Mancherial
-
ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి
బోథ్: సొనాల మండలంలోని గుట్టపక్కతండా గ్రామానికి చెందిన సైనాబాయి (35) ద్విచక్రవాహనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనాబాయి తన అల్లుడు మట్ట నందుసింగ్ బైక్పై ఉదయం 6.30 గంటల సమయంలో చేనుకు వెళుతోంది. గంపలు తీసుకుని బైక్పై వెళుతుండగా సొనాల సమీపంలో అవి కదలడంతో ఒక్కసారిగా ఆమె జారి కిందపడింది. తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికుల సాయంతో బోథ్లోని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతిచెందింది. కాగా మృతురాలికి భర్త సదాశివ్, కుమారుడు ఉన్నారు. పనిముట్ల కొరత లేకుండా చూడాలిశ్రీరాంపూర్: గనుల్లో పనిముట్లు, యంత్రాల స్పేర్స్ కొరత లేకుండా చూడాలని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా పర్చేజ్ అధికారులతో సమీక్షించారు. గనుల్లో యంత్రాల ని ర్వహణకు అవసరమయ్యే పరికరాల కొరత లేకుండా చూడాలన్నారు. నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలంటే యంత్రాలు నిర్ధేశించిన పని గంట లు పని చేయాలని తెలిపారు. ఇందుకోసం యంత్రాల బ్రేక్ డౌన్ అయినప్పుడు జాప్యం జరుగకుండా విడిభాగాలు సమకూర్చాలని, కొనుగోలు టెండ ర్లు, పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జీఎం యన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణారావు, ఏజెంట్లు రవికుమార్, శ్రీధర్, ఓసీపీ పీఓ వెంకటేశ్వ ర్లు, అధికారులు నాగరాజు, రామకృష్ణ, మోహన్, మల్లేశ్, రవీందర్, చంద్రలింగం పాల్గొన్నారు. -
ఇందిరమ్మ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలు అధికారులను ఆదేశించారు. హిమాయత్నగర్లోని హౌసింగ్ కా ర్పొరేషన్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీ క అని అన్నారు. నిర్మాణ ప్రక్రియలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని, అధికారుల వద్ద ఫైల్ వారం రోజులకు మించి ఉండవద్దని పేర్కొన్నారు. సిబ్బంది కొరత ఉంటే తక్షణమే అధికారులను డిప్యూటేషన్పై తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రతీ దశలో పనుల ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థోమతలేని నిరుపేద లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశ ల వారీగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూ రయ్యే నిధుల ద్వారా రుణం తీర్చేలా చూడాలని తెలిపారు. సమావేశంలో ఎంపీలు నగేశ్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీలు దండే విఠల్, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్, రామారావు పటే ల్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్బాబు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్, ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లు రాజర్షిషా, హరిత, భవేష్ మిశ్రా, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
దండేపల్లి: వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ముత్యంపేట గ్రామంలో రైతులు సోమవారం రోడ్డెక్కారు. లక్సెట్టిపేట–నిర్మల్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా మిల్లుల ట్యాగింగ్ రాలేదని, కాంటాలు వేయడం లేదని అన్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు ప్రాంభించి, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఎస్సై తహాసీనొద్దీన్ రైతులు, నాయకులతో మాట్లాడి సమస్యను ఫోన్లో తహసీల్దార్ రోహిత్దేశ్పాండే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో కాంటాలు ప్రారంభిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, నాయకులు వెంకటేష్, కిషన్, సురేష్, అనిల్, శ్రీనివాస్, మొండయ్య, గురువయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సాధించిన ఘనత బీఆర్ఎస్దే..
నస్పూర్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో, తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కే.సురేందర్రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞానం, వినోదానికి సైన్స్ ప్రయోగాలు
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవుల్లో విజ్ఞానం, వినోదం, సైన్స్ ప్రయోగాలకు సమ్మర్ సైన్స్ క్యాంపు ఎంతో దోహదం చేస్తుందని డీఈవో యాదయ్య అన్నారు. సోమవారం జిల్లా సైన్స్ కేంద్రంలో 15 రోజుల వేసవి సైన్స్ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచడం, సైన్స్పై ఆసక్తి పెంచేందుకు శిబిరం తోడ్పడుతుంద ని అన్నారు. 92 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. కృత్యాధార పద్ధతిలో ప్రయోగాలను తమకు తామే చేస్తూ సైన్స్పై అవగా హన పొందాలని తెలిపారు. జిల్లా పరీక్షల విభాగం సహాయ సంచాలకుడు మల్లేశం మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మూఢనమ్మకాలపై సరైన అవగాహన పెంచుకోవాలని, సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. మొదటిరోజు సైన్స్ ఉపాధ్యాయుడు జాకీర్ కొన్ని ప్రయోగాలతో విద్యార్థులను ఆలోచింపజేశారు. జిల్లా పరీక్షల విభాగం కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, సెక్టోరి యల్ అధికారులు భరత్కుమార్, విజయలక్ష్మి, సత్తయ్య, చౌదరి, జూనియర్ కళాశాల లెక్చరర్ నాగవర్మ, ఉపాధ్యాయులు తిరుపతి, రాజేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పెన్గంగలో విద్యార్థి గల్లంతు
సాత్నాల: భోరజ్ మండలం పెన్గంగ నదిలో స్నానానికి వెళ్లి తోటవార్ కిరణ్(19) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. ఎస్సై పవర్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన కిరణ్ ఆదిలాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. పిట్టలవాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్ వాచ్మెన్ సాయి వంశీ పెన్గంగ వద్ద పూజ ఉందని ఉదయం కుటుంబంతో సహా వెళ్లాడు. వారితోపాటు హాస్టల్ విద్యార్థులైన కిరణ్, తరుణ్ కూడా వెళ్లారు. నదీ తీరంలో వారు పూజలు నిర్వహిస్తుండగా, స్నానం కోసం కిరణ్, తరుణ్ నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇరువురు నీటిలో మునిగే క్రమంలో కేకలు వేశారు. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దూకి వారిని కాపాడేందుకు యత్నించాడు. తరుణ్ను ముందుగా ఒడ్డుకు చేర్చగా, కిరణ్ నీటిలో కొట్టుకుపోయాడు. ఎంత వెదికినా ఆచూకీ లభించకపోవడంతో విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలను నిలిపివేశారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు. -
ఆర్కేపీలో క్రీడా సందడి
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లోని సింగరేణి ఠా గూర్స్టేడియంలో అస్మిత ఖేలో ఇండియా అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలు సోమవారం ఘ నంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఫుట్బాల్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎనిమిది జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు మైదానాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఉదయం జరిగిన మ్యాచ్ల్లో తొలుత నిజామాబాద్, గజ్వేల్ జట్లు తలపడగా 7–0 గోల్స్తో నిజామాబాద్ విజయం సాధించింది. రెండో మ్యాచ్ ఆదిలాబాద్, సిద్దిపేట జట్ల మధ్య జరుగగా 13–0 గోల్స్తో ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్ రంగారెడ్డి, హైదరాబాద్ జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్తో రంగారెడ్డి జట్టు గెలుపొందింది. మరో మ్యాచ్ కరీంనగర్, వనపర్తి జట్ల మధ్య జరుగగా 1–0 గోల్స్తో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. ఇక సాయంత్రం జరిగిన మ్యాచ్ల్లో కరీంనగర్, గజ్వేల్ జట్లు తలపడగా 6–0 గోల్స్తో కరీంనగర్ గెలుపొందింది. ఆదిలాబాద్, మల్కాజిగిరి మధ్య జరిగిన మ్యాచ్లో 2–0 గోల్స్తో ఆదిలాబాద్ గెలిచింది. సిద్దిపేట, రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 0–10 గోల్స్తో రంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్ మధ్య జరిగిన మ్యచ్లో 6–0 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందాయి. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలి – సీఐ రమేష్, మందమర్రి క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలని గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మందమర్రి సీఐ పర్స రమేష్ అన్నారు. క్రీడల్లో రాణించటం వల్ల మంచి భవిష్యత్ ఉంటుందని, ముఖ్యంగా క్రమశిక్షణ ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత, సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, పట్టణ ఎస్సై శ్రీధర్, ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫాల్గుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు ఈశ్వరాచారి, బెల్లం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మహిళ హత్య
ఆదిలాబాద్టౌన్: మద్యం మత్తులో మహిళపై లైంగికదాడికి యత్నించిన నిందితుడు ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్లో ఎస్పీ అఖిల్మహాజన్ విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 24న పంజాబ్చౌక్ సమీపంలోని డ్రెయినేజీలో జనగమ్వార్ అనిత మృతదేహం లభ్యమైంది. మృతురాలి సోదరుడు సంతోష్ ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రకు చెందిన నర్సింగా సంతోబా గంపల్వాడ్ను నిందితుడిగా గుర్తించాం. మృతురాలు ఘటనా స్థలంలో విశ్రాంతి తీసుకునే సమయంలో మద్యం మత్తులో ఉన్న నిందితుడు చెత్త ఏరుకునే ఆమెను ఎవరూ లేని ప్రదేశమైన కాలువ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురై గొంతు నులిమి హత్య చేశాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహన్ని డ్రెయినేజీలో పడేశాడు. కాగా, కేసును 48 గంటల్లో చేధించినట్లు ఎస్పీ తెలిపారు. నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఛేదించిన వన్టౌన్ సీఐ సునిల్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు సంజయ్, అశోక్ను ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీ ఏ ఏపీవో వసంత్రావ్ అన్నారు. మండలకేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ యా ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆ యన ఆర్టీలు స్వీకరించారు. వాటిని సంబంధి త అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరి ష్కరించేలాచొరవ చూపాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళనఉట్నూర్రూరల్: ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవా రం ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీవో వసంత్రావ్కు సమస్యలతో కూ డిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతావత్ రాందాస్, ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కుటికెల శంకర్, ఉపాధ్యక్షుడు ధర్మం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు నర్సయ్య, మహిళా సంఘం జి ల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి, బాలసాని మల్లేశ్గౌడ్, నాగరావ్, భగవంతరావ్, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మామిడి.. మొక్కుబడి కొనుగోళ్లు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్కు రోజు వారీగా కనీసం టన్ను మామిడికాయలు కూడా అ మ్మకానికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెటింగ్ అధికారుల నిర్లక్ష్యం, దిగుబడి గణనీయంగా పడిపోవడం, కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మంగు, మచ్చలు ఏర్పడడం, మద్దతు ధర లేకపోవ డం వంటి ప్రతికూల అంశాలు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బెల్లంపల్లి మార్కెట్లో మామిడి కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా వ్యాపారులు, రైతుల నుంచి కనీస స్పందన లేదు. ఓ చిరువ్యాపారి ద్వారా మొక్కుబడిగా కొనుగోళ్లు చేపట్టి ఆనవాయితీని కొనసాగిస్తున్నార నే విమర్శలు వస్తున్నాయి. తొలిసారిగా గత ఏడాది బెల్లంపల్లిలో ప్రారంభించిన మామిడికాయల కొనుగోళ్లు ఆశాజనకంగా సాగాయి. పక్షం రోజులపాటు క్రయవిక్రయాలు సాగి సుమారు ఆరు వేల క్వింటాళ్ల వరకు అమ్మకానికి వచ్చాయి. ఒకరిద్దరు బడా వ్యాపారులు రావడంతో రైతులు మ్యాంగో మార్కెట్కు తీసుకొచ్చి కాయలు విక్రయించారు. రైతులకు పెద్దగా లాభాలు రాకపోయినా నాగ్పూర్కు తీసుకెళ్లే వెతలు తప్పి రవాణా ఖర్చులు మిగిలాయి. ఈసారి ఆమాత్రం వెసులుబాటు కూడా లేకపోవడం రైతులను నిరాశకు గురి చేస్తోంది. తగ్గిన దిగుబడి మామిడి కాతపై ఈసారి ప్రకృతి తీవ్ర ప్రభావం చూపింది. పూత విరబూసినా అకాల వర్షాలు, చీడపీడల వల్ల పూత అధిక శాతం నేలపాలైంది. అక్కడక్కడ నిలిచిన పూత పిందె దశకు చేరుకునే క్రమంలో అకాల వర్షాలకు రాలిపోయింది. ప్రతికూల పరిస్థితులతో దిగుబడి పడిపోయింది. ఉద్యానవన అధికారుల లెక్కల ప్రకారం సాధారణంగా ఒక ఎకరాకు ఐదు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం టన్ను కూడా రాకుండాపోయింది. దీనికి తోడు కాయలపై మంగు, మచ్చలు ఏర్పడడంతో మద్దతు ధర కరువైంది. నాగ్పూర్ మార్కెట్లో ధర ఇలా.. బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్కు డిమాండ్ ఉన్నా మామిడి కాయలు రావడం లేదు. కొద్దిపాటి నీలం, తోతపరి తదితర రకాల కాయలు మాత్రమే వస్తున్నాయి. దశేరి, బంగెనపల్లి, హిమాయతి వంటి ము ఖ్యమైన రకాలు కానరావడం లేదు. వీటికి మార్కెట్లో కనీస మద్దతు ధర ఉంటుంది. బడా వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి అమ్మాలనే తలంపులో రైతులు ఉన్నారు. ప్రస్తుతం నాగ్పూర్ మ్యాంగో మార్కెట్లో దశేరి రకం కాయలకు టన్నుకు రూ.25 వేలు ధర చెల్లిస్తుండగా, బంగెనపల్లి రకానికి రూ.20 వేలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఆదిలో దశేరి కాయలు టన్నుకు రూ.60 వేలు ధర పలుకగా, బంగెనపల్లి కాయల ధర రూ.50 వేలు చెల్లించి బడా వ్యాపారులు రైతుల్లో ఆశలు కల్పించారు. ఆయా రకాల కాయల ధరలు ప్రస్తుతం సగానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులను చవి చూస్తున్నారు. బెల్లంపల్లి మార్కెట్కు బడా వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవడంలో మార్కెటింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.మద్దతు ధర లేదు చెట్లకు వచ్చిన పూత చూసి కాపు లీజుకు తీసుకున్న. తీరా పూతంతా రాలిపోయింది. తోటలన్నీ కాపులేక వెలవెలబోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి లీజుకు తీసుకున్న తోటల్లో దిగుబడి పడిపోయింది. కొద్దిపాటిగా చేతికందిన కాయలకు మద్దతు ధర దక్కుతుందనే ఆశతో ఉండగా నాగ్పూర్ బడా వ్యాపారులు దశేరి, బంగెనపల్లి రకాల ధరలు బాగా తగ్గించి కొంటున్నారు. బెల్లంపల్లిలోనూ మద్దతు ధర లేకుండాపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి కాపు పడిపోయింది గత మూడు నాలుగేళ్ల నుంచి మామిడి కాపు పడిపోతున్నది. చెట్టు నిండా పూత విరబూసిన ఫాయిదా ఉంటలేదు. వచ్చిన పూత వచ్చినట్లే రాలిపోయి కొద్దిపాటి పూత మాత్రమే నిలుస్తున్నది. ఈసారి కూడా అట్లనే జరిగింది. అక్కడక్కడ పిందెలు నిలిచి కాయ దశకు చేరుకోగానే అకాల వర్షాలతో పంట నేలపాలైంది. అమ్మకానికి తీసుకెళ్లడానికి కాయలు కానరాకుండా ఉన్నాయి. కాపు పడిపోయి కష్టాలు మిగిలాయి. – గోమాస మల్లయ్య, మామిడి రైతు, మాలగురిజాల -
ప్రాణం పోసిన ‘108’
నార్నూర్: పురిటి నొప్పుల వేళ ఓ నిండు గర్భిణికి సకాలంలో వైద్యసేవలు అందక 108లో ప్రసవించాల్సిన దుస్థితికి నిదర్శనం ఈ ఘటన. వైద్యసిబ్బంది అందుబాటులో లేని ఆసుపత్రుల కంటే ఆపత్కాలంలో అండగా నిలిచిన వారి మానవత్వమే తల్లీ బిడ్డను కాపాడాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చిత్తగూడ గ్రామానికి చెందిన రంభబాయికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గాదిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఝరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా సిబ్బంది లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరకు 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో లోకారి సమీపంలో ఆమె ప్రసవించింది. అంబులెన్స్ సిబ్బంది చొరవతో ఆమె ఆడ శిశువుకు జన్మినిచ్చింది. అనంతరం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, ఈ ఘటనలో ఆ తల్లి పురిటి వేదన హృదయ విదారకంగా నిలిచింది. సకాలంలో వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రాణాలకు ముప్పు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. రెండు చోట్ల వైద్య సిబ్బంది లేకపోవడం సర్కారు దవాఖానాల దుస్థితికి అద్దం పడుతోంది. -
మండే సూర్యుడు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో భానుడు భగ భగ మండుతూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థా యి గరిష్ట ఉష్ణోగ్రతలతో దడ పుట్టిస్తున్నాడు. వడగాలుల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలో 18మండలాలకు గాను నాలుగు మండలాల్లో 45 నుంచి 46 డిగ్రీలు, 14మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జిల్లా మొత్తం రెడ్, ఆరెంజ్ జోన్లోకి వెళ్లింది. అత్యధికంగా భీమారం మండల కేంద్రంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఉదయం తొమ్మి ది గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో జనం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం ఎండకు తోడు అర్ధరాత్రి వరకు వడగాలులు, ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి నీటి ఎద్దడి తలెత్తుతోంది. ఎండలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వేడి, ఓవర్లోడ్తో ట్రిప్ అవుతూ కాలిపోతున్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఓసీపీల్లో నిప్పుల కుంపటి మండుటెండల్లో భూ ఉపరితలాల్లో పని చేసే సింగరేణి కార్మికుల పరిస్థితి నెత్తిమీద నిప్పుల కుంపటి మాదిరిగా తయారైంది. ఎండల్లో విధులు నిర్వర్తిస్తూ కొందరు వడదెబ్బ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు. అనారోగ్యానికి గురవడంతో మధ్యాహ్నం రెండో షిఫ్టుకు వెళ్లే కార్మికుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. బోసిపోతున్న చిరువ్యాపారాలు గత పది రోజులుగా మండుతున్న ఎండల్లో చిరువ్యాపారాలు, ఆటోవాలల గిరాకీలు తగ్గాయి. రోజువారీగా కూరగాయలు, పండ్లు, ఇతర చిరు వ్యాపారులు రావడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరాకీలు దెబ్బతిన్నాయని అంటున్నారు. సాధారణ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులతోపాటు శుభకార్యల సీజన్ కావడంతో వాటికి హాజరయ్యేందుకు ప్రయాణాలు చేయడం పెద్ద సమస్యగా మారింది. మధ్యాహ్నం వేళ ఇళ్లలో కూలర్లు వినియోగిస్తున్నా వేడి తగ్గడం లేదు. ఎండ తీవ్రత నుంచి ఉమశమనం కోసం ప్రజలు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, చల్లని పండ్ల రసాల తాగేందుకు ఇష్టపడుతుండడంతో వీటి విక్రయాలు పెరిగాయి. భీమారం నస్పూర్ కన్నెపల్లి దండేపల్లి లక్సెట్టిపేట జైపూర్ మంచిర్యాల భీమిని జన్నారం చెన్నూర్ హాజీపూర్ నెన్నెల వేమనపల్లి మందమర్రి కోటపల్లి తాండూర్ బెల్లంపల్లి కాసిపేట కనిష్టం 33.6 32.2 32.8 32.3 33.6 32.4 32.8 33.8 33.9 32.4 34.0 31.8 29.8 33.6 31.8 32.9 32.2 32.3 గరిష్టం 45.8 45.4 45.3 45.2 44.8 44.6 44.5 44.4 44.4 44.3 44.2 44.2 44.0 43.8 43.8 43.3 43.3 43.1నిర్మానుష్యంగా..చున్నీ కప్పుకుని వెళ్తున్న యువతులుమంచిర్యాలలో కూరగాయలు విక్రయిస్తున్న మహిళలు -
శతాధిక వృద్ధురాలి నేత్రదానం
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన ఓ శతాధిక వృద్ధురాలి రెండు కళ్లను సోమవారం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. పట్టణంలో ని హన్మాన్బస్తీకి చెందిన డోలి నర్సమ్మ(103) అనా రోగ్యంతో మృతిచెందింది. జనహిత సేవా సమితి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఆడేపు సతీష్, సభ్యుడు డోలి సుకుమార్ మృతురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో నేత్రదానానికి ముందుకొచ్చా రు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ ఆమె కళ్లను సేకరించి తీసుకెళ్లారు. మృతురాలి కొడుకులు డోలి దశరథ్, విజయ్కుమార్, కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. -
స్వీయ గణన షురూ
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన ప్రక్రియలో సెల్ఫ్ ఎన్యుమరేషన్(స్వీయ గణ న) ప్రక్రియ మొదలైంది. మే 10వరకు ఎవరికి వా రు స్వీయ గణన చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం పోర్టల్లో కుటుంబంలోని ఒకరి సెల్ నంబరుతో లాగిన్ అయి, వారి కుటుంబ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా అధికారులు పలువురు స్వీయ గణన ద్వారా వివరాలను నమోదు చేసుకోగా, ప్రజలు సైతం ముందుకు వచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నారు. మే 11నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి జనగణన చేపడుతారు. అందుకు ముందుగానే స్వీయ గణన చేసుకోవడం వల్ల ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న సమయంలో వచ్చిన 11 అంకెల రెఫ రెన్స్ ఐడీని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వివరాలు తప్పుగా ఉన్నా, ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉండగా, ఇంటి పెద్ద వివరాలను మాత్రం మార్చేందుకు అవకాశం ఉండదు. ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో ఇంట్లో లేకున్నా, ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకున్న రెఫరెన్స్ ఐడీని ఎన్యుమరేటర్కు చెబితే సరిపోతుంది. ఎక్కడున్నా నమోదుకు అవకాశంజనగణన వివరాలను ఎక్కడ ఉన్నా నమోదు చేసుకునేందుకుhttp://se.census.gov. inవెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. జనగణన తొలిదశ మే 11నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ జరగనుండగా, వీటిని ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి చేపట్టనున్నారు. ఏ ఒక్క కుటుంబం వివరాలను కూడా తప్పిపోవద్దనే ఉద్దేశ్యంతో స్వీయ గణనకు అవకాశం కల్పించారు. మే 10వరకు ప్రజలే ఎన్యుమరేటర్లుగా మారి వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ నమోదు చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన వెంటనే 33 రకాల ప్రశ్నలకు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్మిట్ చేయడంతో హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సంఖ్యతో ఐడీ వస్తుంది. దీనిని భద్రపరుచుకుని, జనగణనకు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే సరిపోతుంది. -
‘మున్నూరు కాపులను మోసగిస్తున్న ప్రభుత్వం’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్నూరు కాపులను తక్కువ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి గాదె సత్యం అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 13.75 లక్షల వరకు ఉన్నట్లు లెక్కలు చూపించడం అన్యాయమని అన్నారు. అన్ని బీసీ కులాల సంఖ్యను చాలా తక్కువ లెక్కల్లో చూపించారని ఆరోపించారు. మున్నూరు కాపుల గణాంకాల వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి నియామకమైన గాదె సత్యంను జిల్లా మున్నూరు కాపు కులబాంధవులు ఘనంగా సన్మానించారు. రేసు కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతికోటపల్లి: రేసుకుక్కల దాడిలో 15గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి నక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధి బ్రహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొండ మల్లయ్య తన గొర్రెలను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లగా రేసుకుక్కలు ఒక్కసారిగా గుంపుతో వచ్చి దాడి చేశాయి. గొర్రెలు అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా వెళ్లిపోయాయి. కొన్ని గొర్రెలు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోగా, మిగిలిన వాటిని కాపరి గ్రామంలోకి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దాడి చేసిన స్థలానికి కాపరులతో వెళ్లి పరిశీలించగా 15 గొర్రెలు మృతిచెంది కనిపించాయి. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. -
బడి ముగిసింది.. బాధ్యత మిగిలింది..!
