Mancherial
-
వైద్యశాఖలో బదిలీలు
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు స్థానచలనం పొందారు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎండి.సులేమాన్ను నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా బదిలీ అయ్యారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి ప్రొఫెసర్గా, ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీమన్నారాయణను ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవోగా, ప్రొఫెసర్ ముసాఖాన్ను ఫీవర్ ఆసుపత్రికి ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్ విభాగానికి బదిలీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఇంచార్జి అధికారి డాక్టర్ అనితను హైదరాబాద్ డీఎంహెచ్వో కార్యాలయానికి బదిలీ చేశారు.డాక్టర్ వేదవ్యాస్ఎండి సులేమాన్డాక్టర్ అనితశ్రీమన్నారాయణ -
ఇక బ్యాంకుల్లోనే పింఛన్లు
దండేపల్లి: చేయూత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా అందిస్తుండగా ఇక నుంచి బ్యాంకుల ద్వారానే చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 58,254 మంది పోస్టాఫీసు ద్వారా పింఛన్లు పొందుతున్నారు. ఇకపై బ్యాంకుల ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతుండడంతో ఖాతాలు లేని వారు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకు ద్వారా ఏ విధంగా అందజేస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఏటీఎం కార్డులు జారీ చేస్తారా లేక ప్రత్యేక రోజులు కేటాయించి బ్యాంకు సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తారా అనే విషయాలపై అధికారికంగా ఆదేశాలు వెలువడాల్సి ఉంది. పోస్టల్ విధానంలో ఇబ్బందులు.. పోస్టాఫీసు ద్వారా పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల కొందరు పింఛన్దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నా పంపిణీ సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ ధ్రువీకరణ సమయంలో సరిగా నమోదు కాకపోవడంతో వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రూ.2016, రూ.4016 పింఛన్ల మొత్తంలో చిల్లర రూ.16 చెల్లించడం లేదనే ఆరోణపణలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇక ముఖ గుర్తింపు, బయోమెట్రిక్ రాని వారికి పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో చెల్లిస్తుండడంతో తపాలా కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.ఇంకా ఆదేశాలు రాలే..చేయూత పింఛన్ల పంపిణీలో మార్పులకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంకా అధికారికంగా ఆదేశాల రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లిస్తున్న పింఛన్లను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. – కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల -
సాగు సన్నద్ధతపైరేపు ఫోన్ ఇన్
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో ‘సాక్షి’ బుధవారం ఫోన్ ఇన్ నిర్వహించనుంది. రైతుల సమస్యలు, సాగు సందేహాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సమాధానాలు ఇస్తారు. వాతావరణానికి అనుగుణంగా విత్తనాల ఎంపిక, సాగు ప్రణాళిక, ఎరువుల వినియోగం, పంట మార్పిడి తదితర సాగు సంబంధిత సందేహాలపై రైతులు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.సమయం: బుధవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటలకు వరకు సంపదించాల్సిన ఫోన్ నంబర్లు : -
వాన కురిసె.. రైతు మురిసె
చెన్నూర్/మంచిర్యాలఅగ్రికల్చర్/వేమనపల్లి/లక్సెట్టిపేట: జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సోమవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మృగశిర కార్తె రోజున తొలకరి వర్షం కురువడంతో రైతులు మురిసిపోయారు. కార్తె ప్రారంభంలో వర్షం కురిస్తే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్, వేమనపల్లి, లక్సెట్టిపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో తాడిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు వ్యాపించాయి. బలమైన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వేమనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు భారీ సంఖ్యలో లారీలు వచ్చాయి. లోడ్ చేస్తున్న సమయంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే దుక్కి దున్ని చేన్లు, పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వర్షంతో విత్తనా లు వేసేందుకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. -
నేరాల నియంత్రణకు సహకరించాలి
మంచిర్యాలక్రైం: నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని 38, 39, 40, 41, 42, 43, 44, 45 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు, జల్సాల కోసం కొందరు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్, మద్యానికి అలవాటు పడి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా షీ టీమ్ పని చేస్తోందని, వేధింపులు, మోసాలకు గురైతే 100 డయల్, షీ టీమ్కు సమాచారం అందించాలని అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మంచి ర్యాల సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు తిరుపతి, శ్రావణ్కుమార్, మధుసూధన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
కేజీబీవీలో భద్రతతో కూడిన విద్య
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో బాలికలకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని సెక్టోరల్ అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కేజీబీవీలో అడ్మిషన్ల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెసిడెన్షియల్ విధానంలో విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 18 కేజీబీవీల ప్రత్యేకతను తెలిపే స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు వసతులు, విద్య, ఇతర సదుపాయాలపై వివరించారు. 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాగా 20 మంది అడ్మిషన్లు పొందారు. ప్రత్యేక అడ్మిషన్ల స్టాళ్లను ఎంఈవో మాళవీదేవి పరిశీలించారు. కార్యక్రమంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల వివరాలు ప్రదర్శించాలి
మంచిర్యాలఅర్బన్: ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని, ఎంఈవోలు పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య సూచించారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. బడిబాటలో గతేడాది కంటే పదిశాతం అదనంగా విద్యార్థుల నమోదు పెంచాలని తెలిపారు. తరగతి గదులు, ఆవరణ, వంటపాత్రలు శుభ్రం చేయించాలని, మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం సమకూర్చుకోవాలని అన్నారు. పాఠ్య, నోటుపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్ దశ వరకు నిరాటంకంగా చదువు కొనసాగించేలా చూడాలన్నారు. భవిత సెంటర్లను ఎప్పటికప్పుడు ఎంఈవోలు పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్న భోజనం మొదటి రోజు నుంచే అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లలిత, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు భరత్కుమార్, సత్తయ్య, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
సారూ.. సమస్యలు పరిష్కరించరూ..
మంచిర్యాలఅగ్రికల్చర్: వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు సోమవారం కలెక్టరేట్కు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్కు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని శాఖల్లో అర్జీలు పెండింగ్లో ఉంటున్నాయని, పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ పాల్గొన్నారు. -
పంటల ప్రణాళిక రూపొందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ సహాయ అధికారులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం జూన్, జూలైలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఆగస్టు, సెప్టెంబర్లో గత ఐదారేళ్లతో పోలిస్తే సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు. మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసి భూమిలో ఒకటిన్నర అడుగుల లోతు వరకు తేమ ఉన్న తర్వాతే విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచనలు చేయాలని అన్నారు. పంటల అవశేషాలు తగులబెడితే రైతులకు గ్రామ పంచాయతీల ద్వారా రూ.2,500 నుంచి రూ.15వేల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఎనిమిది రకాల సన్న ధాన్యం సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాబోయే పది రోజులపాటు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేయాలని తెలిపారు. -
● ఏళ్ల తరబడి ఒకే రకం పంటల సాగు చేటు ● మార్పుతోనే మంచి దిగుబడి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సాగు సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనాలు జిల్లాను తాకనున్నాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడల బెడద అధికం కావడంతోపాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం పొందవచ్చని ఆదిలాబాద్ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ వివరించారు. ఆయన సూచనలు, సలహాలు.. పత్తి, వరి పంటలే అధికం.. జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నా రైతులు దాదాపు 15ఏళ్ల నుంచి పత్తి, వరి పంటలే సాగు చేస్తున్నారు. చీడపీడల ఉధృతి పెరగడంతో విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. వానాకాలంలో 70శాతం మంది రైతులు వర్షాధారంగా ఈ రెండు పంటలే సాగు చేస్తున్నారు. కొందరు అటవీ జంతువుల బెడద ఉంటుందని, మార్కెట్, నీటి సౌకర్యం లేదని, వేరే పంటలు దిగుబడి రావని తదితర కారణాలతో ఇతర పంటల వైపు మొగ్గు చూపడం లేదు. భిన్నమైనవి ఎంచుకోవాలి పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటల వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలు ఎక్కువగా గ్రహిస్తాయి. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే ఈ పంటలకు బదులుగా భూమికే పోషకాలు అందించే అపరాల పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి కొంతవరకు బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. ఆకులను రాల్చి భూమికి సేంద్రియ పదార్థాలను అందిస్తాయి. వేరుబుడిపెలు నత్రజనిని స్థిరీకరిస్తాయి. నల్లరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించిన రైతులు సోయాచిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలిపోతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తుంది. చీడపీడల నివారణ కోసం.. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. వరుసగా పత్తి, వరి పంట వేయకుండా పప్పుధాన్యపు పంటలు, నూనెగింజల పంటలు వేసుకోవాలి. మిరుప, వేరుశనగ, క్యాబేజీ పంటలను లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉధృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీనివల్ల ఆయా పంటల్లో కాళహస్తి తెగులు, నులి పురుగులు, ఆకుముడత, లద్దె పురుగుల ఉధృతిని నివారించవచ్చు.వేయకూడని పంటలు..బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలను ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. జొన్న వేసిన భూమిలో మిరప, పసుపు తర్వాత మిరప, టమాటా, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకుముడత పురుగుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు పంటలు సాగు చేయొద్దు.ఏవి వేసుకోవాలి.. గత రబీలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్లో మొక్కజొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రబీలో మళ్లీ వేరుశనగ వేసినప్పుడు ఆ పంట నులి పురుగుల బెడద చాలా వరకు తగ్గుతుంది. -
అంతర్జాతీయ పోటీలకు గ్రామీణ యువకుడు
పెంచికల్పేట్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సాయిక్రిష్ణ అంతర్జాతీయ బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆసియా ఇంటర్ ప్రైవేట్ నేషనల్ గేమ్స్– 2026లో పాల్గొనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా, దేశం తరఫున బేస్బాల్ పోటీల్లో పాల్గొననున్న సాయిక్రిష్ణకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్ రావు క్రీడాకారుడికి నగదు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పగిడె కాంతారావు, సర్పంచ్ పొట్టె ఉమామహేశ్, ఉప సర్పంచ్ రఘునాథ్, నాయకులు మీసారి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లీవ్ ఇట్
ఆదిలాబాద్: ఆర్టీసీ కార్మికులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్యాల బారినపడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రికి వెళ్దామంటే అధికారుల నుంచి అనుమతులు రాక.. విధిలేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. తమకు సెలవులు మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నా అధికారులు ఖరాకండీగా డ్యూటీ చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా వాదిస్తే వారిని టార్గెట్ చేసి ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. యూనియన్లు సైతం లేకపోవడంతో పైఅధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకే ఇబ్బంది అని లీవ్స్ ఇవ్వకపోయినా పని చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. డ్యూటీ చేయాల్సిందే..అనారోగ్యం, పలు కారణాలతో సెలవుల మంజూరు కోసం అధికారులకు అర్జీ పెట్టుకుంటే పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, తప్పకుండా డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హాఫ్ పే సెలవులు మంజూరు చేయాలని విన్నవించినా కనికరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. పలు సందర్భాల్లో నేషనల్ హాఫ్ పేలను సైతం వాడుకునే పరిస్థితి లేక బలవంతంగా డ్యూటీకి ఎక్కుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే పనిఒత్తిడితో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలు ఇలా..నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంవత్సరంలో 15 సాధారణ సెలవు దినాలు ఉంటాయి. వీటితో పాటు ఏడాదికి 4 నేషనల్ హాఫ్ డేలను సైతం సెలవులుగా ఇస్తారు. జనవరి 26, అంబేడ్కర్ జయంతి, ఆగస్టు 15, గాంధీ జయంతి రోజున సెలవులుగా ప్రకటించారు. అయితే ఈ సెలవు రోజుల్లో సైతం ఆర్టీసీ బస్సులు నడపాల్సి ఉంటుంది. కార్మికులు డ్యూటీ చేయాల్సి వస్తున్న కారణంగా ఆ నాలుగు రోజులను ఇతర రోజుల్లో సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రతీ 10 సంవత్సరాల కాలానికి 31 హాఫ్ పే సెలవులను ఆర్టీసీ మంజూరు చేసింది. వీటిని సైతం సెలవులుగా వినియోగించుకునే సౌలభ్యం కార్మికులకు ఉంటుంది. విలీన ప్రకటనతో విధిలేని పరిస్థితిలో..ఇటీవల ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగా రు. దిగివచ్చిన ప్రభుత్వం, వారితో చర్చలు జరిపి విలీన విషయంలో సానుకూలంగా స్పందించింది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌలభ్యాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, విలీనం నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే పరోక్షంగా కార్మికులపై పని ఒత్తిడి పెంచి, వారు స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకునేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విలీన ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి సంస్థలో ఉండకపోతే తీవ్రంగా నష్టపోతామనే భయంతో, సెలవులు దొరక్కపోయినా విధిలేని పరిస్థితుల్లో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. కనీసం అత్యవసర సమయాల్లోనైనా సెలవులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.సెలవులు మంజూరు చేస్తున్నాం.. కార్మికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న సమయాల్లో సిక్ లీవ్స్ ఇస్తున్నాం. అన్ని సందర్భాల్లో సెలవులు మంజూరు చేస్తున్నాం. ఉద్యోగ విరమణతో సిబ్బంది సంఖ్య తగ్గుతున్నా, ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నాం. కార్మికులకు సెలవుల మంజూరులో ఎటువంటి ఇబ్బంది లేదు. డిపోల పరిధిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తా. – విజయభాను, ఆర్టీసీ ఆర్ఎం, ఆదిలాబాద్ -
అమాత్య.. ఎలా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుచరవర్గమూ తప్పకుండా కేబినెట్లో చోటు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం ఇందుకు తోడవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనను సక్సెస్ చేయడంతో పీఎస్సార్కు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ మరోసారి సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు విజయవంతం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల ఆసిఫాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేశారు. ఈ క్రమంలోనే కేబినెట్లో మార్పులు చేర్పులు జరిగితే పీఎస్సార్కు చోటు దక్కుతుందా..? అనే చర్చ జోరందుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో సీఎం వర్గానికి దూరంగా ఉంటారనే ప్రచారం ఉన్నప్పటికీ తాజాగా ఆసిఫాబాద్ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే పీఎస్సార్కు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో సీఎం హైదరాబాద్కు వెళ్తూ మంచిర్యాలలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద కాసేపు ఆగారు. ఆశించి, భంగపడి ఉమ్మడి జిల్లా నుంచి పీఎస్సార్కు మొదటి, ఆ తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినప్పటికీ చోటు దక్కలేదు. గతేడు ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణకు ముందు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్, జై సంవిధాన్’ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన మంత్రి పదవిపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్ల డించారు. తర్వాత జిల్లా నుంచే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామికి అవకాశం దక్కింది. దీంతో ఇక పీఎస్సార్కు మంత్రి పదవి రాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండో విడతలో చోటు ఖాయం అనుకున్నప్పటికీ దక్కలేదు. నామినెటేడ్కు ససేమిరా మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న పీఎస్సార్కు నామినేటెడ్తో బుజ్జగించేలా కార్పొరేషన్ పదవిలో నియమించారు. గత అక్టోబర్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం పీఎస్సార్ను కేబినెట్ హోదాతో సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టలేదు. అంతేకాక నామినేటెడ్ పోస్టులపై తనకు ఆసక్తి లేదని తేల్చారు.అవకాశం ఉంటుందా?కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తోంది. అన్ని సామాజిక, ప్రాంతాలకు సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో కేబినెట్లో మార్పులు చేర్పులపై ఇప్పటికే రాష్ట్రంలో పలువురు సీనియర్ నాయకులు మంత్రి పదవిపై గంపెడాశలతో ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. దీంతో మూడో విడతలో ఎవరికి అవకాశం ఇస్తారోనని ఎదురు చూస్తునారు. ఇప్పటికే జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం ఉంది. ఈ క్రమంలో పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే పీఎస్సార్ను పార్టీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తారనేది వేచిచూడాలి. -
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు
పాతమంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా, మండల, మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని, పార్టీ బలోపేతం కోసం ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్ల య్య, చంద్రశేఖర్, లింగం రవి, శ్రీనివాస్, చంద్రకళ, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బొంతల లక్ష్మీనారాయణ, దుర్గారాజ్, రాజమౌళి, సమ్మయ్య, బానేష్ పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మంచిర్యాలటౌన్: కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాసభ విజయవంతం చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి, ఉమ్మ డి జిల్లా చైర్మన్ సిరాజ్ ఉర్ రహమాన్ కోరారు. ఆదివారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రెయినేజీల నుంచి డ్యామ్ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించి, లేనివాటిని నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ చైర్మన్లు బి.సుగుణాకర్రావు, కట్కూరి దేవేందర్రెడ్డి, యూ.సురేందర్, స్టేట్ అడ్వైజర్ కె.ప్రభాకర్రెడ్డి, ఆదిలాబాద్ మాజీ చైర్మన్ రామారావు, రవీందర్రావు, మనోజ్, జితేందర్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు
శ్రీరాంపూర్:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్షిఫ్ట్ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్ గాయపడ్డాడు. ట్రామర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఆదివారం తెల్లవారు జామున 5 సీమ్, జీరో లెవల్ 7 రేస్ వద్ద ట్రబ్బు ట్రా క్పై నుంచి జారడంతో బల్ల వేసి దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా జంప్ కావడంతో పాయకు, రేస్కు మద్య ఇరుకున్నాడు. దీంతో తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడున్న కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, తుంటి భాగంలో రెండు ఫాక్షర్లు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు.. జన్నారం: మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల నారాయణ గౌడ్ ఈత చెట్టు పైనుంచి పడి గాయాలపాలయ్యాడు. శనివారం సాయంత్రం ఈత చెట్టెక్కి కల్లు గీస్తుండగా మోకు జారడంతో కిందపడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్గౌడ్, నారాయణగౌడ్ కోరారు. -
కార్మిక వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు
భూపాలపల్లి అర్బన్: కార్మిక వ్యతిరేక విధానాలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణి సంస్థ నష్టాలబాట పట్టిందని బీఎంఎస్ జాతీ య బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్లో ఆదివారం సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. తెలంగాణలోని 12 డివిజన్లకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో లక్ష్మారెడ్డి మాట్లాడా రు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హా మీలు నెరవేర్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్టీయూసీ పూర్తిగా వి ఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకుండా యాజమాన్య ం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మూడేళ్లుగా కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘాలు చర్యలు తీసుకోలేదని, స మ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించాయని ఆయన మండిపడ్డారు. కార్మికహక్కుల సాధన, వేతనాల అమలు, కనీస పెన్షన్ వంటి అంశాలపై బీఎంఎస్ జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సింగరేణికి రూ.51,149 కోట్ల విద్యుత్ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు. 12వ వేజ్బోర్డు అమలుకు సంబంధించి కోలిండియా యాజమాన్యం వెంటనే క మిటీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని కో రారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నివారించ డం, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, కార్పొరేట్ మెడికల్ బోర్డు పునరుద్ధరణ, తొలగించిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం, కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియా తరహా వేతనాలు అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. జాతీయ నాయకులు మాధవ్నాయక్, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, వర్షా ఉడికే, భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు వెలబోయిన సుజేందర్, ఆర్ నర్సింగ్రావు, అల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు
బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి. ఏ బస్తీలో చూసినా.. మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. వారం రోజుల్లో.. పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అఽధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. భయంగా ఉంది ఇళ్ల చుట్టూ రెండు, మూడు పాములు తిరుగుతున్నయ్. చీకటి పడటంతోనే చేరుతున్నయ్. రెండు రోజుల క్రితం పాము వచ్చింది. కొద్ది దూరం నుంచి చూసి కేకలు వేసి బయటకు పరుగుతీశాను. ఓ యువకుడు చాకచక్యంగా పామును పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇట్ల పాములతో భయం భయంగా గడుపుతున్నం. – వేల్పుల శాంత, టేకులబస్తీ తేళ్లు వస్తున్నాయి ఇళ్ల పరిసరాల్లో పాములు, తేళ్లు భయపెట్టిస్తున్నాయి. ఒకసారి పాము కనిపిస్తే మరోసారి ఐదారు తేళ్లు వస్తున్నాయి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే వాటి కాటుకు గురయ్యేవాళ్లం. పిల్లలు వణికిపోతున్నారు. పాములు, తేళ్లు రాకుండా మున్సిపల్ అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలి. – మేకల భాగ్యలక్ష్మి, టేకులబస్తీ పట్టుకుని వదిలేస్తున్నా మున్సిపాలిటీలో సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిలో ప్రాణాంతక రక్తపింజరలు, తా చుపాముల సంఖ్య అధికంగా ఉంది. గతంలో రక్త పింజరలు, నాగుపాములు అడపాదడపా కనిపించగా ప్రస్తుతం ప్రతి బస్తీలోనూ దర్శనమిస్తున్నాయి. వీటి సంతతి వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. వారం నుంచి రోజుకు రెండు, మూడు పాములను ప ట్టుకునిసురక్షితంగాఅటవీప్రాంతంలోవదిలేస్తున్నాను. – దుర్గా రాజేష్, సీనియర్ స్నేక్క్యాచర్, బెల్లంపల్లి -
‘పది’ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రెడ్డి కులానికి చెందిన విద్యార్థులకు ఆదివారం జిల్లా కేంద్రంలో రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీ య బహుమతి రూ.6 వేలు, తృతీయ బహుమతి రూ.4 వేలు అందించారు. మొత్తం 10 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా సభ్యులు సంతోషం గోపాల్రెడ్డి, వి.మధుసూదన్రెడ్డి, కె.సరేందర్ రెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, తాళ్ల సంపత్రెడ్డి, ఓడేటి బలరాంరెడ్డి, రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల, పద్మ, భాగ్యలక్ష్మి, పి.సుధా, స్వాతి, లీలా, బి.రాణి, పి.దివ్య, బి.సరిత, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
జిల్లాకేంద్రంలోని ఎస్బీహెచ్ నం.2 పాఠశాలలో 1985–86 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ వేదికై ంది. ఎక్కడెక్కడో స్థిరపడినవారు మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లింబగిరి స్వామి, కుటుంబరావు, చక్రపాణి, టి.రాములు తదితరులను సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. –ఆదిలాబాద్టౌన్సంతోషంగా ఉంది చిన్ననాటి మిత్రులను కుటుంబ సమేతంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన సమయంలో స్నేహితులందరూ ఒకేచోట కలవాలని నిర్ణయించాం. రెండు నెలల నుంచి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించి గ్రూప్ తయారు చేశాం. సమ్మేళనం ఉందని చెప్పడంతో అందరూ వచ్చారు. – దొగ్గలి గంగయ్య, పూర్వ విద్యార్థి హైదరాబాద్ నుంచి వచ్చా మూడు సెక్షన్లు కలిపి దాదాపు 70 మంది ఉంటాం. సమ్మేళనం ఉందని సమాచారంతో హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువులు విలువలతో కూడిన విద్య అందించారు. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రులతో ఫోన్లో మాట్లాడతాను. – కుంట గంగయ్య, రిటైర్డ్ ఆర్మీ మరుపురాని అనుభూతి 40 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. అనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నాం. ఆరోగ్య క్షేమాలు, ఇతర విషయాల గురించి పలకరింపులు మరవలేను. కష్టసుఖాల్లో అందరు పాలుపంచుంటాం. – భీమన్న, పూర్వ విద్యార్థి -
కేంద్రాల్లోనే పౌష్టికాహారం
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పౌష్టికాహారం అందించడంతో పాటు, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మూడేళ్లు దాటిన చిన్నారులను సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
15 నుంచి కొత్త విద్యా సంవత్సరం!
