breaking news
Mancherial
-
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బేల: మండల కేంద్రంలోని గణేశ్ గార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు బావునే శ్రీకాంత్(28) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దాబాల వైపు నుంచి బేల వైపునకు ద్విచక్ర వాహనంపై శ్రీకాంత్ వస్తున్నాడు. బేల నుంచి డోప్టాల వైపునకు మరో ద్విచక్రవాహనంపై డోప్టాలకు చెందిన అంకత్ గజానన్, లాండసాంగ్వికి చెందిన అంకత్ గణేశ్లు వెళ్తున్నారు. గణేశ్ గార్డెన్ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. బేలకు చెందిన శ్రీకాంత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. -
కడుపు నొప్పితో బాలుడు మృతి
నెన్నెల: తీవ్రమైన కడుపునొప్పితో బాలుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఆవుడం గ్రామానికి చెందిన బేతు వర్షిత్సాయి (14) స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం స్థానికంగా ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ బగారా రైస్, చికెన్ కర్రీ తిన్నాడు. అదేరోజు రాత్రి సొంతింటికి వచ్చాడు. ఇంట్లో మరోసారి పప్పుతో భోజనం చేశాడు. బుధవారం ఉదయం 3 గంటల సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు స్థానికంగా ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ సూచన మేరకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. పోస్టుమార్టంలో మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. -
పశువులు అక్రమంగా తరలిస్తున్న ముఠా అరెస్ట్
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నుంచి పశువులను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల గుండా కొచ్చిన్కు తరలించే అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గాడ్చందూర్కు చెందిన ఇమ్రాన్ బాబు షేక్, ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ జాకిర్లు ఇచ్చోడ మార్కెట్లో 16 ఎద్దులను కొనుగోలు చేసి, అదనంగా మూడు ఎద్దులను దొంగిలించి అక్రమంగా కొచ్చిన్ తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు బుధవారం రోల్మామడ టోల్ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో పశువులను కొనుగోలు చేసి, కొన్నింటిని దొంగతనం చేసి మొహమ్మద్ ఇమ్రాన్కు చెందిన వాహనంలో అనంతపూర్ మార్గం గుండా కొచ్చిన్లోని మహేంద్రత్రిమూర్తి వద్దకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాకు సఫాన్ హనీఫ్ సేథ్, అస్లాం, మెహబూబ్ అలీ ఖురేషి అనే వ్యక్తులు మద్దతు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇందులో భాగస్వాములైన 8 మందిని రిమాండ్కు తరలించామని, ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
అమ్మవారికి పూలు, పండ్లు సమర్పణ
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహాపోచమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు బుధవారం మూడోరోజుకు చేరుకున్నాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి వేదపండితులు చంద్రశేఖరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో ఫల పుష్పాధివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నిత్యనిధి ఛండీహోమం, సహస్రకళశాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి ప్ర త్యేక భజన భృందం ఆధ్వర్యంలో కళాకారుల భజ న, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిర్వహించారు. పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పరారీలో ఉన్న నిందితుల అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తాళ్లగురిజాల ఎస్సై బి. రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత సెప్టెంబర్ 6వ తేదీ, రాత్రి 11.30 గంటలకు బుధాకలాన్ గ్రామంలో వినాయక నిమజ్జనం జరుగుతున్న క్రమంలో గొడవ జరుగుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదు అందిందన్నారు. పోలీసు సిబ్బంది శివ శంకర్, శివకృష్ణలు అక్కడికి చేరుకొని సర్ధి చెబుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన చింతకుంట్ల గణేశ్, చింతకుంట్ల మహేశ్లు పోలీసులను అడ్డుకుని దాడి చేసి విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. తాజాగా బుధవారం గ్రామంలో తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వివరించారు. సిబ్బంది అశోక్, శివకృష్ణ పాల్గొన్నారు. -
ముగిసిన కంపెనీస్థాయి సాంస్కృతిక పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈ ఆర్ క్లబ్ ఆవరణలో రెండు రోజులు కొనసాగిన కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలు బుధవారం ము గిశాయి. ఈ పోటీల్లో సింగరేణిలోని ఆయా ఏరియా నుంచి వచ్చిన కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. మందమర్రి –బెల్లంపల్లి ఏరియా జట్టు ప్రదర్శించిన ఫోక్ డ్యాన్స్ మొదటి బహుమతి గెలుచుకోగా, సింగరేణి నుంచి కోలిండియా పోటీలకు ఎంపికై నట్లు డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ కమిటీ ప్రకటించింది. పోటీల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు ఏరియా జీఎం రాధాకృష్ణ బహుమతుల ప్రదానం చేశారు. జీఎం మాట్లాడుతూ ఏ పోటీల్లోనైనా గెలుపోటములు సహజమన్నారు. ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఏరియా గౌరవ కార్యదర్శి కార్తీక్, ఆయా ఏరియాల క్రీడల సూపర్వైజర్స్ జాన్వెస్లీ, సీహెచ్ అశోక్, హెచ్. రమేశ్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, ఆయా ఏరియా స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్, యూనియన్ల ప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు ఉన్నారు. -
పోలీసు స్టేషన్ నుంచి నిందితుడు పరార్
రెబ్బెన(ఆసిఫాబాద్): మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపిన కేసులో ప్రధాన నిందితుడు పోలీసు స్టేషన్ నుంచి పరారైన ఘటన కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. తిర్యాణి మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హన్మంత్రావు(50)ను మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అ దే గ్రామానికి చెందిన రాయిసిడాం వినోద్ శని వారం రాత్రి గొడ్డలితో దారుణంగా నరికి చంపా డు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన సర్కిల్ కార్యాలయానికి తరలించారు. సోమవారం రాత్రి మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన వినోద్ వెంట ఉన్న పోలీసును తోసేసి పారిపోయాడు. తక్షణమే స్పందించిన పోలీసులు నిందితు డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రాత్రిపూట కావడంతో అతడి జాడ చిక్కలేదు. మళ్లీ మంగళవా రం తెల్లవారుజాము నుంచే రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ముమ్మరంగా గాలించారు. రెబ్బెన పోలీ స్స్టేషన్కు వెనుక వైపు కొంతదూరంలో పత్తిచేనులో నిందితుడికి వేసిన బేడీలు దొరికాయి. స్టేషన్ నుంచి అతడు తిర్యాణి మండలానికి చేరుకున్నట్లు గుర్తించారు. రోంపల్లి సమీపంలో స్థానికులకు వినోద్ తారసపడినట్లు సమాచారం. రోంపల్లి పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించినా బుధవారం సాయంత్రం వరకు జాడ దొరకలేదు. రెబ్బెన సీఐ సంజయ్తోపాటు తిర్యాణి, రెబ్బెన ఎస్సైలు, సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ విషయమై రెబ్బెన సీఐ సంజయ్ను ‘సాక్షి’ సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ఇటుకల పిల్లర్ పడి బాలుడు..
బేల: మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా కాలనీలో ఓ ఇంటి ప్రాంగణంలో ఆట ఆడుకునే క్రమంలో ఇటుకల పిల్లర్ పడి ఇందిరానగర్ కాలనీకి చెందిన బాలుడు డౌరే వీర్(7) తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రంలోని విఠల్ రుక్మబాయి ఆలయం కార్తిక పౌర్ణమి సప్తాహలో భాగంగా డౌరే ప్రణయ్ సోదరుడు శంకర్ ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం కోసం ఇంటి ఎదుట రోడ్డుపై వేసిన టెంట్ తాడును ఇంటి గేటుకు చెందిన ఇటుకల పిల్లర్కు కట్టారు. మంగళవారం చీకటి పడే క్రమంలో రాత్రి డౌరే ప్రణయ్ పెద్ద కూమారుడు డౌరే వీర్, టెంట్ తాడును పట్టుకుని లాగి ఆడుకునే క్రమంలో పిల్లర్ విరిగి పడింది. డౌరే వీర్కు తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది. వెంటనే వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు బాలుడి తండ్రి డౌరే ప్రణయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్. ప్రవీణ్ తెలిపారు. -
ఆపరేటర్ లేక కరెంట్ తిప్పలు!
చుట్టుపక్కల గ్రామాల్లోని విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు బేల మండలం సిర్సన్న గ్రామంలో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ను నిర్మించారు. విద్యుత్ సరఫరా పర్యవేక్షించే ఆపరేటర్ లేకపోవడంతో గతేడాది కాలంగా సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగలేదు. సిర్సన్న గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేపట్టడంతో ఇటీవల కేవలం ఆ ఒక్క గ్రామానికే సింగిల్ ఫేజ్తో కూడిన విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. మిగితా గ్రామాలకు మాత్రం ఇంకా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సబ్స్టేషన్ను పూర్తిస్థాయిలో వినియోగిస్తే పది గ్రామాలకు త్రీఫేజ్తో కూడిన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
‘కలప అక్రమ తరలింపునకు అడ్డుకట్ట’
జన్నారం: రాత్రిపూట కలప అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం జన్నారం డివిజన్ ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని కామన్పల్లి గ్రామ ప్రధానకాలువ వద్ద చెక్పోస్టును సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఎఫ్డీవో మాట్లాడుతూ చెక్పోస్టు వద్ద రాత్రి, పగలు ఉండేలా సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. రాత్రివేళ చెక్పోస్టులతో పాటు పెట్రోలింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా కలప తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడవుల రక్షణకు గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని కోరా రు. ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ, జన్నారం ఇన్చార్జి రేంజ్ అధికారి మ మత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రియాజోద్దీన్, నాయకులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
‘జోనల్’ క్రీడలకు సిద్ధం
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల 11వ జోనల్స్థాయి బాలికల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ముస్తాబైంది. కాళేశ్వరం జోన్ పరిధిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల నుంచి క్రీడాకారులు హాజరు కానుండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 6 గురువారం నుంచి జరిగే పోటీలకు జోన్ పరిధిలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 3, మంచిర్యాల నుంచి 4, ములుగు నుంచి 1, పెద్దపల్లి నుంచి 4, భూపాలపల్లి జిల్లా నుంచి 3 గురుకులాల విద్యార్థులు హాజరు కానున్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పక్షుల కిలకిల రావాలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన విశాల మైదానంలో పోటీలు నిర్వహించనున్నారు. పోటీల కోసం కళాశాల ఆవరణలోని మైదానం సిద్ధం చేశారు. క్రీడాకారులకు వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. జోనల్ స్థాయి పోటీలకు లక్సెట్టిపేట కళాశాల ఐదోసారి ఆతిథ్యం ఇస్తుండగా అట్టహాసంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీల నేపథ్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. మైదానంలో అన్ని క్రీడలకు కోర్టులు వేశారు. 6 నుంచి 8వరకు.. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే పోటీల్లో కాళేశ్వరం జోన్ పరిధిలోని 15 పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో పాఠశాల/కళాశాల నుంచి 85మంది క్రీడాకారుల చొప్పున 1275మంది హాజరవుతారు. అండర్–14 విభాగంలో 375మంది, అండర్–17లో 375, అండర్–19లో 45మంది క్రీడాకారులు పాల్గొంటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్, టెన్నికాయిట్, బాల్బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. అథ్లెటిక్స్ విభాగం నుంచి 100, 200, 400, 800, 1500 మీటర్లు, మూడు కిలోమీటర్ల పరుగు పందేలు, షార్ట్పుట్, డిస్కస్త్రో, లాంగ్జంప్, హైజంప్, రిలే వంటి పోటీలు నిర్వహిస్తారు. ఓవరాల్ ఇన్స్ట్రక్టర్గా మల్లిక, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాధారాణి వ్యవహరిస్తుండగా, నిర్వహణ ఏర్పాట్లను ప్రిన్సిపాల్ రమాకళ్యాణి చూస్తున్నారు. బుధవారం రాత్రి వరకే క్రీడాకారులు ఆయా జిల్లాల నుంచి చేరుకున్నారు.ఏర్పాట్లు పూర్తి చేశాం.. జోనల్స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న క్రీడాకారుల కోసం అన్ని విధాల సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మూడు రోజులపాటు పోటీలు కొనసాగుతాయి. – రమాకల్యాణి, కళాశాల ప్రిన్సిపాల్, లక్సెట్టిపేట -
నేటి నుంచి 11వ జోనల్స్థాయి క్రీడలు
సోన్: లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో గురువారం నుంచి 11వ జోనల్ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్, డీసీవో రావుల ప్రశాంతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ బాసర జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 14 బాలికల గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థినులు పోటీల్లో పాల్గొంటారన్నారు. ఒక్కో పాఠశాల నుంచి 85 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు, పీఈటీలు రానున్నట్లు పేర్కొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికై ట్, క్యారం, చెస్, అథ్లెటిక్స్ వంటి మొత్తం 9 రకాల క్రీడలు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, సిబ్బందికి వసతితో పాటు ప్రత్యేక మెనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రీడలను పీడీ నీరజ, పీఈటీలు ఉదయశీల, సుస్మిత నిర్వహిస్తారని, జోనల్ ఆఫీసర్ జి.పూర్ణచందర్ రావు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రానున్నట్లు పేర్కొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు కాసిపేట విద్యార్థి
కాసిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి తెల్కపల్లి శివ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల పీడీ బాబురావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని జింఖానా మైదానంలో నిర్వహిస్తున్న 69వ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–19 విభాగంలో 5వేల మీటర్లు, 6కిలోమీటర్ల పరుగు పందెం పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారని తెలిపారు. ద్వితీయ స్థానం సాధించడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. శివను కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, డీఐఈవో అంజయ్య, హెచ్ఎఫ్ సెక్రెటరీ బాబురావు అభినందించారు. -
యథేచ్ఛగా పశువుల తరలింపు
మంచిర్యాలక్రైం: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా ఎడ్లు, ఆవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ రవాణా మార్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా పశువుల తరలింపు సాగుతున్నా పట్టింపు కరువైంది. మహారాష్ట్రలోని బల్లార్షా, చంద్రాపూర్, రాజూరా, షిరోంచా, అహెరి, ఆలపెల్లి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, కెరమెరి, బెజ్జూర్, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, నీల్వాయి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వద్ద నుంచి రోజు వందలాది పశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి, రహదారులపై పడుకున్న పశువులను దొంగిలించినవి కొన్ని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. తాజాగా చెన్నూర్ సమీపంలోని కిష్టంపేట వై జంక్షన్ వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యానును చెన్నూర్ పోలీసులు పట్టుకున్నారు. అదే రోజు డీసీఎం వ్యానులో మరికొందరు పశువులను తరలిస్తుండగా కిష్టంపేట చెక్పోస్టు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయగా డ్రైవర్ దాడి చేసి తప్పించుకుని పోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చెన్నూర్ మండలానికి చెందిన ఓ పార్టీ నాయకుడి అండదండలతోనే పశువుల అక్రమ రవాణా సాగుతోందనే ఆరోపణలున్నాయి. మంచిర్యాల, సరిహద్దు ప్రాంతాల మీదుగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో కౌటాల నుంచి జగిత్యాలకు అక్రమంగా వ్యానులో ఆవులు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పాతమంచిర్యాలకు చెందిన బొలిశెట్టి మల్లేష్కు చెందిన ఆవును ఇంటి ముందు కట్టేసి ఉంచగా.. ఖరీదైన కారులో ఎక్కించుకుని దొంగిలించారు. సీసీ కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించి పట్టుకున్నారు. మంచిర్యాలలో కొందరు పశువుల దొంగలు రోడ్లపై తిరుగుతున్న ఆవులను అపహరించి రాత్రికి రాత్రే వధించి మాంసం విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ చీకటి దందా వెనుక ఓ పెద్ద ముఠానే పని చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. పశువులు తరలించేందుకు వారసంత చిట్టితోపాటు పశు వైద్యుడు ఇచ్చే అనుమతి పత్రం ఉండాలి. కబేళాలకు తరలించాలంటే కచ్చితంగా నిబంధనలు పాటించాలి. వార సంతలో, యజమాని వద్ద కొనుగోలు చేసేటప్పుడు ఆవులు, గర్భంతో ఉన్నవి, మూడేళ్లలోపు దూడలు తరలించడం పూర్తిగా నిషేధం. ఎడ్లు, గేదెలు అయితే వ్యవసాయానికి, పాడికి పనికి రావని పశువైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారించాలి. పశువులను తరలించే వాహనంలో ప్రతీ పశువుకు మధ్య కనీసం రెండు చదరపు మీటర్ల స్థలం ఉండాలి. రవాణా సమయంలో తగినంత గాలి, వెలుతురు అందేలా చూడాలి. కానీ పశువులను తరలించే వారు ఇవేవీ పాటించడం లేదు. ఒక్కో డీసీఎం వ్యానులో 30 నుంచి 40 వరకు పశువులను తరలిస్తుంటారు. కొందరు వ్యాను పై కప్పును పూర్తిగా కప్పేసి రాత్రివేళల్లో అధిక వేగంతో వెళ్తున్నారు. ఎవరు ఆపినా ఆగకుండా వెళ్లడం, కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగానే ముడుపులు ముట్టజెప్పి దర్జాగా వెళ్తుంటారు. ఒక్కోసారి ఎదురు దాడి చేస్తున్న సంఘటనలో చోటు చేసుకుంటున్నాయి. -
ఇవేం కొర్రీలు..
నాకున్న సొంత భూమితోపాటు మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన. వానలకు కొంత దెబ్బతింది. ఇంకొంత మంచిగ ఉంది. సీసీఐ పోయినేడు తేమశాతం ఎక్కువ వస్తుందని కొనుగోలు చేసేందుకు కొర్రీలు పెట్టింది. ఈయేడు ఫోన్లలో పేరు, ఏమేమో ఎక్కించుకోవాలని చెప్తున్నరు. ఎకరానికి ఏడు క్వింటాళ్లు కొంటారట.. ఇవేం కొర్రీలు. పోయినేడాది కంటే కొంత ధర పెరిగిందనుకుంటే గిట్ల తిరకాసులు పెడుతున్నరు. కొర్రీలు లేకుండా కొనాలే. – అక్కెపెల్లి చిన్నయ్య, గ్రామం: కొత్తగూడెం, మం: నెన్నెల కనీసం పది క్వింటాళ్లు కొనాలి ఈ ఏడాది 14ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తుంది. ఏడు క్వింటాళ్లే కొంటాం అంటున్నారు. ఎక్కువ ఎళ్లింది ఎక్కడ అమ్ముకుని నష్టపోవుడు. దిగుబడి ఎక్కువ వస్తే ఇంత లాభం ఉంటుందని అనుకుంటే గిట్ల తిరకాసులు పెడుతున్నరు. కనీసం ఎకరానికి పది క్వింటాళ్ల వరకై నా కొనుగోలు చేయాలి. – కొండ బాపు, కౌలు రైతు, వేమనపల్లి -
రోడ్డు విస్తరణ పనులు షురూ
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఓ వైపు అంతర్గత ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న షెడ్లు, దుకాణాలు, ప్రహరీ, కట్టడాలు కూల్చివేస్తూనే మరోవైపు విస్తరణ పనులు చేపట్టారు. రూ.8.94 కోట్ల అంచనాతో విస్తరణ పనులకు ప్రతిపాదించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రి నుంచి ఏఎంసీ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా, పాతబస్టాండ్ చౌరస్తా నుంచి అంబేడ్కర్నగర్ చౌరస్తా, బెల్లంపల్లి బస్తీ మీదుగా పోశమ్మ గడ్డ చౌరస్తా వరకు రోడ్డు విస్తరించనున్నారు. కూల్చివేతలు పూర్తి కాకముందే పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం చౌరస్తా ముందు నుంచి జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపట్టి సిమెంటు కాంక్రిట్తో పనులు చేస్తున్నారు. రూ.2.50కోట్లతో కొత్త మున్సిపల్ కార్యాలయం చౌరస్తా, ఏఎంసీ, పాత సింగరేణి జనరల్ కార్యాలయం, బీఆర్ అంబేడ్కర్ చౌరస్తాలను ఆధునికీకరించనున్నారు. షెడ్లు, దుకాణాలు కోల్పోయి నిరాశ్రయులైన వీధి వ్యాపారులకు కాంటా చౌరస్తా పక్కన బంకర్ మూసివేత ప్రాంతంలో తాత్కాలిక ప్రాతిపదికన స్థలాలు చూపించే పనుల్లో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. -
ఎక్సైజ్ స్టేషన్లో కానిస్టేబుళ్ల పేకాట
చెన్నూర్: చెన్నూర్ ఎకై ్సజ్ పోలీసుస్టేషన్ పేకాటకు అడ్డాగా మారింది. గుడుంబా, అక్రమ, కల్తీ మద్యాన్ని నియంత్రించాల్సిన పోలీసులు విధులు విస్మరించి పేకాటలో నిమగ్నయ్యారు. చెన్నూర్కు డిప్యూటేషన్పై వచ్చిన ఎస్సై గత నెల రోజులుగా మద్యం దుకాణాల టెండర్లు ఉండడంతో మంచిర్యాల సూపరింటెండెంట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్సై, సీఐ కార్యాలయంలో లేకపోవడంతో మంగళవారం రాత్రి స్టేషన్ మూసి వేసి పేకాట ఆడారు. ఎకై ్సజ్ స్టేషన్ చెన్నూర్కు దూరంగా జాతీయ రహదారి పక్కనే ఉంది. రాత్రి సమయంలో వాహనాల రాకపోకలు తప్ప జనసంచారం ఉండదు. స్టేషన్ తలుపులు మూసేస్తే లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు. స్టేషన్లో అధికారులు, జన సంచారం లేకపోవడంతో కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్నారని సమాచారం. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని జోరుగా చర్చించుకుంటున్నారు. ఎకై ్సజ్ స్టేషన్ కావడంతో పోలీసులు సైతం రారనే ఉద్దేశంతోనే ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్తోపాటు కానిస్టేబుళ్లు పేకాట జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై చెన్నూర్ ఎకై ్సజ్ సీఐ హరిని సంప్రదించగా.. మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నానని, ఏనాడూ తన దృష్టికి రాలేదని, నిన్న రాత్రి పేకాట ఆడుతున్న విషయం తెలిసింది అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పత్తి ఎక్కువైనా ఏడుపే..!
