాటలే ఇవ్వాళ్ల ఐఆర్ఎస్ అధికారిని చేశాయి. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్గా నాన్న అడ్మినిస్ట్రేషన్ను దగ్గరుండి చూశాను. అంత బిజీగా ఉంటున్నా.. నాన్న మా గురించి నిత్యం ఆలోచించేవారు. తన స్ఫూర్తితోనే సివిల్స్లో ఆలిండియా 293ర్యాంక్ సాధించగలిగాను. ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో కస్టమ్స్ అండ్ సీజీఎస్టీ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నాన్న ఆదర్శాలు నిత్యం నన్ను నడిపిస్తూనే ఉంటాయి. – నాకిడి సృజన్, అడిషనల్ కమిషనర్, కస్టమ్స్ అండ్ సీజీఎస్టీ, గుజరాత్ -
నాన్న రెక్కల కష్టం.. కూతుళ్ల చదువులకే..
తాంసి: మండలంలోని వడ్డాడి గ్రామానికి చెందిన చింతల పురుషోత్తం–మమత దంపతుల కు ఇద్దరు కూతుళ్లు మధుమిత, మనస్విత సంతానం. పురుషోత్తం తననుకున్న ఎకరంలో వ్య వసాయం చేస్తూ, గొర్రెలు కాస్తూ జీవనాన్ని కొ నసాగిస్తున్నాడు. కుటుంబం గడవడానికి, ఇద్ద రు ఆడపిల్లలను ప్రయోజకులుగా చేయడానికి చాలా కష్టపడి చదివించాడు. తను కష్టపడి సంపాదించిన మొత్తాన్నంతా పిల్లల చదువుకే ఖ ర్చు చేస్తున్నాడు. పెద్ద కూతురు మధుమిత ఉ స్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చే సి ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగాల కోసం నంద్యాలలో కోచింగ్ తీసుకుంటోంది. చిన్న కుమార్తె మనస్విత ఎలాంటి కోచింగ్ లేకుండా మూడేళ్ల క్రితం 2వేల ర్యాంక్ సాధించి మద్రాస్ ఐఐటీలో సీఎస్ఈ విభాగంలో సీటు సాధించి ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతోంది. పేద కుటుంబమైనప్పటికీ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్న పురుషోత్తం నాన్నలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
నాన్న.. సేవ..
● తండ్రి యాదిలో చారిటబుల్ ట్రస్టులు ● సామాజిక కార్యక్రమాలతో ముందుకు.. మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన మల్యాల శ్రీపతి తండ్రి రాజయ్య 2007లో చ నిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం సేవ చేయాలని శ్రీపతి ఆలోచించాడు. ఓసారి తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం అవసరం కావడంతో దానం చేశాడు. ఆ తర్వా త 2013లో తండ్రి పేరిట మల్యాల రాజయ్య వెల్ఫేర్ సొసైటీ, 2024లో మల్యాల చారిటబు ల్ ట్రస్టు ఏర్పాటు చేసి రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 55 సార్లు రక్తదానం చేశాడు. రక్తం అవసరమని ఎవరైనా అడిగిన వెంటనే ట్రస్టు ద్వారా సమకూరుస్తుంటారు. మహిళలు ముందుకు రావా లనే ఉద్దేశంతో తన సతీమణి సుష్మతో ఆరుసార్లు రక్తదానం చేయించాడు. పట్టణానికి చెందిన దివ్యాంగుడు, మరో ఇద్దరు వృద్ధురాళ్లకు ప్రతీ మూడు నెలలకోసారి 25కిలోల బియ్యం అందిస్తున్నాడు. ● దుర్గం రాజేశ్ తన తండ్రి పేరిట దుర్గం పోచం చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నాడు. పాత మంచిర్యాలకు చెందిన దుర్గం పోచం కౌన్సిలర్గా పని చేస్తూ చని పోయాడు. 2020లో దుర్గం పోచం చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశాడు. స్కూల్ పిల్ల లకు యూనిఫాం, అనాథాశ్రమానికి బి య్యం అందజేశాడు. సరస్వతీ శిశుమందిర్లో ఓ పేద విద్యార్థికి ఏడాది పాటు ఫీజు చెల్లించాడు. రాళ్లపేట్ రోడ్ నంబర్–1లో శివపంచాయతన ఆలయానికి తన తండ్రి పేరిట స్థలాన్ని అప్పగించి ఆదర్శంగా నిలి చాడు. పేదల కుటుంబాల్లో వివాహాలకు ఆర్థికసాయం, కళాకారులు, క్రీడాకారులకు పోటీల సమయంలో ఆర్థికసాయం, బహుమతులు అందజేస్తున్నాడు. -
క్షయ వ్యాధి నివారణ సులువు
బెల్లంపల్లి: క్షయ వ్యాధిని సత్వరంగా నిర్ధారించడం వల్ల నివారించడం తేలికవుతుందని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుధాకర్నాయక్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ రడగంబాలబస్తీలోని బస్తీ దవాఖానలో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని తెలిపారు. అనంతరం శిబిరానికి హాజరైన ప్రజలకు పలు రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సహన, సుచరిత, సౌజన్య, రామకృష్ణ, జుబేర్ హుస్సెన్, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సురేందర్, క్లినికల్ సర్వీసు అధికారి రాజేష్, టీబీ సూపర్వైజర్ శశికాంత్ పాల్గొన్నారు. -
అనుక్షణం అండగా నిలిచారు..
మాది తలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన పల్సి(బి)తండా. నాన్న జాదవ్ గోవింద్ రావు హెడ్ కానిస్టేబుల్. మా ఊరిలో తొలి ప్రభు త్వ ఉద్యోగి నాన్నే. చదువుతోనే గొప్ప భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి. చిన్నతనం నుంచే నాకు విద్యా ప్రాధాన్యతను వివరించారు. ఒకటి నుంచి ఐదు వరకు ఉట్నూర్లో, ఆరు నుంచి పదో తరగతి వరకు కాగజ్నగర్ నవోదయలో చదివాను. ఇంటర్ హైదరాబాద్లో, తిరుచ్చి ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా ను. నాన్న పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో జిల్లాకు వచ్చిన ఎస్పీ, కలెక్టర్ల గొప్పతనం, వారికి సమాజంలో ఉండే గౌరవం గురించి చెప్పేవారు. ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించేవారు. దీంతో బీటెక్ పూర్తికాగానే ఐఏఎస్ సాధించాలని నిర్ణయించుకున్నాను. తొలి నాలుగు ప్రయత్నాల్లో విఫలమయ్యాను. ఐదో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికై నా అందులో చేరలేదు. 2024లో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణలో ఉన్నా. పోలీస్ ఉద్యోగమంటే సెలవులుండేవి కావు. కానీ నేను పరీక్షలు రాసే సమయంలో నాన్న నా వెంటే ఉండేవారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అనుక్షణం నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన పడిన కష్టం, అందించిన మార్గదర్శనంతోనే నేను విజయం సాధించగలిగాను. – జాదవ్ సాయి చైతన్య, ఐఏఎస్ -
నాన్న కష్టమే ఎస్సైని చేసింది
జన్నారం: నాన్నంటే నడిపించే దైవమంటున్నారు జన్నారం ఎస్సై గొల్లపెల్లి అనూష. ‘కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామానికి చెందిన గొల్లపెల్లి తిరుపతి, పుష్పలత దంపతులకు మేము నలుగురు ఆడపిల్లలం. మాది మధ్య తరగతి కుటుంబం. ఆడపిల్లలమని అధైర్య పడకుండా నాన్న నలుగురిని చదివించారు. అందరూ డిగ్రీ పూర్తి చేయగా నేను మాత్రం బీటెక్ పూర్తి చేశాను. మా అందరికీ వివాహాలు, కాన్పులు చేశారు. నేను కష్టపడి ఎస్సై ఉద్యోగం సాధించాను. నాన్న కష్టపడి చదివించడంతోనే నేను ప్రయోజకురాలిగా ఈ రోజు ఉద్యోగం చేస్తున్నాను. మమ్ములను చదివించేందుకు నాన్న దుబాయ్ వెళ్లేవారు. మాకు వివాహాలు చేసిన తర్వాత కూడా అప్పులు తీర్చడం కోసం ఇంకా దుబాయ్ వెళ్తూనే ఉన్నారు. రెండేళ్లకోసారి మా కోసం ఇక్కడికి వస్తూ తిరిగి వెళ్తుంటారు. ఆయన కష్టమే మమ్ములను ప్రయోజకులుగా చేసింది’ అంటున్నారు అనూష. -
రెడ్క్రాస్ సొసైటీకి అవార్డులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి అరుదైన అవార్డు లభించింది. రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని రాజ్భవన్లో ఉన్న సంస్కృతి కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ సొసైటీ సభ్యులకు అవార్డు అందజేశారు. స్వచ్ఛంద రక్తదాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రక్తదాన శిబిరాల నిర్వాహకుల కృషితో రాష్ట్రంలోనే అత్యధిక రక్త నిల్వలు సేకరించడంలో రెండోస్థానంలో నిలవడంతో అవార్డు దక్కింది. దీంతోపాటు రక్తదాన శిబిరంలో ఎక్కువ మంది స్వచ్ఛంద రక్తదాతలను సేకరించడం, ప్రభుత్వ రంగ సంస్థ కేటగిరీలో రామగుండం పోలీసు కమిషనరేట్, ప్రైవేటు రంగ సంస్థ కేటగిరీలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ దేవాపూర్లకు అవార్డులు అందజేశారు. మంచిర్యాల రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్రెడ్డిని అభినందించారు. -
పట్టుబట్టి.. కొలువు కొట్టాడు
● అసిస్టెంట్ కమాండెంట్గా అభినవ్వర్మదండేపల్లి: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు మండలంలోని నెల్కి వెంకటాపూర్కు చెందిన పెట్టెం అభినవ్వర్మ. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తండ్రి లచ్చన్న ప్ర భుత్వ ఉపాధ్యాయుడు. అభినవ్వర్మ పదోతరగ తి వరకు మంచిర్యాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు. ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ ఐఐటీ జోదాపూర్లో పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గతంలో కంబైండ్ డిఫెన్స్ సర్వీస్ లో ఉద్యోగం కోసం నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. యూపీఎస్సీ నిర్వహించిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) ఉద్యోగానికి గతంలో ఒకసారి ప్రయత్నించి ఫెయిలయ్యాడు. అయినా ఏమాత్రం కుంగిపోకుండా ప ట్టువదలని విక్రమార్కుడిలా క ష్టపడ్డాడు. మళ్లీ కసితో చదివా డు. గతేడాది నోటిఫికేషన్ విడుదల కాగా ఆగస్టులో నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ కనబరిచి క్వాలిఫై అయ్యాడు. ఫిజి కల్ ఫిట్నెస్, మెడికల్, ఇంట ర్వ్యూ అన్నింటా పాస్కావడంతో 138వ ర్యాంక్ సాధించి సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉ ద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబీకులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, పలువురు అతడిని అభినందించారు. -
నాన్న కష్టానికి ఫలితంగా డాక్టర్లమయ్యాం
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన చిరువ్యాపారి సిద్దంశెట్టి ప్రవీణ్, మధుశ్రీ దంపతులకు కుమారుడు ప్రీతమ్, కుమార్తె అశ్వీత సంతానం. తన పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. చేసేది చిరువ్యాపారమైనా ఇద్దరు పిల్లలను వైద్యులను చేశాడు. తండ్రి ఆశలకు అనుగుణంగా కుమారుడు ప్రీతమ్కుమార్ యూకేలో పీజీ సర్జన్ చేస్తుండగా.. కుమార్తె ఆశ్వీత ఎంజీఎంలో హౌజ్ సర్జన్గా చేస్తోంది. తమ భవిష్యత్ కోసం నాన్న పడిన శ్రమ.. ఆర్థిక కష్టాలు, అన్నీఇన్నీ కావంటున్నారు సిద్దం శెట్టి ఆశ్వీత. ‘నాన్న చదువులో ఎంతో ప్రోత్సహించేవారు. అన్నయ్య ప్రీతమ్తో సమానంగా నన్ను చదివించారు. లోనవెల్లి గ్రామంలో మా నాన్నమ్మకు వైద్యం అందక పడిన ఇబ్బందులు కళ్లారా చూశాం. అప్పుడే డాక్టర్లం అవుతామని నాన్నకు చెప్పాం. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డం వస్తాయని అనుకున్నప్పటికీ నాన్న వెన్నంటి ప్రోత్సహించారు. నాన్న కల నిజం చేసి అన్నయ్య, నేను డాక్టర్లయ్యాం’ అని ఆశ్వీత గర్వంగా చెబుతున్నారు. -
● గమ్యం నిర్దేశించి.. దిక్సూచిగా నిలిచి ● లక్ష్యసాధనలో ఆ త్యాగం అనిర్వచనీయం ● నేడు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం
– మరిన్ని కథనాలు 8లోuనాన్న.. రెండక్షరాల పదమే అయినా ప్రతీ ఒక్కరి జీవితంలో విడదీయరాని బంధం. బాల్యంలో వేలుపట్టి నడక నేర్పే తొలిగురువుగా.. తప్పట డుగులు సరిదిద్దే మార్గదర్శిగా.. లక్ష్యసాధనలో దిక్సూచిగా నిలిచే ఆ స్ఫూర్తి ప్రదాత పాత్ర అనిర్వచనీయం. కనుపాపలను తీర్చిదిద్దే ఆ కనురెప్పల మాటున కనిపించని త్యాగాలెన్నో. బిడ్డల విజయ తీరాన అది ఆనంద బాష్పమై వికసిస్తోంది. జీవిత పయనంలో బాధలెన్ని ఎదురైనా పిల్లల వికాసానికి బాటలు వేసే ఆ అలుపెరగని బాటసారికి సలాం చేయాల్సిందే. తాను సాధించని విజయాలను వారి రూపంలో చూసుకుని మురిసిపోయే ఆ ప్రేక్షకుడికి నీరాజనం పలకాల్సిందే. ఉన్నతస్థాయికి ఎదిగిన తమ విజయంలో ఆయనదే అగ్రస్థానమంటున్నారు ఆ బిడ్డలు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ సక్సెస్లో నాన్న పాత్రపై పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – కైలాస్నగర్ -
జీవిత గమ్యాన్ని నిర్దేశించారు
మాది రాజస్థాన్లోని సవాయి మాదాపూర్ జిల్లా మలర్నా చౌర్ గిరిజన గ్రామం. నాన్న సీతారాం మీనా. డీపీఆర్వోగా పనిచేశా రు. 1నుంచి 7వరకు హిందీ మీడియంలో, 8 నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను. బీహెచ్యూలో ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. నాన్న నాకు బాల్యం నుంచే క్రమశిక్షణతో కూడిన జీవిత గమ్యాన్ని నిర్దేశించారు. ఆ దిశగా ప్రోత్సహించారు. ఐఐటీ అనంతరం సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంట్లో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ విషయాన్ని నాకు తెలియనివ్వకుండా చదువుపైనే దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగంతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంటుందని చెప్పేవారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేఽసేవారు. సివిల్స్లో ఐదు సార్లు నిరాశ ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే దిశగా మరింత కష్టపడాలని వెన్నుతట్టారు. ఆ ప్రోత్సాహంతోనే ఆరో ప్రయత్నంలో 458వ ర్యాంకు సాధించాను. ఐఏఎస్గా ఎంపికయ్యా. నా జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో మా నాన్నే నాకు రోల్మోడల్. – యువరాజ్ మర్మాట్, సబ్కలెక్టర్, ఉట్నూర్ తల్లిదండ్రులతో యువరాజ్ మర్మాట్ -
అప్పీళ్లు లేని అంతిమ తీర్పు
మంచిర్యాలక్రైం: లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసులు అప్పీళ్లు లేని అంతిమ తీర్పు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య అన్నారు. జిల్లాలోని వివిధ కోర్టు ప్రాంగణంలో శనివారం ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. మంచిర్యాల లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్లో 37 బ్యాంకు రికవరీ కేసులు, దాదాపు 5,250 కేసులు పరిష్కరించామని తెలిపారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసుల నుంచి విముక్తి పొందాలని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్నాయక్, సీనియర్ సివిల్ జడ్జి రాంమోహన్రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి జీ.కవిత, కే.నిరోష, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజమార్గం లక్సెట్టిపేట: రాజీ మార్గమే రాజమార్గమని జూ నియర్ సివిల్ జడ్జి కాసమల సాయికిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా 552 క్రిమినల్, 2 సివిల్ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ సత్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తన్న, సత్యగౌడ్, ఎస్సైలు సురేష్, శ్రీలత పాల్గొన్నారు.లోక్ అదాలత్లో 1,458 కేసుల పరిష్కారంచెన్నూర్: చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,458 కేసులు పరిష్కారమయ్యాయని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి తెలిపారు. కోర్టు పరిధిలో 1,354 డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్ కేసులు పరిష్కారమయ్యాయని, ఇందులో రూ.6,36,420, బ్యాంక్ కేసులు 37 పరిష్కారం కాగా రూ.23,96,813 జరిమానా విధించామన్నారు. 44 క్రిమినల్ కేసులు, 4 సివిల్ కేసులు పరిష్కారమయ్యాయన్నారు. -
‘నీట్’లో ట్రినిటి ప్రభంజనం
కరీంనగర్: నీట్–2025 ఫలితాల్లో ట్రినిటి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అనేకమంది అత్యు త్త మ మార్కులు సాధించడంతో పాటు, కొందరు టా ప్ 1000ర్యాంకుల్లో చోటు సాధించారు. బీ కార్తిక్(519 మార్కులు), ఎం.మానస (504), ఎం.చంద్రశేఖర్ (501), వై.అశ్విత (488) ఎన్.గౌతమి(471), ఎం.శ్రీకాంత్(470), ఎం.శివప్రసాద్(469), ఎస్.అఖిల్ (469), ఎం.హరిశ్చంద్ర (463), ఎం.అభినయ (461మార్కులు) సాధించారు. బీ కార్తిక్ 736వ ర్యాంక్, ఎం.చంద్రశేఖర్ 1,266వ ర్యాంక్, ఎల్.ప్రతిమ 2,149వ ర్యాంక్, డీ తేజస్విని 2,267వ ర్యాంక్, జే అంజని 4212వ ర్యాంక్, కే మయూక 4,286 వ ర్యాంకులతో జాతీయస్థాయిలో రాణించారు. ట్రి నిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి మా ట్లాడుతూ.. తమ విద్యార్థుల పట్టుదల, ట్రినిటిలో అందించే శిక్షణ పద్ధతులు, మెరుగైన విద్యా వాతావరణం ఈ గొప్ప విజయానికి కారమన్నారు. ఈ విజయం ట్రినిటిని దేశంలోని అత్యుత్తమ మెడికల్ శిక్షణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టిందన్నారు. -
ఉపాధి కల్పనకు కృషి
కార్మిక, గనుల శాఖల మంత్రిగా సింగరేణి సంస్థ, కార్మికుల విషయంలో మీ ప్రణాళికలు ఏంటి?మంత్రి: సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా గనులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఓపెన్ కాస్ట్ల కంటే భూగర్భ గనులతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆ దిశగా సింగరేణి యాజమాన్యంతో చర్చించి స్థానికులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకుంటా.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మికులకు సౌకర్యాలు, యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, కార్మిక, గనుల శాఖ కేటాయింపు తర్వాత శనివారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన వివేక్వెంకటస్వామికి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వివిధకార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపారు. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి, అన్నయ్య వినోద్, ఆ తర్వాత తనకు కార్మిక శాఖ మంత్రిగా పని చేసే అవకాశం దక్కిందని గుర్తు చేశారు. సింగరేణి సంస్థతో మరిన్ని కొత్త గనులు ప్రారంభించి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంత్రిగా మీ ప్రాధాన్యతలు ఏంటి?మంత్రి: చెన్నూరు నియోజకవర్గంలో ఇన్నాళ్లు సరిగా రోడ్లు కూడా లేకుండే. ప్రజలు ఇబ్బంది పడొద్దని ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు మొదలుపెట్టాను. పట్టణాలకు తాగునీటి సమస్య లేకుండా అమృత్స్కీం కింద ఇంటింటికీ స్వచ్ఛనీరు అందిస్తాను. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్చుతాను. సాగునీటి ప్రాజెక్టులతో రైతులకు నీటి వసతులు కల్పించేందుకు కృషి చేస్తాను. దళితులకు ఉపాధి కల్పించే మందమర్రిలోని తోళ్ల పరిశ్రమను తెరిపిస్తారా?మంత్రి: రాష్ట్ర లెదర్ కార్పొరేషన్కు ప్రస్తుతం చైర్మన్ లేరు. నియామకం కావాల్సి ఉంది. ఇ ప్పటికే తోళ్ల పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పన కోసం శిక్షణ, యువతకు అవకాశాలపై అధికా రులతో చర్చించా. అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కలిగేలా చేస్తా. మందమర్రి పట్టణానికి ఎన్నికలు నిలిచి ఏళ్లుగా పెండింగ్లో ఉంది? మంత్రి: మందమర్రి పట్టణానికి ఎన్నికలు ని ర్వహించేందుకు కృషి చేస్తున్నాను. సుప్రీంకో ర్టులో కేసు ఉన్నందున అడ్వకేట్ జనరల్ను క లసి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాను. త్వరలోనే సమస్య పరిష్కారం చేసేలా ప్రయత్నిస్తా. చెన్నూరుపై ప్రత్యేక దృష్టి సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించాలి ‘సాక్షి’తో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి -
అభివృద్ధి పనుల పూర్తికి కృషి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం విశ్వనాథ ఆలయం వద్ద దుకాణాల కూల్చివేతను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు, అధికారుల సహకారంతోనే ఆలయ అంతర్భాగంలో ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని రోడ్ల వెడల్పు, ఐటీ పార్కు, నిర్మాణ పనులను లక్ష్మీటాకీస్ నుంచి రంగంపేట వరకు ఫోర్లేన్ రోడ్డు నిర్మాణాలు, పట్టణంలో మాతాశిశు ఆసుపత్రి పనులను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఐదారు నెలల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. -
మంత్రివర్యా సమస్యలు ఆలకించరూ..!