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు మూడురోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 13న రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు ఉండటంతో పాటు పలు వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల పున:ప్రారంభం వాయిదా పడినందువల్ల కోల్పోయిన విద్యాదినాలను భర్తీ చేయడానికి జూలై 11న రెండో శనివారం సాధారణ పనిదినంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 1,051 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా 1,32,322 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలలు జూన్ 15న ప్రారంభించాలని విద్యాధికారులకు ఆదేశాలు వచ్చాయి. పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి.. కొత్త విద్యాసంవత్సరం మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అన్ని పాఠశాలలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. స్కావెంజర్లకు నిబంధనల ప్రకారం పది నెలలు వేతనాలు చెల్లిస్తారు. జూన్ ఒకటి నుంచి వేతనాలు చెల్లించే నేపథ్యంలో మొక్కలకు నీరు పోయడం, తదితర పనులపై దృష్టి సారించేలా హెచ్ఎంలు చొరవ చూపాలి. వాటర్ ట్యాంకులపై కన్నేయండి.. పాఠశాలల్లో ఉపరితల ట్యాంకులను 15 రోజులకోసారి, భూగర్భ ట్యాంకులను నెలకోసారి శుభ్రం చేయాల్సి ఉంది. రక్షిత నీటితో వంటలు చేయాలని ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో బోరు నీటితోనే వంటలు చేస్తుండడం పరిపాటిగా మారింది. మరికొన్నింట్లో ట్యాంకుల నుంచి వచ్చే నీటితో వంటలు చేస్తున్న సందర్భాలు న్నాయి. పాఠశాలలకు మిషన్ భగీరథ పైపులున్నా నీటిసరఫరా అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలలు చాలా రోజులుగా మూసివేయడంతో ట్యాంకులు శుభ్రం చేయక నాచు పేరుకుపోయి.. నీటిలో పురుగులు వచ్చే ప్రమాదముంది. అపరిశుభ్ర వా తావరణం వల్ల విద్యార్థులు అనారోగ్యం బారిన ప డే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నా రు. ట్యాంకులను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలి. మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం జిల్లాలోని మండల విద్యావనరుల కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారాయి. నిర్వహణ, సౌకర్యా ల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా విని యోగంలో జవాబుదారీతనం లోపిస్తోంది. కొన్ని మండలాల్లో తాగునీరు లేని పరిస్థితి. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అవసరం నిమిత్తం వచ్చినప్పుడు టాయిలెట్కు వెళ్లాలంటే మరుగుదొడ్ల పరిస్థితి చూసి ముక్కుమూసుకుంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లోనే మరుగుదొడ్లు క్లీనింగ్తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -
ఆర్థికంగా భారం
మంచిర్యాలటౌన్: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రోజువారీగా వినియోగించే వంట నూనెలు, ఇతర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఏ ధర పెరిగినా, వాటి ప్రభావం ఇతర వాటిపై పడుతోంది. – రాజమణి, గృహిణి, మంచిర్యాల భరించడం కష్టమేమంచిర్యాలటౌన్: అన్నింటి ధరలు ఒకేసారి పెరుగుతుండడంతో సామాన్యుల నెలవారీ ప్రణాళిక మారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలను భరించడం కష్టంగా మారింది. వీటికితోడు వంట గ్యాస్ ధరలను పెంచుతూ పోతున్నారు. వచ్చే వేతనాలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. పెరిగిన ధరలతో అప్పులు చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. – సునీత, గృహిణి, మంచిర్యాల -
● ఈనెల 15 వరకు వేసవి సెలవులు ● ఈలోగా మూడేళ్ల చిన్నారులను కేంద్రాల్లో.. ● ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం ● 15 నుంచి చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ పథకం
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాలను బలోపే తం చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ రెండేళ్లుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘బడిబాట’ మాదిరిగానే రెండేళ్ల నుంచి ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ పేరిట విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం మే 30 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ‘అమ్మమాట అంగన్వాడీ బాట’ పేరిట జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా, అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్లేస్కూల్కు పిల్లలను పంపించే తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకే వారి పిల్లలను పంపించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆకర్షితులవుతుండడం, ప్రైవేటు కంటే మెరుగ్గా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మారుతుండడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య ఏటా పెరుగుతోంది. బ్రేక్ఫాస్ట్, భోజనం, విద్య ఒకేచోట అందేలా జిల్లాలో 974 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 40,794 మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని పాఠశాలల్లో చేర్పిస్తే చిన్నారుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నారు. చిన్నారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు గానూ ఈ ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాబోధనలో భాగంగా చిన్నారులకు ఆటపాటలు, కథలతో పాటు, సంభాషణ నైపుణ్యాలు నేర్పించి, చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగానే అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల సేవలను చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లులు, పిల్లల పేర్లను సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసి, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం, చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. మూడేళ్లు వచ్చిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకుని, ఆరేళ్ల వరకు వారికి కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేస్తున్నారు. అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లు పైబడిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల నుంచి నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమం చేపట్టనున్నారు.అంగన్వాడీ కేంద్రాలు 974చిన్నారులు 40,794బాలింతలు 3,543గర్భిణులు 3,307జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల వివరాలు -
కూలీ రేట్ల్ల పెంపుపై ప్రభుత్వం నిర్లక్ష్యం
బెల్లంపల్లి:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రసాద్ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూలీ రేట్లను పెంచలేదన్నారు. కూలీలపై వివక్ష ప్రదర్శిసస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందన్నారు. కూలీ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ కూలీలు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలు వచ్చిన తర్వాత కూలీలకు పనులు దొరకడం లేదని తెలిపారు. వలసలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, కూలీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, జాబ్కార్డు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుమాస అశోక్, ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి , గోమాసబాపు, ఎం.జయ, కార్యదర్శిగా కనికరపు అశోక్, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్, రాజమణి , నరేందర్, సరిత, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్యను ఉన్నుకున్నారు. మరో 10 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘం, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. -
టీజీ–20 ఖమ్మం ఏసేస్ జట్టులో హిమతేజ
● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్ ఆదిలాబాద్: జిల్లాకేంద్రానికి చెందిన యువ క్రికెటర్ కొడిమెల హి మతేజ హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ–20 వేలంలో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా ఆదివారం నిర్వహించిన టీజీ–20 క్రికెట్ లీగ్ వేలంలో ఖమ్మం ఏసేస్ జట్టు రూ.8 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ కెరటం తాజాగా టీజీ–20 లీగ్లో అత్యధిక ధర పలకడం విశేషం. లీగ్లో ఎంపిక కావడం పట్ల కోచ్ జయేంద్ర పటాస్కర్ అభినందనలు తెలిపారు. మందమర్రిలో ఆర్టీసీ బస్సు బోల్తామందమర్రిరూరల్:మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్లగ్జరీబస్సు(టీఎస్28జెడ్ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తుండగా ఓసీపీ సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్ సీతారాం, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్కుమార్ మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కాగా స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పట్టణ ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సు డ్రైవర్ సీతారాం బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు. అర్ధరాత్రి బైక్లపై తిరుగుతున్న వారికి డ్రంకెన్ డ్రైవ్పరీక్షలు చేశారు. అదుపులో తీసుకుని విచారించి వివరాలు సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్లపై స్టంట్ల చేస్తున్నవారిపై లాఠీ ఝులిపించారు. లాడ్జీ గదులను డీసీపీ తనిఖీ చేశారు. అద్దెకు ఉన్నవారిలో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు, రికార్డు సక్రమంగా ఉండాలని, రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు మధుసూదన్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
మంచిర్యాలరూరల్(హాజీపూర్):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు. కానీ, కొడుకు ఈత సరదా తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిల్చింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట దుబ్బపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోగిరి సందీప్(15) ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం సందీప్ తన స్నేహితులైన అభినయ్, అక్షయ్, అశ్విత్, రాంచరణ్తో కలిసి ముల్కల్ల శివారులోని ర్యాలీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లాడు. సాయంత్రం వరకు సందీప్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు ఇంటికి వచ్చినా సందీప్ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వివిధ చోట్ల వెతికారు. చివరకు సందీప్ తండ్రి రాజు హాజీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ఉదయం సందీప్తో ఈతకు వెళ్లిన స్నేహితులను విచారించారు. సందీప్ ర్యాలీ ప్రాజెక్ట్లోని లోతైన నీటిలో ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లు తెలిపారు. భయంతో తాము ఇంటికి వచ్చేశామని వెల్లడించారు. గజ ఈతగాళ్లతో గాలింపు దీంతో పోలీసులు ర్యాలీ ప్రాజెక్టుకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించగా సందీప్ మృతదేహం లభించింది. సందీప్ ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు తెరుచుకోవడానికి వారం ముందు జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
బుస కొడుతున్న సర్పాలు
ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. -
ఆహార భద్రతా నియమాలు పాటించాలి
మంచిర్యాలక్రైం: జిల్లాలోని హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఆహార భద్రత నియమాలు పాటించాలని జిల్లా ఆహార భఽద్రత అధికారి జీ.మహేష్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార ఉత్పత్తులను తయారు చేయకూడదన్నారు. ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్లాస్టి క్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురాము నాయక్, 65 మంది వ్యాపారులు పాల్గొన్నారు. -
సామాన్యులపై పెనుభారం
చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతోంది. రెండు నెలల కాలంలోనే రెండు సార్లు గ్యాస్ ధరలు పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,016లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ పోతే నిరుపేదలు బతకడం కష్టమే. పెంచిన ధరలను తగించాలి. – చిలుముల స్వప్న, గృహిణి, చెన్నూర్ కట్టెలపొయ్యే దిక్కు..చెన్నూర్: కేంద్ర ప్రభుత్వం మాటిమాటికి గ్యాస్ ధరలు పెంచుతూ పోతుంటే కట్టెలపొయ్యే దిక్కయ్యేటట్లు ఉంది. వంట చెరుకు సైతం లభించడం లేదు. ఇలా అయితే పేదలు ఎలా బతికేది. పోయిన నెలలోనే ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచింది. మళ్లీ గ్యాస్ ఽసిలిండర్పై రూ.29 పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. – పాతర్ల నిర్మల, గృహిణి, చెన్నూర్ -
హాజీపూర్లో దారుణ హత్య
● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్లో దారుణ హ త్య కలకలం సృష్టించింది. పో లీసుల కథనం ప్రకారం.. హా జీపూర్కు చెందిన పెద్దనాన్న పూదరి భాస్కర్(65), కుమారుడు పూదరి వినయ్ మధ్య ఇటీవల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివా రం రాత్రి వినయ్ కత్తితో వచ్చి అందరూ చూస్తుండగానే భాస్కర్పై రెండుసార్లు దాడిచేశాడు. తీవ్ర గా యాలైన ఆయన్ను అంబులెన్స్లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు స త్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కా గా, ఈ దాడిలో భాస్కర్ కుమారుడు సత్యనారాయణకు గాయాలయ్యాయి. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ ఘటనస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వినయ్ను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతిజన్నారం: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు..మండలంలోని చింతగూడకు చెందిన గజ్జల భూపతి (31) ఆ దివారం తాను కౌలుకు చేస్తున్న భూమిలో పంటవ్యర్థాలు తొలగించడానికి వెళ్లాడు. అక్కడే బహిర్భూమికని వెళ్లాడు. పక్కనే ఉన్న బావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడి భార్య శ్వేత ప్రస్తుతం నిండుగర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సత్తవ్వ–మల్లేశ్తోపాటు భార్య రోదించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందపడి ఆర్మీజవాన్ ఆత్మహత్యకాగజ్నగర్రూరల్: రైలు కిందపడి ఆర్మీజవాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బురదగూడకు చెందిన కొట్రంగి సురేష్(32) అస్సాంలో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మద్యం తాగుతుండడంతో మానేస్తేనే నీతో అస్సాంకు వస్తానని భార్య తిరుమల చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం తాగాడు. మత్తులో క్షణికావేశంలో కాగజ్నగర్, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య గల పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లు లభించాయి. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
కొత్త వేతన ఒప్పందం ఎప్పుడో!
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా కోలిండియా దాని సబ్సిడరీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు సంబంధించిన కీలకమైన 11వ వేతన ఒప్పందం కాలపరిమితి జూన్ 30, 2026తో ముగుస్తుంది. జూలై 1, 2026 నుంచి 12వ వేజ్బోర్డు అమలు కావాలి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. 1వ వేజ్బోర్డు నుంచి 4వ వేజ్బోర్డు వరకు నాలుగేళ్ల ఒప్పంద కాలపరిమితితో ఒప్పందం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఐదేళ్లకోసారి ఒప్పందం జరుగుతోంది. జూన్ 30 తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేజ్బోర్డు ఏర్పాటు కోసం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నూతన వేజ్బోర్డు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి.. నూతన వేతన ఒప్పందం కోసం జాతీయ సంఘాలు కేంద్రం, కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. గడిచిన రెండు వేజ్బోర్డుల సమయానికి బొగ్గు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ అవసరాల దృష్యా కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు కంటే భిన్నంగా త్వరితగతిన వేజ్బోర్డు ఏర్పాటు, వేతన ఒప్పందానికి సహకరించాయి. ఈ వేతన ఒప్పందాన్ని నేషనల్ కోల్వేజ్ అగ్రిమెంట్(ఎన్సీడబ్ల్యూఏ) అని పిలుస్తారు. ఈసారి అలాంటి వాతావరణం లేకపోవడం, కోలిండియాలో షేర్ల విక్రయాలు, ప్రైవేటు బొగ్గు బ్లాకులు పెరిగి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సమయంలో వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు, ఒప్పందం ఎప్పుడు జరుగుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. జేబీసీసీఐ ఏర్పాటుకు ఒత్తిడి.. ప్రతీ వేతన ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కోలిండియా యజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలతో జాయింట్ బైపార్టియేట్ కన్సల్టేటివ్ కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) పేరుతో కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇస్తారు. దీని ప్రకారం జాతీయ సంఘాలు తమ సభ్యుల పేర్లను అందజేస్తారు. కోలిండియా చైర్మన్ ఈ జేబీసీసీఐకి చైర్మన్గా వ్వవహరిస్తారు. జాతీయ సంఘాల సభ్యుల పేర్లను ఖరారు చేసిన తర్వాత పూర్తి కమిటీ స్వరూపం ఏర్పడి వేతన ఒప్పందం కోసం చర్చలు మొదలవుతాయి. ఈ ప్రక్రియకు ప్రతీసారి జాప్యం జరుగుతుండగా ఈసారి మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపు కోసం కార్మిక సంఘాలు తమ డిమాండ్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే 11వ వేతన ఒప్పందం 23 నెలల ఆలస్యంతో మే 20, 2023న ఒప్పందం జరిగింది. ఇందులో సగటు కార్మికుని బేసిక్ వేతనం రూ.6,973.30 పెంపుదల జరిగింది. ఈసారి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తోడు, యుద్ధాల ప్రభావం కూడా వేతన ఒప్పందాలపై ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో రాజకీయ సుస్థిరతను సాధించుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం తమ ఒత్తిడికి ఏమాత్రం దిగి వస్తుందోనన్న సందేహం కార్మిక సంఘాల నేతల్లో నెలకొంది. -
‘ఆయా’కు ‘ఏడు’పే..!
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 72 ప్రీప్రైమరీ పాఠశాలల్లో బోధకులు, ఆయా పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియెట్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పోస్టుల కోసం ఏడో తరగతి(మెమో తప్పనిసరి) ఉత్తీర్ణులై ఉండాలని ప్రకటించడంతో ఆశావహులు పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 8వ తేదీ తుది గడువు కావడంతో సర్టిఫికెట్ లేకుండా ఎలా దరఖాస్తు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు వెళ్తే రికార్డులు అందుబాటులో లేవనే సమాధానం రావడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో పేర్కొన్న అర్హతలు ఉన్న వారినే తీసుకోవాలని, అంతకంటే అధిక అర్హతలున్నా తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. అధికర అర్హతలు ఉన్నా ఏడో తరగతి సర్టిఫికెట్ ప్రాధాన్యత సంతరించుకుంది. రికార్డులు ఎక్కడున్నాయో..? పాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన రికార్డులు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. మూసివేసిన పాఠశాలలతోపాటు చాలా స్కూళ్లలో రికార్డులు సరైన విధంగా సంరక్షించకపోవడంతో ధ్రువీకరణకు అవసరమైన సర్టిఫి కెట్లు పొందడంలో కష్టాలు పడాల్సి వస్తోంది. మరో వైపు పాఠశాలల్లో కాకుండా 2008కు ముందు ఏడో తరగతికి కామన్ బోర్డు ఎగ్జామ్ ఉండేది. ఉమ్మడి ఆదిలాబాద్ డీసీఈబీ కార్యాలయంలో విద్యార్థుల రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది. ఎంతమేరకు భద్రపర్చారో తెలియదు గానీ అక్కడికి వెళ్లి వెతకడం అనేది ఒకట్రెండు రోజుల్లో పూర్తయ్యే పని కాదు. దీంతో దరఖాస్తు సమయం గడిచిపోతుంది. -
అభివృద్ధి పనులు పూర్తి చేయండి
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో తలపెట్టిన అభివృద్ధి పనులను సత్వరంగా పూర్తి చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణ శివారులో అమృత్ 2.0 గోదారి నీటి పథకం పనులు, రైల్వేస్టేషన్ ఏరియాలోని ఫిల్టర్బెడ్ పనులు, అంబేడ్కర్ రడగంబాల బస్తీలో పురాతన జాతికుంట చెరువు సుందరీకరణ పనులు పరిశీలించారు. జాతికుంట చెరువు శిఖం భూములు దురాక్రమణకు గురి కాకుండా చుట్టూ కందకం తవ్వించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేష్, కౌన్సిలర్ కాంపల్లి రాజం, కాంగ్రెస్ నాయకులు దావ రమేష్బాబు, కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి బెల్లంపల్లి: గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్ రడగంబాల బస్తీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేష్, బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై సీ.హెచ్.కిరణ్కుమార్, కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నో పైరవీ.. నో రెక్వెస్ట్
సాక్షి, ఆదిలాబాద్: ఆదాయం అధికంగా ఉండే శాఖల్లో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ చోటు చేసుకుంటుందంటే అందులో పైరవీలు, రిక్వెస్టూలు సాధారణం. జిల్లాకు వచ్చేందుకు ఆ అధికారి జోరుగా పైరవీ చేస్తున్నారట.. రాష్ట్ర మంత్రిని కలిశారట.. మరో ఆఫీసర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడట.. అందుకోసం రూ.లక్షలు కూడా సమర్పించుకునేందుకు వెనకాడటం లేదట.. అనే చర్చ సాగుతోంది. అయితే ఎకై ్సజ్ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఆ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా బాస్ డిప్యూటీ కమిషనర్(డీసీ), నాలుగు జిల్లాలకు డీపీఈవోలుగా కొత్త అధికారులు త్వరలో రావడం ఖాయమని తేలింది. అయితే ఎవరు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో పోస్ట్ కావాలని పైరవీ చేసుకోలేదని, రిక్వెస్ట్ మాటే లేదనే చర్చ సాగుతోంది. పనిష్మెంటు పైనే కొత్త అధికారులను పైనుంచి పంపుతారని చెప్పుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం ఎకై ్సజ్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియ చోటుచేసుకుంది. సీఐలు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఈఎస్లు, ఏసీలకు ప్రమోషన్ లభించింది. డిప్యూటీ కమిషనర్ వరకు పదోన్నతులు అందాయి. తాజాగా వారికి పోస్టింగ్ కేటాయింపు ప్రక్రియ చోటు చేసుకుంటుంది. పక్కనున్న పలు ఉమ్మడి జిల్లాలకు ఆఫీసర్లుగా వచ్చేందుకు పలువురు పైరవీలు, రిక్వెస్ట్లు చేసుకుంటుండగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పుకుంటున్నారు. ఆ జిల్లాలో ‘పచ్చగడ్డి బాగుంటుందని, ఆ జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎండుగడ్డి మాత్రమేనని’ అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఎవరు సుముఖంగా ఉండరని, ఆ శాఖలోని ఓ ఉద్యోగి పేర్కొనడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగని ఉమ్మడి జిల్లాలో ఆదాయం ఉండదనేది కాదని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి అని బాహాటంగానే చెప్పుకోవడం గమనించదగ్గ విషయం. ఇది పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్(డీసీ)గా రఘురాం ఇన్చార్జి ఆఫీసర్గా కొద్ది నెలలుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ డీసీ కార్యాలయంలో అధికారిగా కొనసాగుతున్న ఆయన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఇన్చార్జి డీసీగా ఉన్నారు. పలువురు డీసీలుగా పదోన్నతులు పొందడంతో తాజా ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలకు బాస్లను నియమించనున్నారని, రఘురాంను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరే అధికారికి పోస్టింగ్ ఇవ్వడం ఖాయమని శాఖలో చర్చ సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు డీపీఈవో(ఎకై ్సజ్ సూపరింటెండెంట్) లుగా హిమశ్రీ, నందగోపాల్, జ్యోతి కిరణ్, రజాక్ కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆ జిల్లాల్లో పనిచేస్తుండడంతో వారి బదిలీలు ఖాయం. వారి స్థానంలో కొత్త ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రానున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏ ఆఫీసర్ కూడా పైరవీ, రిక్వెస్టులు లేవని, అక్కడి నుంచి పంపే వారే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు.కొరవడిన పర్యవేక్షణ.. ఉమ్మడి జిల్లా బాస్ డీసీ ఇన్చార్జిగా కొనసాగుతుండడంతో ఆయన అడపాదడపా వస్తుండడంతో పర్యవేక్షణ కొరవడింది. ఈ కార్యాలయంలోనే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కూడా ఇన్చార్జితోనే నడిపిస్తున్నారు. రెండు కీలకమైన పోస్టుల్లో ఇన్చార్జీలు ఉండడంతో పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇక ఏసీ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్సుల్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇటీవల జిల్లాలో గంజాయి సాగు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గుడుంబా కేసులు కూడా పోలీసులు దాడి చేసి పట్టుకునే పరిస్థితి ఉంది. పర్యవేక్షించే శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో నియంత్రణ కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
● ఎరువు బరువు.. ఇంధన వాత ● రూ.8.50 కోట్లు అదనపు మోత ● పెట్టుబడికి రైతుల బెంబేలు
మంచిర్యాలఅగ్రికల్చర్: వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు పెట్టుబడి భారంగా మారింది. ఇప్పటికే ఇంధన వాతతో విలవిలలాడుతుండగా.. మరోవైపు ఎరువుల ధరలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గత నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధర రూ.8నుంచి రూ.9వరకు పెరిగింది. దీంతో దుక్కి దున్నేందుకు ట్రాక్టర్ల కిరాయి, ఇతర యంత్రాల వినియోగంతో ఇంధన ఆర్థిక భారం మోయాల్సి వస్తోంది. ఖరీఫ్లో అధికంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగు ఉంటుంది. 89,010 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో 3.54 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. యూరియా 28,620 మెట్రిక్టన్నులు, డీఏపీ 13,305, ఎంవోపీ 8,352, ఎస్ఎస్పీ 3,308, ఎన్పీకేఎస్ 35,425 మెట్రిక్టన్నులు మొత్తంగా 89,010 మెట్రిక్టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఇందులో కాంప్లెక్స్ ఎరువులు 46,980 మెట్రిక్ టన్నుల వరకు వినియోగిస్తారు. యూరియా ధర మినహాయించి కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగనున్నాయి. గతంతో పోలిస్తే ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో బస్తాపై రూ.200 నుంచి రూ.500 వరకు పెరగనున్నట్లు జిల్లాలోని ఎరువుల దుకాణదారులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా పెరిగిన ముడిపదార్థాల ధరలు, రవాణా ఇబ్బందులు తలెత్తడం, తరలించే నౌకలు బీమా ప్రీమియం ధరలు భారీగా పెంచాయి. దీంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం పెరగనున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా రైతులపై రూ.6.50 కోట్ల మేర భారం పడనుంది. ప్రధానంగా పంటలకు వినియోగించే 45కిలోల యూరియా రూ.266.50, డీఏపీ బస్తాకు రూ.1,305కు లభిస్తోంది. వీటి ధరలు పెరగకపోవడం రైతులకు కొంత ఊరటనిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ భారం భరిస్తుంది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల ఆర్థిక భారం తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.ఖర్చులు పెరిగితే కష్టమే..ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయిలు పెంచిండ్రు. మరో దిక్కు ఎరువుల ధరలు పెంచితే ఈ వానాకాలం సాగు చేయడం కష్టమే అవుతుంది. పెరిగిన పెట్టుబడులతో పంటలు సాగు చేసి అప్పుల పాలవడం కంటే వదిలేసి కూలీ పని చేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది. – ఆర్.శంకర్, గ్రామం: ఘన్పూర్, మం: నెన్నెల ధరలు తగ్గించాలి..సాగు ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే ఏటికేటా పెరుగుతూనే ఉన్నయి. ప్రకృతి సహకరించక ఆశించిన పంటల దిగుబడులు రావడం లేదు. వచ్చిన పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. అయినా వ్యవసాయాన్నే నమ్ముకోవాల్సి వస్తుంది. ధరలు ఇట్లా పెంచుకుంటే పోతే అప్పులే మిగుల్తయి. ఇంధన, ఎరువుల ధరలు తగ్గించి రైతులను ఆదుకోవాలి. – మోతే రాజన్న, కన్నెపెల్లి -
మహిళల భద్రతకు షీ టీం
లక్సెట్టిపేట: మహిళల భద్రత కోసమే పోలీసు శాఖ షీ టీంను ఏర్పాటు చేసిందని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని ఎల్కే గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకతాయిలు మహిళలు, చిన్నారులను వేధిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి భవిష్యత్ను పాడు చేసుకోవద్దన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి మానసికంగా, శారీరకంగా నష్టపోవద్దని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు అమ్మినా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి, కౌన్సిలర్ రాజలింగయ్య, కమిషనర్ విజయ్కుమార్, తహసీల్దార్ దిలీప్కుమార్, ఎస్సై గోపతి సురేష్, ఏవో శ్రీకాంత్ పాల్గొన్నారు. -
నేరస్తులకు శిక్షపడే విధంగా కృషి చేయాలి
● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాలక్రైం: నేరస్తులకు శిక్ష పడే విధంగా కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో శనివారం కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, లైజనింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, దాడులు, తదితర కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడే విధంగా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి బలమైన సాక్ష్యధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని తెలిపారు. నేరం జరిగిన వెంటనే సంఘటన ప్రభావం తగ్గక ముందే శిక్ష పడితే అది నేరస్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. నేరస్తులకు శిక్ష పడితేనే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వర్టికల్ ఇంచార్జి సీఐ చంద్రశేఖర్గౌడ్, సీసీఆర్బీ సీఐ అనిల్కుమార్, బాబురావు, ఎస్సై వినీత, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు. -
‘బీజేపీ నాయకులను విమర్శించే హక్కు లేదు’
మంచిర్యాలటౌన్: వారసత్వ రాజకీయాలతో పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన గడ్డం వంశీకృష్ణకు బీజేపీ నాయకులను విమర్శించే నైతిక హక్కు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, నగరంలోని రోడ్లపై ఎంపీ ఫొటోను ప్రజలకు చూపిస్తూ ఈయనను ఎప్పుడైనా మంచిర్యాలలో చూశారా, గుర్తు పట్టారా అంటూ అడుగుతూ శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల రైల్వేస్టేషన్ ఎదుట ముసుగేసి ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా తండ్రీకొడుకులు అవమానించారని విమర్శించారు. తాత విగ్రహాన్ని ఆవిష్కరించలేని ఎంపీ వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, జోనల్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్కుమార్, కుర్రె చక్రవర్తి, సత్రం రమేశ్, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, బొట్ల సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు. -
బొమ్మను గీస్తే..