మంచిర్యాలఅగ్రికల్చర్: దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ప్రజాప్రతినిధులు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ అధికారులు పత్తి సేకరణలో ఎకరానికి ఏడు క్వింటాళ్ల పరిమితి విధిస్తున్నారు. ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవడమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తేమశాతం, పింజ పొడవు తదితర నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తుండగా.. తాజాగా ఏడు క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో పత్తి చేన్లకు వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. దిగుబడి వచ్చిన పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందాం అనుకుంటే కొత్త నిబంధన మరింత కుంగదీస్తోంది. గతంలో ఎకరాకు 12క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఈ సీజన్ నుంచి ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితి విధించారు. ఐదు క్వింటాళ్లు తగ్గించడంతో ఎక్కువ వచ్చిన దిగుబడి తక్కువ ధరకు దళారులకు విక్రయించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 8నుంచి 12శాతం తేమ వచ్చిన పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. 8శాతం వచ్చిన పత్తికి క్వింటాల్కు ధర రూ.8,110 ఉండగా ఆపై తేమ ఉంటే ఒక్కో శాతానికి రూ.81 చొప్పున తగ్గించి కొనుగోలు చేస్తారు. జిల్లాలో 1,69,397 ఎకరాలు.. జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో రైతులు పత్తి సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఖ రీఫ్లో 1,69,397 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. భా రీ వర్షాల కారణంగా తగ్గిన దిగుబడి మేరకు 12 నుంచి 13లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధి కారులు అంచనా వేశారు. వర్షాలతో దెబ్బతిన్న లో తట్టు, ఎర్రనేలలు, చౌడు, ఇసుక భూముల్లో ఎకరా కు 5నుంచి 7క్వింటాళ్లు, నల్లరేగడి, సమాంతరంగా ఉన్న పల్ల ప్రాంతంలోని నేలల్లో 10నుంచి 12క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలకు పత్తి పోటెత్తనుంది. గత ఏడాది అక్రమాలు గత ఏడాది జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగాయి. పత్తి విక్రయానికి టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) జారీ చేశారు. దళారులు చెప్పిన ఫోన్ నంబరుకు ఓటీపీ వచ్చే విధంగా మార్కెట్ అధికారులు సహకరించారు. ఒకే రైతు పేరిట వందల క్వింటాళ్ల పత్తి విక్రయాలు సాగించారు. దిగుబడి అంచనా కంటే ఎక్కువగా కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి పలువురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. దీంతో ఈ ఏడాది కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చారు. యాప్లో రైతులు స్లాట్ బుక్ చేసుకోకుంటే సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలు చేయరు. జిల్లాలో చాలామంది రైతులకు ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోవడం, నిరక్షరాస్యత కారణంగా యాప్లో నమోదు అవగాహన లేక 75శాతం మంది దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దళారులను యాప్ ఏ మేరకు కట్టడి చేస్తుందో గానీ రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఎకరాకు ఏడు క్వింటాళ్ల చొప్పున మాత్రమే స్లాట్ బుక్ అవుతుంది. ఈ కొర్రీలతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించే దుస్థితి నెలకొంది. ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని, పట్టాపాసుపుస్తకం, ఇతర ధ్రువీకరణ పత్రాల ఆధారంగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
యంత్రాల పని గంటలు పెంచాలి
శ్రీరాంపూర్: ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల పని గంటలను మరింత పెంచాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో బుధవారం రూ.1.51కోట్లు విలువైన హైడ్రాలిక్ షవల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యంత్రం ద్వారా రోజుకు 8500క్యూబిక్ మీటర్ల మట్టిని తీయగలుగుతామన్నారు. ఇలాంటి భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే అనుకున్న ఫలితా లు సాధిస్తామని తెలిపారు. గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, ఏరియా ఇంజనీర్ సాంబశివరావు, ఓిసీపీ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, గని మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అత్యవసరం మేరకే అంబులెన్స్ సేవలు
వేమనపల్లి: అత్యవసర పరిస్థితుల్లోనే 108 అంబులెన్స్ వైద్య సేవలను వినియోగించుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108 అంబులెన్స్ వాహనాల ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అంబులెన్స్ వాహన పనితీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, మందులు, అత్యవసర మెడికల్ సామగ్రి పరిశీలించారు. ఎటువంటి రోడ్డు ప్రమాదాలకై నా అంబులెన్స్ ఉపయోగించుకోవాలని తెలిపారు. సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. అంబులెన్స్లో సుఖప్రసవం నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 108 వాహనాల కార్యనిర్వహణ అధికారి సంపత్, ఈఎంటీ స్వరూప్, పైలట్ సంపత్రెడ్డి పాల్గొన్నారు. -
స్టార్ రేటింగ్ కమిటీ పరిశీలన
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిని ఫైవ్ స్టార్ రేటింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంవత్సరం గని మూతపడినా గత ఏడాది నిర్ణీత ప్రమాణాలు పాటించిన గనుల్లో ఆర్కే 6 గనిని ఫైవ్ స్టార్ రేటింగ్ ఎంపిక కోసం ప్రతిపాదించారు. ఈ మేరకు బుధవారం కమిటీ సభ్యులు గనిని సందర్శించి రికార్డులు పరిశీలించారు. జీఎం కార్యాలయంలో జీఎం ఎం.శ్రీనివాస్, అధికారులకు వివరాలు వెల్లడించారు. నాగపూర్కు చెందిన కోల్ కంట్రోల్ అధికారి రాజేంద్ర చోలే ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. గనిలో తీసుకుంటున్న భద్రత చర్యలు, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ చర్యలను ఏరియా జీఎం కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటు జీఎం యన్.సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్బాజీ సైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు కే.వెంకటేశ్వరరెడ్డి, ఏజెంట్లు రాజేందర్, శ్రీధర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వర్రెడ్డి, గని మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అతివలకు ఆత్మబంధువు షీ టీమ్ మంచిర్యాలక్రైం: అతివలకు ఆత్మబంధువుగా షీ టీమ్ పని చేస్తోందని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే వెంటనే రక్షణ చర్యలు చేపడుతామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, యువతులు, కళాశాల విద్యార్థినులు సమాజంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని, మహిళల రక్షణ కోసం షీ టీమ్ 24 గంటలు పని చేస్తుందని పేర్కొన్నారు. షీ టీమ్ ఆధ్వర్యంలో స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ర్యాగింగ్, ఈవ్టీజింగ్, ఫోక్సో, గుడ్ టచ్–బ్యాడ్టచ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీ–సేఫ్, హాక్–ఐ, 100 డయల్పై అవగాహన కలిగి ఉండాలని, క్యూఆర్ కోడ్, 100 డయల్, షీ టీమ్ వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. -
‘కార్తిక’ జాతర
మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో జ్వాలతోరణం వెలిగించిన భక్తులు దండేపల్లి: గూడెంలో భక్తుల సామూహిక సత్యనారాయణ వ్రతాలు దండేపల్లి/మంచిర్యాలఅర్బన్: తెలంగాణ అన్నవరంగా పేరొందిన గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం కార్తిక పౌర్ణమి జాతర సందర్భంగా బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలి రావడంతో గుట్టంతా భక్తజన సంద్రంగా మారింది. గూడెం సమీప గోదావరి నదిలో స్నానాలు ఆచరించి గంగమ్మతల్లికి పూజలు చేశారు. కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదిలారు. అనంతరం గుట్టపై ఉన్న సత్యదేవుణ్ని దర్శించుకున్నారు. సన్నిధి ద్వారం సమీపంలో రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. సుమారు 1300 జంటలు సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. రూ.1500 వ్రతం టికెట్ కోసం భక్తులు ఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. నీడ కోసం టెంటు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. సత్యదేవుణ్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది పర్యవేక్షించారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాలలోని శివాలయాలు బుధవారం భక్తులతో కిటకిటలాడాయి. విశ్వనాథస్వామి దేవస్థానం, కోదండ రామాలయం, గౌతమేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పిండినేతి దీపాలు వెలిగించారు. 365 వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి విశ్వనాథస్వామి ఆలయంలో జ్వాలతోరణం వెలిగించారు. -
కన్నుల పండువగా మల్లన్నస్వామి కల్యాణం
జైపూర్: మండల కేంద్రంలోని వెలిశాల మల్ల న్న స్వామి ఆలయంలో బుధవారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. చెన్నూర్కు చెందిన పోటు ప్రతాప్రెడ్డి, దేవేంద్ర ఆధ్వర్యంలో ఒగ్గు పూజారులతో సంప్రదాయబద్దంగా మల్లన్నస్వామిభ్రమరాంభికలకు పెద్దపట్నం వేసి కల్యాణం జరిపించారు. ఒగ్గు పూజారుల ఢమరుక మోతలతో అటవీప్రాంతం మార్మోగింది. కల్యాణాన్ని వీక్షించడానికి సమీప ప్రాంతాల్లోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడిగా మారింది. భక్తులు బోనాలు పోసి, పట్నాలు వేసి మొక్కలు చెల్లించారు. -
చెట్లు నరికిన కేసులో ఒకరి రిమాండ్
ఉట్నూర్రూరల్: అటవీ ప్రాంతంలో చెట్లు నరికిన ఒకరిపై మంగళవారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు బీర్సాయిపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుమ్మరికుంటకు చెందిన మడావి మానిక్రావు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్లు నరకడంతో అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తె లిపారు. డిప్యూటీ ఎఫ్ఆర్వో సీతారాం, ఎఫ్బీవోలు మాయాదేవి, మహిపాల్, కోసేరావు, బలవంత్రావు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
అడెల్లి పోచమ్మకు ధాన్యాభిషేకం
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠాపన వేడుకలకు రెండోరోజు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వేదపండితులు చంద్రశేఖరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో నిత్యనిధి, చండీహోమం, సహస్ర కలశ స్థాపన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జలాభిషేకం అనంతరం విగ్రహాలను నీటికొలను నుంచి వేరుచేసి ధాన్యాభిషేకం, మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులే కాకుండా మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. సమీప గ్రామాలకు చెందిన భక్తులు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సైతం పూజా కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులు ముందుగా తమ పేర్లు ప్రతిష్ఠాపన కమిటీ వద్ద నమోదు చేయించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
అర్హులైన గిరిజనులకు సంక్షేమ ఫలాలు అందాలి
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలో అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి జన్ మన్, ప్రధానమంత్రి జుగా, ఇతర ఆదివాసీ గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పీవోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జన్నారం: కూలీ పనులకు వెళ్తున్న యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల మేరకు మండలంలోని సింగరాయి పేటకు చెందిన అడాయి మారుతి (25) జన్నారంకు చెందిన చుక్క గంగాధర్ అనే మేసీ్త్ర వద్ద కూలీ పనులకు వెళ్తున్నాడు. మంగళవారం ఉదయం జన్నారం వెళ్లిన మారుతి మేసీ్త్రని బైక్పై ఎక్కించుకుని తాళ్లపేట్ వైపు వెళ్తుండగా చింతగూడ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరూ ఎగిరి కిందపడ్డారు. మారుతి అక్కడికక్కడే మృతి చెందగా గంగాధర్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై అనూష సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఏపీలోని నూజివీడుకు చెందినట్లు గుర్తించారు. మృతుని తండ్రి భీము ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ బలరామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసుతానూరు: ఇద్దరిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు. మండలంలోని మహాలింగి గ్రామానికి చెందిన ఆనంద్, ఆదికృష్ణతో అదే గ్రామానికి చెందిన గణేశ్, తరుణ్, కిరణ్కు పాత గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని సోమవారం రాత్రి గణేశ్, తరుణ్, కిరణ్ ఫోన్చేసి ఆనంద్, ఆదికృష్ణను గ్రామ శివారులోకి పిలిపించారు. మాటామాట పెరగడంతో ముగ్గురూ కలిసి ఆనంద్, ఆదికృష్ణపై కర్రలతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఎస్సై హన్మాండ్లు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. గణేశ్, తరుణ్, కిరణ్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
టాటామ్యాజిక్ను ఢీకొట్టిన ట్రాక్టర్
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామ శివారు 61వ జాతీయ రహదారిపై మంగళవారం టాటామ్యాజిక్ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపి న వివరాల మేరకు.. మామడ మండలం కొరటికల్కు చెందిన 11 మంది టాటా మ్యాజిక్లో భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి అంత్యక్రియలకు వెళ్లారు. తిరుగుప్రయాణంలో రాంపూర్ శివారులో నర్సాపూర్(జి) నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంగా వచ్చి టాటా మ్యాజిక్ను ఢీకొట్టింది. ఘటనలో టాటా మ్యాజిక్ వాహనం ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్ రాజేశ్వర్ (50), పక్కన కూర్చున్న చిన్నారెడ్డి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ భార్య కిందపడడంతో చేయి విరిగింది. గమనించిన స్థానికులు రాజేశ్వర్, చిన్నారెడ్డిని బయటకు తీసి 108కు సమాచారం అందించగా నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్వర్ మృతి చెందాడు. మృతుని కుమారుడు సంజీవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. ఎస్పీ జానకీ షర్మిల సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. -
కార్తికం.. మహిమాన్వితం!
కెరమెరి: భారతీయ సంప్రదాయంలో కార్తిక మా సం పరమ పవిత్రమైనది. ఈ నెలరోజులు నిత్యం పూజలు, దానధర్మాలు, దీపారాధనలు, పురాణ శ్ర వణం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ మాసానికి అనుబంధంగా వచ్చే పండుగ కార్తిక పౌర్ణమి. దీనిని కై శిక పౌర్ణమి, వైకుంఠ పౌర్ణమి, జిడికంట పున్నమి అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతీరోజు మహిళలు తులసీ దళానికి పూజలు, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి తరిస్తారు. నేడు కార్తికపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పురాణ కథలు తమిళనాడులో తిరువణ్నామళైగా ప్రసిద్ధి చెందిన అరుణాచలంలో కొండమీద ఉన్న దీపస్తంభంలో ఈ రోజు వెలిగించే జ్యోతిని దర్శించడానికి అధికసంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఈ రోజు వెలిగించే దీపం ఎన్నో రోజుల వరకు వెలుగుతూనే ఉంటుందని ప్రతీతి. అలాగే ఇంటి ఎదుట వందలాది ప్రమిదల్లో నూనెపోసి దీపాలు వెలిగిస్తారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారు. గొప్ప వ్రతాల్లో ఒకటి.. వ్రతాల్లో కార్తికపౌర్ణమికి ప్రత్యేకత ఉంది. తెలుగు ప్రజలు ఈ రోజు చలిమిడి చేస్తారు. వేపుడు బియ్యం లేదా అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. బలిచక్రవర్తికి ఒకసారి శరీరమంతా మంటలు వ్యాపించాయి. ఆ రోజు ఆయన సంస్థాన వైద్యులు, ప్రత్యేక పురోహితుల సలహా మేరకు కార్తికపౌర్ణమి రోజున శివున్ని పూజించమని చెప్తారు. అలా చేయడంతో బలి చక్రవర్తి శరీరంలో మంటలు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పటి నుంచి కార్తికపౌర్ణమి వ్రతం ఆచరణలో ఉందని పూర్వీకులు చెబుతారు. తులసీ కల్యాణం కార్తిక పౌర్ణమి సందర్భంగా తులసీ కల్యాణం చేయడం శుభప్రదమని చెబుతారు. తులసి మొక్క వల్ల వాతావరణం పవిత్రంగా ఉంటుంది. పాపపు ఆలోచనలను తొలగిస్తుంది. ప్రతీ ఇంట్లో తులసి మొక్క పాపపుణ్యాల స్థానం కలిగి ఉంటుంది. తులసి నారాయణునికి అత్యంత ప్రియమైనది. తులసి చెట్టుకు కల్యాణం జరిపిస్తే ఇంటిల్లిపాది సుఖసంతోశాలతో వర్ధిల్లుతారు. తులసి మొక్కకు ఉసిరి చెట్టుతో వివాహం జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. తులసీ మాత మండపం చెరుకు ఆకులతో తయారు చేస్తారు. ఇలా చేస్తే చెరుకులోని తీయదనం మన జీవితంలో కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలి
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీల్లోనూ క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలని ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరి ఆడే రామేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాంశాల్లో జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోనల్ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జోనల్ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ ఎంపిక పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లా ప్రథమస్థానం, నిర్మల్ ద్వితీయ స్థానంలో నిలిచాయన్నారు.అండర్–14 బాలబాలికల రెజ్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించామని, అండర్–17 విభాగంలో బాలబాలికలకు సైతం పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, రెజ్లింగ్ శిక్షకుడు శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. -
మందమర్రిలో సింగరేణి స్థాయి పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్లో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. జీఎం రాధాకృష్ణ స్పోర్ట్స్ జెండా ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందమర్రి ఏరియాలో సింగరేణి స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. పోటీల్లో గెలిచిన క్రీడాకారులు కోలిండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి సంస్థకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కీర్తనలు, భజనలు, గజల్స్, సోలో సాంగ్స్, లైట్ సాంగ్స్, బుల్బుల్ సితారా, కీబోర్డ్ సాంగ్స్, తబలా, కూచిపూడి, భరత నాట్యం పోటీలు నిర్వహించగా సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి కార్తీక్, ఏరియా కోఆర్డినేటర్ శివకృష్ణ, క్రీడల సూపర్వైజర్ జాన్వెస్లీ, తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
కుంటాల: తన ఇంటినిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు కుంటాలకు చెందిన పూర్ణం అడెల్లు (44) ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. తీర్చేమార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఆర్ఎంపీ.. లక్ష్మణచాంద: ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మాలెపు రాజు(39) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల అతని భార్య మూడో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పిప్రివాసి మాల్టాలో అనుమానాస్పద మృతి
బజార్హత్నూర్: మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన రామగిరి సాయికుమార్(28) మాల్టా దేశంలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్కు చెందిన రాజు పిప్రి గ్రామంలో ఉన్న తన సమీప బంధువులు రామగిరి సాయికుమార్, అనిల్ మాల్టా వస్తే లక్షల్లో జీతాలు ఉన్నాయని చెప్పడంతో రూ.6 లక్షల చొప్పున సెర్భియా జాతి ఏజెంట్కు చెల్లించారు. 3 నెలల టూరిస్ట్ వీసా పంపగా అక్కడికి వెళ్లిన తర్వాత ఎలాంటి పని చూపించలేదు. అక్టోబర్ 30న సాయికుమార్ అపార్టుమెంట్ పైనుంచి కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అనిల్ మృతుని కుటుంబ సభ్యులకు సమాచా రం అందించాడు. పిప్రి గ్రామానికి చెందిన ప్ర వాసీ మిత్ర లేబర్ యూనియన్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కొమ్ము శశిమాల తెలంగాణ స్టేట్ ఎన్ఆర్ ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్లకు విషయం చెప్పడంతో మాల్టాలోని భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా బాధితుని వివరాలు పంపించారు. శవ పరీక్షల అనంతరం స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. చికిత్స పొందుతూ మెకానిక్..లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రాకాలనీకి చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. మృతుడు గతనెల 30న ఇంటివద్ద బాత్రూంకు వెళ్లగా బీపీ పెరగడంతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎసై తెలిపారు. అడవిపందుల దాడిలో పంట ధ్వంసంవేమనపల్లి: మండలంలోని మంగనపల్లిలో గంగిరెడ్డి తిరుపతికి చెందిన వరి పొలంలో అడవి పందులు దాడులు చేసి పంటను ధ్వంసం చేశాయి. కోతకు వచ్చిన రెండెకరాల వరిపైరును తొక్కి నేల పాలు చేశాయని బాధితుడు వాపోయాడు. డిప్యూటీ అటవీ రేంజర్ రూపేష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
శభాష్ కిష్టయ్య
రామకృష్ణాపూర్: ఎనిమిది పదుల వయస్సు దాటినా వెటరన్ పోటీల్లో అమీతుమీకి సిద్ధం అంటున్నాడు రామకృష్ణాపూర్కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు శఠగోపం కిష్టయ్య. షాట్పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, హ్యామర్త్రో...తదితర అంశాల్లో ప్రావీణ్యం ఉన్న కిష్టయ్య 85 ఏళ్ల వయస్సులోనూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. పట్టణంలోని భగత్సింగ్నగర్కు చెందిన కిష్టయ్య మందమర్రి ఏరియాలోని ఎంకే4 గనిలో హెడ్ ఓవర్మెన్గా విధులు నిర్వర్తించేవాడు. 2005లో మెడికల్ అన్ఫిట్ ఆయ్యాడు. సింగరేణిలో పనిచేసిన సమయంలోనూ ఏరియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించాడు. సాధించిన బహుమతులు... -
వైద్యకళాశాలను అందుబాటులోకి తేవాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్కు పెండింగ్ బిల్లులు చెల్లించి త్వరగా వై ద్య కళాశాల, ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చే శారు. గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశా ల, ఆస్పత్రి భవన నిర్మాణ పనులను మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు చొరవతో జిల్లా కు వైద్యకళాశాల మంజూరైనట్లు తెలిపారు. గుడిపే ట శివారులోని 32 ఎకరాల్లో రూ.510 కోట్లతో వైద్యకళాశాల, మంచిర్యాలలో 450 పడకల ఆస్పత్రి భవ న నిర్మాణాలు జరుగుతుండగా పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి సంబంధిత కాంట్రాక్టర్కు బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బేర పోచయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్ తదితరులున్నారు. -
‘వేగానికన్నా ప్రాణమే మిన్న’
లక్సెట్టిపేట: వేగానికన్నా ప్రాణమే చాలా వి లువైందని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీనివాస గా ర్డెన్ ఫంక్షన్ హాల్లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగా హన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో చాలా కుంటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 142 రోడ్డు ప్రమాదాలు జరిగా యని పేర్కొన్నారు. వాహనదారులు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని, ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూ చించారు. కొన్ని రోడ్డు ప్రమాద ఘటనలు చూసి చలించిన తాను స్వయంగా పాటలు రాసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం గ్రామ కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించా రు. శివసాయి గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో అందించిన హెల్మెట్లను పలువురికి పంపిణీ చేశారు. ఏసీపీ ప్రకాశ్, సీఐ రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్, ఎ స్సైలు సురేశ్, తైసొద్దీన్, అనూష, అదనపు ఎ స్సై రాములు, ఏఎంవీఐ సూర్యతేజ, కానిస్టేబుళ్లు, యువకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. -
రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులు సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని జి ల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్లో పలువురు రైతులకు భూసార పరీక్షా ఫలితాల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూసారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా భూమిలో స్థూల, సూక్ష్మ పోషకాల సమతుల్యతను కా పాడుకోవాలని తెలిపారు. భూమి తేమ నిల్వ ఉండాలంటే సేంద్రియ ఎరువులు, పశువుల పేడ వేయాలని, వానపాముల ఎరువులు వా డాలని సూచించారు. పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడకాన్ని పెంచితే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. కా ర్యక్రమంలో ఏడీఏలు మామిడి కృష్ణ, డీఏవో గోపి, ఏవోలు కృష్ణ, తరుణ్, ఫర్హీన్, ఏఈవో ప్రసన్న, రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ పూస్కూరి శ్రీనివాసరావు, డైరెక్టర్ బొడ్డు శంకర్, స్థానిక రైతులు దొమ్మడి సత్తయ్య, రాజ మౌళి, ఆకిరెడ్డి రాజయ్య, అప్పనని సత్తి, భూ మయ్య, పోచయ్య పాల్గొన్నారు. -
మృత్యు మార్గాలు!