నిర్మల్ఖిల్లా: వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. పిల్లలు పుస్తకాలు పక్కనపెట్టేశారు. ఆట పాటలతో ఎంజాయ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అసలు బాధ్యత ఇప్పుడే మొదలైంది. వచ్చే 45 రోజులు పిల్లలను ఎండల దెబ్బ నుంచి రక్షించి, కాలక్షేపం, మంచి ప్రవర్తన, ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ చూపాలి. ఈ 45 రోజుల కాలంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలతో ప్రమాదాలు.. ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో బయ టకు వెళ్లకుండా పిల్లలు మొబైల్లు, టీవీలకు అతుక్కునే ప్రమాదం ఉంది. ఇది కంటి సమస్యలు, నిద్రలేమి, ఆగ్రహ స్వభావాన్ని తీసుకొస్తుంది. సరైన మార్గదర్శకత లేకపోతే అలవాట్లు దెబ్బతింటాయి. సృజనాత్మక కార్యక్రమాలు.. పిల్లలను ఇండోర్ ఆటలు, పుస్తక పఠనం, కథలు, చిత్రలేఖనం, పజిల్స్ వైపు మళ్లించండి. కుటుంబ సభ్యులతో ఆటలు ఆడటం సామాజిక నైపుణ్యాలను పెంచుతుంది. మొబైల్, టీవీ వాడకాన్ని పరిమితం చేసి, మేధోపరమైన కార్యక్రమాలకు ప్రోత్సాహించండి. ఆరోగ్య జాగ్రత్తలు.. మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయటకు పంపొద్దు. ఉదయం తొందరగా లేదా సాయంత్రం చల్లని సమయాల్లో మాత్రమే అనుమతించాలి. తగినంత నీరు, పండ్ల రసాలు, తేలికపాటి ఆహారం ఇవ్వాలి. హైడ్రేషన్పై శ్రద్ధ పెట్టండి. చదువు, ఆటలు, విశ్రాంతి సమయాలను సమతుల్యం చేసే షెడ్యూల్ రూపొందించాలి. ఇది క్రమశిక్షణను పెంచుతుంది. బాధ్యతలు తెలిసేలా... క్లే మోడలింగ్ (మట్టితో బొమ్మలు చేయడం), పెయింటింగ్, ఒరిగామి (కాగితపు కళలు) నేర్పించాలి. అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పురాణ గాధలు, నీతికథలు వినేలా ప్రోత్సహించాలి. ఇది వారి భాషా పరిజ్ఞానాన్ని, విలువలను పెంచుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, ఇంటిని సర్దడం వంటి పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేస్తే వారికి బాధ్యత తెలుస్తుంది. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. -
ప్రాణం తీసిన ఈత సరదా
సారంగపూర్: వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు వాగులో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్లో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన సాతెల్లి సాయన్న–పోసవ్వ దంపతులకు కొడుకు సాయిప్రసాద్(23), కూతురు సంతానం. సాయిప్రసాద్ తన స్నేహతులతో కలిసి సరదాగా సమీపంలోని వాగుకు ఈతకు వెళ్లాడు. వాగులో దిగిన కొంత దూరం వెళ్లాక లోతు ఉండడంతో స్నేహితులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. ఈతరాని సాయిప్రసాద్ నీటిలో మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేయగా సమీపంలోని రైతులు వచ్చే సరికే సాయిప్రసాద్ నీటిలో మునిగిపోయాడు. ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
పురాతన ఆలయాలను పునర్నిర్మిద్దాం
వేమనపల్లి: పురాతన ఆలయాలను పునర్నిర్మించి ఆలయ చరిత్రను కాపాడుకుందామని టీటీడీ దేవాలయాల పర్యవేక్షణ అధికారి రామనాథం అన్నారు. సోమవారం మండల కేంద్రానికి సమీపంలోని రాజారం గ్రామంలో కొలువై న దశావతార దేవస్థానం, కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల ఆలయాలు నిర్మించామని, రాజా రంలో కొలువుదీరిన దశావతార, కాల భైరవ స్వామి దేవతామూర్తుల వద్ద ఆలయ నిర్మాణా నికి కృషి చేస్తామని అన్నారు. ఆలయ పురాతన చరిత్రను సూచించే వివరాలు, ఫొటోలు అందజేయాలని తెలిపారు. సర్పంచులు మళ్లీశ్వరి, సాయికృష్ణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు సత్యనారాయణ, ధర్మాచార్యులు పరమేశ్వర్, జయప్రద, చంద్రశేఖర్, సభ్యులు అమోల్, మహేష్ పాల్గొన్నారు. -
వడదెబ్బతో ఒకరి మృతి
నెన్నెల: పెళ్లి డప్పు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. మరో పక్షం రోజుల్లో కూతురు పెళ్లి చేయాల్సిన తండ్రి మరణం విషాదం మిగిల్చింది. మండలంలోని మైలారం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోగారపు మారయ్య(56) చిన్న కూతురు వివాహం వచ్చే నెల 13న జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ నెల 24న మధ్యాహ్నం వంట చెరుకు కోసం ఎడ్లబండిలో అడవికి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం అదే రోజు రాత్రి అడవంతా వెతికినా దొరకలేదు. రెండో రోజు ఉదయం మళ్లీ అడవిలోకి వెళ్లి గాలించగా ఓ చోట ఎడ్లు, బండి కనిపించాయి. మారయ్య ఆచూకీ లభించలేదు. మూడో రోజు ఆదివారం సాయంత్రం మైలారం గ్రామ శివారులో ఓ వాగు ఒడ్డున విగత జీవిగా కనిపించాడు. మారయ్య అడవిలో దారి తప్పి నీటి కోసం వెతుకుతూ వాగు వద్దకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి పెద్ద అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేషం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
గోల్డ్ లోన్ బాధితుల ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ బ్రాంచిలో గోల్డ్ లోన్ బాధితులు సోమవారం ఆందోళన చేపట్టారు. గత ఏడాది బ్యాంకులో చోరీ అయిన బంగారు ఆభరణాలు లభించినా నేటి వరకు బాధితులకు ఇవ్వకపోవడం దారుణమని వా పోయారు. బ్యాంకును సందర్శించిన డీజీఎం విజయ్ కుమార్ సాహు బాధితులతో మాట్లాడారు. బంగారం కోర్టు పరిధిలో ఉందని, రు ణం పొందే సమయంలో బంగారం ధర ఎంత ఉందో ఆ ధర చెల్లిస్తామని తెలిపారు. బాధితులు ముందుకు వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. బాధితులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం డీజీఎంకు అందజేశారు. ఏజీఎం రితేష్ గుప్తా, మేనేజర్ రాజేష్, బ్యాంకు అధికారులు, గోల్డ్ లోన్ బాధితులు పాల్గొన్నారు. -
కాళ్లకు వల చుట్టుకొని వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: చేపల వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని బాబాపూర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నేళ్లుగా రాజమండ్రికి చెందిన కొందరు జాలర్లు తెలంగాణకు వలస వచ్చి వేసవి కాలంలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటారు. ఆదివారం మండలంలో గల బాబాపూర్ పెద్ద చెరువులో రాజమండ్రికి చెందిన జాలర్లు సుమారు 15 మంది బృందం చెరువులో చేపలు పట్టడానికి దిగారు. సాయంత్రం 3.30 గంటలకు నందిపల్లి గోవింద్(34) అనే జాలరి కాళ్లకు వల చుట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి మేనమామ రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి మృతినిర్మల్టౌన్: పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద అనుమానాస్పదంగా గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండో ఫ్లోర్పై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ సీఐ కృష్ణ అక్కడికి చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు చేతిపై జాలమ్మ అనే పచ్చబొట్టు ఉందని, ఎవరికై నా వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఉరేసుకొని ఒకరి ఆత్మహత్యకుంటాల: మండలంలోని లింబా(కె) గ్రా మానికి చెందిన సూర్యవంశీ పండిత్ ఆది వారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్గా పని చేస్తున్న సూర్యవంశీకి అప్పులు పెరిగిపోవడంతో తన ఇంట్లో నే ఇనుప కొక్కానికి నైలాన్ తా డుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య అంజనా బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
‘అపూర్వ’ సమ్మేళనం..!
పాత జ్ఞాపకాలతో..!నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని బాగులవాడలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొండాపూర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో 1993 –94 పదో తరగతి బ్యాచ్కు చెందిన 120 మంది విద్యార్థులు, 14 మంది ఆచార్యులు ఒకచోట చేరి పాత జ్ఞాపకాలు, అనుభవాలను పంచుకున్నారు. ప్రధానాచార్యులు రావుల సూర్యనారాయణ, ఆచార్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాలఅర్బన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002 –2003 పదో తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మంచిర్యాలలో నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన రోజులు.. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠాలు బోధించిన సత్యనారాయణ, జమునరాణి, రఫీయా సుల్తానా, ఆశ్లేష తదితర ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1992 –93 బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత ఒకచోట కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.గుర్తుకొస్తున్నాయి..! -
వెలుగులోకి డివైన్ గ్రూప్ మోసాలు
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్లో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధాన నిందితురాలు ఠాకూర్ శివరంజినిబాయి అరెస్టుతో కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్కు చెందిన ఒక కుటుంబం అధిక లాభం పేరిట వల విసిరి రూ.2 కోట్లకు పైగా దండుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగజ్నగర్లో మకాం.. ఠాకూర్ కరణ్ సింగ్ 2021 ఆగస్టులో కాగజ్నగర్లో మకాం వేశాడు. పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగులు, కా ర్మికులు, సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారిని టార్గెట్గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొదట స్థానికంగా కొంత మంది ఏజెంట్లను నియమించుకున్నారు. నెలకు 5 శాతం నుంచి 20 శాతం లాభం, డబ్బు డబుల్ అని ప్రచారం చేయించారు. మొదట నమ్మించి.. తర్వాత బురిడీ మొదట్లో కొంత మందికి చెప్పినట్లుగానే లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారు. రూ.లక్ష కడితే నెలకు రూ.10వేలు చేతిలో పెట్టారు. దీంతో నోటిమాట ద్వారా ప్రచారం జరిగి వందల మంది పెట్టుబడులు పెట్టారు. భారీగా డబ్బులు చేతికొచ్చాక 2023 జనవరిలో ఒక్కసారిగా కార్యాలయానికి తాళం వేసి కుటుంబంతో సహా పారిపోయారు. ఈ ముఠా కాగజ్నగర్లోనే కాకుండా హైదరాబాద్, పెంచికల్పే ట్, లాలాగూడ పరిధిలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ ఇప్పటి వరకు తేలిన మోసం రూ.2.91 కోట్లు కానీ ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, వాస్తవ మోసం రూ.5 కోట్లు దాటుతుందని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఆందోళన.. శివరంజినిబాయి అరెస్టుతో మరికొంత మంది బాధితులు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. ‘మా డబ్బులు మాకు వస్తాయా? నిందితుల ఆస్తులు అమ్మి అయినా సరే మాకు న్యాయం చేయండి’ అని బాధితులు వేడుకుంటున్నారు. ‘ఆర్బీఐ, సెబీ అనుమతి లేకుండా డిపాజిట్లు సేకరించడం నేరం. 5శాతం, 10శాతం, నెలవారి లాభం అంటే అది మోసమే. ప్రజలు అత్యాశకు పోయి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. ఇలాంటి సంస్థల సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని పోలీసులు సూచిస్తున్నారు. -
● రిమ్స్లో ఘనంగా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే ● ముఖ్య అతిథిగా హాజరైన కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో 2020–26 బ్యాచ్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు కలెక్టర్ చిత్రులో కలిసి వైద్య విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అంతకుముందు మెడికోలు గుస్సాడీ నృత్యాలతో అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైద్య విద్యను అభ్యసించి పట్టా పొందడం అభినందనీయమని ప్రశంసించారు. ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ వైద్య కళాశాలలకు దీటుగా రిమ్స్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. డాక్టర్ పూర్తిచేసుకున్న మెడికోలు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. నిరంతర విద్యార్థిలా భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా సేవలు అందించాలని సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులందరూ పీజీ సీట్లు సాధించాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలతో ఫొటోలూ దిగుతూ సందడి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వంజారి, వైస్ ప్రిన్సిపల్ సరోజ, విద్యావిల్సన్, మెడికల్ డిప్యూటీ సూపరింటెండెంట్లు నరేందర్ బండారి, దీపక్ పుష్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’
మంచిర్యాలఅర్బన్: నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం మార్క్స్భవన్లో పీడీఎస్యూ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తోకపేర్లతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సికిందర్, కార్తీక్, సంజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పది రోజులైంది
వరి కోసి పది రోజులు అవుతుంది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసినాం. మైచర్ కూడా తక్కువగానే వస్తుంది. కొనుగోలు కేంద్రం ఎప్పుడో ప్రారంభించారు కాని కాంటా పెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా మబ్బులు, వర్షం పడుతుంది. భారీ వర్షం కురిస్తే పంట తడిసిపోతుందని భయంగా ఉంది. రాత్రనక పగలనక ధాన్యం వద్దనే ఉండాల్సి వస్తుంది. కాంటా పెట్టి మిల్లులకు తరలించాలి. – గొల్ల శ్రీకాంత్, గ్రామం: ఇటిక్యాల, మం: లక్సెట్టిపేట కాంటా పెడ్తలేరు..వడ్లు ఆరబోసుకొని వారం రోజులు అవుతుంది. కాంటా పెడతలేరు. మిల్లుకు ట్యాగింగ్ కాలేదని ఆపుతున్నారు. ఎప్పుడు అయితదో ఎప్పుడు వడ్లు పోతాయో తెల్వడం లేదు. రోజు కుప్ప జేసుడు, నేర్పుడు అవుతుంది. – ముత్తే రాజం, గ్రామం: గుల్లకోట, మం: లక్సెట్టిపేట ఆరబోసుడు.. కుప్పజేసుడుకల్లంలో ధాన్యం ఆరబోసుకుని వారం రోజులు అవుతుంది. గన్నీ సంచులు వచ్చి నాలుగు రోజులు అవుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా ఉదయం ఆరబోసుకునుడు, సాయంత్రం కుప్పజేసి కవర్లు కప్పుడు అవుతుంది. మాపటి పూట మబ్బులు ఈదురుగాలు చినుకులు వస్తున్నాయి. కవర్లు ఇయ్యలే కొనుక్కొని కప్పుకునుడు అయితంది. వెంటనే కాంటాబెట్టి మిల్లుకు పంపితే మంచిగుండు. – శ్రీనివాస్, గ్రామం: ఇటిక్యాల, మం: లక్సెట్టిపేట -
వారంలో కూతురు పెళ్లి.. అంతలోనే..