నిర్మల్టౌన్: పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వేసవి సెలవులను సద్వి నియోగం చేసుకుంటున్నారు. పేప ర్, కాన్వాస్పై బొమ్మలు గీయడం, రంగులు అద్దడం, భావాలు, ఆలో చింపజేసే చిత్రకళపై ఆ సక్తి పెంచుకుంటున్నారు. ఇందుకోసం పెయింటింగ్స్ శిక్షణలో చేరి కళాప్రతిభకు పదును పెడుతున్నా రు. చిత్రలేఖనం, స్కెచ్చింగ్, వాటర్ కలర్, అక్రిలిక్ పెయింటింగ్ వంటి విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పెన్సిళ్లు, సిరా, వాటర్ కలర్స్, ఇతర వాటితో జాతీయ నాయకులు, ప్రకృతి అందాలు, జంతువులు, పక్షులు, సామాజిక అంశాలపై చిత్రాలు గీస్తూ ఆకట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలు గుర్తించి ప్రోత్సహిస్తున్నా రు. దీంతో శిక్షణా కేంద్రాలకు ఆదరణ పెరుగుతోంది. ఏకాగ్రత ఉండాలిచిత్రలేఖనం అంటే రంగులతో పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత ఉండాలి. మనసులోని భావాలను కాగితంపై బొమ్మగా మార్చేందుకు ఆలోచించాలి. నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. అప్పుడే ఊహాశక్తిని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆకారాలు, రంగులు, దశ్యాలను గుర్తుంచుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ సమాజ్ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలని మహా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఓఎస్డీ, ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నేత హామ్రాజ్ ఉయికే, సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ జొగ్దండా అన్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 28న నిర్వహించే ఆదివాసీ పర్ధాన్ సమాజ్ సభ నిర్వహణపై శనివారం ఓ హోటల్ నిర్వహించిన సన్నాహాక సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. పర్ధాన్ సమాజ్ తెగకు ప్రభుత్వాలు పథకాలు అందించాలని పేర్కొన్నారు. రాజకీయంగా, ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్యరంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అశోక్ ఉయికే రాష్ట్రాలవారీగా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలు, సంఘాలకతీతంగా నిర్వహించే సభకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రాల్లో సభలు ముగిశాక ఢిల్లీలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆదివాసీ పర్ధాన్ సమాజ్ నాయకులు పాల్గొన్నారు. -
ఏపీఐ రాష్ట్ర చైర్మన్గా రాములు
నిర్మల్ఖిల్లా: అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియ న్స్ ఆఫ్ ఇండియా (ఏ పీఐ) రాష్ట్ర చైర్మన్గా నిర్మల్కు చెందిన ప్ర ముఖ వైద్యుడు డాక్టర్ దామెర రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేర కు ప్రకటించినట్లు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ నవల్చంద్ర తెలిపారు. నాలుగు దశాబ్దాలకుపైగా వైద్యవృత్తిలో సేవలందిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లా నుంచి తొలి ఏపీఐ రాష్ట్ర చైర్మన్గా ఎంపికయ్యారు. అసోసియేష న్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతానని దామెర రాములు తెలిపారు. ఈయన వైద్యవృత్తితోపాటు సాహితీరంగంలో తనదైన శైలిలో ప్రజలను జాగృతం చేస్తుండటం విశేషం. -
స్పందనకు అండగా కదిలారు..
శ్రీరాంపూర్: ‘అయ్యో బిడ్డా.. వచ్చేదెట్లా’ శీర్షిక న ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాని కి పలువురు మానవతావాదులు స్పందించా రు. నస్పూర్ షిర్కే కాలనీకి చెందిన వ్యాన్ డ్రైవ ర్ లగిశెట్టి శ్రీనివాస్, సునిత దంపతుల కూ తురు స్పందన అమెరికాలోని చికాగోలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతుండడం, గత నెల 31న కాలేజీకి వెళ్లి వస్తూ మెట్రోస్టేషన్లో మెట్లపై నుంచి పడి గాయపడడం తెలిసిందే. అపస్మారక స్థితిలో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అక్కడ కూతురు ఎలా ఉందో, ఎలాంటి వైద్యం అందుతుందోనని తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అ క్కడికి వెళ్లడానికి ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రమే కావడం, పాస్పోర్టు, వీసా కూడా లేకపోవడం ‘సాక్షి’ కథనంలో ప్రస్తావించింది. ఈ కథనాన్ని పలువురు వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశా రు. ఇక్క డి నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగా లు చేస్తున్న వారు, చదువుతున్న వారు ‘సాక్షి’ కథనం ద్వారా కుటుంబ వివరాలు, ఫోన్నంబ ర్లు, ఆస్పత్రి వివరాలు తెలుసుకున్నారు. ఒక బృందంగా ఏర్పడి ఫండ్ సేకరణ మొదలు పె ట్టారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్సకు సుమారు రూ.3కోట్లు ఖర్చవుతాయని తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొంత డబ్బు సమకూరగా.. మరికొంత మంది దాతలు ముందుకు వస్తే స్పందన పూర్తి వైద్యానికి భరోసా ఉంటుందని ఎదురుచూస్తున్నారు. అమెరికా పంపడానికి ఏర్పాట్లు..స్పందన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోగా శుక్రవారం పాస్పోర్టు వచ్చింది. శనివారం స్పందన తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్లో మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్రావును కలిసి తన సమస్యను విన్నవించారు. దీంతో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో వారికి వీసా ఇప్పించి అమెరికా పంపించే ఏర్పాట్లు చేస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. మాయలేడీలపై కేసు నమోదుమంచిర్యాలటౌన్: ‘మంచిర్యాలలో మాయలేడీలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంచిర్యాల పోలీసులు స్పందించా రు. రుణాల పేరిట పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలపై శనివా రం కేసు నమోదు చేశా రు. మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఇక్బాల్ అహ్మద్నగర్కు చెంది న బద్రూన్నిసా, గోపాల్వాడకు చెందిన అరవ సుబ్బలక్ష్మి కలిసి ఈ ఏడాది జనవరి నుంచి కొందరు మహిళలకు రూ.5 లక్షలు లోన్ ఇప్పిస్తామని నమ్మించారు. అందుకోసం కొంత డబ్బు ఖర్చవుతుందని సుమారు పది మంది మహిళల నుంచి దాదాపు రూ.3లక్షలు వసూలు చేశారు. రుణం ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. బాధితులు డ బ్బుల విషయమై ప్రశ్నించగా బెదిరించారు. దీంతో షేక్ రిజ్వానా, బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎఫెక్ట్ -
ఆహార భద్రత.. అందరి బాధ్యత
నిర్మల్ఖిల్లా: ఆహారం ఆరోగ్యానికి మూలాధారం. కానీ ప్రస్తుతం మార్కెట్లో పాల నుంచి భోజనం, ఆహార పదార్థాలు, తినుబండారాల వరకు కల్తీ బారిన పడుతున్నాయి. ఆకర్షణీయంగా కృత్రిమ రంగులు, రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే చిప్స్లు, స్వీట్లు, ఐస్క్రీములు, బేకరీ ఉత్పత్తులు, శీతల పానీయాల్లో ఈ కల్తీ ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. జూన్ 7న నిర్వహించే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ‘సురక్షిత ఆహారం ప్రతీ ఒక్కరి హక్కు’అనే సందేశాన్ని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. గత ఘటనలు కలకలంతనిఖీలు ముమ్మరం చేస్తేనే.. జిల్లాలో ఆహారభద్రత అధికారుల తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, వీధి వ్యాపారుల వద్ద విక్రయించే ఆహార పదార్థాల నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. -
సహజీవనం చేసి..అనుమానంతో కడతేర్చి!
కాసిపేట: మహిళతో తోడుగా ఉంటానని మాటిచ్చి సహజీవనం చేస్తూ, ఆపై అనుమానంతో ఆమెను కడతేర్చాడు. మండలంలోని మల్కెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మందమర్రి మండలం బుర్రగూడంకు చెందిన దుర్గం లక్ష్మి (40)ని భర్త రెండేళ్ల క్రితం వదిలివెళ్లాడు. తన ఐదుగురు పిల్లలతో ఉంటూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. ఈక్రమంలో కూలీ పనిచేసుకుంటున్న సమయంలో కాసిపేట మండలానికి చెందిన పడిగల సంతోష్తో ఆరునెలల క్రితం లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని మల్కెపల్లిలో సహజీవనం చేస్తున్నారు. లక్ష్మి కూలీ పనిచేసే చోట వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందని సంతోష్ అనుమానించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. కోపాద్రికుడైన సంతోష్ ఆమెను కర్రతో కొట్టగా రక్తపు గాయాలతో పడిపోయి ఉంది. వెంటనే ఆమెను కాసిపేట పీహెచ్సీకి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలిపై గాయాలు ఉండడం చూసి అనుమానం వ్యక్తం చేస్తూ దేవాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్కెపల్లికి పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు. లక్ష్మి, సంతోష్ మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెప్పారు. కర్రతో కొట్టి అక్కడే ఉన్న ఏదో పదునైన ఇనుప వస్తువుతో పొడిచి చంపి యాక్సిడెంట్గా నమ్మించడానికి ఆస్పత్రికి తరలించినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతురాలి కుమారుడు దుర్గం రాజబాను ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు. తల్లి మృతితో ఐదుగురు పిల్లలు అనాథలుగా మిగిలారు. -
చిరుతదాడిలో లేగదూడ మృతి
తానూరు: మండలంలోని మోగ్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచా రంతో స్థానికులు బెంబేలెత్తుతున్నా రు. మోగ్లి గ్రామానికి చెందిన రైతు పోతన్న శుక్రవా రం ఆవులను మేపి పొలంలో కట్టేసి రాత్రికి ఇంటికి వెళ్లాడు. శనివారం రైతు పొలానికి వెళ్లగా లేగదూడ కనిపించలేదు. సమీపంలో వెతకగా మృతిచెంది ఉంది. అక్కడ చిరుత పాదముద్రలు కనిపించడంతో వెంటనే అటవీ అధి కారులకు సమాచారం అందించారు. సెక్షన్ అధికారి రవికమార్, సిబ్బంది శివ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత దాడిలో లేగదూడ మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేన్లకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. -
వన మహోత్సవానికి సన్నద్ధం
పాతమంచిర్యాల: జిల్లాలో మూడో విడత వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోని 306 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాల ఎంపిక, గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపుల, పొలం గట్లు, చెరువు గట్లు, బంజరు భూములు, వైకుంఠధామాలు, ఇళ్ల ఆవరణలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. పూలమొక్కలు గులాబీ, మల్లెలు గుల్మోహర్, మందార, తులసితోపాటు పండ్లజాతులు జామ, అల్లనేరేడు, దాని మ్మ, మునగ, చింత, ఖర్జూరా, వృక్షజాతులు టేకు, వేప, కానుగ, అల్లనేరేడు, ఈత, తాటి మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం స్థలాలు ఎంపిక చేయాలని ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. స్థలాలు ఎంపికై న తర్వాత ఉపాధి హామీ పథకం కూలీలతో గుంతలు తీయిస్తారు. జూన్ రెండో వారంలో మొక్కలు నాటుతారు. ప్రభుత్వ శాఖలు, మండలాలు, పంచాయతీల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించారు. శాఖల వారీగా.. అటవీ శాఖ 5.45 లక్షలు, డీఆర్డీఏ 20.5లక్షలు, మున్సిపాల్టీలు 8.4 లక్షలు, సింగరేణి 5.7లక్షలు, పరిశ్రమల శాఖ 95 వేలు, అగ్రికల్చర్ 11000, పోలీస్ శాఖ 10 వేలు మొత్తం 41.11లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. మండలాల వారీగా.. బెల్లంపల్లి మండలంలో 1,13,900, భీమారంలో 73,700, భీమినిలో 80,400, చెన్నూర్లో 2,01,000, దండేపల్లిలో 2,07,700, హాజీపూర్లో 80,400, జైపూర్లో 1,34,000, జన్నారంలో 1,94,300, కన్నెపల్లిలో 1,00,500, కాసిపేటలో 1,47,400, కోటపల్లిలో 2,07,700, లక్షెట్టిపేటలో 1,20,600, మందమర్రిలో 67,000, నెన్నెలలో 1,27,300, తాండూర్లో 1,00,500, వేమనపల్లిలో 94,500 మొత్తంగా 20,50,200 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వన మహోత్సవంలో ఈత, తాటివనాల పెంపునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
మంచిర్యాలలో ఆరు వరుసల రోడ్డు ఎందుకు?
మంచిర్యాలటౌన్: జాతీయ రహదారులకే లేని విధంగా మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్ నుంచి రాళ్లవాగు మీదుగా రంగంపేట్ వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణం ఎందుకని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రశ్నించారు. శుక్రవారం రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానంగా మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని గోదావరి నదిపై నిర్మించేందుకు తాను అనుమతి తీసుకొస్తే స్వార్థం కోసం రద్దు చేయించిన ఘనత మంచిర్యాల ఎమ్మెల్యేదని విమర్శించారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం రూ.160 కోట్లతో పనులు ప్రారంభించగా, రూ.35 కోట్లతో ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు మంజూరు చేయించి నిధులు విడుదల చేయిస్తే ఆ రెండింటిని రద్దు చేయించి రాళ్లవాగు కాజ్వే ఉన్న చోట ఆరు వరుసల బ్రిడ్జిని నిర్మించాలని చూస్తున్నారని అన్నారు. గతంలోనే రూ.13.50 కోట్లతో రాళ్లవాగుపై బ్రిడ్జి తాను మంజూరు చేయించి, శంకుస్థాపన చేశానని అన్నారు. ఆర్మూర్, మంచిర్యాల జాతీయ రహదారి నాలుగు వరుసల రోడ్డు కాగా, మంచిర్యాల నగరంలో ఆరు వరుసల రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. రంగంపేట్ వైపున 24 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కొన్నారని, విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారని, అందుకోసమే రోడ్డు నిర్మించుకునేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
లక్సెట్టిపేట: ఫెర్టిలైజర్ దుకాణాదారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేసిన రైతులకు రశీదు ఇవ్వాలని, స్టాక్ బోర్డు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. యూరియా బుకింగ్ యాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఏడీఏ కృష్ణ, తహసీల్దార్ దిలీప్కుమార్, ఏవో శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
డీఈవో లలిత బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారిగా లలిత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో యాదయ్య బదిలీపై హైదరాబాద్కు వెళ్లడంతో ఆమెకు అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉపాధ్యాయల సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి మంచిర్యాలఅర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఈవో లలిత సూచించారు. శుక్రవారం 20206–27 విద్య సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాల్లో గుడిరేవుకు చెందిన విద్యార్థిని బొమ్మన ఆద్విక చక్కని ప్రతిభ కనబరిచి ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు ఎంపికై ంది. విద్యార్థినిని డీఈవో అభినందించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు భరత్, విజయలక్ష్మీ, సత్తయ్య, కృష్ణమూర్తి, రాజ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చన్న పాల్గొన్నారు. -
నో బ్యాగ్ డే అమలుపై శ్రద్ధ ఏది..?
