breaking news
Mancherial
-
వైన్స్షాప్లో చోరీ.. ముగ్గురు రిమాండ్
బేల: బేలలోని కనకదుర్గ వైన్స్షాప్లో ఈ నెల 27 అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ ముగ్గురిని రిమాండ్ చేసినట్లు జైనథ్ సర్కిల్ సీఐ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో మాట్లాడారు. చోరీపై వైన్స్ నిర్వాహకుడు రవీందర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు. వైన్స్షాపు వెనుక భాగాన ఉన్న వెంటిలెటర్ నుంచి వైన్స్లోపలకు ప్రవేశించి రూ.13,400విలువ గల మద్యంతో పాటు రూ.41,930 నగదును ముగ్గురు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. చోరీకి పాల్పడిన బేలకు చెందిన పుసాం నారాయణ, షిండే అజయ్, టేకం జోష్వలను స్థానిక గణేశ్ గార్డెన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి రూ.10,320 విలువ గల మద్యం బాటిళ్లతో పాటు రూ.38,630 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా దొంగతనం చేసి నగదును వ్యక్తిగత వినోదాలకు వినియోగించినట్లు గుర్తించామన్నారు. సమావేశంలో ఎస్సై ఎల్. ప్రవీణ్, ఏఎస్సై కనక జీవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగిన సాఫ్ట్బాల్ అంతర్జిల్లా యూనివర్సిటీ టోర్నమెంట్లో మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జట్టు రన్నర్స్గా నిలవగా ఇందులో డానియల్, కమల్రాజ్, ప్రదీప్, అభినవ్లు కాకతీయ యూనివర్శిటీ జట్టు నుంచి ఆల్ ఇండియా యూనివర్శిటీ పోటీలకు ఎంపికయ్యారు. పంజాబ్ యూనివర్సిటీలో డిసెంబర్ 12న జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. క్రీడాకారులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రావు, డైరెక్టర్ విజయ్కుమార్, పీడీ శ్రీని వాస్లు అభినందించారు. -
‘వైద్యుల నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతి’
మందమర్రిరూరల్: కార్పొరేట్ ఆసుపత్రుల్లోని వైద్యుల నిర్లక్ష్యం, సింగరేణి పీఆర్వోల బాధ్యతారాహిత్యం వల్లనే మందమర్రి ఏరియాలోని వర్క్షాపులో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే తాళ్ల రమేశ్ మృతి చెందాడని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం రామన్కాలనీలో రమేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జ్వరంతో బాధపడుతున్న రమేశ్ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా రూ.9 లక్షలు పేమెంట్ చేస్తేనే ట్రీట్మెంట్ చేస్తామని కాలయాపన చేశారని ఆరోపించారు. కొత్తగూడెం సీఎంవో నుంచి పేమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత పేషెంట్ మంగళవారం మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారన్నారు. కార్మికుడి మృతికి సింగరేణి భవన్లో ఉన్న హెల్ప్లైన్ డాక్టర్లు, పీఆర్వోలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రమేశ్ మృతదేహాన్ని టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ తదితర సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. -
సురక్షితంగా ప్రయాణించేలా..!
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బైకర్ నిర్లక్ష్యం, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవర్, కండక్టర్ల నిర్లిప్తత వెరసి 19 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో సైతం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తీసుకోవాల్సిన భద్రత ప్రమాణాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ముందే చెకింగ్.. ఆర్టీసీ బస్సులు బయలు దేరేముందే అన్ని విధాలుగా మెకానిక్లు చెక్ చేయనున్నారు. బస్సు డిపోకు చేరుకున్న తర్వాత సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసి, డ్యామేజీలు, టైర్ల పనితీరు వంటివి క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనంతరం ట్యాంకులో డీజిల్ నింపి, వాషింగ్, స్వీపింగ్ వంటివి చేసి బస్సులను మెకానిక్ వద్దకు పంపుతారు. మెకానిక్లు లీకేజీలు, ఇంజన్ ఆయిల్ చెకింగ్, కూలెంట్ పనితీరు, బోల్ట్లు చెక్ చేయడం వంటివి చేసి ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. ఎలక్ట్రీషియన్ వైరింగ్ చెక్ చేయడంతో పాటు హెడ్లైట్స్, ఇండికేటర్స్ వంటివి సరి గ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలిస్తారు. ప్రతీ నెల రోజులకు ఒకసారి హబ్ సర్వీసింగ్ చేయడం, ప్రతీ మూడు నెలలకు గేర్ బాక్స్ మార్పిడి వంటివి చేపడుతారు. అయితే ఇకనుంచి ఒకటికి రెండుసార్లు బస్సును పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే నడిపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు సూచనలు.. ఆర్టీసీ బస్సుల్లో బస్సులు బయలు దేరేముందు ప్రయాణికులకు డ్రైవర్లు పలు సూచనలు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు ఏ రకంగా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయంపై సూచించనున్నారు. ముందుగా తమను తాము పరిచయం చేసుకొని, బస్సు వివరాలు, ఎన్ని గంటలకు గమ్యం చేరుకుంటుందనే విషయాన్ని తెలియపరుస్తారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడడం ఎలాగో వివరిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక పరికరాల వాడకం, అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు హామర్స్ వినియోగం వంటి విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన..అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారులతో డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవిస్తే డ్రైవర్లు ఏ విధంగా వ్యవహరించాలి, అగ్నిమాపక పరికరాలను ఏ విధంగా వినియోగించాలనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మంటలు బస్సులో వేగంగా వ్యాపించినప్పుడు ఏ రకంగా వాటిని అదుపు చేయాలనే అంశాలను వివరిస్తున్నారు.డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లు ప్రయాణికులకు సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రయాణికుల భద్రతే పరమావధిగా, సురక్షిత ప్రయాణాన్ని కల్పించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. – ఎస్.భవాని ప్రసాద్, ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ -
శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్
ఇచ్చోడ: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని గుండాల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారని తెలిపా రు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవిండ్ లైసెన్స్లు కలిగి ఉండాలని పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 బైకులు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ఎస్సైలు పురుషోత్తం, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజతో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
కాసిపేట: బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధి మద్దిమాడలో చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం, మృతుడి తల్లి గంగుబాయి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడలో తల్లి గంగుబాయితో కలిసి ఉండే ఆదె సాయికుమార్(20) దేవాపూర్లోని మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సాయికుమార్ తనకు బైక్ కొనివ్వాలని తల్లిని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహంతో తల్లిని బయటకు గెంటేసి తలుపులు పెట్టుకున్నాడు. తల్లి బయట షెడ్డులో పడుకుని బుధవారం ఉదయం తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా సాయికుమార్ దూలానికి ఉరేసుకుని కన్పించాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. గంగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సందర్శన
నార్నూర్: మండలంలోని నాగల్కొండ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరల్డ్ బ్యాంకు బృందం సభ్యులు సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రిజిస్టర్లను పరి శీలించారు. రోగులకు వైద్యం అందిస్తున్న తీరును స్థానిక ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీ, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందుతున్న తీరును గ్రామ పెద్దలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కేంద్రంలో ఉన్న మందులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పనితీరు బా గుందన్నారు. వరల్డ్ బ్యాంకు బృందం ప్రతినిధులు డాక్టర్ కృష్ణ, రంజన్ బివర్మ, అనికేత్ ఘన్శ్యామ్, రాష్ట్ర క్వాలిటీ మేనేజర్ రాధిక, స్టేట్ డీడీఎం జా న్సన్, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, జిల్లా ప్రో గ్రాం అధికారి జాదవ్ దేవిదాస్, ప్రభుత్వ ఆసుపత్రి డీడీవో డాక్టర్ రాంబాబు తదితరులు ఉన్నారు. ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు ఎస్.కృష్ణ, రంజన్, బి. వర్మ, అనికేత్ ఘన్శ్యామ్ అన్నారు. బుధవారం ఉ ట్నూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వ సతులు, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్ర క్వాలిటీ ఆఫీసర్ రాధిక, డీఎంవో డా క్టర్ శ్రీధర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ దేవీదాస్ జా దవ్, ఏవో గీతేష్, డీడీఎం రమణ, నోడల్ ఆఫీసర్ డా.కపిల్ నాయక్, ఆసుపత్రి ఆర్ఎంవో డా.మ హేందర్ సిబ్బంది ఉన్నారు. -
చిరుత సంచారం
ముధోల్: మండల కేంద్రంలోని కంటి ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అటుగా వెళ్లిన వాహనదారులకు చిరుత కనిపించింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ బుధవారం ఉదయం చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. రోడ్డు పక్కన వ్యవసాయ చేనులో చిరుత పాదముద్రలు లభ్యమయ్యాయి. చిరుత ముధోల్, తరోడా శివారుల్లో సంచరిస్తున్నందున రైతులు ఒంటరిగా చేలోకి వెళ్లొద్దని, గుంపులుగా, చేతిలో కర్రలతో వెళ్లాలని సూచించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాంసి(కే)లో పెద్దపులి సంచారంభీంపూర్: మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారి హైమద్ఖాన్ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కడెం గేట్ల లీకేజీలకు మరమ్మతులుకడెం: కడెం ప్రాజెక్ట్ వరద గేట్ల లీకేజీలను అరికట్టేందుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. లీకేజీల రూపంలో వృథాగా నీళ్లు పోకుండా ఉండేందుకు గేట్ల కింది భాగంలో కాటన్ వేస్ట్ అమర్చుతున్నారు. ప్రస్తుతం 12 గేట్ల లీకేజీ మరమ్మతులు పూర్తయినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. -
సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్
కాగజ్నగర్రూరల్: ఆన్లైన్లో మోసం చేసిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆన్లైన్లో మోసపోయి రూ.45,790లను కోల్పోయినట్లు ఆగస్టు 15న ఓ బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా డబ్బులు ఏ అకౌంట్కు వెళ్లాయో డీఫోర్సీ బృందంతో సాంకేతిక ఆధారాలు సేకరించి ట్రేస్ చేయగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ దోహార్ అకౌంట్లో జమయ్యాయి. నిందితుడు అకౌంట్ పేరును ఆశిష్ కిరాణా స్టోర్ అని మార్పు చేసి వినియోగిస్తున్నాడు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, డీఫోర్సీ బృందం మధ్యప్రదేశ్కు వెళ్లి ఈనెల 25న నిందితుడిని పట్టుకుని అక్కడి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి ఈనెల 28న కాగజ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా ఆశిష్ టీస్టాల్లో పని చేస్తూ జీవిస్తున్న సమయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ఆకాశ్ వద్వానీతో పరిచయం ఏర్పడింది. ఏటీఎం, ఆధార్ కార్డు, మొబైల్ లింక్ అకౌంట్ ఇస్తే నెలకు రూ.10వేలు ఇస్తానని ఆకాశ్ వద్వానీ చెప్పడంతో ఆశిష్ ఇచ్చాడు. ఇతరులను మోసం చేసి వచ్చిన డబ్బులను ఆ అకౌంట్లో జమ చేసేవాడని ఆశిష్ పోలీసులకు తెలిపాడు. కాగా ఫిర్యాదు దారుడి అకౌంట్ నుంచి మోసపోయిన రూ.45,790లకు గాను రూ.34,537 లను ఫ్రీజ్ చేశామని సీఐ వివరించాడు. ఆకాశ్ వద్వానీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సైబర్ కేసును ఛేదించిన కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది, డీఫోర్సీ బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి..
గుడిహత్నూర్: మండలంలోని మా న్కాపూర్ గ్రామానికి చెందిన నల్వాడ్ విట్టల్ (39) మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్ర కారం.. వ్యవసాయం చేసే నల్వాడ్ విట్టల్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత సోమవారం మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. అనంతరం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి తన అన్న కొడుకు మనోజ్కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. మనోజ్తో సహా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి కదల లేని స్థితిలో ఉన్న విట్టల్ను రిమ్స్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం విట్టల్ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పలు రైళ్లు రద్దుకాగజ్నగర్టౌన్: మోంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను బుధ, గురు రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదే విధంగా బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజిపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మద్యనిషేధంపై తీర్మానం
వేమనపల్లి: మండలంలోని పల్లెలు ఏకమై గుడుంబా నిర్మూలనకు ముందుకు కదులుతున్నాయి. మండల కేంద్రంలో బుధవారం గ్రా మస్తులు గుడుంబా, బెల్ట్షాపుల్లో మద్యం అ మ్మకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. గ్రా మంలో మద్యనిషేధానికి తీర్మానించారు. గు డుంబా విక్రయించొద్దని, బెల్ట్షాపులు మూసే యాలని కోరారు. నీల్వాయి ఇంచార్జి ఎస్సై శ్యాంపటేల్, అబ్కారీ అధికారులకు సమాచా రం ఇచ్చారు. తమకు సహకరించాలని కోరా రు. గ్రామ పంచాయతీ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గుడుంబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలి
మందమర్రిరూరల్: ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు నాయకులు సహకరించాలని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. బుధవారం స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. నాయకులు ఏరియాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఐఈడీ కిరణ్కుమార్, సీవిల్ ఎస్ఈ రాము, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు దాగం మల్లేష్, అక్బర్ అలీ, కంది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ‘స్వయం’ భరోసా
పాతమంచిర్యాల: దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగ మహిళలకు భరోసా కల్పించి జీవితం సుఖమయంగా మార్చడానికి పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు పొందుతూ ఉండి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక దివ్యాంగ మహిళల వివరాలు నెల రోజులుగా సేకరిస్తున్నారు. ఐదు నుంచి 15మంది సభ్యులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 253మంది వివిధ రకాల వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను గుర్తించారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచి నిర్వహణకు సంరక్షకులను నియమిస్తున్నారు. దివ్యాంగుల సంరక్షకులు బ్యాంకు రుణాలు తీసుకోవడం, చెల్లించడం, ప్రతీ నెల నిర్వహించే వీవో సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అంది సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం ఉంది. చికిత్స, పునరావాస సేవలు సంఘ సభ్యులకు వారి వైకల్య తీవ్రతను బట్టి ఫిజి యోథెరపి, ఆక్యుపేషన్ థెరపి, స్పీచ్థెరపి వంటి అవసరమైన సేవలు అందిస్తారు. పలు రకాల ఉపకరణాలు అందిస్తారు. సాంకేతిక పరికరాలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఆదాయ అభివృద్ధి సంఘాల్లో వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సీడ్క్యాపిటల్, రివాల్వింగ్ఫండ్, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా కంప్యూటర్ స్కిల్స్, టైలరింగ్, హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ కల్పించి ఆదాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం.. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఆత్మస్థైర్యంతో జీవించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లాలో సదరం సాఫ్ట్వేర్లో నమోదైన, ఆసరా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల వివరాలు సేకరించి ఎస్హెచ్జీలు ఏర్పాటు చేశాం. వారికి బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి రుణాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మంచిర్యాలవీరు అర్హులు దివ్యాంగులు 40శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యులు చేర్చుకుంటారు. కుటుంబంలో ఒకరి కన్న ఎక్కువ మంది వైకల్యం కలిగిన వారు ఉన్నా సంఘంలో చేరడానికి అర్హులే. -
ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బుధవారం రాత్రి వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 87వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 50వేల క్యూసెక్కులు, కడెం నుంచి 5వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 288 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, 23 గేట్లు ఎత్తి 1.59లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వదులుతున్నారు. -
రేటింగ్స్లో వెనుకబడి!
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరిట కార్యక్రమం చేపట్టింది. మూత్రశాలల వినియోగం, నీటి వసతి, మొక్కలు నాటి సంరక్షణ తదితర అంశాలు పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్లో ఆయా పాఠశాలల పరిస్థితిని ఎస్హెచ్వీఆర్ యాప్, https:// shvr. education. gov. in వెబ్సైట్లో యూడైస్ కోడ్తో లాగిన్ అయి నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,045 పాఠశాలల్లో 1,27,834 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 908 పాఠశాలలు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకోగా.. ఇందులో 400 పాఠశాలలు రేటింగ్లో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైవ్స్టార్(అత్యుత్తమ) సాధించిన పాఠశాలలు 23 ఉన్నాయి. పచ్చదనం, నీటి పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో ఫోర్త్స్టార్(4స్టార్)లో 377 ఉన్నాయి. మిగతా 508 పాఠశాలలు రేటింగ్స్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరు అంశాలు.. ఆరవై ప్రశ్నలు స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణ నలోకి తీసుకుని 60 ప్రశ్నలు ఆన్లైన్ ప్రక్రియలో ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల నడవడిక, ఎకోక్లబ్ల ఏర్పాటు, నీటి సంరక్షణ, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మొక్కలు, తోటల పెంపకం, సౌరశక్తి వినియోగం తదితర అంశాలకు ఆన్లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చారు. అవసరమైన ఫొటోలు అప్లోడ్ చేశారు. మెరుగ్గా ఉండే వాటికి మార్కుల ఆధారంగా కేంద్రం ఎంపిక చేసింది. క్షేత్రస్థాయి తనిఖీలు ఎస్హెచ్వీఆర్ కార్యక్రమంలో భాగంగా అప్లోడ్ చేసిన వివరాలు, చిత్రాలను కమిటీ బృందం తనిఖీ చేస్తుంది. ఫైవ్స్టార్, 4స్టార్ పాఠశాలల్లో అప్లోడ్ చేసిన వివరాలు నిర్ధారించనున్నాయి. ఆయా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, సహాయకుడితో బుధవారం నుంచి పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రాథమిక 3, ఉన్నత పాఠశాలలు 3, అర్బన్ నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఒక్కొక్కటి అత్యుత్తమమైన వాటిని తనిఖీల అనంతరం ఎంపిక చేస్తారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్గ్రాంట్గా ఇవ్వనున్నారు. పాఠశాలలను ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్ఫోజర్ విజిట్(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు. -
ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్
వేమనపల్లి: ఇందిరమ్మ లబ్ధిదారు ఖాతాలో జమ అయిన డబ్బులను ఓ పోస్టుమాస్టర్ స్వాహా చేసింది. విడతల వారీగా రూ.లక్ష డ్రా చేసుకుంది. చివరికి రూ.10వేలు వృద్ధురాలికి ఇవ్వగా.. అనుమానం వచ్చి ఖాతాను మరోచోట పరిశీలించగా స్వాహా పర్వం బయటపడింది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పదిరె అంకుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్మెంటు వరకు నిర్మించుకోగా గృహ నిర్మాణ శాఖ నుంచి సెప్టెంబర్ 29న రూ.లక్ష మొదటి విడత బిల్లు ఆమె పోస్టాఫీసు ఖాతాలో జమ అయ్యాయి. ఈ విషయమై ఆమెకు తెలియదు. ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బుల విషయమై వేమనపల్లి పోస్టాఫీసుకు వెళ్లింది. ఖాతాను పరిశీలించిన పోస్టుమాస్టర్ శాంక రూ.లక్ష ఉండడం గమనించింది. ఈ విషయం అంకుకు, ఆమె కుమారుడు చిన్నన్నకు చెప్పకుండా.. గ్యాస్ డబ్బులు పడలేదని తెలిపింది. అంకు వేలిముద్ర ద్వారా ఆ రోజు నుంచి డబ్బులు డ్రా చేస్తూ వచ్చింది. ఈ నెల 13, 15, 16వ తేదీల్లో పోస్టాఫీసుకు వస్తే ఖాతా పరిశీలిస్తానని చెప్పడంతో వెళ్లారు. ఆయా రోజుల్లో రూ.25వేల చొప్పున అంకు వేలిముద్ర ద్వారా రూ.75వేలు పోస్టుమాస్టర్ శాంక డ్రా చేసుకుంది. చివరి రోజు రూ.10వేలు అంకుకు ఇవ్వడంతో పోస్టుమాస్టర్పై అనుమానం వచ్చి మరోచోట ఆన్లైన్ సెంటర్లో వాకబు చేసింది. రూ.25వేల చొప్పున నాలుగు విడతలుగా డ్రా చేసుకున్నట్లు తెలియడంతో వృద్ధురాలు, కుటుంబ సభ్యులు ఆవాక్కయ్యారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమురం రమేష్, బౌడి గోపాల్, తాళ్ల వెంకటేష్గౌడ్ తదితకరులు లబ్ధిదారు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇఫ్తేకర్ అలీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన పోస్టుమాస్టర్ను ఆరా తీయగా.. అరగంటలో వస్తానని, తాను తప్పు చేశానని, డబ్బులు తిరిగి ఇస్తానని బతిమాలింది. పోస్టుమాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
ఎడతెరిపి లేని వాన
చెన్నూర్/చెన్నూర్రూరల్/భీమారం/మందమర్రిరూరల్/జైపూర్/భీమిని/బెల్లంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మోంథా తుపాను ప్రభావం కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్లోని గోదావరి నదీ తీరం వెంట పత్తి, వరి, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందతున్నారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, చింతలపల్లి, శివలింగాపూర్, భీమారం మండలం అంకుసాపూర్, పోలంపల్లి, మద్దికల్, మందమర్రి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలి నష్టం వాటిల్లింది. మొక్కలపై పత్తి తడిసిపోవడంతో నల్ల గా మారే ప్రమాదం ఉంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో పెట్టుబడి కూడా రాకుండా పోతుందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో నాగమల్ల సోమయ్య ఇంటి పై కప్పు కూలింది. జిల్లాలో.. మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7.7మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల మండలంలో 21 మిల్లీమీటర్లు, జైపూర్లో 16.5, దండేపల్లిలో 14.5, నస్పూర్లో 10.5, కన్నెపల్లిలో 10.5, బెల్లంపల్లిలో 9, హాజీపూర్లో 8.8, భీమినిలో 7.5, భీమారంలో 5.8, నెన్నెలలో 5.5, తాండూర్లో 5.5, చెన్నూర్లో 4.5, మందమర్రిలో 3.5, లక్సెటిపేటలో 3.3, కోటపల్లిలో 1.8, జన్నారంలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రెండ్రోజులు తుపాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓసీపీలో నిలిచిన ఉత్పత్తి శ్రీరాంపూర్: వర్షం వల్ల శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి క్వారీలో షవల్స్, డంపర్లు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రస్తుతం రోజుకు 10 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తున్నారు. 3 వేల టన్నుల బొగ్గు వస్తుంది. వర్షం కారణంగా ఇది పూర్తిగా నిలిచిపోయింది. క్వారీలో చేరిన నీటిని భారీ సామర్థ్యం ఉన్న పంపులతో బయటకు తోడేస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గితేనే క్వారీ నడుస్తుందని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్య
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలేక్టరేట్లో జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పరిపాలన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థ, ఉపయోగానికి పనికిరాని పాత గదులను తొలగించి నూతన భవనాల నిర్మాణలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీలకు ప్రతిపాదనలు పంపించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలిపారు. కేజీబీవీ సందర్శన మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ సంతోష్తో కలిసి తరగతి గదులు, వంటశాల, రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని తెలిపారు. -
బస్సులు ఆపాలని మహిళల రాస్తారోకో
కోటపల్లి: మండలంలోని రాంపూర్ గ్రామంలో బస్సులు ఆపాలని మహిళలు బుధవారం రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులు ఆపకుండా డ్రైవర్లు, కండక్టర్లు తమపట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు గ్రామస్తులు, మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు. చెన్నూర్ నుంచి రాంపూర్ మీదుగా కాళేశ్వరం, సిరోంచకు వెళ్తున్న బస్సులు ఆపడం లేదని తెలిపారు. కాళేశ్వరం వెళ్లే ఆర్డీనరి బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి గ్రామంలో ఆపకుండా వెళ్తున్నాయని తెలిపారు. గ్రామస్తులు, విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదన్నారు. రాంపూర్ గ్రామంలో బస్సు దిగాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని కొల్లూర్, దేవులవాడ గ్రామంలో ఆపుతున్నారని, రాత్రివేళల్లో ప్రయాణించే మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. గతంలో పలుమార్లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. మంచిర్యాల ఆర్టీసీ డీఎంతో ఫోన్లో మాట్లాడించగా.. మూడు రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి
నెన్నెల: పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని, పత్తిని వీలైనంత త్వరగా సేకరించి సురక్షిత ప్రాంతానికి తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. బుధవారం ఆమె ఏవో సృజన, ఏఈవో రాంచందర్తో కలిసి నెన్నెల, బొప్పారం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే పత్తిని తీసి తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని తెలిపారు. తడిసిన పత్తిని చెట్లపై నుంచి తీయకుండా ఆరిపోయాక సేకరించాలని తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12శాతం మించకుండా జాగ్రత్త పడాలని అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు పగిలిన పత్తిని తీయడంతో రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఉంటుందని, మొదట 2, 3 తీతల్లో వచ్చే పత్తి అధిక నాణ్యత ఉంటుందని, దీనిని వేరుగా నిల్వ చేసుకుంటే మంచి ధర పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఉదయం పూట మంచు అధికంగా కురుస్తుందని మంచు తగ్గిన తర్వాతనే సేకరించాలన్నారు. అనంతరం కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి విక్రయంపై సందేహాలను వ్యవసాయ అధికారుల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. -
రక్తదానం మహోన్నత సేవ
జైపూర్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని, రక్తదానం మహోన్నత సేవతో సమానమని రామగుండం సీపీ అంబర్కిషోర్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని ఇందారంలో ఉన్న ఫంక్షన్హాల్లో జైపూర్ సబ్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం, ఓపెన్హౌస్ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. మంచిర్యాల రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ అత్యవసర సమయంలో అందించే రక్తంతో ప్రాణ దానం చేసినవారవుతారని తెలిపారు. విద్యార్థులకు పోలీసుల విధులు, రక్షణ, షీటీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టంపై అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గంజాయి, మత్తుపదార్థాలతో జరుగుతున్న అనర్థాలపై ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ రచించిన అమర జవాన్ల త్యాగానికి నివాళి–ఆకాశమంత త్యాగం అనే పాటను విడుదల చేశారు. -