తాంసి: వారం రోజుల్లో కూ తురు పెళ్లితో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉండగా కు మార్తె పెళ్లి పత్రికలు పంచేందు కు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని గిరిగాం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిగాం గ్రామానికి చెందిన అదే జ్ఞానేశ్వర్ కూతురు వివాహం ఇటీవల నిశ్చయమైంది. వచ్చే నెల 4వ తేదీన వివాహం ఉండగా పెళ్లి పత్రికలు బంధువులకు పంచేందుకు గ్రామానికి చెందిన అమృత్తో కలిసి ద్విచక్రవాహనంపై మహారాష్ట్రకు వెళ్లాడు. ఈక్రమంలో మహారాష్ట్రలోని బోరి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో జ్ఞానేశ్వర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. అమృత్కు సైతం బలమైన గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో కుమార్తె పెళ్లి జరగాల్సి ఉండగా తండ్రి ప్రమాదంలో మృతి చెందడంతో గిరిగాం గ్రామంలో ఆదివారం విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీల పూజలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ఆదివాసీల ఆరా ధ్యదైవం ఇంద్రాదేవి ఆలయంలో ఆదివాసీలు ఘ నంగా పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. బావై (వైశాఖ) మాసం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు ఆలయానికి తరలివచ్చి నైవేద్యం తయారు చేసి సమర్పించారు. ఆదివారం మండలంలోని మారుతిగూడ, హీరపూర్, దొడందా, వడగామ్, గట్టెపల్లి, తుమ్మగూడ గ్రామాలతో పాటు నార్నూర్ మండలాల ఆదివాసీలు తరలివచ్చి ఇంద్రాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ మహరాజ్ చహకటి సూర్యరావ్, ఆయా గ్రామాల భక్తులున్నారు. -
శాసీ్త్రయ దృక్పథం పెంచుకుందాం..
మంచిర్యాలఅర్బన్: వేసవి సెలవులు ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను మరింత పెంచుకునేలా జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో సైన్స్ సమ్మర్ క్యాంపు నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు ప్రయోగత్మాక సైన్స్ విద్య అమలు చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆలోచనలను మార్చడంతోపాటు ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జిజ్ఞాస సంచార వాహనం ద్వారా 128 పాఠశాలలకు చెందిన 750 ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 27 నుంచి మే 8 వరకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. 80 మందికి అవకాశం.. వేసవి సెలవుల్లో విద్యార్థులు కాలక్షేపానికి పరిమితం కాకుండా సైన్స్పై ఆసక్తి పెంపొందించుకునేలా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు వివిధ అంశాలపై తర్పీదు ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన 80 మంది విద్యార్థులు శిబిరాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. సైన్స్ సెంటర్లో భౌతిక రసాయన, బయోసైన్స్పై వివిధ అంశాల్లో ప్రయోగాత్మకంగా సులభతరంగా శిభిరాల నిర్వహణకు రూపకల్పన చేశారు. శిబిరంలో పాఠ్యపుస్తకాన్ని ప్రయోగాత్మకంగా, భయం నుంచి విశ్వాసానికి మార్చుటకు, సబ్జెక్టు నిపుణుల సెషన్లతో పాటు, ప్రేరణాత్మక సెషన్లు, ఎలక్ట్రానిక్, రోబిటిక్ సెషన్లపై నేర్పించనున్నారని డీఈవో యాదయ్య ప్రకటించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ను సంప్రదించాలన్నారు. సైన్స్ సమ్మర్క్యాంపులో.. వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచడం, ప్రయోగాల ద్వారా నేర్పించడం, క్రియేటివిటీ, ఆలోచనాశక్తి పెంచడం, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాజెక్టులు తయారు చేయడం, తదితర అంశాలపై శిభిరంలో నేర్పించనున్నారు. -
‘నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టండి’
రామకృష్ణాపూర్: కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మాని చెన్నూర్ నియోజకవర్గ సమస్యలపై మంత్రి వివేక్ దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి ఎన్నికల నేపథ్యంలో నమోదైన కేసుల్లో భాగంగా బెయిల్ షరతుల మేరకు ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్లో సంతకం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి స్థానిక సమస్యలు పక్కనబెట్టి ఎక్కువగా ఇతర జిల్లాల్లోనే తిరుగుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ని రుద్యోగ యువతకు 45 వేల ఉద్యోగాలు, ఈ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ, మందమర్రి–ఆర్కేపీలో 100 ప డకల ఆసుపత్రి తెస్తామని చెప్పిన మంత్రి ఆ హా మీల అమలుకు ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. జీవో 76 కింద సింగరేణి స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాల్సిఉండగా దానిని పట్టించుకోవడం లేదన్నారు. కవిత కొత్త పార్టీ గురించి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూంటాయని కేఏ పాల్, షర్మిల, విజయశాంతి లాంటి వారు కూడా పార్టీలు పెట్టారని ఇప్పుడా ఆ పార్టీలు ఎక్కడపోయాయని ఎద్దేవాచేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గొడిసెల సంధ్యారాణి, బీఆర్ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, సుదర్శన్గౌడ్, మేడిపెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు. -
శంకుస్థాపన దాటని బ్యూటిఫికేషన్!
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని చెరువులను పునరుద్ధరించడంతో పాటు, బ్యూటిఫికేషన్ చేపట్టేందుకు నిధులు విడుదల చేసింది. ప్రజారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో నెలన్నర క్రితమే ఆయా చెరువుల్లో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. చెరువుల పునరుద్ధరణకు వేసవి కాలంలో పనులు చేపడితేనే వర్షాకాలంలోపు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. పనులకు శంకుస్థాపన చేసినా, జిల్లాలోని ఒక్క చెరువు పనులను కూడా ప్రారంభించక పోవడంతో చెరువుల బ్యూటిఫికేషన్ వర్షాకాలంలోపు పూర్తి చేయడం కష్టంగానే ఉంది. పునరుద్ధరణతో ప్రయోజనం పురపాలికల్లో డ్రెయినేజీల నుంచి మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్తుండడంతో మురుగు నీటితో నిండిపోయి, గుర్రపు డెక్క, నాచు పెరగడంతో పాటు, చెత్తా చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. చెరువుకు హద్దులుగా కట్టలను ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణకు గురవుతున్నాయి. చెరువుల వద్ద కాస్త సేదతీరేందుకు అవకాశం లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాల్లోని చెరువులను ప్రజలకు ఆహ్లాదం పంచేలా, వాటిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని ఒక్కో చెరువుకు పనులను బట్టి నిధులను విడుదల చేసింది. అందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాముని చెరువుకు రూ.1.98 కోట్లు, నస్పూర్ చెరువుకు రూ.3.14 కోట్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాజికుంట చెరువుకు రూ.1.57 కోట్లు, మందమర్రి మున్సిపాలిటీలోని మందమర్రి చెరువుకు రూ.3.14 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీలోని కుమ్మరి చెరువుకు రూ.1.87 కోట్లు, క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని కుమ్మరికుంటకు రూ.1.98 కోట్లు, లక్సెట్టిపేట్ మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువుకు రూ.3.14 కోట్ల నిధులు కేటాయించారు. వీటితో చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు చేపడతారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, చెరువు కట్ట నిర్మాణం చేసి, ఫోర్ షోర్ బండ్ పనులు చేపడతారు. చెరువుల్లోకి వర్షపు నీరు మాత్రమే చేరేలా చర్యలు చేపట్టి, పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు. జిల్లాలో ఎంపిక చేసిన చెరువులు, అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులుమున్సిపాలిటీ/కార్పొరేషన్ ఎంపిక చేసిన చెరువులు నిధులు మంచిర్యాల కార్పొరేషన్ రాముని చెరువు రూ.1.98 కోట్లు నస్పూర్ నస్పూర్ చెరువు రూ.3.14 కోట్లు బెల్లంపల్లి జాజికుంట చెరువు రూ.1.57 కోట్లు మందమర్రి మందమర్రి చెరువు రూ.3.14 కోట్లు చెన్నూర్ కుమ్మరి చెరువు రూ.1.87 కోట్లు క్యాతన్పల్లి కుమ్మరికుంట రూ.1.98 కోట్లు లక్సెట్టిపేట్ ఇటిక్యాల చెరువు రూ.3.14 కోట్లు -
పత్తి రైతుకు తీపికబురు
లక్ష్మణచాంద: వ్యవసాయ జిల్లాగా పేరున్న నిర్మల్ జిల్లాలో అన్నదాతలు పత్తి, వరి, సోయా పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ సాగు చేసే పంట పత్తి. పత్తి విత్తనాలు అధిక ధరలు ఉండటంతో రైతులకు సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈనేపథ్యంలో పత్తి సాగు చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఊరటనిస్తూ పత్తి విత్తనాల ధరలను ప్రస్తుతానికి పెంచకూడదని నిర్ణయం తీసుకుంది. పాత ధరలే కొనసాగింపు.. అధిక సాగు ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు 2026 –27 సంవత్సరానికి పాత ధరలనే కొనసాగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి రైతులు ఎక్కువ మొగ్గు చూపే బీజీ –2 (475 గ్రాములు) ప్యాకెట్ ధర రూ.901, బీజీ –1 (475 గ్రాములు) ప్యాకెట్ ధర రూ.635 పాత ధర ఉంది. ఈ ధరలే 2026 –27లో కొనసాగించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. ఉమ్మడి జిల్లా వివరాలు.. నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం 1.40లక్షలు –1.50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు అంటున్నారు. ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున 1.50 లక్షల ఎకరా లకు 3 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయి. మంచిర్యాలలో 1.60 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్లో 3.5 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్లో 4.26 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉంది. మొత్తంగా 25లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయి. జిల్లా సాగు విస్తీర్ణం విత్తనాలు (లక్షల ఎకరాలు) (లక్షల ప్యాకెట్లు) ఆదిలాబాద్ 4.26 11.50 మంచిర్యాల 1.60 3.10 ఆసిఫాబాద్ 3.5 7.5– 8 నిర్మల్ 1.40– 1.50 3జిల్లాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అవసరమైన విత్తనాలు.. -
● కెమెరా కంటికి చిక్కిన వన్యప్రాణులు ● జన్నారం అడవుల్లో స్వేచ్ఛగా విహారం
మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్, కవ్వాల్ అభయారణ్యంలో తాళ్లపేట రేంజ్లో వన్యప్రాణుల అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పగలు ఎండ తీవ్రతకు పొదల మాటున ఉంటున్న జంతువులు చీకటి పడగానే అడవంతా తమదే అన్నట్లుగా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు అమర్చిన నిఘా కెమెరాలకు చిక్కుతున్నాయి. తాజాగా కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల్లో చిరుతపులి, ఎలుగుబంటి, దుప్పి, ముళ్లపందులు తమ సహజ సిద్ధమైన ప్రవర్తనతో కదలుతూ కనిపించాయి. తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ నిఘా కెమెరాలు వన్యప్రాణుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా జంతువుల ప్రవర్తనా తీరును అర్థం చేసుకోవడంతోపాటు, అడవిలో వన్యప్రాణుల జనాభాను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. – జన్నారంవనమంతా మాదే -
ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదివారం పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. భోరజ్ మండలంలోని పూసాయి గ్రామానికి చెందిన తప్రే సంతోష్ అనే వ్యక్తి గతంలో రిమ్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేశాడు. తిరిగి అదే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితులు అతని వద్ద నుంచి రూ.40,000 వసూలు చేశారు. కాగా ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన లేబర్ యూనియన్ నాయకుడు సిర్ర దేవేందర్, సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్లు అబ్దుల్ ముజీబ్, డోంగ్రి చంద్రకాంత్లను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. -
‘లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం’
మందమర్రిరూరల్: లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసఫ్ అన్నారు. ఆదివారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనిగంటలు 8 నుంచి 14 గంటలకు పెంచే ప్రయత్నాలు శ్రమ దోపిడీకి దారితీస్తాయన్నారు. మే డే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ సింగరేణి విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ మెడికల్ బోర్డులు, సొంతింటి పథకం, ఇన్కంటాక్స్ మాఫీ, తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించని పక్షంలో జూన్లో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రాజ్కుమార్, సలెంద్ర సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
మధుర ఫలం.. విషతుల్యం
నెన్నెల: కాయలు పక్వానికి వచ్చాక తింటే వాటి రుచే వేరు. కానీ కొందరు పచ్చికాయలుగా ఉన్నప్పుడే వాటిలో కార్బైడ్, ఇతర మందులు వినియోగించి మగ్గిన తర్వాత విక్రయిస్తున్నారు. విచ్ఛలవిడిగా కార్బైడ్ వాడుతూ వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి పండ్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పండ్ల మార్కెట్లపై అధికారులు దాడులు నిర్వహించి వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. మామిడి పండ్లను విషతుల్యమైన రసాయనాలతో పండిస్తున్నారు. ఆరోగ్యంపై దుష్ప్రభావం.. కార్బైడ్తో మగ్గపెట్టిన మామిడి పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ రసాయనం సాధారణంగా గ్యాస్ వెల్డింగ్లో వినియోగించేందుకు ఉపయోగిస్తారు. ఈ కార్బైడ్తో మగ్గపెట్టిన పండ్లను తీసుకునే వారికి జీర్ణకోశవ్యాధులు, ఎలర్జీ, కడుపునొప్పి, మూత్రపిండ వ్యాధులు వస్తుంటాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు గర్భిణులు, పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. నిషేధం అమలులో ఉందా..? మామిడికాయలను కార్బైడ్తో మగ్గపెట్టడం నేరమని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని నిషేధించాయి. 1995 చట్టం కింద ఎవరైనా మామిడి పండ్లను రసాయనాలతో మగ్గపెడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సీజనల్ వ్యాపారాల్లో మామిడి పండ్ల విక్రయాలు సాధారణమవడంతో మగ్గపెట్టిన మామిడి విక్రయాలు ఏటా జోరందుకుంటున్నాయి. సహజంగా పండిన పండ్లు రుచికరం.. సహజంగా మగ్గిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎంతో రుచికరంగా ఉంటాయి. సహజంగా చెట్టుపై పక్వానికి వచ్చిన కాయలను చూసి వాటిని వరిగడ్డితో, తునికాకులతో కప్పి ఉంచితే నాలుగు రోజులు నుంచి వారం రోజుల్లో బాగా మగ్గి పండుగా మారుతాయి. ఇలాంటివి రంగు, రుచితో మదురంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం గంటల వ్యవధిలోనే మామిడికాయలను రసాయనాలతో మగ్గపెట్టి వ్యాపారాలు సాగిస్తూ ఆరోగ్యాలపై ప్రభావం చూపించే విధానంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు కార్బైడ్తో పండించే మామిడి పండ్లను నిషేధించాలని, మార్కెట్లో దాడులు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
ఒత్తిడి లేని విద్య..!
జన్నారం: ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్లోని బోధనా పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్లిన నలుగురు ఉపాధ్యాయులు ఐదు రోజుల ఎక్స్పోజర్ విజిట్ను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. ఒత్తిడి లేని అభ్యాసం, ప్రాక్టికల్స్కు ప్రాధాన్యత, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలను నేరుగా పరిశీలించడం ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఈ బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిన్లాండ్ విద్యా విధానం ప్రత్యేకతలు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ ‘చదువు అంటే ఒత్తిడి కాదు, ఒక ఆనందకరమైన అనుభవం’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అక్కడ విద్యార్థులకు చాలా తక్కువ హోంవర్క్ ఉంటుంది, ట్యూషన్ల అవసరం అసలే ఉండదు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడం, పాఠశాలల్లో ఆటలకు, కళలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం, విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వొకేషనల్ కోర్సులను ప్రోత్సహించడం వంటి అంశాలు ఫిన్లాండ్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. తెలంగాణ బృందం సందర్శించిన సంస్థలు తెలంగాణ విద్యాశాఖ తరఫున వెళ్లిన ఈ బృందంలో జైపూర్ ఎంఈవో బి.శ్రీనివాస్, జన్నారం మండలంలోని కిష్టాపూర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు దాముక కమలాకర్, పొనకల్ అక్కపల్లిగూడ ఎంపీఎస్ ఉపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా ఏమాయికుంట ఎంపీఎస్ ఉపాధ్యాయుడు బి.గంగయ్య ఉన్నారు. వీరు తమ పర్యటనలో హెల్సింకిలోని పలు పాఠశాలలు, యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి, టీచర్ ట్రైనింగ్ స్కూల్స్, వివిధ వొకేషనల్, టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లు సందర్శించారు. అక్కడి ప్రొఫెసర్లతో సమావేశమై బోధనా పద్ధతులపై, శిక్షణ విధానాలపై లోతైన చర్చలు జరిపారు.ప్రభుత్వానికి సమగ్ర నివేదికఈ పర్యటనలో తాము నేర్చుకున్న అంశాలను, ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో తాము గమనించిన కీలక మార్పులను క్రోడీకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ముఖ్యంగా జీవిత నైపుణ్యాలను పెంపొందించే విలువలతో కూడిన అభ్యాసం, తరగతి గదుల్లో ప్రయోగాత్మక బోధనా పద్ధతుల అమలు వంటివి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో ఈ నివేదికలో పొందుపర్చనున్నారు. ఈ పర్యటన ద్వారా అందిన అనుభవాలు భవిష్యత్తులో తెలంగాణ విద్యారంగంలో సృజనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయని ఉపాధ్యాయ బృందం ధీమా వ్యక్తం చేసింది. -
● కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలతోనే సరి ● తూకం వేయని ధాన్యం.. రైతుల ఎదురు చూపులు ● ఉదయం ఎండలు, సాయంత్రం మబ్బులు.. చిరుజల్లులు
మంచిర్యాలఅగ్రికల్చర్: అట్టహాసంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారం రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కుప్పల వద్ద తిప్పలు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం మబ్బులు, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఎండలో ఆరబోస్తూ.. సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. భారీ వర్షం కురిస్తే ధాన్యం నేలపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి ధాన్యం దిగుబడి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోశారు. ఈ నెల 13న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు లేక నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే ప్రారంభించిన కేంద్రాల్లో మిల్లులకు ట్యాగింగ్ లేక, తూకం వేయక, లారీలు రాక ధాన్యం కదలడం లేదు. వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. పూర్తి స్థాయిలో కేంద్రాలు, మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. ఏ కేంద్రం ఏ మిల్లుకు కేటాయిస్తారోనని గందరగోళం నెలకొంది. 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలో వివిధ ఏజెన్సీల ద్వారా 313 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు 58 కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తరలింపు లేదు. తూకం వేసిన ధాన్యం ట్రక్షీట్ ఎంట్రీ, మి ల్లులకు తరలించి అన్లోడ్, రిసీవింగ్ ఎంట్రీ తదిత ర వివరాలు ట్యాబ్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రాల కేటాయింపు, మిల్లులకు ట్యాగింగ్లో స్పష్టత రాలేదు. ధాన్యం తరలించకపోవడంతో నిర్వాహకులు రైతుల ధాన్యాన్ని తూకం వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం రోజుల తరబడి కేంద్రంలో నిల్వ చేస్తే మిల్లుకు తరలించిన సమయంలో బరువు తగ్గి నష్టపోవాల్సి వస్తుందని, తరుగు పేరుతో మిల్లర్లు కోత విధించే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. లక్ష్యం భారీగా.. సేకరణ ఆలస్యం..జిల్లాలో ఈ యాసంగి 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 2.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేసి 313 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 58 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా క్వింటా ధాన్యం కూడా మిల్లుకు తరలించినట్లు ట్యాబ్ ఎంట్రీ లెక్కలో రాలేదు. జిల్లాలో ధాన్యం సేకరణపై అదనపు కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. -
గిన్నీస్ రికార్డ్లో జిల్లా క్రీడాకారులు
ఆదిలాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.సి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘లార్జెస్ట్ కరాటే డిస్ప్లే’ గిన్నిస్ వరల్డ్ రికార్డు అటెంప్ట్లో జిల్లా చిన్నారులు భాగస్వాములయ్యారు. 30 నిమిషాల వ్యవధిలో 50 సార్లు ‘మొదటి కటా తైకీకి షోడాన్’ ప్రదర్శన నిర్వహించారు. దీంతో గతంలో ఉన్న రికార్డును బద్దలు కొడుతూ మొత్తం 1212 మందితో కలిసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. బాల కేంద్రం శిక్షకులు మిట్టు దత్తు, గాజుల జగన్నాథ ఋషిల నేతృత్వంలో శిక్షణ పొందిన మందోల్ల మహాశ్విని, పడాల ధన్విక, హర్షిణి ఠాకూర్, కోండ్రా అలేఖ్య, క్షీరసాగర జాహ్నవి, దువాస హర్షినీ, జాగృతి, లింగంపల్లి సాయి కార్తీక, రోహిత్, యం. అయాన్ష్, గడ్డం శ్రీనిధి, దీరేన్ సింగ్లు ఈ ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారని బాల కేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి వెల్లడించారు. -
భూసార పరీక్షలకు వేళాయె..!