దోపిడీని అరికట్టాలిప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు తుంగలో తొక్కి పుస్తకాల విక్రయాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. పాఠశాల లోపల, బయట వర్క్బుక్స్, టై, బెల్ట్ షూ, పాఠ్యపుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పోరాటాలు సాగిస్తుండగా ప్రైవేట్లో పుస్తకాల దోపిడీ ఎక్కువైంది. అధికారులు తనిఖీలు చేపట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శినియంత్రణ చర్యలేవి..ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అక్కరలేని పుస్తకాలు, అధిక ఫీజులకు పాల్పడుతున్నా నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి. పుస్తకాల పేరిట రెట్టింపు దోపిడీ చేస్తున్నారు. పుస్తకాల బరువుతో బాల్యంపై మోయలేని భారం పడుతోంది. ఆరోగ్యమైన సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. లాభార్జనే ధేయంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. – అజయ్, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలల్లో ఇటు పుస్తకాలు.. అటు ధరల మోత ఏటేటా పెరిగిపోతోంది. టెక్ట్స్బుక్స్ కంటే వర్క్బుక్స్ పేరిట అధిక ధరల వసూలుతో తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారుతోంది. ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో స్పెషల్ మెటీరియల్ పేర్లతో కొత్త దారులు వెతుకుతూ ఆర్థికభారం మోపడం ఆందోళన కలిగిస్తోంది. టెక్నో, సీబీఎస్ఈ, ఐబీఎస్ఈ, ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరిట స్కూళ్ల ఫీజు భారం పెరిగిపోతోంది. పాఠశాల, ల్యాబ్, లైబ్రరీ ఇతర ఫీజులన్నీ కలిపి ట్యూషన్ ఫీజు, యూనిఫామ్, బస్సులు ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. పుస్తకాల బరువు పెరిగి విద్యార్థుల భుజాలు లాగేయడం, హోంవర్క్ ఒత్తిడి పెరిగిపోతోంది. జిల్లాలో.. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 234, సీబీఎస్ఈ పాఠశాలలు మూడు ఉండగా.. ఒక్క మంచిర్యాలలోనే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 53 ఉన్నాయి. వీటిల్లో 70,273 మంది చదువుతున్నారు. ఆయా పాఠశాలల చివరన ఏదో ఒక టెక్నో, సీబీఎస్ఈ, ఐఐటీ, నీట్ సిలబస్ అంటూ తగిలించి పుస్తకాలు అంటగడుతున్నారు. ఇంటి, పాఠశాల పని, రాత పుస్తకాలు, డ్రాయింగ్, జనరల్ నాలెడ్జి, ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్టడీ మెటీరియల్ కొనాలని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. మోయలేని బరువు 1, 2వ తరగతి విద్యార్థులు 2కిలోలు, 3నుంచి 5వ తరగతులకు 2నుంచి 3కిలోలు, 6నుంచి 7వ తరగతులు 4కిలోల వరకు, 8నుంచి 9వ తరగతులు 4నుంచి ఐదు కిలోలు, 10వ తరగతి ఐదు కిలోల వరకు పుస్తకాల బరువు మోయాల్సి వస్తోంది. సాధారణ విద్యార్థి శరీర బరువు కంటే 10శాతం ఎక్కువ కాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతకుమించితే చిన్నారుల్లో వెన్ను, భుజాల నొప్పి, శరీర ఆకృతి సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. ప్రైవేట్లో వర్క్బుక్స్ ఒక్కొక్కటి దాదాపు కిలో వరకు ఉంటుందని తెలుస్తోంది. పదో తరగతికి ఇలాంటి పుస్తకాలు 7వరకు ఉన్నాయి. పుస్తకాల దుకాణాలు ప్రైవేటు పాఠశాలల ఎదుటే షట్టర్లు తీసుకుని ప్రత్యేక దుకాణాల్లో టెక్ట్స్, వర్క్బుక్స్, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. అన్నీ అక్కడే కొనాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం పాఠ్యపుస్తకాల విక్రయానికి డీఈవో అనుమతి అవసరం. కానీ 12బుక్స్షాపులు మాత్రమే అనుమతి తీసుకోగా.. చాలాచోట్ల పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిగా విక్రయిస్తున్నారు. ట్రేడ్లైసెన్స్, జీఎస్టీ ఎగవేస్తున్నారు. ఫీజుల నియంత్రణపై సాగదీత.. ప్రైవేటు విద్యాసంస్థల్లో ట్యూషన్ఫీజుల నియంత్రణ సాగదీతగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు చైర్మన్గా కమిటీని నియమించింది. నివేదిక బహిర్గతం కాకపోయినా ఆ తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 10శాతం వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లినా ఎటూ తేల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ విద్యాకమిషన్ కమిషనర్ ఆకునూరి మురళి చట్టబద్ధ ఫీజులపై ప్రభుత్వానికి నివేదించడంతో అంతటా చర్చ జరుగుతోంది. ఫీజులుంకు ఎప్పుడు కళ్లెం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.ప్రభత్వ పాఠ్యపుస్తకాల ధర(రూ.లలో)ప్రైవేటు వర్క్బుక్స్ ధర(రూ.లలో)తగ్గిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు 17శాతం మేర తగ్గాయి. పబ్లిషర్ల పోటీతోనే గతేడాది కంటే తక్కువ ధరకే పుస్తకాల ముద్రణకు ముందుకొచ్చారు. గత ఏడాది పదో తరగతి పాఠ్య పుస్తకాల ధర రూ.1078 ఉండగా ఈసారి రూ.900కు తగ్గింది. విద్యార్థులపై పాత ధరల కంటే దాదాపు 40శాతం తక్కువ భారం పడుతోంది. ప్రైవేటులో వర్క్బుక్స్ల పేరిట మూడు రేట్ల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు ఉన్న పుస్తకాల బ్యాగులు మోయడం వల్ల విద్యార్థుల్లో వెన్ను, భుజంనొప్పి, మెడ నరాలపై ప్రభావం చూపే వీలుంది. ఈ నేపథ్యంలో నాలుగో శనివారం విద్యార్థులు సంచి లేకుండా పాఠశాలకు రావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిలో 10 రోజులు ఇలా హాజరు కావాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. -
భూముల ధరలకు రెక్కలు
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని 18 మండలాల్లో భూముల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో అత్యల్పంగా చదరపు గజానికి రూ.500 ఉన్న తాండూరు, భీమిని, కన్నెపల్లి మండలాల్లో ధరను రూ.700కు పెంచారు. మిగతా మండలాల్లోని గ్రామాల్లో రూ.700కు గజం ఉండగా, రూ.900కు పెరిగింది. అత్యధికంగా జిల్లా కేంద్రం మంచిర్యాల మార్కెట్ రోడ్డులో రూ.15,900 ఉండగా.. చదరపు గజం ధర రూ.23,900కు పెంచారు. అపార్టుమెంట్లలో చదరపు అడుగు ధర గతంలో రూ.1,600 ఉండగా, ప్రస్తుతం దానిని రూ.1,800కు చేరింది. అపార్టుమెంట్లలో కమర్షియల్ భవనానికి, హైటెక్సిటీ కాలనీల్లోని అపార్టుమెంట్లకు చదరపు అడుగు స్థలం రూ.2,500 నుంచి రూ.2,700కు పెంచారు. గ్రామాల్లో తక్కువ.. నగరంలో ఎక్కువ భూముల ధరలు గ్రామాల్లో తక్కువగా, పట్టణాల్లో ఎక్కువగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ధరలు చదరపు గజానికి రూ.200 అదనంగా పెరగ్గా, పట్టణ ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను విలీనం చేసి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయగా, ఇందులో హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేశారు. దీంతో ఆయా విలీన గ్రామాల్లోని భూముల ధరలు భారీగా పెరిగాయి. నస్పూరులో గతంలో గజానికి రూ.1,300 ఉండగా, రూ.2 వేలకు, నగరంలోని రాజీవ్నగర్, దొరగారిపల్లె, తిలక్నగర్ ప్రాంతాల్లో గతంలో గజానికి రూ.2,400 ఉండగా ప్రస్తుతం రూ.3,600కు పెంచారు. విలీన గ్రామాలు వేంపల్లి, ముల్కల్ల, నర్సింగాపూర్, గుడిపేట్లలో గజానికి రూ.700 ఉండగా, ప్రస్తుతం రూ.1,500కు పెరిగింది. బెల్లంపల్లి, క్యాతన్పల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట పట్టణ ప్రాంతాల్లోనూ గజానికి రూ.600 వరకు అదనంగా పెంచారు. -
మొక్కలు నాటిన జిల్లా జడ్జి వీరయ్య
మంచిర్యాలక్రైం: స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని మనగడకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతీ ఇంట్లో రెండు మొక్కలు ఉండేలా చూడాలని తెలిపారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కే.నిరోషా, క్రిష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ఎండీ.సందాని, రాములు, రామ్రెడ్డి, మల్లారెడ్డి, తిరుపతి, కోర్టు ఏఓ సూర్యకాంత్, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు. -
తుది దశకు కొనుగోళ్లు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నాయి. వర్షాలు పడే అవకాశం ఉండడంతో గత వారం రోజులుగా అధికారులు ధాన్యం సేకరణ వేగంగా చేయిస్తున్నారు. జన్నారం, దండేపల్లి మండలాల్లో పూర్తి కాగా, లక్షెట్టిపేట మండలంలో ఒక కేంద్రంలో పూర్తి కావాల్సి ఉంది. ఇంకా చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని పలు కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో వానలు పడితే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండడంతో కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి లారీలను వడ్లు ఉన్న చోట్లకు తరలిస్తున్నారు. కేంద్రాల్లోనే కాంటా వేసి బస్తాల్లో ధాన్యంతో నింపి ఉండగా, రవాణా చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 1,69,544మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా సుమారు మూడు వందల లారీల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. ఈ నెల 7వరకు సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక వేళ రవాణాలో జాప్యం జరిగితే మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ధాన్యం లేని చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తున్నారు. మొత్తం 334 కేంద్రాలకు గాను 216 కేంద్రాలు మూసి వేశారు. వానలతో హైరానా గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులతో కేంద్రాల్లో కాంటా వేసి ఉన్న బస్తాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరికోతలు ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల సేకరణ జరుగుతోంది. పగలు ఎండ, రాత్రివేళ మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడాల్సి వస్తోంది. గత నెలలో వడ్లు తడిసిపోకుండా కాపాడుకునేందుకు వెళ్లి ముగ్గురు రైతులు ఈదురుగాలులకు గోడ కూలి చనిపోవడం తెలిసిందే. మరోవైపు నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉండడంతో అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచే కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో సరిపడా మిల్లులకు ట్యాగింగ్ లేక ధాన్యం రవాణా జరగలేదు. తర్వాత రాష్ట్ర గిడ్డంగుల గోదాంలు, ప్రైవేటు గోదాంలు, రైస్మిల్లుల ఆవరణలోనూ నిల్వ చేసుకునేలా ఆదేశాలు రావడంతో ఆ మేరకు వడ్లను తరలించి భద్రపరుస్తున్నారు. ఇవేకాక పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు సైతం ధాన్యాన్ని తరలించేందుకు అనుమతులు రావడంతో నిల్వలకు ఇబ్బంది లేకుండా పోయింది. రైతులు ఆందోళన చెందవద్దురైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ధాన్యం ఉన్న చోట్ల ఎక్కువ లారీలు తీసుకొచ్చి వేగంగా రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశాం. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకవేళ అధిక వర్షంతో ధాన్యం తడిసినా బాయిల్డ్ మిల్లులకు తరలిస్తాం. – వి.రాములు, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) -
మత్తు నుంచి యువతను కాపాడుదాం
మంచిర్యాలక్రైం: యువత గంజాయి మత్తుకు అలవాటు పడి అందమైన జీవితాలను నాశనం చేసుకోకుండా కాపాడుదామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయికి బానిసైన వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. యువతలో వింత ప్రవర్తన కనిపిస్తే డయల్ 100, స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీలు ప్రకాష్, కిరణ్కుమార్, వెంకటేశ్వర్లు, సీఐ ప్రమెద్రావు, డీ అడిక్షన్ సెంటర్ వైద్యులు రామునాయక్ పాల్గొన్నారు. నేరస్తులకు స్ట్రాంగ్ పోలీసింగే.. మంచిర్యాలక్రైం: నేరస్తుల పట్ల నో ఫ్రెండ్లీ పోలీస్.. ఇకపై అంత స్ట్రాంగ్ పోలీసింగే అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కార్యాలయం ఆవరణ, పరిసర ప్రాంతాలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్యను జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన ప్రత్యేక చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు. -
ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి ప్రథమ స్థానం
రామకృష్ణాపూర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవార్డుల ఎంపికలో రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ రంగ ఆసుపత్రుల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. హెల్త్ కేర్సేవల నాణ్యత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, ఆసుపత్రి పరిసరాల అభివృద్ధిలో చూపిన విశిష్ట పనితీరుకు ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన వైద్యసేవలకు కృషి చేస్తున్న ఆసుపత్రి సిబ్బందిని మధుకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం
కోటపల్లి: ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని కోట పల్లి సీఐ కృష్ణ అన్నారు. మండలంలోని శంకరా పూర్ గ్రామంలో శుక్రవారం కోటపల్లి పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతీ ఇంటిని తనిఖీ చేసి 2లీటర్ల గుడుంబాతోపాటు సరైన పత్రాలు లేని 30వాహనాలు సీజ్ చేశారు. సీఐ కృష్ణ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులకు లేదా 100డయల్కు స మాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ జగన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి కట్టడికి కృషి
● డీసీపీ బాస్కర్ కాసిపేట: గంజాయి వినియోగం, క్రయవిక్రయాల కట్టడికి కృషి చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాసిపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, కేసుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు అదుపులోనే ఉన్నాయని, జాతీయ రహదారి, దేవాపూర్ కంపెనీ, కాసిపేట గనులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నివారణకు పోలీస్శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని అన్నారు. డివిజన్ స్థాయిలో గంజాయి నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, 150మంది అనుమానితులను గుర్తించామని తెలిపారు. గ్రామ పోలీస్ అధికారులను నియమించి వారానికి రెండుసార్లు గ్రామాల్లో పర్యటిస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, మందమర్రి సీఐ పర్స రమేష్, కాసిపేట ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ శాఖలో ఇద్దరికి పదోన్నతి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి జిల్లాలోని ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్గా పదోన్నతి లభించింది. శుక్రవారం ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కొమ్రేవార్ అరుణ్కుమార్ను నిజామాబాద్ జిల్లాకు కేటాయించారు. మంచిర్యాలలో పనిచేస్తున్న తిరుపతికి అక్కడే సూపరింటెండెంట్గా పదోన్నతి లభించింది. కాగా టీఎన్జీఓ సంఘ భవనంలో అరుణ్కుమార్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నవిన్ కుమార్, రాజేశ్వర్, నితిన్కుమార్, సోహెల్ మిర్జా, ప్రసాద్, నర్సిములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖరాకే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి అవార్డు
ఇచ్చోడ: మండలంలోని ముఖరా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి శుక్రవారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా అవార్డు ప్రదానం చేశారు. గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం, అవెన్యూప్లాంటేషన్, హరితవనం, బృహత్ పార్కులలో మొక్కలు నా టడడం, ప్రతీ మొక్కను కాపాడి, డిజిటల్ ట్రీ ఆధార్ గుర్తింపు తేవడంతో అవార్డు అందుకున్నట్లు ఆమె తెలిపారు. ఎస్పీ అఖిల్మహాజన్, డీఎఫ్వో ప్రశాంత్బాజీరావు పాటిల్ ఉన్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. మంచి రోజు కావడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1,019మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. వివిధ అర్జిత సేవల ద్వారా రూ.10,99,600 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. – బాసర -
అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికులు
ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలకేంద్రానికి చెందిన జిల్లా జీవ వైవిధ్య కోఆర్డినేటర్ సోన్కాంబ్లే గోపినాథ్, కేస్లాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్లు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అడవుల సంరక్షణకు కృషి చేయడంతో పాటు జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకు గుర్తింపు వచ్చిందని జిల్లా జీవ వైవిధ్య కోఆర్డినేటర్ సోన్కాంబ్లే గోపినాథ్ తెలిపారు. నాగోబా ఆలయ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్ల రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసినందుకు అవార్డు వచ్చినట్లు కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారం తెలిపారు. -
ఇందిరమ్మ ఇంటి కోసం ట్యాంకెక్కి నిరసన
జన్నారం: జన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా తొలగించారని ఆరోపిస్తూ కట్టెకోల రాము శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని నీళ్ల ట్యాంకెక్కి నిరసన వ్యక్తం చేశాడు. హామీ ఇవ్వకుంటే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మిరా నందునాయక్, సర్పంచ్ కళావతి, పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సముదాయించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని హామీనివ్వడంతో కిందికి దిగాడు. ఇందిరమ్మ ఇల్లు, డ్రైనేజీల నిర్మాణం, పింఛన్పై డిమాండ్ చేశాడు. సర్పంచ్ కళావతి ఇల్లు మంజూరుతోపాటు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తానని, పింఛన్ గురించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
మంచిర్యాలలో మాయలేడీలు..!
మంచిర్యాలక్రైం: మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రుణాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు మహిళల ముఠా వసూళ్లకు పాల్పడుతోంది. ఎక్కువ రు ణం కావాలన్నా.. ఇంకా ఎవరికై నా ఇప్పించాలన్నా అధికారులతో అర్ధరాత్రి వేళ వీడియో కాల్స్ మాట్లాడాలంటూ ఒత్తిడి తెస్తోంది. ఐడీ కార్డులు చూపించి నమ్మబలుకడంతో కొందరు మహిళలు మోసపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల రుణాలు ఇప్పించకపోవడంతో మంచిర్యాలలో మహిళలు నిలదీయగా గొడవ జరిగింది. ఈ విషయమై బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. రుణాల పేరిట వసూళ్లు జిల్లా కేంద్రం మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమకు పరిచయం ఉన్న మహిళలకు నటరాజ్ అనే ఓ సంస్థ పేరుతో ఐడీ కార్డులు చూపిస్తూ రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి డబ్బులు సైతం వచ్చాయంటూ నోట్ల కట్టల ఫొటోలు చూపిస్తూ మోసాలకు తెరతీశారు. వారి మాటలు నమ్మిన జిల్లా కేంద్రంలోని 40 మందికి పైగా మహిళల నుంచి రూ.10 వేలు, మరికొందరు వద్ద 50 వేల చొప్పున వసూలు చేశారు. ముందు కంపెనీ పేరిట ఐడీ కార్డు ఇచ్చేందుకు రూ.3వేలు వసూలు చేశారు. జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో 200 మంది వద్ద వసూళ్లు చేసినట్లు సమాచారం. సదరు మాయలేడీలు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా రుణాలు ఇప్పించకపోవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎక్బాల్ హైమద్నగర్లో బాధిత మహిళలు తిరగబడ్డారు. మాయలేడీలు, మహిళల మధ్య గొడవ జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీడియో కాల్స్ బాధితులకు రుణం ఎక్కువ కావాలన్నా, ఇంకెవరికై నా ఇప్పించాలన్న మాయలేడీలు బ్యాంకు అధికారులుగా చెబుతున్న వారితో సన్నిహితంగా ఉండాలని, త్వరగా రుణం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. రుణం కావాలంటే వీడియో కాల్స్ మాట్లాడాలని వేధింపులకు గురి చేశారు. రుణం కావాలంటే చెప్పినట్టు చేయాలని లేదంటే కట్టిన డబ్బులు అటే పోతాయని బెదిరించినట్లు తెలిసింది. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ఫోన్ వీడియో కాల్స్ మాట్లాడే ఆ బ్యాంకు అధికారులు ఎవరనేది పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
మందమర్రిరూరల్: కారులో తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై నరేశ్తో కలిసి సీఐ రమేశ్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. తమకందిన పక్కాసమాచారంతో మందమర్రి పోలీస్స్టేషన్ పరిధి రామన్కాలనీ సమీపంలో వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. శ్రీపతినగర్కు చెందిన మహ్మద్ సాహెబ్జానీ, మహ్మద్ అఫ్రోజ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. భైంసాకు చెందిన అబ్దుల్ రజాక్ వద్ద పత్తి విత్తనాలు కేజీ రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి స్థానికంగా రూ.2500 కేజీ చొప్పున అమ్మడానికి సిద్ధపడ్డారు. కారుతోపాటు విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల గుట్టును రట్టు చేసిన ఎస్సైతోపాటు సిబ్బందిని సీఐ రమేశ్ అభినందించారు. -
సైబర్ వలలో రిటైర్డ్ ఆర్మీ
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ పిట్ల నవీన్ కుమార్ సైబర్ వలలో చిక్కుకున్నాడు. ఏప్రిల్ 27న తన మొబైల్ ఫోన్కు లింక్ రాగా, దానిని ఓపెన్ చేశాడు. నా లుగు సార్లు అకౌంట్లో ఉన్న డబ్బులు రూ.35వేలు, రూ.15వేలు, రూ.40వేలు, రూ.9వేలు మొత్తం రూ.99వేలు కోల్పోయాడు. దీంతో మరుసటి రోజు బాధితుడు సైబర్సెల్కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. పీజీఈసెట్లో సత్తాచాటిన సాయిప్రీతమ్మంచిర్యాలఅర్బన్: తెలంగాణ పీజీఈసెట్లో శుక్రవారం జెఎన్టీయూ విడుదల చేసిన ఫలితాల్లో మంచిర్యాలకు చెందిన అయిత సాయిప్రీతమ్ సత్తాచాటాడు. 90శాతం మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సాయిప్రీతమ్ స్థానిక కార్మెల్లో పదో తరగతి, అల్ఫోర్స్లో ఇంటర్మీడియెట్, హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి కళాశాలలో ఇన్స్ట్రుమెంటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చాటాడు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంమంచిర్యాలఅర్బన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షలకు 78 మందికి గాను 49 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ మల్లేశం సందర్శించారు. మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగిందని డీఈవో ఎల్.లలిత తెలిపారు. నేర పరిశోధనపై శిక్షణ అవసరం మంచిర్యాలక్రైం: నేర పరిశోధనలో పోలీస్ అఽధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బందికి సాంకేతికతపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు నమోదు చేసిన తర్వాత వాటి దర్యాప్తులో నైపుణ్యతను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేర పరిశోధన లక్ష్యంగా టెక్టీమ్, వర్టికల్ ఆంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్టికల్ ఇన్చార్జి సీఐ చంద్రశేఖర్గౌడ్, సీఐలు రంజిత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సర్కారు బడికి సర్పంచ్ కొడుకు
తానూరు: మండలంలోని ఎల్వి గ్రామ సర్పంచ్ ఇర్వంత్ తన కుమారుడిని సర్కారు బడిలో చేర్పించారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుండడంతో ప్రజలకు నమ్మకం కలిగించేందుకు తన కుమారుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యా బోధన ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బడిబాటలో భాగంగా తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను ప్రభత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయులు సుధాకర్, శంకర్, శివకుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
సంతానం లేదని ఆత్మహత్య
కడెం: సంతానం కలగలేదని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ పట్టణానికి చెందిన మండ శ్రీనివాస్ (40)కు వివాహమై పదేళ్లైనా సంతానం కలుగలేదు. దీంతో మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 4న కడెం ప్రాజెక్ట్ వద్ద గల మిషన్ భగీరథ ఇంటెక్వెల్ వద్ద నీళ్లలో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సర్పంచ్ దీకొండ విజయ్, ఉప సర్పంచ్ రాజు యువకుల సహాయంతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని బయటకు తీయించారు. శ్రీనివాస్ లక్ష్మణచాంద మండలంలోని పార్పెల్లి సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్యకుంటాల: మండలంలోని మెదన్పూర్ గ్రామానికి చెందిన మోరె అశోక్ (54) మద్యానికి బానిసై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. యువకుడి ఆత్మహత్యమందమర్రిరూరల్: మండలంలోని సండ్రోన్పల్లి గ్రామానికి చెందిన ఏదులు రాజ్కుమార్(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ కొంతకాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి 8గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో గ్రా మ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడి తల్లి లస్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నంఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన సఫియా సుల్తాన వాస్మోలిన్ తాగి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. 2010లో ఈమెకు వివాహం జరగగా, 2018లో భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఇందిరానగర్కు చెందిన యువకుడు ఆసిఫ్ రజాతో సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వన్టౌన్ సీఐ సునిల్కుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని యాపల్ ప్రాంతానికి చెందిన మారం రామకృష్ణ(46) వడదెబ్బతో మృతిచెందాడు. యాపల్ ప్రాంతంలో ఆయన గత కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండ్రోజులుగా స్వంత పనులపై ఎండలో తిరిగాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో మంచంపై విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బావమరిది సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. రామకృష్ణ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సందర్శించి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
పాతమంచిర్యాల: ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ అన్నారు. శుశ్రవారం జిల్లా కేంద్రంలోని మోడల్ కెరీర్ సెంటర్లో శ్రీఆర్యవర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తమ సంస్థలో 20 ఉద్యోగాల భరీ కోసం జాబ్మేళా నిర్వహించారు. 29 మంది హాజరు కాగా 12మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆరుగురికి ఉద్యోగ నియామక లేఖలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీఆర్యవర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించుదాం
మంచిర్యాలటౌన్: పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్లు, బ్యానర్లు విడుదల చేసిన అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వర్షాకాలంలో చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో వైద్యులు, సిబ్బంది భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అసంక్రమణ వ్యాధుల కోఆర్డినేటర్ కాకిరాల వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, శ్రీనివాస్, పద్మ, వసుమతి, రవికిరణ్, సురేందర్ పాల్గొన్నారు. -
పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి
చెన్నూర్: పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ అధ్యక్షతన వార్డుసభలు నిర్వహించారు. 1వ వార్డులో అదనపు కలెక్టర్, 6వ వార్డులో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చెన్నూర్రూరల్: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలోని అక్కెపల్లితో పాటు వివిధ గ్రామాల్లో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కెపల్లిలో జరిగిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. ఓటర్ లిస్టు రివిజన్ గురించి వివరించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సి న జాగ్రత్తలు, మొక్కలు నాటడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నక్క కల్పన, జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్ అలి, ఏఎస్సై మాజిద్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ విక్రయించిన ఐదుగురి అరెస్టు
ఆదిలాబాద్రూరల్: నకిలీ పత్రాలతో ప్లాట్ విక్రయించి మోసగించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు మావల సీఐ బిడి ప్రేమ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..ఆదిలాబాద్కు చెందిన కె.వేణుగోపాల్, బట్టిసావర్గాం గ్రామానికి చెందిన రత్నాల రాజన్న, విద్యానగర్కు చెందిన కేతిరెడ్డి కృష్ణరెడ్డి, డాక్యుమెంట్ రైటర్ మొహమ్మద్ ఫైజుద్దీన్ సిద్దిఖీ, రాంనగర్కు చెందిన దరాడే కేశవ్లు కుమ్మకై ్క జైనథ్ మండలానికి చెందిన పలమూరి జయప్రకాశ్కు మావల మండలం బట్టిసావర్గాం శివారు గల సర్వే నంబర్ 65లో నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్ విక్రయించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుడు జయప్రకాశ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రికార్డులను పరిశీలించగా నకిలీ పత్రాలు సృష్టించినట్లు విచారణలో తేలింది. డాక్యుమెంట్ రైటర్ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనతోపాటు మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. రోడ్డుప్రమాదంలో ఒకరి మృతికాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన లావుడియా తిరుపతి(41) మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి బుధవారం రాత్రి బైక్పై బెల్లంపల్లి నుంచి పులిమడుగు గ్రామానికి వెళ్తున్నాడు. స్టేషన్ సమీపంలోని ఎంఎంసీసీ క్రికెట్ అకాడమీ వద్ద ఆకస్మాత్తుగా పంది అడ్డం రావడంతో తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. భార్య మహేశ్వరి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