పీఎఫ్ బకాయి చెల్లింపు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నస్పూర్ మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఈపీఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి)ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరోమారు చెల్లించింది. బకాయిలపై గతంలో రూ.30లక్షలు చెల్లించగా.. మంగళవారం మరో రూ.44లక్షలు చెల్లించారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.74లక్షల వరకు కార్మిక శాఖకు కట్టారు. పూర్తిగా రూ.2.50కోట్ల వరకు బకాయిలు ఉండగా కార్పొరేషన్ వాటిని తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్లు సకాలంలో 128మంది కార్మికులకు సంబంధించి నెల నెలవారీగా డబ్బులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. కార్మిక శాఖ గత ఏడేళ్లుగా ఇప్పటివరకు ఆయా కార్మికులకు నెల నెలా చెల్లించాల్సిన పీఎఫ్ చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మొదట 2018నుంచి 2021వరకు రూ.1.05కోటిపైగా ఉండగా, 2021నుంచి ప్రస్తుత నెల వరకు మరో రూ.కోటిన్నర వరకు బకాయిలు ఉన్నాయి. నెల నెలా ఆ మొత్తం పెరుగుతూ వస్తోంది. దీనిపై నస్పూర్ పరిధిలోనే అప్పటి మున్సిపల్ అధికారులకు పలుమార్లు నోటీసులు జారీ చేయడం, బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయడం వంటివి చేసినా స్పందించలేదు. చివరకు కార్పొరేషన్లో విలీనమయ్యాక కూడా ఆ బకాయిల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. మరోవైపు కార్పొరేషన్ బ్యాంకు ఖాతాను సైతం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి హెచ్చరించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కార్మిక శాఖకు చెల్లించాల్సి వస్తోంది. ఇక జరిమానాలు, వడ్డీలు సైతం చెల్లించాల్సి వస్తే ఇంకా అధిక మొత్తంలోనే కార్మిక శాఖకు కట్టాల్సి వస్తుంది. బాధ్యులను వదిలేస్తారా?గతంలో కార్మిక శాఖకు కార్మికులకు సంబంధించి నెల నెలా చెల్లించాల్సిన పీఎఫ్తోపాటు ఈఎ స్ఐని సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేశా రు. దీంతో రూ.కోట్లు బకాయి పడేలా చేసిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఇప్పటికే వీరి పరిధిలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. వీరికి పీఎఫ్ చెల్లించకపోవడంతో కార్మిక బీమా వర్తించకుండా ఆ మొత్తాన్ని కోల్పోయారు. కొంతమంది సర్వీస్ ముగిసిపో యి, నిబంధనల మేరకు చెల్లించే మొత్తాన్ని కో ల్పోయారు. వీటితోపాటు ఇతర సౌకర్యాల కింద పింఛన్ వంటి డబ్బులు పొందలేక బాధిత కార్మిక కుటుంబాలు దూరమయ్యారు. గత ఏడేళ్లుగా ఆయా పీఎఫ్ పథకంతోపాటు ఈఎస్ఐ లేకపోవడంతో కార్మికుల ఆరోగ్య రక్షణ, చికిత్సలకు అవకాశం లేకుండా పోయింది. మళ్లీ ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే రెగ్యులర్గా అన్ని సౌకర్యాలు పొందవచ్చు. అప్పటి అధికారులు కార్మికులతో పని చేయించుకుని వారికి కనీస సౌకర్యం పొందకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు
తాండూర్: పారిశుద్ధ్య సమస్య తలెత్తే విధంగా బహిరంగ ప్రదేశాలు, జనావాసాల మధ్య చెత్త వేస్తే ఉపేక్షించబోమని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తాండూర్ గ్రామ పంచాయతీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తాండూర్ ఐబీ రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను తనిఖీ చేసి రోడ్లపై చెత్త వేసిన పలువురికి జరిమానా విధించారు. అనంతరం తాండూర్ ఐబీ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, నీటి సమస్యలు లేకుండా శ్రద్ధ వహించాలన్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ అధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించా లని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజ మాన్యాన్ని కోరారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయంలో గుర్తింపు సంఘం, యాజమాన్యం మధ్య ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. కాలనీలో కార్మికుల క్వార్టర్లకు మరమ్మతులు చేయాలన్నారు. అన్ని కాలనీల్లో రోడ్డు, క్వార్టర్ల నంబ ర్లు సైన్బోర్డ్ పై రాయించాలని, ఆర్కే 7 గని లో సపోర్ట్మెన్ కార్మికుల కోసం గది నిర్మించాలని కోరారు. ఇన్చార్జి జీఎం కురుమ రాజేందర్, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, ప్రతినిధులు కొట్టే కిషన్ రావు, ఎం. కొముర య్య, బద్రి బుచ్చయ్య, నాగభూషణం, ఏజెంట్ శ్రీధర్, డీజీఎంలు అనిల్కుమార్, రాజన్న ఆనంద్కుమార్, రవీందర్, మల్లయ్య పాల్గొన్నారు. -
మంచిర్యాల
7కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలోని పలు మండలాల్లో వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. రైతులు ధాన్యం విక్రయించి మద్ద తు ధర పొందాలని సూచించారు. 9లోu ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరం దిశగా ఈదురుగాలులు బలంగా వీస్తాయి. ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు.. కార్తిక మాసం నేపథ్యంలో ఆర్టీసీ శైవక్షేత్రాల పర్యాటకంపై దృష్టి సారించింది. ఆలయాల్లో భక్తుల దర్శనాల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. 8లోu -
అజ్ఞాతం వీడిన బండి దాదా
మందమర్రిరూరల్: మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(సికాస) కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు. కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ఎదిగిన నేత అనారోగ్యంతో లొంగుబాట పట్టారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మందమర్రి పట్టణంలోని మొదటిజోన్కు చెందిన అప్పటి సింగరేణి ఉద్యోగి రామారావు, అమృతమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ప్రకాష్ రెండో సంతానం. స్థానిక కార్మెల్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంటి సమీపంలోని కటికె దుకాణాల ఏరియా అంటే అప్పట్లో నక్సలైట్లకు అడ్డాగా ఉండేది. నక్సలైట్ల అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ(రాడికల్ విద్యార్థి సంఘం), రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్) పోటాపోటీగా కార్యకలాపాలు సాగించేవి. గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమానికి ఆకర్శితుడైన ప్రకాష్ ఆర్ఎస్యూతోపాటు అప్పటి ఎనిమిది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కేకే–2 గనిలో చేస్తున్న సమ్మెలో సికాస నాయకులతో చురుగ్గా పాల్గొన్నాడు. 1984లో అప్పటి ఏఐటీయూసీ నేత అబ్రహం హత్య కేసులో శిక్ష పడగా ఆదిలాబాద్ సబ్ జైల్కు వెళ్లాడు. ఇతర కేసుల్లో ఉన్న అప్పటి పీపుల్స్వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యలతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం హైదరాబాద్లో అజ్ఞాతంలో ఉంటూ హేమను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 1992లో హైదరాబాద్లో పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. 2004 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు విడుదలయ్యాడు. వరంగల్ జైలులో ఉండగా పీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పడడంతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతిచర్చల్లో పాల్గొన్నాడు. చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం నేతగా ఎదిగాడు. కుటుంబ సభ్యుల ఆనందంబండి ప్రకాష్ లొంగిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు ఎన్కౌంటర్లలో మృతిచెందాడని వార్త వినాల్సి వచ్చింది. అజ్ఞాతం వీడి లొంగిపోయి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనారోగ్యం.. ప్రకాష్కు వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, దేశవ్యాప్తంగా పలు ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు కుంగదీశాయి. దీంతో రెండు మూడు నెలల క్రిత మే లొంగుబాటు ప్రక్రియ ప్రారంభించాడు. మావోయిస్టు అగ్రనేతలతో చర్చించి కేంద్ర కమిటీ సభ్యుడిగా వచ్చే అవకాశాన్ని వదులుకుని తన ఆయుధాన్ని పార్టీకి అప్పగించి 20రోజుల క్రితమే లొంగుబాటు కోసం పోలీసుల ఆదీనంలోకి వచ్చినట్లు సమాచారం. డీజీపీ సమక్షంలో లొంగిపోవడంతో ఆయన పేరిట ఉన్న రివార్డు రూ.25లక్షలు అందజేశారు. -
పింఛన్లో రూ.16 కోతపై ఆందోళన
వేమనపల్లి: ఆసరా పింఛన్ల లబ్ధిదారుల నుంచి రూ.16 కోత విధించడంపై మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వృద్ధులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పోస్టుమాస్టర్ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ నగదు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4,016 అందజేయాలి. కానీ ప్రతీ నెల రూ.16 మినహాయించుకుని మిగతా మొత్తం ఇస్తున్నారు. దీంతో వృద్ధులు ఆందోళనకు దిగారు. మండలంలో వృద్ధులు 1,225 మంది, వితంతువులు 875, దివ్యాంగులు 266 మంది పింఛన్ పొందుతున్నారు. పింఛన్లో డబ్బు కోతపై పోస్టుమాస్టర్ శాంతను సంప్రదించగా.. కొందరు రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) చెల్లిస్తున్నారని, వడ్డీ కట్టడం లేదని తెలిపారు. చిల్లర రూ.16 వడ్డీ కింద తీసుకుంటున్నామని, ఈ వ్యవహారం మండలం అంతటా ఇలానే ఉందని సమాధానం ఇచ్చారు. -
పంటలు వర్షార్పణం
చెన్నూర్ గోదావరి పరీవాహక ప్రాంతంలో నెలకొరిగిన వరి పంటచెన్నూర్: జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనం అవుతుంటే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో కురిసిన వర్షాలతో వరద ముంచెత్తి గోదావరి పరీవాహక ప్రాంతంలో పత్తి పంటకు 50శాతం నష్టం వాటిల్లింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి కాయ రాలిపోతోంది. పొట్టకు వచ్చిన వరి పంట నేలకొరిగిపోవడంతో ధాన్యం దెబ్బతింటోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెన్నూర్ మండలం నారాయణపూర్, కిష్టంపేట, కొమ్మెర, ఆస్నాద తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. బయటకు వచ్చిన పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్ మండలంలో 13,818 ఎకరాల్లో పత్తి, 18,270 ఎకరాల్లో వరి సాగైంది. గత ఏడాది కంటే ఈసారి ఆయా పంటల సాగు పెరిగింది. పత్తి క్వింటాల్కు రూ.8,100 ధర పలుకుతుండడంతో లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. వరి నేలకొరగడంతో ధాన్యం తాలుగా మారుతుందని, ఆశించిన ధర రాదని పేర్కొంటున్నారు. వణికిస్తున్న మోంథా తుపానుమొన్నటి వరకు భారీ వర్షాల భయం ఉండగా రెండ్రోజులుగా వాయుగుండ ప్రభావం మోంథా తుపానుగా మారింది. మూడు రోజులపా టు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ వర్షాలు కురిస్తే పంటలు వర్షార్పణం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మానసిక ఆరోగ్యస్థితిపై సర్వే
కోటపల్లి: మండలంలోని ఎసన్వాయి గ్రా మంలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 ప్రా జెక్టును మంగళవారం ప్రారంభించారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మానసిక ఒత్తిడి, వృద్ధాప్య స మస్యలు, మద్యపానం, మహిళల ఆరోగ్యం, పిల్లల పోషణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్లు డాక్టర్ వామన్ కుల్కర్జి, డాక్టర్ సాయికృష్ణ, తెలంగా ణ రాష్ట్ర కో ఆర్డినేటర్ వినిల్, డాక్టర్ అరుణ శ్రీ, కార్యదర్శి అబ్ధుల్ తాజుద్దీన్, ఏఎన్ఎం తి రుపతి, అశా కార్యకర్త స్వరూప పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ‘బెల్ట్’ జోరు
కోటపల్లి: మండలంలోని జాతీయ రహదారి–63పై బెల్ట్ దుకాణాల్లో మద్యం దందా జోరుగా సాగుతోంది. దాబాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవిస్తూ అతివేగంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసు ల దర్యాప్తులో వెల్లడవుతోంది. కోటపల్లి మండలం లక్ష్మిపూర్, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆనుకు ని ఉన్న అంతర్రాష్ట్ర వంతెనకు కొద్ది దూరంలోనే మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర సరిహద్దు గ్రా మాల్లోని మందుబాబులు లక్ష్మిపూర్ గ్రామ సమీ పంలోని దాబాల్లో మద్యం కొనుగోలు చేస్తుంటా రు. దాబాల్లో ఒక్కో మద్యం బాటిల్పై రూ.50నుంచి రూ.100 వరకు వసూలు చేస్తుంటారు. జాతీయ రహదారికి ఇరువైపులా మహా రాష్ట్ర, తెలంగాణ స రిహద్దు ప్రాంతాలైన లక్ష్మిపూర్, రాపన్పల్లి 63వ జా తీయ రహదారిపై దాబాల్లో ఎకై ్సజ్, పోలీసులు తని ఖీ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ తనిఖీకి వెళ్లాల్సి వస్తే ముందుగానే నిర్వాహకులకు సమాచారం చేరుతుందనే ఆరోపణలున్నాయి. దాబాల్లో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ చెన్నూర్ సీఐ హరిని సంప్రదించగా.. దాబాల్లో మద్యం అమ్మకాలు నిషేధమని, విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
‘మహా’ ధాన్యం వ్యాన్ పట్టివేత
కోటపల్లి: మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం జిల్లాలోకి తరలిస్తు న్న వ్యాన్ను తెలంగాణ సరిహద్దులోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ‘జిల్లాకు ‘మహా’ ధాన్యం!’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చెక్పోస్టు వద్ద పోలీ సులు వాహనాల తనిఖీ చేపట్టారు. మహారా ష్ట్రలోని సిరొంచ తాలూ కా నగురం గ్రామానికి చెందిన బూర్తి మల్ల య్య చెన్నూర్ పట్టణంలో ని ఓ మిల్లుకు 254 వడ్ల బస్తాలను అక్రమంగా వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సివిల్ సప్లయ్ అధికారుల కు అప్పగించినట్లు ఎస్సై రాజేందర్ తెలిపా రు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులో 24గంటలు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్పందన -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తాండూర్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి సూచించారు. ఇటీవల అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో మంగళవారం మండలంలోని బోయపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, విద్యాభారతి పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. ప్రశ్నపత్రాల పంపిణీ తీరు, పరీక్షల నిర్వహణను క్షు ణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ ను వెలికితీతకు నిర్వహించే ఈ పరీక్షలను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎంఈఓ మల్లేశం, విద్యాభారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ సురభి శరత్కుమార్ పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థ
మంచిర్యాలక్రైం/నస్పూర్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల(పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని మంగళవారం స్థానిక సీసీసీ కార్నర్ నుంచి మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు మంచిర్యాల డివిజన్ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల కోసం పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఎందరో పోలీసులు విధి నిర్వహణలో మావోయిస్టులు, కరుడుగట్టిన నేరగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించినప్పుడే నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్రావ్, నరేష్కుమార్, సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, జాతీ య రహదారులు, రోడ్లు భవనాలు, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమి షనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్ర త కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 7వరకు అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. హైదరాబాద్–కరీంనగర్–చంద్రాపూర్ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, బాసర–లక్సెట్టిపేట రహదారి(రాష్ట్రీయ రహదారి–24)పై ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నందున భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు సెల్లార్ స్థలాలు పార్కింగ్ కోసమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, నాలాలపై అనధికార నిర్మాణాలను వెంటనే తొలగించాలని, సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బాధ్యతగా వ్యవహరించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ చాంబర్లో పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27నుంచి నవంబర్ 2వరకు విజిలెన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలిపా రు. అవార్డుల జారీ వేగవంతం చేయాలిమంచిర్యాలటౌన్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి, ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి జాతీయ రహదారి విస్తరణలో ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. -
పొట్టకచ్చింది..
ఐదెకరాల్లో వరి పంట సాగు చే శా. పొట్ట దశకు వచ్చింది. ఇటీవ ల కురిసిన భారీ వర్షానికి వరి నేలవాలింది. నోటికాడికి వచ్చిన పంట కళ్లముందే నాశనమైంది. పంట కోసం చేసిన అప్పు తీరే పరిస్థితి లేదు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. –టి.రాజయ్య, రైతు, చెన్నూర్ పత్తి సర్వనాశనమైంది.. ఈ ఏడాది పత్తి రైతులను ప్రకృతి పగబట్టింది. వరుస వర్షాలతో పత్తి పంట తీ వ్రంగా దెబ్బతింది. ఎకరానికి పది నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాలి. వర్షాల కారణంగా ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదు. వర్షాలకు అప్పులే మిగిలే అవకాశం ఉంది. –మహేశ్, రైతు, చెన్నూర్ -
వ్యాన్ను ఢీకొట్టిన మట్టి లారీ
తాండూర్: సుబాబుల్లోడ్తో వెళ్తున్న వ్యాన్ను మంగళవారం తెల్లవారుజామున తాండూర్ మండలం వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద నిలిపి ఉంచగా వెనుక నుంచి ఓ మట్టి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో క్లీనర్ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై రెండు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయమేర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. సర్వీస్ రోడ్లపై వాహనాలు నిలుపవద్దని ఆదేశాలున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
కుక్కదాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో వీధి కుక్క వృద్ధురాలిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన పురప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వివరాలు.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దారవేణి లచ్చక్క (లక్ష్మి) అనే వృద్ధురాలు 20 ఏళ్లుగా నిత్యం బెల్లంపల్లికి వచ్చి పాలు విక్రయిస్తోంది. లచ్చక్క మంగళవారం హన్మాన్ బస్తీకి వెళ్లి ఇంటింటా తిరుగుతూ పాలు పోస్తోంది. ఈ క్రమంలో ఓ వీధి కుక్క ఒక్కసారిగా లచ్చక్క రెండు కాళ్లను కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఆమె అరుపులు విని వచ్చిన పలువురు కుక్కను వెళ్లగొట్టారు. లచ్చ వ్వ స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్లో బె ల్లంపల్లి ఏరియాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. లచ్చక్క కుటుంబీకులు వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, లచ్చక్కకు తీవ్ర రక్తస్రావం అవుతుండగా చికిత్స క్లిష్టంగా మారి నట్లు ఆమె కుమారుడు వెంకన్న తెలిపాడు. -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జావిద్ నిజాయితీ చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మరిచిపోయిన బ్యా గును పోలీసులకు అప్పగించాడు. వివరాలు.. ఉట్నూర్ ఎక్స్ రోడ్డుకు చెందిన సునీత సొంతూరు మహారాష్ట్రకు వెళ్లింది. తిరిగి మంగళవారం ట్రైన్లో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె బస్టాండ్కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించింది. బస్టాండ్లో దిగిన ఆమె ఐదు గ్రాముల బంగారు కమ్మలు, 10 తులాల వెండి ఆభరణాలు కలిగిన బ్యాగు మరిచిపోయింది. వెంటనే అప్రమత్తమై బస్టాండ్ వద్ద గల ఆదిలాబా ద్ పోలీస్ సబ్ కంట్రోల్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఏఆర్ ఎస్సై దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ అప్రమత్తమయ్యారు. ఇంతలో ఆటోడ్రైవర్ జావిద్ నిజాయితీగా అక్కడకు చేరుకుని ఆ బ్యాగును పోలీసులకు అందజేశాడు. దీంతో ఆ బ్యాగును వారు బాధితురాలికి అప్పగించారు. త్వరగా స్పందించి బాధితురాలికి న్యాయం చేసేలా కృషి చేసిన సిబ్బందిని, నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ను డీఎస్పీ జీవన్రెడ్డి అభినందించారు. -
ఉరేసుకుని రైతు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని మొహళ గ్రామానికి చెందిన రైతు దండే గంగన్న (53) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గంగన్నకు ఇద్దరు కూతుళ్లున్నారు. రూ.3లక్షలు అప్పు చేసి పెద్ద కూతురు వివాహం చేశాడు. ఖరీఫ్లో తాను సాగు చేసిన పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి వద్ద ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతుడి భార్య బోజాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ నిందితుడి అరెస్ట్ముధోల్: ఆగస్టు 12న మండల కేంద్రంలోని ఝటాశంకర్ ఆలయంలో చోరీకి పాల్పడ్డ బాసర గ్రామానికి చెందిన ఓర్సా లక్ష్మణ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐబీ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లక్ష్మణ్ పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నట్లు తెలిపారు. అతడి నుంచి రూ.1,500 నగదు, ద్విచక్రవాహనం స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుకున్న ద్విచక్రవాహనం సోమవారం బోధన్ పట్టణంలోని ఓ మెకానిక్ షాపు నుంచి దొంగిలించినట్లు తెలిపారు. అతడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పాము కాటుతో మహిళ మృతికెరమెరి: మండలంలోని సావర్ఖెడా గ్రామానికి చెందిన మొహర్లే సంధ్య (32) పాముకాటుతో మరణించింది. ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్య సోమవారం చేనులో పత్తి సేకరిస్తుండగా గుర్తు తెలియని పాము కా టువేసింది. గమనించిన పలువురు రైతులు ఆమె భర్త తులసీరాంకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చా రు. వెంటనే అక్కడికి చేరుకున్న తులసీరాం సంధ్యను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తులసీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధూకర్ తెలిపారు. -
● ఎంపీడీవో వేధింపులతోనేనని ఆరోపణలు ● విచారణకు ఆయా సంఘాల డిమాండ్
టెక్నికల్ అసిస్టెంట్ మృతిబెల్లంపల్లిరూరల్: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ దుగుట భాస్కర్ (31) మంగళవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. ఎంపీడీవో మహేందర్ 15రో జులుగా విధి నిర్వహణలో భాస్కర్పై ఒత్తిడి పెంచి మనోవేదనకు గురిచేస్తున్నట్లు తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎంపీడీవో ముడుపులు ఇవ్వాలని ఒత్తిడి తేవడం, ఈక్రమంలో వారంక్రితం భార్గవ్కు మెమో జారీ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందడంతోపాటు అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు వారు చెబుతున్నారు. ఈజీఎస్ ఈసీ అనిల్ ఎంపీడీవోపై ఇవే ఆరోపిస్తూ చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భార్గ వ్ మృతికి కారణమైన ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు కోరుతున్నారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి భార్గవ్ మృతికి ఎంపీడీవోనే కారణమని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని నేతకాని మహార్ సేవా సంఘం, దళిత సంఘాల నాయకులు గుమాస శ్రీకాంత్, ముడిమడుగుల మహేందర్, దాగం మల్లేశ్, రామటెంకి వాసుదేవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆరోపణల్లో వాస్తవం లేదు – మహేందర్, ఎంపీడీవో భార్గవ్ మృతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎంపీడీవో మహేందర్ వివరించారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో 145 సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని చోట్ల ఏర్పాటు చేయకుండానే రూ.5.80 లక్షలు డ్రా చేయడంపై సిబ్బంది నిలదీశానని తెలిపారు. దీని పై ఉన్నతాధికారులకు నివేదించానని సూచించారు. అయితే.. గిట్టని వారే తనపై కక్ష సాధింపుతో తప్పు డు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భార్గవ్ మృతిపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే తాను సహకరిస్తానని తెలిపారు. కొంతకాలంగా అనారో గ్యంతో బాధ పడుతున్న భార్గవ్ ఆరోగ్యం క్షీణించిన కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. -
లాభాల ఆశ చూపి మోసగించారని ఫిర్యాదు
ఖానాపూర్: ఓ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి తమ వద్ద రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేశారని ఖానాపూర్, కడెం, పెంబి మండలాలకు చెందిన 12మంది రైతులు మంగళవారం ఎస్పీ జానకీ షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము పెట్టుబడి పెట్టి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోయారు. బాధ్యులపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో దొనికెని భీమయ్య, మోటపలుకుల రాజమౌళి, ఎండీ ఖాజా, కూరపాటి రాజేశ్వర్రెడ్డి, గుడిసె నర్స య్య, ఏలేటి నర్సింహారెడ్డి, ముత్యాల రాజేశ్వర్రెడ్డి, మేకల రాజిరెడ్డి, భూషణ్రెడ్డి, పుప్పాల రవి, బండారి రవీందర్, గుమ్ముల లింగన్న ఉన్నారు. -
ఆటో బోల్తా: పలువురికి గాయాలు
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి వాగు వంతెన వద్ద ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం నాగారం గ్రామం నుంచి బద్దంపల్లికి వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో బోగారపు బాపు అనే ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నాయిని గట్టయ్య, మరో ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా, వీరిని 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని ఏఎస్సై నరేశ్, పోలీసులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుదిలావర్పూర్: మండల కేంద్రానికి సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై మంగళవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కుంటాల మండల కేంద్రానికి చెందిన జుట్టు సుభాష్ తన కారులో నిర్మల్ వైపు నుంచి తన స్వగ్రామమైన కుంటాల వైపునకు వెళ్తున్నాడు. ఇతడి కారును గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గమనించిన సమీప టోల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ సుభాష్ను కారులోంచి దించి అంబులెన్స్లో చికిత్స కోసం నిర్మల్కు తరలించారు. ప్రస్తుతం సుభాష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిమామడ: మండలంలోని బూరుగుపల్లి జాతీయరహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన లాకేశ్వర్ నాయ క్ (25) దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొ ట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
నాగారంలో గుడుంబా నిషేధం
వేమనపల్లి: గుడుంబా విక్రయాలు జరపకూడదని మండలంలోని నాగారం గ్రామస్తులు తీర్మానించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని బు య్యారం, దహెగాం, కన్నెపల్లి మండలాల నుంచి కొందరు గుడుంబా ప్యాకెట్లు తెచ్చి గ్రామంలో విక్రయిస్తున్నారు. గుడుంబా తాగినవారు కుటుంబాల్లో గొడవ పడుతున్నారు. పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమష్టిగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరు ఉల్లంఘించినా పట్టుకుని పోలీస్, ఆబ్కారీశాఖ అధికారులకు అప్పగించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. -
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి వేళాయె..