చెన్నూర్రూరల్: భూసారానికి అనుగుణంగా పంటలను సాగు చేయించి, నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురి చొప్పున వలంటీర్లను నియమిస్తోంది. చెన్నూర్ డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలకు సుమారుగా 310 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలో వ్యవసాయ శాస్త్రవేత్తలచే శిక్షణ ఇచ్చి పంట పొలాల్లోని మట్టిని సేకరించి ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూసార పరీక్షలతో మేలు.. భూసార పరీక్షల వల్ల భూముల్లోని పోషకాల మోతాదు తెలుస్తుంది. పోషకాలు తక్కువగా ఉంటే వ్యవసాయాధికారులు వాటిని పెంచడానికి చర్యలు తీసుకుంటారు. నత్రజని, భాస్వరం, పొటాషియం, ఐరన్, జింక్, బోరాన్, మెగ్నీషియం తదితరాల శాతాన్ని గుర్తిస్తారు. వీటికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగు చేయాలో వ్యవసాయాధికారులు సూచిస్తారు. ఎరువులను ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తారు. ఫలితంగా ఎరువుల వినియోగం, పెట్టుబడుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. సేద్యపు రంగంలో ఆధునిక శాసీ్త్రయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు భూసార పరీక్షల కోసం మట్టినమూనాలను సేకరించేందుకు వలంటీర్లు, ఏఈవోలు వ్యవసాయ క్షేత్రాలను ఏవిధంగా ఎంపిక చేసుకోవాలి? ఏవిధంగా సేకరించాలి? అనే అంశాలు, అలాగే పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇస్తారు. సేకరించిన మట్టి నమూనాలను ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫలితాలను రైతులకు తెలియజేయనున్నారు. పరీక్షల ఫలితాల అనంతరం భూసారం ఎంత ఉంది? ఎలాంటి పంటలు సాగు చేయాలి? ఎరువులు ఎంత మోతాదులో వాడాలి. అనేది వ్యవసాయశాఖ అధికారులు రైతులకు తెలియజేస్తారు. -
వైభవంగా వాసవీ మాత జయంతి ఉత్సవాలు
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని విశ్వనాథస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం వాసవీ మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ కుమార్ దీపక్ దంపతులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య, వాసవీ క్లబ్ సభ్యులు కలెక్టర్ దంపతులను ఘనంగా సన్మానించారు. 350 మంది మహిళలు అమ్మవారికి చీరె సారె సమర్పించారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సత్యనారాయణ, జ్యోతి, కోఆప్షన్ సభ్యురాలు పద్మ, వాసవి క్లబ్ జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్లు ముక్త శ్రీనివాస్, సిరిపుర రాజేశ్, కటుకం హరీష్, వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్, క్యాబినెట్ సెక్రెటరీ కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి వెంకటేశ్వర్లు, పీఆర్వో రమేశ్, తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా సంతోష్చారిశ్రీరాంపూర్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సంతోష్ చారి నియామకమయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అశ్విన్ కుమార్ నియామకపత్రం అందజేశారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కమిటీకి సంతోష్ చారి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఆర్టీసీలో ముగిసిన సమ్మె
● విధుల్లో చేరిన కార్మికులు ● రోడ్డెక్కిన బస్సులు మంచిర్యాలఅర్బన్: మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. ప్రభుత్వం, సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచి బస్సులు ప్రారంభం కావడంతో ఉద్యోగులు, అత్యవసర ప్రయాణికలకు ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా 148 బస్సుల్లో కేవలం 62 బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. బస్సుల కొరత వల్ల ప్రయాణికులు ప్రయాసపడాల్సి వచ్చింది. సమ్మెతో మహిళలతో పాటు పురుషులకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. సమ్మెతో ఆర్టీసీ రోజుకు రూ.24 లక్షలపైన ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. కార్మికుల సంబురాలు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల డిపోలో మూడు రోజులుగా సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వ హామీతో సమ్మెను విరమించి శనివారం విధుల్లో చేరారు. స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. సమ్మెకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికీ జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి దండేపల్లి: వరి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఎక్కడ కూడా ధాన్యం కాంటా వేయడం లేదన్నారు. దీంతో యాసంగిలో వరి పండించిన రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలుగా పోసి నిరీక్షిస్తున్నారన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు, పాలకుల వైఫల్యంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, నాయకులు రవీందర్, భూమన్న, శ్రీనివాస్, తిరుపతి, అజయ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకుల తోడ్పాటు
ఉచిత శిక్షణకు కళాశాల అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆనందంగా ఉంది. చాలామట్టుకు పల్లె, పట్టణ ప్రాంతాల విద్యార్థులు సరైన అవగాహన లేక పాలిసెట్ ఉత్తమ ర్యాంకులు సాధించలేక పోతున్నారు. కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. – దేవేందర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బెల్లంపల్లి, -
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
లింగాపూర్: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కంచన్పల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై గంగన్న కథనం ప్రకారం.. కంచన్పల్లికి చెందిన పేందుర్ గిరిజాబాయి (36), పేందుర్ బంధు దంపతులు. సిర్పూర్(యూ) మండలం నేట్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు గత కొంతకాలంగా గిరిజాబాయిను వేధిస్తున్నాడు. ఆమెను వెంబడించడం, ఫోన్లో వేధింపులకు గురిచేయడం, నీ జీవితం నాశనం చేస్తానని బెదిరిస్తుండేవాడు. గురువారం రాత్రి గిరిజాబాయి బయటకు వెళ్లిన సమయంలో ఆత్రం లచ్చు వెంబడించగా ఆమె ఆరుస్తూ ఇంటికి చేరుకుని బాబాయి కనకజ్యోతిరామ్కు విషయం చెప్పింది. సమీప బంధువు కోట్నాకపావుతో కలిసి అక్కడికి వెళ్లగా లచ్చు పారిపోయాడు. నిరంతరం వేధింపులతో మనస్తాపం చెందిన గిరిజాబాయి శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. అంబులెన్స్లో ఆమెను జైనూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తండ్రి బాపురావు, సోదరి జ్ఞానేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిచ్చికుక్క దాడిలో ఆవులకు గాయాలుజన్నారం: వుండలంలోని కవ్వాల్ గ్రామంలో శనివారం పిచ్చికుక్క దాడిలో మూడు ఆవులకు గాయాలయ్యాయి. దుర్గం రాజన్న, దొంగరి లింగన్న, తుడుం దేవయ్యలకు మూడు ఆవులు, దూడలపై కుక్క దాడి చేసి గాయపర్చాయి. పిచ్చికుక్క స్వైరవిహారంతో గ్రామస్తులు భయందోళనకు గురవుతున్నారు. కుక్క ల బెడద నివారించాలని కోరుతున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
చెరువులో పడి యువకుడు.. ఆదిలాబాద్రూరల్: చెరువులో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..మండలంలోని జందాపూర్ గ్రామానికి చెందిన సొప్పరి సాయికుమార్ (31) కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపై శనివారం వ్యవసాయ పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులను చెరువు ఒడ్డున దించారు. ఎడ్లకు చెరువులో నీళ్లు తాగించే క్రమంలో లోతు నీళ్లలోకి తీసుకెళ్లాయి. ఎడ్లబండిపై ఉన్న సాయికుమార్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆయన అరుపులు విన్న సమీపంలోని ఉపాధి కూలీలు అతన్ని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో రిమ్స్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ.. ఆదిలాబాద్టౌన్: పట్టణంలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. పట్టణంలోని భుక్తాపూర్లోని హలి ్దరాం షాప్ ముందు గల డ్రెయినేజీలో ఇచ్చోడకు చెందిన జంగల్వార్ అనిత (45) మృతిచెంది ఉంది. శనివారం స్థానికులు గమనించి వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సునీల్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
ఆదిలాబాద్టౌన్/తాండూర్: ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతిచెందారు. ఆదిలాబాద్లోని తాటిగూడకు చెందిన గొడ్కే రాంగోపాల్ (65) శనివారం పట్టణంలోని పంజాబ్చౌక్లోని ఓ హోటల్ ఎదుట పడి మృతిచెందినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తాండూర్ మండలం రేచిని పంచాయతీ బారేపల్లికి చెందిన కొట్రంగి జయరాం (40) ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం పనినిమిత్తం బెల్లంపల్లికి వెళ్లి ఎండదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి అతన్ని కుటుంబీకులు బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు మంచిర్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మార్గమధ్యలోనే మృతి చెందాడు. భార్య నీలాబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాండూర్ ఎస్సై ప్రసాద్రావు తెలిపారు. -
సింగరేణి కార్మికులకు వైద్యసేవలు మెరుగుపరుస్తాం
బెల్లంపల్లి: సింగరేణి కార్మికులకు వైద్యసేవలు మెరుగుపరుస్తామని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రూ.80లక్షల అంచనాతో పునఃనిర్మాణం చేసిన పలు వైద్యవిభాగాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈసారి బెల్లంపల్లి, సత్తుపల్లి ఏరియాల్లో తప్పా ఇతర ఏరియాల్లో ఆశాజనకంగా బొగ్గు ఉత్పత్తి జరగలేదన్నారు. బెల్లంపల్లి ఏరియాలో కాస్తా ఆలస్యమైనప్పటికినీ గోలేటి, మహావీర్ ఖని (ఎంవీకే) ఓపెన్కాస్ట్ బొగ్గు గనులు ఏర్పాటవుతాయన్నారు. జీఎం విజయ్భాస్కర్రెడ్డి, ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ పాండురంగాచారి, సింగరేణి కాలరీస్వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) బెల్లంపల్లి, గోలేటి బ్రాంచి ఇన్చార్జి చిప్ప నర్సయ్య, బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియా ఆసుపత్రి పిట్ సెక్రెటరీ శ్రీధర్, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
భవనాలు చూసి ఆశ్చర్యపోయాం
మేము మా పనులు తప్పితే ఊరు దాటి వెళ్లింది లేదు. మొదటిసారి హైదరాబాద్ వెళ్లొచ్చినం. ఉట్నూర్లో రెండంతస్తుల భవనాలు మించి కనబడవు. అక్కడ మాత్రం 50 అంతస్తుల భవనాలను బస్సులో వెళ్తూ చూశాం. నగరం ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయాం. – సోయం భీంరావు మంచి విడిది, భోజనాలుఈ పర్యటనలో మాకు చారిత్రక కట్టడమైన తా రాబందీ బారాదరీలో వసతి కల్పించారు. మంచి వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. మంత్రి జూపల్లి మాతో కలిసి భోజనం చేశారు. అ లాగే ఎమ్మెల్యే బొజ్జు కుటుంబ సభ్యులతో కలి సి మాలో ఒకడిగా వచ్చారు. – మేస్రం జాగు ఆదివాసీలకు అద్భుత అవకాశం ఆదివాసీలకు ఇదో అద్భుత అవకాశం. ప్రస్తుతం విడతల వారీగా ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిపుత్రులను హైదరాబాద్ నగర సందర్శనకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఖమ్మంలోని పీవీటీజీలు బాహ్య సమాజానికి దూరంగా జీవితాలను వెల్ల దీస్తున్నారు. అలాంటి వారిలో నగర సందర్శన కొత్త అనుభూతినిస్తుంది. వారి కుటుంబాలు సైతం అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉంటుంది. – వెడ్మ బొజ్జుపటేల్, ఎమ్మెల్యే, ఖానాపూర్ -
● పీఏసీఎస్లకు పాలకవర్గాల ఎంపిక ● పదవులపై అధికార పార్టీ నాయకుల ఆశలు ● ఎమ్మెల్యేల ఆశీర్వాదంతోనే దక్కనున్న అవకాశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను నా మినేటెడ్ పద్ధతిలో ప్రభుత్వం నియమించనుంది. చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల నియామకం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో పదవులపై ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ప్రతీ సహకార సంఘానికి 13మంది చొప్పున డైరెక్టర్ల స్థానా లకు ఎన్నికలు జరిగేవి. సంఘ సభ్యులు ఓట్లు వేసి ఎన్నుకునేవారు. అలా ఎన్నికై న డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్చైర్మన్గా ఎన్నుకునేవారు. తాజాగా ప్రభుత్వం ఎన్నికలు లేకుండా నేరుగా నా మినేటెడ్ పద్ధతిలో సంఘాల పాలకవర్గాలను పూర్తి చేయనుంది. దీనిపై ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆశావహులు పదవుల కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది. గత ఫిబ్రవరిలో పదవీకాలం ముగియగా ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. తర్వాత పలుచోట్ల సంఘాల చైర్మన్, వైస్చైర్మన్లపై ఆరోపణల కారణంగా పక్కన పెట్టింది. చివరికి గత డిసెంబర్ నుంచి పర్సన్ ఇన్చార్జీ లుగా సంఘాలకు అధికారులే ఉన్నారు. నూతన పాలకవర్గాలు రాక సంఘాల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ముగ్గురా? ఐదుగురా? నామినేటెడ్ పద్ధతిలో ఒక్కో సంఘానికి ఎంతమందిని ఎంపిక చేస్తారనేది ఇంకా స్పష్టత లేదు. ఒక్కో సంఘానికి ముగ్గురిని ఎంపిక చేసి, వారిలో చైర్మన్, వైస్ చైర్మన్, ఓ డైరెక్టర్, లేక ఐదుగురిలో ముగ్గురు డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్గా ఉంటారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అధికారులకు దీనిపై ఇంకా విధి విధానాలు రావాల్సి ఉంది. ఏపీలో కొత్తగా మార్పులు చేసిన చట్టం ప్రకారం ముగ్గురిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నామినేటెడ్ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. నామినేటెడ్ చేసే సభ్యుల్లో జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళా వర్గాల కు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. జిల్లాలో 20సంఘాలు జిల్లాలో 20ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాలు ఉండగా 23వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన మండలాల్లో హాజీపూర్, నస్పూర్, కన్నెపల్లిలో మూడు కొత్తగా ఏర్పాటు చేసేందుకు జిల్లా సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇవి ఏర్పడితే సంఘాల సంఖ్య 23 కు చేరనుంది. ఇంకా ఉమ్మడి జిల్లా పరిధి కేంద్రంగా సహకారశాఖ కొనసాగుతోంది. కొత్త జిల్లాల వారీ గా ఏర్పాటు కాలేదు. దీంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం(డీసీఎంఎస్) సైతం కొత్త జిల్లాల వారీగా ఏర్పాటు చే యాల్సి ఉన్నా, ఆ దిశగా ముందడుగు పడడం లే దు. కొత్తగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చై ర్మన్లు, డైరెక్టర్లను సైతం ఎంపిక చే యాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పాత సంఘాలకే నామినెటేడ్ పద్ధతిలో ఎంపిక జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పరపతి కల్పనలో ప్రాథమిక సహకార సంఘాలు కీలకంగా పని చేస్తున్నాయి. పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల సబ్సిడీలు, సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందించడంలో ఉపయోగపడుతున్నాయి. రైతు వర్గాల్లో కీలకంగా ఉన్న ఈ పదవులు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గాల తరహాలో సహకార సంఘాల్లోనూ ఇదే తీరుగా సాగనుంది. దీంతో అధికార పార్టీ రైతు నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. గత రెండున్నర ఏళ్లుగా అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికార పార్టీ నాయకులకు అవకాశాలు దక్కనున్నాయి.ఎంపిక ఎమ్మెల్యేలదే.. -
● పూర్తయిన ఓటర్ మ్యాపింగ్ ● పెరిగిన ఓటర్లతో 3,79,375 మంది ● జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తుమంచిర్యాలరూరల్(హాజీపూర్): పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ) ఎన్నికలు మే నెలలో నిర్వహించేలా సిద్ధంగా ఉండాలని, ఇందుకు ఏర్పాట్లతో పాటు అదనంగా నమోదైన ఓటర్ల ప్రకారం వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికాగా 2,699 మంది ఓటర్లు పెరిగారు. మరోవైపు ఇప్పటికే జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఉంచారు. ఓటర్లు పెరగడంతో రిజర్వేషన్లు కూడా మారవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఇక పరిషత్ల పాలకవర్గాల గడువు ముగిసి రెండేళ్లు దాటినా అడుగు ముందుకు పడటం లేదు. పెరిగిన ఓటర్లు 2,699 మంది.. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,76,676 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన 2,699 ఓటర్లతో మొత్తం 3,79,375 మంది ఓటర్లు ఉన్నా రు. ఇందులో పురుషులు 1,86,949మంది, మహిళలు 1,92,411మంది, ఇతరులు 15 మంది ఉండగా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 3,79,375మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. చిగురించిన ఆశలు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికలు ఉంటాయని అందరూ భావి ంచినా బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో తేలాకే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం మరోసారి రిజర్వేషన్లు మా రే అవకాశం ఉంది. తాజాగా ఎస్ఈసీ ఓటర్ల జాబి తాకు ఆదేశించడంతో ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే పల్లెల్లో పరిషత్ వేడెక్కడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్ము రం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జగింపులు, రాజీపడి పోటీ చేయని వారితో పాటు కొత్తవారూ ఉన్నారు. అవసరమైతే ఎంపీపీ పదవి దక్కించుకోవాలని కొందరు, జెడ్పీటీసీగా గెలుపొంది కేబి నెట్ హోదా ఉన్న జెడ్పీ చైర్మన్ పదవి పొందాలని మరికొందరు చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడు ఉంటాయా.? లేదా మరోసారి రిజర్వేషన్లు ప్రకటించాకే ఉంటాయా? అనే దానిపై అధికారికంగా స్పష్టత లేదు. కానీ ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు మాత్రం అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా వివరాలు జెడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు 25 ఎంపీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారులు 56 ఎంపీటీసీ స్థానాలకు సహాయక రిటర్నింగ్ అధికారులు 56 మొత్తం పోలింగ్ అధికారులు 3,957తేలిన ఓటర్ల లెక్క మండలం ఎంపీటీసీ పోలింగ్ పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ఇతరులు మొత్తం స్థానాలు స్టేషన్లు బెల్లంపల్లి 08 41 11,715 11,937 01 23,653 భీమిని 05 24 5,878 5,738 01 11,617 కన్నెపల్లి 05 30 7,645 7,905 01 15,551 కాసిపేట 09 52 13,194 13,448 03 26,645 కోటపల్లి 09 53 13,437 13,853 02 27,292 మందమర్రి 05 21 5,748 5,863 01 11,612 నెన్నెల 07 35 9,688 9,811 01 19,500 తాండూర్ 09 53 13,848 14,164 00 28,012 వేమనపల్లి 05 32 7,608 7,608 01 15,297 భీమారం 05 26 6,432 6,741 00 13,173 చెన్నూర్ 09 53 13,116 13,529 00 26,645 దండేపల్లి 14 78 20,618 21,771 01 42,390 హాజీపూర్ 06 31 8,414 8,655 00 17,069 జైపూర్ 10 52 15,374 15,464 01 30,839 జన్నారం 15 85 21,814 22,868 02 44,684 లక్సెట్టిపేట 08 47 12,340 13,056 00 25,396 మొత్తం 129 713 1,86,949 1,92,411 15 3,79,375సిద్ధంగా ఉన్నాం..రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. గతంలోనే ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. – గణపతి, జెడ్పీ సీఈవో, మంచిర్యాల -
అభాగ్యులు
ఎవరికి పట్టనిపాలి‘సెట్’ సాధించేలా..బెల్లంపల్లి: సాంకేతిక విద్య అభ్యసించాలని కుతూహలం ఉన్న విద్యార్థులు పాలిసెట్లో నెగ్గేలా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన శిక్షణ తరగతులు మే 11వరకు నిర్వహించనున్నారు. 13న పాలిసెట్–2026 జరగనుంది. 2025–26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎస్టీ, ఎ స్సీ, బీసీ గురుకులాల్లో పదోతరగతి పూర్తి చేసిన వందమంది నిరుపేద విద్యార్థులకు కళాశాల ప్రిన్సి పాల్ దేవేందర్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. సబ్జెక్టులపై పట్టుసాధించేలా... శిక్షణ తరగతులను మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సి ర్పూర్(టి), కాగజ్నగర్, సిర్పూర్ (యూ), ఆసిఫా బాద్, రెబ్బెన, తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరాంపూర్, కాసిపేట, నెన్నెల, తది తర మండలాల విద్యార్థులు శిక్షణకు హాజరవుతున్నారు. సబ్జెక్టులపై పట్టుసాధించేలా ఉదయం 9 ను ంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తూ నే నిర్ధేశించిన పరీక్ష సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా మెలకువలు నేర్పిస్తున్నారు. కోర్సులపై అవగాహన పాలిటెక్నిక్లో ఏఏ కోర్సుల్లో ఉన్నాయి.. ఏ కోర్సులో చేరితే ఉద్యోగావకాశాలు ఉంటాయి.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకునే తీరు, తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. మైనింగ్, ఈఈఈ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఏఐ, ఆటోమేషన్ రోబోటిక్, తదితర కోర్సులను వివరిస్తున్నారు.సమాన స్థాయిలో హాజరు... కళాశాలలో మూడేళ్ల క్రితం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటిసారి 2024లో 60 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరుకాగా పాలిసెట్లో 40 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత అప్పటి అధ్యాపకుల్లో కొందరు బదిలీపై వెళ్లగా రెండేళ్ల పాటు శిక్షణ తరగతులు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో అధ్యాపకుల్లో ఉచితంగా బోధించాలనే జిజ్ఞాస ఏర్పడి ఈ ఏడాది నుంచి ఉచిత శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ పేర్కొన్నారు. కాగా ఈ శిక్షణ తరగతులకు బాలబాలికలు సమాంతరంగా హాజరవుతుండడం గమనార్హం. -