పారిశుద్ధ్యం మెరుగు పర్చుకోవాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని 60 డివిజన్లలో పారిశుద్ధ్యం మెరుగుపర్చుకోవాలని మేయర్ దర్ని మధుకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం 11వ డివిజన్ సాయికుంటలో వార్డుసభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మేయర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను ఇంటి నుంచి వేరు చేసి చెత్త తరలించే ఆటోలకు ఇవ్వాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, మురుగునీరు రోడ్డుపైకి రాకుండా చూడాలన్నారు. ఏసీపీ ప్రకాశ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. లైసెన్సు లేకుండా వాహనాలను ఇవ్వవద్దని, అలా చేస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 15వ డివిజన్లో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కోటపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదనపు కలెక్టర్ రాములు అదేశించారు. సర్వాయిపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని లారీల నుంచి త్వరితగతిన అన్లోడ్ చేసి లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచించారు. అవసరమైన లారీలు సమకూర్చే విధంగా గుత్తేదారులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జీపీవో మల్లక్క, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తరలించేలా చర్యలు.. వేమనపల్లి: దస్నాపూర్, కొత్తపల్లి గ్రామాల రైతుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాములు అన్నారు. ‘తప్పెవరిది.. శిక్ష ఎవరికి’ శీర్షికన ప్రచురితమైన సాక్షి కథనానికి స్పందించిన ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. సెంటర్లకు అదనంగా లారీలు వచ్చేలా కాంట్రాక్టర్లతో మాట్లాడి నాలుగు రోజులలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సాయి కృష్ణ, ఆర్ఐ ఖాలిక్, ఏపీఎం ప్రమోద కుమారి, పీఏసీఎస్ సీఈవో రాజు నాయక్, రైతులు పాల్గొన్నారు. -
‘కేంద్రం నిధులతోనే జిల్లా అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జిల్లా అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆర్మూర్–మంచిర్యాల మధ్య నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం రూ. 5,203 కోట్లతో జాతీయ రహదారి చేపట్టేందుకు ఆమోదం తెలిపినందుకు గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్తో కలిసి మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ చంద్రపూర్–మంచిర్యాల జాతీయ రహదారి 363 ఇప్పటికే పూర్తి చేయగా, మంచిర్యాల–విజయవాడల మధ్య 63వ జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుండగా, పారి శ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణమూర్తి, సంజీవ్రావు, బంగారు వేణుగోపాల్, రమేశ్, మల్యాల రాజమల్లు, ముదాం మల్లేశ్, కుర్రె చక్రవర్తి, సత్రం రమేశ్, ధన్సింగ్, బేరా రామన్న యాదవ్, సప్పిడి నరేశ్, బూర రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యపై స్పందించని ఎమ్మెల్యే
పెంబి: గిరిజన ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి అటవీశాఖ అనుమతులు పేరుతో అడ్డుకుంటున్నారని పెంబి అటవీ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన కొనసాగుతోంది. గురువారం పెంబి మండల పర్యటనకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వచ్చినా కనీసం తమ సమస్య తెలుసుకునేందుకు దీక్ష శిబిరానికి రాలేదని ఆదివాసీలు వాపోయారు. ఆదివాసీ బిడ్డను గెలిపించుకుంటే సమస్యలు తీరుతాయని అనుకుంటే ఎ మ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు. అ యితే వర్షంలో నిరసన చేపట్టారు. సీపీఎం నేతలు సురేష్, తదితరులు మద్దతు ప్రకటించారు. ఆదివాసీ నాయకులు నిర్మ ల, బాపురావు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఆభరణాలు అప్పగింత
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్–2 గోల్డ్లోన్ బాధితులకు ఎట్టకేలకు బంగారు ఆభరణలు అప్పగించే ప్రక్రియను బ్యాంక్ అధికారులు గురువారం నుంచి ప్రారంభించారు. నిజామాబాద్ డీజీఎం విజయభాస్కర్ సాహు, చీఫ్ సెక్యూరిటీ అధికారి (ఏజీఎం) సంజయ్ అప్పజీ, నిజామాబాద్ ఏవో సెక్యూరిటీ అధికారి రాజేశ్యాదవ్, స్థానిక బ్యాంక్ మేనేజర్ రాజేశ్, సీఐ బన్సీలాల్ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య బంగారం తాకట్టుపెట్టి రుణం చెల్లించిన బాధితులకు ఆభరణాలను అప్పగించారు. రోజుకు ఐదుగురికి నగలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. నగలు తాకట్టు పెట్టిన బాధితులు డబ్బులు త్వరగా చెల్లిస్తే పది మందికి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. బంగారం నగల కేసు కోర్టులో ఉన్నంత కాలం ఎలాంటి అమ్మకాలు చేయడం, కరిగించడం వంటివి చేయనని, గౌరవ న్యాయస్థానం, బ్యాంక్ అధికారులు విధించిన అన్ని షరతులకు లోబడి నగలు నాకు అప్పగించారని, సదరు ఆభరణాలు న్యాయస్థానం, బ్యాంక్ అధికారులు కొరినప్పుడు ఆలస్యం చేయకుండా తీసుకువస్తానని, షరతులకు లోబడి ఉండకుంటే నాపై ఎలాంటి క్రిమినల్ చర్యలైనా, రికవరీ చేసేందుకు బ్యాంక్ అధికారులకు స్వేచ్ఛ ఉంటుందని అఫిడవిట్ బాండ్పై సంతకం చేసిన తర్వాత నగలు అప్పగించారు. -
ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి
నస్పూర్: జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్లోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ గోదామును సందర్శించి వరి ధాన్యం, మొక్కజొన్న దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన ప్రకారం ధాన్యాన్ని తరలించడం జరుగుతుందన్నారు. ధాన్యంతో పాటు గోదాములకు వచ్చిన మొక్కజొన్నలను దిగుమతి చేసి నిల్వ చేయాలని నిర్వాహకులకు సూచించారు. హమాలీలకు వేతనం చెల్లింపులపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్తో మాట్లాడి సకాలంలో కూలి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలినస్పూర్: ఓటరు జాబితా సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్లోని కలెక్టర్ చాంబర్లో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గణన చేపట్టి 31న ముసాయిదా జాబితా ప్రచురించాలన్నారు. 31 నుండి ఆగస్టు 30 వరకు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు స్వీకరించి 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించాలన్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును పరిశీలించారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం..మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాపల్లి జీపీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నందువల్ల అందుకు అనువైన పంటలు సాగు చేసేలా వ్యవసాయాధికారులు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, ఎంపీడీవో సాయివెంకట్రెడ్డి, ఎంపీవో సుమన్, ఎంఈవో తిరుపతిరెడ్డి, సర్పంచ్ మిట్టపల్లి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గన్నీ బ్యాగుల కోసం ఆరాటం
వాతావరణం మారుతోంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గన్నీ సంచుల కొరత రైతులను వేధిస్తోంది. సారాంపూర్ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా గన్నీ సంచులు లేక రైతులు ధాన్యం విక్రయించుకోలేకపోతున్నారు. కొందరు రైతులు కౌట్ల(బి) వ్యవసాయ సహకార సంఘం గోదాముల్లో ఉన్న సంచుల కోసం వెళ్తున్నారు. అయితే అక్కడ ముందుగా బుక్ చేసుకున్నవారికే సంచులు ఇస్తున్నారు. గురువారం సారంగాపూర్ రైతులు వెళ్లగా నమోదు చేసుకున్న రైతులకే బ్యాగులు ఇచ్చారు. దీంతో మిగతా రైతులు మార్కెట్ సీఈవోపై సఅహనం వ్యక్తం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ -
దస్నాపూర్లో అగ్నిప్రమాదం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని దస్నాపూర్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. బండె తిరుపతి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రావడంతో ఇంటి ఆవరణలో ఉన్న జొన్న చొప్పకు గమనించిన కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు పక్కన ఉన్న బండె సావిత్రి బాయి ఇంటికి వ్యాపించాయి. స్థానికులు వెంటనే ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, సామన్లు, నగదు, దుస్తులు, బంగారంతోపాటు అన్ని వస్తువులు, అగ్నికి అహుతయ్యాయి. అదే సమయంలో తిరుపతికి చెందిన రెండు మేకలను స్థానికులు రక్షించగా, 8 కోళ్లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాదంలో రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. తహసీల్దార్ రియాజ్ అలి ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, డీసీసీ ఉపాధ్యక్షుడు తారిక్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, మారుతి పటేల్, గోవిందు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలిపారు. స్పందించిన మంత్రి జూపల్లి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌజింగ్ పీడీని ఆదేశించారు. తక్షణసాయం కింద రెండు కుటుంబాలకు రూ. 95,100 ఆర్థికసాయం అందజేసినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఆత్రం సుగుణ తన వంతుగా రూ. 11 వేల నగదు, 50 కిలోల బియ్యం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రూ. 10 వేలు ఆర్థికసాయం అందించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. బాధితులను పరామర్శించి రూ. 20 వేల నగదు, సరుకులు, దుస్తులు అందించారు. ప్రభుత్వం నుంచి రావల్సిన సహకారం అందేలా చూస్తానన్నారు.ఆమె వెంట బీఆర్ఎస్ నాయకురాలు సరస్వతి, మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు అలిబిన్ అహ్మద్, సాలం,సాయిశ్రవణ్, అబ్దుల్లా, అశోక్, రవీందర్ ఉన్నారు. -
‘చెక్క’ని బొమ్మలు
చెన్నూర్రూరల్: నిరుపేద కళాకారుడు కర్రతో అద్భుత కళారూపాలు తయారు చేసి శెభాశ్ అనిపించుకుంటున్నాడు. వివిధ కళాకృతులను చక్కని ఆకృతిలో చెక్కుతున్నాడు. ఆయనే చెన్నూర్ మండలం దుగ్నెపల్లి వాసి పంచకోటి శ్రీధర్చారి. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన కులవృత్తి అయిన వడ్రంగి పనిని ఎంచుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నా డు. కస్టమర్లకు నచ్చేలా తన కళా నైపుణ్యంతో కర్రలపై వివిధ బొమ్మలు, ఆకృతులు చెక్కి ఇస్తున్నాడు. తలుపులు, బెడ్లపై, ఇంట్లో అలంకరించేలా దేవుడి, అనేక రకాల బొమ్మలను ముందుగా కాగితంపై డిజైన్ గీసి కర్రపై వులితో చెక్కుతాడు. ఏనుగులు, గుర్రాలు, పాము, చిన్నికృష్ణుడు, లాఫింగ్ బుద్ద, సింహం బొ మ్మ ఇలా అనేక బొమ్మలను చేతితో తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. పేద కళాకారుడికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని పలువురు కోరుతున్నారు. చిన్నికృష్ణుడు -
స్వాగతిస్తున్నాం
ప్రత్యేక టెట్పై డీటీఎఫ్ స్వాగతిస్తుంది. ఎన్నో స్క్రీనింగ్ పరీక్షల ఆనంతరం ప్రభుత్వ టీచర్గా కొనసాగుతారు. అయినప్పటికీ టెట్లేని కాలంలో వచ్చిన వారికి టెట్ రాయాలని ఆదేశించడం విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఉపాధ్యాయులకు భారం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు టెట్ అర్హత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. – జయకృష్ణ, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సిలబస్ను సబ్జెక్టు వారీగా టెట్ అర్హతపరీక్షలో పేపర్ 2 సిలబస్ను సబ్జెక్టు వారీగా నిర్వహించాలి. టెట్ అర్హత మార్కులు తగ్గించాలి. అలాగే చేసిన సర్వీస్కు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి. ఇన్సర్వీసు ఉపాధ్యాయులకు రెండు సార్లు అదనంగా టెట్ పరీక్ష నిర్వహించడం సంతోషం. – రాజావేణు, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
అడవులు ప్రకృతి ప్రసాదించిన వరం
జన్నారం: అడవులు ప్రకృతి ప్రసాదించిన వరమని, వాటిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని జన్నారం అటవీ డివిజనల్ అధికారి (ఎఫ్డీవో) రామ్మోహన్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో భాగంగా గురువారం జన్నారం, దండేపల్లి మండలాలకు చెందిన విలేకరులకు వనదర్శిని కార్యక్రమంలో భాగంగా అడవులపై అవగాహన కల్పిస్తూ చేపడుతున్న అభివృద్ధి, రక్షణ గురించి వివరించారు. 2012లో ఏర్పాటైన కవ్వాల్ టైగర్జోన్లో పులులు రాకపోకలు సాగిస్తూ, ఇక్కడ అవాసం ఉండకపోవడానికి అనేక కారణాలున్నాయన్నారు. వాటిని నివృత్తి చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. తాడోబాలాంటి టైగర్జోన్లో అక్కడి ప్రజలు అనేక ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారులు ఖాదర్వలీ, లక్ష్మీనారాయణ, డీఆర్వో రాము, సెక్షన్ అధికారులు శంకర్, శేషరావ్, బీట్ అధికారులు అనిత, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
సిలబస్ను డిజైన్ చేయాలి
ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులోనే 60 మార్కులు ప్రశ్నపత్రం రూపకల్పన చేసేలా సిలబస్ డిజైన్ చేయాలి. ఇన్సర్వీసులో టీచర్లకు ప్రత్యేక టెట్ పరీక్ష తప్పనిసరి. పేపర్–2లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్, గణితం తదితర సబ్జెక్టులో 60 మార్కులు ఉండేలా సిలబస్ రూపకల్పన చేయాలి. – రాసమల్ల రవి, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సబ్జెక్టుకు అనుగుణంగా.. ఇన్సర్వీసు టీచర్లకు ఏటా రెండు ప్రత్యక టెట్ నిర్వహించటం సంతోషకరం. బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలి. హిందీ సబ్జెక్టు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు సోషల్ సిలబస్ పెట్టడం, బయాలజీ బోధించే టీచర్లకు గణితం సిలబస్ ఉండటం సరికాదు. బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా సిలబస్ ఉండాలి. – బన్న రవీందర్, టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం ఇన్సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరుతూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూటీఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు -
ఆశపడ్డారు.. పట్టుబడ్డారు
నిర్మల్టౌన్: డబ్బుపై ఆశతో సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేయగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిమ్మ గజేందర్, మగ్గిడి నవీన్, మహేందర్, సోన్ మండలంలోని మాదాపూర్కు చెందిన మేకల నిఖిల్, సాయికృష్ణలు కలిసి 2024 నుంచి తమ పేర్లతోపాటు వ్యాపార సంస్థల పేర్లతో వివిధ బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ ఖాతాలు ప్రారంభించారు. వాటికి సంబంధించిన ఏటీఎం కార్డులు, చెక్బుక్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేర ముఠాలకు అందజేశారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును ఇతర ఖాతాలకు బదిలీ చేసేవారు. ఇందుకు సహకరించిన వారికి కమీషన్లు అందజేసేవారు. ఇందులో గజేందర్కు చెందిన ఆర్వి ట్రేడర్స్ ఖాతా ద్వారా రూ.2.69 కోట్లు, మగ్గిడి నవీన్కు చెందిన అజాన్ ట్రేడర్స్ ఖాతా ద్వారా రూ.2.11 కోట్లు, మహేందర్కు చెందిన ఎన్.ఆర్ ఎంటర్ర్పైజెస్ ఖాతా ద్వారా రూ.91.36 లక్షలు, మేక నిఖిల్కు చెందిన హెచ్.ఆర్ ఆటోమొబైల్స్ హారడ్వర్ ఖాతా ద్వారా రూ.1.18 కోట్లు, సాయికృష్ణకు చెందిన హెచ్ఎన్ ఎంటర్ర్పైజెస్ ఖాతా ద్వారా రూ.1.28 కోట్లు ఇలా మొత్తం సుమారు రూ 8.18 కోట్లు పైగా లావాదేవీలు జరిగాయి. వీరిపై ఎన్సీఆర్పీ పోర్టల్లో 64 ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో గజేందర్, నవీన్, మహేందర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు నిఖిల్, సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన ఇతర బ్యాంకు ఖాతాలు, సైబర్ నేర ముఠాలపై సంబంధాలు, కమీషన్ చెల్లింపులు, తదితరపై విచారణ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. -
యువత దురలవాట్లకు దూరం ఉండాలి
బెల్లంపల్లి: యువత దురలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్పై దృష్టి సారించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సుభాష్నగర్ బస్తీలో వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, భవిష్యత్పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. వేధింపులకు గురైన మహిళలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలి మున్సిపాలిటీలోని 1, 10, 17, 19, 22 వార్డుల్లో వేర్వేరుగా జరిగిన సభల్లో చైర్పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కమిషనర్ రమేశ్ కోరారు. వన్టౌన్ ఎస్హెచ్వో కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ యువకులు సన్మార్గంలో నడవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ కిరణ్కుమార్, టూటౌన్ ఎస్సై సీ.హెచ్.కిరణ్కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు నీడ, నీళ్లు
మండుటెండల్లో పనులు చేస్తున్న ఉపాధిహమీ కూలీలు పని ప్రదేశంలో నీడ, తాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రథమ చికిత్స పెట్టెలు కనిపించలేదు. దీనిపై ఈనెల 22న ‘ఉపాధిహమీ.. వసతుల లేమి’ శిర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈజీఎస్ అధికారులు కోలూరు, ఖర్బాలా గ్రామాల్లో పని ప్రదేశాల్లో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఆరోగ్య శాఖ అధికారులు ప్రథమ చికిత్స పెట్టెలు అందుబాటులో ఉంచారు. దీంతో కూలీలు సాక్షి చొరవను అభినందించారు.– తానూరుతానూరు మండలం కోలూరులో ఏర్పాటు చేసిన తాగునీరు ఖర్బాలా గ్రామంలో పనిప్రదేశంలో ఏర్పాటు చేసిన తాగునీరు -
యువత భవిష్యత్తో రాజకీయాలు వద్దు
పాతమంచిర్యాల: యువత భవిష్యత్తో రాజకీయాలు వద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు నమ్మి యువత తమ భవిష్యత్ను ప్రమాదంలో పడేసుకోవద్దన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉపాధి అవకాశాల విషయంలో యువతకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సుమారు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాల సాధనకు కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి బీఆర్ఎస్ నాయకులు అపోహలు సృష్టిస్తూ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారని విమర్శించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. వాస్తవాలను గుర్తించి అభివృద్ధి పథంలో పయనించాలని యువతకు పిలుపునిచ్చారు. -
అగ్గి రాజుకుంటే.. బుగ్గే
లక్సెట్టిపేట: మండలానికి అగ్ని మాపక కేంద్రం మంజూరు కలగానే మిగిలింది. దీంతో వేసవి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగి బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో అగ్ని ప్రమాదం జరుగుతున్నా సుదూర ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికి ఆస్తులు కాలి బూడిదైపోతున్నాయి. ఒక్క మే నెలలో 42 కేసులు నమోదైనట్లు అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నాలుగే కేంద్రాలు జిల్లాలో మంచిర్యాల, జన్నారం, బెల్లంపల్లి, చెన్నూర్లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎటు వెళ్లినా సుమారు 25కిలోమీటర్ల దూరం పోవాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైరింజన్ రావాలంటే దూరభారానికి తోడు ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతూ ఆలోపే ఆస్తులు కాలిపోతున్నాయి. ఒక కేంద్రంలో ఒక్కటే.. గతంలో నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి లక్సెట్టిపేటలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారు. వ్యవసాయాధారిత గ్రామాల్లో ఎక్కువగా పూరి గుడిసెలే ఉంటాయి. దీంతో పలుసార్లు అగ్నిప్రమాదాలు జరిగినపుడు అగ్నిమాపక యంత్రం వచ్చేసరికి ఆస్తులు కాలిపోవడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతీ కేంద్రానికి ఒక ఫైరింజన్ మాత్రమే ఉన్నది. అందులో నీరు అయిపోతే మళ్లీ వెనక్కి వచ్చి నీటిని నింపుకొని వెళ్లాల్సి వస్తోంది. నీరు అందుబాటులో లేకుంటే మంటలు ఆర్పడం సాధ్యం కాదు. కేంద్రానికి రెండు ఫైరింజన్లు ఉంటే సకాలంలో ప్రమాద స్థలికి చేరి మంటలు ఆర్పే వీలుంటుంది. ఇటీవలి ఘటనల్లో కొన్ని..ఇటీవల మండల కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అగ్నిప్రమాదం సంభవించగా ఫైరింజన్ వచ్చేసరికి రూ.లక్షల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. స్థానిక ఎస్బీఐ బ్యాంక్లో అకస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పగా అప్పటికే స్టేషనరీ కాలిపోయింది. వెంకట్రావుపేట, పోతపల్లి, జెండావెంకటాపూర్ తదితర గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి బాధితులు ఆస్తులు కోల్పోయారు. అధికారులు పట్టించుకుని మండలంలో ఫైర్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలిసిన వెంటనే పంపిస్తున్నాంఅగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమాచారం రాగానే వెంటనే వాహనాలను పంపిస్తున్నాం. కొన్ని ప్రదేశాలు దూరంగా ఉండడంతో ఆస్తులు కాలిపోతున్నాయి. లక్సెట్టిపేటలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రీనివాస్ అగ్నిమాపక అధికారి, జన్నారం -
ఇన్ సర్వీస్ టీచర్లకు ఊరట!
మంచిర్యాలఅర్బన్/మామడ: రాష్ట్రప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది సాధారణ టెట్లకు అదనంగా మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించాలని అనుమతి ఇచ్చింది. తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించడంపై టీచర్లల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ల నుంచి వచ్చిన వినతులను పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల గడువుకు రెండు టెట్లు.. సర్కారు బడిలో పాఠాలు బోధించే టీచర్కు టెట్ తప్పనిసరి ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కలవరానికి గురిచేసింది. విధుల్లో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణతకు రెండేళ్ల గడువు విధించడంతో వారిలో ఆందోళన మొదలైంది. 2012కు ముందు బీఈడీతో పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరిన టీచర్లకు టెట్ లేకపోవడంతో పదవీ విరమణకు దగ్గరున్నవారు, పదోన్నతి పొందాలనే వారిలో నిరాశ నింపింది. జాతీయ విద్యావిధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు అర్హత పరీక్ష పొందాలని సెప్టెంబర్ 1న 2025 ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నోటిఫికేషన్ జారీ కావడం.. జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్ నిర్వహించడంతో టెట్ ఉత్తీర్ణతలేని టీచర్లు పరీక్ష రాశారు. మరోసారి సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహణతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. టెట్లేని వారే అత్యధికం అత్యధికంగా టెట్ ఉత్తీర్ణత లేని ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో 2507 మంది ప్రభుత్వ టీచర్లు ఉంటే 945 మంది మాత్రమే టెట్ ఉత్తీర్ణత ఉన్నట్లు తేలింది. నిర్మల్ జిల్లాలో 2565 మంది టీచర్లకు 1490 మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణతను సాధించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షలో మరికొంత మందిటీచర్లు ఉత్తీర్ణులైనప్పటికీ. అన్లైన్ పరీక్షల నిర్వహణతో వివరాలు విద్యాశాఖ కార్యాలయాల్లో తెలియకుండా పోయింది. ఓవైపు పాఠాలు.. మరో వైపు టెట్కు సన్నద్ధం కొంత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఇన్సర్వీసు టీచర్లకు ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వటంతో టీచర్లకు ఉపశమనం కలిగిస్తోంది. బోధన చేస్తున్న ఉపాధ్యాయులు -
7న బీఎంఎస్ ద్వైవార్షిక మహాసభ
శ్రీరాంపూర్: భూపాలపల్లిలో ఈనెల 7న బీఎంఎస్ 29వ ద్వైవార్షిక మహాసభ నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. గురువారం నస్పూర్ కాలనీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్య అతిథులుగా బొగ్గు పరిశ్రమల ఇన్చార్జి, సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీకాల్ శ్రీనివాస్, ఏబీకేఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పి.మాధవ నాయక్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల సంరక్షణ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేస్తామని పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 50 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కోలిండియాలో కార్మికులకు చెల్లిస్తున్నట్లుగా అలవెన్స్లపై ఆదాయ పన్నును సంస్థనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మెడికల్ బోర్డు కొనసాగించాలని మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి, నాయకులు రాజారామ్, కిరణ్ కుమార్, కొమ్ము బాపు, కుమ్మరి చంద్రశేఖర్, కుంట రాజు, బద్దె ప్రభాకర్, చల్లశ్రీనివాస్, సామల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో బిడ్డా.. నీదగ్గరికి వచ్చేదెట్లా..!
మంచిర్యాల, శ్రీరాంపూర్: ‘అమెరికాలో పెద్ద చదువులు చదివి గొప్పగా తిరిగొస్తదని ఆశించా ం. కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి బిడ్డను చదువు కోసం అంతదూరం పంపించాం. అక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడ్డది. అపస్మారక స్థితికి చేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. బిడ్డను చూసేందుకు వెళ్లేదెట్లా..’ అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నస్పూర్ షిర్కే ప్రాంతానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్పందన, సౌమ్య ఉన్నారు. శ్రీనివాస్ వ్యాన్డ్రైవర్గా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి పెద్ద కూతురు స్పందనను అమెరికాలోని చికాగోకు పంపించాడు. అక్కడి కాలేజీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది.గత నెల 31న కాలేజీకి వెళ్లి వస్తుండగా మెట్రోస్టేషన్లో మెట్లపై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తు తం కోమాలో ఉందని, పరిస్థితి విషమంగా ఉందని తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడ తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పోగు చేసిన డబ్బులతో కూతురిని అమెరికా వరకు పంపించారు.ఇప్పుడు ఆమెను చూడడం కోసం అక్కడికి వెళ్లాడానికి వారికి ఆర్థి క ఇబ్బందులు అడ్డుగా మారాయి. పాస్పోర్టు కూ డా లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్నారు. పాస్ పోర్టు, వీసా వస్తే అక్కడికి వెళ్లడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, ఎవరైన దాతలు సహాయం చేయాలని శ్రీనివాస్, సునీత అభ్యర్థిస్తున్నారు. శ్రీనివాస్ను 98498 32243 నంబరులో సంప్రదించి సహాయం అందించాలని కోరుతున్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి
మందమర్రిరూరల్: పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన రామటెంకి రాధమ్మ, సమ్మయ్య దంపతుల కుమారుడు శ్రీకాంత్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాదే చివరి ఆత్మహత్య కావాలని 2011, ఆగస్టు 6న ఉరేసుకున్నాడు. దీంతో అతని తల్లి పక్షవాతంతో మంచాన పట్టింది. తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు వారి ఇంటికి వచ్చి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, మందమర్రిలో తమ కుమారుడి విగ్రహం ఏర్పాటు చేయాలని, రామన్కాలనీలో సమ్మయ్య సింగరేణి ఉద్యోగం చేసినప్పుడు ఉన్న క్వార్టర్ తమకే కేటాయించాలని ఆ దంపతులు కోరుతున్నారు. -
హోర్డింగ్ ఎక్కి..
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించడంలో ముందు వరుసలో నిలిచాడు వెంపల్లి గ్రామానికి చెందిన ఆరె శ్రీనివాస్ (టవర్ శ్రీను). తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఐక్యంగా ఉద్యమించాలని డిమాండ్ చేస్తూ 2011 సెప్టెంబర్ 22న హైదరాబాద్లో హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించి 14 గంటల పాటు ఉత్కంఠకు తెరతీశాడు. తెలంగాణ ఐకాస నేత కోదండరామ్, గద్దర్ హామీతో కిందకు దిగివచ్చాడు. ఫిబ్రవరి 22న మంచిర్యాలలో ఐబీ వద్ద హోర్డింగ్ ఎక్కి రోజంతా పైనే ఉన్నాడు. అప్పట్లో నిజామాబాద్కు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. వీటితో పాటు మంచిర్యాలలో రైల్రోకో నిర్వహించి కేసుల పాలయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో చురుకై న పాత్ర పోషించాడు టవర్ శ్రీనివాస్. -
తొలి, మలిదశ ఉద్యమంలో..