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా శనివారం చెన్నూర్కు వస్తుండడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నా పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. సింగరేణి పారిశ్రామిక, వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో తాగు, సాగునీరు, వైద్య సమస్యలతో సతమతం అవుతున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు లేక ఉపాధి కోసం యువత నగరాలకు వలస వెళ్తున్నారు. నియోజకవర్గం చుట్టూ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నా ఎత్తిపోతల పథకాలు లేక సాగు, తాగునీటికి ప్రజలు తండ్లాడుతున్నారు. ఇంటింటికీ తాగునీటి సరఫరాకు మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మండలాల వారీగా.. ● చెన్నూర్లో స్కిల్ డెవలప్మెంటు సెంటర్ ఏర్పాటు చేయాలి. ● చెన్నూర్ మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయానికి పక్కా భవనం ● వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలి. ● అమృత్ 2.0 పనులు పూర్తి చేయించాలి. ● చెన్నూర్లోని 50 పడకల ఆస్పత్రిలో పూర్తి స్థాయి సిబ్బంది, పరికరాలు సమాకూర్చాలి. ● భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్ట్కు పిల్ల కాలువలు నిర్మిస్తే మరో 2500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ● కోటపల్లి మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ● పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు పూర్తి చేయాలి. ● మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి. ● పెండింగ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కేసీ ఆర్ పార్క్, ఇతర పనులు పూర్తి చేయించాలి. ● మందమర్రిలో ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ● జైపూర్లోని పవర్ ప్లాంటు ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. ● శివ్వారం మొసళ్ల కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. వివేక్కు అమాత్య పదవితో అభివృద్ధిపై ఆశలు పెండింగ్ పనులు పూర్తయ్యేనా..! చెన్నూర్లో వంద పడకల ఆస్పత్రి 50పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత -
తప్పించారా.. తప్పుకున్నారా!
● ‘జిల్లా ఇన్చార్జి మంత్రి’పై సర్వత్రా చర్చ ● హాట్టాపిక్గా సీతక్క మార్పు ● గతంలోనే ఆమైపె ‘మీనాక్షి’కి ఫిర్యాదు ● అప్పట్లోనే తప్పుకుంటానన్న మినిస్టర్ ● తాజాగా ఆమె నిజామాబాద్కు.. అక్కడి నుంచి ‘జూపల్లి’ ఇక్కడికిసాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ఆ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక ఆమే తప్పుకున్నారా.. అనే చర్చ ప్రస్తుతం పార్టీలో సాగుతోంది. హైదరా బాద్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల సందర్భంగా కొంతమంది నియోజకవర్గ ఇన్చార్జిలు సీతక్క తమను పట్టించుకోవడం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు అప్పట్లో ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. అప్పుడే తాను జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆమె మీనాక్షి ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా నియమించారు. అక్కడి నుంచి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి ఆదిలాబాద్కు ఇన్చార్జిగా కేటాయించారు. ప్రస్తుతం పార్టీలో ఈ నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జూపల్లి ఇక్కడి నేతలను సమన్వయం చేస్తూ పార్టీ విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీతక్కకు కలిసిరాని ఎన్నికలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్కకు ఆదిలాబాద్ పార్లమెంట్, పట్టభద్రుల, ఉ పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి పనితీరుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎన్నికల ప్రణాళిక సరిగా రూపొందించడంలో సీతక్క ఫెయి ల్ అయిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా నియోజకవర్గాల్లో సీనియర్ నేతల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో ఆమె సమన్వయం చేయలేకపోయారనే అపవాదు వ్యక్తమైంది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరగడం కూడా పార్టీ ఓటమికి కారణమయ్యాయని చర్చ సాగింది. ఇదే విషయంలో మీనాక్షి నటరాజన్ పార్టీ ఓటమికి కారణాలపై ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ప్రధానంగా విశ్లేషించారు. అంతేకాకుండా ఇటీవల హైదరా బాద్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అ సెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలను ఒక్కొక్కరి నుంచి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాతనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మార్పు ఖాయమనే ప్రచారం సాగింది. తాజాగా అదే జరిగింది.వీటిపై ప్రభావం పడేనా..పార్టీ పరంగా ప్రస్తుతం పట్టణ, మండల, బ్లాక్ కమిటీలతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. కమిటీలకు సంబంధించి ఇప్పటికే ప్రతి మండలం, పట్టణంలో సమావేశాలు నిర్వహించి ఐదేసి పేర్లను అధిష్టానానికి నివేదించారు. అది ఖరారు కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈనెల చివరిలో డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పోస్టు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక మంచిర్యాలకు కొక్కిరాల సురేఖ, నిర్మల్కు శ్రీహరిరావు, కుమురంభీం ఆసిఫాబాద్కు విశ్వప్రసాద్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ నెలలో కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనుండగా, కొత్త ఇన్చార్జి మంత్రి రానుండడంతో వీటిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది పార్టీలో అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కొత్త ఇన్చార్జి మంత్రికి సవాల్ఉమ్మడి జిల్లాకు కొత్త ఇన్చార్జి మంత్రిగా రానున్న జూపల్లికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే ఆయన ముందున్న ప్రధాన సవాలు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో నాలుగు చోట్ల బీజేపీ, రెండు చోట్ల బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ప్రాతి నిధ్యం ఉంది. మిగతా నియోజకవర్గాల్లో అప్పట్లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినవారు నియోజకవర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జూపల్లి ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సిందే. -
● ఏటా ఉమ్మడి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ● పంట చేన్లలో మరణాలు, జీవాల మృత్యువాత ● అవగాహన లేక పెరుగుతున్న ముప్పు
జాగ్రత్త మరవద్దుఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప డుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ము ప్పు తప్పించుకోవచ్చు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలు వినిపిస్తే వెంటనే అక్కడ నుంచి దూరంగా వెళ్లాలి. పంట చేన్లలో ఉన్నప్పుడు వీలైనంత తొందరగా ఇళ్ల కు చేరుకోవాలి. సమీపంలో ఉన్న నివాస స్థలాలకు వెళ్లాలి. ఇళ్లలో విద్యుత్ పరికరాలు వినియోగించరాదు. సెల్ఫోన్లు, చార్జింగ్ చే యడం, ఐరన్, వాటర్ హీటర్లు, గీజర్లు వాడరాదు. ఇళ్లకు లైటనింగ్ కండక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి.గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో పిడుగు పడిన ప్రదేశం(ఫైల్)సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా పిడుగుపాటుకు ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అధికంగా పంట చేన్లలో పని చేస్తుండగానే మృత్యువాత పడుతున్న ఘటనల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కోసారి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు చనిపోతుండడం తీరని విషాదాన్ని మిగుల్చుతోంది. పేద, మధ్య తరగతి రైతు కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. బాధిత కుటుంబాలకు కోలుకోలేని నష్టం జరుగుతోంది. వానా కాలంలో పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ప్రతీ సీజన్లో అనేకమంది తమ జీవాలను కోల్పోతున్నారు. పిడుగుపాటుపై చాలామందికి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదు. ఎక్కువగా చేన్లలో పని చేస్తున్నసమయంలోనే నష్టం జరుగుతోంది. పంట చేన్లలో పని చేసే రైతులు మ రింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిడుగు అంటే.. ఆకాశంలో సహజసిద్ధంగా ఏర్పడే విద్యుత్పాతమే పిడుగుగా పేర్కొంటారు. సూర్యరశ్మి అధికంగా తాకి, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి వెళ్లి, అధిక బరువున్న రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. ఈ రెండింటి మధ్య దూరం పెరిగితే ధనావేశం గాలి కోసం భూమి వైపు రుణావేశా మేఘాలు వచ్చే క్రమంలో శక్తివంతమైన విద్యుదుత్పాతం ఏర్పడుతుంది. దీనినే పిడుగు అంటారు. ఒక్కో పిడుగు వేల డిగ్రీల సెల్సియస్ శక్తిని విడుదల చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా పిడుగులు పడతాయి. రూ.6లక్షలు పరిహారం గతంలో కేవలం ఆపద్బంధు పథకం కింద నామమాత్రంగానే పరిహారం చెల్లించేవారు. ప్రస్తుతం పిడుగుపాటుకు మరణించిన వారికి రూ.6లక్షలు పరిహారంగా అందజేస్తున్నారు. పిడుగుపాటుతో మరణించినట్లు స్థానిక రెవెన్యూ, వైద్య, పోలీసు అ ధికారులు ధ్రువీకరించాలి. అయితే పరిహారం పొందడంలో కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది. స్మార్ట్ఫోన్లలోనూ.. వాతావరణ మార్పులు ఇప్పుడు స్మార్ట్ఫోన్లలోనూ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్, వాట్సాప్ల్లోనూ అల ర్ట్ పొందవచ్చు. ఐఎండీ(ఇండియన్ మెటీరియలాజిక్ డిపార్ట్మెంట్)తోపాటు పిడుగు పడే ప్రాంతాలను ముందుగానే తెలియజేసే ‘దామిని’తోపా టు ఇతర యాప్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక కేవీకే, వ్యవసాయ, ప్రణాళిక శాఖ అధికారుల వద్ద వాతావరణ పరిస్థితులు ముందస్తుగా తెలుసుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ముందస్తుగా తెలుసుకుంటూ ప్రాణాలతోపాటు ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.చెట్ల కింద ఉండొద్దువర్షం పడితే చాలామంది చెట్ల కింద తడవకుండా ఉండేందుకు వెళ్తుంటారు. అయితే చెట్లు, ఎత్తయిన కొండలు, నీటి నిల్వ ప్రదేశాలు మరింతగా పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉంది. చెట్ల కింద చెరువులు, కాలువల వద్ద ఉండకూడదు. ఒకే చోట అందరూ గుంపులుగా ఉండకూడదు.ఒకే రోజు ఆరుగురుఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్పిరిలో పంట చేనులోనే నలుగురు, బేల మండలం సాంగిరిలో ఇద్దరు మొత్తం గురువారం ఒకే రోజులో ఆరుగురు ప్రాణాలు విడిచారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు. -
చెత్త.. బయోవేస్టేజ్..
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో, బయట అపరిశుభ్రతతో కొత్త వ్యాధులు వచ్చే ముప్పు పొంచి ఉంది. ఆస్పత్రి వెనుకభాగాన బయోవేస్టేజ్ చెత్తతోపాటు ఆస్పత్రిలో వెలువడిన ఇతర చెత్త పేరుకుపోతోంది. వర్షం కురిసినప్పుడు చెత్త తడిసి దుర్వాసన వెదజల్లుతోంది. బయోవేస్టేజ్, సాధారణ చెత్తకు వేర్వేరు గదులున్నాయి. బయోవేస్టేజ్ చెత్తతో గది నిండిపోగా.. దానికి తాళం వేసి బయట పడేస్తున్నారు. సమీపంలో సాధారణ చెత్త షెడ్డు ఉన్నా అందులో వేయకుండా ఆస్పత్రి వెనుకాల ఉన్న సిమెంటు రోడ్డు, ఖాళీ ప్రదేశంలో బయెవేస్టేజ్, చెత్త కలిపి వేస్తున్నారు. ఆస్పత్రికి ప్రతీ రోజు 400వరకు ఓపీ ఉండగా.. వివిధ రోగాలతో వార్డుల్లో చికిత్స పొందుతున్న వారు 250మంది ఉంటారు. రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్బ్యాంకుకు నిత్యం తలసేమియా, సికిల్సెల్ బాధితులు 20మంది వరకు వస్తుంటారు. చెత్త కారణంగా కొత్త వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
● జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ ● విద్యార్థులకు అక్షరాభ్యాసం జైపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గు ణాత్మక విద్య అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠఽశాల, టేకుమట్ల, కిష్టాపూర్లో ప్రాథమికోన్నత పాఠశాల, అంగ న్వాడీ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు పట్టికలు, రిజిష్టర్లు, తరగతి గదులు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అక్షరా భా స్యం చేయించారు. ఆయా గ్రామాల్లో భూభార తి రెవెన్యూ సదస్సులను తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, రెవెన్యూశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధార్కార్డు కలిగి ఉండాలి నస్పూర్: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో యుఐడీ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ శౌభన్, ప్రత్యేక ఉప పాలానాధికారి డి.చంద్రకళ, ఏసీపీ ప్రకాశ్లతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని అంన్వాడీ కేంద్రాలు, పాఠాశాలలు, వసతిగృహాల్లో పిల్లలను చేర్పించే సమయంలో ఆధార్కార్డు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఏడుగురు అనాథలకు ఆధార్ కార్డు జారీ చేశామన్నారు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ ఒకసారి, పేరు రెండుసార్లు మాత్రమే సవరించుకోవడానికి వీలుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్రావు, డీఈఓ యాద య్య, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ తిరుపతి, ఈ డిస్ట్రిక్ మేనేజర్ సునీల్ పాల్గొన్నారు. -
ఎస్టీపీపీలో కేరళ బృందం పర్యటన
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)ను కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. పవర్ ప్లాంటు, గనుల పనితీరు అధ్యయనంలో భాగంగా సందర్శనకు వచ్చిన వారికి ప్లాంటు జీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో విద్యుత్ ఉత్పత్తి, పనితీరు, ఫ్లోటింగ్ సోలార్, గ్రౌండ్ సోలార్, ఎఫ్జీడీ నిర్మాణ పనితీరును పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎఫ్జీడీ నిర్మాణాన్ని పరిశీలించగా అధికారులు పనితీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు శివప్రసాద్, మదన్మోహన్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు చీఫ్ ఇంజనీర్లు ఎంపీ.రాజన్, వీ.లత, కే.అనిత, డీజీఎంలు కిరణ్బాబు, ఈఈ విష్ణువర్థన్రెడ్డి పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ మృతి
ఇంద్రవెల్లి: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడు మృతి చెందిన ట్లు ఎస్సై సాయన్న తెలిపా రు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. మండలంలోని హర్కపూర్ ఆంద్గూ డ గ్రామానికి చెందిన మస్కే రామేశ్వర్ (25) ఈ నెల 11న ఇంద్రవెల్లికి చెందిన షేక్ సాజిద్తో కలిసి ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్కు వెళ్లాడు. రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో మండలంలోని శంకర్గూడ సమీపంలో ప్రధాన రహదారిపై ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని కా రు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామేశ్వర్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు, కుటుంబ సభ్యులు ఆ దిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ మృతి చెందాడు. తల్లి విమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగు పడి ఎద్దు మృతి నార్నూర్: మండలంలోని తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రకాశ్ అనే రైతుకు చెందిన ఎద్దు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడు గు పడి మృతి చెందింది. వారంరోజుల ముందే విద్యుత్షాక్తో ఒక ఎద్దు మృతి చెందగా.. పిడుగు పడి ఇప్పుడు మరో ఎద్దు మృతి చెందిందని బాధిత రైతు వాపోయాడు. మృతి చెందిన ఎద్దు విలువ రూ.50వేలు ఉంటుందని పేర్కొన్నాడు. బైక్ చోరీ నిందితుల అరెస్ట్ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో బైక్ చోరీలకు పా ల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ట్లు స్థానిక సీఐ ప్రమోద్రావు తెలిపారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ, ముఖరాం చౌరస్తా ప్రాంతాల కు చెందిన భరత్రేణ్వా, కుడుదుల శ్రీనుకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు ఇటీవల చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఐబీ చౌరస్తా వ ద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న స్థానిక సూ ర్యనగర్కు చెందిన గుండేటి రాకేశ్, బొల్లి ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా కుడుదుల శ్రీను కు చెందిన బైక్, భరత్ రేణ్వాకు చెందిన స్కూటీని దొంగిలించినట్లు వారు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రైతులను మోసగించిన వ్యక్తి అరెస్ట్
భైంసాటౌన్: కుభీర్ మండలంలోని జాంగామ్కు చెందిన రైతులను మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్కుమార్ తెలిపారు. శుక్రవా రం పట్టణంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కుభీర్కు చెందిన సంగి శ్రీనివాస్ జల్సాగా తిరుగుతూ, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడేవాడు. కొద్దిరోజులకు కుభీర్ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థకు సీఈవోగా, భైంసాలోని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) సంస్థకు ఏజెంట్గా పని చేస్తున్నాడు. రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి మ్యాక్స్కు విక్రయించి, రైతులకు డబ్బులు చెల్లించేవాడు. ఇలా కొ ద్దిరోజులు రైతులను నమ్మించాడు. ఈ క్రమంలో గ తంలో బెట్టింగ్తో చేసిన అప్పులు తీర్చేందుకు రైతులను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు కుభీర్ మండలం జాంగామ్లో రైతుల నుంచి రూ.13,37,144 విలువైన 690క్వింటాళ్ల మొక్కజొ న్నలు కొని డబ్బులు చెల్లించకుండా పారిపోయా డు. దీంతో రైతులు కుభీర్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కుభీర్లోని పార్డి(బి) ఎక్స్రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించామని తెలిపారు. అతడి నుంచి రూ.9లక్షల నగదు, రిసిప్ట్ బుక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లోకేశ్వరం మండలం మన్మధ్, బామ్ని గ్రామాల్లో 32మంది రైతుల నుంచి 3,685 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసి మో సగించినట్లు తెలిపారు. కేసు విచారణ, నిందితుడిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సీ ఐ నైలు, కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి, నిర్మల్ ఐటీ టీంను ఎస్పీ జానకీ షర్మిల అభినందించినట్లు చెప్పారు. -
రక్తదానం.. ప్రాణదానం