సాక్షి ప్రతినిధి మంచిర్యాల: రోడ్డు ప్రమాదాలు కు టుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నపాటి అజాగ్రత్తతో ప్రాణాలు గాల్లో కాలుస్తున్నాయి. ప్ర మాదాల్లో తీవ్ర గాయాలపాలైన వారు జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఏటా ప్ర మాదాల తీవ్రత పెరుగుతూ వస్తోంది. మితి మీరిన వేగం, రహదారి భద్రత నియమాల ఉల్లంఘనతోనే అధికంగా నష్టం జరుగుతోంది. గత నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 500కు పైగా తమ విలువైన జీవితాలను కోల్పోయారు. ఈ ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి. ఎక్కువ శాతం యువతే..రోడ్డు ప్రమాదాల్లో అధికంగా 18నుంచి 40ఏళ్లలోపు వారే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సార్లు మైనర్లు తీవ్రంగా గాయపడడం, మరికొంద రు ప్రాణాలు కోల్పోవడమూ జరుగుతోంది. జిల్లాలో క్రమంగా రోడ్ల పరిస్థితి మెరుగవుతోంది. మంచి ర్యాల, చంద్రాపూర్ ఎన్హెచ్ 363, లక్సెట్టిపేట, చెన్నూరు, సిరొంచ వైపు ఎన్హెచ్ 63 ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రీయ రహదారులైన మంచిర్యా ల, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బాసర, ఆది లాబాద్తో పాటు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలను కలిపే రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సమష్టిగా పని చేస్తేనే..రోడ్డు భద్రతలో ఆయా స్టేషన్ల పరిధిలో పోలీస్ అధి కారులే బాధ్యత తీసుకుంటున్నారు. అయితే రవా ణాశాఖ, రోడ్డు నిర్వహణ పర్యవేక్షించే గ్రామీణ, రాష్ట్ర, నేషనల్ హైవేస్ ఇంజినీర్ల భాగస్వామ్యం మ రింత పెరగాల్సి ఉంది. రోడ్డు నిర్మాణంలో సాంకేతిక లోపం నుంచి వాహనదారులు భద్రత నియమాలు పాటించేలా రవాణాశాఖ అధికారులు చూ డాల్సి ఉంది. కానీ, పోలీస్ అధికారులు మాత్రమే ప్రమాదాల నివారణకు శ్రమించాల్సి వస్తోంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిచిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాద మరణాలను అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నా రు. రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ వద్ద ని, రోడ్డుపై ఎల్లప్పుడు దారికి ఎడమవైపు వాహనం నడపాలని, హైవేలపై భారీ, అతిభారీ వాహనాలు వెళ్లే లేన్లను సైడ్ మిర్రర్లలో చూస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంది. సర్వీస్ రోడ్డు, యూటర్న్ దూరంగా ఉందని, రాంగ్ రూట్లో వెళ్లొ ద్దు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలతో సామర్థ్యానికి మించి వాహనాలపై ఓవర్ స్పీడ్తో వెళ్లకూడదు. ప్ర మాదం జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా తప్పనిసరిగా వ్యక్తిగత, వాహన బీమా తీసుకోవాలి. ప్రమాదాలు అధికంగా జరిగే చింతగూడ, మహ్మదాబాద్ గ్రామాల మధ్య రోడ్డు ఆ రహదారిపైనే అధికంజిల్లాలో అధికంగా లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బాసరకు వెళ్లే మార్గంలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గం అటవీ ప్రాంతం గుండా వెళ్లడం, రో డ్డు ఇరుకుగా ఉండడమే ఇందుకు కారణం. మధ్యలో డివైడర్లు లేకపోవడంతో వాహనదా రులు ఇష్టరీతిన రాకపోకలు సాగిస్తున్నారు. వీటితోపాటు జిల్లా కేంద్రం, బెల్లంపల్లి శివా రు, కన్నాల, తాండూరు, చెన్నూరు వైపు ప్ర మాదాలు జరుగుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న జిల్లా ఉత్తరభారత దేశానికి అనుసంధానం కావడంతో బొగ్గు, సిమెంట్, సిరామిక్, మట్టి ముడి సరుకులతో వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్డు విస్తరణ పెరగడంతో వాహనాల వేగమూ పెరిగి అదుపు తప్పుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
మత్స్యకారుల అభివృద్ధికి కృషి
లక్సెట్టిపేట: మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నా రు. మంగళవారం మండలంలోని గుల్లకోట గ్రా మంలో మత్య్సకారులకు చేపపిల్లలు పంపిణీ చేశా రు. గోదావరి నదిలో చేపపిల్లలు వదిలారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరానికి 223.93 లక్షల చేప పిల్లలు పెంచేందుకు ప్ర తిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపపిల్లలు వదలనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మత్య్సకారులు, నాయకులు పాల్గొన్నారు. గుల్లకోటలో కొనుగోలు కేంద్రం ప్రారంభంమండలంలోని గుల్లకోటలో లక్ష్మీప్రసన్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రేమ్చంద్, వైస్ చైర్మన్ ఎండీ ఆరీ ఫ్, తహసీల్దార్ దిలీప్కుమార్, కాంగ్రెస్ మండలా ధ్యక్షుడు పింగిలి రమేశ్, నాయకులు దేవేందర్రెడ్డి, శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలిమంచిర్యాల అగ్రికల్చర్: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. కలెక్టరేట్లో అధికారులు, జి న్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కపాస్ కిసాన్ యా ప్లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని, పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునేలా అవగాహ న కల్పించాలని సూచించారు. ఈసారి ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 స్థాయిల్లో స్లాట్ బుకింగ్ జరుగుతోందని, ఎల్ 1లో 75శాతం స్లాట్ బుకింగ్ తర్వాత ఎల్ 2 ఓపెన్ అవుతుందని, ఎల్ 2లో 75 శాతం స్లాట్ బుకింగ్ తర్వాత ఎల్ 3 ఓపెన్ అవుతుందని తెలిపా రు. లక్సెట్టిపేట, బెల్లంపల్లి, తాండూర్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి ష హబుద్దీన్, విద్యుత్శాఖ అధికారి ఉత్తమ్ ఉన్నారు. గూడెంలో జాతర ఏర్పాట్లపై ఆరా దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించనున్న కార్తీక జాతర ఏర్పాట్లను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇ బ్బందులకు గురి కాకుండా అన్ని వసతులు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. సత్యదేవున్ని దర్శించుకున్న తర్వాత కలెక్టర్ను వేదపండితులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీని వాస్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టల్ భవనం పరిశీలన మండలంలోని ద్వారక జెడ్పీ ఉన్నత పాఠశాల స మీపంలో చేపట్టిన బీసీ బాలుర వసతిగృహ భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్దీపక్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అ ధికారులను ఆదేశించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన ప థకం నిర్వహణ తీరు గురించి తెలుసుకున్నారు. -
42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మంచిర్యాలటౌన్: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను 42శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టేలా చూడాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు మంగళవారం అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు ఏ ర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. 42శాతం రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేయాల ని, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యా యం జరిగేలా చూడాలని కోరారు. బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, నాయకులు జయరావు, షబ్బీర్ పాషా, యాదగిరి, రాజు, రమేశ్ పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించాలని నిరసన
మంచిర్యాలఅర్బన్: పెండిగ్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర బంద్లో భాగంగా రెండోరోజు మంగళవారం మంచిర్యాలలో డిగ్రీ, పీజీ కళా శాలల యాజమాన్యాలు, అధ్యాపకులు నిరసన తె లిపారు. స్థానిక ఐబీ చౌరస్తాలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ కళాశాలల అసో సియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు తీసుకువచ్చి నెట్టుకువస్తున్నామని తెలిపారు. వేతనాలు, భవన యజమానులకు అద్దె చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళికి నిధులు విడుదల చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కళాశాలల బంద్ చేపట్టినట్లు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నర్సయ్య, సభ్యులు, క రస్పాండెంట్లు పల్లె భూమేశ్, ఉదారి చంద్రమోహన్గౌడ్, శ్రీకర్, మనోహర్రెడ్డి, ఆర్.శ్రీనివాస్, మల్లేశ్, శ్రీధర్రావు, విజయ్కుమార్ తదితరులున్నారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
నస్పూర్: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు. మంగళవా రం ఆమె నస్పూర్ పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ కా ర్యకర్తలు ఇంటింటికీ తిరిగి సేవలందించడంలో ముందుండాలని, ప్రతీ గర్భిణి వివరాలు నమోదు చేయాలని సూచించారు. టీకాలు ఇప్పించడం, ప్ర భుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం అయ్యేలా చూ డాలని పేర్కొన్నారు. ప్రజలకు వ్యాధులపై అవగా హన కల్పించాలని తెలిపారు. ఆశ కార్యకర్తలు ప్రజ లతో సమన్వయం చేసుకుంటూ వారు రోగాల బా రిన పడకుండా చూడాలని, పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్పీఎస్కే టీం ద్వారా పరీక్షలు చేయించడంపై అవగాహన కల్పించాలని సూచించారు. నస్పూర్ మెడికల్ ఆపీసర్ వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు. మెరుగైన సేవలందించాలిజైపూర్: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆశ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణుల వివరాలు వైద్యాధికారికి తెలుపాలని పేర్కొన్నారు. షోషకాహార లో పంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వివరాలు అంగన్వాడీలకు అందించాలని సూచించారు. -
నేడు చేపపిల్లల విడుదల
మంచిర్యాలఅగ్రికల్చర్: ఎట్టకేలకు చేపపిల్లల విడుదలకు మోక్షం లభించింది. మంగళవారం జిల్లాలో పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో విడుదలకు సిద్ధం చేశారు. జూలైలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాయి. ఆగస్టులో చేపపిల్లలు వదలాల్సి ఉండగా.. గతంలో చేపపిల్లలు సరఫరా చేసిన టెండర్దారులకు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈసారి టెండర్దారులు ముందుకు రాలేదు. రెండు నెలలుగా పలుమార్లు టెండర్ల గడువు పెంచుతూ వచ్చింది. అక్టోబర్లో టెండర్లు ఖరారు కాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఎత్తివేసి 20రోజులు గడిచినా విడుదలకు నోచుకోలేదు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 4నుంచి చేపపిల్లల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 380 చెరువులు, కుంటలు రిజర్వాయర్లలో 2.23 కోట్ల చేపపిల్లలు విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 35నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల పిల్లలు(కట్ల, రవు) 115.65లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గల పిల్లలు(కట్ల, రవు, మృగాల) 108.28లక్షలు విడుదల చేయనున్నారు. కాగా, ఆలస్యంగా చేపపిల్లలు వదలడం వల్ల ఏ మేరకు ఎదుగుదల ఉంటుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలపాటు ఎదిగి మార్చి నుంచి మే వరకు మంచి దిగుబడి వస్తుంది. మూడు నుంచి నాలుగు కిలోల వరకు పెరిగి మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేది. కానీ.. ఆలస్యంగా వదలడం వల్ల ఎప్పుడు ఎదిగి.. ఎప్పుడు దిగుబడి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొత్త వర్షాలతో నీరు చేరి వాటికి కావాల్సిన ఆహారం సమృద్ధిగా లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ముగిసి ఎండలు మండుతున్నాయి. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలకు నీటి విడుదల చేపట్టనున్నారు. నాలుగు నెలల సమయంలో చేపపిల్లలు ఏ మేరకు ఎదుగుతాయో అధికారులకే తెలియాలని మత్స్యకారులు వాపోతున్నారు. ఇప్పటికే మత్స్యకారులు స్వయంగా కొనుగోలు చేసి చెరువుల్లో వదిలారు. జిల్లాలో చేపపిల్లల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 51.58 లక్షల చేపపిల్లలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం ముల్కల్లలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రహదారి భధ్రతా నియమాలు పాటిస్తే అంతా సురక్షితంగా ఇంటికి చేరుకుంటారని తెలిపారు. ముల్కల్ల గ్రామ పరిధి లో గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను వివరిస్తూ ప్రతియేటా ఐదుగురు చనిపోతున్నారని, ఈ ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ఎంవీఐ రంజిత్, హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, ఎంపీడీఓ సాయివెంకట్రెడ్డి, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్ కళాబృందం ప్రదర్శన స్థానికులను ఆలోచింపజేసింది. రహదారి భద్రత కమిటీని ఏర్పాటు చేసి విధులపై వివరిస్తూ నిబద్ధతగా వ్యవహరించాలని డీసీపీ సూచించారు. రహదారి భద్రతపై స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు.. దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 5న జరిగే కార్తిక పౌర్ణమి జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని డీసీపీ భాస్కర్ సూచించారు. ఏసీపీ ప్రకాశ్తో కలిసి సోమవారం గూడెం సత్యనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు. సత్యదేవుణ్ని దర్శించుకున్న అనంతరం జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులు, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సైలు సురేష్, తహాసీనొద్దీన్తో చర్చించి సూచనలు చేశారు. -
‘ఎమ్మెల్యే మాటలు విని దుకాణాలు కూలుస్తారా..?’
బెల్లంపల్లి: ఎమ్మెల్యే మాటలు విని దుకాణాలు కూలగొట్టడం ఏం అభివృద్ధి అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. సోమవా రం ఆయన పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్(కాంటా) చౌరస్తా వద్ద కూల్చివేతకు గురైన దుకాణాలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా దుకాణాలు కూల్చి వేసి రోడ్డుపాలు చేశారని నిరాశ్రయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య సెల్ఫోన్లో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్తో మాట్లాడా రు. విస్తరణ పనులకు ముందు దుకాణాల నిర్వాహకులతో ఎందుకు మాట్లాడలేక పోయారని అన్నా రు. ఎమ్మెల్యే మాటలు విని పేదలను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. 1200 కుటుంబా లు వీధిన పడుతున్నాయని, ఆ కుటుంబాలకు ఏ హానీ జరిగినా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంద ని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు ,శ్రేణులు ఎల్.రాము, ఇ.సుందరరావు, హనీఫ్ పాల్గొన్నారు. -
ఇంచార్జి డీసీవోగా సత్యనారాయణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా సహకార శాఖ అధి కారి(డీసీవో)గా ఎం. సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్లో జిల్లా సహకార శాఖ బాధ్యతలు చేపట్టిన రాథోడ్ బిక్కు అక్టోబర్ 25న లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా డిప్యూటీ రిజిస్ట్రా ర్, ఆడిట్ ఆధికారి ఎం.సత్యనారాయణను జిల్లా ఇంచార్జిగా నియమించారు. డీసీవోను సహకార శాఖ అధికారులు అసిస్టెంటు రిజి స్ట్రార్లు, సూపరింటెండెంట్లు హన్మంత్రెడ్డి, రవీందర్రావు, రాజేశ్వరి, వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్లు మల్లారెడ్డి, ఆరాథి, సందీప్, ఏడీ ప్రసాద్, సురేందర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
సీసీఐ నిబంధనల మేరకే పత్తి కొనుగోళ్లు
దండేపల్లి/తాండూర్: సీసీఐ నిబంధనలు పాటిస్తూనే రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. సోమవారం తాండూర్ మండలం రేపల్లెవాడ శివారులోని మహేశ్వరి జిన్నింగ్ మిల్లులో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, దండేపల్లి మండలం కన్నెపల్లి శ్రీవెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారానే స్లాట్లు బుక్ చేసుకొని పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. 12శాతం తేమ మించకుండా సరి చూసుకుని మద్దతు ధర పొందాలని అన్నారు. తాండూర్లో కొందరు రైతులు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తేమ శాతాన్ని సడలించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సీసీఐ అధికారులు కొంతమేర సడలింపులు ఇవ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తొలి రోజు 11 వాహనాల్లో రైతులు పత్తిని తీసుకురాగా ఒక్క వాహనంలోని పత్తి మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేశారు. మిగతా వాహనాల్లోని పత్తి తేమ శాతం 20 నుంచి 30 వరకు ఉండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించాల్సి వచ్చింది. క్వింటాల్కు రూ.6500 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబొద్దీన్, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, వైస్చైర్మన్ ఆరీఫ్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్లక్సెట్టిపేట: చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లతో సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ లక్సెట్టిపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ నెల 20లోగా చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా మత్య్సశాఖ అధికారి అవినాష్, తహసీల్దార్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: గత మూడున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఉమ్మ డి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ, పీఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు అందడం లేదన్నారు. ఉమ్మడి జి ల్లాలోనే రూ.2వేల కోట్లు ఉన్నాయని, సీఎం, డిప్యూటీ సీఎంలను కలువనివ్వడం లేదని, ఇప్పటికే కాంట్రాక్టర్లు అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారని అన్నారు. అసోసియేషన్ వైస్ చైర్మన్ బి.అశోక్ పటేల్, సెక్రెటరీ జి.ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ బి.సదాశివరెడ్డి, కోశాధికారి సిరాజ్ ఉల్ రహమాన్, జనరల్ కౌన్సిల్ మెంబర్ ఎం.శ్రీధర్రావు, ఆది హరిమోహన్రావు పాల్గొన్నారు. -
ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్
మంచిర్యాలఅర్బన్: పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల నిరవధిక బంద్ చేపట్టారు. జిల్లాలోని డిగ్రీ, పీజీ, నర్సింగ్, డీఎడ్ కళాశాలలు బంద్లో పాల్గొన్నాయి. కళాశాలలు మూసివేసి అధ్యాపకులు, యజమానులు నిరసన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇచ్చేవరకు కళాశాలలు ప్రారంభించబోమని కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు ప్రకటించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ(డిగ్రీ కళాశాలల) యాజమాన్య సంఘం అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణ, ఆయా కళాశాలల చైర్మన్లు, కరస్పాండెంట్లు పల్లె భూమేష్, చంద్రమోహన్గౌడ్, పి.మల్లేశ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవగాహనేది..!
విద్యాదీవెనపై మంచిర్యాలఅర్బన్: రాజీవ్ విద్యాదీవెన పథకం కింద అందించే ఉపకార వేతనాలపై ప్రచారలోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో అర్హుల కు అందకుండా పోతోంది. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల్లో డ్రాపౌట్ శాతాన్ని తగ్గించడం, 9, 10వ తరగతుల విద్య పూర్తి చేయడానికి ఆర్థికసాయం అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనా లు అందిస్తారు. ఈ–పాస్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10వ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి డేస్కాలర్కు రూ.3,500, ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రూ.7వేలు(కాస్మెటిక్, పుస్తకాలు, ఇతరత్రా) చొప్పున చెల్లించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ఇప్పటి నుంచి నేరుగా విద్యార్థి లేదా తల్లిదండ్రల ఖాతాల్లో డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) పద్ధతిన బదిలీ కానుంది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం పూర్తయినా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 1072 ఉండగా.. 5,271మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు. యాజ మాన్యాలు, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 219మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 40మంది మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా..?ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు 2012 నుంచి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఉపకార వేతనాలు(రాజీవ్ విద్యాదీవెన పథకం) అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకూ స్కాలర్షిప్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి 17నుంచి పథకం అమల్లోకి వచ్చినా ప్రచారం లేకపోవడం, అవగాహన లేమి, అనేక నిబంధనలు వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. దరఖాస్తుకు బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు రూ.2లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.250లక్షలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులుగా పరిగణిస్తారు. విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు విముఖత చూపడం కూడా కారణంగా తెలుస్తోంది. ముందుగా పాఠశాల యూడైస్ ప్రకారం ఈపాస్ పోర్టల్లో పాఠశాలను రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ డిపార్టుమెంటు మ్యాపింగ్ చేయాలి. తర్వాత విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఈపాస్లో స్కూల్ నమోదు చేయకపోవడం వల్ల విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై ఏడు నెలలు గడిచినా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఒక్కరూ రిజిష్టర్ కాలేదు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకుంటే అర్హులైన ఎస్సీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగనుంది.విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఎస్సీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి. 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.3,500 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ–పాస్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో విధివిధానాలపై సూచనలతోపాటు సందేహాలు నివృత్తి చేశాం. ఎస్సీ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – దుర్గాప్రసాద్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిఎస్సీ విద్యార్థుల వివరాలు పాఠశాలలు 9వ తరగతి 10వ తరగతి ప్రభుత్వ 837 2050 1892 ప్రైవేటు 235 670 639 -
పెండింగ్ కేసుల్లో రాజీకి చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలక్రైం: ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య సూచించారు. ఈ నెల 15న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్పై సోమవారం కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు రాజీమార్గమే రాజమార్గమనే ఉద్దేశంతో ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు అవకాశం కల్పించిందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తి లాల్సింగ్ శ్రీనివాస్నాయక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, అదనపు సినియర్ సివిల్ జడ్జి డి.రామ్మోహన్రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్ పాల్గొన్నారు. -
‘అమ్మకు అక్షరమాల’ విజయవంతం చేయాలి
జన్నారం: ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతం చే యాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీ ర పురుషోత్తం అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతంలో భాగంగా నియమించిన ఇద్దరు ఓబీ(ఆఫీస్ బేరర్), ఒక వీఓఏ(విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్)లకు శిక్షణ ఇ చ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరక్షరాస్యులకు చదువు నేర్పించనున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ మనోహర్రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఐకేపీ ఏపీఎం లలిత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, సీఆర్పీలు రజిత, స్వప్న, వయోజన విద్యాశాఖ డీఆర్పీ సుమన్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న విద్యాశాఖ అధికారి పురుషోత్తం -
చాంపియన్లు.. స్ఫూర్తి రగిలించారు..!
అండర్19లో ఆడుతున్నా.. మంచిర్యాలటౌన్: మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను గెలిచి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నేను క్రికెట్లో శిక్షణ పొంది, అండర్ 19 విభాగంలో జాతీయస్థాయిలో ఆడుతున్నాను. ప్రపంచకప్ను సాధించిన మహిళా క్రికెట్ జట్టుతనలాంటి వారెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. – సుచరిత, చెన్నూరు శిక్షణ తీసుకుంటున్నా.. మంచిర్యాలటౌన్: మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలవడంతో చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టంతో మంచిర్యాలలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి వద్ద క్రికెట్లో శిక్షణ పొందుతున్నాను. గత ఏడాది అండర్ 17 బాలికల విభాగంలో హర్యానాలో జరిగిన జాతీయస్థాయి క్రికెట్లో ఆడాను. – సంజన, టేకుమట్ల, మం.జైపూర్ క్రికెట్లో రాణిస్తా.. మంచిర్యాలటౌన్: క్రికెట్లో రాణించాలన్న కోరికతో శిక్షణ తీసుకుంటున్నా. ఇప్పటి వరకు నా సీనియర్లు క్రికెట్లో శిక్షణ పొంది జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. మన దేశ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ను సాధించడంతో మరింత ఉత్సాహం వచ్చింది. నేను కూడా జాతీయ స్థాయిలో రాణిస్తా. – అక్షర, 8వ తరగతి, జెడ్పీఎస్ఎస్, జైపూర్ పెద్దల ఆలోచనల్లో మార్పు నిర్మల్టౌన్: మహిళలు విశ్వ విజేతలుగా నిలిచి అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ విజయంతో పెద్దల ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది. అమ్మాయిలు క్రికెట్ ఆడతామంటే ప్రోత్సహించేలా చేశారు. నాది నిర్మల్ మండలంలోని మేడిపల్లి గ్రామం. ప్రస్తుతం సోన్ కస్తూరిబాలో పదో తరగతి చదువుతున్నాను. జిల్లా, రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నా. – పోతుగంటి భువన కొత్త వారికి ఆదర్శం నిర్మల్టౌన్: మాలాంటి వారికి, కొత్తగా క్రీడలు ఆడేవారికి మహిళలు సాధించిన ప్రపంచ కప్ టైటిల్ ఆదర్శం. క్రికెట్పై మక్కువ ఉన్న మహిళలకు ఈ విజయం స్ఫూర్తినిచ్చింది. మాది నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామం. అండర్ 14, 16 రాష్ట్రస్థాయిలో ఆడాను. ప్రస్తుతం హైదరాబాద్ లీగ్లో ఆడుతున్నాను. జాతీయస్థాయిలో స్థానం సంపాదించాలన్నదే నా లక్ష్యం. – కోమల్ మంచి బ్యాటర్ అవుతా.. ఆదిలాబాద్: వరల్డ్ కప్లో స్మృతి మందాన చాలా బాగా ఆడింది. మందాన ఆటను చూసి ఎంతగానో నేర్చుకున్నాను. ఆమె లాగా మంచి బ్యాటర్ అవుతా. ప్రతీరోజు అకాడమీలో శ్రమిస్తున్నాను. – వినమ్ర, ఆదిలాబాద్ ఒకప్పుడు ‘క్రికెట్ అంటే మగవారి ఆట’ అని చెప్పిన సమాజం, ఇప్పుడు మహిళల పోరాటం చూసి సలాం చేస్తోంది. సంవత్సరాల కృషి, పట్టుదల, ప్రతీ ఓటమిని పాఠంగా తీసుకున్న ధైర్యం.. ఇవన్నీ కలిసి ఆదివారం భారత మహిళల క్రికెట్ జట్టును చరిత్ర సృష్టించే స్థితికి చేర్చాయి. ముంబైలో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ గెలుపు క్రీడారంగంలో సువర్ణాక్షరాలు లిఖించింది. మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది. ఉమ్మడి జిల్లాల యువతులు, విద్యార్థినులు ఈ విజయాన్ని తమ ప్రేరణగా తీసుకుంటామంటున్నారు. పలువురు మహిళా క్రీడాకారులు, విద్యార్థినులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి నెట్వర్క్ మహిళా శక్తి చాటారు ఆసిఫాబాద్రూరల్: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి వారి ప్రతిభ, క్రీడాశక్తిని ప్రపంచానికి చూపించారు. నేను సైతం వారి క్రీడా స్ఫూర్తితో జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ పోటీల్లో రాణిస్తా. – ఆడే పల్లవి, 10వ తరగతి యువ క్రీడాకారులకు ప్రేరణ ఆసిఫాబాద్రూరల్: ఈ విజయం మా వంటి యువ క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ ఇస్తుంది. నేను ఇలాంటి విజయం సాధించడానికి కృషి చేస్తున్నా. జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్లో కాంస్య పతకం సాధించాను. గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా. – సిడెం అనిత, 10వ తరగతి సొంతగడ్డపై విజయం ప్రత్యేకం ఆసిఫాబాద్రూరల్: భారత మహిళల స్వప్నం సాకారమైంది. ఆఖరి పోరాటంలో సొంతగడ్డపై భారత జట్టు విజయం సాధించడం ఎంతో ప్రత్యేకమైంది. యావత్తు భారత వనితలు గర్వించాల్సిన విజయమిది. నేను ఖోఖోలో 7 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఈ విజయం స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధిస్తా. – నాగేశ్వరి, గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల భారత జట్టుకు ఆడుతా.. ఆదిలాబాద్: చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. నా ఆసక్తిని గమనించి మావాళ్లు అకాడమీలో చేర్పించారు. మొదట్లో కొంత బెరుగ్గా ఉండేది. మ్యాచ్లు చూస్తూ, ప్రతీరోజు అకాడమీలో శిక్షణ తీసుకుంటుండడంతో భయం పోయింది. మహిళా జట్టు కప్ గెలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. – ఆద్య, ఆదిలాబాద్ ఆదర్శంగా తీసుకుంటా.. ఆసిఫాబాద్రూరల్: మహిళా జట్టు ప్రదర్శనను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణిస్తాను. మా క్రీడా పాఠశాలలో మా కోచ్లు క్రీడల్లో రాణించేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో క్రీడల్లో విజయాలు సాధిస్తాం. – నందిని, 10వ తరగతి దీప్తి ప్రదర్శన అద్భుతం.. ఆసిఫాబాద్రూరల్: ఫైనల్ మ్యాచ్లో దీప్తి శర్మ ప్రదర్శన చాలా బాగుంది. కీలక మ్యాచ్లో 58 పరుగులతో పాటు బౌలింగ్తో 5 వికెట్లు తీసింది. ఆమె కృషి ప్రేరణగా నిలుస్తోంది. జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో మూడు సార్లు పాల్గొన్నాను. – శ్రీలత, 9వ తరగతి -
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడులు
దహెగాం: మండలంలోని బీబ్రా గ్రామం శివారులో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం దాడులు నిర్వహించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఐదుగురిని పట్టుకున్నామన్నారు. రూ.5,940 నగదు స్వాధీనం చేసుకొని మొహ్మద్ అర్షద్, నిట్టూరి దుర్గేశ్, దుర్గం సాయికుమార్, మల్లబోయిన ఇస్తారి, నైనీ వెంకటిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎస్సై రాజు, సిబ్బంది మహమ్మద్, విజయ్, రమేశ్ ఉన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
తలమడుగు: అధిక వర్షాలతో పంట దిగుబడిపై ఆశలు ఆవిరైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో చోటు చేసుకుంది. అప్పు తీర్చేదెలా అని రుయ్యాడికి చెందిన కుమ్మరి ప్రేమేందర్ (41) బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమేందర్ తనకున్న 28 గుంటల వ్యవసాయ భూమితో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ సీజన్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులు, బ్యాంకులో దాదాపు రూ.5 లక్షల వరకు అప్పు తెచ్చాడు. అధిక వర్షాల కారణంగా పంట పూత, కాత లేక దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. మనస్తాపం చెందిన ఆయన ఆదివారం తన పశువులపాక సమీపంలో పురుగుల మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య గణిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పురుగుల మందు తాగి కార్మికుడు..మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్కు చెందిన మెంగని శ్రీకాంత్ (30) అనే సింగరేణి కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్కు భార్యతో తరుచూ గొడవలు కావడంతో విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఒంటరి జీవితంతో మనస్తాపానికి గురై శనివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. రైలు కిందపడి యువకుడు.. మంచిర్యాలక్రైం: కుటుంబ కలహాలతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన జాన గంగాధర్ కుమారుడు శ్రీనివాస్(39) ఈ నెల 2న సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున మంచిర్యాల ఏసీసీ సమీపంలోని రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
పోలీసులపై మందుబాబుల దాడి
మంచిర్యాలక్రైం: మద్యంమత్తులో ఇద్దరు వ్యక్తులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. మంచిర్యాలలోని రాజీవ్నగర్లో ఆదివారం అర్ధరాత్రి 12.15గంటలకు జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా హెడ్కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ పల్లె రాజు బ్లూకోల్ట్స్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. రాజీవ్నగర్ నుంచి డయల్ 100కు ఫోన్ రాగా అక్కడి వెళ్లి తిరిగి వస్తుండగా సంతోష్ కిరాణం వద్ద రోడ్డుపై చిప్పకుర్తి సతీష్, సబ్బాని రాజు, నరేష్ బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని పోలీసులు వారిని మందలించారు. దీంతో ఇక్కడే తాగుతామంటూ సతీష్, రాజు గొడవకు దిగారు. కానిస్టేబుళ్లలో ఒకరు వారిని వీడియో చిత్రీకరణ చేస్తుండగా.. ఎందుకు వీడియో తీస్తున్నారంటూ దాడి చేశారు. ఈ విషయమై స్థానిక సీఐ ప్రమోద్రావును సంప్రదించగా.. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన సతీష్, రాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మతిస్థిమితం లేని వృద్ధుడు మృతిఇంద్రవెల్లి: మతిస్థిమితం లేని వృద్ధుడు, ఇంటి నుంచి వెళ్లిపోయి ఓ వ్యవసాయ చేనులో మృతి చెందిన ఘటన మండలంలోని లక్కుగూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిప్రి లక్కుగూడ గ్రామానికి చెందిన మడావి తుల్సిరాం(85) అనే వృద్ధుడు వారం రోజులుగా మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. పలుమార్లు కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఈనెల 31న ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం దనొరా(బి) గ్రామ పంచాయతీ శివారులోని ఓ రైతు వ్యవసాయ చేనులో మడావి తుల్సిరాం మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాతావరణాన్ని తట్టుకోలేక మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. -
పెళ్లింట విషాదం..!