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో క్రియశీలకంగా వ్యవహరించారు మంచిర్యాలకు చెందిన కవి మలయశ్రీ. తన కవితాగానంతో ఉద్యమ కారుల్లో ఉత్తేజాన్ని నింపారు. పెన్నుతోనే కాకుండా ప్రజలతో మమేకమై క్రియశీలకంగా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనే కవులు అరుదు. 65 ఏళ్ల వయస్సుల్లో కూడా తెలంగాణ జేఏసీలో చురుకై న బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా నుంచి హస్తీనా వరకు జరిగిన ధర్నా, పోరుబాటలో పాలుపంచుకున్నారు. జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పిలుపుమేరకు రైలురోకో చేపట్టి అప్పటి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పురాణంతో కలిసి అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన సత్యగ్రహ దీక్షలో ప్రొఫెసర్ కోదండరాంతో పాల్గొని తన యొక్క ఉద్యమ స్ఫూర్తిని చాటారు. -
పోరాట కేంద్రంగా రైల్వేస్టేషన్
బెల్లంపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2009 నవంబర్ నుంచి 2012 వరకు అలుపెరగని పోరాటాలు చేశారు. హైదరాబాద్–న్యూఢిల్లీ ప్రధాన రైల్వే మార్గం బెల్లంపల్లి మీదుగా వెళ్తుండటంతో రైల్వేస్టేషన్ పోరాట కేంద్రమైంది. జేఏసీ పిలుపుతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఎదురెల్లి నిరసనలు తెలిపారు. కన్నాల బస్తీ నుంచి మొదలుకుని బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల దూరం వరకు రైలు పట్టాలపై బైఠాయించారు. ఘటనలో 19 మందిపై 12 రైల్వే కేసులు నమోదయ్యాయి. -
14 రోజులు జైలు జీవితం..
మంచిర్యాలఅర్బన్: 2001 నుంచి టీఆర్ఎస్లో చురుకై న కార్యకర్తగా ఉంటూ విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఉద్యమంలో పోరు సాగించాడు మంచిర్యాలకు చెందిన సోహైల్ఖాన్. అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా 14 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. 2009, నవంబర్ 29న కేసీఆర్ను కరీంనగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఉపాధ్యాయులతో నిరసన తెలిపే క్రమంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి వస్తుండగా మొదటి కేసు నమోదైంది. ఉద్యమకారులపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మంచిర్యాలలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టాడు. పోలీసులు అభ్యంతరం చెప్పటంతో రోడ్డుపై బైటాయించారు. గుండు గీయించుకుని నిరసన తెలపటంతో మరో కేసు నమోదైంది. సీమాంధ్ర నాయకుల పిండ ప్రదానాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం, రహదారుల దిగ్బంధనం, రైలురోకో, వంటవార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాడు. -
గోదావరి నీటి పథకం పనులు పూర్తి చేయాలి
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించిన అమృత్ 2.0 గోదావరి నీటి పథకం పనులు సత్వరంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం ఆయన మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేష్తో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నీటి పథకం పనులు నత్తనడకన సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు కోసం రెండు చోట్ల స్థలాలు పరిశీలించారు. పట్టణ సమస్యలపై చైర్పర్సన్, కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ ఎల్.కృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో విధులు.. ప్రైవేట్లో పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: ప్రయాణికుల భద్రత దృష్యా బస్ డ్రైవర్లకు మెడికల్ రెన్యూవల్ తప్పనిసరి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆర్టీసీ, ప్రైవేట్ బస్ డ్రైవర్లు నిర్దిష్ట వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు ఏడాదికి ఒకసారి, 40 లోపు ఉన్నవారికి మూడేళ్ల మెడికల్ రెన్యూవల్ చేయించుకోవాలి. సదరు డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆర్టీసీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అద్దెబస్సు డ్రైవర్లు ప్రైవేట్ ల్యాబ్లో టెస్టులు చేయించుకోవాలని ఓ అధికారి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలు పక్కనపెట్టి ఓ ప్రైవేట్ ల్యాబ్తో ఒప్పందం చేసుకుని కొంతమంది డ్రైవర్లను పంపించడం చర్చనీయాంశంగా మారింది. మెడికల్ రెన్యూవల్ ఇలా.. మెడికల్ రెన్యూవల్ అనేది ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి నిర్ధారించటానికి నిర్థిష్ట కాలానికి చేసే వైద్యపరీక్ష. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కంటి, గుండె, బీపీ, షుగర్, సాధారణ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యుని నిర్ధారణ తర్వాత ఫిట్గా ఉంటేనే మెడికల్ రెన్యూవల్ అవుతుంది. జరుగుతున్నది ఏమిటి? మంచిర్యాల ఆర్టీసీ ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్ పరికరాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో నెలరోజులు ల్యాబ్లో టెస్ట్కు సంబంధించిన పరికరాలు సరఫరా కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాల్సి ఉండగా ప్రైవేట్ ల్యాబ్కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షలు లెటర్ప్యాడ్పై తీసుకువచ్చినా అభ్యంతరం చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు చేయించుకున్న కొందరు అద్దె బస్సుల డ్రైవర్లు మాత్రం ఆస్పత్రి వర్గాల వైపు వేలెత్తి చూపుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలకు రూ.1400 ఉంటే రూ.1200కు మేం చేయిస్తామని ‘మాములు’గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ తతంగంపై లిఖితపూర్వకంగా విజిలెన్స్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. -
‘గోల్డ్లోన్’ ఆందోళనకు తెర
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచ్–2 గోల్డ్లోన్ బా ధితులు తొమ్మిది నెలలుగా చేస్తున్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. బ్యాంకులో గతేడాది ఆగస్టు 20న బంగారు ఆభరణాలు చోరీకి గురికాగా దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయం తెలిసిందే. బంగారం ఇవ్వడంతో బ్యాంకర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత నెల 30న బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చే పట్టారు. ఈ నెల 1న కోర్టు ఇంటీరియం కస్టడీ ఆ ర్డర్ వెలువరించింది. సొంత పూచీకత్తుతో ఆభరణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. శుభపరిణామమే.. కోర్టు ఇంటీరియం కస్టడీకి ఇవ్వడం శుభపరిణామమేనని, ఇప్పటికై నా మా బంగారం మాకు రావడం సంతోషంగా ఉందని బాధితులు నల్లకుంట అశోక్, బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. -
వరి కొయ్యలు కాలిస్తే భారీ జరిమానా
జన్నారం: వరి కొయ్యలు కాలిస్తే భారీ జరిమానా విధిస్తామని ఏడీఏ కృష్ణ అన్నారు. మండలంలోని చింతగూడ రైతువేదికలో బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొయ్యలు, పంట అవశేషాలు కా ల్చడం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు మృతి చెందుతాయని, సేంద్రియ ఆకర్షణ శాతం తగ్గి పంట దిగుబడిలో రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. పంట పొలాల్లో మంట పెట్టడం ద్వారా నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. పంట పొలాల్లో మంటలు పెట్టిన వారిపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరి మానా విధించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అజిత్కుమార్, చింతగూడ ఏఈవో లవన్ కృష్ణ, రైతులు పాల్గొన్నారు. నేషనల్ క్రికెట్ లీగ్కు ఎంపికఆసిఫాబాద్రూరల్: ఆసిఫా బాద్ మండలంలోని బాబా పూర్ గ్రామానికి చెందిన శ్రీ చంద్ నాయక్ నేషనల్ క్రికెట్ లీగ్కు ఎంపికై నట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. ఇటీవల హైదరాబాద్లోని సెంచూరియన్ మైదా నంలో నిర్వహించిన అండర్ 16 క్రికెట్ పోటీల్లో సదరు విద్యార్థి ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీచంద్ నాయక్ను అభినందించారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకపాత్ర
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ పోలీస్లది కీలక పాత్ర అని రామగుండం పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ ఆవరణలో బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూ కోల్ట్ప్, పెట్రో కార్ల, వర్టికల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్గౌడ్, సీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, బాబురావు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
వేమనపల్లి: వైద్య సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేసినా, సమయపాలన పాటించకపోయినా శాఖాపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధాకర్నాయక్ హెచ్చరించారు. ‘పీహెచ్సీ ఎదుట రోగుల నిరసన’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వేమనపల్లిలోని పీహెచ్సీని సందర్శించి సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. సీహెచ్సీగా అప్గ్రేడ్ అవుతున్న సందర్భంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని అన్నారు. సిబ్బంది కొరతను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎండాకాలం వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రాజేష్, అన్వేష్, సీహెచ్ఓ పుట్టా సత్తయ్య, హెచ్ఏఒ శ్రీనివాస్, హెచ్ఎస్ అపరంజి పాల్గొన్నారు. -
ఆర్థిక సంఘం నిధులతో ఊరట
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే, జూన్ నెలలకు గానూ జిల్లాకు రూ.5,40,81,451 నిధులు విడుదల చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా నిధుల విడుదలతో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఆస్తిపన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే జరగడం, మున్సిపాలిటీలకు వచ్చే నిధులు సరిపోక పోవడం, పాలకవర్గాలు లేవనే సాకుతో ఏడాదికాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో మౌలిక వసతుల కల్పనకు జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాలక వర్గాల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. చేపట్టనున్న పనులు ఇవే.. రాష్ట్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను కేవలం కొన్ని నిర్దేశించిన పనులకు మాత్రమే ఉపయోగించాలని కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలతో పాటు, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఇతరత్రా చట్టబద్ధత కలిగిన చెల్లింపులను చేపట్టడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు కనీసం ఆరు నెలల జీతాలకు సరిపడా నిధులను రిజర్వ్ చేసి ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నీటిశుద్ధి, ప్రజా టాయిలెట్లు, ప్రజా ఉపయోగకరమైన ఆస్తుల నిర్వహణ చేపట్టాలని, డంపింగ్యార్డుల చుట్టూ కంపౌండ్ వాల్స్, షెడ్లు, సీసీ ప్లాట్ఫాంలు, విద్యుత్, నీటి సరఫరా, వాచ్మెన్ గదుల నిర్మాణం చేపట్టేందుకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ చేపట్టేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, బయోమైనింగ్ కోసం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలకు విడుదలైన ఎస్ఎఫ్సీ నిధులునగరం/మున్సిపాలిటీ నిధులు(రూ.ల్లో) మంచిర్యాల నగరం రూ.2.44 కోట్లు బెల్లంపల్లి 81.28 లక్షలు మందమర్రి 81.79 లక్షలు చెన్నూర్ 38.36 లక్షలు క్యాతన్పల్లి 57.30 లక్షలు లక్సెట్టిపేట్ 37.71 లక్షలుఅవసరం మేరకు ఖర్చురాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖర్చు చేయడం జరుగుతుంది. మంచిర్యాల నగర పాలక సంస్థ నూతనంగా ఏర్పడడంతో, వచ్చిన నిధులను ఉన్నతాధికారుల సూచనల మేరకు ఖర్చు చేస్తాం. – అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
ఉద్యమకారులను గుర్తించాలి
ఆసిఫాబాద్అర్బన్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 జూలైలో ఖానాపూర్ నుండి ఆదిలాబాద్కు ఒంటరిగా పాదయాత్ర చేపట్టా. పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి పాలకుల నుండి అనేక బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురయ్యాయి. జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపడంతో ఉద్యమంలో మరింత ఉత్సాహంగా పాల్గొన్నా. ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి పెన్షన్, ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. – ఆమ్టే శ్రీమతి, ఉద్యమకారిణి, ఆసిఫాబాద్ -
● తెలంగాణ కోసం అమరులయ్యారు..
చెన్నూర్రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మండలంలోని సుబ్బరాంపల్లికి చెందిన బిల్కి మహేశ్ అమరుడయ్యాడు. ఆటో డ్రైవర్గా పనిచేసే మహేశ్ 2010, ఫిబ్రవరి 5న చెన్నూర్లో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తీసిన ర్యాలీలో పాల్గొని ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. అతని తండ్రి మల్లేశ్ అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని మహేశ్ తల్లి కౌసల్య తెలిపారు. బావురావుపేటలో బావురావుపేటకు చెందిన ముత్యాల రాజాగౌడ్ 2009, డిసెంబర్ 8న ఉరేసుకున్నాడు. అతనికి భార్య సుశీల, కుమారుడు సత్యనారాయణ, కూతురు స్వప్న ఉన్నారు. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, తెలంగాణ అమరులుగా గుర్తించి అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. మహేశ్ ఫొటోతో తల్లి కౌసల్య -
నేటి నుంచి వార్డు సభలు
మంచిర్యాలటౌన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4నుంచి 10వరకు ప్రభుత్వం వార్డు సభలు నిర్వహించనుంది. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం రూపొందించింది. ప్రతీ వార్డులో అధికారులు సభలకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారమై వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. గురువారం ప్రతీ గ్రామం, వార్డులో సభలు ఏర్పాటు చేసి పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, విపత్తు నిర్వహణ అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. 5న పర్యావరణంపై అవగాహన, 6, 8న గ్రామ/వార్డు సభల నిర్వహణ, 9న క్రీడలపై చేపట్టాల్సిన చర్యలు, పలు క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందించడం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10న వార్డు సభల అనంతరం, 12న విద్యాసంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మాదకద్రవ్యాలను వినియోగించబోమని ప్రతిజ్ఞ చేయిస్తారు. వీటితోపాటు ప్రతీ వార్డు సభలో తడి, పొడి చెత్త వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సేకరణ కోసం ప్రతీ ఇంటికి అనుమతి ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవడం చేస్తారు. రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుని, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జైపూర్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని ఇందారంలో ఓం, అన్నపూర్ణ రైస్మిల్లులు, సుముఖ గోదాం సందర్శించారు. రైస్మిల్లుల్లో ధాన్యం దిగుమతులు పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. బెజ్జాల, కిష్టాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించారు. జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ ఏడాది లక్షా 60వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. హమాలీల సమస్యను అధిగమించడానికి స్థానికంగా హమాలీలను తీసుకుని ధాన్యం ఎగుమతి, దిగుమతి వేగవంతం చేయాలని తెలిపారు. తహసీల్దార్ వనజారెడ్డి పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సైకిల్ పోటీలు
రామకృష్ణాపూర్: అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనంలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ పోటీలు(సైక్లోథాన్) నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలను జిల్లా జడ్జి వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ 15నిమిషాలపాటు సైక్లింగ్ చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. వాహనాల వినియోగా న్ని తగ్గించి సైకిళ్ల వాడకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని సూచించారు. ఐఎఫ్ఎస్ అధికా రులు, జడ్జి కూడా సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్, ఎఫ్డీపీటీ శాంతారామ్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ సర్వేశ్వర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, ఎఫ్ఆర్వో రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
లక్సెట్టిపేట: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల మేరకు కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్ (41) మున్సిపల్ పరిధిలోని ఆంధ్రకాలనీ సమీపంలో బిర్యాని పాయింట్ నడుపుతున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్లో గేమ్లు ఆడి రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. మంగళవారం లోన్కు సంబంధించిన వ్యక్తి వచ్చి డబ్బులు చెల్లించాలని నిలదీయడంతో రేపు ఇస్తానని చెప్పి అతన్ని పంపించాడు. విషయం కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు హోటల్కి వెళ్లి చూసేసరికి ఉరేసుకుని కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకున్న రైల్వే అధికారులుతాండూర్: మండలంలోని రేచిని రోడ్ రైల్వేస్టేషన్, బో యపల్లి బోర్డు ప్రాంతంలో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే జేసీబీలు, రైల్వే అధికారులు, పెద్దయెత్తున రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సివిల్ పోలీసులు, రైల్వే సిబ్బంది వంద మందికి పైగా చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు. రేచిని రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేశాఖ, ఓ ప్రైవేటు సంస్థ మధ్య వివాదాస్పదంగా ఉన్న భూమిని రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలతో చుట్టూ ఉన్న ప్రహరీ, కట్టడాలు తొలగించారు. జాతీయ రహదారిని ఆనుకుని నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని కూల్చివేశారు. భూమిని రైల్వే ఇంజనీరింగ్ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఇంజనీరింగ్ విభాగం అధికారిని ఫోన్లో సంప్రదించగా.. కోర్టు స్టే ఆర్డర్ తొలగించడమే కాక స్వాధీనానికి ఆదేశాలు ఇచ్చిందని, ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. తాండూర్ సీఐ దేవయ్య, తాండూర్, తాళ్లగురిజాల ఎస్సైలు ప్రసాద్రావు, రామకృష్ణ, బెల్లంపల్లి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఏకపక్షంగా కూల్చివేతలు సరికాదు తాండూర్: తాండూర్ శివారులోని స్టీపీల్ ఇన్ఫ్రాకేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భూమి హద్దులు, కట్టడాలను రైల్వే అధికారులు ఏకపక్షంగా తొలగించడం సరికాదని ఆ సంస్థ అడ్వకేట్ ఉదయ్కిరణ్ అన్నారు. తాండూర్ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021లో సంస్థ కొనుగోలు చేసిన భూమికి అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. కోర్టులో వివాదంపై కేసు నడుస్తోందని, రైల్వే అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ ఘటనపై తాండూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజర్ కిషోర్గౌడ్ పాల్గొన్నారు. -
తెలంగాణపై ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందా..!