ఇప్పటివరకు 46సార్లు.. పాతమంచిర్యాల: నాది ఏబీ నెగెటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 46సార్లు రక్తదానం చేశాను. కలెక్టర్లు, గవర్నర్ ద్వారా ప్రశంసాపత్రాలు అందుకున్నాను. రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాను. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో నిల్వలు ఉండేలా కృషి చేస్తున్నాను. రక్తదాతలకు ప్రమాద భీమా పాలసీ అందజేస్తున్నాం. – మధుసూధన్రెడ్డి, లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధి ఎవరు ఫోన్ చేసినా వెళ్తా.. పాతమంచిర్యాల: నాకు రక్తదానంపై అవగాహన ఉంది. ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేశా ను. 10 సార్లు ప్లేట్లెట్లు దానం చేశా ను. నాది ఏ నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరు ఫోన్ చేసినా వెళ్లి రక్తం ఇస్తున్నాను. – మహ్మద్ మజార్, జాఫర్నగర్, మంచిర్యాల ● ఆపదలో ‘సామాజిక’ నేస్తాల అండ ● ప్రత్యేక గ్రూపుల ద్వారా బాధితులకు భరోసా ● ప్రాణదాతలుగా నిలుస్తున్న యువత ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పాతమంచిర్యాల/ఆసిఫాబాద్అర్బన్/నిర్మల్ఖిల్లా: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాల్లో వైద్యులు ఒకరి నుంచి రక్తాన్ని సేకరించి మరొకరికి ఎక్కించి ప్రాణాపాయం నుంచి కాపాడుతారు. సికిల్సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతీవారం లేదా ప్రతీ నెల క్రమంతప్పకుండా రక్తం ఎక్కించాల్సిందే. అలాంటి వారికి రక్తదాతలు నిజంగా ప్రాణదాతలే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు తమ రక్తాన్ని దానం చేసి ఇతరుల ప్రాణాలు నిలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో సేవలు ఇలా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లయన్స్ ఇంటర్నేషనల్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు కొ ద్ది సంవత్సరాలుగా రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా, సికిల్సెల్ వ్యాధిగ్రస్తులు, ప్రభుత్వాస్పత్రుల్లోని గర్భిణులు, వివిధ ప్ర మాదాల బాధితులకు అందిస్తున్నారు. అలాగే కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కొన్ని స్వ చ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే శిబిరాల్లో యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తూ పలు వురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతీ శిబిరంలో తప్పనిసరిగా 20నుంచి 50 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రక్తదానం ఆవశ్యకతను మరో నలుగురికి తెలియజేయాలనే సంకల్పంతోనే పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా బాధితులకు చేరువవుతున్నారు. నిర్మల్ జి ల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్ర మోద్కుమార్, బైంసా పట్టణానికి చెందిన యోగేశ్ రక్త గ్రూపుల వారీగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ‘ప్రేరణ యువసేన’ పేరిట బాధితులకు రక్తాన్ని స మకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మందికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలకేంద్రానికి చెందిన మునిగెల శ్రీధర్ శుద్ధోధన్, శ్రీనివా స్, నిర్మల్ జిల్లాకు చెందిన కొప్పుల నవీన్, సాగర్ తదితరులు ‘జైహింద్’ గ్రూపును 2018లో ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా రక్తదానం చేసినట్లు వీరు తెలిపారు. ఎవరు రక్తదానం చేయొచ్చంటే..ఆరోగ్యవంతులుగా ఉన్న 18–60 ఏళ్ల లోపు వారు రక్తదానం చేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెబుతున్నా రు. అయితే.. దీర్ఘకాలిక వ్యాధులు, హెచ్ఐవీ, రక్తపోటు, హైపటైటీస్ ఉన్నవారు రక్తదానం చేయరా దని పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి రక్తదానం చేసిన తర్వాత తిరిగి మూడు నెలలకు మళ్లీ రక్తదానం చేయవచ్చని సూచిస్తున్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనని పేర్కొంటున్నారు. రక్తదానం చేసే సమయంలో ఇతర వ్యాధులు సోకుతాయనే మాటల్లో నిజం లేదని తెలిపారు. అవన్నీ అపోహలేనని చెబుతున్నారు. రక్తదానం ప్రాణదా నంతో సమానమని, పైగా రక్తదానం చేస్తే శరీరంలో ని అవయవాలు సక్రమంగా పనిచేయడంతో పాటు రక్తం శుద్ధి అవుతుందని సూచిస్తున్నారు.అత్యవసరాల్లో తప్పకుండా చేస్తా పాతమంచిర్యాల: నాది ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం. అత్యవసర సమయాల్లో ఏ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చినా రాత్రి, పగలు అనే తేడా లేకుండా వెళ్లి రక్తదానం చేస్తున్నాను. రక్తం అవసరమైనపుడు బ్లడ్బ్యాంక్ వారు సమాచారమిచ్చినా వెంటనే వెళ్లి రక్తం ఇస్తున్నాను. – నంది రాజేంద్రప్రసాద్, ఇటిక్యాల 25 ఏళ్లుగా ఇస్తున్న పాతమంచిర్యాల: నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఇప్పటివరకు 80 సార్లు రక్తదానం చేశాను. పుట్టినరోజు, అయ్యప్ప దీక్ష తీసుకునే రోజు తప్పనిసరిగా రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తం ఇస్తాను. నా స్నేహితులతో కూడా రక్తదానం చేయిస్తున్నాను. రక్తదానం.. మహాదానం. – పెద్దపల్లి లక్ష్మీకాంత్ పదేళ్లుగా సేవలో.. పాతమంచిర్యాల: పదేళ్లుగా రక్తదా నంపై అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు 2,600 మందికి రక్తదానం చేయించా ను. అత్యవసర వేళల్లో దాతలను పిలిపించి రక్తం ఇప్పిస్తున్నాను. – అబ్దుల్ రహీం, రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ, మంచిర్యాల సేవలోనే సంతృప్తి భైంసాటౌన్: ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని భావించాం. ఇందుకు ఐక్య త సేవాసమితి గ్రూపును ఏర్పాటు చేశాం. రక్తదానం చేస్తున్నాం. ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తం అవసరమైన వారికి వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నాం. – యోగేశ్, ఐక్యత సేవాసమితి అడ్మిన్, భైంసావెంటనే స్పందిస్తాం భైంసాటౌన్: బ్లడ్ డోనర్ గ్రూప్ ద్వారా అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నాం. రక్తం అవసరమని గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వెంటనే స్పందిస్తాం. ఇప్పటివరకు వందలాదిమందికి గ్రూపులోని సభ్యులు రక్తదానం చేశారు. ఇలాగే సేవలను కొనసాగిస్తాం. – సురేశ్, బ్లడ్ డోనర్ గ్రూప్ అడ్మిన్, భైంసా 100 సార్లు ఇవ్వడమే నా లక్ష్యం ఆసిఫాబాద్అర్బన్: నేను ఇప్పటివరకు 34 సార్లు రక్తదానం చేశాను. 100 సార్లు రక్తం ఇవ్వాలన్నదే నా లక్ష్యం. రక్తదానంపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాను. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు నిలపడం ఎంతో సంతృప్తినిస్తుంది. – ఎండీ మొయినొద్దీన్, ఆసిఫాబాద్ 40 సార్లు చేశాను ఆసిఫాబాద్అర్బన్: ఇప్పటివరకు నేను 40 సార్లు రక్తదానం చేశాను. 16 ఏళ్లుగా రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. రక్తాన్ని దానం చేయడం అదృష్టంగా భావిస్తాను. – వైరాగడే ప్రతాప్, ఆసిఫాబాద్రక్తదాతలను ప్రోత్సహిస్తా ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్బ్యాంక్కు దాతలతో వెయ్యి యూనిట్ల రక్తం ఇప్పించాను. అత్యవసర సమయాల్లో ఎంతోమందిని ఆదుకున్నాను. నేను 10 సార్లు రక్తదానం చేశాను. ఎవరికైనా రక్తం అవసరమైతే 8639434390 నంబర్లో సంప్రదించాలి. – మాడిశెట్టి ప్రశాంత్, సామాజిక కార్యకర్త రక్తదాన దినోత్సవ నేపథ్యం1901లో ఆస్ట్రేలియాకు చెంది న నోబెల్ విజేత కార్ల్ లాండ్స్టీనర్ మొదటిసారిగా ర క్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ప్రపంచ రక్తదాత ల దినోత్సవాన్ని ఏటా జూన్ 14వ తేదీన నిర్వహిస్తున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపం చ దేశాలు జూన్ 14వ తేదీన రక్తదాన దినోత్సవాన్ని 2004నుంచి నిర్వహిస్తున్నాయి. -
శిక్షణ ఐఏఎస్ల పర్యటన
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో శుక్రవారం శిక్షణ ఐఏఎస్ అధికారులు పర్యటించారు. భద్రాద్రి కొతగూడెం నుంచి సౌరబ్ శర్మ, ఆదిలాబాద్ నుంచి సలోని చభ్ర, వికారాబాద్ నుంచి హర్షచౌదరి, నిజామాబాద్ నుంచి కరోలిన్ చింతిన్మవి, నారాయణపేట్ నుంచి కోయ్యాడ ప్రణయ్కుమార్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జన్నారానికి వచ్చారు. వారికి తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి, రేంజ్ అధికారి సుష్మారావు స్వాగతం పలికారు. అనంతరం గేట్ నంబర్–1 నుంచి సఫారీ ద్వారా గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట, మల్యాల వాచ్టవర్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం అలీనగర్, దొంగపల్లి గ్రామాల్లో గిరిజనులతో సమావేశం అయ్యారు. అడవి అభివృద్ధి, ఇక్కడి ప్రత్యేకతలను అటవీ బీట్ అధికారి లాలుబాయి వివరించారు. -
కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి
బాసర: విద్యార్థులకు తమ ప్రసంగాల్లో పదాలు, వాక్యాల నిర్మాణంలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతగానో అవసరమని ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ సూచించారు. ఇంగ్లిష్ విభాగం, ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు, అధికారులకు వివిధ సందర్భాల్లో సరైన భాష, వ్యాకరణం, శైలి, ఫార్మాట్ లోపం లేకుండా లేఖలు రాయడానికి ఉపయోగపడే లేఖ నమూనాలను రూపొందించి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ.. నమూనా లేఖలు స్టూడెంట్ హబ్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాటి ఆధారంగా విద్యార్థులు, అధికారులకు వివిధ అవసరాల కోసం సరైన రూపంలో, నిష్పాక్షికంగా లేఖలు తయారు చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, ఇంగ్లిష్ విభాగాధిపతి శ్రీఅప్సింగర్ విజయ్కుమార్, ఇంగ్లిష్ విభాగ అధ్యాపకులు, ఇతర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
జపాన్ సకురకు సాయి శ్రీవల్లి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన సాయిలు సాయి శ్రీవల్లి జపాన్లో ఆధునిక శాస్త్ర, సాంకేతికతలను వీక్షించేందుకు ఎంపికై ంది. స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా 9వ ఇన్స్పైర్ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రదర్శనతో మెప్పించింది. దేశవ్యాప్తంగా 54మంది ఎంపిక కాగా తెలంగాణ నుంచి ఎంపికై న ముగ్గురు వి ద్యార్థుల్లో సాయి శ్రీవల్లి ఒకరు. సమాజంలో మహిళలు, విద్యార్థినులకు రుతుక్రమ సమయంలో రసాయనిక శానిటరీప్యాడ్తో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసేలా రుతుమిత్ర కిట్ ప్రాజెక్టు రూపొందించింది. వివిధ రాష్ట్రాల నుంచి వెయ్యి ప్రాజెక్టులు ప్రదర్శించగా.. జాతీయ స్థాయికి ఎంపిక చేసిన 60 ఉత్తమ ప్రదర్శనల్లో శ్రీవల్లి ఎంపికై ంది. కేంద్రమంత్రి జితేందర్సింగ్, డీఎస్టీ కార్యదర్శి చంద్రశేఖర్, జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ పీఎస్ యోయల్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంది. జపాన్ సైన్స్ స్కూల్ ప్రోగ్రాం(సకుర సైన్స్ పోగ్రాం)కు ఎంపిక కాగా.. ఈ నెల 15నుంచి 21వరకు జపాన్లో నిర్వహించే కార్యక్రమంలో పా ల్గొంటుంది. ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రిన్యూర్షిప్–2023 పే రిట ఢిల్లీ లోని రాష్ట్రప తి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రు తుమిత్ర కిట్ ప్రాజెక్టు ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎదుట ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. శ్రీవల్లి తల్లి దండ్రులు మధుబాబు, ఉమ మంచిర్యాలలో ప్రభు త్వ టీచర్లు. ఇటీవల ప్రకటించిన ‘పది’ ఫలితాల్లో శ్రీవల్లి 588మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. జపాన్ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సాయి శ్రీవల్లి జపాన్లోని టోక్యోలో విరైకాన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్, సుకుబా సైన్స్సిటీలో ఉన్న స్పేస్ సెంటర్, నేచర్ అండ్ సైన్స్ మ్యూజియం, యూనివర్సిటీ ఆప్ టోక్యో వీక్షిస్తుంది. అక్కడ పాఠశాల విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో జపాన్లో అభివృద్ధిపై తెలుసుకుంటుంది. నోబెల్ బహుమతి గ్రహీతలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చల్లో పాల్గొంటుంది. -
నేడు మంత్రి వివేక్ రాక
చెన్నూర్: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి శనివారం చెన్నూర్ నియోజకవర్గానికి రానున్నారు. మంత్రిగా ప్ర మాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వ స్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశా రు. ఉదయం 10గంటలకు జైపూర్ మండలం ఇందారం పెట్రోల్బంక్ నుంచి బైక్ ర్యాలీ, ఇందారం బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్, రసూల్పల్లి వద్ద స్వాగతం, జైపూర్ బస్టాండ్లో సమావేశం, భీమారం, కిష్టంపేట ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కార్యకర్తల స్వాగతం, అక్కడి నుంచి బైక్ ర్యాలీ, చెన్నూర్ జలాల్ పెట్రోల్ వద్ద గజమాల సమర్పణ, గుస్సాడీ నృత్యాలతో స్వాగతం, అంబేద్కర్ చౌక్లో కార్నర్ మీటింగ్, సాయంత్రం 4గంటలకు రామకృష్ణాపూర్ ఏరియా ఆ స్పత్రిలో సింగరేణి కార్మిక విగ్రహ ఆవిష్కరణ, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు సమర్పణ, కార్నర్ మీటింగ్, మందమర్రి పాకిస్తాన్ క్యాంప్ స్వాగతం, మందమర్రి పాత బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన మంత్రి చెన్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను మంత్రి మంత్రి వివేక్ శుక్రవారం హైదరాబాద్లో మర్వాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరి నట్లు మంత్రి తెలిపారు. -
అభివృద్ధిపై మంత్రి దృష్టి సారించాలి
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నూర్ మున్సిపాలిటీ పక్కనే గోదావరి నది ఉన్నా తాగునీటి కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారని తె లిపారు. ఇసుక తీసుకొస్తే అడ్డుకుంటున్నారని, ఇళ్ల నిర్మాణాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. శ్మ శాన వాటిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నో చుకోలేదని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, వర్షాకాలం దృష్ట్యా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యు డు సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కొండపాక చారి, మాజీ కోఆప్షన్ సభ్యుడు కేవీఏం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు పాల్గొన్నారు. -
పచ్చిరొట్టతో ప్రయోజనం
● రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి ● పంటల దిగుబడి పెంచుకోవాలి చెన్నూర్రూరల్: అన్నదాతలు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని ఏడీఏ బానోతు ప్రసాద్ సూచిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలో కాలుష్యం పేరుకు పోయి పంటలకు కొత్త తెగులు సోకుతాయన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 30 కిలోల బ్యాగుకు పూర్తి ధర రూ.4,276 ఉండగా రైతుకు సబ్సిడీపై రూ.2,137కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రైతులు పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, పిల్లి పెసర, జీలుగ, అలసంద, పెసర తదితర విత్తనాలను ఎంపిక చేసుకుంటే ఖర్చు తక్కువతో పాటు ఎక్కువ దిగుబడి సాధించవచ్చని సూచిస్తున్నారు. పచ్చిరొట్టతో లాభాలు పచ్చిరొట్ట సాగుతో భూమిలో 16 రకాల సూక్ష్మ పోషకాలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. పచ్చిరొట్ట ఎరువులు వాడితే చౌడుభూములు సారవంత మవుతాయి. మొక్కలకు బాగా ఆక్సిజన్ అందుతుంది. జింకులోపం నివారించడంతో పాటు నత్రజని శాతం పెరుగుతుంది. మేలైన దిగుబడులు సాధించవచ్చు. సాగు చేసే విధానం వరి నారు పోయడానికి వారం రోజుల ముందు పచ్చిరొట్ట విత్తనాలను పొలంలో చల్లాలి. నెల లేదా 45 రోజుల తర్వాత పచ్చిరొట్ట పైరును భూమిలో కలియ దున్నితే మురిగిపోయి ఎరువుగా మారి పంట ఎదుగుదలకు ఉపకరిస్తుంది. మెట్ట పొలాల్లో పెసర, పిల్లి పెసర, అలసంద విత్తనాలు చల్లి 45 రోజుల తర్వాత వాటి ఆకుకోసి భూమిపై పరిచి దుక్కి దున్నాలి. అలా చేస్తే అది కుళ్లి భూమిలో కలిసి పోతుంది. ఇలా చేసిన తర్వాత పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. -
ఎస్టీపీపీలో ‘మహా’ బృందం పర్యటన
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థ ర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్ బృందం బుధవారం రాత్రి పర్యటించింది. ఎస్టీపీపీలో లిక్విడ్ నేచురల్ గ్యాస్ లేదా నేచురల్ గ్యాస్ వినియోగానికి కావాల్సిన సదుపాయాలు, ఇతర సౌకర్యాలపై అధ్యయనం చేశారు. నేచురల్ గ్యాస్ ను ఇంధనంగా వాడకం వల్ల కర్భన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. బాయిలర్లో రెండు యూనిట్లను పరిశీలించి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. జీఎం(ఓసీపీఎస్) డీవీఎ స్ఎన్.రాజు, జీఎం శ్రీనివాసులు, వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు శివప్రసాద్, మురళీధర్, మదన్మోహన్ పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
భైంసాటౌన్: పట్టణంలోని టిప్పుసుల్తాన్ చౌక్ వద్ద గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టున్నట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. వాహన తనిఖీలు చేపడుతుండగా బొలెరో వాహనంలో అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో అందులో 25 క్వింటాళ్ల రేషన్బియ్యం లభించడంతో సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి, బియ్యం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.న్యాక్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణకైలాస్నగర్: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు నాబార్డు ఆధ్వర్యంలో న్యాక్ శిక్షణ కేంద్రం ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ల్యాండ్ సర్వేయర్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు న్యాక్ ఏడీ నాగేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ , ఇంటర్, ఐటీఐ అ ర్హత కలిగి ఉండి 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం సైతం కల్పించనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్, బెల్లంపల్లి కేంద్రంగా అందించే ఈ శిక్షణను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 9866565156, 6281444199 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.ఒకరి అరెస్టుసిర్పూర్(టి): మండలంలోని బెంగాళీ క్యాంపు కాలనీకి చెందిన అలోక్పాల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదరు యువకుడు 2024 నుంచి చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుండడంతో అతనిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని సిర్పూర్(టి) జూనియర్ సివిల్ కోర్టులో రిమాండ్కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్సై కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు
● ఐదుగురిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ ● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: ఆన్లైన్ గేమింగ్ రాకెట్ గుట్టురట్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలోని పంచవటి హోటల్లో కొంత మంది వ్యక్తులు ఆన్లైన్ గేమింగ్ ఆడి అమాయకులను మోసం చేస్తున్నారనే సమాచారం వచ్చిందన్నారు. గదిలో పోలీసులు తనిఖీ చేయగా ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోయాడన్నారు. వారిలో నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన గొంటి రమేశ్, మహారాష్ట్రలోని ఆకోలకు చెందిన ప్రకాష్ బద్దు రాథోడ్, జిల్లా కేంద్రంలోని మీడియా కాలనీకి చెందిన జాదవ్ ప్రహ్లాద్, మహారాష్ట్రలోని థానేకు చెందిన పంకజ్ నాందేవ్, భోరజ్ మండలంలోని నిరాలకు చెందిన బోంద్రే సూర్యబాన్ ఉన్నారన్నారు. ఏ–1 గొంటి రమేశ్ ఈనెల 10న ఏ–2 ప్రకాష్ బద్దు రాథోడ్కు ఫోన్చేసి పంచవటి హోటల్లో గదిని బుక్ చేయాలని చెప్పాడు. పంకజ్ నాందేవ్తో కలిసి వస్తానని పేర్కొన్నాడు. బోంద్రే సూర్యభాన్ హోటల్లోని గదిలో వేచి ఉండగా వారికి ఆన్లైన్ గేమింగ్ గురించి గొంటి రమేశ్ వివరించాడు. ప్రతీఒక్కరు రూ.9,100 చొప్పున ఆన్లైన్ ద్వారా వేసి సాయంత్రం 4 గంటలకు గేమ్ ఆడటం ప్రారంభించారు. గేమ్లో గెలిస్తే 100 అమెరికన్ డాలర్లు లాభంగా వస్తాయని చెప్పాడు. వీరు గేమ్ ఆడుతుండగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకోగా రమేశ్ పరారయ్యాడు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు సెల్ఫోన్లు, ఒక కారు, మూడు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ
మంచిర్యాలఅర్బన్/నిర్మల్ఖిల్లా: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అందుబాటులోకి రానుంది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 12 జిల్లాలు ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కొనసాగుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు చదువుకునే వీలుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 210 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో 14, కుమురంభీం ఆసిఫాబాద్లో 7, నిర్మల్ జిల్లాలో 2 పాఠశాలల్లో పూర్వ విద్య అందుబాటులోకి రానుంది. మంచిర్యాల జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో ఎంపీపీఎస్, గుడిరేవు, ఎంపీపీఎస్, రెబ్బనపల్లి, ఎంపీపీఎస్, గంపలపల్లి, ఎంపీపీఎస్ క్లబ్రోడ్–లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్, ముల్కలగూడ, లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్ బోయవాడ, లక్సెట్టిపేట్, ఎంపీపీఎస్, నాయకపుగూడ (ఎస్), ఎంపీపీఎస్ రోట్టపల్లి, ఎంపీయూపీఎస్ పెద్దనపల్లి, ఎంపీపీఎస్ గెర్రిగూడెం (కొత్తకాలనీ), ఎంపీపీఎస్ మామడ, ఎంపీపీఎస్ మిట్పల్లె, మందమర్రి (వీ), ఎంపీపీఎస్ సుపాక (కే). కుమురంభీం జిల్లాలో.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీపీఎస్ ధనోరా (యూఎం), ఎంపీపీఎస్ గుండాయిపేట్, ఎంపీపీఎస్ ముత్తంపేట్, ఎంపీపీఎస్ డబ్బా, ఎంపీయూపీఎస్, రుద్రపూర్, ఎంపీపీఎస్ కొండపల్లి, ఎంపీపీఎస్ చడ్వాయి. నిర్మల్ జిల్లాలో... నిర్మల్ జిల్లాలో ఎంపీపీఎస్ చామన్పల్లి, ఎంపీపీఎస్ పేండ్పల్లిలో పూర్వ ప్రాథమిక విద్య అమలుకానుంది. ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలల్లో పూర్వప్రాథమిక తరగతులు తొలిదశలో ఉమ్మడి ఆదిలాబాద్లో మూడు జిల్లాల్లో అమలు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు... నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పెండ్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2017 నుంచే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తూ ప్రవేశాల సంఖ్య క్రమంగా పెంచుతూ వస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతుల నిర్వహణ వల్ల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపకుండా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణతో ప్రవేశాల సంఖ్య పెంచామని ప్రధానోపాధ్యాయులు ఎం.అమృతం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 130 వరకు విద్యార్థులున్నారని, ఈ సంవత్సరం సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ బడులను బలోపేతం చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.ప్రాథమిక పాఠశాలలు పరిపుష్టం ప్రీ ప్రైమరీ తరగతులను అనుసంధానం చేయడం వల్ల ప్రైమరీ స్కూల్స్ బలోపేతం అవుతాయి. మూడేళ్ల వయసు ఉన్నప్పుడే ప్రైవేటు బడుల్లోకి పంపుతున్న తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ప్రైమరీ తరగతికి ప్రత్యేక సిలబస్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు, నిర్మల్ చిన్నారులకు ప్రయోజనం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుతో చిన్నారులకు ఎంతగానో ప్రయోజనం కలగనుంది. ఇదివరకు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న ఊళ్లోనే ిపిల్లలను చేర్పించవచ్చు. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. పిల్లలకు విద్యాభాస్యం ప్రారంభించేందుకు ఒక మంచి పునాది వేస్తుంది. – ఎస్.యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
విద్యుత్ పోల్స్ టాక్స్ రద్దు చేయాలి
నస్పూర్: జిల్లాలోని కేబుల్ టీవీ ఆపరేటర్లకు విద్యుత్ పోల్ టాక్స్ రద్దు చేయాలని కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గూడ రాంరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట జిల్లాలో ని కేబుల్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ రాజేశ్వర్రావుకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాలు, ప ట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని ప్రాంతాల్లో విద్యుత్ పోల్స్ టాక్స్ చెల్లించా లంటే కేబుల్ టీవీ ఆపరేటర్లపై ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. మంచిర్యాల మండల అధ్యక్షుడు గాండ్ల సత్యం, నస్పూర్ మండల అధ్యక్షుడు పంబాల తిరుపతి, భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్, జైపూర్ అధ్యక్షుడు వెంకన్న, చెన్నూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, లక్షెట్టిపేట అధ్యక్షుడు భూమేశ్, దండేపల్లి అధ్యక్షుడు శంకర్, నాయకులు ఏల్పుల మల్లేశ్, గుమ్ముల శ్రీనివాస్, లక్ష్మణ్, రాజేందర్, మల్లేశ్, రాజు, శేఖర్, రవీందర్ పాల్గొన్నారు. -
నేటి బాలలే రేపటి పౌరులు
లక్సెట్టిపేట: నేటి బాలలే రేపటి పౌరులని జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ వి జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వి ద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని, చాలామంది చిన్నతనంలో విద్యకు దూరమవుతూ బాలకార్మికులగా ఉండిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులకు హ క్కులు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, ఏజీపీ సత్యం, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు లక్సెట్టిపేట: నేటి బాలలే రేపటి పౌరులని జూ నియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ వి జ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. వి ద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకోవాలని, చాలామంది చిన్నతనంలో విద్యకు దూరమవుతూ బాలకార్మికులగా ఉండిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం విద్యార్థులకు హ క్కులు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన క ల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, ఏజీపీ సత్యం, న్యాయవాదులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● జీసీసీ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్ ఉట్నూర్రూరల్: గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఉట్నూర్ జీసీసీ ఇన్చార్జి డీఎం సందీప్ కుమార్ అన్నారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆదేశాల మేరకు గురువారం జీసీసీ ఉమ్మడి జిల్లా మేనేజర్లు, అకౌంటెంట్లు, గోడౌన్ క్లర్క్లు, జూనియర్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్న నేపథ్యంలో పిల్లలకు అవసరమైన నిత్యావసరాలు వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. అన్ని వస్తువుల కాలపరిమితి స్వయంగా పరిశీలించిన తరువాతే సరఫరా చేయాలన్నారు. గోడౌన్లలో ఉన్న రికార్డులను, రిజిస్టర్లను వెంటనే అప్డేట్ చేయాలన్నారు. స్టాక్ వివరాలను డీఎం కార్యాలయానికి పంపించాలన్నారు. అనంతరం ఆయనను మేనేజర్లు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. -
ప్లాట్ల లెక్క తేలేనా?
● ‘టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ’పై మరోసారి విచారణ ● స్థలాల కేటాయింపులు, నిర్వహణలో ఉల్లంఘనలు ● పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల టీఎన్జీవో ఎస్ హౌసింగ్ సొసైటీ అక్రమాల పర్వం వెలుగులోకి రానుంది. మొదటి దఫాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు దక్కించుకున్న వ్యవహారంపై మరోసారి విచారణకు రంగం సిద్ధమైంది. గత కొంత కాలంగా మంచిర్యాల టీఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల కేటాయింపులతో పలు అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సహకార చట్టం 1995, సెక్షన్ 29ప్రకారం పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చారు. అన్యాక్రాంతమైన భూమిసర్వే నంబరు 42లో ఇప్పటికే అనేక కబ్జాలు జరిగా యి. టీఎన్జీవోస్కు కేటాయించిన భూమిలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు పొందారు. అంతేకాక కొందరు సభ్యులు సైతం ఇతరులకు అమ్ముకున్నారు. చాలామందికి ప్లాట్లు ఇచ్చినట్లు పత్రాలు ఉన్నప్పటికీ తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. దీనిపై సభ్యుల మధ్యే తీవ్ర వివాదాలు జరిగాయి. సభ్యులు తమకు ప్లాట్లు రాలేదని ఫిర్యాదులు చేశారు. మరోవైపు అదే భూమిలో కబ్జాలు జరగగా, సభ్యుల నుంచి పైసలు వసూళ్లు చేస్తూ సెటిల్మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ టీఎన్జీవోస్లకు భూమి కేటాయింపు చట్ట విరుద్ధమంటూ కోర్టు తీర్పు సైతం ఇచ్చింది. నివేదికలకే పరిమితమా? సహకార శాఖ పరిధిలో అనేక సంఘాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పాలకవర్గాల్లో ఉన్న కొంద రు ఇష్టారీతిన వ్యవహరిస్తూ సంఘాల ప్రతిష్టను దె బ్బతీస్తున్నారు. ఏటేటా ఆడిట్లలో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. వీటిపై విచారణలు జరుగుతున్నా బాధ్యులపై చర్యలు ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఉమర్మియా హౌసింగ్ సొసైటీ పేరుతో ఎక్కడ భూమి లేకున్నా కూడా, సొసైటీ పేరుతో కొందరు రియల్వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నారు. ఏళ్లపాటు రూ.కోట్ల లో లావాదేవీలు జరిగాయి. సొసైటీ అక్రమాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పరిధిలో ఉందంటూ సహకారశాఖ అధికారులు చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవేకాకుండా జిల్లాలో ఆ యా సొసైటీల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయి. విచారణ చేపడతాం టీఎన్జీవోఎస్ హౌసింగ్ సొసైటీలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతాం. ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – జి.హన్మంత్రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారిఅధికారులే అక్రమాలు చేసిఅప్పటి నస్పూర్ గ్రామ పంచాయతీ, ప్రస్తుత కార్పొరేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబరు 42లోని ప్రభుత్వ భూమిలో 29ఎకరాలను తెలంగాణ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. 2010లో ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉన్న మొత్తం 340మంది సభ్యులకు 175గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించారు. ఈ ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. దీనిపై కొందరు సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిల్లా సహకార శాఖ అధికా రులతో ఆడిట్ చేయించారు. గతేడు నవంబర్లోనే నివేదిక ఇచ్చారు. ఆడిట్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. ప్లాట్ల నిర్ణీత విస్తీర్ణానికి అధికంగా తీసుకోవడం, ఒక చోట బదులు మరోచోట ఇళ్లు కట్టడం చేశారు. సొసైటీ లెక్కలు, ఎన్నికల, నిర్వహణలు సజావు లేవని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో మరోసారి జిల్లా సహకార శాఖ అధికారితో పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. -
విద్యార్థులకు మంచి బోధన అందించాలి
లక్సెట్టిపేట: విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనాన్ని ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలపై ఉన్న ప్రేమతో పేద విద్యార్థుల ఉజ్వల భవి ష్యత్ కోసం నిధులు మంజూరు చేయించి భవన ని ర్మాణం పూర్తి చేశానని, తన కల నెరవేరిందని అ న్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకుని తల్లిదండ్రులకు పేరు తీసుకు రావాలని కోరారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కళాశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించారు. జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు ప్రేంచంద్, ఎండీ.ఆరీఫ్, చింత అశోక్, గడ్డం త్రిమూర్తి, నాగభూషణం, పింగిళి రమేష్, డీసీపీ భాస్కర్, డీఈవో యాదయ్య, డీఐఈవో అంజయ్య, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ దిలీప్కుమార్, ఎంపీడీవో సరోజ, ఎంఈవో శైలజ, ఈఈ, ఏఈ పాల్గొన్నారు. గురువుకు ఎమ్మెల్యే పాదాభివందనంఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తనకు పదవ తరగతిలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడు హరిచందర్ను శా లువాతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు పాదాభివంద నం చేశారు. 1973–74లో 10వ తరగతి చదువుతు న్న సమయంలో ఇదే బడిలో గణితం బోధించారని అన్నారు. గురుశిష్యులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ కళాశాల నూతన భవనం ప్రారంభం -
బతుకులు ఛిద్రం
● పిడుగుపాటుకు ఆరుగురు మృతి ● విత్తనాలు వేస్తుండగా దుర్ఘటన ● భర్త, కూతురిని కోల్పోయిన మహిళ ● తల్లులకు దూరమైన కొడుకు, బిడ్డ ● గాదిగూడ, బేల మండలాల్లో ఘటనలు ● చికిత్స పొందుతున్న క్షతగాత్రులు సాక్షి, ఆదిలాబాద్/నార్నూర్/బేల: వారంతా మట్టి మనుషులు.. మట్టినే నమ్ముకుని జీవించేవారు.. ఆ మనుషుల మధ్య ఉన్న ఆత్మీయత ఎంతచెప్పినా త క్కువే.. భార్యాభర్తలిద్దరు తమ పిల్లలతో కలిసి సొంత చేనులో విత్తనాలు వేస్తున్నారు. విత్తనాలు వేసే మిగతావారు కూడా ఈ కుటుంబానికి దగ్గరి సంబంధీకులే. అంతా ఆదివాసీ గిరిజనులే. వీరంతా హుషారుగా విత్తనాలు వేశారు. మధ్యాహ్నం కా వడంతో 14 మంది ఒకే దగ్గర భోజనం చేశారు. ఆ తర్వాత మళ్లీ విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలో వర్షం రావడంతో అంతా వెళ్లి స మీపంలోని చిన్న గుడిసెలో ఒకే దగ్గర కూర్చున్నా రు. సరిగ్గా అదే సమయానికి పక్కనున్న టేకు చెట్టు పై భారీ శబ్దంతో పిడుగు పడింది. ఉలిక్కిపడేలోపే గుడిసెలోని నలుగురు ప్రాణాలు విడిచారు. ఆ మట్టిపైనే నేలకొరిగారు. మిగతా వారు చెల్లాచెదురుగా పడిపోయి గాయాలతో బయటపడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘట న. మరో రెండు ఘటనల్లో బేల మండలంలోని ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మొత్తంగా పిడుగుపాటుకు ఆరుగురు మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని కలిగించాయి. బాధిత కుటుంబాల్లో విషాదం..గాదిగూడ మండలం పిప్పిరికి చెందిన పెందూర్ మాధవరావు తన చేనులో భార్య, కుమారులు, కూతురుతో పాటు దగ్గరి సంబంధీకులైన 14 మందితో కలిసి గురువారం మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నారు. పిడుగుపాటుకు గురై మాధవరావు, ఆయన కూతురు పెందూర్ సంజన అలియాస్ సుజాత, సంబంధీకులు సిడం రంభాబాయి, మంగం భీమ్బాయి మృతిచెందారు. ఈ ఘటనలో మాధవరావు భార్య పెందూర్ రేణుక, ఇద్దరు కుమారులు పెందూర్ జంగు, పెందూర్ శేఖు గాయపడ్డారు. సిడం రాంబాయి కుమారుడు సిడం శంకర్, మంగం భీమ్బాయి కూతురు మంగం నందిని కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు దగ్గరి సంబంధీకులైన హెచ్కే ఈశ్వర్, మర్సుకోల అంజలి, మర్సుకోల సోము, గెడం శంభు, గుణవంత్రావు కూడా గాయపడ్డారు. ఇక బేల మండలంలోని సాంగిడి, సోన్కాస్ గ్రామాల్లో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుకు మహిళా కూలీలు గెడం నందిని, కోవ సునీత మృతిచెందారు. వీరిరువురికి భర్త, పిల్లలున్నారు. కాగా, క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కొందరిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని పలువురు పరామర్శించారు.మృతుల వివరాలుపిడుగు పడిన ఘటనలో గాదిగూడ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన తండ్రి, కూ తురు పెందూర్ మాధవ్రావు(45), పెందూ ర్ సుజాత అలియాస్ సంజన(16), మాధవ్రావుకు దగ్గరి సంబంధీకులైన సిడం రంభా బాయి(40), మంగం భీమ్బాయి(45) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బేల మండలం సాంగిడి గ్రామంలో పిడుగుపాటుకు గురై గెడం నందిని(30), సోన్కాస్ గ్రామంలో కోవ సునీత(40) ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రెండు వేర్వేరు ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇందులో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు. -
తాటిచెట్లపై పిడుగులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ధర్మారం గ్రామ శివారులో గురువారం రెండు తాటిచెట్లపై పిడుగులు పడ్డాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి రెండు చెట్లపై పిడుగులు పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పిడుగుపడి ఆలయ గోపురం ధ్వంసంతాంసి: గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షానికి బండల్నాగా పూర్లో రా మాలయం గోపురంపై పిడుగుపడింది. ఒక్కసారిగా ఆల య గోపురంపై పిడుగుపడడంతో కలశంతో పాటు గోపురం ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు పా టు ప్రభావంతో గ్రామంలోని పలువురి ఇళ్లలో గృహోపకరణాలు సైతం కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళను బెదిరించిన ఒకరిపై కేసుమంచిర్యాలక్రైం: మహిళను బెదిరించిన ఒకరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన దేశవేని సునీత, జన్నారం మండలంలోని ధర్మారంకు చెందిన దుర్గం లింగేశ్వర్ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు. సదరు మహిళ లింగేశ్వర్కు రూ.50 వేల నగ దు, 13 గ్రాముల బంగారం ఇచ్చింది. చెల్లించమనడంతో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొమ్మని బెదిరించాడు. సునీత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మంత్రాల నెపంతో ఒకరి దారుణ హత్య
● నిర్మల్ జిల్లా నగర్లో ఘటనలోకేశ్వరం: తమ కుటుంబ సభ్యులకు మంత్రాలు చేస్తున్నాడని ఒకరిని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని నగర్లో చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు నగర్ గ్రామానికి చెందిన గడ్డం పోసులు (64) గురువారం ఉదయం తన వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళ్తుండగా బస్టాండ్ ప్రాంతంలో కాచుకుని కూర్చున్న అదే గ్రామానికి చెందిన గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు ఒక్కసారిగా పోసులుపై ఇటుకలు, బండాయితో ముఖంపై దాడిచేసి హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏడాది క్రితం గంగాధర్ 17 నెలల కూతురు, రెండు నెలల క్రితం రెండు ఆవులు మృతి చెందాయి. అంతేకాకుండా తన తల్లికూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, వీటన్నింటికి పోసులు చేతబడే కారణమని హత్యకు పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు గడ్డం సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని ఏఎస్పీ అవినాష్ కుమార్ పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ‘జూపల్లి’
● మంత్రి వివేక్కు మెదక్ జిల్లా బాధ్యతలు ● నిజామాబాద్కు మంత్రి సీతక్క కైలాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర ఎకై ్సజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారా వు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన ధనసరి అనసూయ సీతక్కను నిజా మాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్ర భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆదివాసీ ల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్కు సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. పార్లమెంటు ఎన్నికల వరకు ఆమె ఉత్సాహంగానే పనిచేశారు. జిల్లా అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో నిరాశకు గురైన ఆమె నాటి నుంచి జిల్లాపై అంతగా ఆసక్తి చూపలేదు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా ఆది లాబాద్ జిల్లాలో పర్యటించడం దాదాపుగా తగ్గించా రు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సీతక్క బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాల ఇన్చార్జి మంత్రుల మార్పు జరిగితే సీతక్క జిల్లా బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇన్చార్జి మంత్రుల జాబితాతో ఆ విషయం స్పష్టమైంది. కొత్తగా రానున్న జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీనియర్ మంత్రి కావడంతో జిల్లాకు మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఇటీవల కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్వెంకటస్వామికి మెదక్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
అన్నావదిన... దీవించండి
మంచిర్యాల: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ తన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి వివేక్ హైదరాబాద్లో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అన్నా వదినల కాళ్లకు సమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎల్లప్పుడు ఇలాగే తనపై ప్రేమానురాగాలు ఉంచాలని వివేక్ తన సోదరుడిని కోరారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, మునిమంద రమేశ్, కేవీ ప్రతాప్, హరీష్ గౌడ్, ఎం.మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల సంక్షేమానికి అంగన్వాడీ బాట
భీమారం: పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, పిల్లలతో కలిసి భోజనం చేశారు. జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి రౌఫ్ఖాన్, మండల ప్రత్యేక అధికారి కల్పన, తహసీల్దార్ సదానందం, సీడీపీవో మనోరమ పాల్గొన్నారు. ఆ తర్వాత మండల కేంద్రంలో పీహెచ్సీ నూతన భవన నిర్మాణ పనులు, కేజీబీవీ, వసతిగృహాం పరిశీలించారు. ఔషధ మొక్కలతో రోగాలు నయం జన్నారం: అడవుల్లో సహజంగా పెరిగే మొక్కల్లో అనేక ఔషధాలు ఉన్నాయని, వాటితో అనేక రకాల రోగాలు నయమవుతాయని ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని నార్లపూర్ బీట్లో సిబ్బందితో కలిసి పర్యటించారు. కలుపు మొక్కలు, ఔషధ మొక్కలను గుర్తించారు. ఔషధ మొక్కల ఉపయోగాలను సిబ్బందికి తెలిపారు. ప్రతీ రోజు బీట్ అధికారులు బీట్ పరిధిలో పర్యటించి గడ్డి మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని, వన్యప్రాణులు గడ్డిని ఇష్టంగా తింటాయని సూచించారు. సెక్షన్ అధికారులు హన్మంతరావు, రవి, బీట్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సంఖ్య తగ్గేదేలే!