మంచిర్యాలక్రైం: నాలుగు రోజుల క్రితమే ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కొత్త పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తమ అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఎంతో ఆనందంగా గడుపుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మేనమామ పెళ్లికి వచ్చిన బాలుడు తన స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఆడుకుంటూ కిందపడిపోయి మృతిచెందాడు. ఈ హృదయ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమినగర్లోని అవినాష్ అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. రేకు విరిగిపోవడంతో.. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని శాంతినగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలసంకుల రాజశేఖర్ –శృతి దంపతులకు కుమారుడు సహర్ష్(10), కుమార్తె సహస్ర ఉన్నారు. రాజశేఖర్ ఖానాపూర్ సమీపంలోని పెద్ద తర్లపాడ్ గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల నిర్మల్లో ఓ ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. గత నెల 31న రాజశేఖర్ బావమరిది (శృతి తమ్ముడు) తిరుపతి వివాహం ఉండడంతో అందరూ కలిసి మంచిర్యాలకు వెళ్లారు. తిరుపతి కుటుంబంతో కలిసి గౌతమినగర్ అవినాష్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. వివాహం పూర్తి కాగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా పెళ్లి వేడుకలపై కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈక్రమంలో సోమవారం సహర్ష్ తన స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్లోని 5వ అంతస్తుపై ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ అక్క డే వెంటిలేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులపైకి వెళ్లాడు. ఒక్కసారిగా రేకు విరిగిపోవడంతో 5వ అంతస్తు నుంచి నేలమీద పడ్డాడు. తోటి స్నేహితులు ఏడ్చుకుంటూ వెళ్లి విషయం చెప్పడంతో వెంటనే సహర్ష్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో వివాహం జరిగిన ఇంట్లో ఆనందం ఆవిరైంది. మేనమామ తిరుపతి, సహర్ష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోధనలు కాలనీవాసులను కంటతడి పెట్టించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. -
‘పీవీటీజీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు’
ఆదిలాబాద్రూరల్: పీవీటీజీల సంక్షేమానికి, అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు సకాలంలో ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నామని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పొలాం బాట కార్యక్రమంలో భాగంగా పీవీటీజీ గ్రామాలకు లింకు రోడ్లు మంజూరు చేశారని, కొన్ని జీవోలను సాకుగా చూపెట్టి మంజూరైన పనులను చేపట్టడం లేదని విమర్శించారు. గడువులోగా పనులు చేయకుంటే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని, పనులను వెంటనే చేపట్టాలని కోరారు. కుంరం సూరు యువసేనా జిల్లా అధ్యక్షుడు కుమ్ర రాజు, జలపతి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
లోకేశ్వరం: ప్రేమవ్యవహారంలో మనస్పర్థలు రావడంతో ప్రేమజంట వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న హృదయ విషాదకర ఘటన మండలంలోని వట్టోలి గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. వట్టోలి గ్రామానికి చెందిన భూంపల్లి అఖిల(21) డిగ్రీ మధ్యలో మానేసి ఇంటివద్ద ఉంటూ తల్లి నీలకు చేదోడువాదోడుగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్ (22) బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో ఆదివారం సాయంత్రం అఖిల ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే నరేశ్ కూడా బ్రహ్మేశ్వరాలయం వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నరేశ్ వేధింపుల వల్లే అఖిల ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి నీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరేశ్ తల్లి ముత్తవ్వ ఇరువురి మధ్య మనస్పర్థల వల్లే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా యువరాజ్ మర్మట్
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా ఉట్నూర్ సబ్కలెక్టర్ యువరాజ్ మర్మట్ను నియమిస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఈ నెల 4వ తేదీ నుంచి ఆరు నెలల పాటు మెటర్నిటీ సెలవులో వెళ్లనున్నారు. దీంతో ఇన్చార్జి పీవోగా ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బాసరలో గంగాహారతిబాసర: కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యగోదావరి హారతితో పాటు గోదావరి తీరంలో విశేష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోదావరి నదికి హారతినిచ్చి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నది వద్ద ఈనెల 5న ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో అంజనదేవి తెలిపారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గీట్ల సుమీత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల్లో దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న వారు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారన్నారు. ఈ క్రమంలో ఆఫీస్ సబార్డినేటర్లకు, విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు మంజూరు చేయాలని, పీఆర్సీ వర్తింజేయాల ని, హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలి పారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కవితారాణి, కోశాధికారి సుజాత, సభ్యులు శేఖర్, అంకూస్, సతీశ్, సునీత, తారాబాయి, శ్రీనివాస్, గోవర్దన్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పతకాల పంట
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–17 బాల,బాలికల జూడో పోటీల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో ఈనెల 1, 2 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 12 పతకాలతో మెరిశారు. బాలికల్లో డి.నాగిని ప్రియ (–44 కేజీలు), పి.అక్షిత (–57), జి. సహస్ర (–48) లు స్వర్ణ పతకాలతో ప్రతిభ కనబరర్చారు. టి.సింధు (–52 కేజీలు) రజత పతకంతో మెరవగా, ప్రణీత(–63), బి.శృతి (–36)లు కాంస్య పతకాలతో సత్తా చాటారు. బాలురలో ఎస్.మనోజ్ కుమార్ (–40 కేజీలు), ఆర్.తరుణ్ (–55), ఎం.హర్షవర్ధన్(–60), ఆర్.మధు(–81), ఏ.సంతోష్ (–90)లు స్వర్ణ పతకాలు సాధించారు. పి.లోకేష్ (–66 కేజీల) ఈవెంట్లో రజత పతకం సాధించినట్లు కోచ్ రాజు తెలిపారు. డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, క్రీడా పాఠశాల సిబ్బంది, శిక్షకులు తదితరులు వారికి అభినందనలు తెలిపారు. -
యాప్లో పల్లెల లెక్క
మంచిర్యాలరూరల్(హాజీపూర్):గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు గత నెల 18న చేపట్టిన జీపీ మానిటరింగ్ సర్వే నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో సర్వే జరుగుతోంది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం, నిధుల కొరతతో పలు గ్రామాల్లో సమస్యలు పెరిగిపోవడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ జీపీ మానిటరింగ్ సమాచారంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయవచ్చని ప్రభుత్వం సర్వేకు ఉపక్రమించింది. 21 అంశాలపై సర్వే..జీపీ మానిటరింగ్ యాప్ ద్వారా అన్ని గ్రామాల్లో 21 అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ యాప్లో పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. పంచాయతీ భవనం, ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్, పారిశుద్ధ్యం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, వైకుంఠధామం, తాగునీరు, వీధిదీపాలు, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, తదితర ప్రాథమిక వసతు ల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లోని వసతులతో పాటు ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తుల వాస్తవ పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు తెలియడంతో పాటు ఈ సర్వే ద్వారా పంచాయతీలోని సమగ్ర సమాచారంపై పూర్తి అవగాహన వస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడనుంది. పారదర్శకంగా సర్వే.. గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న జీపీ మానిటరింగ్ యాప్ సర్వే పారదర్శకంగా సాగుతోంది. పంచాయతీల్లోని ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులపై సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు 21 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను జీపీ మానిటరింగ్ యాప్లో నమోదు చేస్తున్నారు. సర్వేపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
ఖానాపూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధి గండిరాంపూర్కు చెందిన గాదె నరేశ్(22) గత కొంతకాలంగా ఖానాపూర్ మండలం సత్తన్పల్లి పంచాయతీ పరిధిలోని రాంరెడ్డిపల్లెలో నివాసం ఉంటున్నాడు. గతనెల 31న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు, గ్రామస్తులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గ్రామంలో అడ్ప లక్ష్మారెడ్డి మామిడి తోటలో వ్యవసాయ బావిలో ఆదివారం మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. నరేశ్ మానసిక సమస్యతోపాటు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడని ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నెన్నెల: వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గూర్చి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. పరిశుభ్రత పాటించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సిబ్బందికి సూచించారు. వంటగది, భోజనశాల, స్టోర్రూమ్ హాస్టల్కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు ట్యూటర్లను నియమించాలని వార్డెన్ జయశంకర్ను ఆదేశించారు. -
A…«§ýl E´ë-«§éÅ-Ķæ¬yìl ˘ దొరకని ఆచూకీ
కడెం: కరీంనగర్కు చెందిన అంధ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్రెడ్డి శనివారం కడెం ప్రాజెక్ట్లో దూకి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి రాత్రివరకు ఎస్సై పి.సాయికిరణ్, సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. మధ్యాహ్నం కడెం ప్రాజెక్ట్ వరద గేటు ఎత్తారు. బ్యాక్వాటర్లో నుంచి గేటు బయటకు వెళ్లి ఉంటాడా, లేదా బురదలో తట్టుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా రాజశేఖర్రెడ్డి మనస్తాపంతో కడెం ప్రాజెక్ట్లో దూకి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
సోయా టోకెన్ల కోసం బారులు
ముధోల్:మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం నుంచి సోయా టోకెన్ల పంపిణీ చేయనున్నారు. ఆదివారం రాత్రి రైతులు తరలివచ్చి కార్యాలయం వద్ద బారులు తీరారు. క్యూలో చెప్పులు, వాటర్ బాటిళ్లు ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్సై బిట్లా పెర్సిస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉదయం కార్యాలయానికి రావాలని కోరిన వారు అక్కడే ఉండిపోయారు. సోమవారం ముధోల్, ముద్గల్, విఠోలి, మచ్కల్, తరోడా గ్రామాలు, మంగళవారం రాంటెక్, టాక్లీ, దోడాపూర్, లబి గ్రామాలకు టోకెన్లు జారీ చేయనున్నారు. క్యూలైన్లో చెప్పులు ఉంచిన రైతులు -
బియ్యం మారినా.. దందా ఆగలే!
మంచిర్యాలక్రైం: గత ప్రభుత్వాలు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేసిన రేషన్ (దొడ్డు) బి య్యం తినడానికి యోగ్యంగా లేకపోవడంతో రా ష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు వాటిని దళారుల కు అమ్ముకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొడ్డు బియ్యం ఎవరూ తినడం లేదని ఈ ఏడాది మే నెలలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో బాగానే ఉన్నా ఆతర్వాత అన్నం మెత్తగా అవుతోందని, ఇసుక ఉంటోందని జిల్లాలో 70 శాతం మంది లబ్ధిదారులు సన్నబియ్యం అమ్ముకుంటున్నారు. ధళారులు వీధుల గుండా తిరుగుతూ కిలోకు రూ.18 చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకు 20 కేసులు నమోదు కాగా 208.31 క్వింటాళ్ల రేషన్బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సన్నబియ్యం అక్రమ రవాణపై సివిల్ సప్లై అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మళ్లీ అదే దందా.. అదే జోరు..గతంలో 90 శాతం మంది ప్రజలు ఉచితంగా వచ్చిన రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.12 నుంచి 14 వరకు దళారులకు విక్రయించేవారు. ఇదే అదనుగా భావించిన రేషన్ డీలర్లు సైతం లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని నగదు చెల్లించేవారు. దళారులు ప్రస్తుతం ఒకరు రూ.18 చెల్లిస్తుంటే మరొకరు పోటీగా రూ.20 పెట్టి వాడల్లో తిరుగుతూ సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. కొందరు మహారాష్ట్రలోని సిరోంచకు, మరికొందరు స్థానికంగా, ఇతర ప్రాంతాల రైస్మిల్లులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సైతం మళ్లీ దళారుల అవతారమెత్తి దర్జాగా దందా సాగిస్తున్నట్లు సమాచారం. సగానికిపైగా అనర్హులే...జిల్లాలో 423 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీనెల జిల్లాకు 9 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బి య్యం పంపిణీ చేస్తోంది. ఇందులో సగానికిపైగా అ నర్హత కలిగిన కుటుంబాలు ఉండడం గమనార్హం. రేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు ఆదాయ వర్గాలు సైతం పెద్దఎత్తున కార్డులు పొందారు. వారికి పీడీఎస్ బియ్యం అవసరం లేకపోయినప్పటికీ కేవలం తమ రేషన్ కార్డు రద్దు కాకుండా యాక్టివ్గా ఉండేందుకు అప్పుడప్పుడు బియ్యం కోటా డ్రా చేస్తున్నారు. ఎవరైన సన్నబియ్యం అమ్ముకుంటే వారిని గుర్తించి రేషన్కా ర్డు రద్దు చేస్తామని ఓ వైపు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు. సరిహద్దులో నిఘా కరువు...మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాపనపల్లి ప్రాణ హిత నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర రహదారి అక్ర మ రవాణాకు వారధిగా మారింది. మంచిర్యా ల నుంచి మహారాష్ట్రకు డీసీఎం, ఆటోలు, ట్రాలీ ఆటో ల ద్వారా రాత్రి పగలు తేడాలేకుండా యథేచ్చగా రేషన్బియ్యం తరలిస్తున్నారు. గతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీ సులు ప్రత్యేక టీంగా ఏర్పడి అక్రమ రవాణా, చ ట్ట వ్యతిరేఖ కార్యక్రమాలపై నిఘా పెట్టి వరుస దాడులు నిర్వహించారు. ప్రస్తుతం టాస్క్ఫోర్ బృందం లేకపోవడంతో అంతర్రాష్ట్ర వారధిపై నిఘా వైఫల్యం వల్లే అక్రమ రవాణా దందా యథేచ్చగా సాగుతోంది. ప్రతీరోజు జిల్లా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.కోటి విలువైన బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఏదైనా సమాచారం ఉంటే తప్ప పోలీసులు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా చేసిన దాడుల్లోనే క్వింటాళ్ల కొద్దీ బియ్యం పట్టుబడడం గమనార్హం. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాపై నిఘా... రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. బియ్యం అమ్మిన వారి రేషన్కార్డు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తున్నాం. అక్రమ రవాణా ఏదైనా సరే వదిలిపెట్టిది లేదు. ఇప్పటికీ చాలా కేసులు నమోదు చేశాం. అదే వృత్తిగా మలచుకుని దందా కొనసాగిస్తున్న కొందరిని గుర్తించాం. త్వరలో వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తాం. బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
తేలిన టీచర్ల లెక్క
ఈ చిత్రంలో కనిపిస్తోంది దండేపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల. ఇందులో 227 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రేషనలైజేషన్ (పాఠశాలల హేతుబద్ధీకరణ) మేరకు 8 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈలెక్కన 14 మంది టీచర్లు మిగులు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ టీచర్లను అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేయనుంది. మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పునర్విభజన, మిగులు పోస్టులను సర్దుబాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమిస్తూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా 2025–26 విద్యాసంవత్సరంలో టీచర్ల సర్దుబాటు (తాత్కాలిక డిప్యూటేషన్) చేసింది. తాజాగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు మిగులు టీచర్లు, ఉపాధ్యాయుల కొరత వివరాలు సేకరించి నివేదించింది. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించింది. అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్అడ్జస్ట్ పేరిట మొదటి విడత 73 మంది, రెండో దఫా 19 మంది టీచర్లను సర్దుబాటు చేసింది. మరోసారి ఉపాధ్యాయుల సర్దుబాటుతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మిగులు 367.. కొరత 96జిల్లాలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రైమరీ స్కూళ్లు 488, యూపీఎస్లు 88, ఉన్నత పాఠశాలలు 101 ఉన్నాయి. 30,406 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 2,474 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న (మిగులు పాఠశాలలు)లెక్క తేల్చారు. మొత్తం 367 మంది మిగులు టీచర్లు (సర్ప్లస్) ఉన్నట్లు గుర్తించారు. ఇందులో చెన్నూర్, దండేపల్లి మండలాల్లో 43 మంది చొప్పున మిగులు ఉన్నట్లు గుర్తించారు. నెన్నెలలో 29, జైపూర్లో 26, మంచిర్యాలలో 26, కోటపల్లిలో 25, తాండూర్లో 24, హాజీపూర్లో 22 మంది సర్ప్లస్ ఉపాధ్యాయులుండగా మిగిలిన మండలాల్లో నలుగురి నుంచి 20లోపు ఉన్నట్లు విద్యాశాఖ నిర్ధారించింది. విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయుల కొరత గుర్తించింది. ఆయా పాఠశాలల్లో 96 మంది ఉపాధ్యాయులు అవసరమున్నట్లు తేల్చారు. ఇందులో అత్యధికంగా జన్నారం మండలంలో 17 మంది, మంచిర్యాలలో 14, మందమర్రిలో 12 మంది, మిగిలిన మండలాల్లో 1 నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లు తేల్చింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువగా ఉన్న పాఠశాలలకు వారిని సర్దుబాటు చేయనున్నారు. రేషనలైజేషన్ ఇలా.. పాఠశాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియలో చైల్డ్ఇన్ఫోలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం నిర్వహిస్తున్న చోట 50 మందికిపైగా విద్యార్థులుంటే పూర్తిస్థాయిలో అంటే ఏడుగురు టీచర్లు, ఒక హెచ్ఎం, పీఈటీని కేటాయించాలి. మిగిలిన మీడియంకు నాన్ లాంగ్వేజ్ గణితం, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ టీచర్ను నియమించాలి. ప్రైమరీ, యూపీఎస్ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులుంటే 1టీచరు, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది వరకు ఉంటే ఆరుగురు టీచర్లు అవసరముంటుంది. 6, 7 తరగతులకు 1 నుంచి 20 ఒక లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ టీచర్, 21 మందిపైన–నాలుగు సబ్జెక్టు టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలో 220 మంది వరకు విద్యార్థులు ఉంటే ఏడుగురు టీచర్లు, 221 నుంచి 250 వరకు ఉంటే 8, 251 నుంచి 280 వరకు ఉంటే 9, 281 నుంచి 310 వరకు ఉంటే 10, 311నుంచి 340 వరకు ఉంటే 12, 671 నుంచి 700 వరకు ఉంటే 24 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ టీచర్లు ఉండగా, మరికొన్నింట్లో విద్యార్థుల సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. మచ్చుకు కొన్ని.. -
16న కుంగుఫూ చాంపియన్షిప్ పోటీలు
నస్పూర్: నస్పూర్లో వి కరాటే అండ్ ఫిట్నెస్ అకాడమీ మంచిర్యాల ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ స్మారకార్థం ఈనెల 16న రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే కుంగు ఫూ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది ఎండీ సంధాని తెలిపారు. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన పోటీల నిర్వాహకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధాని మాట్లాడుతూ నస్పూర్ కాలనీలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ స్మారకార్థం నిర్వహించే పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో నిర్వాహకులు వెంకటేశ్, శ్రీనివాస్, మహేశ్, రమేశ్, ఎండీ అబ్బాస్, ఎండీ మయూబ్, విజయ్, నరెడ్ల శ్రీనివాస్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
చిరువ్యాపారులపై కమిషనర్ జులుం
చెన్నూర్: వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిని వేధింపులకు గురిచేస్తున్న కమిషనర్ మురళీకృష్ణను సస్పెండ్ చేయాలని మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజుయాదవ్ డిమాండ్ చేశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి బ్లాంకెట్లు, చద్దర్లు అమ్ముకుని జీవనం సాగించేందుకు 40 ఏళ్లుగా వ్యాపారులు వస్తున్నారని తెలిపారు. కమిషనర్ వారివద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే షాపులను జేసీబీలతో తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తానని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి రత్నాకర్ మహదేవ్, నాయకులు దుర్గం రాజమల్లు, చిరు వ్యాపారులు కిషన్, విజయ్, సాగర్, కిరణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
మంచిర్యాల
7గూడెం గుట్ట..భక్తుల కిటకిట దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 8లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. సత్ఫలితాలిస్తున్న గడ్డిక్షేత్రాలు కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డిక్షేత్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. గతంతో పోలిస్తే వీటి వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. 8లోu -
గూడెం గుట్ట..భక్తుల కిటకిట
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో కార్తిక సందడి కొనసాగుతోంది. ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో గూడెం గుట్ట భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. 905 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. గుట్ట కింద రావిచెట్టు వద్ద గుట్టపైన ఖాళీ ప్రదేశంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈవో శ్రీనివాస్, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. సుమారు 600 మందికి అన్నదానం చేశారు. -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
నిర్మల్టౌన్: ఆర్యవైశ్యులు పార్టీలకతీతంగా రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఆమెడ శ్రీధర్, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండేళ్ల పదవీ కాలంలో ఆర్యవైశ్యులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి రూ.25 లక్షల నిధుల విడుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్చార్జిగా పట్టణానికి చెందిన పత్తి విజ్ఞతేజ నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ చైర్మన్ మిరుదొడ్డి శ్యామ్, వైస్ చైర్మన్ యాద నాగేశ్వర్రావు, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గాదె విలాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గంజాయి సాగు చేసిన రైతుపై కేసు ఇంద్రవెల్లి: చేనులో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పాటగూడ గ్రామానికి చెందిన కుమ్ర భీంరావ్.. ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, కంది, పత్తి పంటలు, అంతర పంటగా 20 గంజాయి మొక్కలు సాగు చేశాడు. పక్కా సమాచారం మేరకు ఆదివారం భీంరావ్ చేనులో తనిఖీ చేయగా 20 గంజాయి మొక్కలు లభ్యం కాగా, వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కలప స్మగ్లింగ్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ఖానాపూర్: కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలో కలప స్మగ్లింగ్కు పాల్పడిన ఎంబడి శేఖర్కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిర్మల్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాసు మె జిస్ట్రేట్, ఖానాపూర్ ఇన్చార్జి భవిష్య తెలి పారు. నిందితుడిని రాత్రి నిర్మల్ సబ్జైల్కు తరలించినట్లు ఎఫ్డీవో శివకుమార్, ఎఫ్ఆర్వో అనిత పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకుంటామన్నారు. కలప పట్టివేతజన్నారం: మండలంలోని రోటిగూడ గ్రామంలో ఆదివారం సాయంత్రం తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు, ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పాలాజీ సుధాకర్, భాస్కర్ ఇళ్లలో రెండు కర్ర కోత యంత్రాలు, కలపను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వీటి విలువ రూ. 24,500 ఉంటుందన్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. తాళ్లపేట డీఆర్వోలు సాగరిక, పోచమల్లు, ఎఫ్ఎస్వోలు శంకర్, నరేశ్, బీట్ అధికారులు రహీమోద్దీన్, సాయ రవికిరణ్, అనిత, జ్యోతి, కృష్ణమూర్తి, రుబీనా, వెంకటేశ్, లవన్ ఉన్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) బాలుర గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గురుకులంలో 8వ తరగతి చదువుతున్న బి.ఉషాకిరణ్ ఇటీవల కాగజ్నగర్లో జరిగిన ఉమ్మడి జిల్లా జోనల్స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 3 నుంచి 5వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. సదరు విద్యార్థిని సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. సీవోఈ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు సీ.హెచ్.రాజశేఖర్, అల్లూరి వామన్ పాల్గొన్నారు. -