పాతమంచిర్యాల: తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని.. అన్యాయం చేసిన శక్తులతోనే కలిసి నడుస్తూ ఇప్పుడు తెలంగాణపై ప్రేమ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, రాష్ట్రం హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్కల్యాన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చినప్పుడు ఎందుకు స్పందించలేదని అన్నా రు. ఆత్మగౌరవాన్ని అవమానించిన ప్రతీ సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడదని, హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. -
సంక్షేమమే లక్ష్యంగా పాలన
జాతీయ జెండాకు వందనం చేస్తున్న వేణుగోపాల్రావు, ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, తదితరులుమంచిర్యాలఅగ్రికల్చర్: రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మా ర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రా ములు, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్డులోగల తెలంగాణ అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. విజయవంతంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక మార్చి 6నుంచి జూన్ 12వరకు చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా సా గుతోంది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరి శుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రహదారి భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ ని యంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువత క్రీడలు, మహిళలు, పర్యావరణం తదితర 10 అంశాలతో కూడిన కార్యక్రమాలను జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. -
నేర రహితంగా మార్చాలి
మంచిర్యాలక్రైం: రాష్ట్రాన్ని నేర రహితంగా మా ర్చేందుకు కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవా రం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం విధి నిర్వహణలో అత్యున్నత ప్రతి భ కనబర్చిన పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలు, సే వా పతకాలు ప్రదానం చేశారు. మంచిర్యాల సీ సీఎస్ (సెంట్రల్ క్రైమ్స్టేషన్) ఎస్సై దుర్గం లలి తకు ఉత్తమ సేవా పతకం ఇచ్చారు. అడిషన ల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాశ్, శ్రీనివాస్, రమేశ్, నాగేంద్రగౌడ్, సీఐలు, ఎస్సైలున్నారు. -
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
దండేపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశా ల సంబరంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మ య్య, ఏఎంసీ చైర్మన్ ప్రేమ్చంద్, తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, హౌసింగ్పీడీ బన్సీలాల్, ఆర్ఐ భూమన్న పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలో.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని రా పల్లి, కర్ణమామిడి తదితర గ్రామాల్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు కని పించాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్లి శాలువాలు కప్పి సన్మానించారు. రాపల్లిలో లబ్ధిదారులు సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు చిత్రపటాలతో గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, ఎంపీవో సుమన్, గృహ నిర్మాణ శాఖ ఏఈ వాజ్మయి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. లక్సెట్టిపేట మండలం కొత్తూరులో.. లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన 36 ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గ్రామస్తులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తహసీల్దార్ దిలీప్కుమార్, సర్పంచ్ నల్లపు రజిత–పోచమల్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
‘నిరాశకు గురి చేసిన సీఎం’
మంచిర్యాలటౌన్: సీఎం రేవంత్రెడ్డి సోమవా రం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి మంచిర్యాలకు వచ్చినా ఎలాంటి హామీ లు ఇవ్వకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరా శకు గురయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేశ్గౌడ్, అమిరిశెట్టి రాజ్కుమార్, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామిరెడ్డి, బేర సత్యనారాయణ, మెట్టుపల్లి జయరామారావు పాల్గొన్నారు. నేటి నుంచి సదరం శిబిరాలుపాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 3నుంచి 30వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీవో కిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 30వరకు మీ సేవా కేంద్రాల్లో సదరం పోర్టల్లో పేర్లు న మోదు చేసుకున్నవారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3,9,16,22,25,29 తేదీల్లో ఆర్థో/లోకోమోటా ర్ సమస్యలు కలవారికి, 4,8 తేదీల్లో వినికిడి, భాషాలోపం, మాట్లాడకపోవడం లాంటి సమస్యలున్నవారికి, 5న సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల కు, 10,23 తేదీల్లో దృష్టి లోపాలు కలవారికి, 30న మానసిక అనారోగ్యం, మేధోవైకల్యం కలవారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపా రు. దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలలో హాజరు కావాలని సూచించారు. -
‘కేసీఆర్ ఉద్యమంతోనే తెలంగాణ’
నస్పూర్: మాజీ సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నస్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అంతకుముందు తె లంగాణతల్లి విగ్రహం చౌరస్తాలో జెండా ఎగు రవేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నాయకుడు విజిత్రావు, టీబీజేకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, నస్పూర్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు పవన్కుమార్, తిరుపతి తదితరులున్నారు.డీఈవోగా లలితమంచిర్యాలఅర్బన్: డీఈవోగా లలితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాలలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు కు మురంభీం ఆసిఫాబాద్ డీఈవోగా బాధ్యతలు అప్పగించగా మంగళవారం రిలీవ్ చేశారు. మంచిర్యాల డీఈవో యాదయ్య బదిలీపై హై దరాబాద్కు వెళ్లడగా ఇక్కడ లలితకు డీఈవో గా అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)అప్పగించారు. -
కన్నెపల్లిలో ప్రొటోకాల్ రగడ
భీమిని: కన్నెపల్లి మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. కార్యక్రమం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభం కాగా ప్రొటోకాల్ వివాదంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం దూషణకు దిగి పెనుగులాడుకోవడంతో పోలీ సులు ఆపారు. అనంతరం సర్పంచులు, నా యకులు చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై బీఆ ర్ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు. అనంతరం కాంగ్రెస్ డౌన్ డౌన్.. అంటూ నిన దించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఎస్సై భాస్కర్రావు వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో రైతువేదికలోని 20కుర్చీలు విరిగి, డోర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు ఏఈవో తెలిపారు. -
పీహెచ్సీ ఎదుట రోగుల నిరసన
వేమనపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రం ఎదుట రోగులు మంగళవారం నిరసన తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన వైద్యాధికారి, సిబ్బంది ఆ తర్వాత ఇళ్లకు వెళ్లారు. మంగళవారం వైద్యం కో సం ఎనిమిది మంది గర్భిణులు, ఇద్దరు తేలుకాటు బాధితులు, గొర్లపల్లి కిత్తకాలనీకి చెందిన తీవ్ర అ నారోగ్యంతో ఓ వృద్ధురాలు, సాధారణ రోగులు 30 మంది వరకు వచ్చారు. స్టాఫ్నర్స్ రజిత, కాంటింజెంట్ వర్కర్ బాపు మాత్రమే విధుల్లో ఉన్నారు. 24 గంటల(రౌండ్దిక్లాక్) వైద్యం అమల్లో ఉండాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది వెళ్లిపోవడంపై రోగులు ఆగ్ర హించారు. రోజంతా పడిగాపులు కాచి వెళ్లి పోయా రు. జెండావిష్కరణ, విధులకు వచ్చిన వైద్యాధికారి అన్వేశ్, హెల్త్ సూపర్వైజర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ముగ్గురు హెల్త్ అసిస్టెంట్లు, ఏడుగురు ఏ ఎస్ఎంలు, డీఈవో ఉదయమే వెళ్లిపోయారు. వైద్యాధికారి అన్వేశ్ ను సంప్రదించగా.. స్టాఫ్నర్స్ మాత్రమే విధుల్లో ఉన్నారని, సిబ్బంది మధ్య గొడవలతో వెళ్లిపోయారని చెప్పడం గమనార్హం. -
జూన్ 15 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 67 లక్షల క్వింటాళ్ల వడ్లను సేకరించామని, ఇంకా 15 లక్షల క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని, వాటన్నింటినీ సేకరిస్తామని, మొత్తం 75 లక్షల క్వింటాళ్ల వడ్లు కొంటామన్నారు. సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను రేవంత్ ప్రారంభించారు. మొదటి విడతలో పూర్తయిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరించారు. రెబ్బెన మండలం కొండపల్లి శివారు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతిబాట’ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సోమవారం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక సభలో మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి ప్రల్హాద్ జోషీ పంజాబ్, హరియాణాకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. జూన్ 15లోపు ధాన్యం సేకరణ పూర్తవుతుందని, అన్ని పంటలను మద్దతు ధరతో కొనాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆఫీసు ముందు ధాన్యాన్ని పోస్తామని హెచ్చరించారు. కేంద్రంతో యుద్ధమే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ రైతుల పక్షాన పోరాటం చేసి మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కిషన్రెడ్డి తెలంగాణలో తిరగడానికి సమస్య అవుతుందన్నారు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికి నెల్లూరి పెద్దారెడ్డి సిఫారసు తీరుగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని, కేంద్రం కొనుగోలు చేసేలా ఆయన బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు భూ సేకరణకు 1500 ఎకరాలు కోసం చర్చిద్దామని లేఖ రాస్తే కిషన్రెడ్డి నుంచి ఇప్పటికీ స్పందన లేదన్నారు. బస్సుయాత్ర పేరుతో బీజేపీ నాయకులు రైతుల వద్దకు వెళ్లడం కాదని దుయ్యబట్టారు. ఎవరినీ లెక్కచేయను నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగం హక్కులు, సమస్యలే ముఖ్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. వారి కోసం ఎవరినీ లెక్కచేయని స్పష్టం చేశారు. ఏదైనా నేను మొదట పరిష్కారం చేసుకోవాలని చూస్తానని, అలా కాకపోతే పంచాయతీ పెట్టుకోవడానికి సిద్ధమేనని హెచ్చరించారు. తెలంగాణ అంటే ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎంను ఒప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించకపోగా, మీ ఆలోచన ఏంటని ప్రశ్నించారు. ప్రాణహితపై బరాజ్ కట్టి ఎల్లంపల్లి గ్రావిటీతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్లను విడిచిపెట్టి, కాళేశ్వరం కడితే కూళేశ్వరంగా మారిందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర నదీ జలాలు పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నారని, అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహకరించడం లేదన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి లక్షలాది మందికి అన్యాయం చేశారని చెప్పారు. తాము మనుషులు, ఊళ్లను అడగం లేదని, కేవలం భూమి అడుగుతున్నామని చెప్పారు. రెండో విడత రెండన్నర లక్షల ఇళ్లు రాష్ట్రంలో మొదటి విడత 4.50 లక్షల ఇళ్లకు అదనంగా గూడేలకు 21వేలు అదనంగా ఇచ్చాం. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తున్నాం. ఇంకా ఇళ్లు రాని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండో విడతలో అందరికీ ఇళ్లు వచ్చేలా 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15 నాటికి మరో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గతంలో ఇల్లు వచ్చిన వారికి భాగస్వామ్యం చేసి అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి తీరుతామన్నారు. గిరిజనులు తమకు ఆత్మగౌరవంగా బతికేందుకు ఇళ్లు ఇవ్వాలని కోరారని చెప్పారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ప్రేమ్సాగర్రావు, పాల్వాయి హరీశ్బాబు, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని కెరమెరి మండలం కొఠారి గ్రామపంచాయతీ కొత్తగూడలో లబ్ధిదారులు సిడాం కన్నిబాయి, ఆత్రం పోచుబాయి, టేకం పగ్గబాయి ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ మడావి శంతాబాయితో కలిసి ప్రారంభించారు. కాసేపు నేలపైనే కూర్చుని లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ పర్యటనలో ఆరు సబ్స్టేషన్లు, రెబ్బెన మండలం నంబాలలో 2 మెగావాట్ల సోలార్ప్లాంట్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపాలిటీల్లో మొత్తం రూ.112.14కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుడిసెలు లేని ఆదిలాబాద్ను చేస్తాం గుడిసెలు లేని ఆదిలాబాద్ను చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది వరకు అవసరమైన ప్రతీ ఒక్కరికి ఇంటిని మంజూరు చేస్తామన్నారు. ఇందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో వివరాలు తీసుకుని ఇవ్వాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వివక్ష లేని పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెలు ఉన్న చోట్ల కూడా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు ఇవ్వాలని సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలను కోరారు. ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీ లేదని, మంచిర్యాలలో ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కోరారు. మీ పిల్లల్ని చదివిస్తామని మాటివ్వండి.. ‘ఉచిత విద్యుత్, బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు సౌకర్యాలన్నీ కల్పిస్తాం. కానీ ప్రతిఫలంగా నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక్కటేనని అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆదివాసీ మహిళల్ని అడిగారు. ‘మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పిల్లలను మాత్రం చదివించాలని కోరుతున్నా.. చదివిస్తామని మాట ఇవ్వండి అని ఆదివాసీ మహిళలను కోరారు. చదువు ఒక్కటే మార్పు తెస్తుందన్నారు. కొత్తగూడలో 25 ఇళ్లు పూర్తికాగా వాటిని పరిశీలించారు. -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది. ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి, జిల్లా పౌరుల తలసరి ఆదాయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్థికంగా మరింత మెరుగు కనిపిస్తోంది. నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -
మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీరాంపూర్: మైనింగ్ స్టా్ఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శనివారం రాత్రి సీసీసీ కార్నర్లోని నర్సయ్య భవన్లో ఏర్పాటు చేసిన డివిజన్ మైనింగ్ స్టాఫ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూన్లో జరిగే స్ట్రక్చరల్ సమావేశంలో మైనింగ్ స్టాఫ్ డిమాండ్లను యజమాన్యం ముందు పెట్టి చర్చిస్తామన్నారు. పదేళ్లుగా ప్రమోషన్ లేకపోవడం వలన అనేకమంది ఆందోళన చెందుతున్నారన్నారు. పనిభారం పెరిగిందని, ప్రమాదాలు జరిగితే మైనింగ్ స్టాఫ్ను బాధ్యులను చేస్తూ శిక్షిస్తున్నారన్నారు. సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, మైనింగ్ స్టాఫ్ ఉపాధ్యక్షుడు అద్దు శ్రీనివాస్, జీఎం చర్చల ప్రతినిధి గొర్రె నరసయ్య, పిట్ సెక్రెటరీలు గునిగంటి నర్సింగరావు, ఆకుల లక్ష్మణ్, మీడియా ప్రతినిధి రాజకుమార్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, శివ, చంద్రమౌళి, దీక్షిత్, తదితరులు పాల్గొన్నారు. -
కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం
మంచిర్యాలక్రైం: అడవుల సంరక్షణ.. చెట్లపై ఉన్న మమకారం.. ప్రకృతిని కాపాడాలనే తపన.. అతన్ని ఐఎఫ్ఎస్ను చేసింది. అటవీ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా విధుల్లో నిబద్ధత పాటిస్తూ ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అడవిని జల్లెడ పట్టేస్తున్నాడు. ఏమూలన ఏ చెట్టు ఉంది.. ఎక్కడ టూరిజానికి అనువైన ప్రాంతమని పరిశోధిస్తున్నాడు.. కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు.. అతనెవరో కాదు.. జిల్లా అటవీశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఐఎఫ్ఎస్ 2018 బ్యాచ్కు చెందిన కిషన్ జాదవ్. ఆదివారం ‘సాక్షి’ ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహించింది. సాక్షి: మంచిర్యాల డీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచింది. ఇప్పటి వరకు అటవీప్రాంతంలో ఏమేం గుర్తించారు? డీఎఫ్వో: మాది మహారాష్ట్రలోని చిన్నవాసీం జిల్లా నెల్కి గ్రామం. నాన్న కిషన్ జాదవ్, అమ్మ వందన. తమ్ముడు సెక్యూరిటిస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం. అటవీ సంరక్షణే ప్రధాన లక్ష్యంగా విధుల్లో చేరా. నా పరిధిలోని అటవీ ప్రాంతమంతా పరిశీలించాల్సిన బాధ్యత నాపై ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించడం వల్ల ఇక్కడి పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో అభయారణ్యం చాలా బాగుంది. టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చాలా వనరులున్నాయి. గాంధారిఖిల్లా, ఏసీసీ క్వారీ, ట్రెక్కింగ్, శివ్వారం మొసళ్ల కేంద్రం, జన్నారం గాంధారి వనం ఉన్నాయి. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా. సాక్షి: కవ్వాల్ అభయారణ్యం, చెన్నూర్ అటవీ ప్రాంతాల నుండి కలప అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై మీరేమంటారు?డీఎఫ్వో: చెట్లతోనే మానవ మనుగడ సాధ్యం. చెట్లను నరకడం వలన మానవుడు మనుగడ కోల్పోతాడు. కలప అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతాం. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి. చెక్పోస్ట్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తా. తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులకు అధికారులు సహకరించినట్లు మా దృష్టికి వస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. ఏస్తాయి అధికారి అయినా ఉపేక్షించేది లేదు. పాత నేరస్తులపై నిఘా ఉంచాం. సాక్షి: కవ్వాల్ అభయారణ్యంలో పులులు నిలకడగా ఉండేందుకు వాటికి అనువైన అటవీప్రాంతం లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన పులులు ఆగడం లేదని తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు?డీఎఫ్వో: కవ్వాల్ అభయారాణ్యం చాలా బాగుంది. లోప ల దట్టమైన అడవి ఉంది. పులులు ఒకచోట స్థిర ంగా ఉండవు. అవి ఆహా రం కోసం కొత్తప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. సా ధారణంగా రోజుకు సగటున 15 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తాయి. ఇవి పగటి పూట విశ్రాంతి తీసుకుని రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. కొన్ని మగపులులు కొత్త భూభాగం లేదా ఆడపులి తోడుకోసం వెతుక్కుంటూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇటీవల మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఒక పులి కేవలం రెండు నెలల్లో 375 కిలో మీటర్ల దూరం ప్రయాణించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సాక్షి: నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదా.. మీరు ఐఎఫ్ఎస్నే ఎందుకు ఎంచుకున్నారు?డీఎఫ్వో: నాన్నకు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో డ్యూటీ. అతని యాక్టివిటీస్, సిస్టమెటిక్, స్ట్రగుల్స్ అన్నీ చిన్నప్పటి నుంచి చూశా. క్రమశిక్షణ, పట్టుదల అక్కడి నుంచే నేర్చుకున్నా. ఆర్మ్డ్ ఫోర్స్లో ఇండియన్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యా. వద్దు సివిల్ సర్వీస్ ట్రై చేయమన్నారు. అయితే నాకు ఫారెస్ట్ అంటే ఇష్టం. అందుకే ఐఎఫ్ఎస్ ఎంచుకున్నా.సాక్షి: జిల్లాలో కొందరు ఎఫ్ఆర్వో స్థాయి అధికారులు తమకు నచ్చిన బీట్ అధికారి ద్వారా గృహనిర్మాణదారుల వద్ద డోర్కు రూ.2 వేలు, కిటికీకి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మీరేమంటారు?డీఎఫ్వో: గృహనిర్మాణ దారులు అక్రమంగా రవాణ చేసిన కలపను వినియోగించరాదు. పర్మిట్ కలపను మాత్రమే ఉపయోగించాలి. అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గృహనిర్మాణదారులవద్ద అటవీ శాఖ అధికారులు వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం.సాక్షి: వన్యప్రాణుల వేట అధికంగా జరుగుతోంది. వేటగాళ్ల ఉచ్చుకు పులులు బలైన ఘటనలు అనేకం ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?డీఎఫ్వో: ఎవరైనా ఉచ్చులు పెట్టి వన్యప్రాణులను హతమారిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఇలాంటి విషయాల్లో ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి సహకరించాలి. -
● మంచిర్యాల మార్కెట్లో నెమ్మదిగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ● వర్షాలు కురిస్తే పనులకు అడ్డంకి ● వేగం పెంచాలంటున్న నగర వాసులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని మార్కె ట్ ఏరియాలో రోడ్ల వెడల్పు పనులను శ్రీకారం చుట్టారు. పనులు చేపడుతున్నా అనుకున్న సమయంలో పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా వర్షాకాలంలోపు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేయడం కష్టంగా మారే అవకాశం ఉంది. రూ.78 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులను చేపడుతున్నారు. శ్రీనివాస థియేటర్ నుండి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు దాదాపుగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి అవుతుండగా, మార్కెట్ రోడ్డులోని అర్చన టెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్డు ప్రారంభం వరకు చేపడుతున్న అండర్గ్రౌడ్ డ్రెయినేజీ పనుల్లో ఒకవైపు మాత్రమే ఇప్పటికీ పూర్తి చేయగా, మరోవైపు నిర్మాణ పనులు సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచితేనే వర్షాలు కురిసేలోపు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేసేందుకు అవకాశం ఉండగా, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. రోడ్డు వెడల్పు అయితేనే.. ప్రస్తుతం మార్కెట్ రోడ్డుతో పాటు శ్రీనివాస థియేటర్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. నెల రోజులకు పైగా పనులతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఏ రోడ్డు ఎప్పుడు మూసి ఉంటుందో, ఎటువైపు నుంచి రాకపోకలు సాగించాలో వాహనదారులకు తెలియని పరిస్థితి. దీంతో రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యే వరకు దుకాణాల యజమానులు, ప్రజలు సహకారం అందిస్తున్నా వర్షాలు కురిస్తే మాత్రం మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు నిలిస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేసిన చోట రోడ్డు వెడల్పు పనులను చేపడితేనే వాహనదారులకు, దుకాణదారులకు ఇబ్బంది తొలగనుంది. రోడ్డు వెడల్పు పనులన్నీ పూర్తి చేసేందుకు కొంత సమయం తీసుకున్నా, భవిష్యత్లో మాత్రం ప్రజలకు రోడ్ల వెడల్పు ఎంతగానో ఉపయోగపడనుంది. ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు, వాహనాల పార్కింగ్ సమస్య రోడ్ల వెడల్పుతో తీరనుంది. -
అన్నదమ్ముళ్ల అరుదైన ఘనత
సాత్నాల: భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన రాజులవార్ యోగేశ్వర్–స్వప్న దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మణికంఠ స్వామి, చిన్న కుమారుడు దత్తాత్రి అగ్నివీరులుగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మణికంఠస్వామి ఆరు నెలల క్రితం ఎంపికై ప్రస్తుతం అస్సాంలో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు దత్తాత్రి ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఆర్మీ ఉద్యోగం సాధించాడు. చిన్ననాటి నుంచి సైన్యంలో చేరాలని లక్ష్యంతో అన్నదమ్మళ్లు నిరంతర సాధనతో తమ కలలను సాకారం చేసుకున్నారు. దేశరక్షణలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నదమ్ముళ్లు తెలిపారు. దేశసేవలో కుమారులు పాల్గొనడం తమకు గర్వకారణమని తల్లిదండ్రులు తెలిపారు. వారిని గ్రామప్రజలు అభినందించారు. -
స్విమ్మింగ్పూల్లో సందడి
నిర్మల్టౌన్: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంట్లో ఏసీలు, కూలర్లతో ఉపశమనం పొందుతుండగా, బయటకు వెళ్లేవారు ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. వేసవితాపం నుంచి కాస్త చల్లదనాన్ని అందించే స్విమ్మింగ్ పూల్స్ విద్యార్థులు, యువతకు హాట్ ఫేవరెట్గా మారాయి. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో ఈతకొడుతున్నారు. కోచ్లు వారికి ఈతలో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల స్విమ్మింగ్ క్రీడకు గుర్తింపుతో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకోవచ్చని ఉద్దేశంతో పలువురు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. చిన్న వయసులోనే ఈత నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని కోచ్లు చెబుతున్నారు.ఫిట్గా ఉండేందుకు.. వేసవి వేడి తట్టుకోవడానికి స్విమ్మింగ్ ఉపయోగపడుతుంది. గత నెల రోజులుగా ప్ర తీరోజు స్నేహితులతో కలిసి ఈత కొడుతున్నా. తక్కువ ధ రకు స్విమ్మింగ్ చేసే అవకాశం ఉంది. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఫిట్గా ఉండేందుకు స్విమ్మింగ్ చేస్తున్నా. – సూర్యతేజ ఆనందంగా ఉంది వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ చేస్తున్నా. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడంతోపాటు శరీరానికి వ్యాయామం లభిస్తుంది. స్నేహితులతో కలిసి వచ్చి చేయడం ఆనందంగా ఉంది. – త్రినయన్ -
ఆర్నెళ్లలోపు పనులన్నీ పూర్తి
మంచిర్యాల నగరంలోని మార్కెట్ ఏరియా, శ్రీనివాస టాకీస్ నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులన్నీ ఆరు నెలల్లోపు పూర్తి చేస్తాం. వర్షాలు పడక ముందే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులను పూర్తి చేసి, మిగతా పనులను వర్షాలు తగ్గినప్పుడు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. వర్షాలతో పనులకు ఇబ్బంది లేకుండా, రోడ్డు పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తాం. – అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
గాలివాన బీభత్సం
● విరిగిన విద్యుత్ స్తంభాలు ● ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పు నెన్నెల/మందమర్రిరూరల్: మండలంలోని జెండావెంకటాపూర్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. 16 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. చిత్తాపూర్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. గంగారాంలో సంకె రాకేష్ అనే రైతుకు చెందిన తూకం వేసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొత్తూర్లో ఎనుక పోశం ఇంటి ముందున్న తాటిచెట్లపై పిడుగుపడడంతో దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న బోరు మోటారు సాయంతో స్థానికులు మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మందమర్రిలో పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.నెన్నెల: జెండా వెంకటాపూర్లో విరిగిన స్తంభంనెన్నెల: కొత్తూర్లో పిడుగుపడి దగ్ధమవుతున్న చెట్లు -
డీఈవో యాదయ్య బదిలీ
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల డీఈవో యాదయ్య బదిలీ అ య్యారు. ఆదివారం పాఠశాల విద్యాశాఖలో బదిలీపై నిషేధం ఎత్తివేయడం.. డీడీ, డీఈవో లకు బదిలీల్లో భాగంగా యాదయ్యను హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్ల క్రితం మహబూబ్నగర్ డీఈవోగా పనిచేస్తున్న ఆయన 2023 మే 5న మంచిర్యాలకు బదిలీపై వచ్చారు. పరిపాలనా పరమైన విషయాలు, విద్యా కార్యక్రమాలపై తనదైన ముద్ర వేశారు. మూడేళ్ల కాలంలో పదోన్నతులు, బదిలీల నియామకాలను పారదర్శకంగా నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో ఏయేటికాయేడు ఉత్తీర్ణత శాతం మెరుగుపడేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన టీచర్లపై కొరడా ఝులిపించారు. మంచిర్యాల ప్రభుత్వ పాఠశాల (హరిజనవాడ) పరిధిలో ఉన్న స్టేషన్ రోడ్ స్కూల్ను బాయ్స్ హైస్కూల్కు తరలించి నిలబెట్టారు. తొమ్మిది మంది విద్యార్థుల నుంచి 120కు పైగా విద్యార్థులు ప్రవేశం పొందారంటే ఆయన కృషి చెప్పకతప్పదు. విద్యార్థులు వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించేలా వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రస్తుతం మంచిర్యాల డీఈవోగా ఎవరినీ నియమించలేదు. -
పోరుగడ్డకు సీఎం
రెబ్బెన: పోరుగడ్డ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. గతనెలలో తుమ్మిడిహెట్టి పర్యటన దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కెరమెరి మండలం కొత్తగూడలో నూతనంగా నిర్మించిన 25 ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవంతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరును ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. పర్యటన ఇలా.. సీఎం రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద ఉన్న హెలిప్యాడ్ ప్రాంతానికి బయలుదేరుతారు. 4.40 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా 5.45 గంటలకు కెరమెరి మండలం కొఠారి పంచాయతీకి చేరుకుంటారు. 5.50 నుంచి 6.30 వరకు కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడుతారు. 6.55 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఏ ర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 7గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8.30గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 8.30గంటలకు రోడ్డు మార్గం ద్వారా కాగజ్నగర్కు చేరుకుంటారు. వి శ్రాంతి తీసుకుని 9.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ నివాసానికి వెళ్తారు. రాత్రి 10 గంటలకు రోడ్డు మా ర్గం ద్వారా హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. భారీగా జనసమీకరణ.. సీఎం రేవంత్రెడ్డి తొలిసారి జిల్లాకు రానుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా జనసమీకరణకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రజలను తరలించనున్నారు. దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. సీఎం సభ కన్వీనర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జనాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. ఏర్పాట్లు పరిశీలనఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం కెరమెరి మండలం కొఠారి పంచాయతీలోని కొత్తగూడతోపాటు కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి పరిశీలించారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, ఇళ్ల శంకుస్థాపన ప్రాంతాలను పరి శీలించి కలెక్టర్, ఎస్పీలకు సూచనలు చేశారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సైతం ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్చెన్నూర్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు, నిల్వ, రవాణా ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం చెన్నూర్లోని గోదాం, వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు, ఓత్కులపల్లి, ఆస్నాద్, సోమన్పల్లి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని గోదాములకు తరలించాలన్నారు. అధికారులు సమన్వయంతో గడువులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఆర్ఐ అజీజ్, రైతులు పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. స్తంభం పైనుంచి పడి వలసకార్మికుడు, చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చనిపోయారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందారు.స్తంభం పైనుంచి పడి వలసకార్మికుడు.. ఖానాపూర్: మండలంలోని బావాపూర్(కే) శివారులో ఆదివారం విద్యుత్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభంపై నుంచి కిందపడి వలస కార్మికుడు మృతిచెందాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా బావాపూర్ (కే) పరిసరాల్లో పలుచోట్ల స్తంభాలు కూలిపోగా, సరఫరా నిలిచిపోయింది. ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన కార్మికులతో మరమ్మతు చేపట్టారు. యవత్మాల్ జిల్లా ఉమర్ఖేడ్ తాలూకా దేవరంగా గ్రామానికి చెందిన పెదేవర్ ప్రకాశ్ (33) కార్మికుడు, స్తంభం ఎక్కి కొత్త వైరింగ్ అమర్చే పనులు చేస్తున్నాడు. వైర్లు కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు జారి స్తంభం పైనుంచి కిందపడిపోయాడు. ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు అతడిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి.. లక్ష్మణచాంద: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కాళ్లకు వల చుట్టుకుని మృతి చెందినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన తోకల చిన్న లింగన్న(40) శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పులి చెరువులో చేపల వేటకు వెళ్లాడు. రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం చెరువులో వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై.. మృతదేహాన్ని బయటకు తీయించగా కాళ్లకు వల చుట్టుకుని మృతిచెందినట్లు గుర్తించారు. భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. లక్సెట్టిపేట: మండలంలోని శాంతాపూర్ గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయినగర్ కాలనీకి చెందిన గుర్రాల ప్రశాంత్(22) బైక్పై శనివారం పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లాడు. తిరిగి లక్సెట్టిపేటకు రాత్రి వస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న స్కూటీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అంబులెన్సులో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పట్టుబడిన వాహనం స్పేర్స్ మాయం!
మంచిర్యాలక్రైం: కలప అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వాహనాలను అటవీ అధికారులు జిల్లాకేంద్రంలోని ఆశాఖ డివిజన్ కార్యాలయానికి తరలిస్తారు. వాహనాలకు సంబంధించి యాజమానులు రాకపోవడంతో ఇలా పక్కనే పడేశారు. బైక్ల ముందు భాగం చక్రాలు కనిపించకపోవడంతో ఆదివారం ‘సాక్షి’క్లిక్ మనిపించింది. చక్రాలు లేకుండానే స్వాధీనం చేసుకున్నారా.? లేక వీటిని ఎవరైన మాయం చేశారా, అనేది అధికారులే తేల్చాల్సి ఉంది. ఇలా పట్టుబడిన వాహనం ఏదైన సరే స్పేర్స్ మాయం కావల్సిందేనా? స్తంభం విరిగిపడి మూడు మేకలు మృతిబెల్లంపల్లి: మున్సిపాలిటీ 13వ వార్డు గొల్లగూడెంలో ఆదివారం జోరువానకు విద్యుత్ స్తంభం విరిగిపడి చిప్ప గట్టయ్యకు చెందిన మూ డు మేకలు మృత్యువాతపడ్డాయి. కౌన్సిలర్ దొంగల రాజ్ కుమార్ వెంటనే స్పందించి విద్యుత్, పశు సంవర్థక శాఖ అధికారులకు సమాచారం అందించి ఘటనస్థలికి రప్పించారు. మృతి చెందిన మేకలకు పంచనామా నిర్వహించారు. బాధితుడికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కౌన్సిలర్ కోరారు. -
దేశసేవ చేయాలని..