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మ హాపోచమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమానికి దేవాదాయశాఖ న వంబర్ 7న ముహూర్తం ఖరారు చేసింది. అమ్మవా రి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నేటి నుంచి 11 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మండలంలో ని ఆయా గ్రామాల్లోని దాదాపు 100మంది భక్తులు అమ్మవారి దీక్ష స్వీకరించినట్లు ఆలయ ప్రధాన అ ర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోని వసతిగదుల్లో సన్నిధానం ఏ ర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మాలధారణకు ముందుకు వచ్చిన భక్తులకు శతాధిక ప్రతిష్ఠాపనా చార్యులు గురుమంచి చంద్రశేఖరశర్మ మాలవేసి ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మండలంలోని వీడీసీలు ముందుకువచ్చాయి. ఇతర సేవాకార్యక్రమాలు చేపట్టేందుకు మహారాష్ట్రకు చెందిన భక్తులు ఆసక్తి చూపుతున్నా రు. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను అట్ట హాసంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశా రు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజల అభీ ష్టం మేరకే విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ ఈవో భూమయ్య తెలిపారు. భ క్తులు విరాళాలిచ్చేందుకు ముందుకువస్తున్నట్లు పే ర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు
ఆదిలాబాద్: ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కార్తీకమాసాన్ని పరమపవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. హరిహరాదులకు ప్రీతిపాత్రంగా భావించే ఈ మాసంలో కార్తీక స్నానాలు చేయడంతోపాటు శైవక్షేత్రాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు వేశారు. పుణ్యక్షేత్రాలు ఇవే.. కార్తీకమాసం నేపథ్యంలో ఆదిలాబాద్ డిపో నుంచి ఆర్టీసీ అధికారులు అరుణాచలం, కాళేశ్వరం క్షేత్రాల కు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి అరుణాచలం, అయోధ్య, మంచి ర్యాల నుంచి అరుణాచలం, శ్రీశైలం, భైంసా నుంచి వేములవాడ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు వేశా రు. ప్రయాణికుల డిమాండ్కు తగినట్లు తిరుపతి, రామేశ్వరం, శబరిమలై పుణ్యక్షేత్రాలకూ బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి.. మంచిర్యాల బస్టాండ్ నుంచి.. నిర్మల్, భైంసా బస్టాండ్ల నుంచి.. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు డిపో పేరు సెల్ నంబర్ ఆదిలాబాద్, ఉట్నూరు 9959226002 నిర్మల్ 9959226003 భైంసా 9959226005 ఆసిఫాబాద్ 9959226006 మంచిర్యాల 9959226004 సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ శైవక్షేత్రాలకు బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్లోని జిల్లా కేంద్రాలకు సమీపంగా ఉండే పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అరుణాచలం, అయోధ్య, కాశీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇప్పటికే తొమ్మిది ప్రత్యేక సర్వీసులు బుక్ అయ్యాయి. ప్రయాణికుల స్పందనకు అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎస్.భవానీ ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ -
పెట్టుబడుల పేరిట మోసగించిన ఒకరి అరెస్ట్
కాగజ్నగర్ టౌన్: స్టాక్స్, ఐపీవో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ పేరిట వాట్సాప్ గ్రూప్లు సృష్టించి మోసగించిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వహీదుద్దీన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్కు చెందిన అశోక్కుమార్ వర్మాస్బుక్ డిస్కషన్, అలయన్స్ పేరిట వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేశాడు. 108 మందిని చేర్చి వారితో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డబ్బులు కాజేశాడు. బాధితులు 26 దఫాలుగా రూ.76.50లక్షలు ఇన్వెస్ట్ చేశారు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఓ ఫిర్యాదుదారు జూలై 5న ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కాంతిలాల్పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్నగర్ పట్టణ సీఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరిట వచ్చే ఆఫర్లను నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు. అపరిచతులు క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఉండకూడదని పేర్కొన్నారు. ఆన్లైన్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే అధికారిక, ధ్రువీకృత ప్లాట్ఫాంలనే ఉపయోగించాలని తెలిపారు. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైం, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పట్టణ సీఐ ప్రేంకుమార్, ఎస్సై సుధాకర్, శ్రీకాంత్ తదితరులున్నారు. -
ఏఐ సంస్థతో ఆర్జీయూకేటీకి అవగాహన ఒప్పందం
బాసర: బాసర ఆర్జీయూకేటీకి మ్యాడ్ సైంటిస్ట్ ఏఐ సంస్థతో అంతర్జాల అవగాహన ఒప్పందం కుదిరిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. మంగళవారం ఆయన కళాశాలలో మాట్లాడారు. విద్యార్థుల్లో వృత్తిపరమై న నైపుణ్యాలు, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్ ద్వారా శక్తిమంతమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఆర్జీయూకేటీ బాసర హైదరాబాద్కు చెందిన మ్యాడ్ సైంటిస్ట్ ఏఐ సంస్థతో అంతర్జాలంలో పరస్పర అవగాహన ఒప్పందం కుదరడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆర్జీయూకేటీ విద్యార్థులకు మ్యాడ్ సైంటిస్ట్ సంస్థ నైపుణ్య శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఏఐ విద్య, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వనరులను ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దిల్ బహార్, డా.మహేశ్, శేఖర్, డా.విఠల్, డా.సాగర్, డా.కాశన్న, డా.భావ్సింగ్, సుజయ్ సర్కార్, ఉపేందర్, వెంకటరామ్, మ్యాడ్ సైంటిస్ట్ సంస్థ నిపుణులు సిలివేరు శ్రీనివాస్, భాను కిరణ్, భానుప్రసాద్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. -
తోటల పనులు ప్రారంభించాలి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్లోని 379, 380 కంపార్ట్మెంట్లో ఆక్రమణలు తొలగించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పథకం ద్వారా వెదురు, యూకలిప్టస్ తోటల పెంపకం పనులు ప్రారంభించాలని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ సూచించారు. తాళ్లపేట అటవీ రేంజి కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీవో, అటవీ శాఖ సిబ్బందితో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు 380 కంపార్ట్ మెంట్లో గిరిజనులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, డీఆర్వో సాగరిక, ఎఫ్ఎస్వో రాజేందర్ పాల్గొన్నారు. -
వలపువల విసిరి.. రూ.8లక్షలు దోచేసి
ఆదిలాబాద్టౌన్: అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వలపు వలతో రూ.8లక్షలు స్వాహా చేసిన ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. సోమవారం వన్టౌన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ ఈ నెల 25న వన్టౌన్లో ఫిర్యాదు చేశాడు. తన వివాహాం కోసం బాధితుడు యూబ్యూబ్లో పరిశీలించగా కృష్ణవేణి అనే అమ్మాయి ఫొటోతో రూపావత్ శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజీ అనే మోసగాడిని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడైన మంజీ కృష్ణవేణి పేరిట మహిళా గొంతుతో మాట్లాడి తాను ధనవంతురాలినని తన ఆస్తులు కోర్టులో ఉన్నాయని నమ్మించాడు. న్యాయవాదికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తన వివాహాం తర్వాత ఆస్తులు, వ్యాపారాలను పూర్తిగా చూసుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడు విడుతల వారీగా మోసగాడికి రూ.8లక్షలను ఆన్లైన్లో పంపించాడు. తిరిగి డబ్బులివ్వాలని అడుగగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ విభాగం 1930కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన వన్టౌన్ పోలీసులు సైబర్ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సూర్యాపేట జిల్లాకు పంపించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. వారిలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రాంచంద్రాపూరం తండాకు చెందిన మాలోత్ మంజీ, భుక్యా గణేశ్, రూపావత్ శ్రావణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.50లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేంకుమార్, సైబర్ సెల్ ఎస్సై గోపీకృష్ణ, వన్టౌన్ ఏఎస్సై గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్ తదితరులున్నారు. -
పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నిత్యం విధుల్లో పోలీసులతోపాటు విధి నిర్వహణలో అమరులు అవుతున్న వారి త్యాగాలు వెలకట్ట లేనివని బెటాలి యన్ కమాండెంట్ పి.వెంకటరాములు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవా రం బెటాలియన్ ఆవరణలో బైక్ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గుడిపేట గ్రామ, జాతీయ రహదారులపై బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణరక్షణలో పోలీసులు ఏదో ఒక సందర్భంలో అమరులు అవుతున్నారని తెలిపారు. ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్రావు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మధుకర్ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి
వేమనపల్లి: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో కారకులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ను కోరా రు. సోమవారం ఆయన మధుకర్ కుటుంబ స భ్యులతో కలిసి కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిశారు. మధుకర్ కు టుంబానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంపెల అజయ్కుమార్, నాయకులు సత్యనారా యణ, మధునయ్య, వెంకాగౌడ్, లస్మయ్య, ఏట వెంకటేష్, రవికుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం
పాతమంచిర్యాల: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షు డు దుంపల రంజిత్కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో యూనియన్ 2వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ ఎఫ్టీఏను చెల్లించాలని అ న్నారు. రెండో ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలు మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా దుంపల రంజిత్కుమార్, అధ్యక్షురాలుగా సంధ్య, కార్యదర్శిగా మౌ లాలి, కోశాధికారిగా గంగ, ఉపాధ్యక్షులుగా శోభ, రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిగా విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులుగా సత్యవతి ఎన్నికయ్యారు. -
నేరస్తులపై బహిష్కరణ వేటు
మంచిర్యాలక్రైం: కరుడుగట్టిన నేరస్తులు, గంజాయి, దొంగతనాలు, చైన్స్నాచర్లు, మహిళలను వేధించేవారు, భూ ఆక్రమణదారులు వంటి చట్టవ్యతిరేకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 37మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకుడిపై 25 కేసులు ఉండడంతో రెండు నెలల క్రితం పీడీ యాక్టు నమోదైంది. మరికొందరిపై పీడీ యాక్టు, పద్ధతి మార్చుకోకపోతే నగర బహిష్కరణకు సైతం జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మందమర్రికి చెందిన ఓ రౌడీషీటర్పై నెల రోజుల క్రితం నగర బహిష్కరణ విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై, సెటిల్మెంటు, గ్యాంగుదాడులు, సంఘవిద్రోహ శక్తులు, పాత నేరస్తులపై ఎస్బీ, ఇంటెలిజెన్స్, ప్రత్యేక పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద హత్య, హైదరాబాద్లోని చాదర్ఘాట్లో డీసీపీ, గన్మెన్లపై కత్తులతో సెల్ఫోన్ దొంగల దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేరచరితుల విషయంలో పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని పక్కనపెట్టి వారిని కట్టడి చేయడంలో నిమగ్నమయ్యారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో.. జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయ డం, గ్యాంగ్దాడులు, సెటిల్మెంట్లు, నేరస్తులు, గంజాయి, భూకబ్జాలకు పాల్పడే 250 మందిపై రౌడీషీట్ ఉంది. ఇందులో కొందరు పాత నేరస్తులు కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. వీరిలో ఒకరిపై నగర బహిష్కరణ విధించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించడం, పద్ధతి మార్చుకోవాలని లేదంటే నగర బహిష్కరణ తప్పదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో దడనగర బహిష్కరణ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కేసుల నమోదుతో అక్రమార్కుల్లో పోలీసులు దడ పుట్టిస్తున్నా రు. జిల్లాలోని కొందరు రౌడీషీటర్లు ఇప్పటి కే మంచిర్యాలను వదిలి హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లి ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తూ ప్రత్యేక నిఘాను పటిష్టం చేశారు. -
జిల్లాకు మహా ధాన్యం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు విచారణ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత యాసంగి సీజన్లో చెన్నూరు నియోజకవర్గంలో పలు కొనుగోలు కేంద్రాలకు మహారాష్ట్ర నుంచి వచ్చిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర రైతుల పేర్లతో విక్రయించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల పౌరసరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు ఆయా కేంద్రాల్లో జరిగిన కొనుగోళ్ల తీరుపై తనిఖీ చేసి వెళ్లారు. జిల్లా కార్యాలయం, జైపూర్ మండలం నర్సింగాపూర్, చెన్నూరు మండలం దుగ్నేపల్లితోపాటు పలు కేంద్రాల్లో గత యాసంగిలో పొరుగు రాష్ట్ర ధాన్యం ఇక్కడి రైతుల పేర్లతో అమ్ముకున్నట్లు రావడంతో అప్పటి రికార్డులు పరిశీలించారు. కేంద్ర నిర్వాహకులు, వ్యవసాయ అధికారులు, సహకరించిన రైతులు ఎవరెవరు, ఆ కేంద్ర పరిధిలో ఎంత మొత్తం లక్ష్యం ఉంది?, ఎంత మొత్తంలో అమ్మారు?, ఏయే మిల్లులకు ఆ ధాన్యం వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేశారు. దీనిపై నివేదిక ఉన్నతస్థాయిలోనే అందజేయనున్నట్లు తెలిసింది. దిద్దుబాటు చర్యలు మహారాష్ట్ర ధాన్యం రాకుండా జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేట్టింది. గత సీజన్లలో పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం వస్తోందనే చెక్పోస్టులు ప్రాణహిత బ్రిడ్జికి సమీపంలోనే ఏర్పాటు చేశారు. గతంలో జాతీయ రహదారిపైనున్న కోటపల్లి మండలం పారుపల్లి శివారులో ఉండేది. దీంతో పర్యవేక్షణ కొరవడింది. ఇక అక్కడ ఉన్న సిబ్బందిని మేనేజ్ చేస్తూ ధాన్యం రాష్ట్రం దాటిస్తూ అమ్మేస్తున్నారు. రాత్రివేళ లారీలకొద్దీ కోటపల్లి, చెన్నూరు, జైపూర్ మండలాల్లో కేంద్రాలకు తరలించి ఉదయం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. వీటికి కేంద్ర నిర్వాహకులతోపాటు వ్యవసాయ అధికారుల సహకారంతోనూ ఈ అక్రమ ధాన్యం కొనుగోలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వానాకాలంలో 301కేంద్రాలతో 2.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ఈసారి పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అక్రమాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. పకడ్బందీగా నిఘా మహారాష్ట్ర నుంచి ధాన్యం జిల్లాకు వస్తే చాలాసార్లు ఆ లారీలను తిప్పి పంపించాం. ఆ రాష్ట్ర ధాన్యం ఇక్కడ అమ్ముకోవడానికి వీలు లేదు. దీనిపై చెక్పోస్ట్ల్లో పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశాం. అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు ఉంటాయి. – సీహెచ్.బ్రహ్మారావు, జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి దొడ్డిదారిలో..జిల్లాకు వందల క్వింటాళ్ల కొద్దీ మహారాష్ట్ర నుంచి ధాన్యం దొడ్డిదారిలో వస్తోంది. ప్రాణహిత నది ఆవల కొందరు సిరొంచ సమీప గ్రామాల నుంచి అధిక ధర ఆశతో జిల్లాకు చాటుగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వడ్ల వ్యాపారులు ఇక్కడి వారి సహకారంతో అక్కడ తక్కువ ధరతో కొనుగోలు చేసి తెలంగాణ పరిధిలో స్థానిక రైతుల పేర్లతో అమ్ముకుని లాభం పొందుతున్నారు. ఈ సీజన్లో పరిశీలిస్తే ఒక క్వింటాల్కు ఏ గ్రేడ్ రూ.2,389 సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ఉంది. ఇక సన్న రకం వడ్లకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఉంది. మహారాష్ట్రలో ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లతో అక్కడి ధర తక్కువ. ఇక్కడ బోనస్ పొందే అవకాశం ఉంది. దీంతో చెక్పోస్టులను దాటేస్తే అమ్ముకోవచ్చని ఎత్తు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రంతో స్థానికుల బంధుత్వాలు, సత్సంబంధాలు, వ్యవసాయ భూములు ఉండడంతో అక్కడి వారికి జిల్లా వాసులు సహకారం అందిస్తున్నారు. దీంతో అధిక ధర పొందేందుకు సులువుగా మారుతోంది. ప్రభుత్వం రూ.వందల కోట్లు పెట్టి రాష్ట్ర రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ ఇవ్వాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మిల్లులకు ధాన్యం తరలిస్తోంది. అయితే పొరుగు రాష్ట్ర రైతులు అక్రమ మార్గంలో అమ్ముకోవడంతో ప్రజాధనం దుర్వి నియోగం అవుతోంది. -
నగరంలో దోమల మోత
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో డ్రె యినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం లేక మురు గు నీరు ఖాళీ స్థలాల్లోకి పారుతూ దోమలు, పందులకు ఆవాసంగా మారుతోంది. దుర్వాసన, దోమల మోతతో ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో పారి శుద్ధ్యాన్ని మెరుగుపర్చకపోవడంతో మురుగునీరు ఇళ్ల మధ్యన చేరుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు పారిశుద్ధ్యం మెరుగ్గానే ఉండేది. ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, డ్రెయినేజీ నీరు రోడ్లు, ఖాళీస్థలాల్లోకి రాకుండా చూడడంతోపాటు ఖాళీ స్థలాల్లో నిలిస్తే దోమలకు ఆవాసంగా మారకుండా ఆయిల్ బాల్స్ వేసి ఫాగింగ్ చేసేవారు. ఈ ఏడాది జనవరిలో నస్పూరు మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను మంచిర్యాల మున్సిపాలిటీలో విలీ నం చేసి కార్పొరేషన్గా మార్చారు. పరిధి పెరగడంతో కార్మికులు లేక ఉన్నవారిని కార్పొరేష న్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వినియోగిస్తున్నారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉండడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా నిర్వహించలేక సమస్య ఏర్పడుతోందని తెలుస్తోంది. పాలకవర్గ పదవీ కాలం జనవరిలో పూర్తయింది. డివిజన్లలో తాజామాజీ ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నా కార్పొరేషన్ అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడి పది నెలలు అవుతున్నా ఇంకా పాలన గాడిలో పడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్రెయినేజీలు నిర్మిస్తేనే...మంచిర్యాల కార్పొరేషన్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం సమస్యగా మారుతోంది. నగరంలో 463 కిలోమీటర్ల మేర డ్రెయినేజీ వ్యవస్థ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 273 కిలోమీటర్లు మాత్రమే నిర్మించారు. మిగతా 190 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసేలోపు శివారు ప్రాంతాల్లో మరిన్ని కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడితే మరింత పెరుగుతాయి. శరవేగంగా పెరుగుతున్న నగర విస్తీర్ణానికి అనుగుణంగా డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడం, పలుచోట్ల గతంలో నిర్మించిన కాలువలు శిథిలమవడం వల్ల మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి పారుతోంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ చేపట్టినా మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అవసరం మేరకు తాత్కాలికంగా కార్మికులను నియమించుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూనే అవసరమైన చోట డ్రెయినేజీలు నిర్మిస్తే నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది.మురుగు నీరు నిల్వ లేకుండా చూస్తాం నగరంలో అవసరమైన చోట డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొన్ని చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపట్టని చోట మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి వస్తోంది. మురుగు నీరు బయటకు రాకుండా, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాని కి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే నిర్మాణ పనులు చేపడతాం. – సంపత్కుమార్, కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్ -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కాంస్య పతకం
బెల్లంపల్లి: యాదాద్రి భువనగిరిలో ఈ నెల 24 నుంచి 26వరకు స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులు సత్తా చాటారు. సీఎస్ఎన్ఆర్ గౌడ్ జూనియర్ కళాశాలలో అండర్–19 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకం గెలుచుకున్నారు. క్రీడాకారులను సోమవారం కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్కుమార్, ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెక్రెటరీ బాబురావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ హరీష్, సంక్షేమ గురుకుల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రమేష్, పీఈటీలు అల్లూరి వామన్, రాజేందర్ పాల్గొన్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బేల మండలం బోదిడి గ్రామానికి చెందిన కుమరం దేవరావు తనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాల మండలం రెబ్బన గ్రామానికి చెందిన శిరీష ఎంబీబీఎస్ చదువు కోసం ఫీజు మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. -
ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన శ్రీరాముల శ్రీకాంత్(44) పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య వాణిశ్రీ, కూతురు శ్లోక ఉన్నారు. గతకొంత కాలంగా భార్య అనారోగ్యం బారిన పడింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మనస్తాపానికి గురైన శ్రీఖాంత్ ఈ నెల 19న మావల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 20న హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈయన గతంలో మాజీ మంత్రి జోగు రామన్న వద్ద పీఏగా పనిచేశారు. -
హామీలు సరే.. అమలేది..!
బెల్లంపల్లి: రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భూగర్భ బొగ్గుగనులు, విభాగాలు వేలాదిమంది కార్మికులతో విరాజిల్లిన బెల్లంపల్లి ప్రస్తుతం కళ తప్పింది. ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు, మానవ వనరులు అపారంగా ఉన్నా అభివృద్ధి కరువైంది. ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు ఇచ్చే హామీలు అమలుకు నోచుకోక నిరుద్యోగం పెరిగిపోతోంది. పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ ఎప్పుడో..! బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తామని గత రెండున్నర దశాబ్దాల కాలంగా పాలకులు, నాయకులు హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయించి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో, ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ అంశం ఎన్నికల నినాదంగా మారింది. ఈ విషయంలో అడుగు ముందుకు పడక విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయ కళాశాల బెల్లంపల్లి కేంద్రంగా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఏర్పాటై పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. కేవీకేకు అనుబంధంగా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ కళాశాల మంజూరుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా పాలకులు యోచించడం లేదు. అగ్రికల్చర్/హార్టికల్చర్ కళాశాల మంజూరైతే విద్యార్థులు, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండున్నర దశాబ్దాల క్రితం బెల్లంపల్లికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మంజూరు కాగా అప్పటి పాలకుల పట్టింపులేని తనంతో జగిత్యాలకు తరలిపోయింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలేవీ..? రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధి గాంచిన బెల్లంపల్లిలో బొ గ్గు ఆధారిత పరిశ్రమల ఊసు లేకుండా ఉంది. బొ గ్గు గనులతో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో రకరకాల కారణాలతో గనులన్నీ మూ త పడగా, వేలాది మంది కార్మికులు ఇతర ఏరియాలకు వెళ్లారు. గనులు మూతపడి, కార్మికులు బదిలీ కావడంతో బెల్లంపల్లి వైభవం మసకబారింది. ఈ క్రమంలో అర్ధంతరంగా మూతపడ్డ భూగర్భ గనుల్లో ఇంకా ఏళ్ల తరబడి తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నా వెలికితీతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఈ కారణంగా బొగ్గు ఆధారిత పరి శ్రమలు ఏర్పాటు కాక నిరుద్యోగులు, కార్మికుల పి ల్లలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. బెల్లంపల్లి పట్టణం నర్సింగ్ కళాశాల లేనట్లే..! ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో 275 పడకల సామర్థ్యం కలిగిన ఏరి యా ఆసుపత్రి, ప్రభుత్వ పరంగా వంద పడకలతో కూడిన ఏరియా ఆసుపత్రులు బెల్లంపల్లిలో ఉన్నాయి. ఏటా వందలాది మంది ఈ ప్రాంత విద్యార్థినులు నర్సింగ్ విద్య అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ అవకాశం అందుబాటులో లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు అందుబాటులో ఉండడంతో బాలికలు పోటీ పడి చేరుతున్నారు. అదే తీరుగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయించాలనే డిమాండ్ ఉన్నా పట్టింపు చేయడం లేదు. జాడలేని మెడికల్ కళాశాల.. ఆర్టీసీ బస్డిపో.. బెల్లంపల్లికి పూర్వ వైభవం తీసుకు రావడానికి మెడికల్ కళాశాల, ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని హామీలిచ్చిన పాలకుల నోటి వెంట ప్రస్తుతం ఆ మాట రావడం లేదు. మెడికల్ కళాశాల మంజూరు అవుతుందో లేదో తెలియదు కానీ కనీసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తగినంతమంది వైద్యులు, సిబ్బందిని నియమించడంలోనూ విఫలం అవుతున్నారు. ఆర్టీసీ బస్డిపో మంజూరు చేయిస్తానని చేసిన వాగ్దానం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదనే అసంతృప్తి ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఫిర్యాదులు పరిష్కరించాలి
బెల్లంపల్లిరూరల్: పోలీస్స్టేషన్కు వచ్చేవారి తో మర్యాదపూర్వకంగా మెదిలి ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీస్స్టేషన్ను ఆయన బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. స్టేష న్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. గ్రా మాల్లో నిరంతరం నిఘా వేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల ని సిబ్బందిని ఆదేశించారు. గ్రామీణులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ఖానాపూర్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు శాంతినగర్ కాలనీకి చెందిన కోమటిపెల్లి నడిపి పోశెట్టి (50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సోమవారం ఉదయం గాంధీనగర్ శివారులోని నల్ల పోచమ్మ ఆలయ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
లక్కు దక్కింది.. ఇక కిక్కే..!