వృత్తి రక్షణకు పార్టీలకతీతంగా ఏకం కావాలి
భైంసాటౌన్: గ్రామాల్లో కల్లుగీత కార్మికులపై వీడీసీ వేధింపులు ఎక్కువయ్యాయని, వృత్తి రక్షణకు గౌడ కులస్తులు పార్టీలకతీతంగా ఏకం కావాలని మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి గౌడ సంఘ భవనంలో నక్కల మోహన్గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మోకుదెబ్బ జిల్లా ముఖ్యుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు జిల్లా అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కనక గౌడ్(కుభీర్), ముష్కం అశోక్ గౌడ్(భైంసా)ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రక్షణ, గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ కృషి చేస్తోందన్నారు. వీడీసీల నిలువు దోపిడీపై రాజకీయాలకతీతకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చార ు. కుల దామాషా ప్రకారం అన్ని రంగాల్లో గౌడ కులస్తుల వాటా సాధన కోసం మోకుదెబ్బ పని చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి 5 లక్షల మందితో హైదరాబాద్లో భారీ సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మురళిగౌడ్, కార్యవర్గ సభ్యులు రాజేందర్గౌడ్, వెంకట్గౌడ్, దశాగౌడ్, జిల్లాలోని అన్ని మండలాల గౌడ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
సామాజికసేవలో ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర
ఆదిలాబాద్: సామాజిక సేవలు ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర పోషిస్తోందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ్ బలవత్రి గణేశ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు భాగంగా జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఆదివారం పథ సంచలన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథ సంచలన్ జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌక్ల గుండా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ అన్నివర్గాలకు విపత్కర సమయాల్లో అండగా నిలుస్తోందన్నారు. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చిన సంఘ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ సంచలన్లో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇందూర్ విభాగ్ సంఘ్ చాలక్ నిమ్మల ప్రతాపరెడ్డి, నగర సంఘ్ చాలక్ నూతుల కల్యాణ్రెడ్డి పాల్గొన్నారు. -
సత్ఫలితాలనిస్తున్న గడ్డిక్షేత్రాలు
జన్నారం: కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డిక్షేత్రాలు సత్ఫలితాలిస్తోంది. గతంతో పోలిస్తే వీటి వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగాయి. అటవీప్రాంతంలో గడ్డి క్షేత్రాలు విస్తరించి ఉంటే శాకాహార జంతువుల సంతతి పెరుగుతుందనే ఆ శాఖ అధికారులు 2019లో వీటి పెంపకానికి శ్రీకారం చుట్టారు. దీంతో పులుల రాక కోసం అటవీ అధికారులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి ఆహారంగా అడవిలో నివాసం ఉండే శాకాహార జంతువుల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం వరకు జన్నారం అటవీ డివిజన్లో సుమారు వెయ్యి హెక్టర్లలో గడ్డి మైదానాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మరో 80 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గడ్డి విత్తనాలు చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సహజసిద్ధంగా మొలసిన గడ్డిలో కలుపు తొలగిస్తూ పెంపకం చేస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే పశువులు తినకుండా సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. కేరాఫ్గా జన్నారం డివిజన్ జన్నారం అటవీ డివిజన్లో అత్యధికంగా గడ్డి మైదానాలున్నాయి. వీటికి కేరాఫ్గా చెప్పువచ్చు. ఈ అటవి డివిజన్ పులి అవాసాలకు అనువుగా ఉండటం వల్ల గడ్డిపెంపకంపై దృష్టి సారిస్తున్నారు. దీనికితోడు శాకాహార జంతువులు జింకలు, దుప్పులు, నీలుగాయిలు, సాంబ ర్లు, కుందేళ్లు, గడ్డి, కృష్ణ జింకలు అవాసాలు ఏ ర్పాటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే గడ్డిక్షేత్రాలతో వన్యప్రాణుల సంఖ్య పెరిగినట్లు అఽ దికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో స హజసిద్ధంగా గడ్డి వస్తుంటుంది. గత సంవత్సరంలో ఎండిన గడ్డి విత్తనాలు మొలకెత్తుతా యి. ఆయా ప్రాంతంలో గడ్డి క్షేత్రాలు పరిశీలించడం, కలుపు తీయించడం, జరుగుతుంది. దీంతో కలుపు లేని గడ్డిని వన్యప్రాణులు ఇష్టంగా తింటాయని అధికారులు పేర్కొంటున్నారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
నస్పూర్: పట్టపగలే ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కు ని ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ పరిధిలోని రాయల్ గార్డెన్ సమీపంలోని గణేశ్నగర్కు చెందిన చేవెళ్ల సరస్వతి.. ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం ఆమె పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించింది. ఆ తర్వాత తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి సరస్వతి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్కుమార్, ఎస్సై ఉపేందర్రావు ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆలయంలో చోరీ ముధోల్: కారేగాం గ్రామంలోని శనివారం రాత్రి ఎ ల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం, వెండి కన్నులతోపాటు భక్తులు సమర్పించిన కానుకలు, రూ.2 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. తాళం పగులగొట్టిన హుండీ తెరుచుకోకపోవడంతో అక్కడే వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. -
ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1న కాగజ్నగర్లో నిర్వహించిన అండర్–14 జోనల్స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పల్లపు హర్షవర్ధన్, తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణీత్ ఈ నెల 3న నుంచి 5 వరకు వికారాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, పీడీ రాజయ్య అభినందించారు. -
మొలకెత్తిన దూది
చెన్నూర్రూరల్: జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. పంటలు చేతికి వచ్చే మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురవడంతో పత్తి, వరి చేలు దెబ్బతిన్నాయి. ఏరే దశలో ఉన్న పత్తి తడిసిపోయింది. చెన్నూర్ మండలం కాంబోజిపేట గ్రామానికి చెందిన యువరైతు పెండ్లి సంతోష్ గ్రామ సమీపంలోనే ఎకరానికి రూ.15వేలు కౌలు చెల్లించి మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఇప్పటివరకు పత్తి పంట సాగుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు చేశాడు. మొక్కలకు ఉన్న పత్తి కాయల నుంచి పత్తి బయటకు వచ్చింది. కురిసిన వర్షాలకు ఇలా బయటకు వచ్చిన పత్తి మొత్తం తడిసి పోయి గింజలోంచి మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు. -
పత్తి కొనుగోళ్లు
నేటి నుంచి మంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి/దండేపల్లి: జిల్లాలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ మూడు వ్యవసాయ మార్కెట్యార్డుల పరిధిలో 10 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. చెన్నూర్ పరిధిలో 6, బెల్లంపల్లిలో 3, లక్సెట్టిపేటలో 1 జిన్నింగ్ మిల్లులో ఏర్పాట్లు చేశారు. సోమవారం బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని తాండూర్ మండలంలో రేపల్లెవాడ జిన్నింగ్ మిల్లు, లక్సెట్టిపేట మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 నుంచి 13 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు అధికారుల అంచనా. గతేడాది ఆందోళనలు, రాస్తారోకోలుగతేడాది 7.58 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పత్తి అమ్ముకునేందుకు అరిగోస పడ్డారు. సీసీఐ నిబంధనతో అవస్థలు పడ్డారు. తేమ, పింజపొడవు తదితర నిబంధనల సాకుతో వారంలో మూడు నాలుగు రోజులు కొనుగోళ్లు నిలిపివేయడంతో పత్తి వాహనాలతో నిరీక్షించారు. డిసెంబర్, జనవరి మాసంలో మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోయి త రచూ కొనుగోళ్లు నిలిపివేయడంతో రాస్తారోకోలు, ఆందోళనలు సైతం చేపట్టారు. కొంతమంది రైతులు సీసీఐ కొర్రీలతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు. వర్షాలతో తగ్గిన దిగుబడిఈ ఏడాది జిల్లాలో 1.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పంట నీటమునిగింది. కొన్నిచోట్ల మొక్కలు జాలువారి దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 4 నుంచి 5 క్వింటాళ్లకు మించి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి వెళ్తే చాలని సరిపుచ్చుకుంటున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడికి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఏటా సీసీఐకి రైతులు తీసుకువచ్చిన పత్తికి తేమ, పింజపొడవు, తదితర నిబంధనల పేరుతో కొనుగోలు చేయడం లేదు. ఆరంభంలో తేమ 12 శాతం కంటే ఎక్కువగా వస్తుందని కొనుగోలు చేయడం లేదు. గడిచిన నాలుగేళ్లలో డిసెంబర్, జనవరి మాసాల్లో పెద్ద ఎత్తున పత్తి మార్కెట్లకు తరలివచ్చింది. ఈ సమయంలో సీసీఐ తేమ తిరకాసుతో రైతులు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయారు. నాణ్యమైన పత్తి తీసుకురావాలి జిల్లాలో సీసీఐ ద్వారా 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయనున్నప్పటికీ నేడు తాండూర్ మండలం రేపల్లెవాడ, లక్సెట్టిపేటలోని జిన్నింగ్ మిల్లులో కలెక్టర్ పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. పత్తి విక్రయించే రైతులు కపాస్ కి సాన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. నాణ్యమైన పత్తి తీసుకువచ్చి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర పొందాలి. – షాబొద్దీన్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అఽధికారిపత్తికి మద్దతు ధర ఇలా (క్వింటాలుకు)కొత్త తిప్పలు.. కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకవచ్చింది. పత్తి విక్రయించే రైతులు ముందుగా ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా సాగు చేసిన పత్తి పంటకు సంబంధించి క్రాప్ బుకింగ్లో నమోదు చేసి ఉండాలి. ఆధార్కు అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ లేదా, బయోమెట్రిక్/ ఐరిస్ ద్వారా కూడా ఆధార్ దృవీకరించనున్నారు. రైతులు ఆధార్కు అనుసంధానించిన సెల్ నంబర్ను యాప్లో నమోదు చేసుకుంటే స్లాట్ బుకింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లో కపాస్ కిసాన్యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్లు కేటాయిస్తారు. అవగాహన లేని రైతులకు ఏఈవోలు, సీసీఐ సిబ్బంది ద్వారా స్లాట్ బుకింగ్ సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీఐ నిబంధనల మేరకు 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయనుంది. 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.8,110, ఆపై పెరిగితే ఒక్క శాతానికి రూ.81 తగ్గించి ధర చెల్లించనున్నారు. -
రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమావేశం నిర్వహించారు. సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారీగా నాలుగు కేటగిరీలుగా విభజించామని తెలిపారు. ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
మంచిర్యాల
7లీకేజీలతో అరిగోస చెన్నూర్, భీమారం, నస్పూర్లో మిషన్ భగీర థ పైపులైన్ల లీకేజీల కారణంగా తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. తాగునీరు క లుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈదురుగాలులు వీస్తాయి. అద్దె భవనాలు.. అసౌకర్యాలు బెల్లంపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ గు రుకుల విద్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అసౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నానో ఎరువుల వినియోగం పెంచాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంటల సా గులో రైతులు నానో ఎరువుల వినియోగం పెంచేలా వ్యవసాయ అధికారులు కృషి చే యాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. శనివారం గుడిపేట రైతువేదికలో హాజీపూర్ మండల వ్యవసాయాధికారి కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ద్రవ రూపంలో యూరియా, డీఏపీ వాడకం జరిగేలా అవగా హన కల్పించాలని అన్నారు. పీఎం కిసాన్, రైతుబీమా, ఎరువుల పంపిణీ ఇతర అంశాల పై అధికారులతో కలిసి ప్రగతిని సమీక్షించా రు. సమావేశంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు, నానో ఫర్టిలైజర్ కో ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
15న ప్రత్యేక లోక్ అదాలత్
మంచిర్యాలక్రైం: ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులతో ప్రత్యేక లోక్ అదాలత్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బ్యాంకు రికవరీ, సివిల్, మోటార్ వెహికిల్ యాక్ట్ తదితర కేసులు పరిష్కరించాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, అదనపు సినియర్ సివిల్ జడ్జి డీ.రామ్మోహన్రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పంటల సర్వే.. కాకి లెక్కలే!
మంచిర్యాలఅగ్రికల్చర్: అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన వ్యవసాయ అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ప్రభుత్వం సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, రుణాలు, ఇతర రాయితీ పథకాలు, పనిముట్లు, పంట నష్టపోతే గుర్తించేందుకు వీలుగా పంట పొలాల్లోకి వెళ్లి లొకేషన్ ఆధారంగా నమోదుకు డిజిటల్ సర్వే ప్రవేశపెట్టింది. కానీ సాగు విస్తీర్ణం నమోదు క్షేత్రస్థాయిలో జరగడం లేదు. సెప్టెంబర్ 30వరకు పంటల నమోదుకు రైతులే ఏఈవో వద్దకు రావాలని, ఆధార్కార్డు, పట్టాపాస్ పుస్తకం తీసుకొచ్చి ఏ పంట సాగు చేశారో నమోదు చేసుకోవాలని.. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని సూచించారు. రైతులు ఇచ్చిన వివరాలు, పంటలు మాత్రమే నమోదు చేసుకున్నారు. కొందరు రైతులు అందుబాటులో లేకపోవడం, పట్టాపాస్పుస్తకం లేక నమోదు చేసుకోలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిందీ లేక నమోదు చేసిందీ లేక కాకిలెక్కలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. గత జూలై, ఆగస్టులో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు నీటమునిగాయి. ఆ సమయంలో నష్టం నమోదు, మూడు రోజుల క్రితం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షంతో నష్టం నమోదు తీరు కాకిలెక్కలేనని తెలుస్తోంది. గత నెల 30న 15 మండలాల్లో 2,751మంది రైతులు 3,351 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో భీమిని, భీమారం మండలాల్లో దెబ్బతిన్న పత్తి, వరి పంటలను ఒక్క ఎకరం కూడా గుర్తించకపోవడం గమనార్హం. ఆయా మండలాల్లో పంటలు నేలవాలి వరిగొలుసు నీటిలో మునిగాయి. పరిశీలించి నమోదు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాలలో 75 ఎకరాల్లో 45 మంది రైతులు, నస్పూర్ ప్రాంతంలో 75 ఎకరాల్లో 45మంది రైతులు ఒకే పంట వరి నష్టపోయినట్లు గుర్తించారు. హాజీపూర్ మండలంలో వరి పంట 200 ఎకరాలు, 200 మంది రైతులు నష్టపోయారని పేర్కొనడం గమనార్హం. క్షేత్రస్థాయికి వెళ్లరు.. నమోదు చేయరు..ప్రతీ సీజన్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం రైతుల వ్యవసాయ అవసరాలు తీరుస్తుంది. ప్రస్తుత ఖరీఫ్లో పంట విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా నమోదు చేయడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏ వారంలో ఏయే పంటలు సాగయ్యాయనే సమాచారం పూర్తి స్థాయిలో లేకపోవడం గమనార్హం. గత వానాకాలం సీజన్ 3.33 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేశారు. గత నెలాఖరు వరకు 3.24,551 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు ధ్రువీకరించారు. ఇందులో ప్రధానంగా పత్తి 1,69,397 ఎకరాలు, వరి 1,53,183 ఎకరాల్లో సాగైనట్లు నమోదు చేశారు. గత ఏడాది జైపూర్ మండలంలో వానాకాలం కంటే యాసంగిలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగినట్లు వ్యవసాయ అధికారులు తప్పుడు లెక్కలు నమోదు చేశారు. ఓ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం తప్పుడు లెక్కలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోనూ వానాకాలం కంటే యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలతో సాగు విస్తీర్ణం తీరు బయటపడుతోంది. అక్రమార్కులకు అనుగుణంగా సాగువిస్తీర్ణం పెరిగినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో సాధారణంగా వానాకాలంలో సాగు ఎక్కువగా ఉంటుంది. కానీ యాసంగి సీజన్లో వరిసాగు పెరిగినట్లు నమోదు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లోనే ఉంటూ పంటల నష్టం నమోదు చేస్తుండడంతో నష్టపోయిన వారికి పరిహారం అందకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. -
● జిల్లాలో ప్రాచీన కళలకు ఆదరణ ● కలరి, కర్ర, కత్తిసాము, ముద్గర్ ● ఏళ్ల నాటి మార్షల్ ఆర్ట్స్పై ట్రెండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న రోబోటిక్ స్మార్ట్యుగంలో ప్రాచీన యుద్ధ కళలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ కరాటే, కుంఫూ, తైక్వాండో, యోగ తదితర విద్యల్లో జిల్లా వాసులు ప్రావీణ్యం సాధించారు. కేరళలో ఉద్భవించిన ‘కలరిపయట్టు’, మహాభారతం నాటి ‘ముద్గర్’, కర్ర, కత్తిసాము వంటి వేల ఏళ్లనాటి యుద్ధ కళల ట్రెండ్ మొదలైంది. జిల్లాలో చిన్నా పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రోజువారీగా బిజీగా ఉంటున్న వారంతా శారీరక, మానసిక దృఢత్వం కోసం రోజులో కొంత సమయం కేటాయిస్తూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాలముద్గర్ముద్గర్ ఓ ప్రాచీన వ్యాయామ కళ. యుద్ధవిద్య(మార్షల్ ఆర్ట్స్)లో కీలక వ్యాయామమిది. దేశంలో వేల ఏళ్ల క్రితం గట్టి కర్రతో చేసే ముద్గర్ను వాడుతున్నారు. ముద్గర్ను శివుడు పరుశురాముడికి నేర్పించారని ఇతిహాసాల్లో ఉంది. భీముడు, దుర్యోధనుడు, హనుమాన్ గదలను వాడడంలో అగ్రగణ్యులు. ఈ ముద్గర్ పేరుతో ఉత్తర భారతదేశంలో అనేక క్లబ్లు ఉన్నాయి. ఒక కిలో బరువు ఉన్న ముద్గర్ నుంచి 30కిలోల బరువు ఉన్నవి చేతులతో తిప్పడం నేర్పుతున్నారు. చేతులు, చాతి, భుజాలు, జీర్ణక్రియలు మెరుగు పడి దృఢత్వంగా మారేందుకు దోహదపడుతోంది. జిల్లాలో గత పదేళ్ల క్రితమే ఆరంభమైనప్పటికీ ఈ మధ్యకాలంలోనే ముద్గర్పై వందలాదిమంది శిక్షణకు మొగ్గుచూపుతున్నారు. జిల్లా కేంద్రంలో శిక్షకుడు మండ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఓ అకాడమి నిర్వహిస్తున్నారు. తమ రంగంలో మరింత పట్టు సాధించేందుకు ముద్గర్ చక్కని వ్యాయామ సాధనం. మనస్సు, శరీరంలో అద్భుత మార్పులుక్రీడల్లో రాణిస్తున్న వారికి శారీరక దృఢత్వం ఉంటుంది. శరీరం అదుపులో ఉంటుంది. ప్రాచీన యుద్ధ కళలతో శరీరం, మనస్సు ప్రభావితం అవుతుందని శిక్షకులు చెబుతున్నారు. అంతఃశుద్ధితో మానసిక ప్రశాంతత చేకూరి అద్భుతమైన మార్పులు వస్తాయని వివరిస్తున్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, ఆక్యుపెన్సీ పాయింట్స్ ఉత్తేజితమవుతాయి. శరీరంలో ఏడు చక్రాలు ఉత్తేజితమై సోమరితనం దూరమవుతుంది. బిజీగా ఒత్తిడితో పని చేసే ఆయా రంగాల్లో ఉండేవారికి డిప్రెషన్, చికాకు, ఆందోళన వంటివి దరి చేరవు. మానసిక ప్రశాంతతో గుండె జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. క్రీడల్లో రాణించే వారికి ఈ ప్రాచీన యుద్ధ కళలతో చదువులో ఏకాగ్రత పెరగడంతో రెజ్లింగ్, కుస్తీ, జూడో, క్రికెట్, కబడ్డీ తది తర క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునే వీలుంది. -
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
మందమర్రిరూరల్: రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని డీసీపీ భాస్కర్ అన్నారు. శనివారం పట్టణంలోని జీఎం కార్యాలయ సమీపంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదా ల్లో 17 మంది చనిపోగా అందులో యాపల్, అంగడిబజార్ ప్రాంతాలకు చెందిన వారు ఏడుగురు ఉన్నారని తెలిపారు. ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్, మందమర్రి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, నేషనల్ రోడ్డు అథారిటీ అధికారులు, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు అబ్బాస్, గణేష్, నర్సయ్య పాష, రాజేశ్వరి పాల్గొన్నారు. -
‘అటవీ భూములు ఆక్రమిస్తే సహించం’
దండేపల్లి: అటవీ భూములు ఆక్రమిస్తే ఎంతటివారైనా సహించేది లేదని మంచిర్యాల డీఎఫ్వో శివ్ఆశిష్ సింగ్ అన్నారు. మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధి చింతపల్లి ఫారెస్ట్లోని నార్త్, ఈస్ట్ బీట్లను జన్నారం ఎఫ్డీవో రాంమ్మోహన్తో కలిసి శనివారం పరిశీలించారు. గుండాలకు చెందిన కొందరు భూమి చదును చేయడంపై ఆరా తీశారు. తమకు తిర్యాణి తహసీల్దార్ పట్టాలు జారీ చేశారని, వాటిని సాగు చేస్తేనే రైతు భరోసా డబ్బులు వస్తాయని చెప్పడంతో దున్నామని గిరిజనులు తెలిపారు. ఆక్రమిత భూమిలో తిర్యాణి, కాసిపేట మండలాల సర్వేయర్లతో సర్వే నిర్వహించారు. వాస్తవ పట్టాభూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్వో సాగరిక, ఎఫ్ఎస్వో నరేష్, ఎ్ఫ్బీవోలు రవికిరణ్, నాగరాజుచారి పాల్గొన్నారు. 48గంటల్లో గుడిసెలు తొలగించాలిమండలంలోని లింగాపూర్ ఫారెస్ట్ బీట్లో దమ్మన్నపేట గ్రామానికి చెందిన గిరిజనులు వేసిన గుడిసెలు 48గంటల్లో తొలగించాలని తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, డీఆర్వో సాగరిక సూచించారు. శనివారం వారు దమ్మన్నపేట గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. -
యూడైస్ ప్లస్లో వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రీ ప్రైమరీ నుంచి ఇంట ర్మీడియెట్ విద్యనందించే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు యూడైస్ ప్లస్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని జిల్లా విద్యాధి కారి యాదయ్య అన్నారు. శనివారం జిల్లా సైన్స్ కేంద్రంలో సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డి నేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యూడైస్ ప్లస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ తరగతి గదులు, వాటి స్థితిగతులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, కిచెన్షెడ్, ఉచిత పాఠ్య పుస్తకాలు తదితర వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం.భరత్కుమార్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రాజ్కుమార్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు చౌదరి, సత్యనారాయణ మూర్తి, రాజ్కుమార్, టెక్నికల్ పర్సన్ నగేష్ పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
దస్తురాబాద్: తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మండలంలోని రేవోజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేవోజీపేట గ్రామానికి చెందిన ముప్పిడి రాధ అనే వివాహిత తన కూతూరు నిత్యతో కలిసి అక్టోబర్ 27న కరీంనగర్లోని బంధువుల ఇంటికి వెళ్లింది. 30న ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లోని బీరువాను గుర్తుతెలి యని వ్యక్తులు పగులగొట్టి 5తులాల వెండి, తులం బంగారు కమ్మలు, అర్ధతులం చైను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గోదావరిలో పడి వృద్ధుడు..