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన చెండే కమల– బాపు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి అంజన్న, రాజు సంతానం. పెద్ద కుమారుడు అంజన్న స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి, బెల్లంపల్లిలో ఇంటర్ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన అంజన్న సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో జగిత్యాలలో నెలరోజుల శిక్షణ పొందాడు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రయత్నించాడు. ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వ్యవసాయం చేస్తూ..చదివించి పెంబి: మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన నారకట్ల మమత–రమేశ్ యాదవ్ దంపతుల కుమారుడు రఘవీర యాదవ్, బొజ్జ శంకరమ్మ– భీమన్న దంపతుల కుమారుడు మణికంఠ అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వారి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారులను చదివించారు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ జనరల్ డ్యూటీ కేటగిరీ ఫలితాల్లో తమ కల సాకారం చేసుకున్నారు. -
గోసంపల్లిలో అగ్నిప్రమాదం
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పలువురు పేదలకు చెందిన గుడిసెలు ద గ్ధమయ్యాయి. నివాసాల సమీపంలో ఉన్న పంట పొలాల నుంచి వ్యాపించిన మంటలు ఇళ్ల వరకు చే రుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బేడ బు డగ జంగం కులస్తులకు చెందిన మూడు గుడిసెల కు మంటలు అంటుకోగా, గడ్డం బసవలింగంకు చెందిన ఇల్లు దగ్ధమైంది. గడ్డం అంజన్న, వినుకొండ వెంకటేశ్లకు చెందిన ఇల్లు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. స్థానికులు అప్రమత్తమై గుడిసెల్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రాణపాయం తప్పింది. అనంతరం గ్రామస్తులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఇంటి సామగ్రి, నిత్యావసరాలు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. పంట వ్యర్థాలకు నిప్పు లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కే) సమీపంలోని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు వరి పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. గాలి దుమారానికి గ్రామ సమీపం వరకు వ్యాపించాయి. 100 నుంచి 150 ఎకరాల్లో వరి వ్యర్థాలు కాలిపోయాయి. పొగ వల్ల బీసీ, ఎస్టీ కాలనీల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. గ్రామస్తులు పంచాయతీ ట్యాంకర్తో చెట్ల కొమ్మలు, నీళ్ల బకెట్లతో మంటలార్పివేశారు. బాబెరతండాలో రెండు ఇళ్లు.. బోథ్: మండలంలోని బాబెరతండాలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. జాదవ్ హీరాలాల్, జాదవ్ దేవిదాస్లకు చెందిన ఇళ్లపై విద్యుత్ వైర్లు తెగి మంటలు చెలరేగాయి. ఇళ్లల్లో వస్తువులు, పత్రాలు, నగదు కాలిపోయాయి. దాదాపు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
సంగీత వాయిద్యంలో గిన్నీస్ రికార్డు
చెన్నూర్రూరల్: వారిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించి వివాహం చేశారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూనే సంగీత వాయిద్యకారుల కార్యక్రమంలో పాల్గొని ఆమె గిన్నీస్ వరల్డ్ రికార్డులో సాధించింది. చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాగిరి వనజ. ఈమె తల్లిదండ్రులు పాగిరి లక్ష్మి– లింగయ్యలది నిరుపేద వ్యవసాయ కుటుంబం. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలకు వివాహం జరిపించారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమార్తె వనజకు 2024లో వివాహం జరిగింది. ఈమె భర్త మహేశ్కుమార్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏడీపీఎంగా పని చేస్తున్నాడు. ఆమె హైదరాబాద్లోని ఇన్మార్ ఇంటలిజెన్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పని చేస్తోంది. భర్త ప్రోత్సాహంతోనే.. ఉద్యోగం చేస్తూనే వనజ భర్త మహేశ్కుమార్ ప్రోత్సాహంతో 2026 జనవరిలో ఆన్లైన్లో కీబోర్డుపై సంగీత వాయిద్యం నేర్చుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్ జొరాస్ట్రియన్ క్లబ్లో గిన్నీస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పాస్టర్ ఆగస్టిన్ దండంగి స్థాపించిన మ్యూజిక్ స్కూల్ సమన్వయంతో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది సంగీత వాయిద్యకారులు ఏకకాలంలో పాల్గొంది. జనగణమణ, పలు పాటలకు సంగీతం వాయించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ నుంచి గుర్తింపు లభించింది. సంస్థ ప్రతినిధులు మే 29న ఆమెకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్తోపాటు గోల్డ్ మెడల్ అందజేశారు. -
శ్రమించి.. కొలువులు సాధించి
సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన యువత అసామాన్య ప్రతిభతో సత్తాచాటారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మైదానంలో చెమటోడ్చారు. గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపట్టి తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశసేవ చేయడమే ధ్యేయంగా భారత సైనికదళంలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. వారి కష్టానికి విజయం దాసోహమంది. వారి పట్టుదలకు అగ్నివీర్ కొలువులు దక్కాయి. శనివారం రాత్రి విడుదలైన అగ్నివీర్ ఎంపిక ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి జిల్లా యువకులపై కథనం. – ఆదిలాబాద్ -
బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తి రిమాండ్
ఉట్నూర్రూరల్: బ్యాంకు రుణం పేరిట మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరిలించినట్లు ఉట్నూర్ సీఐ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఆదివారం వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన భూక్యా దేవానాయక్ జీసీసీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. దేవానాయక్కు బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నిందితుడు కడుకుంట్ల పరుశురాం నమ్మించి ఖాళీ చెక్కులు తీసుకుని దుర్వినియోగం చేస్తూ రూ.1.87 లక్షలు కాజేశాడు. బాధితుడు దేవానాయక్ ఫిర్యాదుతో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. ఎస్సై విజయ్ తదితరులు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసగిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటు్ల్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నీలిశెట్టి సాయిరాం విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూళ్లు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఉట్నూర్ బోయవాడకు చెందిన పెందుర్ కృష్ణవేణు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
కుటుంబంలోనే తొలి కొలువు..
సాత్నాల మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన ఎస్.గోపి–అనిత దంపతుల కుమారుడు సాయి శివప్రసాద్ది సామాన్య కుటుంబం. తండ్రి ఓ జనరల్ స్టోర్లో పనిచేస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్గా విధులు నిర్వహిస్తోంది. తల్లిదండ్రుల శ్రమే ఆయన్ను లక్ష్యం వైపు సాగించింది. పాలిటెక్నీక్ పూర్తి చేసి శిక్షకుడు వీజీఎస్ రాకేష్ పర్యవేక్షణలో నిత్యం సాధన చేసి అగ్నివీర్గా ఎంపికయ్యాడు. కుటుంబంలో తొలి కొలువు దక్కింది. ప్రణాళికతో సాధన చేస్తే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చని సాయిశివప్రసాద్ చెబుతున్నాడు. -
● యూనియన్ నుంచి లేఖలు ● ట్రాన్స్ఫర్ తప్పించుకునేలా ఎత్తులు ● పలువురు ఉద్యోగుల తీరుపై ఆరోపణలు ● పారదర్శకంగా జరిగితేనే అర్హులకు మేలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ బదిలీల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. ఈ నెల ఒకటి నుంచి 31లోపు బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటితో బదిలీల పక్రియ పూర్తి కానుంది. వచ్చే నెల 3లోపు ఉద్యోగులు తమకు బదిలీ జరిగిన స్థానాల్లో విధుల్లో చేరాలి. వచ్చే జూన్ ఒకటి నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలు కానుంది. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగించేలా నోడల్ అధికారులను నియమించారు. రాష్ట్ర, మల్టీ జోన్, జిల్లా స్థాయిల్లోని ఆయా శాఖల్లో ఉన్నతాధికారులతో కమిటీలు నియమించారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు మూడేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తయితే వారికి బదిలీ చేసుకునే అర్హత పొందుతున్నారు. ఇక నాలుగేళ్లు దాటిన వారైతే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. తప్పించుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటికే కొందరు ఉద్యోగులు అనారోగ్యం, వైకల్యం, స్పౌజ్ కోటా కింద బదిలీల నుంచి మినహాయింపు పొందారు. 2027 మే 31వరకు రిటైర్డు అయ్యే వారికి కూడా ఈ బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలి. ఇక జనగణన విధుల్లో ఉన్న టీచర్లకు మినహాయింపు ఉండగా నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. దీంతో కొందరు రిజర్వులో ఉన్న ఉద్యోగులు సైతం బదిలీ కాకుండా చూసుకుంటున్నారు. ఒక్కో శాఖ పరిధిలో మొత్తం 40శాతం మించొద్దనే నిబంధనను అడ్డుపెట్టుకుని కూడా కొందరు తప్పించుకుంటున్నారు. రాజకీయ పైరవీలు ఇక కొందరు ఉద్యోగులు అధికార పార్టీ నేతలతో పైరవీలు చేసుకుంటున్నారు. జోన్, మల్టీ జోన్ పరి ధిలోని కొందరు ఉద్యోగులు జిల్లాను దాటి ఇతర జిల్లాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంతో అర్హులు, ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చేందుకు అర్హత ఉన్నా రాలేకపోతున్నామని వాపోతున్నారు. -
‘ప్రీ ప్రైమరీ’ విస్తరణకు సై..
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది నుంచి జిల్లాలో 44 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తోంది. వీటిలో ఐదేళ్లలోపు చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించారు. 2026–27 విద్యాసంవత్సరానికి మరో 72 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రతీ పాఠశాలకు రూ.లక్ష వరకు నిధులు కేటాయించి చిన్నపాటి మరమ్మతులు, ఫర్నిచర్, ఇండోర్–అవుట్డోర్ క్రీడా సామగ్రి, బాల పెయింటింగ్స్ సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ ప్రీ ప్రైమరీ సెక్షన్కు ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను గౌరవ వేతనాలపై నియమించాలని సూచించింది. పూర్వ ప్రాథమిక విద్య అమలుతో.. జిల్లాలో 511 ప్రాథమిక పాఠశాలల్లో 13,678 మంది విద్యార్థులు, 97 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,234 మంది, 108 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 23,442 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల పిల్లల్ని చేర్చుకుంటే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ చదివించాలంటే రూ.వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. సర్కారు బడిలో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. జిల్లాలో గతేడాది నుంచి ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తుండగా కొన్నింటిలో విద్యార్థుల ప్రవేశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడి విద్యార్థుల సంఖ్య పెంచారు. 44 పాఠశాలల్లో పీపీ–1 (నర్సరీ), పీపీ–2 (యూకేజీ), పీపీ–3 (ఎల్కేజీ) పూర్వ ప్రాథమిక విద్య తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల ఇన్స్ట్రక్టర్లు (బోధకులు), ఆయా (సహాయకులు)లను నియమించి వేతనాలు చెల్లించారు. సర్కారు బడుల్లోనే చేర్పించాలిజిల్లాలో పూర్వప్రాథమిక అమలుకు జిల్లాలో 72 పాఠశాలలకు అనుమతి లభించింది. గతేడాది 44 పాఠశాలలను కలుపుకొంటే మొత్తం 116 పాఠశాలల్లో విద్యార్థుల ఆడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభించాలని ఎంఈవో, ఉపాధ్యాయులను ఆదేశించాం. కొత్తగా అనుమతి పొందిన పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ఇన్స్ట్రక్టర్లు, ఆయాలను నియమిస్తాం. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు ఇండోర్ అవుట్డోర్ ప్లే మెటీరియల్, ఆకర్షణీయమైన పెయింటింగ్లు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్కు సర్కారు పాఠశాలలోన్లే చేర్పించాలి. – యాదయ్య, డీఈవో -
పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
మంచిర్యాలక్రైం: కమిషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్లలో పెండింగ్లో ఉన్న పాత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం ఆయన కమిషనరేట్లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసు అధికారులతో నేర సమీక్ష, కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశం వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన కేసుల్లో అరెస్టులు, విచారణ, సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. రేషన్ బియ్యం, పేకాట, గుడుంబా, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు. నేరస్తులకు శిక్ష పడితే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపారు. కోర్టు వారెంట్ల జారీలో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కోర్టు కానిస్టేబుళ్లకు వివిధ అంశాలపై ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, భీ.రాంరెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, నాగేంద్ర, కృష్ణ, శ్రీనివాస్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ధాన్యం తేమ శాతం చూడండి సారూ..
నెన్నెల: ఇరవై రోజుల క్రితం తేమ శాతం చూసి కాంటా వేసిన ధాన్యం బస్తాలను మళ్లీ తేమ పరీక్షలు నిర్వహించి తూకం వేయాలని, అంతవరకు ధాన్నాన్ని తరలించేది లేదని డీసీఎంఎస్ నిర్వాహకుడు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గొల్లపల్లి రైతులు శనివారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట ఉంచి తేమ శాతం పరీక్షించాలని కోరారు. కావాలనే గోస పెడుతున్నారని విన్నవించారు. ఈ నెల 10న కాంటా అయిన బస్తాలను ఖాళీ చేసి మళ్లీ తూకం వేయమంటే ఎలా సారూ అని ప్రశ్నించారు. తహసీల్దార్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో రైతులు మెండి కిష్టయ్య, కాల్వ రాజం, బండి రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నగర కమిషనర్గా అన్వేష్ కొనసాగింపు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా జి.అన్వేష్ను కొనసాగిస్తూ సీడీఎంఏ సెక్రెటరీ డాక్టర్ టీ.కే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30న కమిషనర్ల బదిలీల్లో భాగంగా జి.అన్వేష్ను వేములవాడకు, ఆదిలాబాద్ కమిషనర్ జి.రాజును మంచిర్యాల కమిషనర్గా బదిలీ చేశారు. ఇద్దరూ వారి వారి మున్సిపాలిటీల్లోనే నెల రోజులుగా పనిచేస్తుండగా, బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేశారు. అన్వేష్ను మంచిర్యాలలోనే కొనసాగిస్తూ, జి.రాజును మంచిర్యాల అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మంచిర్యాల అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్ను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. -
మన ప్రజాస్వామ్యం ఆదర్శం
మంచిర్యాలఅగ్రికల్చర్: మన ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్నేహ సంఘాల సభ్యులతో మాక్ పార్లమెంటు నిర్వహించారు. కలెక్టర్తోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, నగర మేయర్ ధర్ని మధుకర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ అధికారులు కిషన్, యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ శాసనసభ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. విద్యా అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదని, సమాజంలో ప్రతీ అంశాన్ని తెలుసుకోవాలని, హక్కులు, చట్టాలు తెలుసుకోవాలని, విద్యార్థులు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని తెలిపారు. మాక్ పార్లమెంట్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందజేశారు. -
వెంకటసాయి.. మీ సంకల్పానికి సెల్యూట్
వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదని నిరూపిస్తున్నారు వీరు. పుట్టుకతోనే తోడైన ఎముకల వ్యాధి మంచానికే పరిమితం చేసినా డిజిటల్ రంగంలో పట్టు సాధించి టీమ్ లీడర్గా ఎదిగాడు ఓ యువకుడు. గాలిపటం ఎగరేస్తూ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా పట్టుదలతో ‘పది’ పరీక్షలు రాసి సత్తా చాటాడు మరో బాలుడు. దైవ నామాలతో సంకల్పదీక్షను జయించిన ఆ ఇద్దరిలో ఒకరు వెంకటరమణ కాగా మరొకరు శ్రీసాయిచరణ్. అన్నీ ఉండి నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువత ఒక్కసారి ఆలోచించాల్సిందే. విధిని సైతం జయించిన వీరికి సెల్యూట్ చేయాల్సిందే. – ఆదిలాబాద్టౌన్మంచానికే పరిమితమైనా.. డిజిటల్ రంగంలో రాణిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని కై లాస్నగర్కు చెందిన టెంబేకర్ సంతోష్కుమార్–సురేఖ దంపతులు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు వైద్యవిద్య అభ్యసిస్తున్నాడు. పెద్ద కుమారుడైన వెంకటరమణను పుట్టుకతోనే ఎముకల జన్యు సంబంధ సమస్య వెంటాడింది. ప్రస్తుతం ఈయన వయస్సు 26 ఏళ్లు. చిన్నప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. తల్లిదండ్రులే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. సెల్ఫోన్, టీవీ చూస్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాడు. కుమారుడి పట్టుదల, తెలివితేటలు చూసి చదువు నేర్పించేందుకు ఓ ట్యూటర్ను ఏర్పాటు చేశారు పేరెంట్స్. 2018లో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్ష రాసి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పుడు ఈ బాలుడి అమ్మమ్మ ప్రభావతి చార్టుల ద్వారా అక్షరాలు నేర్పించింది. తల్లి అప్పుడప్పుడు బడికి తీసుకెళ్లేది. వెనుక బెంచిలో పడుకోబెట్టినప్పుడు పాఠాలు విని అర్థం చేసుకునేవాడు. ఆంగ్లం ధారళంగా మాట్లాడేవాడు. 2024లో ఎఫ్ఎల్ఎన్ డిజిటల్ మార్ట్లో ఆన్లైన్లో కోర్సు నేర్చుకున్నాడు. 8 నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్ అందుకున్నాడు. నాలుగు నెలల పాటు ఆన్లైన్లోనే ఇంటర్షిప్ పూర్తి చేశాడు. ఈయన తెలివితేటలు చూసి ఆ సంస్థ మొదట రూ.18వేల వేతనం చెల్లించింది. ఆ తర్వాత టీమ్ లీడర్గా నియమించింది. ప్రస్తుత ం రూ.35వేల నుంచి రూ.40వేల వరకు వేతనం పొందుతున్నాడు. చాలా మంది కాలక్షేపం కోసం వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ను ఈయన ఆయుధంగా మలుచుకున్నాడు. రెండు చేతుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఆ చేతితో మొబైల్ ఆపరేట్ చేస్తూ డిజిటల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. ఎముకల వ్యాధి కారణంగా అతడిని కదిపితే ఎముకలు విరిగిపోతాయి. దీంతో ఎటువెళ్లినా ఓ పీటపై తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు బడికి వెళ్లే ముందు తినిపించి వెళ్తారు. మధ్యాహ్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి తినిపించడం, కాలకృత్యాలు తీర్చుతారు. ఈయన ముందు వైకల్యం సైతం ఓడిపోయింది. ఎంతో మంది సకలాంగులకు ఈయన జీవితం ఆదర్శనీయం. రెండు చేతులు కోల్పోయినా అధైర్యపడకుండా.. ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి చెందిన పొచ్చన్న–రమ దంపతులకు ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున వీరి కుమారుడు శ్రీసాయిచరణ్ గాలిపటం ఎగిరేసేందుకు పక్కింటికి వెళ్లాడు. బంగ్లాపై ఎగిరేసే క్రమంలో ఇంటి పైనుంచి వెళ్తున్న 33కేవీ విద్యుత్ తీగలకు తగిలి షాక్కు గురయ్యాడు. రెండు చేతులతో పాటు రెండు కాళ్లకు సంబంధించి రెండ్రెండు వేళ్లను కోల్పోయాడు. విధి వక్రించినా అధైర్యపడలేదు. చదవాలనే తపనతో మోచేతులతో పెన్ను పట్టడం, రాయడం నేర్చుకున్నాడు. ఇటీవల పదో తరగతి పరీక్షలకు హాజరై 500కు గాను 417 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఈ బాలుడు కాలకృత్యాలు, తినడం సొంతగా చేసుకోలేడు. తల్లిదండ్రులే అన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటర్ ఎంపీసీలో అడ్మిషన్ తీసుకున్నాడు. తల్లి గృహిణి కాగా, తండ్రి డ్రైవర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృత్రిమ చేతులు పెట్టించడానికి తండ్రి ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లగా రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఈ కుటుంబం ఎదురుచూస్తోంది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఇటీవల కలెక్టర్ రాజర్షిషా ఈ బాలుడిని ప్రత్యేకంగా అభినందించారు. -
గోల్డ్లోన్ బాధితుల రిలే నిరాహార దీక్షలు
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ గోల్డ్లోన్ బాధితులు శనివారం బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ బ్యాంకులో చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారని, తమకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏం చేసుకుంటారో చేసుకోండని ఆర్ఎం నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి గత ఆగస్టు నుంచి నేటి వరకు వడ్డీ మాఫీ చేసి రుణం చెల్లిస్తే నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డ్లోన్ బాధితులు సాధనబోయిన కృష్ణ, గొడిసెల సంపత్రెడ్డి, నల్లకుంట అశోక్, తిరుపతిరెడ్డి, ఆకుల తిరుపతి, బీరం సతీశ్, సమ్మయ్య నాయక్, జడల మల్లేశ్, ఆర్ఎంపీ సంపత్ పాల్గొన్నారు. -
రోడ్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు చేరుకోలేని గ్రామాలను గుర్తించి, అక్కడి రోడ్ల మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమన్నారు. మాట్లాడుతున్న పీవో మంద మకరందు -
ముస్తాబైన కొత్త‘గూడు’
కెరమెరి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో కొత్తగూడ ఓ మారుమూల గ్రామం.. అక్కడ నివసించేది గిరిజనులే.. ఆ గ్రామానికి జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యటనలే అరుదు.. కానీ ఇప్పుడు ఆ గ్రామానికి ఏకంగా ముఖ్యమంత్రి రానున్నారు. ప్రభుత్వ చొరవతో కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణంలో జూన్ 1న ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అందరికీ ఇళ్లు..కొఠారి పంచాయతీ పరిధిలో కొఠారి, కొలాం కొఠారి, అంబారావుగూడ, కొత్తగూడ, కల్లెగాం గ్రామాలు ఉన్నాయి. 241 కుటుంబాలు ఉండగా 1976 మంది జనాభా ఉంది. పంచాయతీకి మొత్తం 110 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇక కొత్తగూడ గ్రామంలో 36 కుటుంబాలు ఉండగా, 166 జనాభా ఉంది. గతంలోనే 10 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో మిగతా 26 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు. కానీ ఇందులో కుటుంబ యజమాని మరణంతో ఒకటి రద్దు కాగా, మిగిలిన 25 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పనుల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. శనివారం నాటికి 18 గృహాలు పూర్తికాగా, సోమవారం నాటికి అన్ని ఇళ్లూ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెబుతున్నారు. మరోవైపు మిగిలిన ఒక కుటుంబంతోపాటు పాత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మరోసారి ఇళ్ల కోసం ప్రతిపాదనలు పంపిస్తామని వారు పేర్కొంటున్నారు. ముమ్మరంగా ఏర్పాట్లుగత వారం రోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం గ్రామాన్ని సందర్శిస్తూ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ రోడ్డు వేయడంతోపాటు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం కలెక్టర్ హరిత హెలిప్యాడ్తోపాటు ఇతర ఏర్పాట్లు పరిశీలించారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనానికి, లబ్ధిదారులతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే కుమురంభీం జిల్లా ఎస్పీ నితిక పంత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలిసారి కొత్తగూడకు వస్తున్న ముఖ్యమంత్రి గ్రామానికి వరాల జల్లు కురిపిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. సీఎం రావడం మా అదృష్టం సీఎం మా గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇక్కడికి వస్తారని కలలో కూడా ఊహించలేదు. చాలా కాలంగా ఇక్కడ పెంకు, రేకుల ఇళ్లు, గుడిసెలు ఉన్నాయి. ప్రభుత్వం చొరవతో అన్ని కుటుంబాలకు పక్కా ఇళ్లు వచ్చాయి. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామ రూపురేఖలు సైతం పూర్తిగా మారిపోయాయి. – మడావి శాంతాబాయి, సర్పంచ్, కొఠారి పంచాయతీ ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తాం కెరమెరి: గంగుబాయి, భీము దంపతులకు గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ గంగుబాయి అనారోగ్యంతో మృతి చెందడంతో నిర్మాణం చేపట్టలేక పోయారు. వారి కుమారుడు కూడా మృతి చెందడం, కోడలు లేకపోవడంతో మనుమరాలు వైశాలి, అంజలి భీము వద్దే ఉంటున్నారు. వీరిద్దరూ కూడా మేజర్ కాకపోవడంతో వారి పేరిట కూడా ఇల్లు మంజూరు చేయరాదు. అయితే ఈ కేసును ప్రత్యేకంగా పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హౌసింగ్ డీఈ వేణుగోపాల్ తెలిపారు.