భారీ పెట్టుబడి మోసం కేసులో నిందితురాలు అరెస్ట్
ఆసిఫాబాద్అర్బన్: కాగజ్నగర్ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రూ.2 కోట్ల భారీ పెట్టుబడి మో సం చేసిన కేసులో నిందితురాలు థాకూర్ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడి పెట్టమని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ. 2 కోట్ల మొత్తంలో నగదు వసూళ్లు చేశారు. 5 నుంచి 20 శాతం లాభాలు ఇస్తామని చెప్పి మోసాలకు పా ల్పడ్డారు. కాగజ్నగర్, పెంచికల్పేట్, హైదరాబాద్ ప్రాంతాల్లో 2021 నుంచి 2023 మధ్య కాగజ్నగర్లో ఉంఉడి ప్రజల నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యారు. కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇందులో థాకూర్ శివరంజనిబాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మిగతా నిందితులు ఠాకూర్ కరణ్సింగ్, థాకూర్ రతన్సింగ్, ధా కూర్ రవీందర్, థాకూర్ రాణాసింగ్ పరారీలో ఉ న్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కీలక నిందితురాలిని అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, టౌన్ సీఐ ప్రేమ్కుమార్, ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు లక్ష్మి, జ్యోత్స్న, బ్లేస్సీ, షమీనా, కానిస్టేబుల్ విజయను ఎస్పీ అభినందించారు. -
● మూడో అంతస్తు నుంచి పడి బాలుడి మృత్యువాత ● తల్లిదండ్రుల కళ్లముందే ఘటన
అయ్యో బాబు..!రామకృష్ణాపూర్: కూలీ పనుల కోసం ఓ కుటుంబం పొట్ట చేతబట్టుకుని వలస వచ్చింది. తల్లిదండ్రులు భవన నిర్మాణ పనుల్లో నిమగ్నం కాగా.. కుమారుడు ఆడుకుంటూ మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాగాడ్ జిల్లా సిరిగ్రామ్ గ్రామానికి చెందిన దాల్సింగ్, కిశోరి దంపతులు కూలీ పనుల నిమిత్తం ఐదు నెలల క్రితం కుటుంబంతో కలిసి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గద్దెరాగిడి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల్లో శనివారం మధ్యాహ్నం దాల్సింగ్, కిశోరి దంపతులు నిమగ్నమై ఉన్నారు. వీరి కుమారుడు నితేష్(8) భవనం మూడో అంతస్తుపై ఆడుకుంటూ ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడిని వెంటనే మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తల్లిదండ్రుల కళ్లముందే ఘటన చోటుచేసుకోవడం అందరిని కంటతడి పెట్టించింది. బతుకు పోరాటం కోసం వచ్చిన కుటుంబానికి కుమారుడి మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల్య వివాహాలు చట్ట విరుద్ధం
లక్సెట్టిపేట: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. బాల్య వివాహాలు జరిపిస్తే అందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరిపై కేసు నమోదవుతుందన్నారు. బాల్య వివాహా లు చట్ట పరంగా నేరమని, వాటిని ప్రోత్రహించవద్దన్నారు. చట్ట పరంగా అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడే వివాహానికి అర్హులవుతారన్నారు. అనంతరం బాల్య వివాహాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు, మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి, కమిషనర్ విజయ్కుమార్, న్యాయవాదులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ రాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహ/ంచారు. కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. డీపీఓ వెంకటేశ్వర్రావుతోపాటు బెల్లంపల్లి డీఎల్పీఓ సతీశ్, మంచిర్యాల డీఎల్పీఓ ధర్మారాణి, ఎంపీఓలు శ్రీపతి బాపు, సఫ్దర్అలీ, ఉమర్షరీఫ్, సుమన్, శ్రీనివాస్, రమ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రావణ్కుమార్, కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది ప్రజ్ఞ, రాంకుమార్ పాల్గొన్నారు. -
మందమర్రిలో చెస్ పోటీలు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని బూరుదగూడెంలోగల లిటిల్ఫ్లవర్ హైస్కూల్లో శుక్రవారం అండర్–7, అండర్–11, ఓపెన్ టూ ఆల్ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాల విద్యార్థులకు చెస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 26న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వి ద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చదరంగం చైర్మన్ ఈగ కనకయ్య, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంపత్కుమార్, కొంగల తిరుపతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్, శృతి, కుమార్, కార్యవర్గ సభ్యుడు సతీశ్ తదితరులున్నారు. -
వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం
ఆదిలాబాద్టౌన్: వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం జిల్లాలో ఏకకాలంలో 16 మండలాల్లో 45 బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించగా, ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్పీ శుక్రవారం వెల్లడించారు. దాదాపు వంద మంది వడ్డీ వ్యాపారులను తనిఖీ చేసి, జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూ ములు కుదువుపెట్టుకుని, కొందరు రైతుల భూములను తమ పేర్లపై రాయించుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తున్నవారిపై దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్బుక్కులు, ఖాళీ స్టాంప్ పేపర్లు, బాండ్ పేపర్లు, సేల్డీడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఖుర్షీద్నగర్కు చెందిన నాయిని సుదర్శన్, తలమడుగు పోలీస్స్టేషన్లో దేవాపూర్కు చెందిన కటకం రాజు, శ్రీనివాస్, మావల పోలీస్స్టేషన్లో 170 కాలనీకి చెందిన కుంటి లింగన్న, మావలకు చెందిన దుర్గారెడ్డి, నేరడిగొండ పోలీస్స్టేషన్లో తేజపూర్కు చెందిన గంగారెడ్డి, నేరడిగొండకు చెందిన శ్రీనివాస్, జుంబేరాత్ రాహుల్, తాంసి పోలీస్స్టేషన్లో కప్పర్లకు చెందిన ఉప్లంచి నగేశ్, ఉప్లంచి గంభీర్, ఇచ్చోడ పోలీస్స్టేషన్లో గొతి సుందర్ సింగ్, గిట్టే మారుతి, కడమ్ సుదర్శన్, కడమ్ సాయికృష్ణ సిద్ధాంత్, గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో మన్నూరు గ్రామానికి చెందిన దహాలే పవన్పై కేసులు నమోదైనట్లు వివరించారు. -
అ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది..!
జన్నారం: వారం నుంచి ఓ వ్యక్తి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. పోలీసులు, గ్రామస్తులు ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకడంలేదు. దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేశ్ ఈ నెల 16న రాత్రి జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో పేకాడుతున్నాడు. దారి వెంట వెళ్లేవారి టార్చిలైట్లను చూసి పోలీసులనుకుని పారిపోయాడు. అప్పటి నుంచి అతడి సెల్ఫోన్ స్విచాఫ్ వస్తోంది. మరుసటి రోజు అతడి భార్య సుజాత జ న్నారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, అతడితోపాటే పేకాడుతున్న మిగతా వారున్నా ఇప్పటివరకు మల్లేశ్ ఆచూకీ లభించలేదు. దీంతో స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. సుజాత ఫిర్యాదు మేరకు ఏసీపీ ప్రకాశ్ ఆదేశాలతో లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై ఉదయ్కిరణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు మల్లేశ్ అదృశ్యం ఘటన అతడి కుటుంబ సభ్యుల కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పోలీసులు డాగ్స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో ఇదివరకే వెతకగా శుక్రవారం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సైలు సురేశ్, తహసీనొద్దీన్, ఉదయ్కిరణ్ గ్రామస్తులతో కలిసి చెట్ల పొదలు, గోదావరి తీర ప్రాంతాల్లో గాలించారు. పోలీసులు డాగ్స్క్వాడ్తో వెతకగా గోదావరి సమీపంలో ఆయన చెప్పులు కనిపించాయి. డాగ్ వాటిని పసిగట్టి గోదావరి నీటి వరకు వెళ్లి ఆగింది. దీంతో రిస్క్ టీంతో గోదావరి నీటిలో గాలించారు. డ్రోన్ కెమెరాతో పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి గోదావరి ప్రాంతంలోని చెట్లపొదలు, గుట్టలను గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో పంట చేలు, పొలాలకు విద్యుత్ తీగలు అమర్చి ఉంటే వాటికి తగిలే ప్రమాదముంది. ఆ కోణంలో పో లీసులు దర్యాప్తు జరిపితే బాగుంటుందని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎస్సై ఉదయ్కిరణ్ను ‘సాక్షి’ సంప్రదించగా, వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు డాగ్స్క్వాడ్, డ్రోన్లతో పరిశీలించామని పేర్కొన్నారు. గ్రామస్తులతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికామని వివరించారు. -
నాణ్యమైన విత్తనమే లక్ష్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, నమ్మకమైన, అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో మంచిర్యాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వ్యవసాయ అధికారులు సురేఖ, విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఎఫ్పీఓల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్రెడ్డి మాట్లాడుతూ కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని నాణ్యమైన విత్తనాల వినియోగం వైపు మళ్లించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి పంటలు సాగు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాల్లో విత్తనాల కొరత లేదని, సన్న, దొడ్డు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రెండు జిల్లాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని, ఇందుకు 50 వేల క్వింటాళ్ల విత్తనం అవసరమని, కనీసం 20 వేల క్వింటాళ్లను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరాకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించేలా, పంట మార్పిడి చేపట్టేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ(టెక్నికల్), సహకార అధికారులు, ఏడీఏలు, ఎంఏఓలు, ఎఫ్పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కార్మికుల సంక్షేమానికి కృషి
కాసిపేట/శ్రీరాంపూర్: సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందని సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు) కే.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన మందమర్రి ఏరియా కాసిపేట–1ఏ న్యూటన్నల్ గనిపై మ్యాన్ రైడింగ్ను ప్రారంభించారు. కేకే ఓసీ వ్యూ పాయింట్ నుంచి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి వివరాలు తెలుసుకున్నారు. జీఎం కార్యాలయంలో ఏరియా ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూగర్భ గనుల ద్వారా నష్టం వాటిల్లుతున్నా కార్మికుల సంక్షేమం కోసం నడిపిస్తున్నామని తెలిపారు. అత్యధికంగా నష్టం వాటిల్లే గనుల్లో మొదటి స్థానంలో కాసిపేట గని ఉందన్నారు. నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ముందుస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. మందమర్రి ఏరియా కేకే ఓసీలో గని వ్యూ పాయింట్ను సందర్శించి బొగ్గు వెలికితీత పనులను పర్యవేక్షించారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, శ్రీరాంపూర్ జీఎం ఎం శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, ఏజెంట్ రాంబాబు, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియా కార్యదర్శి సత్యనారాయణ, గని మేనేజర్ సతీష్కుమార్, సంక్షేమాధికారి జీషాన్, కేకే ఓసీ ఎస్ఓటూ జీఎం ప్రసాద్, బెల్లంపల్లి రీజియన్ జీఎం క్వాలిటీ వీరభద్రరావు, కేకే ఓసీ మేనేజర్ రామారాజు తదితరులు పాల్గొన్నారు. -
సామేలలో మరొకరు..
వాంకిడి: ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సామేల గ్రామానికి చెందిన సెండె శివతేజ (17) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం కనర్గాం గ్రామ శివారులో కోలె గణపతికి చెందిన వ్యవసాయ భూమిలోగల పత్తి కట్టెలు తొలగించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వెనుక ఉన్న కాలువను గమనించక ట్రాక్టర్ను రివర్స్ తీశాడు. దీంతో ట్రాక్టర్ కాలువలో బోల్తా పడగా దాని కింద ఇరుక్కుని మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆలయాలకు ‘పుష్కర’ శోభ
చెన్నూర్: చెన్నూర్ గోదావరి నదీ తీరంలోని ఆలయాలు పుష్కర శోభను సంతరించుకోనున్నాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆలయాలు, వివిధ అభివృద్ధి పనులకు రూ.130.59 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. 2027 జూన్లో నిర్వహించే గోదావరి పుష్కరాలను టైర్వన్గా గుర్తించడంతో ఇప్పటి నుంచే పనులు ప్రారంభించేందుకు సిద్ధం కావాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. చెన్నూర్ ప్రాంత దేవాలయాలు, పుష్కర ఘాట్లకు విశాలమైన రోడ్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పుష్కర ఘాట్లు నిర్మిస్తారు. జాతీయ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ల వరకు ఇరువైపుల పూలమొక్కలు, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పెయింటింగ్లు వేస్తారు. పనులు.. ఆలయాలకు పెద్దయెత్తున నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. పుష్కరఘాట్ ప్రాంతంలో గోదావరి మాత విగ్రహానికి రూ.50లక్షలు, రూ.కోటితో శివలింగం, గోదావరి తీర హనుమాన్ మందిర్కు రూ.50లక్షలు, చెన్నూర్ మదనం పోచమ్మ ఆలయానికి రూ.3 కోట్లు, జగన్నాథ ఆలయానికి రూ.75 లక్షలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్కు రూ.4కోట్లు, గెస్ట్హౌస్ నిర్మాణానికి రూ.50 లక్షలు, కత్తరశాల మల్లికార్జున ఆలయానికి రూ.1.50కోట్లు, భక్తులు సేదదీరేందుకు భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, శారద మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, ఘాట్ వద్ద కేశఖండన షెడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు, అక్కెపల్లి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి రూ.కోటి, చెన్నూర్ మహాంకాళి దేవాలయానికి రూ.30 లక్షలు ప్రతిపాదించారు. పనులు పూర్తయితే ఆలయాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. భూ సేకరణ చెన్నూర్ గోదావరి పుష్కరాల్లో భాగంగా జాతీయ రోడ్డు నుంచి పుష్కర ఘాట్ వరకు రోడ్డు వెడల్పు చేసేందుకు అధికారులు 4.21 ఎకరాల భూమి సేకరించాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరానికి రూ.12లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతోంది. రెవెన్యూ అధికారులు రూ.7.88 లక్షలుగా అంచనా వేశారు. రైతులను సంప్రదించి ధర నిర్ణయించే అవకాశం ఉంది. శాఖల వారీగా నిధుల ప్రతిపాదనలు.. -
ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: నిరుద్యోగ యువత తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో నైపుణ్యత సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారంలో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల, మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కెరీర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి విద్య కోర్సుల్లో ఆధునిక సాంకేతికతను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందిస్తుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, మైనార్టీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. కూలీల సంక్షేమం దిశగా చర్యలు భీమిని: ఉపాధి హామీ పథకం కూలీల సంక్షేమం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం ఆయన భీమిని, కన్నెపల్లి మండలాల్లో పర్యటించారు. భీమిని మండలంలో ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. భీమినిలో ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. భీమిని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు, భీమిని, కన్నెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించి మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి ఉపాధిహామీ పనులు పరిశీలించారు. అనంతరం పీపీరావు ప్రాజెక్టును సందర్శించారు. ఎంపీడీఓలు గంగామోహన్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓలు రమ్య, తహసీల్దార్ బికర్ణదాస్ పాల్గొన్నారు. -
● 32.5 తులాల బంగారం, కిలో వెండి, రూ.1.50 లక్షల నగదు చోరీ
మంచిర్యాలలో భారీ చోరీ మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో ఈ నెల 23న రాత్రి భారీ చోరీ జరిగింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ముదాం నాగయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 22న జైపూర్ మండలం రామారావుపేటలోని బంధువుల ఇంట్లో జరిగిన సంవత్సరీకం కార్యక్రమానికి వెళ్లాడు. తిరిగి 23న రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే తలుపులు తెరుచుకుని, మాస్టర్ బెడ్రూమ్లోని బీరువా తలు పులు పగులగొట్టి ఉన్నాయి. నాగయ్య దొంగతనం జరిగినట్లు భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. 32.5 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 1.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలంలో ఫింగర్ ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల మౌనదీక్ష
మౌనదీక్షలో పాల్గొన్న కార్మికులుమంచిర్యాలఅర్బన్: సమస్యల పరిష్కారం కోసం టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజు శుక్రవారమూ కొనసాగింది. మంచిర్యాల డిపో వద్ద కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి మౌనదీక్ష నిర్వహించారు. అంతకుముందు ప్రాణత్యాగం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమ్మెకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అన్నారు. బస్సులు డిపోకే పరిమితం డిపోలో 148 బస్సులు ఉండగా.. 62 అద్దె బస్సుల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. సంస్థ బస్సులు డిపోకే పరిమితం కాగా, అద్దె బస్సులు నడిచాయి. డీఎంతోపాటు మరో నలుగురు మినహయిస్తే మిగతా వారంతా సమ్మెలోనే ఉన్నారు. రెండు రోజులుగా మహిళలతోపాటు పురుషులకు ఉచి తంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులపై తాత్కాలిక కండక్టర్లను నియమించి పురుషులకు టికెట్ ఇష్యూ చేయించారు. హైదరాబాద్కు వెళ్లే 38 బస్సుల్లో మొత్తం లగ్జరీ, రాజధాని, లహరీ బస్సులన్నీ సంస్థవి ఉన్నా యి. మూడు రోజులుగా ఉద్యోగులు విధులకు దూ రంగా ఉండడంతో శుక్రవారం కూడా హైదారాబా ద్కు వెళ్లే సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొవ్వత్తుల ర్యాలీ ఆర్టీసీ అమరవీరుడు శంకర్గౌడ్ మృతికి సంతాప సూచికంగా కార్మికులు శుక్రవారం రాత్రి మంచిర్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు వెళ్లి మళ్లీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
భర్త ఇంటి ఎదుట బైఠాయింపు
దస్తురాబాద్: భర్త ఇంటి ఎదుట ఓ మహిళ బైఠాంచిన ఘటన మండలంలోని మున్యాల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన సుమలతకు 2024 ఫిబ్రవరి 9న దస్తురాబాద్ మండలం మున్యాల గ్రామానికి చెందిన కొప్పుల సత్తన్నతో వివాహమైంది. పెళ్లయిన నెలకే ఉపాధి నిమిత్తం సతన్న గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఆ సమయంలో సుమలత తన తల్లిగారింట్లో ఆరు నెలలు ఉండి డీఎస్సీ పరీక్షలు రాసి వస్తానని వెళ్లింది. రెండేళ్లయినా తిరిగా రాలేదని, ఇందుకు తన అత్త, మామే కారణమని ఆరోపించింది. వారు తనను ఇంటికి రాకుండా అడ్డు పడుతున్నారని తెలిపింది. కనీసం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన భర్త ఇంటి ఎదుట బైఠాయించినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని గ్రామ పెద్దలను వేడుకుంది. కాగా, స్థానికులు మద్దతు తెలుపగా సుమలత ఆందోళన కొనసాగిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
బాసర: మండలంలోని టాక్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ము థోల్ నుంచి కూలీలు ఆటోలో బాసరకు వెళ్తున్నారు. బాసర–భైంసా రహదారిపై టాక్లి సమీపంలో ఎదురుగా వస్తున్న జేసీబీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముథోల్కు చెందిన రుమోళ్ల పోతన్న (26) అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు బాసర సీఐ కిరణ్కుమార్, ఏఎస్సై గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జన్నా‘రాం.. రాం..!’
జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియా పరిధిలో విధి నిర్వహణకు అటవీశాఖ అధికారులు జంకుతున్నారు. టైగర్జోన్ నిబంధనల అమలులో ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలతో సతమతం అవుతున్నారు. నిబంధనలు అమలు చేస్తున్న సిబ్బందికి స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండడంతో మనశ్శాంతి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్కు రావడానికి సిబ్బంది ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. పక్కనే ఉన్న మంచిర్యాల, చెన్నూర్ వంటి బఫర్ ఏరియా ప్రాంతాల్లో పని ఒత్తిడి తక్కువగా ఉండడంతో.. సస్పెండైన సిబ్బంది తిరిగి అటు వైపు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జన్నారం అటవీ డివిజన్లో బీట్, సెక్షన్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొనసాగుతున్న సస్పెన్షన్లు.. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో జాప్యంపై గత ఆరు నెలలుగా పదుల సంఖ్యలో సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్న జన్నారం అటవీ డివిజన్లో సస్పెన్షన్ల కారణంగా మరింత కొరత ఏర్పడింది. సస్పెండైన వారిని మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్ డివిజన్లకు పంపించడంతో జన్నారం డివిజన్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాలను పాటించడం, టైగర్ జోన్ నిబంధనలు అమలు చేయడం, స్థానిక ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకత సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా జన్నారం అటవీ డివిజన్లో సిబ్బంది కొరత కొంతమేర ఉంది. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధుల నిర్వహణ జరుగుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం ఇక్కడ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. – రామ్మోహన్, ఎఫ్డీవో -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ మద్దిమాడ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. కాగా, తోటి సిబ్బంది భయంతో హత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని మరోచోట వేయడం వివాదాస్పదంగా మారింది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడకు చెందిన కొడప కృష్ణ (28) గురువారం రాత్రి 9గంటల సమయంలో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ట్రాక్టర్లో ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు గ్రామస్తులు దిశ మోడల్ స్కూల్ పక్కన కృష్ణ మృతదేహం ఉన్నట్లు తెలుపగా భార్య స్వప్న, స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. కృష్ణ తల, కాలు, నడుముకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు గుర్తించారు. రాత్రి ట్రాక్టర్లో ఇసుక నింపుకొని మద్దిమాడ వైపు వస్తుండగా 11గంటల సమయంలో డ్రైవర్ పోశం ట్రాక్టర్ను అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో బోల్తా పడింది. దీంతో కృష్ణ తల, నడుముకు గాయాలు కావడంతో అక్కడే మృతి చెందాడు. భయపడ్డ డ్రైవర్ పోశం అతడి వెంట ఉన్న గంట రాజయ్య, చంద్రయ్య, అజయ్తో కలిసి సాక్ష్యాలను తారుమారు చేయాలని భావించాడు. దీంతో పోశం కృష్ణ మృతదేహాన్ని ట్రాక్టర్లో తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బైక్పై మృతదేహాన్ని తీసుకుని వెళ్లి దిశ మోడల్స్కూల్ పక్కన పడేశాడు. ఈ విషయమై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తెలంగాణలోకి ఇతర ప్రాంతాల ధాన్యం
కోటపల్లి: మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు మీదుగా తెలంగాణలోకి అక్రమంగా వరి ధాన్యం తరలింపును అడ్డుకునేందుకు ఏర్పాటు చేసి న అంతర్రాష్ట్ర చెక్పోస్టు నామమాత్రమే అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తుండగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కొంతమంది దళారులు ధాన్యం తెచ్చి సొమ్ము చేసుకుంటుండగా దీనిని అడ్డుకునేందుకు రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయించింది. మండలంలోని రాపన్పల్లి ప్రాణహిత నది సమీపంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో బుధవారం అంతర్రాష్ట్ర చెక్పోస్టును రెవెన్యూ, పోలీ స్, వ్యవసాయశాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు. కాగా, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వరి ధాన్యం బస్తాలతో ట్రాక్టర్ రాగా అధికారులు పరిశీలించారు. తిరిగి వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోకి ధాన్యం రాకుండా అడ్డుకుని సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసులు చేయాల్సిన అధికారులే వదిలివేయడంతో అక్రమ ధాన్యం రవాణాకు ఆజ్యం పోసినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు. నామమాత్రపు తనిఖీలే.. మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు నామమాత్రమే అయ్యాయి. తెలంగాణలో కి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేసి న చెక్పోస్టు వద్ద పోలీస్, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఽఇంతమంది అధికారులు విధులు నిర్వహిస్తున్నా గతంలో చెన్నూర్లో రెండు, మూడుసా ర్లు ధాన్యం బస్తాలతో వచ్చిన లారీలను రైతులే అ డ్డుకుని అధికారులకు అప్పగించిన సందర్భాలున్నా యి. కాళేశ్వరం అన్నారం బ్యారేజ్ మీదుగా చెన్నూర్ మండలంలోకి అక్రమంగా ధాన్యం తీసుకువచ్చే అ వకాశాలున్నట్లు గతంలో పలువురు అధికారులు ఉ న్నతాధికారులకు నివేదించినా అటువైపు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది కళ్లు గప్పి లోనికి వాహనాలు ఎలా వస్తున్నాయి? పట్టుబడిన వాహనాలకు ఎలాంటి కేసులు చేయరాదని, ధాన్యాన్ని రై తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని అధికారులే చెబు తుండగా, అలాంటప్పుడు మూడు శాఖల అధికా రులు 24గంటల విధులు నిర్వహిస్తుండడం ఎందుకని పలువురు అధికారులు చర్చించుకోవడం కొసమెరుపు. ఎలాంటి కేసులు చేయకపోతే అక్రమంగా ధాన్యం తీసుకువచ్చే వారికి ఏం భయం ఉంటుందని కొందరి వాదన. దీనిని అలుసుగా తీసుకుని దళారులు అధికారులను మచ్చిక చేసుకుని ధాన్యం వాహనాలను అక్రమంగా రాత్రిపూట, తెల్లవారుజామున మన రాష్ట్రంలోకి తెస్తున్నారని గతంలో పట్టుబడిన వాహనదారులు విచారణ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ధాన్యం బస్తాలతో వచ్చే వాహనాలను తనిఖీ కేంద్రం వద్ద ఆపి వెనక్కి పంపడం మినహా ఎలాంటి కేసులు నమోదు చేసే అధికారం తమకు లేదని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రహ్మారావు తెలిపారు. ధాన్యాన్ని రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
గుడిపేటలో ఆక్వా పార్కు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని గుడిపేట శివారులో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుని ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్లు పిలిచి.. ఖరారైతే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. 100 నుంచి 150 ఎకరాల్లో దాదాపు రూ.80కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్రం కూడా 60శాతం నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్వా పార్కు నిర్మాణంతో రెండు రకాలుగా అభివృద్ధి జరగనుంది. పర్యాటకులకు వినోదం పంచేందుకు అత్యాధునిక వాటర్పార్కులతోపాటు మత్స్య సంపద అభివృద్ధి చేసే మౌలిక సదుపాయాల కేంద్రంగా నిలువనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై) కింద దేశవ్యాప్తంగా మత్స్యరంగ అభివృద్ధికి ఆక్వా పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్ర ప్రతిపాదనల మేరకే గుడిపేటలో ముర్రెల్ చేప ఉత్పత్తి, సంరక్షణ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా టూరిజం ప్రాంతంగానే కాకుండా జల మత్స్య సంపద, విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు వేదిక కానుంది. ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. ఆక్వా పార్కులో వివిధ రకాల చేపల ప్రదర్శనకు ఆక్వా మ్యూజియం, వాటర్ గేమ్స్, ఆక్వా రైతులకు ఆధునిక పద్ధతుల అవగాహనకు శిక్షణ కేంద్రం, సందర్శకులకు షాపింగ్, హోటళ్లు, కెఫెటేరియాలు, మత్స్య సేవా కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీలు ఉంటాయి. రూ.2.5 కోట్లతో ముర్రెల్ క్లస్టర్..ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద రూ.2.5కోట్లతో ముర్రెల్ క్లస్టర్ ఏర్పాటు కానుంది. ముర్రెల్ చేప అంటే రాష్ట్ర చేప కాగా, దీనినే బొమ్మె చేపగానే కాకుండా కొరమీను, కొర్రమట్ట, మట్టగిడసగా పిలుస్తుంటారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముర్రెల్ చేపల పెంపకాన్ని చేపట్టబోతోంది. 30 ఎకరాల్లో ముర్రెల్ క్లస్టర్లో ముర్రెల్ చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ జరుగుతుంది. ముర్రెల్ క్లస్టర్తో మత్స్యకారులు, మహిళా స్వయం సహాయ సంఘాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ఓ వైపు ముర్రెల్ క్లస్టర్ మరోవైపు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటుతో మంచిర్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రానుంది. -
ఘాట్ ఏర్పాటయ్యేనా..!
కోటపల్లి: పుష్కరాల సమయంలో భక్తుల పుణ్యస్నానాలకు మండలంలో పుష్కరఘాట్ లేదు. ఇటీవల మండలంలోని పార్పల్లి ఎర్రాయిపేట గ్రామ సమీపంలోని గోదావరి నదీ తీరాన్ని అధికారులు పరిశీలించారు. కానీ ఇంతవరకు పనుల వైపు అడుగులు పడలేదు. దీంతో పుష్కరాల సమయానికి పనులు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్పల్లి నదీ తీరంలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. పార్పల్లి ఎర్రాయిపేట సమీపంలోని గోదావరి నది పుష్కరఘాట్కు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పంచకోశ ఉత్తరవాహిని గోదావరి నదీ తీరం పార్పల్లి వద్దనే ముగుస్తుంది. గోదావరి నది 63వ జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో ఏటా శివరాత్రి, శుభ కార్యక్రమాల సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. సమీపంలోనే కాలభైరవస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 15కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, 10కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉండడం గమనార్హం. పుష్కరఘాట్కు ఎంతమంది జనం వచ్చినా ఇబ్బందులు లేకుండా పార్కింగ్కు అనువైన స్థలాలు నదీ తీరంలోనే ఉన్నాయి. -
వేతన కమిటీ వేయాలి
శ్రీరాంపూర్: బొగ్గు గని కార్మికుల నూతన ఒప్పందం కోసం వేతన కమిటీ వేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆర్కే5 గనిపై కార్మికులతో మాట్లాడారు. వేతన ఒప్పంద కాల పరిమితి జూన్ 30తో ముగుస్తుందని, జూలై ఒకటి నుంచి కొత్త వేతన కాలపరిమితి అమలు కావాల్సి ఉందని తెలిపారు. ఈ వేతన ఒప్పందం కోసం ముందుగా కోల్ ఇండియా యాజమాన్యం కమిటీ వేసి వేజ్బోర్డ్ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఇప్పటికే దీని ఏర్పాటులో జాప్యం జరిగిందని, దీన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టబోతున్నామని అన్నారు. వేతన కమిటీపై తక్షణమే కోలిండియా యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు భూంపల్లి రమేష్, మేకల స్వామి, కొమ్మ బాబు, ఫిట్ కార్యదర్శి కుమ్మరి చంద్రశేఖర్, నాయకులు కుంట రాజు, తెల్ల ప్రశాంత్, అరుణ్గౌడ్, చల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రశాంతంగా డీసీసీబీ సీఈవో ఇంటర్వ్యూలు
కై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పోస్టు భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పోస్టు భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్, బ్యాంక్ ప్రత్యేకాధికారి రాజర్షి షా ఆధ్వర్యంలో టెస్కాబ్, నాబార్డు అధికారులు డీసీసీబీ బ్యాంక్లో ఇంటర్వ్యూ నిర్వహించగా ఐదుగురే హాజరయ్యారు. బ్యాంక్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అభ్యర్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతాంగానికి, సహకార సంఘాలకు వెన్నెముకగా నిలిచే డీసీసీబీ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో సీ ఈవో పాత్ర కీలకమని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం, పరిపాలనా దక్షత కలిగిన అధికారుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపా రు. పారదర్శకంగా అర్హుడిని ఎంపిక చేసి త్వరలోనే నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే రావు, నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ జాంబ్రే, చీఫ్ జనరల్ మేనేజర్ పి.మోహనయ్య తదితరులు పాల్గొన్నారు. భూ ఆక్రమణకు యత్నించిన కొడుకుపై తల్లి ఫిర్యాదునెన్నెల: మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన పెళ్లి శ్రావణ్పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తల్లి శారద పేరిట గ్రామ శివారులో ఎనిమిదెకరాల భూమి ఉంది. ఆమెకు నలుగురు కుమారులున్నారు. ఆ భూమిని పెద్ద కొడుకు శ్రావణ్ ఒక్కడే ఆక్రమించుకునేందుకు యత్నించగా తల్లి అడ్డుకుంది. దీంతో ఆమెను బెదిరించి చేనులోని పత్తి కట్టెను తొలగించి దున్నాడు. అతడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గొడవ కేసులో ఇరువురి అరెస్ట్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధి గుడిపేటలో ఇటీవల జరిగి న ఓ తగాదా కేసులో ఇరువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపేట ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న విద్యార్థులతో అదే ప్రాంతానికి చెందిన సుంకరి శ్రీకాంత్, దేవి అఖిల్ గొడవకు దిగారు. విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ చేతులతో కొట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్లందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ మాదంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 2026–28 సంవత్సరాలకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు 252, ఆర్టీ 103 ప్రకారం అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయాలని తెలిపారు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు రమేష్రెడ్డి, సిద్ధార్థ, సురేష్ కుమార్, సత్యనారాయణ, ఇమాద్ ఉద్దీన్, ప్రకాష్రెడ్డి, నవీన్కుమార్, నరేష్, సదానందం, సంతోష్, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది సంపత్కుమార్, జి.రవితేజ, సునీల్కుమార్ పాల్గొన్నారు. -
వేదం.. జీవన నాదం
బాసర: బాసరలోని శ్రీవేద భారతి పీఠం ఎంతో మందికి వేదవిద్యను అందిస్తోంది. నిత్యం ఆధ్యాత్మి క కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర సుదూర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడి వేద విద్యాలయాన్ని సందర్శిస్తున్నా రు. సనాతన ధర్మానికి మూలమైన వేద జ్ఞానాన్ని అందించే కల్పవల్లిగా బాసర వేదవిద్యాలయం వి రాజిల్లుతోంది. ఇక్కడ విద్యార్థులకు వేద తరగతులు నిర్వహిస్తూ ఉచితంగా ఆహారం, ఆశ్రయం అందిస్తోంది. వేద విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీవేదభారతి పీఠం వ్యవస్థాపకుడు వేద విద్యానందస్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వసతి, భోజన సౌకర్యం బాసరలో వేదభారతి పీఠాన్ని 2008లో స్థాపించా రు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ వేదవిద్యతో పాటు ఆధునిక విద్య (ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్)ను బోధిస్తున్నారు. కులాలకు అతీతంగా లింగబేధం లేకుండా వేద విజ్ఞానాన్ని అందించే ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. 12 ఏళ్లు పైబడిన బాలబాలికలకు వేదవిద్యను అందించే ప్రణాళికనూ రూపొందించారు. వేదవిద్య ప్రవేశపెట్టి పదోతరగతి/ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో కూడిన కోర్సులు అందుబాటులో ఉంచారు. SVBPయూట్యూబ్ చానెల్ ద్వారా వేలాదిమందికి ఆన్లైన్లో ఉచితంగా వేదవిద్యను అందిస్తున్నారు. ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్లోనూ వేదవిద్యను అందిస్తున్న ఏకైక సంస్థగా బాసర శ్రీవేదభారతి పీఠం భక్తులకు చేరువవుతోంది. ఇప్పటివరకు వేదవిద్యలో సుమారు 300మందికి శిక్షణ ఇచ్చిన ఘనత వేద విద్యానందస్వామీజీకి దక్కింది. నిర్వహించే కార్యక్రమాలు వేద విద్యాలయం ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం, వేదవిద్యను పెంపొందించేలా ప్రణాళికలు రూపొందిస్తూనే నిరుపేదలకూ ఉచిత విద్యావకాశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు నిత్యం ఉదయం ప్రార్థన, సూర్యనమస్కారాలు, యోగా, వేద అధ్యయనం, వీణ, గిటా ర్, వయోలిన్ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ శనివారం సాయంత్రం 5.30నుంచి 7.30గంటల వరకు రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోపూజ, గోహారతిని స్వామీజీ సహకారంతో రుషికన్యలు, రుషి పుత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేదవిద్యాలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 26న అర్హులైన విద్యార్థులకు ఉపనయన కార్యక్రమం ని ర్వహిస్తున్నారు. కులాలకు అతీతంగా 18–25ఏళ్లవారికి వేదమంత్రాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, పూజా హోమాది క్రతువులు తదితర కార్యక్రమాలపై మూడేళ్ల కాల వ్యవధితో శిక్షణ ఇస్తున్నారు. ఏడాది కిందటివరకు సుమారు తొమ్మిదేళ్లు గోదావరినది తీరంలో నిరంతరాయంగా ‘గోదావరికి నిత్యహారతి’ పేరిట నదీమ తల్లికి హారతులిచ్చి శ్రీవేద భారతి పీఠం పలువురు ప్రముఖుల మన్ననలు పొందింది. శ్రీవేద భారతి పీఠం వ్యవస్థాపకుడు శ్రీవేద విద్యానందస్వామీజీ నేతృత్వంలో గోపూజ, త్రినాథ వ్రతం, గోహారతులు ఇస్తూ వేదవిద్యతోపాటు గోసంపదకు విలువలనిచ్చే ఏకై క సంస్థగా వేదభారతి పీఠాన్ని భక్తులు కొనియాడుతున్నారు. ఆలయాలు క్షేత్రాల వద్ద ఇలాంటి ఆశ్రమాలు, మఠాలు మరిన్ని వృద్ధిలోకి వస్తే ఆలయ క్షేత్రాలు వైదికంగా మరింత అభివృద్ధి చెందుతాయని భక్తులు భావిస్తున్నారు. తొమ్మిదేళ్లు నిత్య గోదావరి హారతి -
వెంచర్లో వివాదం...