లోకేశ్వరం: మండలంలోని అబ్ధుల్లాపూర్ గ్రామానికి చెందిన దుందు చిన్న భోజన్న (65) అనే మతిస్థిమితం లేని వృద్ధుడు గోదావరిలో పడి మృతి చెందాడు. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. దుందు భోజన్నకు మతిస్థిమితం లేదు. ఈనెల 23 నుంచి కన్పించడం లేదు. కుటుంబ సభ్యులు ఫి ర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం పాత అబ్ధుల్లాపూర్ గ్రామ శివారు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో శవమై కన్పించాడు. మృతదేహం కుళ్లిపోవడంతో భైంసా ఆస్పత్రి వైద్యులు సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. కాగా భార్య రుక్మవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు
లక్ష్మణచాంద: ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నా రు. ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరుపనున్నారు. ఇంగ్లిష్ ప్రయోగ పరీక్షలను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల కు జనవరి 21న, రెండో సంవత్సరం విద్యార్థులకు 22న నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూ మన్ వాల్యూస్ పరీక్ష జనవరి 23న, పర్యావరణ విద్య జనవరి 24న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షల నేపథ్యంలో.. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు ఉండడంతో ఈసారి ముందుగానే ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో మార్చిలో కాకుండా ఫిబ్రవరిలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇప్పటివరకు 75శాతం సిలబస్ పూర్తయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి 100 శాతం పూర్తి చేసి జనవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు. సీసీ కెమెరాల మధ్య ప్రయోగ పరీక్షలు.. ఈసారి ఇంటర్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. సీసీ కె మెరాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మాత్రమే ప్రయోగ పరీక్ష కేంద్రాలు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే జూనియర్ కళాశాలల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. సన్నద్ధత ప్రారంభించాం ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాం. కళాశాలలో సాయంత్రం సమయంలో నిర్వహించే ప్రత్యేక స్టడీ అవర్స్లో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం. – హారతి, ఇంటర్ విద్యార్థిని అధ్యాపకుల పర్యవేక్షణలో.. ఇంటర్ వార్షిక పరీక్షల కోసం అధ్యాపకుల పర్యవేక్షణలో చదువుకుంటున్నాం. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాం. – మహాలక్ష్మి, ఇంటర్ విద్యార్థిని ప్రణాళికతో ముందుకు.. ఇంటర్ బోర్డు సూచనల మేరకు జూనియర్ కళాశాలల్లో చర్యలు చేపడుతున్నాం. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే 75శాతం సిలబస్ పూర్తయ్యింది. డిసెంబర్ చివరకు సిలబస్ పూర్తి చేస్తాం. విద్యార్థులను పరీక్షల కోసం సన్నద్ధం చేసేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. – పరశురాం నాయక్, ఇంటర్ నోడల్ అధికారి, నిర్మల్ -
ఇంటర్ ఫీజు భారం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షల షె డ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి –మార్చి నెలల్లో రెండు దశల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రూ.100 లేటు ఫీజుతో నవంబర్ 24 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వరకు, రూ.1000 ఫైన్తో డిసెంబర్ 8 వరకు, రూ.2000 ఫైన్తో డిసెంబర్ 15 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది పరీక్ష ఫీజు పెంపుతో ఒక్కో విద్యార్థిపై రూ.120 అదనపు భారం మోపింది. గత ఏడాది కంటే ఎక్కువ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మొత్తం 32,343 మందికిపైగా ఉన్నారు. ఫస్టియర్ ఇంటర్ (జనరల్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో కలిపి) రూ. 630, వొకేషనల్ –థియరీ, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో రూ. 870, సెకండియర్ జనరల్ సైన్స్ రూ.870, జనరల్ ఆర్ట్స్ (ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో) రూ. 630 ఫీజు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్కు రూ. 520 కాగా 2025 –26 విద్యాసంవత్సరంలో పరీక్షలు రాసే విద్యార్థులకు అదనంగా రూ.10 కలిపి రూ. 530 చెల్లించాలి. గతేడాది నిర్వహించిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫీజు కూ డా జనరల్ ఫీజులోనే (రూ. 520) తీసుకునేవారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో మాత్రం ఇంగ్లిష్ ప్రా క్టికల్ పేరిట రూ. 100 అదనంగా ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఇంగ్లిష్ ప్రాక్టికల్ కలిపి రూ.110 అదనపు భారం పడనుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గతేడాది ఫీజు రూ.750 కాగా ప్రస్తుతం రూ.870 చెల్లించాల్సి ఉండటంతో రూ.120 అదనం భారం పడనుంది. ఇక ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్యాలు ఇష్టానుసారంగా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి.జిల్లా కాలేజీలు ఫస్టియర్ సెకండియర్ మంచిర్యాల 65 4699 3528 కుమురంభీం 49 5507 4791 నిర్మల్ 69 7069 6749 జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్ విద్యార్థుల వివరాలు..పెంపు సరికాదు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు పెంపు సరికాదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పేరిట రూ.100 ఫీజు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై ఫీజుల పేరిట అదనపు భారం మోపొద్దు. బ్రిడ్జికోర్సులు చదివే విద్యార్థుల ఫీజులు రూ.200 వరకు పెంచారు. బోర్డు వెంటనే పెంచిన ఫీజులు ఉపసంహరించుకోవాలి. – చిప్పకుర్తి శ్రీనివాస్, టీవీయూవీ రాష్ట్ర కార్యదర్శి -
కళాకార్ సంఘ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్
జైపూర్: మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రకారుల సంస్థ భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 28, 29 తేదీల్లో జరిగిన భారతీయ కళాకార్ సంఘ్ జాతీయ సమావేశాల్లో ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు అంకూర్, జాతీయ అధ్యక్షుడు కుమార్, యూపీ అధ్యక్షుడు పాలన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాము పాల్గొన్నారు. -
బాసర ఆలయంలో కార్తిక సందడి
బాసర: కార్తికమాసం పురస్కరించుకుని శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణ మధ్య సరస్వతి, లక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, అలంకరణ హా రతి పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీకదీపం వదిలి శ్రీ సూరేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం క్యూ లైన్లో వేచి ఉండి తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అ మ్మవారి దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా ఆలయానికి శుక్రవారం అక్షరాభ్యాసాలు, వివిధ అర్జిత సేవలతో మొత్తం రూ.7 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనా దేవి తెలిపారు. -
చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
కాసిపేట: మండలంలోని రొట్టెపల్లికి చెందిన పోగు ల పోసు(70) అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు దువాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మల్కేపల్లి ఆశ్రమ పాఠశాలలో స్వీపర్గా పనిచేసే పోసుకు ఐదు నెలల క్రితం కిడ్నీలలో రాళ్లు రావడంతో అపరేషన్ చేశారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో జీ వితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లోని గడ్డి మందు తాగింది. ఆమె కుమారుడు పోగుల శంకర్ కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉద యం మృతిచెందింది. శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రైల్వే సామగ్రి చోరీ.. నిందితులు అరెస్ట్
బెల్లంపల్లి: రైల్వే సామగ్రి దొంగతనం చేసిన నిందితులను బెల్లంపల్లి రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. బెల్లంపల్లి ఆర్పీఎఫ్ ఏఎస్సై మోహన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేకు చెందిన చిన్నసైజ్ పట్టాలను బెల్లంపల్లిలో కొందరు యువకులు అపహరించుకు పోతున్నారని రామగుండం ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్కు గురువారం రాత్రి సమాచారం అందింది. సీఐ వెంటనే బెల్లంపల్లి సిబ్బందికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కాల్టెక్స్ ఏరియా ప్రాంతంలో నిఘా పెట్టి తాండూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మోటం తిరుపతి, సీసీసీ నస్పూర్కు చెందిన కడమంచి సురేశ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 45 చిన్నసైజ్ రైలు పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27,660 వరకు ఉంటుందని అంచనా వేశారు. చెన్నూర్లో స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్న కడారి శేఖర్ అనే వ్యక్తికి రైల్వే సామగ్రిని అమ్మకానికి తీసుకెళ్లే క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. సామగ్రి తరలించడానికి వినియోగించిన మారుతి ఆల్టో కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులతో పాటు కొనుగోలు దారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
ఇద్దరు బైండోవర్
జన్నారం: అటవీ ప్రాంతంలో రంపం, జీఐ వైర్తో కనిపించిన ఇద్దరిని బైండోవర్ చేసినట్లు తాళ్లపేట్ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. శుక్రవారం రేంజ్ అధికారి తెలిపిన వివరాల ప్ర కారం విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో పరిశీలించగా తపాలపూర్ గ్రామానికి చెందిన ఏదుల చంద్రయ్య, వొడ్డెపల్లి శ్రీని వాస్లు అటవీ ప్రాంతంలో రంపం, జీఐ వైర్, తాళ్లతో పట్టుబడ్డారు. వారిని ఎఫ్ఆర్వో సుష్మారావు ఆదేశాల మేరకు డీఆర్వో సాగరిక, ఎఫ్ ఎస్వో నహీదా, ఎఫ్బీవోలు సాయి, శ్రీ కాంత్లు విచారించారు. అనుమానంతో నింది తుల ఇళ్లలో తనిఖీ చేయగా రెండు టేకు దుంగలు ల భ్యమయ్యాయి. దీంతో వారిపై కేసు నమో దు చేసి తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. ప్రియురాలి కోసం సెల్టవర్ ఎక్కిన యువకుడుబెజ్జూర్: ప్రియురాలి కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి గ్రామంలో గంటపాటు కలకలం రేపాడు. మద్దిగూడ గ్రామానికి చెందిన కోరితే కిష్టయ్య అనే యువకుడు సులుగుపల్లి గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నాడు. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం సులుగుపల్లి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి హైడ్రామా సృష్టించాడు. యువకుడు టవర్ పైకి ఎక్కి తన ప్రేమను అంగీకరించకపోతే కిందికి దూకుతానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై సర్తాజ్ పాషా, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడితో మాట్లాడి కిందికి దింపారు. అనంతరం యువకుడిని పోలీస్స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. తెగిపడిన విద్యుత్ తీగరామకృష్ణాపూర్: పట్టణంలోని తారకరామకాలనీ నుంచి పులిమడుగు వెళ్లే మార్గంలో ఓ ఇంటి ఆవరణలో శుక్రవారం హైటెన్షన్ విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడగా పెను ప్రమాదం తప్పింది. 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి పడి ఇంట్లోని ఇనుప తీగ(దండెం)కు తాకింది. అదే సమయంలో ఇంటి వాకిలి ఊడుస్తున్న రజితకు దండెం తీగ తగలడంతో విద్యుత్ షా క్కు గురై కిందపడిపోయింది. విద్యుత్ తీగను స్థానికులు గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాక్కు గురైన రజితను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. దొంగ అరెస్ట్తలమడుగు: తలమడుగు మండలం ఉండం గ్రామ శివారులో గల పేట పోచమ్మ ఆలయంలో ఈనెల 29వ తేదీన దొంగతనం చేసిన మండలంలోని లాల్ఘడ గ్రామానికి చెందిన దోడిసం లచ్చిరాంను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై రాధిక తెలిపారు. నిందితుడు ఈ నెలలోనే తాంసి మండలంలోని దుర్గామాత ఆలయంలోనూ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
జైపూర్: మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గల అడ్మిన్ భవన కార్యాలయంలో శుక్రవారం సైబర్ మోసాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ల అధ్యక్షతన అధికారులు, ఉద్యోగులకు ఐడీ డీజీఎంలు శ్రీనివాస్రావు, నానా ఫర్ణవీస్లు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆధార్, బ్యాంకు, ఇతర ముఖ్యమైన నంబర్లను సోషల్మీడియాలో ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అంతకుముందు ఎస్టీపీపీలో జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామానికి చెందిన రసూల్ సాయి(26) అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి చిన్నతనంలోనే తల్లి మృతి చెందగా తన ఆలనాపాలన తాత, నానమ్మలు ఆశన్న –ఆశమ్మలు చూసుకునేవారు. తండ్రి ప్రకాశ్ వద్దకు వెళ్లకుండా వీళ్ల వద్దే ఉండేవాడు. ఈనేపథ్యంలో మద్యానికి బానిసై డబ్బులకోసం వారిని వేధిస్తూ కొట్టేవాడు. బాధ భరించలేక సాయి నానమ్మ, తాతయ్యలు సాయికి దూరంగా వేరే ఇళ్లు అద్దె కు తీసుకుని ఉంటున్నారు. ఈక్రమంలో అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
వంతెన కోసం గిరిజనుల పాదయాత్ర
పెంబి: కడెం వాగుపై వంతెన నిర్మించాలని పలు గిరిజన గ్రామాల ప్రజలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మండల పరిధిలోని గిరిజన గ్రామాలు యాపలగడ, దోందారి, వస్పల్లి, చాకిరేవు, సత్తుగడ, రాంనగర్లతో పాటు దాదాపు 15 గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే కడెం, దోత్తి వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. వంతెనలు నిర్మించాలని షెట్పల్లి గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి తోడసం శంభు, విజయ్, భీంరావు, సోమేశ్, ప్రజలు పాల్గొన్నారు. -
క్రీడాకిట్లు మాయం..?
మంచిర్యాలటౌన్: యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఆటలు ఆడేలా సౌకర్యాలు కల్పించకపోయినా క్రీడాకిట్లు మాత్రం పంపిణీ చేసింది. మైదానానికి వచ్చేవారిలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలు వెలికితీసేలా క్రీడాకిట్లు ఉపయోగపడుతాయని అంతా భావించారు. కానీ ప్రస్తుతం క్రీడాకిట్లు మాయం కావడంతో లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, వార్డులు, గ్రామాల్లో 670 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించింది. ఆయా స్థలాలను చదును చేసి బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి పలు క్రీడల కిట్లు అందజేశారు. ఇందులో క్రికెట్ కిట్(రెండు బ్యాట్లు, బ్యాగింగ్ గ్లౌజులు రెండు జతలు, వికెట్ కీపింగ్ లెదర్ గ్లౌజులు ఒక జత, లెగ్ప్యాడ్లు రెండు జతలు, వికెట్ కీపింగ్ లెగ్గార్డు/ప్యాడ్ ఒక జత, స్టంప్స్ సెట్లు 2, అబ్డమినాల్ గార్డులు రెండు జతలు, ప్రాక్టిస్ బాల్స్ 6, ఆర్మ్గార్డ్ 2, థై ప్యాడ్లు 4, క్రికెట్ కిట్ బ్యాగ్ 1), జిమ్(డంబెల్స్ మూడుసెట్లు), వాలీబాల్ సెట్లో వాలీబాల్ సింథటిక్ 1, నెట్ 1, సైకిల్ పంప్ బిగ్ సైజ్(ఫుట్ పంప్1), ఆటవస్తువులకు కిట్ బ్యాగ్, 75 టీషర్టులు, స్కిప్పింగ్ రోప్ 4, ప్లాస్టిక్ విజిల్స్ 3, స్టాప్ అండ్ గో వాచ్ 1 చొప్పున ప్రతీ క్రీడా ప్రాంగణానికి అందజేశారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో నమోదు చేసుకున్న యువజన సంఘాలకు కిట్లు అప్పగించగా, గ్రామీణ ప్రాంత కిట్లను ఎంపీడీవోలకు అందించారు. ఇందులో ఎన్ని కిట్లు యువతకు చేరాయి, ఎన్ని వినియోగంలో ఉన్నాయనే వివరాలు ప్రస్తుతం అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. రూ.లక్షలు వెచ్చించి అందించిన కిట్లు ప్రస్తుతం క్రీడల్లో శిక్షణ పొందాలనుకునే వారికి అందుబాటులో లేకపోవడంతో, స్వంతంగా కొనుగోలు చేసుకుని సాధన చేయాల్సి వస్తోంది. గతంలో ఇచ్చిన క్రీడా కిట్లు ఏమయ్యాయనే వివరాలు సేకరించి, ఉన్నవాటిని ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారికి అందిస్తే మేలు జరిగే అవకాశం ఉంది. వివరాలు సేకరిస్తాం జిల్లాలో క్రీడాకిట్ల పంపిణీ గతంలోనే చేపట్టారు. వాటిని యువతకు ఇస్తే ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలు సేకరిస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడాకిట్లు అందించగా, వాటిని యువత సద్వినియోగం చేసుకునేలా చూస్తాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తాం. – హన్మంతరెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి -
జీజీహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్గా వేదవ్యాస్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీ జీహెచ్) ఇంచార్జి సూ పరింటెండెంట్గా డాక్టర్ వేదవ్యాస్ను ని యమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడిక ల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ.నరేంద్రకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బదిలీ అయిన విష యం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వేదవ్యాస్కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. -
పోలీస్స్టేషన్లో డీసీపీ తనిఖీ
భీమారం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఫిర్యాదులను ఎలా ఆన్లైన్ చేస్తున్నారని పరిశీలించారు. ఎఫ్ఆర్ఐ కాపీలు పరిశీలించి కేసుల వివరాలపై సీఐని అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్కు వచ్చేవారికి మర్యాద ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గంజాయి అమ్మకాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఆ నేరాలకు పాల్పడకుండా చూడాలని అన్నారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, భీమారం ఇంచార్జి ఎస్సై లక్ష్మిప్రస్సన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
మంచిర్యాల
7వైద్యులు సమయపాలన పాటించాలి మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో అనిత అన్నారు. స్థానిక సాయికుంట బస్తీ దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యులు ఏసన్న, అమన్ పాల్గొన్నారు. బాలికల హాస్టల్ తనిఖీ మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి(డీడీ) దుర్గాప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి టిఫిన్ చేశారు. రికార్డులు, కిచెన్ గదులు పరిశీలించారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. -
పర్యవేక్షణేది..!
కొనుగోళ్లపై సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం సేకరణలో కొన్ని చోట్ల గోల్మాల్ జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకూ గుర్తించకపోవడంలో ప్రధానంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. తాజాగా జైపూర్ మండలంలో రూ.కో టిన్నర వరకు అక్రమాలు చోటు చేసుకోవడం పర్యవేక్షణలో డొల్లతనాన్ని బయటపెడుతోంది. జిల్లాలో ప్రతీ సీజన్లో వరి ధాన్యం సేకరణ లక్ష్యం పెరుగు తూ వస్తోంది. ఆయా సీజన్లలో ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతోంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రాల నిర్వాహకులపైనా ఆరోపణలు రావడం, వారి స్థానంలో కొత్తవా రిని ఎంపిక చేయడం జరుగుతోంది. ఐకేపీ, మెప్మా కేంద్రాల కన్నా డీసీఎంఎస్, సహకార సంఘాల్లో అధికంగా అక్రమాలు జరుగుతున్నాయి. మంచిర్యా ల నియోజకవర్గంలో గత రెండు సీజన్లుగా కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు చేపడుతున్నారు. కేంద్రాలు అప్పగించడం మొదలు, మిల్లుల ట్యాగింగ్, రవాణా తదితర అన్నింటిలోనూ మోసాలకు ఆస్కారం ఉంది. ప్రజాధనం పక్కదారి పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సరిహద్దు నుంచి లారీల కొద్దీ ధాన్యం జిల్లాకు అక్రమంగా వస్తోంది. ఇక్కడ కొందరు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులతో కుమ్మకై ్క దొడ్డిదారిన వడ్లు తెచ్చి విక్రయిస్తున్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న బోనస్ సైతం కాజేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు సహకరించుకుంటూ రైతులను ముంచేస్తున్నారు. తాలు, దుమ్ము, ధూళి, తేమ అంటూ తరుగు పేరుతో కటింగ్ పెడుతున్నారు. అధికంగా వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. రైతు పంపిన బస్తాలకు, మిల్లు నుంచి వచ్చే రశీదుల మధ్య వ్యత్యాసం వస్తోంది. ఇక కొన్ని చోట్ల మిల్లర్లే రవాణా కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సైతం వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీంతో ధాన్యం సేకరణ నుంచి కొనుగోలు, రవాణా, మిల్లులకు అప్పగింత, సీఎంఆర్ కింద బియ్యం ఇచ్చే వరకు అంతా తమ అదుపులో ఉంటోంది. దీంతో ఎక్కడైనా ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఆన్లైన్లో నమోదు చేసినా..కొనుగోలు కేంద్రాల్లో ప్రతీ గింజను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. వానాకాలం, యాసంగి వడ్ల కొనుగోళ్ల సమయంలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని తతంగం నడిపిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖతోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా పర్యవేక్షణ చేపటాల్సిందిగా రైతులు కోరుతున్నారు.ధాన్యం కొనుగోళ్లు(ఫైల్)జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలు(విలువ మెట్రిక్ టన్నుల్లో)సంవత్సరం ఖరీఫ్ రబీ 2017–18 31254.6 138147.3 2018–19 67044.3 156585.9 2019–20 119044.3 199856.2 2020–21 51765.9 222990.9 2021–22 137179.8 113080.3 2022–23 158336.8 186113.040 2023–24 139663.8 155067.7 2024–25 1.01లక్షలు 197590.9 2025–26 2.32లక్షలు(లక్ష్యం) -
డ్రగ్స్ నిర్మూలనకు పోరాటం చేయాలి
పాతమంచిర్యాల: సామాజిక రుగ్మతలకు మూలకారణమైన డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు నిరంతర పోరాటాలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, తెలంగా ణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భాషా, సాంస్కృతిక, సామాజిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సల హా కమిటీ సభ్యుడు పల్లె నర్సింహ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ‘ఎంజాయి పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో సాగుతున్న బస్ కళాజాత కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీని వాస్, సీపీఐ నాయకులు మేకల దాసు, ఖలిందర్ అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, రాజేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య, సౌకర్యాలు కల్పించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు క ల్పించి నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర వి ద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ సంచా లకులు నవీన్ నికోలస్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అధికారులు తో సమీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈ సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఈవో యాద య్య, ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య పాల్గొన్నారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీకాసిపేట: మండలంలోని కేజీబీవీ, తెలంగాణ మో డల్ స్కూల్, రేగులగూడ, మల్కేపల్లి గిరిజన ఆశ్ర మ పాఠశాలలు, జూనియర్ కళాశాలను కలెక్టర్ కు మార్ దీపక్ శుక్రవారం తనిఖీ చేశారు. వంటశాల, రిజిష్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో సబ్ధర్ అలీ పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి తాండూర్: పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీరామ, మహేశ్వరి జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు ఏర్పాట్లను తహసీల్దార్ జ్యోత్స్నతో కలిసి పరిశీలించారు. రైతులు తమ వివరాలను కిసాన్ కపాస్ యాప్లో నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. -
ఎస్టీపీపీ సీఎంవోఏఐ ప్రెసిడెంట్గా పంతులా
జైపూర్: స్థానిక సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో శుక్రవారం సీఎంవోఏ ఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఎస్టీపీపీ జీఎం నరసింహారావు, వోఅండ్ఎం జీఎం మదన్మోహన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీ పదవులకు నామినేషన్ కోరారు. అధికారుల సంఘం సభ్యులందరూ సీఎంవోఏఐ ఎస్టీపీపీ బ్రాంచ్ ప్రెసిడెంట్గా డి.పంతులాను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. వైస్ప్రెసిడెంట్గా జనగామ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా శ్యామలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నూతన కమిటీ సభ్యులు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవికి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అంద రి సహకారంతో సెంట్రల్ కమిటీ సభ్యులతో యాజమాన్యాన్ని సమన్వయపర్చుతూ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. -
పేకాటస్థావరంపై పోలీసుల దాడి
జైనథ్: విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని కంఠ గ్రామంలో శుక్రవారం ఎస్సై గౌ తమ్ పవర్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. నిందితులతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.5325 నగదు స్వా ధీ నం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు న మో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ సేవలకు పురస్కారంమంచిర్యాలటౌన్: జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పురస్కారాలు అందించారు. ప్రీ హాస్పిటల్ కేర్, బెల్లంపల్లి వాహనంలో సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎం. భూమన్నకు, 108 లక్సెట్టిపే ట్ వాహనం పైలట్లు ఎం. సత్తయ్య, గంగన్న, 102 అమ్మ ఒడి కెప్టెన్ శంకర్లు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో 108 ఉమ్మ డి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, మంచిర్యాల 108 అధికారి డి. సంపత్ పాల్గొన్నారు. -
బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులు షురూ
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త ము న్సిపల్ కార్యాలయం ముందు నుంచి కాంటా చౌర స్తా వరకు పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు జేసీబీలతో తొలగించి విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ధార్మిక, విద్యాసంస్థల ప్రహరీలను కూల్చివేశారు. ముందుగా ఎలాంటి అభ్యంతరాలు లేని కట్టడాలు తొలగించారు. శిథిలాలను మున్సిపల్ ట్రాక్టర్లలో డంప్యార్డుకు తరలించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రి నుంచి కాంటా చౌరస్తా వరకు వంద ఫీట్ల రోడ్డును విస్తరించనుండడంతో అడ్డుగా ఉన్న కట్ట డాలను తొలగించే పనులు ముమ్మరం చేశారు. సింగరేణి ఆస్తులకు సంబంధించి ప్రహరీలు, సీఎస్ఐ చర్చి, క్యాంపు కార్యాలయం ఇతర ప్రాంతాల్లో కట డాలను రాత్రి వరకు కూల్చివేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.9.7కోట్ల అంచనాతో మున్సిపాల్టీలో ప్రతిపాదించిన రోడ్లను విస్తరించనున్నారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పర్యవేక్షణలో పనులు జరిగాయి. బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్ పర్యవేక్షణలో వన్టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు కే.శ్రీనివాసరావు, హెచ్.హనోక్, ఎన్.దేవయ్య, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ప్రజాధనం వృథా వీధి వ్యాపారుల కోసం ప్రధాన రహదారి మూసివేతకు గురైన సింగరేణి ఎక్స్ప్లోరేషన్ విభాగం ఎదుట మున్సిపల్ ఆధ్వర్యంలో షెడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ షెడ్లలో వీధి, చిరు వ్యాపారులు చేపలు, పండ్లు, రెడీమేడ్ దుస్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుత విస్తరణలో షెడ్లు కూల్చివేతకు గురయ్యాయి. షెడ్లను ఆధారం చేసుకుని జీవనం సాగించిన చిరువ్యాపారులు వీధినపడ్డారు. షెడ్లు కూల్చివేతతో ప్రజాధనం వృథా అయిందని, అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. -
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా పీఎస్సార్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్గా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) నియామకం అయ్యారు. కేబినెట్ హోదాతో కూడిన పదవిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఎమ్మెల్యేగా ఎన్నికై నప్పటి నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖరారు కాకపోవడంతో ఇన్నాళ్లుగా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ హోదాతో కూడిన పదవిని ఇచ్చినా కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుంచీ కాంగ్రెస్లోనే..కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకమైన నాయకుడిగా ఉన్నారు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్లో ప్రారంభించి.. పార్టీ మారకుండా పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుతూ వస్తున్నారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా, 1999 నుంచి 2002 వరకు పీసీసీ సభ్యుడిగా, 2002 నుంచి 2005 వరకు పీసీసీ సెక్రెటరీగా, 2004 నుంచి 2006 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా, 2005 నుంచి 2007 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా, 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018 నుంచి ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతూనే, 2022లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, 2023 సాధారణ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదవిపై విముఖతకేబినెట్ మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేమ్సాగర్రావు కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు రెండో విడతలో మంత్రిగా అవకాశం కల్పించి ప్రేమ్సాగర్రావును పక్కనబెట్టారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సమయంలో చీఫ్ విప్, విప్తో సహా కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించడంపై చర్చకు వచ్చాయి. ఆయన మంత్రి పదవి తప్ప మరే పదవీ వద్దని, ఎమ్మెల్యేగానే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని పలుమార్లు ప్రకటించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం కోయంబత్తూర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయనను నామినేటెడ్ పదవిలో నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ పదవి చేపట్టేందుకు ఇష్టం లేనట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుని కోలుకుని వచ్చాక నామినేటెడ్ పదవిని స్వీకరిస్తారా? లేదా తిరస్కరిస్తారా అనేది స్పష్టత రానుంది. -
జాతీయ సమైక్యతకు నిదర్శనం ‘సర్దార్’
మంచిర్యాలక్రైం: దేశ ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐబీ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా క్రీడా యువజ న సర్వీసుల అధికారి హనుమంతరావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని కొనియాడారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. ప్రజలంద రూ ఐక్యతతో ముందుకు సాగితే రాష్ట్రం, దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని, దేశభక్తి, సమైక్యత భా వం ప్రతీ ఒక్కరిలో ఉండాలని అన్నారు. మహనీ యుల ఆశయాలను యువత సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) వేడుకలు గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సమైక్యతను ప్రదర్శించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బెటాలియన్ నుంచి గుడిపేట గోదావరి శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు 2కే రన్ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు, అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వర్రావు, బాలయ్య, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో..హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో పటేల్ జయంతి సందర్భంగా 2కే రన్ నిర్వహించారు. పోలీస్స్టేషన్ నుంచి పడ్తనపల్లి, రాంపూర్ విద్యారణ్య ఆవాస వి ద్యాలయం మైదానం వరకు సాగింది. ఎస్సై స్వరూప్రాజ్, పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీల శ్రేణులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్లో కమాండెంట్ వెంకటరాములు, పోలీస్ అధికారులురన్ను ప్రారంభిస్తున్న కలెక్టర్ కుమార్దీపక్, డీసీపీ భాస్కర్ -
‘గడ్డెన్నవాగు’కు భారీగా వరద
దిగువకు వెళ్తున్న నీళ్లుఎగువన మహారాష్ట్రతో పాటు పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కురిసిన వర్షానికి గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 14వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో అధికారులు రెండు గేట్లు 2 మీటర్ల మేర ఎత్తి 14,280 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కొనసాగిస్తూ నీటిని వదిలేస్తున్నారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 9వేల క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను 1.2 మీటర్ల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. – భైంసాటౌన్ -
ఆర్జీయుకేటీలో ఆంగ్లభాషపై అవగాహన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఈ నెల 30, 31 తేదీల్లో విద్యార్థులకు ఆంగ్లభాషపై అవగాహన కల్పిస్తున్నట్లు వీసీ గోవర్ధన్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఆంగ్లభాష నైపుణ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కెన్నడి బాబు హాజరై ఆంగ్లభాషపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆంగ్ల విభా గం అధిపతి ఎ.విజయ్ కుమార్, డాక్టర్ ఎస్ విఠల్, డాక్టర్ గుజ్జారి శంకర్, డాక్టర్ ఎన్.విజయ్కుమార్, యు.ప్రభాకర్, డి.వసంత్బాబు పాల్గొన్నారు. -
అవినీతి నిర్మూలనకే విజిలెన్స్ విభాగం
మందమర్రిరూరల్: సింగరేణిలో అవినీతి నిర్మూలన కోసమే విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏరియాలోని జీవీటీసీలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గెస్ట్ లెక్చరల్ కిషోర్ బుగాడియాతో కలసి అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం భాస్కర్రెడ్డి, శ్రీరాంపూర్ ఏజీఎం రాజేందర్, జీవీటీసీ మేనేజర్ శంకర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియా అధికారులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
నిర్మల్రూరల్: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని న్యూవెల్మల్కు చెందిన ప్రవీణ్ కుమార్ (35) జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయలుదేరాడు. అక్కాపూర్ గ్రామం వద్ద రోడ్డుపై ఓ రైతు ఆరబోసిన సోయాకుప్పలోంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్య
దండేపల్లి: మండలంలోని గూడెం వద్ద గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన గోళ్ల రవీందర్ (35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఉదయం అతని భార్య సుమలత అత్త దేవక్కతో కలిసి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం సమీప బంధువైన శ్రీనివాస్ సుమలతకు ఫోన్చేసి మీ భర్త బైక్ గూడెం బ్రిడ్జి వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లింది. భర్త కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికించగా మృతదేహం లభించింది. మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఖాళీ...!