పారదర్శకంగా కేటాయింపులు నస్పూర్: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. లక్కీడ్రాలో దుకాణాలు దక్కిన వారు ఎగిరి గంతేయగా.. దుకాణాలు దక్కని వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లాలోని 73 దుకాణాలకు 1,712 దరఖాస్తులు రాగా.. నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు భద్రత చర్యలు చేపట్టారు. ఉదయం 9గంటల నుంచి దరఖాస్తుదారులను మాత్రమే లోపలికి అనుమతించారు. మొబైల్ఫోన్లను కూడా అనుమతించలేదు. ఉదయం 11గంటలకు కలెక్టర్ కుమార్ దీపక్ డ్రా పద్ధతిలో దుకాణాలు కేటాయింపు చేపట్టారు. డ్రాలో మొదటి షాపును మహిళ దక్కించుకున్నారు. జిల్లాలోని ఇందారం ఒకటో నంబరు దుకాణానికి ఓపెన్ కేటగిరీలో అత్యధికంగా 64 దరఖాస్తులు రాగా.. మహిళను అదృష్టం వరించింది. రెండోస్థానంలో భీమారం దుకాణం నంబరు 25కు జనరల్ కేటగిరీలో 59 దరఖాస్తులు రాగా.. ఆ షాపు సైతం మహిళనే వరించింది. ఎస్సీలకు 10, ఎస్టీ 6, గౌడ్లకు 6 దుకాణాలు కేటాయించగా.. ఆయా కేటగిరీల వారు దక్కించుకున్నారు. మొత్తంగా 16మంది మహిళలకు దుకాణాలు దక్కాయి. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న షాపుల టెండర్ నవంబర్ 30తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. సంతోషంగా ఉంది.. మాది హాజీపూర్. నేను మొదటిసారిగా మద్యం షాపు టెండర్లలో పాల్గొన్నాను. నేను టెండర్ వేసిన మొదటిసారే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. గెజిట్ నంబర్–1 షాప్ దక్కింది. – గజెంగి లక్ష్మి నూతన మద్యం పాలసీ విధానం 2025–27 ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తూ డ్రా తీసినట్లు వివరించారు. దుకాణాలు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు 24గంటల్లోపు చెల్లించాలని సూచించారు. ఫీజు చెల్లించిన తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్తగా షాపులు నిర్వహించవచ్చని తెలిపారు. ఎకై ్సజ్, ప్రోహిబిషన్ జిల్లా అధికారి నందగోపాల్, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లా కేంద్రం హమాలీవాడ, సూర్యనగర్ కాలనీ వాసులు గత కొద్దిరోజులుగా నల్లానీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన జే.బాలక్క, ఎస్సీ కాలానికి చెందిన ఎన్.లక్ష్మి, భూపెల్లి లావణ్య ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి కిష్టయ్య తన కుమారుడు భూములు లాక్కొని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని, న్యాయం చే యాలని ఫిర్యాదు చేశారు. పలువురు పింఛన్ల కో సం వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలో జ్యోతి రావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పా టు చేయాలని యుగంధర్, సాయి, సంధ్యారాణి, నరేష్, కుమారస్వామి కోరారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతున్నామని, తమ స్థలం పై నుంచి ఉన్న విద్యుత్ తీగలు తొలగించాలని భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందిన పద్మ కోరింది. -
పోలీసు విధులపై విద్యార్థులకు అవగాహన
మంచిర్యాలక్రైం: పోలీసుల విధులు, బాధ్యతలపై వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఓపెన్హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు చట్టాలు, విధులు, షీ టీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టం, ఫింగర్ ప్రింట్ డివైస్ ఉపయోగాలు, స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ నిబంధనలు తదితర వాటిపై వివరించారు. అనంతరం సీపీ అంబర్కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికే కాదు.. సమాజంలో శాంతిభద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నతల్లి కాదనుకుంది..!
కాగజ్నగర్టౌన్: నవమాసాలు కడుపున మోసింది.. బిడ్డను భూమి మీదకు తెచ్చేందుకు పురిటి నొప్పులు తట్టుకుంది. ఏమైందో ఏమోగాని పొత్తిళ్ల పాలు తాగుతూ సేదతీరాల్సిన పసికందును ఆ తల్లి కాదనుకుంది. రైలులో ఓ ప్రయాణికుడికి అప్పగించి దిగి వెళ్లిపోయింది. దీంతో రెండు నెలల ప్రాయంలోనే ఆ పసికందు మాతృప్రేమకు దూరమైంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్తున్న ధానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులోని వెనుకవైపు ఉన్న జనరల్ బోగీలో గుర్తు తెలియని మహిళ సుమారు రెండు నెలల వయస్సు ఉన్న పాపతో కాజిపేట రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. మళ్లీ వస్తానని చెప్పి ఓ ప్రయాణికుడికి పాపను అప్పగించి కిందికి దిగింది. రైలు కదిలినా సదరు మహిళ రాకపోవడంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్ వరకు చూసిన అతడు కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. వారు ఆ పాపను సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో అప్పగించాలని సూచించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పాపను తమ ఆధీనంలోకి తీసుకోని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్కు విషయం తెలియజేశారు. వెంటనే జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది స్టేషన్కు చేరుకుని పాపను ఆసిఫాబాద్లోని బాలరక్ష భవన్కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్లోని శిశు సంక్షేమ గృహానికి తీసుకెళ్లారు. చట్టబద్ధంగా శిశుగృహం ద్వారా పాపను దత్తత ఇస్తామని ఆయన తెలిపారు. బాల రక్షభవన్ సిబ్బంది శ్రవణ్కుమార్, జమున, చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తాండూర్లో తెల్లకాకి దర్శనం
తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్లోని ఓ ఇంటి వద్ద ఇటీవల తెల్తరంగు హౌస్క్రో(దేశీయ కాకి) కనిపించింది. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హెచ్వైటీఐసీఓఎస్) సభ్యుడు, వన్యప్రాణి పరిరక్షకుడు శ్రీపతి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని భాగాలు తెల్లగా ఉన్న కాకులు మాత్రమే కనిపించగా.. పూర్తి తెల్లకాకి కనిపించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉంది. దీని వల్ల పక్షి రెక్కలు పూర్తిగా తెల్లగా మారినప్పటికీ కళ్ల రంగు సహజంగా ఉంది. అల్బినిజంలో కళ్లతో సహా శరీరమంతా తెల్లబడుతుంది. కానీ ల్యూసిజంలో కళ్లు సాధారణంగా ఉంటాయి. ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా. సహజత్వానికి భిన్నంగా ఉన్న రూపం వల్ల ఇతర కాకులతో సంబంధాలు, సంతాన ఎంపిక ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ చాలా తెలివైన కాకులు వాటి సామాజిక బంధాలు, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వల్ల ఆ ఇబ్బందులను అధిగమిస్తాయి. తెల్లరంగు కాకి పెద్ద వయస్సు వరకు జీవించడం దాని అనుకూల సామర్థ్యానికి నిదర్శనమని వైష్ణవ్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ
ఆదిలాబాద్: ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ ఉమెన్స్ లీగ్ పోటీల్లో ఆరు పతకాలతో ప్రతిభ కనబరిచారు. సీనియర్ విభాగంలో ఆకోజివార్ శృతి బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో ముంగటివారి ప్రజ్ఞ, వడ్నాల కీర్తన రజత పతకాలతో మెరిశారు. అలాగే జూనియర్స్ విభాగంలో రావుల అవంతిక కాంస్య పతకం సాధించగా, సబ్ జూనియర్స్ విభాగంలో సుంకు ఘనశ్రీ, కాంక్ష కాంస్య పతకాలు కై వసం చేసుకున్నట్లు మాస్టర్ వీరేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంపై జిల్లా క్రీడా శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
మనమూ చేద్దాం... మారథాన్
మామడ: నేటి పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం కారణంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడితో మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. నడక, జాగింగ్, రన్నింగ్ చేయడం మర్చిపోతే పనిఒత్తిడి వలన ఆందోళన, చికాకుతో పాటు బీపీ, షుగర్ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో వాకింగ్, మారథాన్, యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఇంగ్లండ్కు చెందిన రన్నర్ జాక్ సెయింట్ ఇటీవల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు మారథాన్ చేపట్టారు. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోగా మారథాన్ రన్నర్ల బృందం ఆయనకు ఘనస్వాగతం పలికింది. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ దానిని అధిగమించాల న్న ధృడసంకల్పంతో మారథాన్ చేస్తున్నట్లు తెలి పారు. 60 రోజుల పాటు రోజుకు 60 కిలోమీటర్ల దూరం పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత ఆసక్తి... సుదీర్ఘ దూరం నడకను మారథాన్గా పేర్కొంటారు. 42.196 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 6 గంటల్లో, 21 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల సమయంలో పూర్తి చేస్తారు. మారథాన్లో పాల్గొనడం శ్రమ అనుకుంటే 10 కి.మీ, 5కి.మీ, 3 కి.మీల క్లబ్లలో చేరుతున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాలకు చెందిన రన్నర్లు హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తదితర పట్టణాల్లో నిర్వహిస్తున్న మారథాన్ పోటీలలో పాల్గొంటున్నారు. -
సేవలను పోర్టల్లో నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్న ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, ప్రసవాలను పోర్టల్లో నమోదు చేయాలని డీఎంహెచ్వో అనిత సూచించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, సీ్త్ర వైద్య నిపుణులతో శనివారం జిల్లా వైద్యారో గ్యశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్ర సవాల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాల ను పెంచాలని సూచించారు. ఫిజీషియన్ల వద్ద న మోదయ్యే హెచ్ఐవీ కేసుల వివరాలను ఐసీటీసీ సెంటర్కు అందించాలని, రోజువారీ వివరాల్లో క మ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ వ్యా ధుల వివరాలు ప్రతీ ఆస్పత్రికి ఇచ్చిన పాస్వర్డ్ల ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్న 51 ఆస్పత్రుల్లోని వివరాలను రోజువారీగా ఫామ్ ‘ఎఫ్’ ద్వారా అందించాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఆడబిడ్డకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేయాలని సూచించారు. ఐఎంఏ సభ్యుడు డాక్టర్ రవిప్రసాద్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సెక్రెటరీ డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, వైద్యులు అనిల్కుమార్, చంద్రదత్, శ్రీనివాస్, ఝాన్సీ, నందిని, జ్యోతి, శృతి, మాధురి, స్వాతి, సంధ్యారాణి, డీపీవో నీలిమ, డెమో బుక్క వెంకటేశ్వర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సుధాకర్నాయక్ పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహనజిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బందికి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్వో అనిత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలు నమోదు చేయాలని, ఆధా ర్కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా వారి వి వరాలు పోర్టల్లో నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. వైద్యులు ప్రసాద్, సుధాకర్నాయక్, డీపీవో ప్రశాంతి, ప్రవళ్లిక, భాగ్య, డీడీఎంలు చారి, కాంతారావు, ఎస్వో వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి
పాతమంచిర్యాల: 42శాతం బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో నాయకులతో కలిసి శనివారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు కర్ణ శ్రీధర్, గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, పంపరి వేణుగోపాల్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నెన్నెల నర్సయ్య, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెలగాని సుదర్శన్, షెట్పల్లి గట్టయ్య, చెలిమెల అంజయ్య, కీర్తి భిక్షపతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు సామూహిక వివాహాలుబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ శివారులోని శివాలయంలో ఆదివారం సామూహిక వివా హాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తిలక్ వాకర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో నిరుపేద యువతి, యువకులకు వివాహాలు చేయడానికి నిర్వాహకులు ముందుకొచ్చారు. ఉదయం 11.29గంటలకు వివాహ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నా రు. కార్యక్రజుమానికి హాజరయ్యే వధూవరులకు పుస్తెలు, మట్టెలు, నూతన వస్త్రాలు అందజేస్తారు. అలాగే వివాహానికి వధూవరుల తరఫున హాజరయ్యే ప్రజలకు భోజన సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. -
‘ప్రజల భద్రత కోసమే పోలీసులు’
మంచిర్యాలక్రైం: పోలీసులున్నది ప్రజల భద్రత కోసమేనని డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్హాల్లో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జి ల్లాకు చెందిన యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఆటో డ్రైవర్లు, పొలీస్ అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ అమరులైన పోలీసుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దా నాల కన్నా రక్తదానం చాలా విలువైందని తెలిపా రు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో రౌడీషీటర్ రి యాజ్ చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ హత్యకు గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 172 యూనిట్ల రక్తం సేకరించగా రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీపీ ప్రకాశ్, సీఐలు ప్రమోద్రావ్, రమణమూర్తి, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేశ్కుమార్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు సత్యపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు
నెన్నెల: మండల కేంద్రంలో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ కుక్క దాడి చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెన్నెల గ్రామంలో చాకలివాడకు చెందిన ఓరగంటి బాపు, లేతకారి కుమార్లతో పాటు బెస్తవాడకు చెందిన కంప ల రాజేశం, కంపల జశ్వంత్, కుమ్మరివాడలో భీమరాజుల హరీశ్, అట్కపురం పోశంలపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన వారికి నెన్నెల పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించి బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వెంబడించి పిచ్చికుక్కను కర్రలతో కొట్టి హతమార్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న పిచ్చికుక్కల నుంచి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. -
చేపలు పడుతుండగా మూర్చ
కుంటాల: సరదాగా చేపల వేటకు వెళ్లిన యువకుడు మూర్చ రావడంతో నీటిలో పడి మృతి చెందిన ఘటన మండలంలోని కల్లూరులో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సునీల్ (22), నీలేష్లు కల్లూరు వాగు చెక్డ్యాం వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. సునీల్ చేపలు పట్టే క్రమంలో ఒక్కసారిగా మూర్చ వ్యాధి రావడంతో నీటిలో పడి మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన నీలేష్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయన వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది వచ్చి సునీల్ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి అన్న దమ్మపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై జీవన్ రావు తెలిపారు. -
మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి: స్థానిక ఏఎంసీ క్రీడా మైదానంలో ఆది వారం నిర్వహించనున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం ఏఎంసీ క్యాంపు కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సింగరేణి ప్రాంత యువతలో మా ర్పు రావాలని, విచక్షణ కోల్పోకుండా ముందుకుసా గాలని సూచించారు. సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ.. ఏడో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న నిరుద్యోగులు జాబ్మేళాకు హాజరు కావాల ని సూచించారు. జాబ్మేళాకు ఏర్పాట్లు చేసినట్లు జీఎం రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకు 5వేల పైచిలుకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. మేళాకు 75 కంపెనీలు హాజరవుతుండగా, దాదాపు 4వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించే అవకాశముందని తెలిపారు. ఏసీపీ ఎ.రవికుమార్, ఎ స్వోటూ జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పలు విభాగాల అధికారులున్నారు. ఏర్పాట్ల పరిశీలన బెల్లంపల్లి ఏఎంసీ క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించనున్న మెగా జాబ్మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే వినోద్ పరిశీలించారు. ఏర్పాట్లపై సింగరేణి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. -
‘ఎస్ఏఈ ఇండియా’ క్లబ్ ప్రారంభం
బాసర: ఆర్జీయూకేటీలో ఎస్ఏఈ ఇండియా కాలేజియేట్ క్లబ్ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా లార్వెన్ ఏఐ సహ వ్యవస్థాపకులు వైఘారెడ్డి, వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యూనివర్సిటీలో ఆటోమేటివ్ ఇంజనీరింగ్ కార్యకలాపాలకు ఒక మైలురాయన్నారు. సాంకేతిక పోటీలలో, పరిశ్రమ ఆధారిత అభ్యాసంలో విద్యార్థులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని తెలిపారు. ఫ్యాకల్టీ సలహాదారు రాహుల్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసరలో ఔత్సాహిక ఇంజనీర్లకు ఎస్ఏఈ భాగస్వామ్యం ద్వారా లభించే విద్యా, ఉపాధి అవకాశాలు వివరించారు. డీన్స్ డాక్టర్ కే. మహేశ్, డాక్టర్ విఠల్, ఎస్. శేఖర్, చరణ్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జనావాసాల్లో కొండచిలువ సంచారం
నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ కొండచిలువ హడలెత్తించింది. శనివారం సాయంత్రం 7గంటల తర్వాత దివ్యనగర్ కాలనీ పార్కు గేటు ఆవరణలో దాదాపు 8 అడుగులకు పైగా ఉన్న భారీ కొండచిలువ కంటపడడంతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్ సేవర్ గిరిగంటి అనిల్కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆయన చాకచక్యంగా కొండచిలువను బంధించడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన పాము దాదాపు 20 కిలోలకు పైగా బరువు ఉన్నట్లు కాలనీవాసులు తెలిపారు. -
డీసీసీపై వీడని ఉత్కంఠ!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేన్నట్లుగా ఈ సారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుందో.. అనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తుది ఎంపిక ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయమే ఫైనల్గా ఉండేది. అయితే.. పార్టీలో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రధానంగా కష్టపడ్డవారిని గుర్తించాలని, సామాజిక, స్థానిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు పరిశీలకులను నియమించి డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఎంపికలో వీరే కీలకం..మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేశ్కుమార్, పీసీసీ పరిశీలకులు అడువాల జ్యోతి, పులి అనిల్కుమార్, శ్రీనివాస్గౌడ్ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారారు. ఇక జిల్లా నుంచి మంత్రి వివేక్ వెంకట స్వామితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల బాధ్యుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. జిల్లాలో 28మంది పార్టీ నాయకులు డీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరిచి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరితోనూ ప రిశీలకులు వ్యక్తిగతంగా మాట్లాడారు. పార్టీలో కనీ సం ఐదేళ్ల అనుభవం, పార్టీని నడిపే సత్తా, కేడర్ను సమన్వయం చేయగల సమర్ధత లాంటి అర్హతలు పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వడబోసి షార్ట్ లిస్ట్ తయారు చేసి మూడు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల లాబీయింగ్రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేయనున్న నేపథ్యంలో వెనుకబడిన వర్గాల నుంచి ఓ నాయకుడిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఎంపీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కావడంతో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వాలంటే ఓసీ లేదా బలహీన వర్గాలకు చెందిన నాయకులకు అవకాశమివ్వడంపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే.. డీసీసీ అధ్యక్ష పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న ఇద్దరు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, ఏఐ సీసీ అబ్జర్వర్లు, గాంధీభవన్లో సీనియర్ నేతలతో ఢిల్లీ వరకు లాబీయింగ్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అధిష్టానం చివరకు ఎవరికి డీసీసీ పీఠం కట్టబెట్టనుందో త్వరలోనే తేలిపోనుంది.సీనియర్లకే అవకాశంప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు అవకాశం ఇవ్వకపోవడంతో పా టు సీనియార్టీని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్నా రు? గతంలో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు ఏవైనా పదవులు వచ్చాయా? లాంటి అంశాల ను పరిశీలిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, ఇత ర పార్టీ పదవులు అనుభవించినవారికి అవకా శం తక్కువేనని చెబుతున్నారు. అధ్యక్షుడిగా ఎంపికై నవారు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేయాలి. జిల్లాలోని ఎమ్మెల్యేలతో సఖ్యత, రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండే జిల్లా పదవి కావడంతో ఆచితూచీ అన్ని కోణాల్లో వడపోసి సీనియర్ నాయకుడికి అవకా శం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే షార్ట్ లిస్ట్ నుంచి సామాజిక కోణం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స మాచారం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కో ణంతో పాటు కొత్తవారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, యువతను ఆకర్షించేందుకు చురుగ్గా ఉండే నాయకుడిని ఎంపిక చేస్తున్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. జిల్లాలో పదవి ఆశిస్తున్న వారిలో ఒకరిద్దరి పేర్లు తుది జాబితాకు చేరినట్లు తెలిసింది. -
అధిక సాంద్రత పత్తి సాగు చేయాలి
కాసిపేట: జిల్లా రైతులు వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అధిక సాంద్రత పత్తి సాగు సాంకేతికతను అవలంబించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. శనివారం మండలంలోని సండ్రల్ పహాడ్ శివారులో అధిక సాంద్రత పత్తిసాగుపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు అధిక సాంద్రత పత్తిసాగుపై అవగాహన కల్పించారు. ప్రతీ ఎకరాకు అధిక మొక్కల సాంద్రత ఉంచడం ద్వారా దిగుబ డులు పెరగడం, నేల సారాన్ని కాపాడటం లాంటి ప్రయోజనాల గురించి వివరించారు. పత్తి మొక్కల ఎత్తు ఆధారంగా మెపిక్వాట్ క్లోరైడ్ స్ప్రే వాడకం, పోషక లోప లక్షణాలు, కీటక వ్యాధి లక్షణాల మ ధ్య తేడా వివరించారు. సమగ్ర పోషక నిర్వహణ, యాంత్రిక పత్తికోత, సమగ్ర కీటక వ్యాధి నిర్వహణ పద్ధతులపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్, కేవీకే శాస్త్రవేత్తలు ఎన్.మహేశ్, నాగరాజు, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, ఏఈవో శ్రీధర్, రైతులు పాల్గొన్నారు. -
భూరికార్డులను డిజిటలైజ్ చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా సర్వేలో భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రయ్య, బె ల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. మండలాల వారీగా కాడాస్ట్రాల్ మ్యాప్ లను నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ నమూనా 1నుంచి 6వరకు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అటవీ భూములను సర్వే నుంచి మినహాయించా లని తెలిపారు. ఆరు మండలాల్లో పైలెట్ సర్వే, తొ మ్మిది మండలాల్లో తొమ్మిదిమంది ప్రభుత్వ సర్వేయర్లు, ప్రతీ మండలంలో ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్ల బృందం తమ పరిధిలోని గ్రామాల్లో కచ్చితమైన సర్వే చేయాలని వివరించారు. అనధికారిక ని ర్మాణాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గు ర్తించాలని సూచించారు. ముందుగా గ్రామాల్లో స ర్వే పూర్తి చేసిన తర్వాత సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో నిర్వహించాలని వివరించారు. అనంతరం తహసీల్దార్లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 2002, 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. కేటగిరీ ‘ఏ’ లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదైన వారు, కేటగిరీ ‘బీ’ లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదైనవారు, కేటగిరీ ‘సీ’ లో 1987 నుంచి 2002 మధ్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదైనవారు, కేటగిరీ ‘డీ’ లో 2002–2007 మధ్యలో జన్మించిన వారీగా విభజించినట్లు పేర్కొన్నారు. ల్యాండ్ సర్వే అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలిమంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో నూతనంగా చేపట్టిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని క లెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం ఆయ న భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. అందులో భాగంగానే విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. -
ధాన్యం తనిఖీ కేంద్రం ఏర్పాటు
కోటపల్లి: ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ లోకి ధాన్యం రాకుండా మహారాష్ట్ర–తెలంగా ణ సరిహద్దు ప్రాంతమైన రాపన్పల్లి అంతర్రాష్ట్ర వంతెనపై ధాన్యం తనిఖీ కేంద్రాన్ని త హసీల్దార్ రాఘవేందర్రావు, ఎస్సై రాజేంద ర్ శనివారం ప్రారంభించారు. త్వరలో ధా న్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అరికట్టేందుకే 24గంటల చెక్పోస్టును ప్రారంభించినట్లు వారు తెలిపా రు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చెక్పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండి ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేయాలని సిబ్బందిని ఆదేశించారు. -
భార్యపై కత్తెరతో దాడి
జన్నారం: కట్టుకున్న భర్తనే భార్యపై కత్తెరతో దాడి చేసిన ఘటన శనివారం జన్నారం మండలం చింతగూడలో చోటుచేసుకుంది. బాధితురాలి సమీప బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం చింతగూడకు చెందిన అనితకు, వె ల్గటూరు మండలం స్తంభంపల్లికి చెందిన సూర అశోక్తో 2020లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. గత సంవత్సరం భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చారు. తర్వాత అశోక్ జీవనోపాధికి దుబాయ్ వెళ్లాడు. సంవత్సర కాలంగా అనిత చింతగూడలోని తన అన్నయ్య కోట ఉపేందర్ ఇంటిలో ఉంటుంది. అశోక్ దుబాయ్ నుంచి గురువారం తిరిగివచ్చాడు. శుక్రవారం చింతగూడకు వచ్చి భార్యతో మాట్లాడి తిరిగి స్తంభంపల్లికి వెళ్లాడు. శనివారం తిరిగి చింతగూడకు వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. పక్కింటికి వెళ్లిన భార్య అనిత ఇంటికి చేరుకుని లోపలికి వెళ్తుండగా ఇంట్లో ఉన్న బీడీలు చేసే కత్తెరతో అశోక్ ఆమైపె దాడి చేశాడు. మెడ, గొంతు, పొట్ట వద్ద పొడిచి గాయపరిచాడు. ఆమె అరుస్తూ రోడ్డుపై పరుగెత్తడంతో అశోక్ పారిపోయాడు. గమనించిన బంధువులు ఆమెను అంబులెన్స్లో లక్షెట్టిపేట ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్సై అనూషను సంప్రదించగా దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
రామకృష్ణాపూర్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని గ్రీన్సిటీలో నివాసం ఉండే ఉప్పట్ల సుభాష్, అతని భార్య ఉప్పట్ల కవిత(42) కూతురు భార్గవిలు శుక్రవారం స్కూటీపై ఓ శుభకార్యానికి బెల్లంపల్లికి వెళ్లారు. తిరిగి రాత్రి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో బొక్కలగుట్ట సర్వీస్ రోడ్డు వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. బైక్పై వెనుక కూర్చున్న కవిత కిండపడిపోయి బస్సు ముందు భాగంలో ఇరుక్కుంది. ఈక్రమంలో ఆమెను బస్సు కొంత దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కవితకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్కు రెఫర్ చేశారు. కాగా మార్గమధ్యలోనే కవిత మృతిచెందింది. ఘటనలో సుభాష్, భార్గవిలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండల మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శనివారం సాయంత్రం బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ అడెల్లి రవికుమార్ వివరాలు వెల్ల డించారు. ఈ నెల 23న మాజీ ఎంపీపీ గో మాస శ్రీనివాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రా మం బట్వాన్పల్లి నుంచి బెల్లంపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య అమృత తాళ్లగురిజాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు జరిపి చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. డబ్బులు ఇవ్వడం లేదని..గత ఆగస్టులో గోమాస శ్రీనివాస్, అల్లం శ్రీను, ఇప్ప భూమయ్యలు తాండూర్ మండలం అచ్చలాపూర్ శివారులో 42 ఎకరాలు భూమి తమ పేరు మీద ఉందని అమ్ముతామని పులిమడుగుకు చెందిన బండి సాగర్, మల్లేశ్లతో రూ.80 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. గోమాస శ్రీనివాస్కు సాగర్ రూ.80 లక్షలు ఇచ్చాడు. భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని సాగర్, మల్లేశ్లు కోరగా శ్రీనివాస్ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సాగర్ నకిలీ భూమి పత్రాలతో తమను శ్రీనివాస్ మోసం చేసినట్లు గ్రహించి రామకృష్ణపూర్ పోలీసుస్టేషన్లో సెప్టెంబర్లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్పై కేసు నమోదైంది. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు శ్రీనివాస్ రెండు నెలల గడువు కోరాడు. ఆ మేరకు బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు. అయితే గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా శ్రీనివాస్ తప్పించుకు తిరుగుతుండడంతో సాగర్ కక్ష పెంచుకున్నాడు. శ్రీనివాస్ను కిడ్నాప్ చేస్తేనే తమ డబ్బులు తమకు వస్తాయని భావించాడు. బెల్లంపల్లి పట్టణం సుభాష్నగర్కు చెందిన గొల్ల సంపత్ సాయంతో బెల్లంపల్లి మండలం లింగాపూర్కు చెందిన మైలారపు భీమేశ్, బెల్లంపల్లికి చెందిన సాదిక్, సాయితేజలతో రూ.2.40 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నారు. డబ్బును సాధిక్కు అప్పగించారు. పథకం ప్రకారం ఈ నెల 23న పోచమ్మగడ్డ సమీపంలోని రోజ్ గార్డెన్ ప్రాంతంలో సాధిక్, డ్రైవర్ సాయితేజ, భీమేశ్లు గోమాస శ్రీనివాస్ను అడ్డుకుని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు. మార్గమధ్యలో బండి మల్లేశ్, సాగర్లు కారులో ఎక్కగా చంద్రవెల్లి మీదుగా టేకులపల్లి, దహెగాం, ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వరకు తీసుకెళ్లారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు విడిచిపెట్టమని శ్రీనివాస్ను బెదిరించారు. కాగా తాళ్లగురిజాల పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కారును ట్రేస్ చేసి శుక్రవారం రాత్రి జన్నారం చెక్పోస్టు వద్ద నిందితులను, శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బండి మల్లేశ్, బండి సాగర్, మైలారపు భీమేశ్, సాధిక్, సాయితేజలను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. గొల్ల సంపత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదు, కిడ్నాప్కు ఉపయోగించిన ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. బెల్లంపల్లి రూరల్ సీఐ చందవోలు హనోక్, తాళ్లగురిజాల, నెన్నెల ఎస్సైలు బండి రామకృష్ణ, ప్రసాద్, ఏఎస్సైలు అలీ, బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం
దహెగాం: నిండు గర్భిణి శ్రావణిని ఆమె మామ శివార్ల సత్తయ్య గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసి వారం గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలోని శ్రావణి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రావణి హత్యకు గురైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీలు నేటికీ బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు. గిరిజనులను చిన్నచూ పు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పటివరకు 140 కుల దురహంకార హత్యలు జరి గాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఐదెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండ రవికుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాజన్న, నియోజకవర్గ కన్వీనర్ ముంజం ఆనంద్కుమార్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్, జిల్లా అధ్యక్షుడు కొరంగుల మాలశ్రీ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
2న స్కాలర్షిప్ పరీక్ష
విద్యానగర్(కరీంనగర్): పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కూడిన కార్పొరేట్ విద్య అందించేందుకు నవంబర్ 2న స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ఎం.రమేశ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కరీంనగర్లోని శ్రీచైతన్య కళాశాలలో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా వందశాతం ఫీజు రాయితీతో కూడిన విద్య అందించేందుకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు 9848587584, 9912349038 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులకు లక్కీ డ్రా నిర్వహిస్తామని తెలిపారు. మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవి, రెండో బహుమతిగా సైకిల్, మూడో బహుమతిగా సెల్ఫోన్ అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, జూనియర్ కళాశాలల డీన్ జగన్ మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బోర్డు మార్చి.. ఏమార్చి
ఆదిలాబాద్: ప్రజారవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ సంస్థ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు వివిధ రకాల సర్వీసులు నడిపిస్తోంది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సెమీడీలక్స్, రాజధాని, సూపర్ లగ్జరీ, లహరి, ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడుపుతున్నారు. ఆయా సర్వీసుల వేగం, సౌకర్యాలు దృష్టిలో ఉంచుకొని చార్జీలు వసూలు చేస్తుంటారు. పల్లె వెలుగు బస్సులతో పోలిస్తే ఎక్స్ప్రెస్ నుంచి మొదలుకొని లహరి వరకు చార్జీలు అధికంగా ఉంటాయి. అయితే ఆదాయమే పరమావధిగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. పల్లెవెలుగు సర్వీసుల్లో ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ బోర్డు తగిలించి..పల్లె వెలుగు సర్వీసు ప్రయాణికులు ఎక్కిన స్టాప్ నుంచి దిగే వరకు రిక్వెస్ట్ చేసిన ప్రతీ స్టాపు వద్ద ఆ గుతూ వెళ్తుంది. ఎక్స్ప్రెస్ సర్వీస్ ముందుగానే నిర్ణయించిన స్టాపుల్లో మాత్రమే ఆగుతుంది. పల్లె వె లుగు సర్వీసు నెమ్మదిగా వెళ్లడం, చాలా మంది ప్ర యాణికులు ఉండడం, పలు సందర్భాల్లో సీట్లు సైతం దొరక్కపోవడం వంటి కారణాలతో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూ పుతుంటారు. చార్జీలు కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులో అధికంగా ఉంటాయి. అయితే ఆర్టీసీ అధికారులు లాభార్జనే ధ్యేయంగా ప్రయాణికులను బురిడీ కొట్టిస్తున్నారు. పల్లె వెలుగు బస్సులకు బోర్డు మార్చేసి, ఎక్స్ప్రెస్ అంటూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. పల్లెవెలుగు వేగంతోనే వెళ్తున్నా ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తుండడం గమనార్హం. పల్లె వెలుగూ ప్రత్యేకమే..దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపింది. ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి వంటి ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసింది. అయితే గ్రామాలకు మాత్రమే నడిచే పల్లెవెలుగు సర్వీసులను కూడా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులుగా నడిపి, వీటిలోనూ స్పెషల్ చార్జీలు వసూలు చేయడం గమనార్హం. వేగంగా, సౌకర్యవంతంగా ఉండే సర్వీసులతో పాటు వేగం, సౌకర్యాలు తక్కువగా ఉండే పల్లె వెలుగుల్లోనూ ప్రయాణికులు రద్దీ దృష్ట్యా అసంతృప్తిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ఆదాయానికి అన్వేషణ..ఆర్టీసీ అధికారులు బిజీ రూట్లను ఆదాయానికి మార్గంగా ఎంచుకున్నారు. నిర్మల్ నుంచి ఆదిలా బాద్కు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సు ఆదిలాబాద్ నుంచి నిర్మల్, నిర్మల్ నుంచి ఆదిలాబాద్ మధ్య నడుస్తుంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న రూటు కావడంతో అధికారులు ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించారు. పల్లె వెలుగు సర్వీసులకు ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టి ఈ రూట్లో నడుపుతున్నారు. దీంతో ప్రయాణానికి అధిక సమయం పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ రూట్లోని ఎక్స్ప్రెస్ సర్వీస్ గుడిహత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ స్టాపులలో మాత్రమే ఆగేది. అయితే ప్రస్తుతం మరో రెండు స్టాపులు పెంచి నడుపుతుండడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మన్నూర్, బోథ్ఎక్స్ రోడ్డు వద్ద సైతం ఆగుతుండడంతో సుమారు 20 నుంచి 25 నిమిషాలు ఆలస్యంగా బస్సులు నడుస్తున్నాయి. ఓవైపు చార్జీలు అధికంగా వసూలు చేయడం, సమయం ఎక్కువగా పడుతుండడంతో ప్రయాణికులు అనుకున్న సమయానికి గమ్యానికి వెళ్లలేని దుస్థితి నెలకొంది.ఆదిలాబాద్ –ఇచ్చోడ పల్లెవెలుగు చార్జీఆదిలాబాద్ –ఇచ్చోడ ఎక్స్ప్రెస్ చార్జీ చార్జీలు ఇలా..ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడ వరకూ పల్లెవెలుగులో రూ. 40 చార్జీ ఉండగా, ఎక్స్ప్రెస్ సర్వీసులో రూ. 60 చార్జీ తీసుకుంటున్నారు. చార్జీలో రూ. 20 తేడా ఉన్నా, సర్వీసులో మాత్రం ఏ తేడా ఉండడంలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పల్లెవెలుగులుగా నడిచిన బస్సులను ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి నడిపే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులను ఏమార్చి అధికారులు ఇంత చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కార్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో డిపో స్థాయి ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇబ్బంది పడకుండా చర్యలు పల్లెవెలుగు బస్సుల్లో అందుకు అనుగుణంగానే చార్జీలు వసూలు చేస్తున్నాం. ఎక్కడైనా అధిక చార్జీలు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలి. రిక్వెస్ట్ చేసిన ప్రాంతాల్లో బస్సులు ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత సమయంలోనే గమ్యస్థానానికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – ఎస్.భవానిప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ -
మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: అటవీశాఖ ప్లాంటేషన్లోకి ఎద్దు చొరబడడంతో కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ ఆఫీసర్ బెదిరింపులకు మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన ఘటన ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొట్టిపటార్ గ్రామానికి చెందిన వాగ్మారే భుజంగరావుకు ఐదుగురు కుమారులున్నారు. మూడో కుమారుడు వాగ్మారే గౌతం (29) ఎప్పటి లాగే తమ ఎద్దులను మేపేందుకు శుక్రవారం చేనుకు వెళ్లాడు. చేను పక్కన ఉన్న ఫారెస్ట్ ప్లాంటేషన్లోకి ఎద్దు వెళ్లడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన గౌతం చేనులో ఉన్న పురుగుల మందు తాగి కింద పడిపోయాడు. మృతుడి చిన్న తమ్ముడు నైలేశ్ అటువైపు వెళ్లగా కిందపడి ఉన్న గౌతం విషయాన్ని అతడికి చెప్పాడు. వెంటనే గౌతంను ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని తండ్రి వాగ్మారే భుజంగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. -
మార్కెట్ రోడ్డులో ఇష్టారీతిన పార్కింగ్
మంచిర్యాలటౌన్: నగరంలోని మార్కెట్ రోడ్డును 60 ఫీట్లకు పెంచేందుకు ఇటీవల ఆక్రమణలను తొలగించి, వాహనాలను రోడ్డు మధ్యలో నిలుపకుండా ఆయా దుకాణాల ఎదుట పార్కింగ్ చేసేలా నిబంధనలు మార్చారు. రోడ్డు వెడల్పు పనుల్లో జాప్యం కావడం, మంచిర్యాల ఎమ్మెల్యే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో వాహనాలు ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. ఇటీవల దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసులను, దుకాణదారులు రోడ్లపైకి రాకుండా చూడాలని కార్పొరేషన్ అధికారులను ఫోన్లో ఆదేశించారు. -
సిటిజన్ బడ్డీ.. పరిష్కారం లేదండీ!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం ‘సిటిజన్ బడ్డీ’ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగకుండా స్మార్ట్ఫోన్లో యాప్పై ఒక క్లిక్తో సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ యాప్ తయారు చేయబడింది. అయితే ఇంటి నుంచి బడ్డీ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసే ఫిర్యాదులను పరిష్కరించడంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అన్నీ యాప్లోనే..మంచిర్యాల నగర ప్రజలకు 2018 నుంచి ‘సిటిజన్ బడ్డీ’ యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్లో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు ప్రజాప్రతినిధులు, ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది జాబితా, కమిషనర్, కార్యాలయ కాంట్రాక్ట్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. అంతేకాదు.. పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు, ఆన్లైన్ సేవలు, పౌరసేవలు, దరఖాస్తు ప్రతాలు, అర్బన్ వైబ్స్, ఇతర సేవలు ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ను పరిశీలిస్తున్న ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులు2025–26 ఆర్థిక సంవత్సరంలో బడ్డీ యాప్ ద్వారా ఇప్పటి వరకు పలు సమస్యలపై 3,362 ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఇందులో మొత్తంగా 1,084 సమస్యలు పరిష్కారం కాగా ఇంకా 1,689 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 91 రిజెక్ట్ చేయగా మరో 64 వరకు ఫిర్యాదులు పలుమార్లు తిరిగి వచ్చినట్లుగా గుర్తించారు. మరో 165 ఫిర్యాదులు ఖర్చుతో కూడుకుని ఉన్నవిగా భావించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. సత్వరం సేవలు అందించాల్సి ఉండగా..‘సిటిజన్ బడ్డీ’ యాప్లోని గ్రీవెన్స్ విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శానిటేషన్, మురికి కాలువలు, రోడ్లు, సఫాయిమిత్ర సురక్ష, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, అనధికార, అక్రమ కట్టడాలు, ఉల్లంఘనల నివేదన, ఆదాయం, వీధి వ్యాపారుల సమస్య, ఆహార పరిశుభ్రత, ఇతర సమస్యలన్నీ యాప్లో కనిపిస్తాయి. యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులపై ఆయా విభాగాల అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉన్నా ఆదిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తామనే సమాచారం ఇవ్వడం, పరిష్కారం అనంతరం ఫిర్యాదుదారుడి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఏ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చర్యలు తీసుకుంటున్నాం ప్రత్యక్షంగా వచ్చే ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తాం. గతంలో గ్రీవెన్స్కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా సేవలు అందించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. – సంపత్, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు యాప్లో వచ్చిన ఫిర్యాదులు -
ఉత్తమ ఫలితాలపై శ్రద్ధ..
మంచిర్యాలఅర్బన్: పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వార్షిక పరీక్షలు ముగిసేదాకా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా అల్పాహారంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో పాఠశాల వదిలిన తర్వాత గంట పాటు ప్రత్యేక తరగతుల్లో ఉండాల్సి రావడంతో విద్యార్థులు అర్ధాకలితో చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పస్తులతోనే తరగతులకు..జిల్లాలోని 131 ప్రభుత్వ పాఠశాలల్లో 4,567 మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. సర్కారు బడుల్లో చదివే ఎక్కువ శాతం విద్యార్థులు పాఠశాలలకు దూరంగానే ఉండడంతో గంట ముందుగానే బయలుదేరి వస్తుంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలామంది ఇళ్లలో పాఠశాల సమయానికి అల్పాహారం వండే పరిస్థితులు ఉండవు. ఫలితంగా మధ్యాహ్న భోజనం అందించే వరకు ఖాళీ కడుపులతో పాఠాలు వినాల్సి వస్తుంది. పాఠశాల ముగిశాక సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు ప్రత్యేక తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రత్యేక తరగతులకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం నవంబర్ నుంచి అల్పాహారం అమలు చేస్తే ప్రయోజనకరంగా మారనుంది. ఈ ఏడాది ముందుగానే..వార్షిక పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ దసరా సెలవుల తర్వాత నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. ఏటా సంక్రాంతి సెలవుల తర్వాత ఫిబ్రవరి 1 నుంచి వార్షిక పరీక్షలు మొదలయ్యే వరకు స్నాక్స్ అందించేంది. ఈఏడాది ముందుగానే స్పెషల్ క్లాస్లు అమలు చేస్తోంది. జనవరి నుంచి రెండు పూటల తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి 10 నాటికి అన్ని సబ్జెక్టుల సిలబస్ బోధించి పునఃశ్చరణ పూర్తి చేయించాలి. సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1) పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థి స్థాయిని ఏబీసీ గ్రూపులుగా విభజించి వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. సీ గ్రేడ్ వారిని సబ్జెక్టు వారీగా టీచర్లు దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. తరగతులకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి హాజరుశాతం పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది ఇలా..గతేడాది ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున నిధులు మంజూరయ్యాయి. 38 రోజులకు సంబంధించి రూ.13,82,820 నిధులు విడుదలయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవసరమైన స్నాక్స్ అందించారు. ఈ ఏడాదికి కూడా స్నాక్స్ అందించేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఉడకబెట్టిన పెసర్లు, బబ్బెర్లు, శనగలు, పల్లీలు, బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, పకోడి రోజుకోరకం చొప్పున విద్యార్థులకు అందించే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
భీమిని: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని జిల్లా విద్యుత్శాఖ అధి కారి ఉత్తమ్ జాడే అన్నారు. గురువారం కన్నెపెల్లి మండలంలోని జన్కాపూర్ రైతు వేదికలో బెల్లంపల్లి రూరల్ పరిధిలోని కన్నెపెల్లి, భీమిని, వేమనపల్లి, నెన్నెల విద్యుత్ వినియోగదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలను తమదృష్టికి తీసుకొ స్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. విద్యుత్ తీగల కింద చెట్ల కొమ్మల తొలగింపునకు సిబ్బందికి సహకరించాలన్నారు. రైతులు పంటల రక్షణకు విద్యుత్ తీగలు అమర్చి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. సమావేశంలో డీఈ రాజన్న, ఏడీ రవికుమార్, ఏఈ రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు. -
టెండర్ పెంచిన బెల్ట్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వైన్స్ షాపుల టెండర్లలో బెల్ట్షాపులే వ్యాపారుల మధ్య పోటీని డిసైడ్ చేస్తున్నాయి. ఏ లిక్కర్షాపు కింద ఎన్ని బెల్ట్షాపులు, ఎంత జనాభా ఉంటే అంత ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 73 మద్యం షాపులకు టెండర్ల గడువు గురువారంతో ముగిసింది. రూ.లక్షల దరఖాస్తు ఫీజుతో చాలా మంది గ్రూప్ల వారీగా టెండర్లలో పాల్గొన్నారు. కొందరు ధైర్యం చేసి సింగిల్ వేశారు. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొన్నారు. ఆ ఐదు షాపులకే...జిల్లాలో ఐదు షాపులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. భీమిని, కన్నెపల్లిలో మద్యం అమ్మకాలు తక్కువగా ఉండడంతో గతంలో, ఈసారి అక్కడ ఎవరూ టెండర్లకు ఆసక్తి చూపలేదు. ఉదాహరణకు జాతీయ రహదారి, గోదావరికి సమీపంలో ఉన్న జైపూర్ మండలం ఇందారం వైన్స్కు డిమాండ్తో (గెజిట్ నంబర్ 1)కు 64 దరఖాస్తులు వచ్చాయి. కొన్నేళ్లుగా ఇక్కడి షాపును దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. జాతీయ రహదా రిపై ఉండడం, సింగరేణి ఓపెన్కాస్టులు, గోదావరి ఖని సమీపంలో ఉండడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఈ వైన్స్ నుంచే మద్యం సరఫరా అవుతోంది. దీంతో బెల్ట్షాపులే గ్రామాల్లో వైన్స్ల మాదిరిగా అమ్మకాలు సాగిస్తున్నాయి. భీమారంలో 59, హాజీపూర్లో 57, బెల్లంపల్లి పరిధిలో 45, కోటపల్లి పరిధిలో 45 చొప్పున అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ షాపుల పరిధి గ్రామాల్లోని బెల్ట్షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువతో రాత్రిపగలు తేడా లేకుండా అమ్మేస్తున్నారు. గ్రామాలు, జనా భా ఎక్కువ ఉన్న చోట్ల బెల్ట్షాపుల్లో అమ్మకాలు ఎ క్కువగా ఉంటాయి. దీంతో ఆ ప్రాంత వైన్స్లకు రూ.లక్షల్లో కౌంటర్ అవుతోంది. రిటైల్ కంటే బెల్ట్ కు హోల్సేల్ వ్యాపారం సాగుతోంది. దీంతో ఆ షాపులకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. అమ్మకాలు తక్కువగా ఉన్న భీమిని, కన్నెపల్లి వైన్స్కు పది చొప్పున రాగా మిగతా చోట్ల జిల్లావ్యాప్తంగా సగటున ఒక్కోషాప్కు 24 చొప్పున వచ్చాయి. పట్టణాల్లో ఖర్చులెక్కువజిల్లా కేంద్రం, పట్టణాల్లో అంతంత మాత్రంగానే వ్యాపారం సాగుతోంది. గ్రామాలతో పోలిస్తే పట్ట ణాల్లో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. రెండేళ్ల పాటు వైన్స్లకు అద్దె, నిర్వహణ, సిబ్బంది జీతాలు అధికంగా మారాయి. అంతేకాక పోలీసు, ఆబ్కారీ, ఇతర అధికార యంత్రాంగానికి నెలనెలా మామూళ్లు ఇవ్వడంతో పాటు, ఇక్కడే పర్యవేక్షణ ఎక్కువగా ఉండడంతో అక్రమాలు చేయడం తక్కు వ. మరోవైపు పట్టణాల్లో బార్లు సైతం ఉండడంతో పోటీ ఎక్కువ. దీంతో వైన్సుల్లో పోటీతో ఓ షాపు ఎమ్మార్పీ ధర కన్నా తక్కువ అమ్మడం మొదలుపెట్టింది. దీంతో మిగతా షాపుల కన్నా కౌంటర్ పెరిగింది. జిల్లా కేంద్రంలోని హమాలివాడ, ప్రధా న రోడ్ల వెంట వైన్స్లు, సిట్టింగ్ సౌకర్యం ఉన్న షా పులకు గిరాకీ బాగానే ఉంటోంది. అయితే పెరిగిన ఖర్చులతో టెండర్ల సమయంలో రూ.లక్షలు పెట్టి షాపు దక్కించుకోవడం, ఆపై లైసెన్స్ ఫీజులు, నిర్వహణ, సిబ్బంది జీతాలు వంటివాటితో గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వచ్చిన ఆదాయం కంటే తక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. బెల్ట్తోనే లాభాల పంటషాపుల్లో రిటైల్ కంటే హోల్సేల్గా బెల్ట్షాపులు ఉన్న చోట్లనే రెట్టింపు లాభాలు తెస్తున్నాయి. వైన్స్లకు ఎమ్మార్పీపై ఆయా బ్రాండ్లపై ప్రభుత్వం నిర్దేశించిన శ్లాబ్ల ప్రకారమే మార్జిన్ చెల్లిస్తున్నారు. రూ.లక్షల్లో లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. స్టాక్ లిఫ్ట్ చేయండి అంటూ కొన్నిసార్లు అధికారులు అమ్మకాల లక్ష్యం చేరుకునేందుకు కూడా వైన్స్ యజమానులపై ఒత్తిడి తెస్తుంటారు. అయితే కొన్నిసార్లు డిమాండ్ లేని సమయాల్లో విక్రయాలు తక్కువగా ఉంటా యి. వేసవిలో బీర్ల వినియోగం, పెళ్ళిళ్ళు, పండుగలు, ప్రత్యేక దినాల్లో మాత్రం కౌంటర్ సేల్ అధికంగా ఉంటున్నాయి. గతంలో కోల్బెల్ట్ ప్రాంత వైన్స్లు అధికంగా లాభాలు ఇచ్చేవి. అయితే ఒకే ప్రాంతంలో వైన్స్లు పెరగడంతో సిండికేట్గా మారితే తప్ప సింగిల్గా అమ్మితే లాభాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముగిసిన గడువు..మంచిర్యాలక్రైం: 2025–27 ఆర్థిక సంవత్సరానికిగానూ కొత్త మద్యం పాలసీ అమలుకు జిల్లాలోని 73 మద్యం షాపులకుగానూ ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 18న బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ నెల 23 వరకు గడువు పొడిగించింది. మొదటిసారి విధించిన గడువు ప్రకారం 1,617 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.48.51 కోట్ల ఆదాయం వచ్చింది. గడువు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య 1,712కు చేరింది. ఐదు రోజుల్లో 80 దరఖాస్తులు పెరిగాయి. ఆదాయం రూ.51.36 కోట్లకు పెరిగింది. ఎక్సైజ్శాఖ అధికారులు జిల్లా మొత్తం మీద ఏషాపులకుఽ తక్కువ దరఖాస్తులు వచ్చా యో ఫోకస్ చేస్తూ మద్యం వ్యాపారులకు ఫోన్లు చేసి మరీ టెండర్లు వేయించే ప్రయత్నాలు చేశారు. ఫీజు గడువు పెంచడంతో గతం కంటే రె ట్టింపు ఆదాయం వస్తుందని అంచనా వేసిన ప్ర భుత్వ వ్యూహం ఫలించక పోవడం గమనార్హం. 27న లక్కీ డ్రా ద్వారా ఎంపికఈ నెల 23న లక్కీ డ్రా నిర్వహించాల్సి ఉండగా టెండర్ల స్వీకరణ గడువు పొడిగించడంతో లక్కీ డ్రా తేదీని కూడా పొడిగించారు. 27న శ్రీరాంపూర్ పోలీస్స్టేషన్ సమీపంలోని పీవీఆర్ గార్డెన్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. టెండర్ల గడువు పొడిగించడంతో ఇప్పటి వరకు సిండికేట్ అయిన మద్యం వ్యాపారుల్లో గుబులు మొదలైంది. ముందస్తుగానే అగ్రిమెంట్ ప్రకారం టెండర్లు సమర్పించిన వారు అయోమయంలో పడ్డారు. గడువు పొడిగించడంతో తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం దుకాణాలను చూసి సిండికేట్ అయినవారే తమపంథా మార్చుకుని బినామి పేర్ల మీద మళ్లీ టెండర్లు వేసినట్లు తెలిసింది. జిల్లాలోని భీమిని, కన్నెపెల్లి మండలాల మద్యం దుకాణాలకు రెండంకెలు దాటి దరఖాస్తులు రాకపోవడంతో ఎకై ్సజ్ అధికారులు వాటిపై ఫోకస్ పెట్టి దరఖాస్తులు వేయించినట్లు తెలిసింది. -
భూ ఆక్రమణదారులపై చర్యలు తప్పవు
నస్పూర్: మండల పరిధిలోని ప్రభుత్వ భూ ములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ సంతోష్ హెచ్చరించా రు. గు రువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడుతూ ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా నస్పూర్ శివారులో ని సర్వే నంబర్ 42, 43 మధ్య వి వాదానికి సంబందించి రీ సర్వే కోసం మంచి ర్యాల ఏడీకి లేఖరాసి సర్వే ప్రారంభించామన్నారు. 42 సర్వే నంబర్లో గ్రంథాలయం, తహసీల్దార్, ఐటీ కార్యాలయానికి కేటాయించిన స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు తొలగించి బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములవ్వాలి
● సీపీ అంబర్ కిషోర్ ఝాతాండూర్: శాంతిభద్రతల పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా గురువారం తాండూర్ పోలీస్స్టేషన్ను సందర్శించారు. రికార్డులు పరిశీలించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక యువకులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. విధి నిర్వహణలో పోలీసులు అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సీఐ దేవయ్య, ఎస్సైలు కిరణ్కుమార్, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రతీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా తరగతి గదులు, వసతి, మూ త్రశాలలు ఉండాలన్నారు. ఫ్లోరింగ్, రూఫ్, ఫర్నీచర్తో కూడిన భోజనశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ం చేపట్టిన తెలంగాణ రైసింగ్ విజన్ 2047 సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలిమంచిర్యాలఅగ్రికల్చర్: రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా పౌరసరఫరా ల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ వన్ రకం వరి ధా న్యానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి 2,269 మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ సందర్శనభీమారం: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్ర మ పాఠశాలతో పాటు కేజీబీవీని కలెక్టర్ కుమా ర్ దీపక్ సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. కేజీబీవీలో తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం పరిశీ లించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి గుణాత్మక విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం పీహెచ్సీని సందర్శించి పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. దాంపూర్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
బెల్లంపల్లి: విద్యార్థులు చదువుతో క్రీడల్లోనూ రాణించాలని టీపీసీసీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి అన్నారు. గురువారం మురళి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 విభాగంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. పోటీల్లో సత్తా చాటి పతకాలు సాఽధించాలని ఆకాంక్షించారు. ప్రతిభ కనబర్చిన 30 మంది క్రీడాకారులను జోనల్స్థాయికి ఎంపిక చేశారు. ఈకార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కే.రాంచందర్, కాసిపేట బాలుర గురుకుల ప్రిన్సిపాల్ సంతోష్కుమార్, ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బాబురావు, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్, కోచ్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల కల్పన కోసమే జాబ్మేళా
బెల్లంపల్లి: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసమే బెల్లంపల్లిలో ఈనెల 26న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి జాబ్మేళా ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 80కి పైగా ప్రైవేట్ కంపెనీలు రానున్నట్లు, విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని బెల్లంపల్లి ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్ ) టి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో.. బెల్లంపల్లి సింగరేణి ఏఎంసీ క్రీడా మైదానంలో గురువారం మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జీఎం మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నిరుద్యోగులు జాబ్మేళాలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం విజయ ప్రసాద్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, రమేశ్, రాము, శంకర్, చిప్ప నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్బాల్ పోటీల్లో కాసిపేట–1 విజయం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో గురువారం డబ్ల్యూపీఎస్, జీఏ ఆధ్వర్యంలో ఏరియాస్థాయి ఫుట్బాల్ పోటీలను నిర్వహించారు., ఏరియా జీఎం రాధాకృష్ణ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో కాసిపేట– 1, కేకే జట్లు తలపడగా కాసిపేట –1 గ్రూపు జట్టు విజయం సాధించింది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంజిత్ ఫుట్బాల్ క్రీడాకారుడి మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్, జీఏ గౌరవ కార్యదర్శి కార్తీక్, కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు. అడవులపై అవగాహనజన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్పల్లి రేంజ్లో మైసమ్మకుంట, ఘనిషెట్టి కుంట ప్రాంతాలపై ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ సొసైటీ కోఆర్డినేటర్ వెంకట్ అవగాహన కల్పించారు. అడవిలోని వృక్ష జాతులు, శీలింద్రాలు, జంతువుల గురించి వివరించారు. బైపీసీకి చెందిన 40 మంది విద్యార్థులు ఈ పర్యాటనకు వెళ్లారు. కార్యక్రమంలో అధ్యాపకులు దేవేందర్గౌడ్, స్వరూప, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన బిల్లులు విడుదల
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు గత కొద్ది నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బిల్లు అందజేయాలని నిర్ణయం తీసుకుంది. బిల్లుల విడుదల.. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న కార్మికులకు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఏప్రిల్, జూన్, జూలై నెలలకు సంబంధించిన గుడ్ల వ్యయం రూ.50,52,959 రూపాయలు, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల వంట నిర్వహణ ఖర్చులు కింద రూ.38,19,352 రూపాయలు, నిర్మల్ జిల్లాకు మొత్తం రూ. 88,72,311 రూపాయలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. భోజన సహాయకులుగా పని చేస్తున్న కార్మికులకు గౌరవ వేతనాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం సహాయకులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి గౌరవ వేతనాలు చేయాలని కోరుతున్నారు. -
అట్టహాసంగా ఫెన్సింగ్ పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అండర్– 14 బాల, బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేశ్, పీడీ వంగళ సురేశ్, సంయుక్త కార్యదర్శి భీమిని రాజేశ్ల చేతుల మీదుగా పోటీలు ప్రారంభించారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్ క్రీడాకారులు ఆవునూరి సురేశ్, గుజ్జుల చందులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ఫెన్సింగ్ క్రీడాకారులు ఈనెల 25, 26న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు.. గుడిపేట ఎంజేపీ విద్యార్థులు ఏ.రిత్విక్, జి.అభిలాశ్, ఏ.శశికుమార్, ఏ.రక్షిత్, బి.హర్షిత్, ఎం.నిశ్వంత్, జి.అశ్విత్, ఎస్.భానుతేజలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఎంజేపీ ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, ఉపాధ్యాయులు అభినందించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు
వరంగల్ క్రైం: తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని బాధితులకు మాయమాటలు చెప్పి సుమారు రూ.కోటి వరకు వసూలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. గురువారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన రామిడి సంపత్రెడ్డి 2021లో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, తక్కువ ధరలకే భూములు ఇప్పిస్తానని పలువురికి మాయమాటలు చెప్పి వారి నుంచి సుమారు రూ.కోటి వసూలు చేశాడు. అనంతరం ఎలాంటి భూములు చూపెట్టకుండా వాయిదా వేస్తూ మోసం చేశాడు. దీంతో బాధితులు ఈ జనవరిలో హనుమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. సంవత్సరం నుంచి పరారీలో ఉన్న సంపత్రెడ్డిని గురువారం హనుమకొండ బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా.. బాధితుల నుంచి తీసుకున్న రూ.కోటితో ఆన్లైన్ గేమ్ ఆడానని, అంతా పోగొట్టుకున్నానని తెలిపాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
అనుబంధానికి ప్రతీక..!