దండేపల్లి: మండలంలోని పెద్దపేట ప్రాథమిక పాఠశాలలో 2018కి ముందు విద్యార్థుల సంఖ్య పది మాత్రమే. అదే సంవత్సరంలో ప్రధానోపాధ్యాయురాలిగా శ్రీలత బదిలీపై వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలను ప్రైవేటుకు పంపకుండా, వారిలో నమ్మకాన్ని పెంచి, విద్యార్థుల సంఖ్యను 60కి చేర్చారు. 2022లో మన ఊరు–మనబడి పథకంలో భాగంగా రూ.20 లక్షలు మంజూరు కావడంతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదులు, ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తున్నారు. ప్రతియేటా పది మంది వరకు విద్యార్థులు గురుకులాలకు ఎంపికవుతున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య 50కి పైనే తప్పా తగ్గడం లేదు. బాల్యం గుర్తుకు వస్తది.. దండేపల్లి: మాది దండేపల్లి మండలం కాసిపేట. దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6నుంచి 10 వరకు చదివాను. 1984–85 ఎస్సెస్సీ బ్యాచ్. నాకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. నేను చదివిన దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2005–11 వరకు పనిచేశాను. మళ్లీ రెండోసారి 2018 నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. నేను రోజు బడిలో అడుగుపెట్టగానే నాకు నా బాల్యం గుర్తుకు వస్తది. చదివిన పాఠశాలలోనే పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా బాల్యం, నా ఉద్యోగ సర్వీస్, నేను చదివిన పాఠశాలలో గడుపుతున్నందుకు ఆనందంగా ఉంది. – అప్పాల మనోహర్, స్కూల్ అసిస్టెంట్, దండేపల్లి -
పత్తి విత్తేందుకు తొందరొద్దు
‘‘తొలకరి వర్షాలకు తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నేలలో కనీసం తేమ కూడా రాలేదు. పంటల సాగుకు సమయం మించి పోలేదు. జూలై 15వరకు పత్తి విత్తుకోవచ్చు..’’ అని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీ) ప్రోగ్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త కోట శివకృష్ణ అన్నారు. బుధవారం పంటల సాగు పద్ధతులు, అధిక దిగుబడి, చీడపీడల నివారణ తదితర అంశాలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన లభించింది. సాగులో రైతుల సందేహాలను శాస్త్రవేత్త శివకృష్ణ నివృత్తి చేశారు. రైతుల ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు. బెల్లంపల్లిపత్తిలో అంతర పంటగా ఎన్ని సాళ్లకో కంది సాలు వేసుకోవాలి. – జిల్లెల సుదర్శన్గౌడ్, గ్రామం: నాయకునిపేట, మం: కన్నెపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంటలో నిరభ్యంతరంగా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. పత్తి 4–6 సాళ్ల ఎడంలో కంది సాలు వేసుకోవచ్చు. ఈ తీరుగా సాగు చేయడం వల్ల ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. తొలకరి వర్షాలకు పత్తి విత్తుకోవచ్చా.. – మేడి పవన్, గ్రామం: కిష్టంపేట, మం: తాండూర్, ఇందూరి భూమయ్య, గ్రామం: తంగళ్లపల్లి, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి విత్తుకోవడానికి ఇప్పటికిప్పుడు తొందరపడాల్సిందేమీ లేదు. తొలకరి జల్లులకు ఇంకా నేల ఏమాత్రం తడవలేదు. తేమ కూడా రాలేదు. భూమి కనీసం తొమ్మిది ఇంచుల వరకు తడిసిన తర్వాత విత్తుకోవడం ఉత్తమం. జూలై 15వరకు పత్తి విత్తుకోవడానికి సమయం ఉంది. పత్తిలో అంతర పంటల సాగుకు ఎలాంటి సూచనలు చేస్తారు – కామిని శ్రీనివాస్, గ్రామం: కిష్టంపేట, మం: తాండూర్ వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంటలో అంతర పంటలుగా ప్రధానంగా కంది, సోయాబీన్, పెసర సాగు చేసుకోవచ్చు. ఏటా ఏక పంట కాకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలి. ఈ విషయంలో రైతులు సరైన అవగాహన పెంచుకోవాలి. పత్తి పంటలో గూడ రాలడాన్ని నివారించే వీలుందా..? – కాట్న శ్రీకాంత్, గ్రామం: గంగారాం, మం: నెన్నెల వ్యవసాయ శాస్త్రవేత్త: భారీ వర్షాలు కురవడం, ఆకస్మికంగా ప్రకృతిలో మార్పులు చోటు చేసుకోవడం మరీ ముఖ్యంగా పత్తి పంటలో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడడం వల్ల గూడ రాలుతుంది. అందువల్ల ఫ్లానఫిక్స్ 1ఎంఎల్ 5లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నల్ల, ఎర్రరేగడి నేలల్లో పత్తి సాగుకు వేర్వేరు విత్తనాలు ఉంటాయా.. – రాంటెంకి దశరథ్, గ్రామం: బిట్టూర్పల్లి, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: నేలల రకాలను బట్టి విత్తుకునే పత్తి విత్తనాలు వేర్వేరుగా ఏమీలేవు. నల్ల, ఎర్ర రేగడి నేలలైనా ఒకే తీరైన పత్తి విత్తనాలు సాగు చేసుకోవచ్చు. విత్తనాలను మాత్రం ధ్రువీకరించిన కేంద్రాల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా రశీదు తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. వర్షాధారంగా వరి సాగుకు అనువైన వంగడాలు.. – కే.రాజ్కుమార్, గ్రామం: చిన్నగుడిపేట, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: వరినారు మడులు జూలై 15వరకు పోసుకోవాలి. జనుము, జీలుగ విత్తనాలు చల్లుకుని సాగు చేయాలి. ఏపుగా ఎదిగాక సింగిల్ సూపర్ఫాస్పేట్ వేసి దుక్కి కలియ దున్నాలి. కునారం 1638, 118 దొడ్డురకం, జేజీఎల్ తదితర రకాల వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. జూలై 15వరకు విత్తుకోవచ్చు.. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కోట శివకృష్ణ ‘సాక్షి’ ఫోన్ ఇన్కు స్పందనపత్తి పంటలో కలుపు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. గులాబీ రంగు పురుగును నివారించడం ఎలా..? – గుమ్మడి మల్లేష్, గ్రామం: నీలాయపల్లి, మం: తాండూర్, తోట మధు, గ్రామం: నెన్నెల, అప్పని గురవయ్య, గ్రామం: లక్ష్మీపూర్ వ్యవసాయ శాస్త్రవేత్త: పత్తి పంట విత్తుకున్న 48గంటల్లోపు పెండిమిథాలిన్ కలుపు నివారణ మందును పిచికారీ చేయాలి. భూమి పదునుగా ఉన్న సమయంలో ఎకరానికి 700 ఎంఎల్ మందు పిచికారీ చేస్తే సాధ్యమైంతవరకు కలుపు రాకుండా ఉంటుంది. పత్తి పంట సేకరణ పూర్తి కాగానే పత్తి మొదళ్లను భూమిలో కలియ దున్నాలి. అలా చేయడం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గుతుంది. పత్తి పంట విత్తుకున్న 45 రోజుల్లో గులాబీ రంగు పురుగు కనిపించినట్లయితే పంట చుట్టూరా లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. అదే తీరుగా ప్రతీ 15–20 రోజులకోసారి వేపనూనె పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. వరిలో మొగిపురుగు సమస్యను అధిగమించడం ఎలా.. – కోట సునిల్కుమార్, గ్రామం: దుగినేపల్లి, గోమాస ప్రశాంత్, గ్రామం: మాలగురిజాల, మం: బెల్లంపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త: మొగి పురుగు ప్రభావం కనిపించకుండా నారుమడిలో 800 గ్రాముల త్రీజీ గుళికలు వేసుకోవాలి. నారు వేసిన ఎనిమిది రోజుల్లో ఎకరాకు ఎనిమిది కిలోల గుళికలు మరోమారు వేయడం వల్ల మొగి పురుగు ప్రభావం తగ్గుతుంది.అధిక సాంద్రత పత్తి సాగుకు అనుకూలమైన పత్తి రకాలు ఏమిటి.. – బోర్ల తిరుపతి, గ్రామం: చిన్నగుడిపేట, మం: భీమిని వ్యవసాయ శాస్త్రవేత్త: అధిక సాంద్రత కలిగిన పత్తి విత్తుకోవడానికి రైతులు ముందుకు రావాలి. గరిష్టంగా 150–160 రోజుల్లో పంట చేతికి అందే పత్తి సాగు చేసుకోవాలి. పత్తి మొక్క ఎత్తుగా పెరగని రకాలు ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా రాశి కంపెనీకి చెందిన ఆర్సీహెచ్ 929, స్విఫ్ట్, నూజివీడు కంపెనీకి చెందిన అరమిత తదితర రకాలు సాగు చేసుకోవచ్చు. -
● నేడు పండుగలా పాఠశాలల పునఃప్రారంభం ● యూనిఫాం, పుస్తకాలు పంపిణీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1,078 ఉండగా 1,27,568మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో 40 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 5,941మంది, 684 ఎంపీపీఎస్, జెడ్పీ పాఠశాలల్లో 30,406మంది, 18కేజీబీవీల్లో 4,568మంది, ఐదు మోడల్ స్కూళ్లలో 3,100మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 42,711 యూనిఫామ్లు విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. 3,07,820 పుస్తకాలు అవసరం కాగా పాఠశాలలకు చేరాయి. మొదటి రోజు ఒక్కో జత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఈ నెల 6నుంచి బడిబాటలో అడ్మిషన్లు చేపట్టారు. ఇలాంటి పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 684 పాఠశాలల్లో 2,474 మంది టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. గత ఏడాది సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించేందుకు 67మందిని సర్దుబాటు చేశారు. ఈ ఏడాది బడిబాట తర్వాత విద్యార్థుల అడ్మిషన్లు పెరిగే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారించాల్సి ఉంది. బడి శుభ్రత, భోజనంలో నాణ్యత.. సర్కారు పాఠశాలల్లో బడి శుభ్రత, భోజనంలో నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. వంట శుభ్రత, వడ్డన అంశాలపై 1,290మంది మధ్యాహ్న భోజన కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రూ.63లక్షలతో వంటపాత్రలు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి 1,130 మంది ఎస్జీటీ, 1,811మంది స్కూల్అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. పిల్లలను చేర్పిస్తున్నారా..? ఆలోచించండి.. పిల్లలను ఏయే బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల హంగు ఆర్భాటాలు చూసి హడావుడిగా పిల్లలను చేర్పించొద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా..? పాఠశాలకు గుర్తింపు ఉందా..? ఆటస్థలాలు, అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నారా తెలుసుకుని చేర్పించాలని, లేదంటే అన్ని వసతులున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు. తడ‘బడి’ నిలిచింది.. మంచిర్యాలఅర్బన్: ఒకప్పుడు తొమ్మిది మంది విద్యార్థులకు పడిపోయి తడబడిన పాఠశాల 80 మందితో నిలబడింది. దూరంగా ఉన్న పాఠశాల చేరువ కావడం.. ఉపాధ్యాయులు ఉత్సాహం చూపడం విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. అడ్మిషన్లు పెరగడంతో ఒక ఉపాధ్యాయుడి నుంచి ముగ్గురికి చేరింది. స్థానిక మంచిర్యాల(హరిజనవాడ) పాఠశాల భవనంలో మూడు స్కూళ్లు ఉండగా.. విద్యార్థుల ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో డీఈవో యాదయ్య చొరవ చూపారు. గత ఏడాది జూలై 9న జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోకి స్టేషన్రోడ్ పాఠశాల తరలించారు. అంతకుముందు హరిజన పాఠశాల ప్రాంగణంలో హరిజనవాడ స్కూల్లో 30, రాళ్లపేట్ రోడ్లో 14, స్టేషన్రోడ్ స్కూల్లో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. మూడు స్కూళ్లలో 51 మంది విద్యార్థులున్నా పరిస్థితి నుంచి ఒక స్టేషన్రోడ్ స్కూల్లోనే 80కు చేరడం గమనార్హం. స్టేషన్రోడ్ స్కూల్ టీచర్లు పప్పుగుత్తివాడలో బడిబాట నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను చేర్పించారు. విద్యార్థుల సంఖ్య 78మంది కాగా 18 మంది ఐదో తరగతి పూర్తయి పైచదువులకు వెళ్లనున్నారు. 60 మంది ఉండగా కొత్తగా 20 మంది అడ్మిషన్లు చేయడంతో సంఖ్య 80కి చేరింది. ప్రవేశాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. చదువులకు ఆటంకం లేకుండా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తాం. బడిబాట ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమున్నా చోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి చదువులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం –ఎస్.యాదయ్య, డీఈవో -
ఆ బడికి 63ఏళ్లు
భీమారం: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అప్పటి మారుమూల గ్రామమైన భీమారంలో ప్రభుత్వం 1963లో జెడ్పీ పాఠశాలను ఏర్పాటు చేసింది. గ్రామానికి చెందిన సంఘసేవకులు ఎన్వీ.రాజారెడ్డి కృషి కారణంగా మొదట ప్రాథమిక పాఠశాల, 1967లో పదో తరగతి మంజూరు చేసింది. దీనికి తోడు గిరిజన బాలుర హాస్టల్ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని గిరిజన గ్రామాలను నుంచి వచ్చి చదువుకున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది ఉన్నత పదవులు చేపట్టారు. ఉట్నూరు ప్రాంతానికి చెందిన డాక్టర్లు తొడసం చందు, భీష్మ, పెద్దపల్లి జెడ్పీ సీఈవో నరేందర్ ఇక్కడే చదివారు. ఇప్పుడు టాటాకన్సెల్టెంగ్ సర్వీస్(టీసీఎస్)లో ఉన్నత పదవిలో ఉన్న వీ.రాజయ్య ఇక్కడే చదువుకున్నారు. -
అన్నావదిన... దీవించండి..
బెల్లంపల్లి: రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ తన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, వదిన రమ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి వివేక్ హైదరాబాద్లో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అన్నా వదినల కాళ్లకు సమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎల్లప్పుడు ఇలాగే తనపై ప్రేమానురాగాలు ఉంచాలని వివేక్ తన సోదరుడిని కోరారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింగరావు, మునిమంద రమేశ్, కేవీ ప్రతాప్, హరీష్ గౌడ్, ఎం.మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
కౌటాల: వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గుండాయిపేట గ్రామానికి చెందిన ఉర్వత్ కమలాబాయి(56) కొంతకాలంగా మద్యానికి బానిసైంది. మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలిస్తుండగా బావిలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచా రం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమి త్తం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తరలించా రు. మృతురాలి కుమారుడు ఉ ర్వత్ బండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
రండి.. దయచేయండి..
వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. 48రోజులపాటు ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తొలిరోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు అందించనున్నారు. ఈ ఏడాది నుంచి 50శాతం అంతకంటే ఎక్కువ మంది ఉన్న పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన కార్యక్రమం అమలు చేయనున్నారు. 2025–26విద్యాసంవత్సరం పాఠశాలల ప్రారంభం పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పదో తరగతి వరకు ఇక్కడే.. లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాను. అప్పటి రోజుల్లో తాలూకా హెడ్ కావడంతో ఇక్కడే ప్రభుత్వ పాఠశాల ఉన్నది. 1973–74లో పదవ తరగతి చదివాను. సుదూర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మంచి హోదా, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. నేను చుదువుకున్న పాఠశాలను మరిచిపోలేక పోతున్నాను. అప్పటి పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టాను. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ నెల 12న ప్రారంభిస్తున్నాం. – మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు స్టేషన్రోడ్ పాఠశాల ముస్తాబు చెన్నూర్/చెన్నూర్రూరల్/జైపూర్/జన్నారం: చెన్నూర్ మున్సిపాల్టీ పరిధిలోని సర్కారు పాఠశాలలను ఉపాధ్యాయులు రంగు రంగుల పూలు, బెలూన్లతో ఆకర్షణంగా తీర్చిదిద్దారు. తాగునీరు, బెంచీలు, కుర్చీలు, మూత్రశాలలు వంటి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు స్వప్నశ్రీ తెలిపారు. మండలంలోని సుద్దాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 57మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల ఫొటోలతో ఎంట్రెన్స్బోర్డు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఆటవస్తువులతోపాటు చిత్రాలు వేయించారు. ● జైపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో గదులు, పరిసరాలు శుభ్రం చేయించారు. స్వాగత తోరణాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. జైపూర్ హైస్కూల్లో అత్యాధునిక వసతులు, ల్యాబ్, వసతిగృహ సౌకర్యం ఉండడంతో ఈ ఏడాది సుమారు 100మంది కొత్త విద్యార్థులు చేరనున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ● జన్నారం మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్టించారు. ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాఠశాలకు నూతన భవనం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నిర్మించి అన్ని వసతులు కల్పించారు. -
అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి
మంచిర్యాలఅర్బన్: తెలంగాణలోని ధూప, దీప, నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చే స్తానని తెలంగాణ అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉ పేంద్రశర్మ అన్నారు. బుధవారం మంచిర్యాల విశ్వనాథస్వామి కాలక్షేప మండపంలో అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99 పీఆర్సీసీకి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో అర్చక వే ల్ఫేర్ బోర్డు సభ్యుడు నారాయణస్వామి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నవీన్, సీడీడీఎన్ అధ్యక్షుడు శ్రీ కాంత్స్వామి, డీడీఎన్ అధ్యక్షుడు సతీశ్శర్మ, ఈవో రవి, అర్చకులు నరహరిశర్మ పాల్గొన్నారు. -
తోరణాలు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఓ వైపు పరిశుభ్రత కార్యక్రమాలు.. విద్యార్థులకు స్వాగతం పలికేలా ఆవరణల్లో రంగవల్లులు, మామిడి తోరణాలు, అరటి చెట్లు ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకులు, మూత్రశాలలు, గదులు శుభ్రం చేయించారు. మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో బడిబాట ద్వారా 250మంది చేరారు. ఆహ్లాదకర స్వాగతం నెన్నెల: మండలంలోని కుశ్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సకల సదుపాయాలు, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పచ్చని చెట్లతో ఆహ్లాదకర స్వాగతం పలుకుతోంది. ఏపుగా పెరిగిన వృక్షాలతో నందనవనాన్ని తలపిస్తోంది. నా లుగు గదులు ఉండగా 60 మంది పిల్ల లు చదువుకుంటున్నారు. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లు ఉన్నాయి. ఉపాధ్యాయుల ప్రచారంతో ఈయేడు అడ్మిషన్లు పెరిగాయి. బుధవారం పిల్లలు, ఉపాధ్యాయులు, స్థానికులు గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. -
వ్యాక్సినేషన్ ప్రారంభం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోటసిల్ లిక్విడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంచార్జి డీఎంహెచ్వో డాక్టర్ ప్రసాద్, డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ హెల్త్సెంటర్లు, 100 ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ను ఆరు, పది, 14 వారాలు ఉన్న పిల్లలకు ఇస్తామని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా, ఇతర వ్యాధులు రాకుండా అరికడుతుందని, ప్రజలందరూ పిల్లలకు వేయించాలని తెలిపారు. వైద్యులు శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, డీపీహెచ్ఎం పద్మ పాల్గొన్నారు. -
మత్స్యసొసైటీ ఖాతాలో నగదు జమచేయాలి
పాతమంచిర్యాల: మత్స్య సొసైటీలకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేసేందుకు బదులుగా సొసైటీల ఖాతాలలో నగదు జమచేస్తే సభ్యులకు లాభదాయకంగా ఉంటుందని తెలంగాణ మ త్స్యకారుల, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకృష్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చార్వక ట్రస్ట్ భవన్లో మత్స్య కార్మిక సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీ స్కీంలను పునరుద్ధరించాలని, మత్స్యకారులకు టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలు 90 శాతం సబ్సిడీపై మంజూరు చేయాలన్నారు. మత్స్యకారులు ప్రమాదాల బారిన పడి చనిపోతే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారుల సహజ మరణానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో పది ఎకరాల్లో అధునాతన చేపల మార్కెట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, నాయకులు గుమ్ముల శ్రీనివాస్, పెద్దపల్లి మధునయ్య, పందిరి రమాదేవి, లెల్లల మల్లీశ్వరి, బానెం నాగన్న, నాగుల మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
శివాలయంలో చోరీ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న త్రినేత్ర శివాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్ప డ్డారు. గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి ద్వారం తాళాన్ని పగులగొట్టి శివలింగంపై ఉన్న వెండి నాగపడిగను అపహరించారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు విషయాన్ని గమనించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భుక్తాపూర్లో చోరీఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన రహెమాన్ ఇంట్లో చోరీ జరిగినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఈనెల 3న కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన గోనధన్నూర్కు వెళ్లాడు. ఈనెల 11న ఇంటికి వచ్చిచూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న ఐదు గ్రాముల బంగారం, రూ.6వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. మిస్సింగ్ కేసు నమోదుతానూరు: మండలంలోని కోలూరు గ్రామానికి చెందిన గాడేకర్ శేషారావు (35) అదృశ్యమైనట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలి పారు. శేషారావు ఈ నెల 10న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కు టుంబ సభ్యులు తెలిసిన చోట్ల వెతికినా ఆ చూకీ లభించలేదు. దీంతో అతని వదినె గాడేకర్ శాంతాబాయి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘భూకబ్జాకు పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలి’బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి లోని అంబేడ్కర్ రడగంబాల బస్తీలో ఓ మ హిళ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజ లను బెదిరింపులకు గురిచేస్తోందని బాధితులు బుధవారం బెల్లంపల్లి ఆర్డీవో, తహసీ ల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వేర్వేరుగా లి ఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బాధితులు చీకటి మాధురి, ఎండీ రె హెనా బేగం, పెద్దపల్లి వరలక్ష్మి, చీకటి ల క్ష్మి, ఎండీ షహనాజ్ మాట్లాడుతూ తామంతా కూ లీ పనులు చేసుకుని బస్తీలో నివాసం ఉంటున్నామన్నారు. ఎంతో కష్టపడి పక్కా గృహా లు కట్టుకుని జీవిస్తున్న తమను ఆర్పీ మాధవి బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. అక్రమంగా రాత్రి పూట నిర్మాణాలు సాగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ప్ర భుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని, కొందరు పేదల గృహాలను కబ్జా చే యడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని, ఇప్పటికే దాదాపు 40 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వివరించారు. గతంలో రెవె న్యూ, మున్సిపల్ అధికారులు అడ్డుకోగా తిరి గి కబ్జాకు యత్నాలు సా గిస్తున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి బస్తీలో సాగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలని, భూ క బ్జాలు జరగకుండా రెవెన్యూ అధికారులు ని వారించి, మాధవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆర్జీయూకేటీ, స్విన్ఫీ మధ్య ఒప్పందం
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భవిష్యత్కు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు బాసర ఆర్జీయూకేటీ, స్విన్ఫీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య బుధవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఓఎస్డీ మురళీదర్శన్, స్విన్ఫీ శిక్షణ బృందంలోని సీఈవో రాణి గుంటికడి సంతకాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం గ్రామీణ యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచిందన్నారు. వీరిని ఐటీ పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయనున్నామన్నారు. ఇందులో భాగంగా ఆర్జీయూకేటీలో చివరి సంవత్సరం చదువుతున్న వందమంది విద్యార్థులకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అంశాలపై మూడునెలల పాటు ఇంటెన్సివ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ మహేష్, డాక్టర్ ఎన్ విజయ్కుమార్, కంపెనీ ప్రతినిధులు సుమశ్రీ వల్లపు, రాకేష్ గంజి, మహేష్ సద్దాలా, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
తాండూర్: మండలంలోని బోయపల్లిలో బుధవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని గోండ్ పిప్పిరి గ్రామం నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు బోయపల్లి గ్రామ సమీపంలో మాటువేసి మాసాడి రవీందర్ అనే యువకుడు నకిలీ పత్తి విత్తనాలు తీ సుకువస్తుండగా పోలీసులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి 18 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మండల వ్యవసాయ అధికారి సుష్మ పర్యవేక్షణలో పంచనామా నిర్వహించారు. విత్తనాల విలువ రూ.54 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. భీమారం: మండలంలోని ఎలకేశ్వరంలో బుధవారం వ్యవసాయశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి సూరం సురేష్ వద్ద 2 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏవో అత్తె సుధాకర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సురేష్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
జన్నారం: మండలంలోని పొనకల్, ధర్మారం గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపారు. ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా ఇసుక ట్రాక్టర్లు కనిపించడంతో పట్టుకుని సీజ్ చేసి సదరు ట్రాక్టర్ యాజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రేపు అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికమంచిర్యాలక్రైం: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఈనెల 13న జిల్లాస్థాయి అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు క్రికెట్ కోచ్, జిల్లా కార్యదర్శి ప్రదీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక విధానం రౌండ్ రాబిన్ మ్యాచ్ల రూపంలో ఉంటుందని, ఈ మ్యాచ్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 2006 సెప్టెంబర్ 1 తరువాత జన్మించి ఉన్నావారు మాత్రమే అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కలవారు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకుని ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు. చెట్టుకొమ్మలు విరిగిపడి బైకులు ధ్వంసంనస్పూర్: సీసీసీ కార్నర్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట ఉన్న వేపచెట్టు కొమ్మలు బుధవారం గాలికి విరిగి పడడంతో చెట్టు కింద ఉన్న సుమారు 10 బైక్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు కొమ్మలు విద్యుత్ వైర్ల మీద పడడంతో స్తంభం కిందకు వంగింది. దీంతో తీగలు సైతం కిందకి వేలాడి ప్రమాద కరంగ మారడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మద్యం దుకాణం ముందున్న ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్జీవో హౌసింగ్ సొసైటీపై విచారణమంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీవోస్) హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ సురేంద్రమోహన్ బుధవారం విచారణకు ఉత్వర్వులు జారీ చేశారు. విచారణ అధికారిగా జిల్లా సహకారశాఖ సూపరింటెండెంట్ జి.హనుమంత్రెడ్డిని నియమించారు. ప్లాట్ల కేటాయింపు, అర్హులు కాకుండా అనర్హులు ఉన్నారని, స్థలాల మధ్య వ్యత్యాసం, తదితర అక్రమాల ఆరోపణలపై 1995లో సెక్షన్ 29 ప్రకారం అప్పటి జిల్లా సహకార శాఖ అధికారి అందజేసిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. -
విత్తన చట్టం రూపకల్పనకు కృషి
● తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డికై లాస్నగర్: నూతన విత్తన చట్టం–2025 రూపకల్పనలో రైతుల సూచనలు తీసుకుని త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విత్తన చట్టం ముసాయిదా తయారీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతుల నుంచి అభిప్రాయ సే కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ విత్తన చట్టం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. అంతకుముందు బోరంచు శ్రీకాంత్రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. -
వివేక్కు ఏ శాఖ ఇస్తరో..!
గత ఏడాదిన్నరగా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేక ప్రజలు, నాయకులు, అధికారులకు పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రి పదవి రావడంతో ఊరట దక్కింది. మరోవైపు రాష్ట్రం ఏర్పడ్డాక, తూర్పు జిల్లా నుంచి తొలిసారిగా మంత్రి పదవి లభించింది. గత ప్రభుత్వంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండగా.. ఈసారి మంచిర్యాల జిల్లాకు అవకాశం లభించింది.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తదితరవన్నీ జిల్లాకు మంత్రి లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని పథకాల అమలులో ఇన్చార్జి మంత్రి కీలకంగా మారారు. ప్రస్తుతం మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాల వారీగా జరుగుతున్న అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్షలు, సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇకపై వివేక్ ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పర్యవేక్షణలో సులువు కానుంది. ప్రభుత్వ పరంగా వేడుకలు, అధికారిక కార్యక్రమాలు మంత్రి హోదాలో జరగనున్నాయి.శాఖలపై కసరత్తురెండో విడతలో మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ ప్రమాణం స్వీకారం చేశారు. వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. మంత్రి మండలిలో ఖాళీగా హోం, మున్సిపల్, గనులు, కార్మిక, పశుసంవర్ధక, పాడి, సంక్షేమ శాఖలు, ఇతర శాఖలు ఖాళీగా ఉండడంతోపాటు రెండేసి, మూడేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారికి ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై కసరత్తు చేస్తుండగా, త్వరలోనే స్పష్టత రానుంది.వివేక్పైనే ఆశలుగత పదిహేడు నెలలుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా లేకపోవడంతో నాయకులతోపాటు ప్రజలకు లోటు ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిలో ఒకరికై నా మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజాగా వివేక్నే ఖరారు చేయడంతో ఆయనపై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు ఉన్నాయి. నిధులు, విధులు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు తదితరవన్నీ ఉమ్మడి జిల్లా నుంచి బలంగా వినిపించాల్సి ఉంటుంది. తన నియోజకవర్గం చెన్నూరుతోపాటు మిగతా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాలు, సింగరేణి తదితర అనేక సమస్యలు ఉన్నాయి.సీఎంను కలిసిన మంత్రి, ఎంపీచెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. -
బస్టాండ్ బాత్రూంలో బోనోఫిక్స్ కలకలం!
● మత్తు కోసం వినియోగిస్తున్న యువతఖానాపూర్: మద్యం, గుట్కాతో పాటు గంజాయి లాంటి పలు మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే తరహాలో సైకిల్ టైర్ పంక్చర్ కోసం వినియోగించే బోనోఫిక్స్తో ద్వారా మత్తును ఆస్వాదిస్తున్న ఘటన ఖానాపూ ర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరుగుదొ డ్లు, మూత్రశాలల ప్రాంతంలో బోనోఫిక్స్ వినియోగించి పడేసిన ఖాళీ కవర్లు కనిపించాయి. ఈ ఘట న తెలియడంతో పట్టణవాసులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నా రు. దుకాణాల్లో కొనుగోలు చేసిన బోనోఫిక్స్ను కర్చీఫ్లు, కవర్లలో వేసుకుని యువత మత్తు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బోనోఫిక్స్ పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు చెడిపోవడంతో పాటు ఇతర వ్యాధులు వస్తాయని, సైడ్ఎఫెక్ట్లకు దారితీసే ప్ర మాదముందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి కై నా సంబంధిత అధికారులు బోనోఫిక్స్ విక్రయాలపై నిఘా పెట్టాలని, యువతకు దురలవాట్లపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
మూడో యూనిట్కు ముహూర్తమెప్పుడో!