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారి (ఏఎల్వో) కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. అసంఘటిత కార్మికవర్గానికి అందుబాటులో ఉండి సేవలు అందించడానికి రెగ్యులర్ అసిస్టెంట్ లేబర్ అధికారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏఎల్వో కార్యాలయంలో ఏడాదిన్నర నుంచి ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్), అత్యంత అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ కావడంలేదు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎల్వో పాక సుకన్య మృతి చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు కోసం గత జులై 18న తన వ్యక్తిగత సహాయకురాలు మోకెనపల్లి రాజేశ్వరి ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుని ఏసీబీ అధికారుల చిక్కి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ అధికారి సత్యనారాయణకు బెల్లంపల్లి ఇన్చార్జి ఏఎల్వో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ ఒక్కడే అన్నీ తానై విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫైళ్లు కానరాక అయోమయం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏఎల్వో పాక సుకన్య పట్టుబడక ముందు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. కొంతమందిని సహాయకులుగా నియమించుకుని ప్రతీపనికి లెక్కకట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే అనేక మంది అసంఘటిత కార్మికులు కార్యాలయంలో అందజేసిన ఫైళ్లను సుకన్య వ్యక్తిగతంగా తన వద్ద ఉంచుకుని ముడుపులు ముట్టజెప్పిన కార్మికుల ఫైళ్లను మాత్రమే క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగతా కార్మికుల పైళ్లను పెండింగ్లో పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఫైళ్ల క్లియరెన్స్ కోసం రోజువారీగా అసంఘటిత కార్మికులు ఏఎల్వో కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. కొందరి పైళ్లు కానరాకుండా పోయినట్లుగా తెలుస్తోంది. అయితే మరుగునపడిన ఫైళ్లను ఒక్కొక్కటిగా వెతికి ఇన్చార్జి ఏఎల్వో ఫార్వర్డ్ చేస్తుండటంతో కార్మికులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు 70కి పైగా ఫైళ్లు ఫార్వర్డ్ కాగా మరో 100 వరకు ఎక్కడున్నాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రెగ్యులర్ ఏఎల్వో వచ్చేదెప్పుడో? అసిస్టెంట్ లేబర్ అధికారి కార్యాలయం పరిధిలో బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాలు ఉన్నాయి. కార్మిక క్షేత్రం బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, హెల్పర్స్, హమాలీలు, దుకాణాల్లో పనిచేసే గుమాస్తాలు, తదితర రంగాల వర్కర్లు వేల సంఖ్యలో ఉన్నారు. కాసిపేట, తాండూర్లో సిమెంట్, సిరామిక్స్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, కళాకారులు తదితరులు ఉన్నారు. వీరందరికి సేవలు అందించడంలో అసిస్టెంట్ లేబర్ అధికారి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అంతముఖ్యమైన పోస్టును రెగ్యులర్ అధికారితో భర్తీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్చార్జిగా పని చేస్తున్న ఏఎల్ఓతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పని భారానికి గురవుతున్నారు. ఏమాత్రం జాప్యం చేయకుండా రెగ్యులర్ ఏఎల్వోను నియమించి అసంఘటిత కార్మికులకు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఇద్దరిపై రౌడీషీట్
నిర్మల్టౌన్: పట్టణానికి చెందిన ఇద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. సోన్ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఉమర్, గఫర్ తమ స్నేహితులతో కలిసి నిర్మల్కు వచ్చారు. హోటల్లో భోజనం చేసిన అనంతరం రాత్రి 10 గంటల సమయంలో గఫర్ తన స్నేహితులతో కలిసి తిరుమల లాడ్జి ఎదుట నిలబడి ఉండగా బాలాజీవాడకు చెందిన ప్రమోద్, బుధవార్పేట్కు చెందిన దేవర రాజ్ కుమార్ వారిని బూతులు తిడుతూ గఫర్ను బండతో కొట్టి గాయపరిచారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గత నేరచరిత్ర ఉండడంతో వారిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. -
రజక వృత్తిదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
పాతమంచిర్యాల: రజక వృత్తిదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదునూరి మదర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో రజక వృత్తిదారుల 25వ వార్షికోత్సవ సభ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి జీవ నం సాగిస్తున్నారని, ఆర్థికంగా, సామాజికంగా వె నుకబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రజకుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. పెత్తందారులు కులవివక్ష దాడులకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ రజకులకు ఉచిత విద్యుత్ పథకం కోసం నిధులు కేటాయించా లని, విద్యుత్ అధికారుల వేధింపులు ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వ ర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి క నికరపు అశోక్, పట్టణ పౌర వేదిక కన్వీనర్ గోమాస ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు నడిగోడి తిరుప తి, తోట కళావతి, సందీప్, సదయ్య పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థి తలకు గాయం
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో బుధవారం రాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటలో పదోతరగతి చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి అదుపుతప్పి కిందపడ్డాడు. ఇనుప డోర్కు తాకడంతో తలకు గాయమైంది. హాస్టల్ వార్డెన్ కెజియారాణి వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై వార్డెన్ను వివరణ కోరగా మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ప్రమాదంలేదని వైద్యులు చెప్పడంతో గురువారం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
ఐరన్ మాత్రలు వికటించి అస్వస్థత
బజార్హత్నూర్: మండలంలోని కొలారి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఐరన్ మాత్రలు మింగి అస్వస్థతకు గురయ్యారు. ఇన్చార్జి ఎంఈవో రాంకిషన్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఆశ కార్యకర్త సురేఖ ఐరన్ (ఫొలిక్ యాసిడ్) మాత్రలు ఇచ్చారు. అవి వేసుకున్న ఏడుగురు విద్యార్థులు టార్పే సాక్షిత, టార్పే ఇందుజ, ఆరాధ్య, అమృత, సుజా త, ఓంకార్, కార్తీక్ వాంతులు చేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిలివేరి శ్రీలక్ష్మి వెంటనే మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వేతనాలు తక్కువ వేశారని ఫిర్యాదు
మందమర్రిరూరల్: తమకు అక్టోబర్ మాసం వేతనాల్లో తక్కువ వేశారని మండలంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవో రాజేశ్వర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య మాట్లాడుతూ పని ప్రోగ్రెస్లో ఎలాంటి పొరపాటు లేనప్పటికీ ఏపీవో మండలంలోని ప్రతీ ఫీల్డ్ అసిస్టెంట్కు 250, సారంగపల్లి ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.1,397, శంకర్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.1,011 వేతనంలో తగ్గించి వేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని డీపీఆర్వో దృష్టికి తీసుకెళ్లి తగ్గించి వేసిన వేతనాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో శెట్టి సత్యనారాయణ, నెండుగూరి బాపు, బోరె జ్యోతి, సెగ్యం శంకరయ్య, తదితరులు ఉన్నారు. -
డబ్బులు తిరిగివ్వాలని ఆత్మహత్యాయత్నం
● కొండాపూర్ యాపలో టవరెక్కిన బాధితుడుకాసిపేట: దేవాపూర్ రేంజ్ పరిధిలో పనిచేసే బీట్ అఫీసర్ లత ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చుంచు జనార్దన్ అనే వ్యక్తి గురువారం రాత్రి 9 గంటలకు కొండాపూర్యాపలో సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. మండలంలోని తుంగగూడకు చెందిన జనార్దన్ వద్ద బీట్ ఆఫీసర్ లత 2018లో ప్లాట్ విషయంలో రూ.2.50 లక్షలు తీసుకుందని, అడిగితే ధూషిస్తోందని వాపోయాడు. పలుమార్లు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న దేవాపూర్ ఎస్సై గంగారాం సంఘటన స్థలానికి చేరుకోని బాధితుడితో ఫోన్లో మాట్లాడాడు. అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగాడు. -
నయా.. వంచకులు
బెల్లంపల్లి: భూముల క్రయ విక్రయాల పేరుతో కొందరు కొనుగోలు దారులను నయవంచనకు గు రిచేస్తున్నారు. సాగులో ఉన్న, పడావుగా ఉన్న భూ ములకు నకిలీ దస్త్రాలు సృష్టించి రూ.లక్షల్లో అడ్వా న్స్ తీసుకుని ఏళ్లు గడుస్తున్నా భూమి అప్పగించకుండా, అడ్వాన్స్ డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము మోసపోయామని గుర్తించిన కొందరు బాధితులు అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు చెల్లించాలని నెల క్రితం బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆందోళన చేసిన ఘటన మరువక ముందే పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు సరిగ్గా అదే కారణంతో కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. ఆ రెండు సంఘటనలు భూ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలకు అద్దం పడుతున్నాయి. సారవంతమైన భూములు చూపించి... వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు బెల్లంపల్లి ప్రాంతం నెలవుగా మారింది. భీమిని, తాండూర్, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో సాగులో ఉన్న పట్టా భూములతో పాటు ఉద్యానవన తోటలు, పడావుగా ఉంటున్న భూములను అమ్మకానికి చూపిస్తున్నారు. సారవంతమైన భూములు కావడం, జల వనరులతో అలరారుతుండడంతో కొనుగోలుదారులు ఇష్టపడి అడ్వాన్స్ చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. వీటిలో అనేక భూములు వివాదంలో ఉంటున్నాయి. నెలలు గడుస్తున్నా భూమిని పట్టా చేసి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సివిల్ కేసుల పరిధిలోకి రావడంతో... భూ సమస్యలు, అమ్మకం, కొనుగోళ్లు, డబ్బుల వ్య వహారాలు సివిల్ కేసుల పరిధిలోకి వస్తాయి. కో ర్టుల ద్వారా మాత్రమే ఆయా సమస్యలను పరి ష్కరించుకోవాల్సి ఉంటుంది. సివిల్ తగాదాలను పో లీస్స్టేషన్లో పరిష్కరించరాదనే కోర్టు ఆదేశాలు ఉండటంతో భూ మోసాలు, నయవంచనలు పో లీసు అధికారుల దృష్టికి వెళ్లినా నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. దీంతో పెద్ద మనుషులు, తెలి సిన వ్యక్తుల సమక్షంలో మాట్లాడుకుని డబ్బుల చెల్లింపునకు ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గడువు ప్రకారం డబ్బులు ముట్టజెప్పక పోవడంతో అమ్మకం, కొనుగోలు దారుల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంటోంది. చివరికి బాధితులు కొందరు రౌడీలు, గూండాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇంకొందరు రాజకీయ నేతలను ఆశ్రయించి వొత్తిళ్లు తీసుకు వస్తున్నారు. కాగా భూ అమ్మకాలకు సిద్ధపడిన వ్యక్తులు సైతం తామేం తక్కువ కాదన్నట్లు ఆకతాయి యువకులతో గ్యాంగ్లు మెయింటేన్ చేస్తున్నారు. ఏదిక్కూలేని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలిస్తున్నా భూముల అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. కొనుగోలు దారులంతా స్థానికేతరులే ... రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు మంచిర్యాలకు చెందిన వ్యక్తులు కూడా భూములకోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు భూ క్రయ విక్రయాలు సాగిస్తున్న కొంతమంది ఆయా ప్రాంతాలకు వెళ్లి తప్పుడు పత్రాల ఆధారంగా వారితో బేరం కుదుర్చుకుంటున్నారు. కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటికి పైగా వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. -
అక్షరాస్యతలో ముందుండాలి
వేమనపల్లి: అక్షరాస్యతలో మండలాన్ని ప్రథ మ స్థానంలో నిలపాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిష త్ కార్యాలయంలో ఎంపీడీఓ కుమారస్వామి అధ్యక్షతన ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేశామన్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సీఆర్పీలతో ప్రతీ గ్రామ సంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీఓఏలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అందరూ సమన్వయం, అంకితభావంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి ఎంఈఓ శ్రీధర్రెడ్డి, సీఆర్పీలు తిరుమల, అమీనా, డీఆర్పీ సుమన్ పాల్గొన్నారు. -
సంక్షేమం పట్టేదెవరికి..!
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ వసతిగృహాల్లో వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణ లేమి వెరసి తల్లిదండ్రుల నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారుల నుంచి వార్డెన్ల వరకు ఇన్చార్జీలు కొనసాగడం, ఏదో ఒక కారణంగా బాధ్యతల నుంచి తప్పించడం, సస్పెండ్కు గురి కావడం, రెగ్యులర్ పోస్టు నుంచి డిప్యూటేషన్లు ఇవ్వడం అంతా షరా మామూలుగా మారింది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో నిర్వహణ లోపం మొదలు విద్యార్థుల అస్వస్థత.. అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎస్టీ హాస్టళ్లలో గందరగోళంఎస్టీ వసతిగృహాల పర్యవేక్షణ గాలికి వదిలేశారు. ఇన్చార్జీలు, డిప్యూటేషన్లతోనే సర్దుకుపోతున్నారు. గత ఏడాది నవంబర్ 6న ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనకు బాధ్యులను చేస్తూ జిల్లా స్థాయి అధికారి(ఎస్సీ డీడీ)తోపాటు హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ఇదే పాఠశాలలో రెగ్యులర్ వార్డెన్ను కూడా జన్నారానికి డిప్యూటేషన్ చేశారు. వేధింపుల వ్యవహారంలో ఓ ఉపాధ్యాయుడిని బాబానగర్కు, పీడీని వేమనపల్లికి డిప్యూటేషన్ పంపించారు. సస్పెన్షన్కు గురైన హెచ్ఎంకు తిరిగి ఇదే పాఠశాలలో రెగ్యలర్ పోస్టు కేటాయించి వేమనపల్లి ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించారు. బియ్యం గోల్మాల్ ఘటనలో వేమనపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేసి తిరిగి అక్కడే రెగ్యులర్ పోస్టు ఇచ్చినట్లే ఇచ్చి మరో పాఠశాలకు డిప్యూటేషన్ ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారింది. ఎస్టీ డీడీగా విధులు నిర్వర్తించి సస్పెండ్కు గురి కావడంతో నిర్మల్ అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఏమైందో ఏమోగానీ మూడు నెలలు గడవక ముందే ఆయన స్థానంలో ఓ అధికారిని నియమించారు. రెగ్యులర్ పోస్టును కాదని ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు డిప్యూటేషన్పై వెళ్లడం ఏమిటో అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించడం గమనార్హం. ఇదివరకు జిల్లాలోని ఎస్టీ హాస్టళ్ల నిర్వహణ లోపంపై ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూడడంతో ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఎస్సీ వసతిగృహం అంతేగా..ఎస్సీ వసతిగృహాల్లోనూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. హెచ్డబ్ల్యూవో, ఓ అధికారి వ్యవహార శైలిపై మంత్రికి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేయ డం తెలిసిందే. బెల్లంపల్లిలో ఇన్చార్జిగా కొనసాగుతున్న వసతిగృహం సంక్షేమాధికారి వద్దంటూ వి ద్యార్థులు లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. మెనూ అమలు చేయాలంటూ రోడ్డెక్కారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇంత జరిగినా షోకాజ్ నోటీసుతో సరిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి(ఎస్సీ డీడీ)గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఇన్చార్జిగా నియమించారు. పదోన్నతిపై ఖాళీగా ఉన్న ఓ హెచ్డబ్ల్యూవో స్థానంలో ఏఎస్డబ్ల్యూవోకు ఇంచార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. గతంలో వార్డెన్గా ఉన్న సమయంలో చేసిన అవకతవకలపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేసినా వెనకేసుకొచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్ వచ్చినా ప్రోసీడింగ్ ఇవ్వకపోవడం, అధికారుల వేధింపులు తాళలేక లక్సెట్టిపేట వసతిగృహ సంక్షేమాధికారి రాజగోపాల్రావు ఆత్మహత్యాయత్నం చేసిన విష యం తెలిసిందే. విద్యార్థి సంఘాలు అధికారి చిట్టా తో కలెక్టర్, మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఎట్టకేలకు ఇన్చార్జి బాధ్యతల నుంచి అతడిని తప్పించి మరో వార్డెన్ను నియమించడం గమనార్హం. నిధులపై నిగ్గుతేలేనా..?బీసీ వసతిగృహాల్లో వ్యవహారం మరోలా ఉంది. శాఖకు ఏమాత్రం సంబంధం లేని అధికారికి అప్పగించారు. ఇదే అదునుగా భావించిన అధికారి ఆ శాఖ బాధ్యతలు శాశ్వతమని భావించాడేమో తెలియదు కానీ.. కార్యాలయం(క్యాబిన్) కోసం ప్రభు త్వ నిధులు లేకుండా పనులు చక్కబెట్టారు. సార్ కూర్చునే గదితోపాటు మరో రెండు గదులకు రూ.3లక్షలతో వార్డెన్లు క్యాబిన్ చేయించారంటే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల సంఖ్యను బట్టి వా ర్డెన్లు నిధులు సమకూర్చాలని హూకుం జారీ చేసిన అదృశ్య శక్తి ఎవరో తెలియకుండాపోయింది. వార్డెన్లు ఇష్టానుసారంగా ని ధులు సమకూర్చారనే వాదనలూ లేకపోలేదు. అయితే.. రూ.3లక్షలకు పైగా ఎందు కు ఇచ్చారనేదే తెలియాల్సి ఉంది. ఇటీవల లక్సెట్టిపేట హాస్టల్లో నెలకొన్న వివాదంతో వార్డెన్ను సస్పెండ్ కాకుండా సరెండర్ చేయడంపై చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్కు తనిఖీకి వెళ్లినప్పుడు హాజరు పుస్తకంలో ఉన్నదానికంటే విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నా కిమ్మనకుండా ఉండడం వెనుక లోగుట్టు ఏమిటో తనిఖీ అధికారికే తెలియాలి. తనిఖీకి వెళ్లినప్పుడు శాఖకు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లడంపై వార్డెన్లు తప్పుపడుతున్నారు. మహనీ యుల వర్ధంతి, జయంతికి నిధులు మంజూ రైనా వార్డెన్లకు బరువు బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారి బాగోతంపై ఉన్నతాధికారులకు హెచ్డబ్ల్యూవోలు ఫిర్యాదులు చేయడమో..? ఏ మోగానీ అధికారిని బాధ్యతల నుంచి త ప్పించారు. అన్ని విషయాలపై నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏబీసీడబ్ల్యూవోను ఇంచార్జిగా నియమించడం కొసమెరుపు. -
డిజిటల్ మెడికల్ కార్డులు ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: నవంబర్లో డిజిటల్ లైవ్ సర్టిఫి కేట్ సమర్పించేందుకు సీఎంపీఎఫ్ అధికారులు ఏరి యా వారీగా చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భా గంగానే డిజిటల్ మెడికల్ కార్డులు ఇవ్వాలని సింగరేణి విశ్రాంత కార్మికులు కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. డిజిటల్ లైవ్ సర్టిఫికేట్ స్పెషల్ డ్రైవ్ కేంద్రాలను మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండలో ఏర్పాటు చేయడం వల్ల విశ్రాంత పెన్షనర్లకు ఉ పయోగకరంగా ఉంటుందని అన్నారు. మీసేవా కేంద్రాలలో జీవన్ ప్రమాణ్ లైవ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వల్ల గత ఏడాది దాదాపు ఐదు వేల మంది విశ్రాంత ఉద్యోగులకు కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పింఛన్లు ఆగిపోయాయని అన్నారు. ఈ స మావేశంలో తెలంగాణ సింగరేణి రిటైర్మెంటు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు చెలిమల అంజన్న, బీంసేన్, ఆర్. రాజేశం, కె.భిక్షపతి, జి.లింగయ్య, సుధీర్సేన్ పాల్గొన్నారు. -
ఇంటర్ ఫస్టియర్లో ‘ప్రయోగ’ం
మంచిర్యాలఅర్బన్: ప్రయోగాలు చేయడం విజ్ఞానశాస్త్రంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. శాస్త్ర సాంకేతిక విప్లవంలో ప్రయోగాలకు ప్రధాన స్థానం ఉంది. తరగతిలో విన్న పాఠాన్ని తెలుసుకునేందుకు కృత్యాలు.. ప్రయోగాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో మాత్రమే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగాల కు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులకు నేర్పించాల్సి ఉన్నా చాలా కళాశాలల్లో బోధనోపకరణాలపై దుమ్ము పేరుకుపోయి కనిపిస్తుంది. రెండో సంవత్సరంలో మాత్రమే నిర్వహిస్తున్న ప్రయోగాలను వచ్చే ఏడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విషయ పరిజ్ఞానం పెరుగుదలకు ప్రయోగ పరీక్షలు ఎంతో దోహదపడుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 4699, రెండో సంవత్సరం విద్యార్థులు 3528 మంది ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, వృత్తి విద్య విద్యార్థులు ప్రయోగం చేయడంతో విషయ పరిజ్ఞానం పెరుగనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ ద్వారా మొదటి సంవత్సరం నుంచి సన్నద్ధమవుతారు. ప్రస్తుతం రెండో సంవత్సరంలో నిర్వహించడం వల్ల విషయ పరిజ్ఞానంలో వెనుకబడి పోతున్నారు. గతేడాది ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరికరాలకు ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున నిధులు మంజూ రు చేసింది. రసాయనశాస్త్రంలో లవణ, విశ్లేషణ, మూలకాలు, తదితర వాటి గురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. హైడ్రో క్లోరిక్ యాసిడ్, సల్ఫర్ యాసిడ్తో 24 రకాల సాల్ట్(లవణాలు) అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు. బోట నీ, జువాలజీ ల్యాబ్స్లో జంతు కళేబరాలు, అవశేషాలు విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం తదితర విషయాలు తెలుసుకునేందుకు మెక్రోస్కోప్లు వినియోగించడంతో విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపడే వీలుంటుంది. -
ఇందిరమ్మ బిల్లు ‘లక్ష’ణంగా అందజేత
వేమనపల్లి: ‘ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్’ శీర్షికన గు రువారం సాక్షిలో ప్రచురితమైన కథనం మండలంలో సంచలనం సృష్టించింది. బిల్లు స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంపీడీవో కుమారస్వామి పోస్టుమాస్టర్ శాంకతోపాటు బాధితురాలు పదిరె అంకు, కుటుంబ సభ్యులను మండల పరిష త్ కార్యాలయానికి పిలిపించారు. ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. పొరపాటుగా తాను బా ధితురాలి ఖాతా నుంచి ఆమెకు చెప్పకుండా రూ.లక్ష డ్రా చేసుకోవడం తప్పేనని పోస్టుమాస్ట ర్ అంగీకరించారు. గతంలో రూ.10వేలు ఇవ్వగా.. మిగతా రూ.90వేలు ఎంపీడీవో చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. పింఛన్లో రూ.16 కోత విధించడంపై బాధితులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. ఇకముందు లబ్ధిదారులకు రూ.16 నగదు అందజేస్తానని పోస్టుమాస్టర్ అంగీకరించా రు. మరోసారి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వనని రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. ‘సాక్షి’ కథనంతో తమకు న్యాయం జరిగిందని బా ధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమురం రమేష్, నాయకులు జాడి గోపాల్, వెంకటేష్గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఎఫెక్ట్ -
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సందర్శన
నార్నూర్: మండలంలోని నాగల్కొండ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరల్డ్ బ్యాంకు బృందం సభ్యులు సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రిజిస్టర్లను పరి శీలించారు. రోగులకు వైద్యం అందిస్తున్న తీరును స్థానిక ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీ, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందుతున్న తీరును గ్రామ పెద్దలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కేంద్రంలో ఉన్న మందులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పనితీరు బా గుందన్నారు. వరల్డ్ బ్యాంకు బృందం ప్రతినిధులు డాక్టర్ కృష్ణ, రంజన్ బివర్మ, అనికేత్ ఘన్శ్యామ్, రాష్ట్ర క్వాలిటీ మేనేజర్ రాధిక, స్టేట్ డీడీఎం జా న్సన్, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, జిల్లా ప్రో గ్రాం అధికారి జాదవ్ దేవిదాస్, ప్రభుత్వ ఆసుపత్రి డీడీవో డాక్టర్ రాంబాబు తదితరులు ఉన్నారు. ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు ఎస్.కృష్ణ, రంజన్, బి. వర్మ, అనికేత్ ఘన్శ్యామ్ అన్నారు. బుధవారం ఉ ట్నూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వ సతులు, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్ర క్వాలిటీ ఆఫీసర్ రాధిక, డీఎంవో డా క్టర్ శ్రీధర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ దేవీదాస్ జా దవ్, ఏవో గీతేష్, డీడీఎం రమణ, నోడల్ ఆఫీసర్ డా.కపిల్ నాయక్, ఆసుపత్రి ఆర్ఎంవో డా.మ హేందర్ సిబ్బంది ఉన్నారు. -
సురక్షితంగా ప్రయాణించేలా..!