కెరమెరి(ఆసిఫాబాద్): అన్నాతమ్ముడు, అక్కాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే భావుబీజ్ ఉత్సవాలు గురువారం ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్ జిల్లాలో ప్రారంభమైయ్యాయి. ఈ పండుగను మహారాష్ట్రకు అనుకుని ఉన్న మండలాల్లో అధికంగా జరుపుకుంటారు. అక్కడి సంస్కృతి ఆచార వ్యవహారాలను నేటికి మనవారు పాటిస్తున్నారు. చుట్టరికం, బంధువులు, బంధుత్వాలు ఉన్న నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీపావళి పర్వదినం అనంతరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. భావుబీజ్ అంటే.. భావుబీజ్ పండుగపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉ న్నాయి. యమధర్మరాజు తన చెల్లి యమున ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చాడు. అనంతరం యముడు యమున ఇంట్లోనే భోజనం చేశాడు. అందుకే ఆరోజును భావుబీజ్ అంటారు. యముడు, ఈ రోజు యమున నదిలో స్నానం చే యడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. యమున సోదరి–సోదర ప్రేమ గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. యమధర్మరాజు మృతి చెందాక యమన కళ్లల్లోంచి కన్నీరు ఆగలేదు. దినమంతా ఎడుస్తునే ఉంటుంది. ఆరోజు ముగిసిందని చూపించేందుకు దేవుడు రాత్రిని సృష్టించాడు. దీంతో యయునకు తన సోదరుడి పట్ల ఉన్న దుఖం కొంత తగ్గింది. అ ప్పటి నుంచి భావుబీజ్ను నిర్వహిస్తారని పురాణా లు చెబుతున్నాయి. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తుడి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ రో జు అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఇళ్లకు వెళ్లి మంగళ హారతులిస్తారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలి చే రోజును ఉత్సవంగా భావిస్తారు. ఎవరికై తే అన్నదమ్ములు లేక అక్కాచెల్లెళ్లు ఉంటారో వారు చంద్రుడిని అన్న తమ్ముడిగా భావిస్తారు. అన్నాతమ్ములు సుఖంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని అక్కాచెలెళ్లు కోరుకుంటారు. భావుబీజ్ రోజు అక్కచెల్లిళ్లు త న అన్నదమ్ములకు కొబ్బరికాయ, మోల్దారం, తమలపాకులు, పోకలను సమర్పిస్తారు. తలకు రుమాలు చూట్టి, మిఠాయిలు తినిపించి, మంగళహారతులు ఇస్తారు. కాళ్లు కడిగి ఆశీర్వదం తీసుకుంటారు. -
క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న సంసద్ ఖేల్ అభియాన్ క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. గురువా రం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో క్రీడా పో టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ యాప్ను ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులను క్రీడల పట్ల ఆకర్షితులను చేయాలనే ఉద్దేశంతో ఈ క్రీడా మహోత్సవాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ క్రీడాకారులు పాల్గొనేందుకు అర్హులన్నారు. నవంబర్ చివరి వారంలో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, హాకీ, యోగా, రెజ్లింగ్, స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, గిల్లిదండ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఈనెల 24నుంచి నవంబర్ 10 వరకు https://sansadkhelmahotsav.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారధి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్, పెటా కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు. -
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ఆదిలాబాద్టౌన్: నిండు గర్భిణిని హత్యచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మంజూల డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిందితుడు శివార్ల సత్తయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గొర్రె గ్రామానికి చెందిన గిరిజన మహిళ కులాంతర వివాహం చేసుకుందనే అక్కసుతో నిండు గర్భిణి శ్రావణి రాణిని హత్య చేసినట్లు తెలిపారు. రోజురోజుకూ మహిళలు, యువతులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఈ దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జమున, శకుంతల, విజయ, పంచపూల, పొచ్చక్క, తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో దూకి ఒకరి ఆత్మహత్య
ఖానాపూర్: మండలంలోని గోసంపల్లి గ్రామానికి చెందిన కొండేరి చందు (51) బుధవారం రాత్రి మద్యం మత్తులో సదర్మాట్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. మద్యానికి బానిసైన చందు గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. రాత్రి 10 గంటలకూ కూడా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామ శివారులోని కొత్తపేట వెళ్లే మార్గంలో సదర్మాట్ కాలువపై లుంగీ కనిపించడంతో కుటుంబసభ్యులు కాలువలో వెతికారు. అనంతరం కడెం మండలం లింగాపూర్ సమీపంలోని సదర్మాట్ కాలువలో చందు మృతదేహం లభించింది. మృతుడికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పశువుల కాపర్లపై అటవీ అధికారుల దాడి దహెగాం: పశువులను మేపేందుకు అడవి వెళ్లిన కాపర్లపై అటవీ అధికారి దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఒడ్డుగూడ గ్రామానికి చెందిన బుజాడి రామన్న, బావండ్లపల్ల్లి భూషయ్య పశువులను మేపేందుకు బుధవారం అడవికి తీసుకెళ్లారు. ఎఫ్ఎస్వో సద్దాం అక్కడికి చేరుకొని పశువులను ఫ్లాంటేషన్లో మేపుతున్నావా? అంటూ.. దాడి చేశారని బాధితులు వాపోయారు. అధికారిపై పోలీస్టేషన్లో, కాగజ్నగర్ రూరల్ సీఐకి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఎఫ్ఎస్వో సద్దాంను వివరణ కోరగా పశువులను బయట ప్రదేశంలో మేపుకోవాలని, ఫ్లాంటేషన్లో మేపవద్దని చెప్పడం జరిగింది. వారిపై దాడి చేయలేదని తెలిపారు. పాముకాటుకు ఆశ కార్యకర్త మృతిబెజ్జూర్: మండలం ఇప్పలగూడ గ్రామానికి చెందిన కనక కమల (45) అనే ఆశ కార్యకర్త పాముకాటుకు మృతి చెందినట్లు బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గురువారం ఉదయం ఇంటి పెరటిలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. కేకలు వేయడంతో ఆమె కుమారుడు సుధాకర్, కోడలు ఆమెను ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా, అక్కడి నుంచి ఆసిఫాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సురక్షితంగా విద్యార్థి అప్పగింతఅదిలాబాద్రూరల్: మావల మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. నిర్మ ల్ ఖానాపూర్కు చెందిన 12 ఏళ్ల విద్యార్థి మావల మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నాడు. దసరా, దీపావళి సెలవులు అనంతరం కుటుంబసభ్యులు గురువారం గురుకు ల పాఠశాలకు తీసుకువచ్చారు. పాఠశాలలోకి ప్రవేశించిన అనంతరం విద్యార్థి అక్కడి నుంచి పారిపోయారు. ఇదే క్రమంలో జాతీయ రహదారి 44 వద్ద గమనించిన మావల గ్రామస్తులు విద్యార్థిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థి సురక్షితంగా గురుకుల పాఠశాలకు చేర్చారు. సిబ్బంది పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థి పారిపోయాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూషయ్య, బాధితుడు రామన్న, బాధితుడు -
ముగ్గురు వేటగాళ్లపై కేసు
వాంకిడి: వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి జైలుకి తరలించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ధరావత్ భీమా, గుర్నులె తిరుపతి, నగోషే బీర్సావ్ అనే ముగ్గురు వ్యక్తులు జోగాపూర్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చుతుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి విద్యుత్ తీగలను స్వాధీనం చేసుకొని, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్ధార్ తెలిపారు. దాడుల్లో డిప్యూటీ రేంజ్ అధికారిని ఝాన్సిలక్ష్మి, ఎఫ్ఎస్వో సాయి చరణ్, ఎఫ్బీవోలు ప్రభాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టాలీవుడ్లో రాణిస్తున్న యువ కెరటం
ఆదిలాబాద్ జిల్లా: మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువకుడు నటనలో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న తను ఇప్పుడు ఏకంగా సినిమాలో హీరోగా నటిస్తూ అందరి మన్ననలు పొంతున్నాడు. ఆయనే కుంటాలకు చెందిన రాధా –శేఖర్ రావు పాటిల్ దంపతుల కుమారుడు దావు నవికేత్. హైదరాబాద్లో బీపార్మసీ చదివేందుకు వెళ్లిన నవికేత్ చదువుకునే రోజుల్లో సినిమా రంగంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి నటనపై ఉన్న అభిరుచి ఆయనను సినిమాల వైపు మళ్లించింది.తనదైన గుర్తింపు..చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే అనే మూవీతో వెండితెరపై నటించే అవకాశం నవికేత్కు దక్కింది. దేత్తడి యూట్యూబ్ ఛానల్ ద్వారా నటనలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ అంతా ఈజీ కాదు మూవీలో ప్రత్యేక పాత్రలో మెప్పించాడు. జెర్సీ సినిమాలో హీరో నానితో కలిసి క్రికెటర్గా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాలో హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవితో కలిసి నటించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం భార్గవ చారి దర్శకత్వంలో జకాస్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఆలీ, పృథ్వి హాస్యనటులతో డబ్బులు ఎవరికి ఊరికే రావు వర్కింగ్ టైటిల్లో హీరోగా అవకాశం సంపాదించాడు. చట్టానికి వ్యతిరేక పనులు చేసే వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఆధారంగా వీఎస్వీ(వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన) డైరెక్షన్లో రూపొందిస్తున్న విద్రోహి మూవీలో నవికేత్ నటిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 24న విడుదల కానుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్లి సినిమాలో రాణిస్తున్న నవికేత్ కొత్త నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.సినిమా రంగంపై ఆసక్తిచదువుకునే రోజుల్లో నట నపై ఆసక్తి ఉండేది. అదే నన్ను సినిమా రంగం వైపు మళ్లించింది. అందివచ్చిన అవకాశాలను ఎప్పుడూ వదులుకోలేదు. నటనలో ప్రతిభ కనబర్చి మంచి పేరు సంపాదిస్తా.– దావు నవికేత్, నటుడు టాలీవుడ్లో రాణిస్తున్న యువ కెరటం -
ఏఎస్డబ్ల్యూవోగా ధర్మానంద్గౌడ్ బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅర్బన్: జిల్లా ఎస్సీ ఏఎస్డబ్ల్యూవోగా ధర్మానంద్గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఏఎస్డబ్ల్యూవోగా విధులు నిర్వహించిన సురేష్పై ఆరోపణల నేపథ్యంలో బాధ్యతల నుంచి తొలగించి ధర్మానంద్గౌడ్కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) అప్పగించారు. బుధవారం రాత్రి ఎస్సీ కళాశాల బాలుర, బాలికల వసతిగృహాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ బాగా చదవుకుని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఎస్సీ కళాశాల వసతిగృహ నిర్వాహకులు కుమారస్వామి, చందన పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమెప్పుడో..!
నేరడిగొండ: స్వరాష్ట్రం వచ్చిందంటే తమ జీవితాలు మారుతాయని ఆశించిన సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ప్రతీరోజు పాఠశాలల పర్యవేక్షణ, డేటా సేకరణ, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, బడిబయటి పిల్లల చేర్పు వంటి పనులతో నిత్యం విధుల్లో బిజీగా ఉంటున్నారు. అయినా చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నామని, వేతన పెంపు గానీ, క్రమబద్ధీకరణ గానీ దక్కకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్(సీఆర్పీ)లు గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యతాభివృద్ధికి కృషి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వీరికి ఇంక్రిమెంట్, మినిమం టైం స్కేల్ అమలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ పోషణ భారమవుతుందని సీఆర్పీలు వాపోతున్నారు. ప్రతీరోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ఎంఈవోలకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ సమాచారాన్ని నమోదు చేయడం, ఏకోపాధ్యాయులు గైర్హాజరైతే వారు బోధన బాధ్యతలు నిర్వర్తించడం వంటి బాధ్యతలు వీరిపైనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పునాది బలపర్చడం కోసం పని చేస్తున్నప్పటికీ తమ బతుకులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని సీఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్పీలు ఖాళీలు ఉన్న చోట ఆ పనులు సైతం ఉన్నవారే చేపట్టాల్సి వస్తోంది. దీంతో అదనపు పనిభారం పడుతుందని వాపోతున్నారు. వీరి ప్రధాన డిమాండ్లు.. ఉమ్మడి జిల్లాలో సీఆర్పీల వివరాలు.. జిల్లా స్కూల్ కాంప్లెక్స్లు సీఆర్పీలు ఖాళీలు ఆదిలాబాద్ 71 58 13మంచిర్యాల 51 43 8నిర్మల్ 48 43 5 కుమురంభీం 67 55 12 -
వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఖానాపూర్: తెలంగాణ గోసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పరీక్ష పోటీల్లో మండలంలోని మస్కాపూర్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు హెచ్ఎం నరేందర్ రావు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థిని నవ్య, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థి అభినయ్, నాలుగో స్థానంలో నిలిచిన విద్యార్థిని సంజన, ఐదో స్థానంలో రాణించిన విద్యార్థిని దీప్తిలను అభినందించారు. ఈనెల 26న హైదరాబాద్లోని కేశవ నిలయంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. పోటీల్లో మొదటిస్థానంలో రాణించిన వారికి రాష్ట్ర గవర్నర్ అవార్డుతో పాటు రూ.లక్ష నగదు బహుమతి ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు శంకర్, శేఖర్, శ్రీనివాస్, అంజయ్య, ఇమ్రాన్, కిషన్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
బ్యాంకులో చోరీకి యత్నం
రెబ్బెన: మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ తెలంగాణ గ్రామీణ బ్యాంకు భవనం కిటికీ ఊచలు తొలగించి అద్దాలు పగలగొట్టి బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. డబ్బుల కోసం క్యాషియర్ క్యాబిన్లో, అకౌంటెంట్ టేబుల్ వద్ద డ్రాలో వెతికాడు. డబ్బులు దొరక్కపోవడంతో బ్యాంకు మేనేజర్ గదిలోకి వెళ్లి సీసీ కెమెరాల వైర్లు తొలగించి బ్యాంకు లాకర్ తాళాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే బ్యాంకులో ఉన్న సెక్యూరిటీ అలారంతో పాటు బ్యాంకు మేనేజర్ సెల్ఫోన్లో సెక్యూరిటీ అలారం మోగింది. అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ దేవరకొండ శ్రీకాంత్ క్యాషియర్ ప్రసాద్కు ఫోన్ చేసి బ్యాంకు వద్దకు వెళ్లాలని సూచించాడు. హుటాహుటిన క్యాషియర్ బ్యాంకు వద్దకు చేరుకోగా అదే సమయంలో కిటికీ నుంచి దొంగ పరారయ్యాడు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ చిత్తరంజన్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని దొంగ బ్యాంకు లోపలికి ప్రవేశించిన తీరు, చోరీకి యత్నించిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డ్వాగ్ స్క్వాడ్ను పిలిపించి దొంగ వేలిముద్రలు, ఇతర ఆధారాలు సే కరించారు. దొంగను పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంక్ లాకర్ తెరుచుకోకపోవడంతో నగదు, బంగారం చోరీకి గురికాలేదని, బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బుధవారం తెలిపారు. -
ఏసీబీ అధికారుల తనిఖీలు
నిర్మల్టౌన్: సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామ సమీపంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఏసీబీ డీఎస్పీ మధు నేతృత్వంలో అధికారులు కార్యాలయానికి చేరుకొని, కంప్యూటర్లో నమోదైన వివరాలు, సిబ్బంది మొబైల్ ఫోన్లను, రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ.. సాధారణ తనిఖీల్లో భాగంగానే డీటీవో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి, ఎంవీఐలు సెలవుల్లో ఉన్నారని, రికార్డులు పరిశీలించగా అన్ని సక్రమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చే వారు ఏజెంట్ ద్వారా లైసెన్సులు, ఇతర పనులు చేసుకుంటున్నట్లు తెలిసిందని దీనిపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని సూచించారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీ నంబర్ 1064ను సంప్రదించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇదిలా ఉండగా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయని తెలియడంతో నిర్మల్లో చర్చ మొదలైంది. ఎవరూ ఏ అధికారిని పట్టించారో.. అని కొంతసేపు అందరిలో ఉత్కంఠ నెలకొంది. కాగా అధికారుల దాడులు రాత్రి వరకు కొనసాగాయి. -
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించొద్దు
తాండూర్: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. బుధవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయంలో అధికారులు అందుబాటులో లేరు. కొద్దిసేపు వేచి చూసిన తర్వాత అధికారులు రావడంతో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ భారతి దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కిష్టంపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కొలవార్ రైతులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మండలంలోని వెంకయ్యపల్లి శివారు సర్వేనంబర్ 12లోని 34 ఎకరాల భూమిని గత మూడు దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్నామని, అటవీ శా ఖ అధికారులు అడ్డుకుంటున్నారని, పోడు పట్టాలు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ స్పందిస్తూ అధికారులతో విచారణ చేయిస్తానని తెలిపారు. తహసీల్దార్ జ్యోత్స్న పాల్గొన్నారు. -
హోటల్లో అగ్ని ప్రమాదం
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలోని ఈద్గాం ప్రాంతంలో గల నక్ష త్ర హోటల్లో బుధవారం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్లో మధ్యాహ్న సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ అధికారులు, సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రూ.9 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ అధికారి ప్రభాకర్ తెలిపారు. వెంటనే మంటలను ఆర్పివేయడంతో రూ.2 కోట్ల మేర ఆస్తినష్టం జరగకుండా రక్షించినట్లు పేర్కొన్నారు. -
మెడికల్ బోర్డు.. అన్ఫిట్..!