● ఎస్టీపీపీలో 2015లో శంకుస్థాపన ● పనులు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ ● పదేళ్లయినా ప్రారంభంకాని పనులు ● ఉపాధి కోసం నిరుద్యోగుల నిరీక్షణ జైపూర్: పదేళ్లయినా మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో మూడో యూనిట్ ప్లాంట్ నిర్మాణం టెండర్ల దశలోనే నిలిచింది. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను విస్తరిస్తూ రెండు యూనిట్లకు అదనంగా మూడో యూనిట్ ఏర్పాటుకు 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 600 మెగా థర్మల్ పవర్ ప్లాంట్ల ఎదుట మరో 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా సూపర్క్రిటికల్ విధానంతో 800 మెగావాట్ల ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నూతనంగా నిర్మించనున్న 800 మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు అన్ని అనుమతులు పొందడానికి ఎనిమిదేళ్లు పట్టగా టెండర్లు ఖరారు కావడానికి మొత్తం 10 ఏళ్లు పట్టింది. రెండు దఫా లుగా సింగరేణి నిర్వహించిన టెండర్లలో రెండోసా రి బీహెచ్ఈఎల్ కంపెనీ దక్కించుకోగా సుమారు రూ.8,500కోట్ల అంచనా వ్యయంతో కొత్త ప్లాంట్ నిర్మించనున్నారు. టెండర్ల దశకు చేరుకోవడానికి పదేళ్లు పట్టగా పనుల ప్రారంభోత్సవానికి ముహూర్తం కాలిసి రావడం లేదు. ఓసారి ఉపముఖ్యమంత్రి ప్రోగ్రాం ఖరారై చివరి నిమిషంలో నేతల మధ్య వర్గపోరుతో రద్దయింది. ఉపముఖ్యమంత్రి పవర్ ప్లాంట్ సందర్శన, పలు ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉండగా వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. మళ్లీ సీఎం చేతుల మీదుగా కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవం ఉంటుందని అందరూ భావించారు. గత నెలలో అధికార యంత్రాంగం సీఎం ప్రోగ్రాం ఉంటుందని హడావుడి చేసినా అది కూడా ఖరారు కాలేదు. అసలు కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవానికి సమయమే కలిసిరావడం లేదని అభిప్రాయపడుతున్నారు. కాగా, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఇటీవల మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రి హోదాలో అతడు సీఎం రేవంత్రెడ్డి చే తుల మీదుగా ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలుగా కసరత్తు జరుగుతున్నా.. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కాంతులు పంచుతోంది. సింగరేణి సంస్థకు ఇక్కడి వనరులు అనుకూలించడం ప్రధానంగా అంచనాకు మించి సేకరించిన భూములతో థర్మల్ విద్యుత్ కేంద్రాలను విస్తరించే దిశగా ఆదిలోనే అడుగులు వేసింది. అందులో భాగంగానే నూతనంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ను రూ.8,500కోట్ల అంచనాతో నిర్మించాల ని నిర్ణయించింది. కానీ, నిధుల సమీకరణలో జా ప్యం చోటు చేసుకుందో?.. లేదా ఆశించిన స్థాయిలో సింగరేణి సంస్థకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించిందో.. లేదో కానీ 800 మెగావాట్ల ప్లాంట్ పనులు 10 ఏళ్లుగా టెండర్ల దశలోనే నిలిచాయి. ఎట్టకేలకు మళ్లీ బీహెచ్ఈఎల్ కంపెనీ పనులు దక్కించుకోగా పనుల ప్రారంభోత్సవానికి ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పవర్ప్లాంట్లో కొత్త ప్లాంట్ నిర్మించే ప్రాంతాన్ని చదును చేసి అధికార యంత్రాంగం ఎదురుచూస్తోంది. రాజకీయ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అధికారిక కార్యక్రమాలూ రద్దుకావడం అంతటా చర్చనీయాంశమైంది. కొత్త ప్లాంట్ నిర్మించనున్న ప్రాంతం ఉపాధి కోసం యువత నిరీక్షణఎస్టీపీపీలో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ పూర్తయితే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని స్థానిక నిరుద్యోగ యువకులు, భూనిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త ప్లాంట్ ప్రారంభమవుతుందని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ దాని పనులు ప్రారంభం కాకపోవడంతో వారికి నిరాశే మిగులుతోంది. కొత్త ప్లాంట్ ని ర్మాణంతో ప్రభావిత గ్రామాలతో పాటు పరిసరప్రాంతాల్లో ఇక నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరుతుందని అందరూ భావిస్తున్నారు. అయి నప్పటికీ ప్లాంట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుండడం గమనార్హం. -
బ్లాక్ స్పాట్ల గుర్తింపు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు మంగళవారం మంచిర్యాల రూర ల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రా జ్, కమిషనరేట్ రోడ్డు భద్రతా విభాగం హెడ్ కాని స్టేబుల్ చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఏఈఈ రవికిరణ్, జాతీయ రహదారి జేఈ సతీశ్, పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదా లు జరిగే ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా గ్రామాల రహదారులు జాతీయ రహదారిని సమన్వయం చేసే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు గాను స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, జాతీయ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్ లైటింగ్ పెంచడం, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన ప్రాంతాలతో పాటు వారసంతల వద్ద బారికేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
హాకీ చాంపియన్గా ‘హైదరాబాద్’
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్ జట్టుతో జరిగిన పోరులో 3–0 గోల్స్తో విజయదుందుభి మోగించింది. రెండో స్థానంలో నిజామాబాద్, మూడో స్థానంలో నల్గొండ జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్కుమార్, జనరల్ సెక్రటరీ సీఆర్ భీంసింగ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, యూనుస్ అక్బాన్, రాష్ట్రపాల్, క్రీడాకారులు, శిక్షకులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తాపడి ఒకరి మృతి
● ఐదుగురికి గాయాలు ముధోల్: మండలంలోని బోరిగాం, వడ్తాల గ్రామాల మధ్య ఆటో బోల్తా పడ్డ ఘటనలో బ్రహ్మణ్గావ్కు చెందిన రొడ్డ ముత్యం (50) మృతి చెందగా, ఐదుగురికి గాయాలైనట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన ఆటోలో మంగళవారం లోకేశ్వరం మండలం అబ్ధుల్లాపూర్ గ్రామానికి తమ బంధువు అంత్యక్రియలకు ముత్యం వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడడంతో గాయాల పాలైనవారిని భైంసా ఏరియాస్పత్రికి తరలిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ ముత్యం మార్గ మధ్యలో మృతి చెందాడు. గాయపడ్డ వారిలో బాసర మండలం కిర్గుల్(కే) గ్రామానికి చెందిన బుజ్జవ్వ, కాశీ, ముధోల్ మండలంలో బ్రహ్మణ్గావ్ గ్రామానికి చెందిన లక్ష్మి, గంగన్న, రువ్వి గ్రామానికి చెందిన శ్యామల ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. -
మహిళా సమాఖ్యకే ‘ట్రిపుల్ఐటీ యూనిఫాం’
నిర్మల్: రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ సేవలతో దూసుకుపోతున్న జిల్లా మహిళా సమాఖ్య మరో గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికే స్కూల్ యూనిఫాంలను కుడుతున్న సమాఖ్య తాజాగా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా గుర్తింపు ఉన్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల యూనిఫాంలనూ కుట్టించి ఇచ్చే పనిని దక్కించుకుంది. వేలాదిమంది విద్యార్థులుండే ట్రిపుల్ఐటీకి సంబంధించి రూ.54 లక్షల విలువైన యూనిఫాం కాంట్రాక్టు జిల్లా మహిళా సమాఖ్యకు దక్కడంపై డీఆర్డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గంగామణి హర్షం వ్యక్తంచేశారు. కలెక్టర్ అభిలాషఅభినవ్, ట్రిపుల్ఐటీ వీసీ గోవర్ధన్ సహకారంతో మహిళా సమాఖ్యకు ఈ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
కుంటాల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరా ల ప్రకారం.. కుంటాలకు చెందిన బాస హన్మాండ్లు (58) సోమవారం రాత్రి వర్షంలోనే నిత్యావసరాల కోసం కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. తల వెనుక, ముందు భాగం బలమైన గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అతడి కుమారుడు గజేందర్ బతుకుదెరువు కోసం ఏడాదిన్నర క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిడుగుపాటుకు మహిళ మృతిభీంపూర్: మండలంలోని నిపా ని గ్రామానికి చెందిన కలిమి నాగమ్మ (48) మంగళవారంపిడుగుపాటుకు గురై మృతి చెందింది. వివరాలు.. నిపాని గ్రామానికి చెందిన నాగమ్మ అత్త కర్మకాండలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీపూర్ గ్రామ సమీపంలోని చేను వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం రావడంతో బస్టాండ్ వద్ద ఆగిన సమయంలో పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కు చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. హమాలీవాడకు చెందిన తారచాంద్శర్మ భార్య అంకిత (40) ఈ నెల 7న ఉదయం కూ రగాయలు తీసుకువచ్చేందుకు మార్కెట్కు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తారచాంద్శర్మ మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఫిర్యాదువేమనపల్లి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగా యంటూ మండలంలోని కొత్తపల్లి గ్రామ రైతులు మంగళవారం తహసీల్దార్ సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో జరిగే అవకతవకల గురించి వివరించి ఆధారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పీఏసీఎస్ ద్వారా 19 లారీల వడ్లు కొనుగోలు చేసిన నిర్వాహకులు 15 రోజులైనా రైతులకు రషీదులు, ట్రక్షీట్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటివె న్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని తెలిపా రు. అక్రమాలపై సెంటర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం కలెక్టర్ను కూడా కలిసి తమ గోడు విన్నవించుకుంటామని వారు తెలిపారు. -
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు
ఆదిలాబాద్రూరల్: ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆది లాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో రౌ డీయిం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పే ర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధి లోని ఇందరమ్మ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి అతడి నుంచి రూ.2వేలు లా క్కున్న బంగారుగూడకు చెందిన షేక్ సలీంతో పా టు మరో ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసి రౌడీయిజం చేస్తే పోలీసులకు ఫి ర్యాదు చేయాలని, అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ ఉన్నారు. -
తేనెటీగల దాడిలో ఆరుగురికి గాయాలు
తానూరు: మండలంలోని ఝరి(బి)తండా గ్రామ శివారులో మంగళవారం పత్తి విత్తనాలు విత్తుతున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేయడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన బాధితులను గ్రా మస్తులు 108 అంబులెన్స్లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడిలో రాథో డ్ గోవర్ధన్, హరిదాస్, సుభాష్, ధన్రాజ్, దేవుకబాయి, శివరాజ్కు గాయాలయ్యాయి. బాధితులు ప్రస్తుతం భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జీసీసీ డీఎంగా పీహెచ్వోకు అదనపు బాధ్యతఉట్నూర్రూరల్: ఉట్నూర్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజన్ మేనేజర్గా ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి (పీహెచ్వో) సందీప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఎంగా పని చేసిన వీఎల్ఎన్ ప్రసాద్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినందున తాత్కాలికంగా సందీప్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు త్వరలో తెరచుకోనున్న నేపథ్యంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సూచన మేరకు సందీప్కు అదన పు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందీప్ను జీసీసీ సిబ్బంది గోవింద్రావు, లింబారావు, సత్యనారాయణ తదితరులు సన్మానించారు. మొక్కలు తొలగించి, చెట్లు నరికి నిరసనకడెం: రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామస్తుల ఆందోళన రెండోరోజూ కొనసాగింది. మంగళవారం గ్రామస్తులు మరిన్ని గుడిసెలు వేసి అక్కడే వంట చేసుకుని మకాం వేశారు. ఉడుంపూర్ ఎఫ్ఆర్వో అనిత ఎదుటే రాంపూర్ గిరిజనులు ప్లాంటేషన్లో మొక్కలు తొలగించారు. చెట్లు నరికి నిరసన తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎఫ్డీవో భవానీశంకర్ ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడినా వారు వినలేదు. తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని తేల్చిచెప్పారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
బెల్లంపల్లి: లేబర్ కోడ్ల రద్దు కోరుతూ జూలై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, బెల్లంపల్లి మండల కన్వీనర్ సీహెచ్ దేవదాస్ కోరారు. మంగళవారం బెల్లంపల్లి సీఐటీయూ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మి క, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడానికి సిద్ధపడిందని విమర్శించారు. ఈ తీరు అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో కార్మికులు సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాల ని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూ నియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, శ్రేణులు పద్మ, అనురాధ, రాజేశ్వరి, స్వాతి, సీఐటీయూ శ్రే ణులు యాకూబ్, సుమన్, నారాయణ, రవీందర్, విశ్వనాథ్, అనిల్, రాహుల్, కిశోర్ పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్జోన్ ఫీల్డ్ డైరెక్టర్(ఎఫ్డీపీటీ) శాంతారాం అన్నారు. మంగళవారం నస్పూర్లోని సమావేశమందిరంలో వన్యప్రాణుల సంరక్షణపై క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని అన్నారు. జంతువులను కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నైపుణ్యం కలిగిన వారితో ప్రత్యేక శిక్షణ అవసరమని అన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 50మందికి గన్ఫైరింగ్తో కూడిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్, ఏ.శంకరన్, సయ్యద్ మోహినొద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
సాగులో సందేహాలా..!
పాఠశాలల్లో మెనూ అమలు చేయాలిబెల్లంపల్లి: పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను వ్యవసాయ శాస్త్రవేత్త దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. వర్షాధారంగా పత్తి, వరి, కంది, పెసర, మొక్కజొన్న తదితర పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు నూతన సాగు పద్ధతులు, వంగడాలు, అధిక దిగుబడి సాధించే తీరు, చీడపీడల నివారణ, పంటల మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త కోట శివకృష్ణ దృష్టికి తీసుకెళ్లి తెలుసుకోవచ్చు.సమయం : నేడు మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల వరకు సంప్రదించాల్సిన నంబరు : 83338 18267 -
ప్రయాణికులపై ఆర్టీసీ బాదుడు
● పెరిగిన బస్సుపాస్ చార్జీలు ● మంచిర్యాల–హైదరాబాద్కు టోల్ వాత ● కిలోమీటర్ల రౌండప్ చార్జీలతో అదనపు భారం బస్పాస్ చార్జీలు తగ్గించాలిఆర్టీసీ బస్సుపాస్ చార్జీలు తగ్గించాలి. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. చార్జీల పెంపుతో గ్రామీణ విద్యార్థులపై పె నుభారం పడుతుంది. మూడు నెలల ప్యాకేజీని రూ.1200 నుంచి రూ.1800 వరకు పెంచారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు చెల్లించకుండా బస్చా ర్జీలు పెంచడం సరికాదు. పెంచిన 20శాతం బస్సుచార్జీలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని మంగళవారం ఆర్టీసీ డిపో కార్యాలయంలో వినతిపత్రం అందజేశాం. – బి.అభిరాం, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపింది. టోల్ప్లాజా దారుల్లో యూజర్ చార్జీలను ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.10 వసూలు చేస్తోంది. డిజీల్, ఇతరత్రా పెరిగిన ఖర్చుల సాకుతో అన్ని రకాల బస్పాస్ల ధరలూ పెంచింది. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటరు రౌండప్, టోల్ యూజర్, బస్పాస్ చార్జీ(రౌండెడ్ అప్)ల పేరిట ప్రయాణికులపై భారం మోపడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. యూజర్ చార్జీలు రూ.10, బస్పాస్ ధరలు రూ.300కు పైగా పెంచడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 146 బస్సులు ప్రతీ రోజు 62వేల కిలోమీటర్ల తిప్పడం ద్వారా రూ.34లక్షల నుంచి రూ.36లక్షల(మహాలక్ష్మి) మేర ఆదాయం సమకూరుతోంది. పెంచిన బస్చార్జీలు(టోల్ యూజర్ చార్జీ) వల్ల మంచిర్యాల నుంచి హైదరాబాద్కు వెళ్లే ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 చొప్పున మూడు టోల్ప్లాజాలు ఉండడం వల్ల రూ.30 వరకు అదనపు భారం పడుతోంది. మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్లే బస్సుల్లో రూ.10 టోల్ వసూలు చేస్తున్నారు. యాపల్ వరకు మినహాయిస్తే సోమగూడెం, బెల్లంపల్లి, తాండూర్, కాగజ్నగర్, ఆసిఫాబాద్కు వెళ్లే బస్సుల్లో ప్రతీ ప్రయాణికుడిపై రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంకోవైపు కిలోమీటరు రౌండప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులపై రూ.10 అదనపు భారం పడుతోంది. ఉదాహరణకు ఆదిలాబాద్ 166కిలోమీటర్లు కాగా 170 రౌండప్ కిలోమీటర్లు చేయడం వల్ల రూ.220 ఉంటే రూ.230 వసూలు చేయనున్నారు. మందమర్రి 13కిలోమీటర్లు ఉంటే 15 చేస్తారు. చిల్ల ర రౌండప్ పేరిట పెంచి రూట్లలో మాత్రం అన్ని మార్గాల్లో(స్టేజీలు) కిలోమీటరు రౌండప్ మార్చకపోవచ్చు. కిలోమీటర్లు ఏయే మార్గాల్లో అనేది స్పష్టత రావాల్సి ఉంది. మంచిర్యాల నుంచి కరీంనగర్, కాగజ్నగర్ వైపు వెళ్లే అన్ని రకాల బస్సుల్లో పాత చార్జీల కంటే రూ.10 పెరిగింది. బస్సుపాస్లపై చార్జీల మోత అన్ని రకాల బస్పాస్ చార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 20శాతం మేర బస్సుపాస్ ధరలు పెంచింది. రూ.1150 ఉన్న ఆర్డీనరి బస్పాస్ ధర రూ.1400కు పెరిగింది. జిల్లాలో 499సీజనల్ పాస్లు, 777 స్టూడెంట్ పాస్లు ఉన్నాయి. నెలవారీ పాస్లు తీసుకునే వారి నుంచి 20రోజులు టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం బస్పాస్ ధర రూ.1750 ఉంటే రూ.2150వరకు పెరిగింది. విద్యాసంస్థలు ప్రారంభమైతే ఎంతమేర స్టూడెంట్ పాస్ చార్జీలు పెరిగాయో తెలుస్తుంది. బస్చార్జీల బాదుడుకు అదనంగా బెల్లంపల్లి, కాగజ్నగర్ రూట్లలో ప్రయాణికులకు టోల్ యూజర్ చార్జీల భారం రూ.10 పడనునంది. ఓ వైపు ఉచితం.. మరోవైపు వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. మరోవైపు టోల్చార్జీలు, బస్పాస్ చార్జీలు, కిలోమీటర్ రౌండప్ పేరిట వాత పెడుతోంది. అక్కడ లోకల్ టోల్ మినహాయింపు.. ఆర్టీసీ బస్సులకు టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్తో ప్రయాణికులపై భారం తగ్గించవచ్చు. ప్రస్తుతం రూ.30 టికెట్ ధర ఉంటే రూ.40 వసూలు చేస్తున్నారు. మంచిర్యాల డిపో నుంచి 20 నుంచి 30కిలోమీటర్లు ఉంటే జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన బస్సులకు లోకల్ కన్సెషన్ వర్తింపు ద్వారా టోల్చార్జీల భారం తగ్గించవచ్చు. బెల్లంపల్లి, కాగజ్నగర్, ఆసిఫాబాద్ వైపు వెళ్లే బస్సులకు మందమర్రి టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్ ఇవ్వడం వల్ల రూ.10 భారం తగ్గించే వీలుంది. ఉమ్మడి జిల్లాలోని దిలావర్పూర్ టోల్గేట్ వద్ద లోకల్ కన్సెషన్ కింద బస్సులకు సున్న చార్జీలు పడుతున్నట్లు తెలుస్తోంది. మందమర్రి టోల్గేట్ దగ్గర కూడా మినహాయించాలని పలువురు కోరుతున్నారు. మంచిర్యాల–హైదరాబాద్ చార్జీలు(టోల్ యూజర్ చార్జీ కలిపి)బస్సులు పాత బస్సు చార్జీలు పెరిగిన చార్జీలుసూపర్ లగ్జరీ రూ.470(జెబీఎస్) రూ.500 రాజధాని రూ.600(జేబీఎస్) రూ.630 లహరీ నాన్ ఏసీ రూ.480 రూ.510 లహరీ ఏసీ రూ.620 రూ.650 ఎక్స్ప్రేస్ రూ.360 రూ.390 -
పంట సాగులో రైతులకు చేయూత
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: పంట సాగులో రైతులకు సాగునీరు, రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర అన్ని విధాలుగా చేయూత అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో కలిసి వానాకాలం సాగు సంసిద్ధత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పౌల్ట్రీ, డెయిరీ ఫారాలు, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, పెరటి కోళ్ల పెంపకం ఇతర అంశాలపై రాయితీ రుణాలు అందించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎరువులు, వరి, పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ పంట మార్పిడి విధానాన్ని అవలంబించి వాణిజ్యం, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడితోపాటు భూసారం పెంపొందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ, మార్కెట్ కమిటీ అధికారులు, చైర్మన్ ప్రేమ్చంద్, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సింగతి మురళి, బ్యాంకు అధికారులు, ఫర్టిలైజర్ షాపుల యజమానులు, రైతులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు మంచిర్యాలరూరల్(హాజీపూర్): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీ పూర్ మండలం వేంపల్లి, పెద్దంపేట గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుతోపాటు రిజిష్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిస్తే త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, నాయబ్ తహసీల్దార్ అతీశ్, గిర్దావర్లు మంగ, ప్రభు పాల్గొన్నారు. అనంతరం దొనబండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంటశాల పరిసరాలను పరిశీలించి పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
పాతమంచిర్యాల: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మ ద్దూరి రాజుయాదవ్, కమలాకర్ మాట్లాడుతూ ఈపీఎఫ్–95 కనీస పింఛన్ రూ.1000నుంచి రూ. 5000 వెంటనే చెల్లించాలని, ఈపీఎఫ్ వేతన పరి మితి రూ.15000 నుంచి రూ.30000 పెంచాలని, ఈఎస్ఐ పరిమితిని రూ.21000 నుంచి రూ.42000 పెంచాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషధం విధించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రభాకర్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు. -
21నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఈ నెల 21, 22వ తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు కలవేన శంకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రామసుధా రెసిడెన్సిలో మహాసభల నిర్వహణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21న ప్రదర్శన మహాసభ, 22న ప్రతినిధుల సభ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హాజరవుతారని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మేకల దాసు, మిట్టపల్లి పౌలు, వెంకట స్వామి, రేగుంట చంద్రశేఖర్, ఖలిందర్ అలీఖాన్, ముష్కె సమ్మయ్య, రేగుంట చంద్రకళ, లింగం రవి పాల్గొన్నారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ● సొంత ఇంటి స్థలం ఉన్న తనకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్థికసాయం అందించాలని చెన్నూర్ మండలం ఒతుకులపల్లి గ్రామానికి చెందిన మద్దూరి అఖిల కోరింది. ● మా తాత పేరిట ఉన్న భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని మందమర్రికి చెందిన నాగుల కార్తీక్ ఫిర్యాదు చేశాడు. ● దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన నిమ్మల బాపు, తాను కొనుగోలు చేసిన భూమిని తన పేరిటా పట్టామార్పిడి చేయాలని హాజీపూర్ మండలం నంనూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అర్జీ అందజేశారు. ● నస్పూర్ మండలం సీతారాంపల్లి శివారులో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని జగిత్యాల జిల్లా జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామానికి చెందిన నర్వేసి అస్మిత ఫిర్యాదు చేసింది. ● రేషన్కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు అందించానని, గతంలో మహారాష్ట్రలో ఉంటే తొలగించి ఇక్కడ దరఖాస్తు చేసుకున్నానని, మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని మందమర్రి పట్టణంలోని దీపక్నగర్కు చెందిన మాటురి ఆనంద్ దరఖాస్తు అందజేశాడు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
భైంసాటౌన్: పట్టణంలోని గీతా కాటన్ ఇండస్ట్రీస్లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న చంద్రకాంత్ దేశ్ముఖ్ అనే వ్యక్తి సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. కుభీర్ మండలం వర్నికి చెందిన చంద్రకాంత్ కొన్నేళ్లుగా రాహుల్నగర్లో ఉంటూ, గీతా కాటన్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఫ్యాక్టరీలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయమై పట్టణ సీఐ జి.గోపినాథ్ను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. గంజాయి దహనంఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన 14 కేసుల్లో పట్టుబడ్డ 77 కిలోల 781 గ్రాముల గంజాయిని దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంటర్ వద్ద గంజాయి డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డీసీఆర్బీ డీఎస్పీ సీహెచ్ నాగేందర్, డీసీఆర్బీ ఎస్సై హకీమ్లు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో అధికారుల నిలదీతదండేపల్లి: మండలంలోని తాళ్లపేటలో సోమవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులను గ్రామానికి చెందిన కొందరు సమస్యలపై నిలదీశారు. గ్రామానికి చెందిన ఎండీ రశీద్ఖాన్ డీఎస్ పెండింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ చేయడంతో సమస్య పరిష్కారం కాలేదని, సదస్సుకు హాజరైన డీటీ మాధవి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు లావణ్య, ప్రవీణ్లను ప్రశ్నించారు. అధికారులు కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. రశీద్ఖాన్తో పాటు నర్సయ్య అనే మరో రైతు సైతం అధికారులను తన సమస్యపై ప్రశ్నించాడు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తాళ్లపేటలోనే భూ సమస్యలపై 57, సాదాబైనామాలకు సంబంధించి 79 దరఖాస్తులు వచ్చాయి. -
‘విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి’
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా భవనాలు, మహిళా సంఘాల పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని గుర్తించాలని సూచించారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అక్టోబర్ 2లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి యాదయ్య, వెనుబడిన తరుగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, రౌఫ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యాసంగి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.360.10 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 31,702 మంది రైతుల నుంచి 1,99,383 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. సన్నబియ్యం విక్రయిస్తే కార్డు రద్దు మంచిర్యాలఅగ్రికల్చర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, అక్రమంగా విక్రయిస్తే చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ నెల 30వరకు బియ్యం పొందవచ్చని తెలిపారు. ఉపకరణాల కోసం దరఖాస్తుల స్వీకరణ మంచిర్యాలఅగ్రికల్చర్: దివ్యాంగులకు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రెట్రోఫిట్మెంట్ స్కూటీలు, బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, హైబ్రిడ్ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, చేతికర్రలు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, క్రచెస్, వాకింగ్ స్టిక్స్ మంజూరైనట్లు తెలిపారు. దివ్యాంగులు https//tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 155326లో సంప్రదించాలని తెలిపారు. -
పొట్టకూటి కోసం వెళ్లి అదృశ్యం
● గల్ఫ్దేశంలో జాడ తెలియని నిర్మల్ జిల్లావాసి ● ఆందోళనలో కుటుంబసభ్యులు ● ఇండియాకు రప్పించాలని వినతి నిర్మల్ఖిల్లా: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన జిల్లాకు చెందిన ఓ కార్మికుడి ఆచూకీ తెలియక అతడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్కు చెందిన పన్నాల శ్రీనివాస్(40) గత 16 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో తోటమాలిగా పనిచేస్తున్నాడు. ప్రతీ రెండూ, మూడేళ్లకొకసారి ఇంటికి వస్తూ పోతుండేవాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తాజాగా ఎనిమిది నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్ ఇక ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే సౌదీ అరేబియాలోని తన యజమాని వచ్చి పనిలో చేరాలని కోరగా గత మే నెలలో మళ్లీ వెళ్లాడు. అక్కడ యజమాని ఇంట్లో రెండు రోజులు ఉన్న అనంతరం వ్యవసాయ క్షేత్రానికి పంపగా అక్కడి నుంచి తన భార్యాపిల్లలకు ఫోన్ చేసి క్షేమ సమాచారం అందించాడు. అనంతరం అతని నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి యజమానికి ఫోన్ చేయగా స్పందించలేదని, శ్రీనివాస్ క్షేమసమాచారంపై తమకు ఆందోళనగా ఉందని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో శ్రీనివాస్ తల్లి గంగవ్వ, భార్య మమత, ముగ్గురు పిల్లలు వాపోయారు. సౌదీ అరేబియా నుంచి స్వస్థలానికి రప్పించే ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. అనంతరం రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి పూర్తి వివరాలు అందజేశారు. అక్కడి ఎంబసీతో మాట్లాడి శ్రీనివాస్ ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు ఆయన భరోసానిచ్చారు. -
‘ఖర్గే’ను కలిసిన మంత్రి వివేక్
చెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి తన సతీమణి సరోజ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖా ర్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. సోమవారం ఢిల్లీలో వారిని కలి సి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ రా ష్ట్రంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చే యాలని, రానున్న కార్పొరేషన్, మున్సిపాల్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా పని చేయాలని ఖర్గే సూచించినట్లు తెలిపారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
మంచిర్యాలటౌన్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్తో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏళ్లలోపు పిల్లలతో పని చేయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికుల సమాచారాన్ని 1098 నంబరులో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్వో రామ్మోహన్, డీసీపీవో ఆనంద్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘సాక్షి’పై దాడులు అమానుషం
కరీంనగర్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్, ఆంధ్రప్రదేశ్లోని ‘సాక్షి’ కార్యాలయాలపై దుండగుల దాడిని ఖండిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని సాక్షి యూనిట్ ఆఫీస్ వద్ద జర్నలిస్టులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ మీడియా స్వేచ్ఛను కాలరాస్తూ అణచివేయాలని చూడడం దారుణమన్నారు. నిరసనలో యూనిట్ మేనేజర్ వైద శ్రీనివాస్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జీలు ముజఫర్, గుర్రాల మహేశ్, డెస్క్ జర్నలిస్టులు బొగ్గుల సంతోష్, ములుకుంట్ల కనకేశ్వర్, మామిండ్ల బాలనర్సయ్య, డి.రాజశేఖర్, పోలు సంపత్, దూట వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
విప్లవ వీరుడా.. ఇక సెలవు..!
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఆయన స్వగ్రామం పొచ్చెరలో కు టుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, అభిమానుల మధ్య ముగిశాయి. అడెల్లు అంతిమయాత్రలో గ్రా మం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. ఆదివారం రార తి బీజాపూర్ నుంచి పొచ్చెర గ్రామానికి ఆడెల్లు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అడెల్లు భౌతికకాయంపై ఎర్రని వస్త్రం ఉంచి నివాళులర్పించారు. సోమవారం ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), సీపీఐ డెమొక్రటిక్, ప్రజాసంఘాల నాయకులు, మాజీ మావోయిస్టులు, అభిమానులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అడెల్లు భౌతికకాయానికి నివాళులర్పించా రు. గ్రామంలోని వీధుల గుండా అంతిమయాత్ర ని ర్వహించారు. పౌర హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, విరసం నేతలు, మాజీ మావోయిస్టులు, కళాకారులు పాటలు, నృత్యాలు చేస్తూ అడెల్లుకు నివాళులర్పించారు. ఎర్రజెండాలు చేతపట్టి, అడెల్లు అమర్రహే అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలో ముందుకుసాగారు. ‘ఆదివాసీలదే అడవి, కగా ర్ ఆపరేషన్ ఆపివేయాలని’ ప్లకార్డులు పట్టుకుని అంతిమయాత్ర నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర 3 గంటలకు ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. ప్రజా సంఘా ల నేతలు సైతం కన్నీరుమున్నీరయ్యారు. మాజీ మావోయిస్టులు ఉద్యమంలో అడెల్లుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విలపించారు. కాగా గ్రామంలోని వైకుంఠధామం వద్ద అడెల్లుకు అంత్యక్రియలు నిర్వహించారు. అడెల్లు అన్న పెద్ద అడెల్లు దహన సంస్కారం నిర్వహించారు. ‘చంపే హక్కు ఎవరికీ లేదు’.. అడెల్లు భౌతికకాయం వద్ద పౌర హక్కుల నాయకులు, అమరుల బంధు,మిత్ర సభ్యులు, మానవహక్కుల వేదిక నాయకులు, విప్లవ రచయిత సంఘం(విరసం) నేతలు మాట్లాడారు. ఒక మనిషిని చంపే హక్కు రాజ్యాంగం కల్పించలేదని, అలాంటిది రాజ్యాంగాన్ని విస్మరిస్తూ మావోయిస్టులను పిట్టల్లా చంపుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తే వారిని చంపుతారా అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భజంగ్ రావ్ అన్నారు. అడెల్లును పట్టుకుని, విషంతో కూడిన ఆహారం తినిపించి చెట్టుకు కట్టి కాల్చి చంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మఫ్తీలో పోలీసులు.. అడెల్లు అంత్యక్రియల్లో పోలీసులు మఫ్తీలో ఉండి నిఘా వేశారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం అంత్యక్రియలు ముగిసే వరకు కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించారు. భౌతికకాయంపై ఎర్రజెండా కప్పుతున్న విరసం, అమరుల బంధుమిత్ర సభ్యులు 30 ఏళ్ల ఉద్యమ బాటకు ఇక సెలవు.. నూనూగు మీసాల వయస్సులో పేగు బంధాన్ని తెంచుకుని పోరు బాటలో నడిచి, చివరకు అడవిలో రక్తపు సింధూరమై 30 ఏళ్ల తరువాత స్వగ్రామానికి తిరిగి వచ్చిన అడెల్లు మృతదేహం ఎర్రని వర్ణపు తాకిడికి తడిసి ముద్దయింది. కట్టెలో తన మేను కాలినా, అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనాలను చూస్తే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడని రుజువైంది. – బోథ్ ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మైలారపు అడెల్లు భౌతికకాయానికి బోథ్ ఎ మ్మెల్యే అనిల్ జాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడెల్లు సొంత లాభం కోసం పనిచేయలేదని, పేద ప్రజల కోసమే చిన్న వయస్సులోనే ఉద్యమంలోకి వెళ్లాడన్నారు. 30 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉండి పేద ప్రజల పక్షాన నిలబడ్డాడని తెలిపారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కగార్ పేరుతో చేపట్టిన ఎన్కౌంటర్లు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఇవి ఎన్కౌంటర్లు కావని పట్టుకొచ్చి కాల్చి చంపడమని ఆరోపించారు. అడెల్లు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు రూ.10 వేలు అందించారు. -
లారీలో అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
భీమారం: మహారాష్ట్ర నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 35 పశువులను సోమవారం భీమారం సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దఎత్తున పశువులను లారీల్లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు భీమారంలో తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని ఆపగా లారీ డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పారిపోతున్న డ్రైవర్ను వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా ఎద్దులను మహారాష్ట్ర నుంచి జగిత్యాల జిల్లా రాజరాంపల్లికి తరలిస్తున్నామని తెలిపాడు. అనంతరం లారీని పోలీస్స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ రుక్సాకా, యజమాని పంకజ్ గోపాల్ సింగ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. పశువులను చెన్నూరు పట్టణం సమీపంలోని గోశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా వెటర్నరీ వైద్యుడు రాకేశ్ శర్మ పశువులకు పరీక్షలు నిర్వహించారు. -
ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే రెండు రోజుల క్రికెట్లీగ్ పోటీల కోసం ఉమ్మడి జిల్లా నుంచి క్రికెట్ జట్టు ఎంపిక చేసినట్లు హెడ్కోచ్ పి.ప్రదీప్, సెలెక్టర్లు గోదావర్తి సుధీర్, చందు, పత్తి తిరుపతి, బి.రాకేశ్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 90 మంది క్రీడాకారులు రాగా, వారిని ఆరు జట్లుగా విభజించి, ఎంపిక పోటీలు నిర్వహించామన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన వారిని అండర్ 25 ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిలో మంచిర్యాలకు చెందిన సాయికృష్ణారెడ్డి, ఐ. సందీప్, ఇజాన్ అవాజ్, అశ్రిత్, ఎండీ జాంషెడ్, చరణ్, ఆసిఫాబాద్ నుంచి ఏ.సంతోష్, మందమర్రి నుంచి సింహాద్రి, రామ్యాదవ్, లక్ష్మణ్ యాదవ్, సాయి వర్మ, వేంపల్లి నుంచి సాత్విక్ పటేల్, నిర్మల్ నుంచి వినయ్, ఆదిలాబాద్ నుంచి శ్రీచరణ్, చందన్, దర్శ్ అగర్వాల్, ముసాదిక్, రాజబాబు, గుడిపేట్ నుంచి జే. సంతోష్, బెల్లంపల్లి నుంచి సుభాష్ చంద్రబోస్లు ఎంపికై నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తిపై కేసుఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్రూరల్ మండల పరిధిలోని బెల్లూరి శివారు ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న గోలి మనోజ్ కుమార్పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దుకాణంలో తనిఖీలు చేశారు. షాపులో రెండు నకిలీ విత్తన ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఎలాంటి అనుమతి లేకుండా 227 ప్యాకెట్లను నిల్వ ఉంచాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఏవో నగేశ్ రెడ్డి, ఆర్ఐ నారాయణలు ఉన్నారు. మద్యానికి బానిసై ఆత్మహత్యనేరడిగొండ: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన లక్ష్మణ్ (32) మద్యానికి బానిసై సోమవారం మండలంలోని చించోలి గ్రామ సమీపంలో గల వాగులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి లక్ష్మణ్ తాగుడికి బానిసై దొంగతనాలు చేసే వాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆదివారం తన పక్కింట్లో 11 గ్రాముల బంగారం దొంగలిస్తూ పట్టుబడడంతో పంచాయతీ నిర్వహించి గ్రామపెద్దలు మందలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
● ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ● ‘సాక్షి’తో డీఈవో ఎస్.యాదయ్య
మంచిర్యాలఅర్బన్: ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపు, నాణ్యమైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాల సాధననే విద్యాశాఖ లక్ష్యం. ఉచితంగా అందిస్తున్న యూనిఫాం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, బోధన తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం..’’ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య అన్నారు. మరో రెండ్రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు, పాఠశాలల నిర్వహణపై పలు విషయాలు వెల్లడించారు. సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు డీఈవో: ఈ నెల ఆరు నుంచి 19వరకు బడిబాట చేపడుతున్నాం. గ్రామసభలు, స్వయం సహాయక సంఘాల సమావేశాల నిర్వహణ, ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లల గుర్తింపు, కరపత్రాల ద్వారా ప్రచారం చేపట్టాం. సామూహిక అక్షరాభ్యాసం, విలీన విద్య, బాలల సభ, బాలిక విద్య, తరగతుల డిజిటలీకరణతోపాటు చివరి రోజున క్రీడాపోటీలు నిర్వహించనున్నాం. సర్కారు బడుల్లో బోధన తీరు, సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సర్కారు పాఠశాలల్లో నాలుగు వేల మందికి పైగా ప్రవేశాలు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అడ్మిషన్లు ఎక్కువగా చేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో సన్మానిస్తాం. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మాటేమిటి..? డీఈవో: బడులు ప్రారంభమైన తొలిరోజే అందరికీ పాఠ్యపుస్తకాలు, ఒక జత దుస్తులు పంపిణీ చేస్తాం. జిల్లాకు అవసరమైన 3,07,820 పాఠ్యపుస్తకాలకు గాను 2,98,670 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 9, 10వ తరగతులకు పర్యావరణం పుస్తకాలు రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో అన్ని పుస్తకాలు రావొచ్చు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 56వేల వర్క్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నాం. 42,711 యూనిఫామ్లు అవసరం. పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు అందజేస్తాం. బడుల్లో చేపట్టిన పనులు పూర్తవుతాయా..? డీఈవో: సర్కారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 739 అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలతో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నవీకరణ, మరమ్మతులకు రూ.22 కోట్లు కేటాయించారు. దాదాపుగా 95శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మన ఊరు–మన బడి కింద 245 పాఠశాలల్లో పనులు చేపట్టాం. ఇందులో అసంపూర్తి పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాగునీరు, మరుగుదొడ్డి, ప్రహరీ వంటివి మొదలు కాకపోతే కలెక్టర్ అనుమతి ఇస్తామని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లతోపాటు కనీస వసతుల కల్పనలో ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కృత్రిమమేధ ఆధారిత అభ్యసనపై వివరించండి.. డీఈవో: ప్రాథమిక స్థాయిలో అభ్యసనలో తెలుగు, ఆంగ్లం, గణితంలో వెనకబడిన విద్యార్థులు నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని స్వయంగా పరీక్షించుకోవడం, తద్వారా అభ్యసనలో చురుగ్గా పాల్గొనడం లక్ష్యాలుగా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత అభ్యసన కార్యక్రమం రూపొందించాం. గతేడాది ప్రయోగత్మకంగా 13 మండలాల్లో 22 ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేశాం. ఈ విద్యాసంవత్సరంలో 50శాతం అంతకంటే ఎక్కువ మంది 68 పాఠశాలల్లో అమలుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి. విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఐదు కంప్యూటర్లు అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉపాధ్యాయుల ఖాళీలు..డీఈవో: 2024 డీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో 265 మంది ఉపాధ్యాయులను నియమించాం. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధిగమించాం. ఎక్కడైనా రిటైర్మెంట్లు, పలు కారణాల వల్ల ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే కలెక్టర్ అనుమతితో సర్దుబాటు చేస్తాం. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. అనుమతిలేని ప్రైవేట్ పాఠశాలలపై తీసుకుంటున్న చర్యలేమిటి..?డీఈవో: అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపకూడదని ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా అనుమతులు లేకుండా నిర్వహిస్తే తమ దృష్టికి తీసుకువస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పా ఠశాలల్లో చేర్పించే ముందు అ నుమతులు, సౌకర్యాలు ఉన్నాయా..? లేదా అని ఒకటికి రెండు సార్లు తల్లిదండ్రులు ఆలో చించాలి. ఫీజుల భారం లేకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, డిజిటల్ బోధన అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. -
చేపమందుకు విశేష స్పందన
దండేపల్లి: ఉబ్బసం వ్యాధి నివారణకు మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా దండేపల్లిలో రంగసాయి ప్రేంరాజ్–భూలక్ష్మీ దంపతులు సోమవారం నిర్వహించిన ఉచిత చేప మందు పంపిణీకి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సహాకార చైర్మన్ కోట్నాక తిరుపతి ప్రారంభించారు. దూర ప్రాంతాలవారు మందు కోసం ఒక రోజు ముందే వచ్చారు. పంపిణీ సమయంలో వర్షం పడడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు వివిధ జిల్లాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గ్రామానికి చెందిన పలువురు వాలంటీర్లుగా సేవలు అందించారు. ఎస్సై తహాసీనొద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.