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బైకర్ నిర్లక్ష్యం, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవర్, కండక్టర్ల నిర్లిప్తత వెరసి 19 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో సైతం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తీసుకోవాల్సిన భద్రత ప్రమాణాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ముందే చెకింగ్.. ఆర్టీసీ బస్సులు బయలు దేరేముందే అన్ని విధాలుగా మెకానిక్లు చెక్ చేయనున్నారు. బస్సు డిపోకు చేరుకున్న తర్వాత సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసి, డ్యామేజీలు, టైర్ల పనితీరు వంటివి క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనంతరం ట్యాంకులో డీజిల్ నింపి, వాషింగ్, స్వీపింగ్ వంటివి చేసి బస్సులను మెకానిక్ వద్దకు పంపుతారు. మెకానిక్లు లీకేజీలు, ఇంజన్ ఆయిల్ చెకింగ్, కూలెంట్ పనితీరు, బోల్ట్లు చెక్ చేయడం వంటివి చేసి ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. ఎలక్ట్రీషియన్ వైరింగ్ చెక్ చేయడంతో పాటు హెడ్లైట్స్, ఇండికేటర్స్ వంటివి సరి గ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలిస్తారు. ప్రతీ నెల రోజులకు ఒకసారి హబ్ సర్వీసింగ్ చేయడం, ప్రతీ మూడు నెలలకు గేర్ బాక్స్ మార్పిడి వంటివి చేపడుతారు. అయితే ఇకనుంచి ఒకటికి రెండుసార్లు బస్సును పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే నడిపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు సూచనలు.. ఆర్టీసీ బస్సుల్లో బస్సులు బయలు దేరేముందు ప్రయాణికులకు డ్రైవర్లు పలు సూచనలు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు ఏ రకంగా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయంపై సూచించనున్నారు. ముందుగా తమను తాము పరిచయం చేసుకొని, బస్సు వివరాలు, ఎన్ని గంటలకు గమ్యం చేరుకుంటుందనే విషయాన్ని తెలియపరుస్తారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడడం ఎలాగో వివరిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక పరికరాల వాడకం, అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు హామర్స్ వినియోగం వంటి విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన..అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారులతో డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవిస్తే డ్రైవర్లు ఏ విధంగా వ్యవహరించాలి, అగ్నిమాపక పరికరాలను ఏ విధంగా వినియోగించాలనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మంటలు బస్సులో వేగంగా వ్యాపించినప్పుడు ఏ రకంగా వాటిని అదుపు చేయాలనే అంశాలను వివరిస్తున్నారు.డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లు ప్రయాణికులకు సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రయాణికుల భద్రతే పరమావధిగా, సురక్షిత ప్రయాణాన్ని కల్పించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. – ఎస్.భవాని ప్రసాద్, ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ -
ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగిన సాఫ్ట్బాల్ అంతర్జిల్లా యూనివర్సిటీ టోర్నమెంట్లో మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జట్టు రన్నర్స్గా నిలవగా ఇందులో డానియల్, కమల్రాజ్, ప్రదీప్, అభినవ్లు కాకతీయ యూనివర్శిటీ జట్టు నుంచి ఆల్ ఇండియా యూనివర్శిటీ పోటీలకు ఎంపికయ్యారు. పంజాబ్ యూనివర్సిటీలో డిసెంబర్ 12న జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. క్రీడాకారులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రావు, డైరెక్టర్ విజయ్కుమార్, పీడీ శ్రీని వాస్లు అభినందించారు. -
‘వైద్యుల నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతి’
మందమర్రిరూరల్: కార్పొరేట్ ఆసుపత్రుల్లోని వైద్యుల నిర్లక్ష్యం, సింగరేణి పీఆర్వోల బాధ్యతారాహిత్యం వల్లనే మందమర్రి ఏరియాలోని వర్క్షాపులో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే తాళ్ల రమేశ్ మృతి చెందాడని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం రామన్కాలనీలో రమేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జ్వరంతో బాధపడుతున్న రమేశ్ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా రూ.9 లక్షలు పేమెంట్ చేస్తేనే ట్రీట్మెంట్ చేస్తామని కాలయాపన చేశారని ఆరోపించారు. కొత్తగూడెం సీఎంవో నుంచి పేమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత పేషెంట్ మంగళవారం మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారన్నారు. కార్మికుడి మృతికి సింగరేణి భవన్లో ఉన్న హెల్ప్లైన్ డాక్టర్లు, పీఆర్వోలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రమేశ్ మృతదేహాన్ని టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ తదితర సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. -
వైన్స్షాప్లో చోరీ.. ముగ్గురు రిమాండ్
బేల: బేలలోని కనకదుర్గ వైన్స్షాప్లో ఈ నెల 27 అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ ముగ్గురిని రిమాండ్ చేసినట్లు జైనథ్ సర్కిల్ సీఐ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో మాట్లాడారు. చోరీపై వైన్స్ నిర్వాహకుడు రవీందర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు. వైన్స్షాపు వెనుక భాగాన ఉన్న వెంటిలెటర్ నుంచి వైన్స్లోపలకు ప్రవేశించి రూ.13,400విలువ గల మద్యంతో పాటు రూ.41,930 నగదును ముగ్గురు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. చోరీకి పాల్పడిన బేలకు చెందిన పుసాం నారాయణ, షిండే అజయ్, టేకం జోష్వలను స్థానిక గణేశ్ గార్డెన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి రూ.10,320 విలువ గల మద్యం బాటిళ్లతో పాటు రూ.38,630 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా దొంగతనం చేసి నగదును వ్యక్తిగత వినోదాలకు వినియోగించినట్లు గుర్తించామన్నారు. సమావేశంలో ఎస్సై ఎల్. ప్రవీణ్, ఏఎస్సై కనక జీవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్
ఇచ్చోడ: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని గుండాల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారని తెలిపా రు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవిండ్ లైసెన్స్లు కలిగి ఉండాలని పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 బైకులు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ఎస్సైలు పురుషోత్తం, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజతో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
చిరుత సంచారం
ముధోల్: మండల కేంద్రంలోని కంటి ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అటుగా వెళ్లిన వాహనదారులకు చిరుత కనిపించింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ బుధవారం ఉదయం చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. రోడ్డు పక్కన వ్యవసాయ చేనులో చిరుత పాదముద్రలు లభ్యమయ్యాయి. చిరుత ముధోల్, తరోడా శివారుల్లో సంచరిస్తున్నందున రైతులు ఒంటరిగా చేలోకి వెళ్లొద్దని, గుంపులుగా, చేతిలో కర్రలతో వెళ్లాలని సూచించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాంసి(కే)లో పెద్దపులి సంచారంభీంపూర్: మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారి హైమద్ఖాన్ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కడెం గేట్ల లీకేజీలకు మరమ్మతులుకడెం: కడెం ప్రాజెక్ట్ వరద గేట్ల లీకేజీలను అరికట్టేందుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. లీకేజీల రూపంలో వృథాగా నీళ్లు పోకుండా ఉండేందుకు గేట్ల కింది భాగంలో కాటన్ వేస్ట్ అమర్చుతున్నారు. ప్రస్తుతం 12 గేట్ల లీకేజీ మరమ్మతులు పూర్తయినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి..
గుడిహత్నూర్: మండలంలోని మా న్కాపూర్ గ్రామానికి చెందిన నల్వాడ్ విట్టల్ (39) మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్ర కారం.. వ్యవసాయం చేసే నల్వాడ్ విట్టల్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత సోమవారం మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. అనంతరం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి తన అన్న కొడుకు మనోజ్కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. మనోజ్తో సహా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి కదల లేని స్థితిలో ఉన్న విట్టల్ను రిమ్స్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం విట్టల్ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పలు రైళ్లు రద్దుకాగజ్నగర్టౌన్: మోంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను బుధ, గురు రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదే విధంగా బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజిపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్
కాగజ్నగర్రూరల్: ఆన్లైన్లో మోసం చేసిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆన్లైన్లో మోసపోయి రూ.45,790లను కోల్పోయినట్లు ఆగస్టు 15న ఓ బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా డబ్బులు ఏ అకౌంట్కు వెళ్లాయో డీఫోర్సీ బృందంతో సాంకేతిక ఆధారాలు సేకరించి ట్రేస్ చేయగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ దోహార్ అకౌంట్లో జమయ్యాయి. నిందితుడు అకౌంట్ పేరును ఆశిష్ కిరాణా స్టోర్ అని మార్పు చేసి వినియోగిస్తున్నాడు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, డీఫోర్సీ బృందం మధ్యప్రదేశ్కు వెళ్లి ఈనెల 25న నిందితుడిని పట్టుకుని అక్కడి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి ఈనెల 28న కాగజ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా ఆశిష్ టీస్టాల్లో పని చేస్తూ జీవిస్తున్న సమయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ఆకాశ్ వద్వానీతో పరిచయం ఏర్పడింది. ఏటీఎం, ఆధార్ కార్డు, మొబైల్ లింక్ అకౌంట్ ఇస్తే నెలకు రూ.10వేలు ఇస్తానని ఆకాశ్ వద్వానీ చెప్పడంతో ఆశిష్ ఇచ్చాడు. ఇతరులను మోసం చేసి వచ్చిన డబ్బులను ఆ అకౌంట్లో జమ చేసేవాడని ఆశిష్ పోలీసులకు తెలిపాడు. కాగా ఫిర్యాదు దారుడి అకౌంట్ నుంచి మోసపోయిన రూ.45,790లకు గాను రూ.34,537 లను ఫ్రీజ్ చేశామని సీఐ వివరించాడు. ఆకాశ్ వద్వానీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సైబర్ కేసును ఛేదించిన కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది, డీఫోర్సీ బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
కాసిపేట: బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధి మద్దిమాడలో చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం, మృతుడి తల్లి గంగుబాయి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడలో తల్లి గంగుబాయితో కలిసి ఉండే ఆదె సాయికుమార్(20) దేవాపూర్లోని మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సాయికుమార్ తనకు బైక్ కొనివ్వాలని తల్లిని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహంతో తల్లిని బయటకు గెంటేసి తలుపులు పెట్టుకున్నాడు. తల్లి బయట షెడ్డులో పడుకుని బుధవారం ఉదయం తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా సాయికుమార్ దూలానికి ఉరేసుకుని కన్పించాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. గంగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దివ్యాంగులకు ‘స్వయం’ భరోసా
పాతమంచిర్యాల: దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగ మహిళలకు భరోసా కల్పించి జీవితం సుఖమయంగా మార్చడానికి పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు పొందుతూ ఉండి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక దివ్యాంగ మహిళల వివరాలు నెల రోజులుగా సేకరిస్తున్నారు. ఐదు నుంచి 15మంది సభ్యులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 253మంది వివిధ రకాల వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను గుర్తించారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచి నిర్వహణకు సంరక్షకులను నియమిస్తున్నారు. దివ్యాంగుల సంరక్షకులు బ్యాంకు రుణాలు తీసుకోవడం, చెల్లించడం, ప్రతీ నెల నిర్వహించే వీవో సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అంది సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం ఉంది. చికిత్స, పునరావాస సేవలు సంఘ సభ్యులకు వారి వైకల్య తీవ్రతను బట్టి ఫిజి యోథెరపి, ఆక్యుపేషన్ థెరపి, స్పీచ్థెరపి వంటి అవసరమైన సేవలు అందిస్తారు. పలు రకాల ఉపకరణాలు అందిస్తారు. సాంకేతిక పరికరాలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఆదాయ అభివృద్ధి సంఘాల్లో వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సీడ్క్యాపిటల్, రివాల్వింగ్ఫండ్, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా కంప్యూటర్ స్కిల్స్, టైలరింగ్, హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ కల్పించి ఆదాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం.. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఆత్మస్థైర్యంతో జీవించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లాలో సదరం సాఫ్ట్వేర్లో నమోదైన, ఆసరా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల వివరాలు సేకరించి ఎస్హెచ్జీలు ఏర్పాటు చేశాం. వారికి బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి రుణాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మంచిర్యాలవీరు అర్హులు దివ్యాంగులు 40శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యులు చేర్చుకుంటారు. కుటుంబంలో ఒకరి కన్న ఎక్కువ మంది వైకల్యం కలిగిన వారు ఉన్నా సంఘంలో చేరడానికి అర్హులే. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలి
మందమర్రిరూరల్: ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు నాయకులు సహకరించాలని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. బుధవారం స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. నాయకులు ఏరియాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఐఈడీ కిరణ్కుమార్, సీవిల్ ఎస్ఈ రాము, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు దాగం మల్లేష్, అక్బర్ అలీ, కంది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎడతెరిపి లేని వాన
చెన్నూర్/చెన్నూర్రూరల్/భీమారం/మందమర్రిరూరల్/జైపూర్/భీమిని/బెల్లంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మోంథా తుపాను ప్రభావం కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్లోని గోదావరి నదీ తీరం వెంట పత్తి, వరి, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందతున్నారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, చింతలపల్లి, శివలింగాపూర్, భీమారం మండలం అంకుసాపూర్, పోలంపల్లి, మద్దికల్, మందమర్రి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలి నష్టం వాటిల్లింది. మొక్కలపై పత్తి తడిసిపోవడంతో నల్ల గా మారే ప్రమాదం ఉంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో పెట్టుబడి కూడా రాకుండా పోతుందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో నాగమల్ల సోమయ్య ఇంటి పై కప్పు కూలింది. జిల్లాలో.. మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7.7మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల మండలంలో 21 మిల్లీమీటర్లు, జైపూర్లో 16.5, దండేపల్లిలో 14.5, నస్పూర్లో 10.5, కన్నెపల్లిలో 10.5, బెల్లంపల్లిలో 9, హాజీపూర్లో 8.8, భీమినిలో 7.5, భీమారంలో 5.8, నెన్నెలలో 5.5, తాండూర్లో 5.5, చెన్నూర్లో 4.5, మందమర్రిలో 3.5, లక్సెటిపేటలో 3.3, కోటపల్లిలో 1.8, జన్నారంలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రెండ్రోజులు తుపాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓసీపీలో నిలిచిన ఉత్పత్తి శ్రీరాంపూర్: వర్షం వల్ల శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి క్వారీలో షవల్స్, డంపర్లు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రస్తుతం రోజుకు 10 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తున్నారు. 3 వేల టన్నుల బొగ్గు వస్తుంది. వర్షం కారణంగా ఇది పూర్తిగా నిలిచిపోయింది. క్వారీలో చేరిన నీటిని భారీ సామర్థ్యం ఉన్న పంపులతో బయటకు తోడేస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గితేనే క్వారీ నడుస్తుందని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. -
రేటింగ్స్లో వెనుకబడి!
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరిట కార్యక్రమం చేపట్టింది. మూత్రశాలల వినియోగం, నీటి వసతి, మొక్కలు నాటి సంరక్షణ తదితర అంశాలు పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్లో ఆయా పాఠశాలల పరిస్థితిని ఎస్హెచ్వీఆర్ యాప్, https:// shvr. education. gov. in వెబ్సైట్లో యూడైస్ కోడ్తో లాగిన్ అయి నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,045 పాఠశాలల్లో 1,27,834 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 908 పాఠశాలలు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకోగా.. ఇందులో 400 పాఠశాలలు రేటింగ్లో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైవ్స్టార్(అత్యుత్తమ) సాధించిన పాఠశాలలు 23 ఉన్నాయి. పచ్చదనం, నీటి పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో ఫోర్త్స్టార్(4స్టార్)లో 377 ఉన్నాయి. మిగతా 508 పాఠశాలలు రేటింగ్స్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరు అంశాలు.. ఆరవై ప్రశ్నలు స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణ నలోకి తీసుకుని 60 ప్రశ్నలు ఆన్లైన్ ప్రక్రియలో ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల నడవడిక, ఎకోక్లబ్ల ఏర్పాటు, నీటి సంరక్షణ, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మొక్కలు, తోటల పెంపకం, సౌరశక్తి వినియోగం తదితర అంశాలకు ఆన్లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చారు. అవసరమైన ఫొటోలు అప్లోడ్ చేశారు. మెరుగ్గా ఉండే వాటికి మార్కుల ఆధారంగా కేంద్రం ఎంపిక చేసింది. క్షేత్రస్థాయి తనిఖీలు ఎస్హెచ్వీఆర్ కార్యక్రమంలో భాగంగా అప్లోడ్ చేసిన వివరాలు, చిత్రాలను కమిటీ బృందం తనిఖీ చేస్తుంది. ఫైవ్స్టార్, 4స్టార్ పాఠశాలల్లో అప్లోడ్ చేసిన వివరాలు నిర్ధారించనున్నాయి. ఆయా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, సహాయకుడితో బుధవారం నుంచి పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రాథమిక 3, ఉన్నత పాఠశాలలు 3, అర్బన్ నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఒక్కొక్కటి అత్యుత్తమమైన వాటిని తనిఖీల అనంతరం ఎంపిక చేస్తారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్గ్రాంట్గా ఇవ్వనున్నారు. పాఠశాలలను ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్ఫోజర్ విజిట్(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు. -
మద్యనిషేధంపై తీర్మానం
వేమనపల్లి: మండలంలోని పల్లెలు ఏకమై గుడుంబా నిర్మూలనకు ముందుకు కదులుతున్నాయి. మండల కేంద్రంలో బుధవారం గ్రా మస్తులు గుడుంబా, బెల్ట్షాపుల్లో మద్యం అ మ్మకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. గ్రా మంలో మద్యనిషేధానికి తీర్మానించారు. గు డుంబా విక్రయించొద్దని, బెల్ట్షాపులు మూసే యాలని కోరారు. నీల్వాయి ఇంచార్జి ఎస్సై శ్యాంపటేల్, అబ్కారీ అధికారులకు సమాచా రం ఇచ్చారు. తమకు సహకరించాలని కోరా రు. గ్రామ పంచాయతీ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గుడుంబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్
వేమనపల్లి: ఇందిరమ్మ లబ్ధిదారు ఖాతాలో జమ అయిన డబ్బులను ఓ పోస్టుమాస్టర్ స్వాహా చేసింది. విడతల వారీగా రూ.లక్ష డ్రా చేసుకుంది. చివరికి రూ.10వేలు వృద్ధురాలికి ఇవ్వగా.. అనుమానం వచ్చి ఖాతాను మరోచోట పరిశీలించగా స్వాహా పర్వం బయటపడింది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పదిరె అంకుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్మెంటు వరకు నిర్మించుకోగా గృహ నిర్మాణ శాఖ నుంచి సెప్టెంబర్ 29న రూ.లక్ష మొదటి విడత బిల్లు ఆమె పోస్టాఫీసు ఖాతాలో జమ అయ్యాయి. ఈ విషయమై ఆమెకు తెలియదు. ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బుల విషయమై వేమనపల్లి పోస్టాఫీసుకు వెళ్లింది. ఖాతాను పరిశీలించిన పోస్టుమాస్టర్ శాంక రూ.లక్ష ఉండడం గమనించింది. ఈ విషయం అంకుకు, ఆమె కుమారుడు చిన్నన్నకు చెప్పకుండా.. గ్యాస్ డబ్బులు పడలేదని తెలిపింది. అంకు వేలిముద్ర ద్వారా ఆ రోజు నుంచి డబ్బులు డ్రా చేస్తూ వచ్చింది. ఈ నెల 13, 15, 16వ తేదీల్లో పోస్టాఫీసుకు వస్తే ఖాతా పరిశీలిస్తానని చెప్పడంతో వెళ్లారు. ఆయా రోజుల్లో రూ.25వేల చొప్పున అంకు వేలిముద్ర ద్వారా రూ.75వేలు పోస్టుమాస్టర్ శాంక డ్రా చేసుకుంది. చివరి రోజు రూ.10వేలు అంకుకు ఇవ్వడంతో పోస్టుమాస్టర్పై అనుమానం వచ్చి మరోచోట ఆన్లైన్ సెంటర్లో వాకబు చేసింది. రూ.25వేల చొప్పున నాలుగు విడతలుగా డ్రా చేసుకున్నట్లు తెలియడంతో వృద్ధురాలు, కుటుంబ సభ్యులు ఆవాక్కయ్యారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమురం రమేష్, బౌడి గోపాల్, తాళ్ల వెంకటేష్గౌడ్ తదితకరులు లబ్ధిదారు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇఫ్తేకర్ అలీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన పోస్టుమాస్టర్ను ఆరా తీయగా.. అరగంటలో వస్తానని, తాను తప్పు చేశానని, డబ్బులు తిరిగి ఇస్తానని బతిమాలింది. పోస్టుమాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బుధవారం రాత్రి వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 87వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 50వేల క్యూసెక్కులు, కడెం నుంచి 5వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 288 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, 23 గేట్లు ఎత్తి 1.59లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వదులుతున్నారు.