శ్రీరాంపూర్: సింగరేణిలో మెడికల్ బోర్డు నిలిచిపోయి ఏడు నెలలు గడుస్తోంది. దీంతో వ్యాధుల బారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనారోగ్యం కారణంగా డ్యూటీలు చేయలేకపోతున్న కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారిని ప్రతీ నెల బోర్డుకు పిలిచి స్క్రీనింగ్ చేస్తారు. వారి డిజిగ్నేషన్, జబ్బు తీవ్రతను బట్టి అన్ఫిట్(ఇన్వాలిడేషన్) చేయడమో, అండర్గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు లేదా హయ్యర్ సెంటర్ రెఫరల్ అని ఇస్తారు. కంపెనీలో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మెడికల్ బోర్డును చివరిసారిగా ఈ ఏడాది మార్చి 21న నిర్వహించారు. అప్పటి నుంచి రెగ్యులర్ బోర్డు నిర్వహించలేదు. కానీ హయ్యర్ సెంటర్ రెఫరల్ కేసులకు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో మెడికల్ బోర్డు నిర్వహించారు. వారు కూడా అప్పటికే నెలల తరబడి నిరీక్షించారు. మొత్తంగా 55మందిని బోర్డుకు పిలువగా వారిలో 54మంది హాజరయ్యారు. వీరిలో ఐదుగురిని మాత్రమే అన్ఫిట్ చేసి మిగతా వారిని డ్యూటీలు చేసుకోవాలని సూచించారు. కారుణ్య నియామకాలు అమలైన తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో అన్ఫిట్లు కావడం ఇదే మొదటిసారి. మున్ముందు నిర్వహించే రెగ్యులర్ మెడికల్ బోర్డుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. కార్మికుల నిరీక్షణ రెండేళ్ల సర్వీసు మిగిలిన కార్మికులు ఎక్కువ శాతం మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. వీరితోపాటు గనుల్లో, బయట జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారు కూడా బోర్డుకు దరఖాస్తులు అందజేస్తుంటారు. వీరందరిని ప్రతీ నెల చివరిలో బోర్డుకు పిలిచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడు నెలలుగా బోర్డు నిలిచిపోవడంతో సింగరేణి వ్యా ప్తంగా సుమారు వెయ్యి మంది కార్మికులు తీవ్ర ఇ బ్బంది పడుతున్నారు. జబ్బు కారణంగా కొందరు డ్యూటీలు కూడా సక్రమంగా చేయడం లేదు. బోర్డు నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా జా ప్యం చేయడం వల్ల వేతన నష్టం చవిచూడాల్సి వ స్తోందని వాపోతున్నారు. ఇప్పటికే పైరవీ ఆరోపణ లతో అబాసుపాలవుతున్న మెడికల్ బోర్డు నేడు జా ప్యం వల్ల మరిన్ని విమర్శలు ఎదుర్కోంటోంది. మె డికల్ బోర్డు జాప్యంతో కారుణ్య నియామకాలు పొందే డిపెండెంట్ల సర్వీసు లాస్ అవుతోందని కా ర్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రక్షాళన అయ్యేనా..? మెడికల్ బోర్డుపై వస్తున్న అవినీతి, ఆరోపణల నేపథ్యంలో బోర్డును ప్రక్షాళన చేయడానికి జాప్యం జరుగుతుందా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోపక్క కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరగడం, దానికి సరిపడా కొత్తగనులు లేకపోవడంతో మున్ముందు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కడ వీరిని సర్దుబాటు చేస్తామనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బోర్డును మరింత కఠినతరం చేసి కారుణ్య నియామకాల సంఖ్య తగ్గిస్తారా..? అలా చేయడానికేనా ఇటీవల నిర్వహించిన హయ్యర్ సెంటర్ రెఫరల్ బోర్డులో ఎన్నడూ లేనంతగా కొద్దిమందిని మాత్రమే అన్ఫిట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏదేమైనా చాలా ఏళ్ల తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న కారుణ్య ఉద్యోగాలు ప్రమాదంలో పడితే గెలిచిన సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా భవిష్యత్లో అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది.వెంటనే ఏర్పాటు చేయాలి వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. కంపెనీ, ప్రభుత్వ తీరు చూస్తే కారుణ్య ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రతీ నెల నిర్వహించాల్సిన మెడికల్ బోర్డును ఏడు నెలలుగా నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గెలిచిన సంఘాలు దీనిపై నోరుమెదపకపోవడం శోచనీయం. – కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి -
ఘాట్ల వద్ద రక్షణ కరువు
జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో నది నిండుకుండను తలపిస్తోంది. అమ్మవారి దర్శనానికి ముందు భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే పుష్కరఘాట్ల వద్ద పోలీసు భద్రత ఉన్నప్పటికీ భక్తులు నీటి లోపలకు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టలేదు. ఘాట్ల చుట్టూ జాలీలు నిర్మించడంతో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. – బాసర -
గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్రూరల్: గిరిజన హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, బెస్ట్ అవైలబుల్ ఫీజు బకాయిలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, టీఏజీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిశారు. వారు మాట్లాడుతూ 43 రోజులుగా వర్కర్లు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. హాస్టల్ డైలీవేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు మధు, పాపారావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఎస్ఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్ తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన అక్రమ విద్యుత్ రక్షణ తీగ
ఖానాపూర్: వన్యప్రాణుల నుంచి పంట రక్షణ కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఓ గిరిజన యువకుడి ప్రాణాన్ని బలికొంది. సీఐ సీహెచ్ అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండ పంచాయతీ పరిధి దేవరిగూడ గ్రామానికి చెందిన సిడాం గజానంద్(45), బీర్నంది పంచాయతీ పరిధిలో గల తుమ్మగూడెంలోని అతని చిన్నమామ అర్క జ్యోతిరాం ఇంటికి మూడు నెలల క్రితం కూలీ పనుల కోసం వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం గజానంద్ భార్య యమున తన ముగ్గురు పిల్లలతో పాటు కడెం మండలం గంగాపూర్ గ్రామంలో జరిగే దండారీ ఉత్సవాలకు వెళ్లింది. మంగళవారం రాత్రి గజానంద్ ఇంటివద్ద లేకపోవడంతో చుట్టుపక్కల వెతికినా జాడ కానరాలేదు. బుధవారం ఉదయం ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామశివారులోని వ్యవసాయ భూమి వద్ద గజానంద్ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పంట పొలాన్ని అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు అక్రమంగా విద్యుత్ రక్షణ కంచె ఏర్పాటు చేయగా అటు వైపు కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లిన గజానంద్ మంగళవారం విద్యుత్షాక్కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య యమున, ఇద్దరు కూతుళ్లు శైలజ, వెన్నెల, కొడుకు బదిరాజ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
నేడు ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపిక పోటీలు
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ –19 బాలబాలికల క్రికెట్ పోటీలు ఈనెల 23న నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్కీ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ అండర్ –19 సెక్రెటరీ బాబురావు తెలిపారు. పూర్తి వివరాలకు కోచ్ సుదర్శన్ను సంప్రదించాలన్నారు. రేపు అథ్లెటిక్ పోటీలు.. ఈనెల 24న ఎస్జీఎఫ్ అండర్ –19, జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలు లక్సెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్, క ళాశాలలో నిర్వహిస్తున్నట్లు బాబురావు తెలపారు. కళాశాల నుంచి ఒక ఈవెంట్లో ఒక వి ద్యార్థి మాత్రమే పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు పీఈటీలు నాంపల్లి(బాలురు), రమా(బాలికలు)లను సంప్రదించాలన్నారు. రేపు ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ఎస్ సమావేశంమంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సమావేశం ఈనెల 24న మంచిర్యాల వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్ఎస్ఎస్ కన్వీనర్ ఉదారి చంద్రమోహన్గౌడ్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్ఎస్ఎస్ పథకం ప్రోగ్రాం అధికారులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. 2024 –25 సంవత్సరానికి రెగ్యులర్ ఆక్టివిస్, స్పెషల్ క్యాంపులకు సంబంధించిన రిపోర్టు తీసుకురావాలన్నారు. 2025 –26 సంవత్సరానికి యాక్షన్ప్లాన్, వలంటీర్స్ డాటా సైతం తీసుకురావాలని సూచించారు. పులి సంచారంకాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ మండలం రాస్పెల్లి పరిధిలోని గెర్రెగూడ గ్రామ సమీపంలో బుధవారం పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గెర్రెగూడ గ్రామం నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లే దారిలో పులి అడుగులను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రలు సేకరించారు. పులిజాడను గుర్తించేందుకు అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పులి రాస్పెల్లి బీట్ పరిధిలో సంచరిస్తుండడంతో డప్పు చాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
ఆర్టీఏ అవినీతికి చెక్ !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రాష్ట్రంలో రవాణా శాఖ చెక్పోస్టులు ఎత్తివేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న తనిఖీ కేంద్రాలను బుధవారం సాయంత్రం నుంచే అమలు చేశారు. ఉమ్మడి జిల్లాలో అంతర్రాష్ట్ర సరి హద్దుగా జాతీయ రహదారులు–44, 61, 363పై జైనథ్ మండలం భోరజ్, తానూర్ మండలం బెల్తరోడ, వాంకిడిలోని చెక్పోస్టులు పూర్తిగా తొలగించారు. మూడు నెలల క్రితమే రవాణా శాఖలో తని ఖీ కేంద్రాలను ఎత్తి వేసి పూర్తిగా ఆన్లైన్ ఆధారిత వాహన పన్నుల వసూళ్లు, జరిమానాలు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా చెక్పోస్టులు అనధికారికంగానే కొనసాగుతూ వస్తున్నా యి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో లెక్కకు మించి ఉన్న రూ.1.26లక్షల నగదు భోరజ్ వద్ద, రూ.5,100 వాంకిడి చెక్పోస్టు వద్ద, బెల్తరోడ చెక్పోస్టు వద్ద రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఇవే చెక్పోస్టుల్లో దాడులు జరుగగా.. అనధికారికంగా వసూలు చేసిన సొమ్మును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. తరచూ దాడులు, తనిఖీలు జరిగినా ఈ కేంద్రాల్లో సాగిన అవినీతిని నిలువరించలేకపోయారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నుల లక్ష్యాలు పూర్తి స్థాయిలో చేరడం లేదు. తాజాగా కేంద్రాలను ఎత్తివేయడంతో వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి అనధికార వసూళ్లు పూర్తిగా తగ్గనుంది. బెల్తరోడాలో.. తానూరు: బెల్తరోడా చెక్పోస్టులోని ఫర్నిచర్ను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ఫర్నిచర్తోపాటు కంప్యూటర్లు, ఫైళ్లు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. చెక్పోస్ట్ను ఎత్తివేసినట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఫైళ్లు తరలింపు.. ఆదిలాబాద్టౌన్: జిల్లా అధికారులు ఆఘమేఘాలపై బోరజ్ చెక్పోస్టు వద్ద కార్యకలాపాలు నిలిపి వేశారు. బోర్డులు, బారికేడ్లు తొలగించారు. కంప్యూటర్లు, రశీదులు, ఆర్థిక పరిపరమైన రికార్డులను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాని(డీటీసీ)కి తరలించారు. నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పని చేస్తున్నారు. వీరు మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే వారు. వీరిని డీటీసీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక నుంచి వీరికి ఇతర బాధ్యతలు అప్పగించనున్నారు. కార్యాలయాల్లో ఏజెంట్ల హవా ఆన్లైన్లో సేవలు.. వాంకిడి: చెక్పోస్టుల ద్వారా అందించిన సేవలను ఇకపై www. transport. telangana. gov. in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ద్వారా టెంపరరీ పర్మిట్, వాలంటరీ టాక్స్, స్పెషల్ పర్మిట్ వంటి సేవలు లభ్యమవుతాయి. సేవలపై చెక్పోస్ట్ సిబ్బంది కొన్ని నెలలుగా వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు చెక్పోస్టు వద్ద ప్రత్యేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లోనూ ఏజెంట్లు, మధ్యవర్తల హవా కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏజెంట్ల పేరుతో వాస్తవ చార్జీల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అంతా తెలిసి కూడా ఈ అనధికార వసూళ్లను ప్రోత్సహిస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, వినియోగదారులు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు ఇవ్వడంలో ప్రభుత్వం విధించిన రుసుం, పన్నుల కంటే అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చాలామందికి రవాణా శాఖ నిబంధనలపై అవగాహన లేమితో విద్యావంతులు సైతం మధ్యవర్తులతోనే కార్యాలయాలకు వెళ్తున్నారు. చాలా సేవలు ఆన్లైన్లో చేసుకోవచ్చు. సులువుగా పని పూర్తవుతుందనే కారణంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్న పౌరులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే చేసుకునే వెలుసుబాటు ఇవ్వాలి. నిరక్షరాస్యులు సైతం కార్యాలయాల్లో సేవలు పొందేలా ఏర్పాట్లు, కార్యాలయాల్లో మధ్యవర్తులను కట్టడి చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఆధునిక సేవలను వినియోగించి దళారుల వ్యవస్థను తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్న నేపథ్యంలో ఆ దిశగా ఉమ్మడి జిల్లా కార్యాలయాల్లో పకడ్బందీగా అమలు చేస్తే అక్రమ వసూళ్లు నిలిచే అవకాశం ఉంటుంది. -
● బ్లేడ్తో కోసుకున్న యువకుడు ● తాళ్లతో బంధించిన స్థానికులు
నిర్మల్లో సైకో వీరంగంనిర్మల్టౌన్: జిల్లా కేంద్రంలో ఓ సైకో వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బర్కత్పురా కాలనీకి చెందిన మొహమ్మద్ అన్వర్ పాత మార్కెట్లోని టెంట్ హౌస్లో పనిచేస్తున్నాడు. టెంట్ హౌస్ ఆటోను మంగళవారం రాత్రి యజమానికి చెప్పకుండా తీసుకెళ్లాడు. దీంతో యజమాని బైక్పై వచ్చి స్థానిక నగ్రేశ్వర వాడ చౌరస్తాలో ఆటోను ఆపి అన్వర్ను మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అటువైపు వచ్చిన కానిస్టేబుల్ రెహమాన్ గొడవపై ఆరా తీశారు. దీంతో అన్వర్ తన మీద ఉన్న బట్టలు చింపుకొని బ్లేడుతో శరీరంపై కోసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న వారు అన్వర్ను పట్టుకొని తాళ్లతో బంధించారు. అప్పటికే అన్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా ఆసుపత్రికి చేరుకున్నారు. అన్వర్తో మాట్లాడే ప్రయత్నం చేయగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అన్వర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. -
సీపీని కలిసిన రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు
పాతమంచిర్యాల: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ సభ్యులు బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ఝాను కలిశారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా విధినిర్వహణలో అమరులైన వీర జవాన్ల కు సంతాపం తెలిపారు. సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించాల ని వినతిపత్రం సమర్పించారు. అనంతరం శాలు వాతో సన్మానించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కే.భాస్కర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రక్తనిధి కేంద్రం ఇంచార్జీ వి.మధుసూదన్రెడ్డి, జిల్లా కోశాధికారి కే.సత్యపాల్రెడ్డి పాల్గొన్నారు. -
వచ్చే నెల ఒకటి నుంచి పత్తి కొనుగోళ్లు
నస్పూర్: నవంబర్ ఒకటి నుంచి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. రై తులు పత్తిని దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. బుధవారం ఆయన కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జి ల్లా వ్యవసాయాధికారి సురేఖ, మార్కెటింగ్ అధి కారి షహబుద్దీన్, ముఖ్య ప్రణాళిక అధికారి స త్యంతో కలిసి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు ల నిర్వాహకులతో పత్తి కొనుగోలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి పత్తి జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యు, మండల వ్యవసాయాధికారి, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కొనుగోలుపై పర్యవేక్షిస్తామని తెలిపారు. సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి నస్పూర్: జిల్లాలోని రైస్మిల్లులకు ఖరీఫ్, రబీలకు సంబంధించి కేటాయించిన సీఎంఆర్ డెలివరీ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసి 2025– 26 సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్ వరి ధాన్యం కో సం బ్యాంకు గ్యారంటీలు, ఒప్పందాలు సమర్పించా లని తెలిపారు. లక్ష్యాలు పూర్తి చేయని డిఫాల్టర్ రైస్మిల్లులకు ధాన్యం కేటాయించబోమన్నారు. -
మెప్మాపై పట్టింపేది..!
మంచిర్యాలటౌన్: జిల్లాలోని బల్దియాల్లో మహిళల ఆర్థిక బలోపేతానికి ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)ను పట్టించుకునే వారే కరువయ్యారు. రూ.కోట్ల రుణాలు బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు అందిస్తుంటారు. రుణాలు ఇప్పించడంలో మెప్మా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆడిట్లో సీ్త్రనిధి రుణాలను మహిళా సంఘాల నుంచి వసూలు చేసిన సిబ్బంది, వాటిని బ్యాంకుల్లో చెల్లించకుండా సొంత అవసరాలకు వినియోగించినట్లు బయటపడింది. మంచిర్యాలలో రూ.56.38 లక్షలు, బెల్లంపల్లిలో రూ.16.50 లక్షలు సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా గుర్తించిన అధికారులు రికవరీకి ఆదేశించారు. ఆర్సీల నుంచి మొదలుకుని సీవోలు, టీఎంసీలు రుణాలు ఇప్పించడంతోపాటు రికవరీలో అవకతవకలకు పాల్పడుతున్నా.. వారిపై పర్యవేక్షించాల్సిన ఏడీఎంసీ, డీఎంసీ పోస్టులు ఖాళీగా ఉండడం, రెగ్యులర్ మెప్మా పీడీ లేకపోవడం, మున్సిపల్ కమిషనర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం కారణంగా మెప్మాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. డబ్బులిస్తేనే రుణాలు.. జిల్లాలో 5,363 స్వయం సహాయక గ్రూపుల్లో 56,130 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు బ్యాంకు లింకేజి, సీ్త్రనిధి రుణాలు ఇప్పించి, వివిధ యూనిట్ల ఏర్పాటుతో ఆర్థికంగా ఎదిగి రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. రుణాలు ఇప్పించేందుకు జిల్లావ్యాప్తంగా 235 మంది ఆర్పీలు పనిచేస్తున్నారు. వీరు సీవోకు ప్రతిపాదనలు పంపిస్తారు. గ్రూపు సభ్యులు రుణాలు సకాలంలో చెల్లిస్తున్నారో లేదో పరిశీలించి, ఆయా గ్రూపులకు కొత్త రుణాలను సీవో, టీఎంసీలు మంజూరు చేయిస్తారు. రుణంలో నుంచి కొంత మొత్తం తీసుకుంటున్నారని, అది ఇచ్చే వారికే రుణాలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆర్పీల్లో కొందరిని తమ ఆధీనంలో ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతూ, వినని ఆర్పీలను పక్కన పెట్టి, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక మెప్మా సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆయా మున్సిపాలిటీల ఆర్పీలు, టీం సభ్యులు మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. ఎక్కడి సిబ్బంది అక్కడే జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో టీఎంసీలు, సీవోలు ఏళ్ల తరబడి ఒక్కచోటే పనిచేస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో టీఎంసీతోపాటు ముగ్గురు సీవోలు కొన్నేళ్లుగా పని చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్లంపల్లి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో రెగ్యులర్ టీఎంసీ పనిచేస్తుండగా, ఒక్క సీవో గాని, ఇతర సిబ్బంది గాని లేరు. లక్సెట్టిపేట, నస్పూరు, మందమర్రి, చెన్నూరులో సీవోకు టీఎంసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంచిర్యాల మినహా ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ పూర్తిస్థాయి సిబ్బంది లేక ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. మంచిర్యాలలో 56 మంది ఆర్పీలు పనిచేస్తుండగా, చెప్పినట్లుగా వినే ఆర్పీలకు సంబంధించిన గ్రూపు సభ్యులకు బ్యాంకు రుణాలు ఇప్పించి కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు కమిషనర్కు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం జిల్లాలోని మెప్మాలో కొందరు ఆర్పీలు, సీవోలు, టీఎంసీల పనితీరుపై ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బెల్లంపల్లి, క్యాతన్పల్లి, మంచిర్యాలలో రెగ్యులర్ టీఎంసీ ఉండగా, నస్పూరు, లక్సెట్టిపేట, చెన్నూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో ఉన్న ఒక్క సీవోలకు టీఎంసీగా అదనపు బాధ్యతలు అప్పగించాం. మెప్మాలో ఏ అధికారి నుంచి ఇబ్బందులు ఉన్నా వెంటనే తనకు ఫిర్యాదు చేస్తే విచారించి శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. – రాజు, మెప్మా పీడీ (క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్)జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా మహిళా సంఘాలు, సంఘ సభ్యులు మున్సిపాలిటీ ఎస్హెచ్జీ సభ్యులు ఆర్పీలు గ్రూప్లు బెల్లంపల్లి 842 8,743 33 చెన్నూరు 414 4,563 19 క్యాతన్పల్లి 563 5,950 23 లక్సెట్టిపేట 350 3,618 17 మంచిర్యాల 1306 13,310 56 మందమర్రి 856 9,005 38 నస్పూర్ 1032 10,941 49 మొత్తం 5,363 56,130 235 -
మద్యం మత్తులో యువకుడి ఆత్మహత్య
నెన్నెల: మండల కేంద్రంలోని ముస్లింవాడకు చెందిన షేక్ యాకుబ్(25) అనే యువకుడు మద్యం మత్తులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. యాకుబ్ మద్యానికి బానిసవడంతో భార్యభర్తలకు తరచూ గొడవలు జరిగేవి. బుధవారం ఉదయం మద్యం మత్తులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకొని కన్పించాడు. మృతుడి తండ్రి మహబూబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య జోయ, కొడుకులు యాజన్, అజియాన్ ఉన్నారు. చికిత్స పొందుతూ వివాహిత మృతికౌటాల: సిర్పూర్(టి) మండలం ఇటిక్యాల పహాడ్ గ్రామానికి చెందిన లెండుగురె రేణుక(30) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కౌటాల ఎస్సై చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రేణుక తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో తల్లి వద్దే ఉంటుంది. రేణుక పెద్ద కుమార్తె ఇందు పుట్టుకతోనే పక్షవాతంతో బాధపడుతుంది. గత కొద్ది రోజులుగా రేణుక సైతం అనారోగ్యం బారిన పడడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సిర్పూర్(టి) ఆస్పత్రిలో రేణుక మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో బుధవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి తల్లి మందాడె తారాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చెరువులో దూకి వృద్ధుడు ఆత్మహత్యభైంసారూరల్: మండలంలోని కుంసర గ్రామానికి చెందిన భుజంగ్రావు(75) అనే వృద్ధుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భుజంగ్రావు గత కొంత కాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో భరించలేక బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భుజంగ్రావు కూతురు నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. బైక్ దొంగకు ఆరు నెలల జైలు శిక్షమంచిర్యాలక్రైం: బైక్ దొంగతనానికి పాల్పడిన ఒకరికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.100ల జరిమానా విధిస్తూ జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ సివిల్ జడ్జి కే. నిరోష బుధవారం తీర్పు వెల్లడించినట్లు స్థానిక సీఐ ప్రమోద్ రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ముఖరాం చౌరస్తా కాలనీకి చెందిన భరత్ రేన్వాకు చెందిన స్కూటీని 2025 జూన్11న స్థానిక సూర్యనగర్కు చెందిన గుండేటి రాకేశ్ దొంగతనం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పర్చగా, విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో రాకేశ్కు ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ముగ్గురు వ్యక్తులపై కేసుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో గల పేపర్ ప్లేట్ల షాపులోకి వెళ్లి గందరగోళం సృష్టించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై రమ్య తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు షాపులోకి చొరబడి వస్తువులను చిందరవందరగా పడేశారని బాధితుడు మహేందర్ వాపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి
బాసర: పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభం కావడంతో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. బుధవారం పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి నది తీరాన ఉన్న శ్రీ సూర్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల శివనామస్మరణలో ఆలయం మారుమోగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి పాదాల వద్ద అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో అంజనీదేవి ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించా లని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత సూచించారు. జిల్లా కేంద్రంలోని హ మాలీవాడ బస్తీ దవాఖానాను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వై ద్య సేవలను పరిశీలించారు. బుధ, శనివారా ల్లో వ్యాక్సినేషన్ను తప్పనిసరిగా నిర్వహించా లని సూచించారు. ప్రతీ శుక్రవారం డ్రైడేను పాటించడంతో పాటు జిల్లాలోని ప్రజలకు కీటకజనిత వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. గ ర్భిణుల వివరాలను నమోదు చేసి, వారికి నె లనెలా వైద్యులు పరీక్షలు నిర్వహించి, సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ రమ్య, డీపీహెచ్ఎన్ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆనందాల కేళి
ముగ్గువేసి దీపాలు వెలిగిస్తున్న సెక్టోరల్ అధికారి విజయలక్ష్మిమంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలో దీపావళి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే దుకాణాలు, ఇళ్లను పూలతో అందంగా అలంకరించారు. ఇళ్ల ముందు రంగురంగుల విద్యుద్దీపాలు, ప్రమిదలు వెలిగించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాణాసంచా, మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. పిల్లలు, పెద్దలు బాణాసంచా కాల్చి సంబురాల్లో మునిగితేలారు. టపాసుల మోత, తారాజువ్వల వెలుగులతో వాడలన్నీ మెరిసిపోయాయి. -
వార్డెన్ను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: లక్సెట్టిపేట ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్ను వేధింపులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు మార్ దీపక్, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి దు ర్గాప్రసాద్కు మంగళవారం టీఎన్జీవోస్ సభ్యులు వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హాస్టల్ పిల్లల సంక్షేమానికి ఖర్చు చే సిన బిల్లులు మంజూరు చేయకుండా వ్యక్తిగతంగా అవమానిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో నే వార్డెన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరో పించారు. హాస్టల్ వార్డెన్కు తక్షణమే న్యాయం చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కోశాధికారి సతీశ్కుమార్, ఉపాధ్యక్షులు రామ్మార్, తిరుపతి, జాయింట్ సెక్రటరీ సు రేందర్, పబ్లిక్ సెక్రటరీ యూసుఫ్, రాజేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, అజయ్, ప్రశాంత్, విజయ, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేశ్, సభ్యులు గంగారాం, సంజీవ్రావు, సునీత, సుభద్ర, సుధాలక్ష్మి ఉన్నారు. -
సన్నగా పక్కదారి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రేషన్ దుకాణాల ద్వా రా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని కూడా అక్రమార్కులు వదలడంలేదు. కొన్ని చోట్ల లబ్ధిదారులకు చేరకముందే డీలర్లే బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. మరికొన్ని చోట్ల లబ్ధిదారులే అమ్ము కుంటున్నారు. పేదల ప్రయోజనం కోసం ప్రభు త్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమార్కులు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీస్, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో ఇవి వెలుగులోకి వస్తున్నాయి. అంతా ఆన్లైన్.. అయితేనేమి?ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నుంచి కొందరు లబ్ధిదారులు నేరుగా దళారులతోపాటు రేషన్ డీలర్లకు అమ్మేసుకుంటున్నారు. ఇందుకు వారు కిలోకు రూ.15వరకు చెల్లిస్తున్నారు. మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే కార్డు తొలగించే అవకాశం ఉండడంతో లబ్ధిదారులు క్ర మం తప్పకుండా తీసుకుంటున్నప్పటికీ పలుచోట్ల దళారులు, రేషన్డీలర్లకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన సన్న బియ్యాన్ని అక్రమార్కులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని షాపుల్లో బియ్యం పంపిణీ, ఆన్లైన్ కోటా, షాపుల్లోని నిల్వలకు లెక్కలు కుదరడం లేదు. మరోవైపు ఎంఎల్ఎస్ (మండల స్థాయి గిడ్డంగి) పాయింట్ల నుంచి తమకు తక్కువ తూకంతో బియ్యం వస్తున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులకు గన్నీ సంచితోనే తూకం వేస్తున్నారు. బియ్యం బస్తాలు ఎత్తి, దింపేటపుడు తరుగుతో పాటు చినిగిన సంచీలతోనూ తమకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంటున్నారు. లబ్ధిదారుల మాదిరిగా డీలర్లకూ బయోమెట్రిక్ అమలవుతోంది. అంటే ఎంఎల్ఎస్ పాయింట్లో వేలి ముద్రతోనే బియ్యం పంపిస్తున్నారు. అయితే ఆర్వో (రిలీజింగ్ ఆర్డర్)లో ఉన్న కోటాకు తేడా వస్తోందని చెబుతూ క్షేత్రస్థాయిలో కొందరు డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి తనిఖీల్లో..ఈ నెల 15న జిల్లా కేంద్రంలో పౌరసరఫరాలశాఖ టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో పాత మంచిర్యాలలో రెండు రేషన్ దుకాణాల డీలర్లు, చున్నంబట్టివాడలో ఒక దుకాణం డీలర్ వారు రాకముందే షాపులు వదిలి పారిపోయారు. దీంతో బియ్యం ని ల్వల్లో తేడాలున్నట్లుగా భావించిన అధికారులు ఆ మూడింటిని సీజ్ చేశారు. గత నెల 12న దండేపల్లి మండలం నంబాలలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7.50 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు జిల్లాలో రేషన్ అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి. బియ్యం కోటా 4,736.8 మెట్రిక్ టన్నులు (అక్టోబర్)జిల్లా సమాచారంకఠినంగా అమలు చేస్తేనే..సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన మొదట్లో లబ్ధిదారులు అమ్ముకున్నా.. దళారులు, డీలర్లు కొనుగోలు చేసినా కేసులు నమోదు చేశారు. బియ్యం విక్రయించిన లబ్ధిదారుల రేషన్కా ర్డుల రద్దుకు సిఫారసు చేశారు. ఆ తర్వాత ప ట్టించుకోవడం మానేశారు. దీంతో యథేచ్ఛగా సన్న బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులతో ఒప్పందం చేసుకుని వారికివ్వాల్సిన బియ్యాన్ని కొని బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారు. ఎవరైనా లబ్ధి దారులు బియ్యం అమ్ముకుంటే కేసులు నమో దు చేయడంతో పాటు రేషన్కార్డులు తప్పనిసరిగా తొలగించాలి. అలాగే బియ్యం నల్లబజా రుకు తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే ప్రజాధనం వృథా కాకుండా అర్హులకే సన్నబియ్యం అందే అవకాశముంది. -
పంటలపై పందుల దాడి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన అన్నదాతలను ఇప్పుడు అడవిపందులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో కురిసిన భారీ వర్షాలు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటను నీటముంచాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినా కాత, దిగుబడి దశలో ఉన్న ప త్తి, పొట్ట, గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి పంటలపై అడవిపందులు ధ్వంసం చేస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు చీరెలు, ప్లా స్టిక్ కవర్లు, సంచులు, బెదురు బొమ్మలు, ఇనుప డ బ్బాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు పంటచేల వద్ద మంటలు వేసుకుని కాపలా ఉంటున్నారు. కేకలు వేస్తూ, ఇనుపడబ్బాలు చప్పుడు చే స్తూ, టపాకాయలు కాలుస్తూ వాటిని బెదిరిస్తున్నా రు. అయినా బెదరని పందులు పదుల సంఖ్యలో పంటచేలలోకి ప్రవేశించి చేనంతా నేలమట్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అడవిపందులు రైతులపైనా దాడి చేసి గాయపర్చిన ఘటనలున్నాయి. వేల ఎకరాల్లో నష్టంజిల్లాలో ఈ ఏడాది రైతులు 3.21 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 1.61 లక్షల ఎకరాల్లో పత్తి, 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత ఆగస్టు, సెప్టెంబర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలు, ఈ నెల అల్పపీడన ప్రభావంతో వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం రైతులు పత్తి ఏరేందు కు సిద్ధమవుతున్నారు. వరి గొలుసు పట్టి గింజపాలు పోసుకుంటోంది. ఈ సమయంలో అడవిపందుల దాడి విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో పత్తిచేలల్లోకి దూరి కాయలు తింటూ చెట్లను తొక్కుతూ నేలమట్టం చేస్తున్నాయి. వరి గొలుసులు తింటూ కర్రలను బురదలో తొక్కుతున్నాయి. పచ్చగా ఉన్న పంట పొలాలను తెల్లారేసరికి బురదమడుగులా తయారు చేస్తున్నాయి. దీంతో పంట నష్టపోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా..అడవిపందుల బారినుంచి పంటలను రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నా రు. ఒక్కో చీరెకు రూ.20 నుంచి రూ.30కి వెచ్చించి వందలసంఖ్యలో తెచ్చి పత్తి, వరి పంటల చుట్టూ కడుతున్నారు. దీంతో పాటు బెదురు బొమ్మలు, ప్లా స్టిక్ సంచులు, ఇనుప డబ్బాలు కడుతూ అడవిపందులను బెదరగొట్టేందుకు అష్టకష్టాలు పడుతున్నా రు. అయినప్పటికీ అడవిపందుల దాడులు ఆగడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం రాయితీపై వివిధ వ్యవసాయ పనిముట్లు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా రాయితీపై తమ కు సోలార్ కంచెలు అందించి పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
అమరుల త్యాగాలు మరువలేనివి
మంచిర్యాలక్రైం: విధి నిర్వహణలో అమరులైన పో లీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంగళవా రం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఆర్జీ–1 డివిజన్ జీఎం లలి తకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రజాసే వ కోసం తమ ప్రాణాలర్పించిన పోలీసులు మహా నుభావులని, వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించా రు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసుల సహాయసహకారాలు ఉంటాయని, ఎలాంటిసమ స్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని సూచించా రు. అంతకుముందు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ దేశంలో 191మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారి పేర్లు చదివి వినిపించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ, ఏఆర్ఐలు, ఈపీవోలు, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. గుడిపేట బెటాలియన్లో..మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం అమరవీ రుల స్తూపం ఎదుట పోలీస్ అమరవీరులకు బెటా లియన్ కమాండెంట్ వెంకటరాములు, పోలీస్ అధి కారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. బె టాలియన్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, శిక్షణ కానిస్టేబుళ్లు రెండు నిమిషాలు మౌనం పాటించా రు. గౌరవ వందనం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించా రు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వర్రావు, బాలయ్య, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.మంచిర్యాలక్రైం: అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తున్న కలెక్టర్ కుమార్దీపక్ మంచిర్యాలక్రైం: స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న సీపీ అంబర్ కిషోర్ ఝా -
బడి తనిఖీకి సార్లొస్తున్నారు..
మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలలను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు, విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యసన తీరు పరిశీలనకు ప్రత్యేక బృందాలతో తనఖీలు చేయాలని యోచిస్తోంది. ఇందు కు పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో కమి టీల నియామకానికి కసరత్తు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా బృందాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో వంద పాఠశాలలకు ఒక కమిటీ చొప్పున ఎనిమిది బృందాలను నియమించనుంది. విద్యాశా ఖ నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాలు, పదేళ్ల అనుభవం, సబ్జెక్టుల్లో పాఠ్యాంశ ప్రదర్శన ఇచ్చే టీచర్లకు కమిటీలో అవకాశం కల్పించనుంది. ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్ హెచ్ఎంతో పాటు ఇద్దరు ఎస్జీటీలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అ సిస్టెంట్ నోడల్ ఆఫీసర్గా ఇద్దరు ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలల్లో జీహెచ్ఎం ఏడుగురు సబ్జెక్టుల టీచ ర్లు, పీడీతో కూడిన బృందాలు తనఖీలు నిర్వహిస్తా యి. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీలో స్థాని క సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో, కలెక్టర్ నామి నెట్ చేసిన ఒక అధికారి ఉంటారు. ఈ బృందాల్లో ఉన్న ఉపాధ్యాయులు పూర్తికాల సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ విద్యాసంవత్సరం వరకు ఉండనున్నారు. ఎంపికైన ఉపాధ్యాయుల స్థానంలో డీఈవోలు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మూడు నెలల్లో తనిఖీలు పూర్తిజిల్లాలో 486 ప్రాథమిక పాఠశాలలకు ఐదు, 96 యూపీఎస్లకు ఒకటి, 108 ఉన్నత పాఠశాలలకు రెండు తనిఖీ బృందాలను నియమించనున్నారు. పాఠశాలల తనిఖీలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలు మూడునెలల్లో తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లో తనిఖీలు పూర్తి చేయాలి. ప్రతినెలా 5న అందుబాటులో ఉన్న వివరాలు డీఈవోకు నివేదించాలి. బడికి వెళ్లి తరగతి గదిలో బోధన తీరు గమనించా లి. విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకోవాలి. పా ఠాలు కూడా బోధించాల్సి ఉంటుంది. స్టాఫ్ మీటింగ్ నిర్వహించి ఎప్పటికప్పుడు సమావేశ వివరాలు అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ప్రగతిని అంచనా వే యడం, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ల పరిశీలించడం చే స్తూ ఉండాలి. విద్యార్థులు, టీచర్లు హాజరు, పనితీ రు వివరాలు ప్రత్యేక బృందాలు అడిగి తెలుసుకో నున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలు, పా రిశుధ్య నివారణ చర్యలు, తాగునీటి సదుపాయం, ఇతర సౌకర్యాల గురించి క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. -
Telangana: పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్పే, గూగుల్పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
ఖండాంతరాలు దాటిన నృత్య ప్రదర్శన
కుభీర్: మండల కేంద్రానికి చెందిన కళాకారిణి ఠాకూర్ అనూష భరతనాట్య నృత్య ప్రదర్శన ఖండాంతరాలకు దాటింది. ఈమె తల్లిదండ్రులు మీరా–కరణ్సింగ్. తల్లి గృహిణి. తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనూషకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం(జానపద) డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. ఎంఏ ఇంగ్లిష్ విద్యనభ్యసించగా, ఆమె భరతనాట్యంలో డిప్లొమా పూర్తిచేసింది. 2008లో మా టీవీలో వచ్చిన రేలారేలా కార్యక్రమంలో పాల్గొని జానపద పాటలు పాడారు. గురువు సముద్రాల మాధవీ రామానుజం వద్ద భరతనాట్యంలో మెలకవలు నేర్చుకుంది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, భద్రాచలం, తిరుమల తదితర నగరాల్లో 400లకు పైగా, అమెరికా, యూకే, మలేషియా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. తండ్రి ఆదిలాబాద్లో పనిచేయడంతో ఆమె విద్యాభ్యాసం అక్కడే సాగింది. దేశ,విదేశాల్లో భరతనాట్య ప్రదర్శన చేసిన ఆమె ఎక్కడికెళ్లిన కుభీర్ వాసిగా చెబుతోంది. -
జన్నారం అందాలు చూసొద్దాం..
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో అందాలు ఆస్వాదిస్తూ.. వన్యప్రాణులు, రకరకాల పక్షులు, జంగిల్ సఫారీ ప్రయాణం ద్వారా పర్యాటకులు వీక్షించేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టడడంతో సఫారీ ప్రయాణానికి గ్రీన్సిగ్నల్ లభించింది. మూడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 1 నుంచి జంగిల్ సఫారీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చి అడవులు చూసి మురిసిపోతున్నారు. పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం మధ్య గడుపుతున్నారు. వీకెండ్ రోజుల్లో గదులు ఫుల్గా ఉంటున్నాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. 15 రోజుల్లో 600 పైగా మంది జంగిల్ సఫారీ మొదలైన 15 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 600 పైగా మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చారని అధికారులు తెలిపారు. నిజామాబాద్, హైదరాబాద్ నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ సందడి చేస్తున్నారు. రాత్రి హరిత రిసార్ట్లో బస చేసి ఉదయం జంగిల్ సఫారీ ద్వారా వన్యప్రాణుల పరుగులు, పచ్చని అడవులను అస్వాదిస్తున్నారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన బేస్క్యాంపు, అధ్యయన కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అడవుల్లో నిర్మించిన కుంటల్లో పక్షుల కిలకిలలు చూసి మురిసిపోతున్నారు. చెడిపోయిన దారులు.. గేట్ నంబర్ 1 నుంచి సుమారు 15 కి.మీ దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. గొండుగూడ బేస్క్యాంపు, బైసన్కుంట ప్రాంతాల్లో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, అడవి దున్నలు, రకరకాల పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో సఫారీ దారి చెడిపోయినట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అటవీశాఖ దృష్టిసారించి సఫారీ దారిని బాగు చేయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు సైతం కల్పించాలని కోరుతున్నారు. -
క్వారీ గుంతలో పడి యువ రైతు మృతి
మంచిర్యాలక్రైం: క్వారీలో గుంతలో ప్రమాదవశాత్తు పడి యువరైతు మృతిచెందినట్లు ఎస్సై మజారోద్దిన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొడప గంగు–భారతి దంపతుల కుమారుడు యాదవరావు(25). తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఉన్న నాగారం శివారులోని పత్తి చేనులో నీరు పట్టేందుకు శనివారం సాయంత్రం యాదవరావు అక్కడికి వెళ్లాడు. కరెంట్ మోటారుకు మరమ్మతు చేపడుతున్నాడు. ఈక్రమంలో మోటారు పంప్ను నీటిలో బిగించేందుకు క్వారీలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలకు సోమగూడెం యువకుడు
కాసిపేట:మండలంలోని సోమగూడెంకు చెందిన గురునాథం శంకర్ యూనివర్సిటీస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ బాదె శేఖర్ తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతన్న శంకర్ ఈనెల 18న హన్మకొండలో జరి గిన కాకతీయ యూనివర్సిటీ అంతర్ విశ్వవి ద్యాలయ పోటీల్లో ప్రతిభకనబర్చాడు. హైదరాబాద్లో జనవరిలో నిర్వహించే సౌత్జోన్ అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో శంకర్ కాకతీ య యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వ హించనున్నాడు. ఈసందర్భంగా కోచ్తోపాటు తోటి క్రీడాకారులు శంకర్ను అభినందించారు. ఆవుకు అంతిమ సంస్కారంమంచిర్యాలరూరల్(హాజీపూర్): నంనూర్ పునరావాస కాలనీలో రైతు అత్తె శ్రీనివాస్కు చెందిన ఆవు ఆదివారం పాముకాటుతో మృతిచెందింది. ఈ ఆవు ఆ కాలనీలో జరిగే గృహప్రవేశాలకు వచ్చి మొదట ప్రత్యేక పూజలు అందుకునేది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో ముంపున కు గురైన నంనూర్ పాత గ్రామంలోని అభయాంజనేయ స్వామి విగ్రహాలను ఆవు సమక్షంలోనే కదిలించారు. పాముకాటుతో మృతిచెందిన ఆవుకు స్థానికులు శాస్త్రోక్తంగా పూజలు చేసి అంతిమ సంస్కాకంలో భాగంగా ఖననం చేశారు. వ్యక్తిపై కేసుచెన్నూర్: సోషల్మీడియాలో మైనింగ్ అధికారిపై అసత్య, అసభ్య ఆరోపణలు చేసిన పట్టణానికి చెందిన ముత్యాల రవికుమార్పై కేసు నమోదు చేసినట్లు సీఐ దేవేందర్రావు తెలిపారు. మైనింగ్ అధికారి రామకృష్ణ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరి మనోభావాలు దెబ్బతిసేలా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
వార్డెన్ ఆత్మహత్యాయత్నం
లక్సెట్టిపేట:మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన రాజగోపాల్ ఈనెల 18న సాయంత్రం తన ఇంటి వద్ద యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17న ఇంటికి వెళ్లిన రాజగోపాల్... 18వ తేదీ సాయంత్రం బాత్రూంలోకి వెల్లి యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను 100 నుంచి 252కి పెంచేలా రాజగోపాల్ కృషి చేశాడు. అయితే ఆమేరకు బిల్లులు రాకపోవడంతో రూ.7 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. అయినా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. దీనిపై సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చాతరాజు దుర్గాప్రసాద్ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నిర్మల్కు వెళ్లి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఏఎస్డబ్ల్యూవో సురేశ్ను వివరణ కోరగా ఈనెల 17న తన తల్లి ఆరోగ్యం బాగాలేదని రాజగోపాల్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భీమారం: ఆర్థిక ఇబ్బందుల కారణంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆమె కథనం ప్రకారం..భీమారంలోని ఎస్సీ కాలనీకి చెందిన గాలిపల్లి తారక్ (19) మంచిర్యాలలో కొన్ని నెలలుగా కారు మెకానిక్ పని నేర్చుకున్నాడు. శిక్షణ అనంతరం భీమారంలో సొంతంగా కారు మెకానిక్ షెడ్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించున్నాడు. ఈ విషయాన్ని తండ్రి రమేశ్కు చెప్పగా అంత డబ్బు లేదని తర్వాత ఏర్పాటు చేద్దామనడంతో తారక్ మనస్తాపం చెందాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో మరో గదిలోకి వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకున్నాడు. అనుమానంతో తండ్రి రమేశ్ తలుపు బాదిన ఎంతకు తీయకపోవడంతో కిటీకి నుంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలుకొట్టి వెళ్లి తారక్ కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటన స్థలానికి ఎస్సై శ్వేత చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొడేటి రవి.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో సత్తా
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన కొమ్ము కృష్ణ సత్తా చాటాడు. హైదరాబాద్లోని అంబర్పేటలో ఆదివారం నిర్వహించిన పదవ తెలంగాణ మాస్టర్ ఇంటర్ డిస్టిక్ర్ట్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో గోల్డ్ మెడల్తో మెరిశాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలవడంపై డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్రెడ్డి, పార్థసారథి తదితరులు అభినందించారు. -
జీజీహెచ్లో సదుపాయాలు కల్పించాలి
మంచిర్యాలటౌన్/కోటపల్లి: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ఆదివా రం జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే బెడ్పై ఇద్దరు పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని, మరుగుదొడ్లు చాలినంతగా లేకపోవడం, ఉన్నవి సైతం అపరిశుభ్రతతో వినియోగించలేని పరిస్థితి ఉందన్నారు. సరిపడా వైద్యులు, మౌలిక వసతులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారన్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని వసతిగృహం శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్పందించిన రాంచందర్ సమస్యలను షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ము న్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి మంత్రి సురేఖ రామయ్య, ఆఫీస్ కార్యదర్శి తోట మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. ఒకే మాను..రెండు చెట్లుజన్నారం: ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. జన్నారం మండలం ధర్మా రం వెళ్లే దారిలో పొలాల మధ్య జువ్వి, ఇప్ప చెట్లు పెనవేసుకుని ఎ దిగాయి. ఒకే మానుకు రెండు చెట్లు ఉన్నట్లు కనిపిస్తూ ఆకర్షిస్తున్నాయి. -
చెదరని నెత్తుటి జ్ఞాపకాలు
ఖానాపూర్: ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఈనెల 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సాక్షి కథనం. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు నేటికి చెదరని నెత్తుటి చేదు జ్ఞాపకాలు.. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసినా అన్నల అలజడి.. తుపాకీ మోత చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతీరోజు ఎక్కడో ఒకచోట నక్సలైట్ల విధ్వంసాలు, తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి. వారి కవ్వింపు చర్యలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో పలువురు పోలీసులు అమరులయ్యారు. వారి సేవలు మరువలేనివి. ఈక్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు నడిపేవారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే నక్సలైట్లు విద్రోహచర్యలకు శ్రీకారం చుట్టారు. ఖానాపూర్లో అమరుల స్తూపం ఖానాపూర్ పోలీస్ష్టేషన్లో పోలీసు అమవీరుల స్మారకార్థం స్తూపం లేదు. పోలీస్స్టేషన్ ఆవరణలో వేపచెట్టు కింద కొన్నేళ్లుగా శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచారు. 2008లో అప్పటి సీఐ, ఎస్సైలు స్మారక స్తూప నిర్మాణానికి కృషిచేశారు. ప్రస్తుత సీఐ అజయ్తోపాటు ఎస్సై రాహుల్ గైక్వాడ్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. సంఘటనల వివరాలివే.. -
‘సాక్షి’పై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడే
సాక్షి పత్రికపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేయడం.. పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలని జిల్లాకు చెందిన పలువురు అభిప్రాయపడ్డారు. పత్రికలు ప్రజలకు, పాలకులకు వారధిగా ఉంటాయన్నారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.కక్షపూరిత చర్యలు మానుకోవాలిపాతమంచిర్యాల: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సాక్షిపై చే స్తున్న దాడి అప్రజాస్వామి కం. సాక్షి రాస్తున్న వార్తల్లో కుట్ర కోణం ఉందని అక్క డి ప్రభుత్వం ఎడిట ర్పై, ఇతర సి బ్బందిపై విచారణ పేరుతో పోలీసులతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. – తోట రాజేశ్, పీడీఎస్యూ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ -
చెన్నూర్ మున్సిపల్ కమిషనర్పై ఫిర్యాదు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలి టీలో గతంలో విధులు నిర్వర్తించిన ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ హరికాంత్ తాజాగా పోలీసులకు ఫిర్యా దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన ఒప్పంద కాలం పూర్తయినా, నూతనంగా కొనసాగింపు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం నుంచి తొలగించారని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తనకు రావాల్సిన వేతనం రూ.94,962 చెల్లించకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనూ వివాదాలు.. మున్సిపల్లో కాంట్రాక్ట్ పనులు నిర్వహించిన సునీల్రెడ్డి కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాడని చెబుతున్నారు. తనకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఆగస్టు 7న సునీల్రెడ్డి కమిషనర్తో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయ ప్రాంగణంలోనే ఇద్దరూ గొడవ పడ్డారు. అనంతరం సునీల్రెడ్డి చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని సమాచారం. కమిషనర్ ప్రవర్తనపై విమర్శలు మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మున్సిపల్ కార్యకలాపాలు వివాదాస్పదంగా మారాయి. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో కమిషనర్ దురుసుగా మాట్లాడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. కమిషనర్ రాకతో అభివృద్ధి పనులు మందగించాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సిబ్బందికి వేధింపులు.. వార్డు ఆఫీసర్లను ఆదివారం విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళావార్డు ఆఫీసర్ ఆదివారం కార్యాలయానికి రాకపోవడంతో కమిషనర్ నోటీసు పంపినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద విధులకు హాజరైన సదరు వార్డు ఆఫీసర్ కార్యాలయంలో స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయం బయటికి పొక్కకుండా వాహనం మాట్లాడి మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారని తెలిసింది. ఈ విషయమై కమిషనర్ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. ఉద్యోగి ఫిర్యాదు చేశారు..వేతనం ఇవ్వకుండా మానసికంగా, ఆర్థికంగా చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వేధిస్తున్నాడని ఎన్విరాన్మెంట్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాం. – దేవేందర్రావు, సీఐ, చెన్నూర్ -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
చెన్నూర్: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. పదే పదే కూటమి ప్రభుత్వం పోలీసులతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించడం హేయమైన చర్య. పత్రికల గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సరికాదు. గతంలో పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించిన ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయాయి. – సిద్ది రమేశ్ యాదవ్, భారత యాదవ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
అట్టహాసంగా చెస్ పోటీలు
తాండూర్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాల, బాలి కలకు జిల్లాస్థాయి చెస్ ఎంపిక పోటీలు మండలంలోని విద్యాభారతి ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు పాఠశాల కరస్పాండెంట్ సురభి శరత్కుమార్ కన్వీనర్గా వ్యవహరించి పోటీలను ప్రారంభించారు. ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి ఇదే ప్రాంగణంలో త్వరలో నిర్వహించే జోనల్స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమీ డైరెక్టర్ సౌమ్య, స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి యాకూబ్, పాఠశాల ప్రిన్సిపాల్ సరోజని, చెస్ ఆర్బీటర్స్ సమ్మయ్య, ఆకాశ్, కార్తీక్, పరిశీలకులు పాశం శ్రీనివాస్, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శులు బాలకృష్ణ, రాజు, తారకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కాకో ఆలయానికి పోటెత్తిన భక్తజనం
దండేపల్లి: తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గుడిరేవు గోదావరినది ఒడ్డున ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన శ్రీపద్మల్పురి కాకో ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వారం రోజులుగా జరుగుతున్న దండారీ ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు రద్దీగా మారాయి. సమీప గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు ఒడ్డున గల పద్మల్పురి కాకోను దర్శించుకుని పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అక్కడే వంట చేసుకుని భోజనాలు చేశారు. ఆదివాసీల కోలాటాలు, గుస్సాడీల నృత్యాలు, భజనలు ఆకట్టుకున్నాయి. -
హాస్టల్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలి
పాతమంచిర్యాల: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి పీఏ రాకేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్ మాట్లాడుతూ జీవో 69 రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు వెలిశాల కృష్ణమూర్తి, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్యాంరావు, కోశాధికారి రాంబాయి, ఉపాధ్యక్షురాలు హీరాబా యి, నాయకులు తార, జంగుదేవి, బాపురావు, అరిగెల కోటయ్య, శ్యామల, పద్మ, సముద్రబాయి, తదితరులు పాల్గొన్నారు. -
పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్పే, గూగుల్పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు.