● గోడ కూల్చివేసిన బాధితులు లక్సెట్టిపేట: మండలంలోని సూరారంలో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన వెంచర్లో వివాదం నెలకొంది. బాధితులు గోడ కూల్చడంతో సమస్య తీవ్రమైంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఓ ప్రైవేటు వెంచర్ నిర్వాహకులు 2023లో మూడెకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. మొత్తం 53 ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపారు. వ్యాపారుల్లో ఒక భాగస్వామి వెంచర్లో రహదారులకోసం తీసిన సుమారు ఎకరం భూమిని ఒకరికి విక్రయించాడు. సద రు కొనుగోలు దారుడు అట్టి ప్రదేశం చుట్టూ గోడ నిర్మాణం చేసుకున్నాడు. దీంతో అప్పటి వరకు కొనుగోలు చేసిన 30 మంది బాధితులు గురువారం గోడలు కూల్చివేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్ను వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం రాలేద ని, దీనిపై పూర్తి విచారణ చేపడుతామన్నారు. మందమర్రి వాసులకు డాక్టరేట్మందమర్రిరూరల్: మందమర్రి మండలం సారంగపల్లి గ్రామానికి చెందిన రామగిరి శేఖర్, మందమర్రిలోని దొరలబంగ్లా ప్రాంతా నికి చెందిన బాసాని మంజుల డాక్టరేట్ సాధించారు. సారంగపల్లికి చెందిన రామగిరి లింగ య్య, రత్న దంపతుల కుమారుడు శేఖర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరే ట్ పొందాడు. సింగరేణిలో కోల్కట్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజలింగు కుమార్తె బాసాని మంజుల ఓయూ విశ్వ విద్యాలయంలో ‘నేటి విద్యావ్యవస్థ, విద్యార్థులలో విలువలను పెంపొందించడంలో దాని పాత్ర’ అంశంపై పరిశోధనలు నిర్వహించి డాక్టరేట్ అందుకున్నారు. ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ స మీపంలో గురువారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఘటనలో మందమర్రి మండలం బొక్కలగుట్టకు చెందిన చిప్పరి శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక పోలీసులను వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని, బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదు రాలేదన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం అనుభవంలేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
ఆర్టీసీలో సమాఖ్యల అద్దెబస్లు
పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా చేయూతనందిస్తోంది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు బస్సులను మంజూరు చేసింది. వాటిని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించి ప్రతీనెల వచ్చిన ఆదాయాన్ని మండల సమాఖ్యల ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో 11 మండల సమాఖ్యలకు అద్దె బస్లు మంజూరుకాగా వాటిని పెద్దపల్లి జిల్లా మంఽఽథని డిపోకు 09, మంచిర్యాల, సిరిసిల్ల డిపోలకు ఒక్కో బస్సు చొప్పున కేటాయించారు. బస్సుల రిజిస్ట్రేషన్లు, హైపోతికేషన్ పూర్తి చేస్తున్నారు. మండల సమాఖ్యలకు ప్రభుత్వం విడుదల చేసే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తెలిపారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.36 లక్షలు, నెలవారీ అద్దె రూ.69,468. ఆర్టీసీ, పేదరిక నిర్మూలన సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ప్రకారం ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున 16 బస్సులకు రూ.5 కోట్ల 70 లక్షలు ఆర్టిసీకి చెల్లించారు. ఒక్కో బస్సుకు 7 సంవత్సరాల్లో 84 వాయిదాలలో మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. 84 వాయిదాలు పూర్తయిన తర్వాత హైపోతికేషన్ రద్దు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా జిల్లాలోని జన్నారం, కన్నెపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, హజీపూర్, దండేపల్లి, మందమర్రి, కోటపల్లి, చెన్నూర్ భీమారం, జైపూర్ మండలాల మండల సమాఖ్యలకు బస్లు మంజూరయ్యయి, త్వరలోనే ఆయా డిపోలకు కేటాయించిన బస్లను డిపోల పరిధిలోని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జిల్లాలో 16 మండలాలు ఉండగా 16 మండల సమాఖ్యలకు బస్లు ఇవ్వాలని నిర్ణియించింది. కానీ మొదటి విడతగా 11 బస్లు మంజూరు చేసింది. మరో ఐదు మండలాలు లక్సెట్టిపేట, భీమిని, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండల సమాఖ్యలకు కూడా బస్సులు మంజూరవుతాయని అధికారులు తెలిపారు. ప్రక్రియ పూర్తి.. జిల్లాలో 16 మండల సమాఖ్యలకు సెర్ప్ ద్వారా బస్సుల మంజూరు ప్రక్రియ పూర్తయింది. బస్ల హైపోతికేషన్, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆయా డిపోలకు కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం డిపోలకు బస్లు రాలేదు. డిపోలకు బస్సులు వచ్చిన తర్వాత నిర్ణీత రూట్లలో తిరుగుతాయి. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
వనంలో వరాహాల గుంపు
దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజీ పరిధిలో గల తానిమడుగు బీట్లో అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ సోలార్ బోర్వెల్ ఏర్పాటు చేసింది. బుధవారం రాత్రి నీటి కుంట వద్ద అరుదైన చిత్రం సీసీకెమెరాకు చిక్కింది. అడవి పందులు వరుసక్రమంలో సోలార్ బోర్వెల్ వద్ద ఉన్న నీటికుంట వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకున్నాయి. ఒకదానికి ఒకటి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణగా వచ్చి నీళ్లు తాగుతున్న వాటి సహజ ప్రవర్తన చిత్రంలో ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు. – దండేపల్లి -
సరదా.. కారాదు విషాదం
బజార్హత్నూర్: పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చయంటే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈనెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పిల్లలు వేసవి సెలవుల్లో తోటి విద్యార్థులతో, మిత్రులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్తుంటారు. సరదాకోసం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతుంటారు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే చదువు, ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పిల్లలు ఇంటి ఆవరణలో, నీడ ప్రదేశంలో ఆడుకునేలా, చదువుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. బావులు, చెరువులకు దూరం చిన్నారుల ఈత సరదా వారి ప్రాణాలను బలిగొనే అవకాశం ఉంది. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి సరదాగా చెరువులు, నీటి కుంటలు, బావుల్లో ఈతకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఈతకు వెళ్తే జరిగే ప్రమాదాల గురించి తల్లిదండ్రులు పిల్లల కు వివరించి చెప్పాలి. గతంలో సిరికొండ మండలంలోని ముత్యంపేటకు చెందిన ఇద్దరు చిన్నారులు ఫారంఫాండ్ గుంతలో జారిపడి మృతి చెందా రు. బోథ్ మండలంలోని సాకెరా వద్ద ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు పిల్లలకు గుర్తు చేయాలి. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు వారి కదలికలను గమనిస్తూ ఉండాలి. ఎండలో ఆడితే ప్రాణాలకే ముప్పు వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువగా సామూహిక క్రికెట్, డిల్లిదండా, గోలిలాట, కొమ్మకొచ్చి ఆటలతో పాటు పొలాల వెంట తిరుగుతూ పండ్ల సేకరణ చేస్తుంటారు. ఎండ వేడిమికి డీహైడ్రేషన్ అయి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. చెస్, క్యారంబోర్డు వంటి ఆటలు పిల్లల మేదస్సును పెంపొందిస్తాయి. సైకిళ్ళంటే మోజు సైకిళ్ళంటే పిల్లలకు మోజు ఎక్కువ. వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి సైకిళ్లపై పండ్ల తోటలు, చె రువు గట్లకు, మైదానాలకు వెళ్తుంటారు. దీంతో రో డ్లపై వెళ్లేటప్పడుప్రమాదాలబారిన పడుతుంటారు. దృశ్య, శ్రవణ పరికరాలకు దూరంగా ఉంచాలి విద్యార్థులు ఇంటివద్ద ఎక్కువగా టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేమ్లు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతారు. దీంతో దృష్టి లోపం తలెత్తే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు వాటిని ఎక్కువ చూడనీయకుండా జాగ్రత్త పడాలి. -
జాతర్లలో కూలీ..
బజార్హత్నూర్: విద్యుత్ షాక్తో కూలీ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్శాఖ సబ్ ఇంజినీర్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు నార్నూర్ మండలంలోని గుంజాలకు చెందిన కాంట్రాక్ట్ కూలీ సోయం గంగాధర్ (26) ఈ నెల 21న బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల ఫీడర్ విద్యుత్ లైన్ మరమ్మతు పనుల్లో పాల్గొన్నాడు. అందులో భాగంగా జాతర్ల ఫీడర్ లైన్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ అతను జాతర్ల ఫీడర్ 11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కాల్సి ఉండగా పొరపాటున మిషన్ భగీరథ 11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కాడు. విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై కిందపడ్డాడు. వెంటనే ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వడదెబ్బతో వ్యక్తి.. భైంసాటౌన్: పట్టణంలోని ఏఎంసీ యార్డులో దడువా యిగా పనిచేస్తున్న పాపేశ్వర్ (50) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన పాపేశ్వర్ దడువాయిగా పనిచేస్తూ, ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం రోజంతా ఎండలో పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం తోటి దడువాయిలు ముందుగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు ..నేరడిగొండ: బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా, కుమార్తె గాయాలతో బతికి బయటపడింది. ఎస్సై ఇమ్రాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేపల్లి గ్రామానికి చెందిన గోడం జ్యోతిరామ్ (48) కుమార్తె సారులత బుగ్గారం(బి) గ్రామంలోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు జ్యోతిరామ్ బైక్పై బుగ్గారం వెళ్లాడు. తిరుగుప్రయాణంలో రోల్మామడ వద్ద గల వంతెనను దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొట్టింది. జ్యోతిరామ్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. సారులత స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారమే హత్యాయత్నంమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని పథకం ప్రకారమే హత్య చేసేందుకు ఓ వర్గం మరో వర్గంపై దాడికి పాల్పడిన ఘటన గురువారం సంచలనం సృష్టించింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు సీసీసీ రాంనగర్కు చెందిన పనాస రాజేందర్, అన్వేష్, గొర్రె ప్రసాద్ మండి బిర్యాని తినేందుకు బుధవారం రాత్రి సుమారు 10 గంటలకు మంచిర్యాలకు వచ్చారు. అక్కడ వారి పాత స్నేహితులు దీపక్, బిట్టు, శ్యామ్ కలవడంతో అందరూ కలిసి బార్కు వెళ్లి మద్యం సేవించారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకున్న దీపక్ తన స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. బయటకు వెళ్లిన తర్వాత రాజేందర్, ప్రసాద్, అన్వేష్పై ప్రథకం ప్రకారం కర్రలు, బీరు సీసాలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రాజేందర్, అన్వేష్కు తీవ్ర గాయాలుకాగా ప్రసాద్ స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న పో లీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల ను ఆస్పత్రికి తరలించారు. రాజేందర్ తండ్రి చిన్న య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యామ్, దీపక్, బిట్టు, నితిన్, రంజిత్, భరత్, మరి కొందరిపై కేసు నమె దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఒకరిపై హత్యాయత్నంనర్సాపూర్ (జి): మండలంలోని టెంబరేణిలో ఒకరిపై హత్యాయత్నం కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. టెంబరేణికి చెందిన ధనుసుల మధును అదే గ్రామానికి చెందిన దాసరి శంకర్ బుధవారం సాయంత్రం మందలించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న మధు రాత్రి దాసరి శంకర్ ఇంటికి వెళ్లి గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసిన పోలీసులు హత్యాయత్నానికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
జాతర చూసొద్దాం..!
లక్సెట్టిపేట: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్ద చర్చిగా లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి గుర్తింపు ఉంది. జిల్లాలోని చారిత్రక కట్టాడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు చర్చిని ముస్తాబు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆంగ్లేయుల కాలంలో నిర్మాణం.. 1920లో ఇంగ్లాండ్కు చెందిన రెవసీజీ అర్లి దొర లక్సెట్టిపేటకు వచ్చాడు. ఏసుక్రీస్తు ఆరాధకుడు కావడంతో ఇక్కడ చర్చి నిర్మించాలనుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్ళు తెప్పించాడు. మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించాడు. లక్సెట్టిపేటకు సమీపంలో టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించాడు. వేసవిలో వడదెబ్బకు గురికావడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివహెచ్బర్డ్ లక్సెట్టిపేటకు వచ్చి చర్చి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఇక్కడికి మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించారు. 86 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఘనంగా ఏర్పాట్లు జాతర ఏర్పాట్లను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్పాల్ చూసుకుంటున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందర్నీ ఆహ్వానిస్తారు. సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజా భజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తువులు ర్యాలీగా చర్చి వద్దకు వస్తారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు ఆలపిస్తారు. 26న ఉదయం నుంచి చర్చిలో కీర్తనలు ఆలపిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
జైపూర్: మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఒకరిని కొట్టి చంపిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయంలో సీఐ నవీన్కుమార్, ఎస్సైలు రాజశేఖర్, రాజేందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. జైపూర్ మండలం బెజ్జాలకు చెందిన గుమ్ముల రాజం (56) తమ కుటుంబానికి మంత్రాలు చేయడం మూలంగా ఆస్పత్రుల పాలవుతున్నామని గ్రామానికి చెందిన గుమ్ము ల వెంకటి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథ కం ప్రకారం ఈ నెల 21న గుమ్ముల తిరుపతి, వెంకటి, నర్సమ్మ, రాజబాపుతో కలిసి కొట్టిచంపారు. ఎవరికీ అనుమానం రావద్దని మృతదేహాన్ని పార్వతిబ్యారేజి కాల్వలో పడేశారు. గురువారం సీఐ నవీన్కుమార్ ఆధ్వర్యంలో షెట్పల్లి సమీపంలో నిందితుల ను పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాయి, కర్ర, బైక్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
ఎస్టీపీపీలో సీఐఎస్ఎఫ్ డీఐజీ పర్యటన
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును గురువారం సీఐఎస్ఎఫ్ డీఐజీ జీ.రాఘవేంద్రకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్టీపీపీ జీఎం, వోఅండ్ఎం చీఫ్ మదన్మోహన్ ఆయనకు పూలమొక్క అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం డీఐజీ సీఐఎస్ఎఫ్ యూనిట్ను పరిశీలించా రు. ప్లాంటులో భద్రతపరంగా తీసుకుంటున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. ప్లాంటు ను మరింత సురక్షితంగా ఉంచడానికి, తగిన భద్రతపరమైన చర్యలు తీసుకోవడానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ చంఛల్ సర్కార్, డీజీఎం పర్సనల్ కిరణ్బాబు, ఎస్వోటు జీఎం శంకర్, అసిస్టెంట్ కమాండెంట్లు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పొన్నారి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలి
తాంసి: ఐదోతరగతి చదువుతూనే గేయాలు రచించిన పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పొన్నారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రచించిన మోదుగ మొగ్గలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయురాలు సరిత సహకారంతో విద్యార్థులు స్థానిక పండుగలు, తదితర వాటిపై గేయాలను రచించడం అభినందనీయమన్నారు. పాఠశాల హెచ్ఎం సుజాత, డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, సర్పంచ్ పొచ్చన్న, రచయిత ఉదారి నారాయణ పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి
ఆదిలాబాద్రూరల్: విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన అనిల్ పాటిల్ (35)భీంపూర్ మండలంలో అసిస్టెంట్ లైన్మెన్గా చేస్తున్నాడు. బుధవారం భీంపూర్, భోరజ్ మండలాలకు సరఫరా అయ్యే 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గురువారం మరమ్మతులు చేసేందుకు సంబంధిత అధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. అనిల్ పాటిల్ స్తంభంపైకి ఎక్కాడు. అయితే అక్కడ మూడు ప్రాంతాలకు సంబంధించిన 33 కేవీ ఫీడర్లు ఒకే చోట ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఉన్న విషయాన్ని మృతుడు గమనించకపోవడంతో షాక్కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మరో ఉద్యోగి చంద్రశేఖర్కు సైతం గాయాలయ్యాయి. -
ఎక్కడికుప్పలు అక్కడే.. వానొస్తే తిప్పలే!
దండేపల్లి: మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటి వరకు 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఎక్కడ కూడా కాంటా వేయడం లేదు. మిల్లుల ట్యాగింగ్ ఇవ్వకపోవడంతో, కాంటాలు వేయడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల సమీపంలో, రోడ్ల పక్కన ధాన్యాన్ని ఆరబోయగా, మరికొందరు కుప్పలుగా పోసి ఉంచారు. ఉన్నట్టుండి గురువారం అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. రైతులు గుబులు చెంది ఆరబోసిన ధాన్యాన్ని కుప్పచేసి కవర్లు కప్పారు. అధికారులు స్పందించి వెంటనే మిల్లుల ట్యాగింగ్ ఇచ్చి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించి, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం లక్ష్మీని సంప్రదించగా, మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, మిల్లుల ట్యాగింగ్ ఇవ్వలేదు. దీంతో ఎక్కడ కూడా కాంటా వేయడం లేదు. ట్యాగింగ్ వచ్చిన వెంటనే కాంటాలు ప్రారంభించి, ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని చెప్పారు. -
● ధరణి నుంచి ప్రస్తుత భూ భారతి దాక? ● ‘సాక్షి’ కథనంతో సేల్డీడ్ ఆప్షన్లో మోసం వెలుగులోకి ● నెన్నెల మండలంలో మొదలైన విచారణ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సిటిజన్ లాగిన్లో సేల్డీడ్లో ఉన్న ఆప్షన్ను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెరలేపిన తీరుపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఖజానాకు గండి కొట్టారు’ కథనం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. చాలామంది అధికారులు ఈ తరహా మోసంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా మోసంపై రెవెన్యూ అధికారులతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. ఇలాంటి మోసం ఇప్పటివరకు ఎక్కడా వెలుగులోకి రాకపోవడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి సబ్డివిజన్లో సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్తో కలసి బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి, తాండూరు మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. భూ భారతి పోర్టల్లో దరఖాస్తులను పరిశీలించారు. నెన్నెల మండలంలో ఎప్పటి సేల్డీడ్ అగ్రిమెంట్ విత్ పొసిషన్, సేల్ డీడ్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసిషన్ ఆప్షన్లలో తేడా చూపిస్తూ.. సర్కారుకు స్టాంపు డ్యూటీ తగ్గించేలా చేసి, మిగతా మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకున్న తీరుపై విచారణ మొదలైంది. ఈ ఏడాదిలో 31డాక్యుమెంట్లలో ఈ తరహాలో సేల్ విత్ పొసిషన్ ఆప్షన్ ఎంచుకున్నారు. వీటిని ఒక్కొక్కటిగా అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉంది. అంతకుముందు సైతం ఈ ఆప్షన్తో లావాదేవీలు జరిగాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పట్టాదారులు, కొనుగోలుదార్లకు ఈ ఆప్షన్పై అవగాహన లేకపోవడం, మరోవైపు ఎంత మొత్తంలో చలానా చెల్లించాము? ఎంత మొత్తానికి ఈ చలానా వచ్చింది? అంతేకాక రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తహసీల్దార్ రివర్స్ ఎండార్స్మెంట్ పరిశీలన లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. ఈ క్రమంలో జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి మోసాలు జరిగాయా? అని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. అయితే ధరణి నుంచి ప్రస్తుత భూ భారతి వరకు ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.వివరాలన్నీ పంపించాలినెన్నెల: భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి వెంటనే లావాదేవీల వివరాలన్నీ పంపించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తహసీల్దార్ శ్రీనివాస్ను ఆదేశించారు. గురువారం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి పోర్టల్లో లావాదేవీలు పరిశీలించారు. 2021 నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. స్లాట్ బుకింగ్ చేసిన వ్యక్తుల వద్ద అవకతవకలు జరిగినట్లు గమనించారు. స్టాంప్ డ్యూటీపై తహసీల్దార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2021 నుంచి జరిగిన సేల్ డీడ్ లావాదేవీల వివరాలన్నీ తనకు పంపించాలని ఆదేశించారు. వివిధ రకాల భూ సమస్యలపై అర్జీదారులు అందించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా పరిష్కరించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ భారతి పరిష్కార ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు.నెన్నెల మండలంలో గత కొంతకాలం ఓ వ్యక్తి సిటిజన్ లాగిన్తో భూ లావాదేవీల్లో ఆరితేరి గత కొంతకాలంగా రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించి రూ.లక్షలు అక్రమంగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే రెవెన్యూ అధికారులు స్లాట్ బుకింగ్ కోసం సిటిజన్ లాగిన్లో ఎవరి నుంచి అప్లికేషన్ జనరేట్ అయింది? ఎందుకు రెండు సార్లు దరఖాస్తును మార్చుతున్నారు? రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు, కొనుగోలుదారులు మధ్యవర్తులకు చలానా కోసం ఎంత మొత్తం చెల్లించారు? అలాగే మొదట దరఖాస్తులో చూపించిన మొత్తం, చివరకు ఈ చలానా వివరాల్లో కనిపిస్తున్న మొత్తానికి ఎందుకు తేడా వస్తోందనే కోణాల్లో పరిశీలన చేస్తే అసలు బాగోతం బయటపడనుంది.అక్రమాలకు నెలవు -
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీ పూర్): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని, పౌష్టికాహారంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించేందుకే పోషణ్ పక్వాడ్ను ఈ నెల 9నుంచి 23వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్ ముగింపు కార్యక్రమం, 48వ డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు శ్రీమంతాలు చేసి, అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ, పౌష్టికాహారం ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో చందన, సూపర్వైజర్లు జ్యోతి, సరిత, పోషణ్ అభియాన్ రజిత, శ్యామల, కార్పొరేటర్ పెంట రజిత పాల్గొన్నారు. -
‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర బయటపడింది’
మంచిర్యాలటౌన్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డిలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై చేసిన కుట్ర, అసత్య ప్రచారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బయటపడ్డాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రూ.94 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పొంతన లేని ఆరోపణలు చేశారని అన్నారు. మేడిగడ్డ వద్ద కొంత భాగం కుంగిపోతే మరమ్మతు చేసేందుకు అవకాశం ఉన్నా చేయలేదని, బీఆర్ఎస్ను బదానం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని అన్నారు. ఇప్పటికై నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజాపాలన దిశగా ప్రభుత్వాన్ని నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, టీబీజీఎకేఎస్ నాయకుడు సురేందర్రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, పెట్టెం లక్ష్మణ్, ఎర్రం తిరుపతి నాయకులు పాల్గొన్నారు. -
బొగ్గు రవాణా పెంచాలి
● డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు శ్రీరాంపూర్/జైపూర్: రాబోయే మూడు నెలలు కంపెనీ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పెరుగనుందని, అందుకు అనుగుణంగా రవాణా పెంచాలని సింగరేణి డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ సీహెచ్పీ, జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీని సందర్శించారు. ఐకే–ఓసీపీలో క్వారీ, పని ప్రాంతాలు పరిశీలించారు. ఓబీ తొ లగింపు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల పనితీరు ఇతర అంశాలపై స్వయంగా పరిశీలించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి పెంపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీరోజు 1200టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5వేల టన్నుల ఓబీ తొలగించాలని ఆదేశించారు. శ్రీరాంపూర్ సీహెచ్పీలో ఏరియా ఇన్చార్జి జీఎం కే.రాజేందర్తో కలిసి బొగ్గు రవాణాపై సమీక్షించారు. బొగ్గు రవాణా కోసం రైల్వేశాఖ కేటాయించిన రేకులు పూర్తిగా నింపి పంపించాలని, నిర్ణీత సమయానికి నింపి పంపించకుంటే జరిమానా భరించాల్సి వస్తుందని తెలిపారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధనే లక్ష్యంగా అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. మ్యాన్ పవర్, మెటీరియల్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ సీహెచ్పీ ఇన్చార్జీ చంద్రలింగం, మేనేజర్ ఆపరేషన్స్ శంకర్, రామకృష్ణ, మహేశ్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల హామీలు నెరవేర్చాలి
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాలలో ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా చేపట్టిన సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కస్తూ రి నాగరాజ్, నాయకులు అమిరిశెట్టి రాజ్కుమార్, కర్రె లచ్చన్న అశోక్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
నిషేధం..‘పత్తి’మాటే..!
● జిల్లాకు చేరిన నిషేధిత విత్తనాలు! ● ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పట్టివేత ● చర్యలు తీసుకుంటున్నా మారని తీరుమంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి: నిషేధిత పత్తి విత్తనం జిల్లాకు చేరుతోంది. ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో అక్రమార్కులు క్వింటాళ్ల కొద్దీ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఖరీఫ్ ఆరంభం జూన్లో ప్రభుత్వం పటిష్ట నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై కేసులు నమోదు చేసింది. దీంతో ఈ ఏడాది అక్రమార్కులు ముందస్తుగానే సరఫరా చేస్తే తనిఖీలు ఉండవని భావించి దందాకు తెరతీసినట్లు తెలుస్తోంది. లూజు విత్తనాలను కిలోకు రూ.2,600 నుంచి రూ.3వేల చొప్పున రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో రైతులు వేసవి దుక్కులు దున్ని ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ఏటా ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాల నివారణకు చర్యలు చేపడుతున్నా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో గైసిల్ విత్తనంగా పేరుగాంచిన గుర్తింపు లేని పత్తి విత్తన దందా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి అక్రమార్కులు విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నెల 16న తాండూర్ మండలం బోయపల్లి బోర్డు వద్ద పోలీసులు 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిపై ఇప్పటికే విత్తనాలు సరఫరా చేసినందుకు పీడీ యాక్టు నమోదై ఉండడం గమనార్హం. గత మంగళవారం మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ తీరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. 50కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జిల్లాలో 14 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని 17 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్ చేశారు. కలుపు మందు పిచికారీ చేసినా ఎలాంటి నష్టం ఉండదని, కలుపు నివారణకు ఇబ్బంది రాదని, బుగ్గ పెద్దగా వస్తుందని మాయమాటలు చెబుతూ రైతులకు నిషేధిత విత్తనాలు అంటగడుతున్నారు. ఇలా రైతులు ఏటా మోసపోతున్నా కొందరు బయటకు చెప్పుకుంటే కేసులు నమోదవుతాయని మిన్నకుండిపోతున్నారు. నిషేధిత విత్తనాలు సాగు చేస్తే కలుపు నియంత్రణకు ఉపయోగించే గ్లైపోసెట్ గడ్డి నివారణ మందు వాడకం కూడా పెరిగిపోతుంది. దీని ద్వారా పర్యావరణం, భూసారం దెబ్బతినడంతోపాటు రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విత్తనాలను నిషేధించాయి. బీటీ–3 రైతుల చెంతకు చేరకుండా చూసేందుకు సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా సాగు ఆగుతుందా? అనేది అనుమానమే. గ్రామాల్లో బడా నేతలు విత్తనాలు సరఫరా చేసే ఏజెంట్లుగా అవతారం ఎత్తడమే కారణం. నిషేధిత విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. పెద్ద మొత్తంలో ఎవరు సరఫరా చేశారు.. అనే దానిపై ఆరా తీసి కఠినచర్యలు తీసుకుంటేనే గానీ దందా ఆగేలా లేదు. కఠినచర్యలు తప్పవునకిలీ విత్తనాలు అరికట్టడానికి టాస్క్ఫోర్స్ టీంలు ఏర్పాటు చేశాం. రైతుల వద్దకు చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నాం. పోలీస్, వ్యవసాయశాఖల అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ గుర్తింపు లేని విత్తనాలు సాగు చేస్తే రైతులు నష్టపోతారు. భూసారం కూడా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. రైతులతో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠినచర్యలు తప్పవు. – సురేఖ, జిల్లా వ్యవసాయాధికారికొనేళ్లుగా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 1.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది. గతంలో సాధారణ పత్తి విత్తనాలు సాగు చేసిన రైతులు దిగుబడి పెరిగేందుకు బీటీ రకం విత్తనాల వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఈ రకం విత్తనాలు సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు చీడపీడల వ్యాప్తి పెరిగింది. దీనిని తట్టుకునేందుకు బీటీ–2 రకం విత్తనం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ విత్తనాలు సాగు చేయగా పంటను గులాబీ రంగు పురుగు ఆశించి రైతులకు కొంత మేర నష్టం చేసింది. దీంతో రైతులు ఎక్కువ దిగుబడి కోసం అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తుండడంతో పత్తి పంటలో కలుపు కూడా అధికంగా పెరుగుతోంది. కలుపు నివారణ సమస్యను అధిగమించేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంట చేతికి వచ్చే వరకు మూడుసార్లు కలుపు నివారించాల్సి ఉంటుంది. కూలీల కొరతతోపాటు ఖర్చూ పెరిగిపోయింది. దీంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా బీటీ–3 రకం కలుపు మందు(గ్లైపొసెట్)ను తట్టుకునే సామర్థ్యం ఉన్న విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. రైతులు ఐదారేళ్లుగా ఈ విత్తనాలవైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పత్తి సాగే అధికంఅవగాహన కల్పిస్తేనే మేలు -
తాగునీటి సమస్య లేకుండా చర్యలు
చెన్నూర్/చెన్నూర్రూరల్: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. మండలంలోని సుందరసాల గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. గ్రామాన్ని పీఎంఏజేఏవై పథకంలో ఎంపిక చేసి చేపట్టబోయే పనులపై తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాలింతలు, చిన్నారులు, తల్లులకు ఇచ్చే పోషక ఆహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వర్రావు, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజ్మత్అలి, సర్పంచ్ గుండ మంజుల, పంచాయతీ కార్యదర్శి వంశీధర్ పాల్గొన్నారు. కాగా, చెన్నూర్ జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన లేఅవుట్ స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ, పట్టణ ప్రణాళికాధికారి సంపత్తో కలిసి సందర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూమి అభివృద్ధి చేయాలని సూచించారు. -
వేసవి సెలవులు వచ్చేశాయ్
మంచిర్యాలఅర్బన్: పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ నెల 24 నుంచి సెలవుల ప్రకటనతో వసతిగృహ విద్యాలయాల్లోని విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాలోని 684 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 18 కస్తూర్భా, 5 ఆదర్శ పాఠశాలలు, 95 గురుకులాల్లో 58,386 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 18న పరీక్షలు ముగియడంతో గురువారం ప్రోగ్రెస్ రిపోర్టు అందజేశారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చాలామంది ఆటోలు, ఇతర వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్లారు. -
భైంసాలో వైద్యుడి హఠాన్మరణం
భైంసాటౌన్: పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, నర్సాపూర్(జి) సీహెచ్సీ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పని చేసే జీడీ సురేందర్(50) బుధవా రం గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని తన ప్రైవేట్ ఆస్పత్రి లో బుధవారం విధులు నిర్వర్తిస్తుండగానే ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే నిర్మల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పేద కుటుంబం నుంచి.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని కిసాన్దాస్పేట కాలనీకి చెందిన జీడి సాయిలు–పోశవ్వ దంపతుల కుమారుడైన జీడి సురేందర్ పేద కుటుంబానికి చెందినవారు. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్లో మెడిసిన్ చదువుతుండగా.. చిన్న కుమార్తె ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆయన హఠాన్మరణంపై వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
పుస్తకం.. మన నేస్తం!
నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాహితీ రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరోసారి చాటుకుంటోంది. గిరిజన సంస్కృతి, జానపద సంపద, సా మాజిక అంశాలను అక్షరాల్లో అల్లిన ఈ నేల ఎన్నో రచయితలను అందించి ‘సాహితీ సౌరభాల నిలయం’గా పేరు తెచ్చుకుంది. నేడు పుస్తకాన్ని మొబైల్ ఫోన్ కబళించి వేస్తుందన్న చేదు నిజం బాధిస్తున్నా ఇప్పటికీ పుస్తకాలపై మక్కువ చూపుతున్న వారెందరో ఉన్నారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తకాలపై అభిరుచి పెంపొందించే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు, సాహితీనిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సాహితీ పురోగమనం.. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రచయితలు తమ పుస్తకాల ద్వారా తెలుగు సాహిత్యంలో ముద్రవేశారు. జానపద గేయాలు, కవితా సంకలనాలు, కథా సంపుటాలు, చరిత్రాత్మక గ్రంథాలు వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు వెలువరించి పాఠకులను ఆకట్టుకుంటున్నారు. స్థానిక భాషా మాధుర్యాన్ని కాపాడుతూ, ఆధునిక భావజాలాన్ని కలగలిపి సృజనాత్మకతకు కొత్త దిశ చూపుతున్నారు. సాహిత్యానికి గుర్తింపు.. ఈ ప్రాంతం సంస్కృతికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. గోండు, కొలాం, లంబాడీ వంటి గిరిజన తెగల జీవన విధానాలు, వారి పండుగలు, సంప్రదాయాలు రచయితల కలంతో పుస్తకాల రూపంలో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కేవలం సాహిత్యం మాత్రమే కాదు. ఒక సంస్కతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. విద్యార్థుల్లో పుస్తకాలపై ఆసక్తి పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పాఠశాలలో రీడింగ్ కార్నర్, లైబ్రరీలను విద్యాశాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. సామల సదాశివ, గూడ అంజయ్య వంటి ప్రముఖుల నుంచి నేటి యువతరం రచయితల వరకు సాహితీ ప్రస్థానం కొనసాగుతోంది. జిల్లా నుంచి వెలువరించిన పుస్తకాలెన్నో గ్రంథాలయాలు, సాహితీవిపణిలో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, డిజి టల్ మీడియా విస్తరించినా పుస్తకాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఆన్లైన్ వేదికల ద్వారా స్థానిక రచయితల పుస్తకాలు మరింత విస్తృతంగా పాఠకులకు చేరుతున్నాయి. యువత కూడా రచన వైపు మొగ్గు చూపుతూ కొత్త సాహిత్యాన్ని సృష్టిస్తోంది.బాల సాహితీ ‘అంకురాలు’ వీరు.. వీరి వయసు చూస్తే 15 సంవత్సరాల లోపు. కానీ ఇప్పటికే వీరు రెండు పుస్తకాలను రచించి ప్రచురణ కూడా పూర్తి చేసుకుని సాహితీ విపణిలో విడుదల చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6 నుంచి పదో తరగతి విద్యార్థులు అంకురాలు పేరిట ఇప్పటికే రెండు కథల సంపుటిలను విడుదల చేశారు అంకురాలు –1, అంకురాలు –2 పేరిట వీరు విడుదల చేసిన కథల సంపుటి పుస్తకాలు పలువురు సాహితీవేత్తల ప్రశంసలు, పురస్కారాలు అందుకోవడం విశేషం. వీరికి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడు కొండూరు పోతన్న మార్గదర్శనం చేశారు. విద్యార్థులు స్వయంగా వారు చూసిన సామాజిక నేపథ్యాలను, గ్రామీణజీవన విధానాలను ఇతివృత్తంగా తీసుకొని వారు గ్రహించిన అంశాల ఆధారంగా కథలు రాశారు. దాదాపు 29 మంది విద్యార్థులు 30 కథలతో సంపుటిని విడుదల చేయగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, డీఈవో దర్శనం భోజన్న తదితరులు ప్రశంసించారు. -
ఇంట్లోనే గ్రంథాలయం..
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ నజీర్ఖాన్ అటవీ శాఖలో డిప్యూటీ రేంజ్ అధికారిగా సారంగాపూర్లో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పఠనాభిరుచి ఎక్కువ. ఇంట్లోనే ఓ ప్రత్యేకగది కేటాయించి ఒక చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులు, బంధువులు ఎవరు వచ్చినా వారికి ఓ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. బుక్ ఫెయిర్ ఎక్కడ జరిగిన వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేస్తారు. గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలను తెలిపే లిస్టు, దానికి తోడు ప్రతీ పుస్తకానికి ఓ సీరియల్ నంబర్ ఏర్పరచుకొని ప్రత్యేకంగా రబ్బర్ స్టాంపు తయారు చేసుకున్నారు. ఇలా తన వద్ద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి.? వాటి క్రమ సంఖ్య ఎంత అనే గణాంకాలు ఉన్నాయంటే ఆయనకు పుస్తకాల పట్ల ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
జేఈఈ అడ్వాన్స్కు సీవోఈ విద్యార్థుల ఎంపిక
బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమం బెల్లంపల్లి బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీవోఈ) కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటి అడ్వాన్స్కు అర్హత సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 33 మంది జేఈఈ పరీక్షకు హాజరు కాగా 15 మంది మెరుగైన పర్సంటైల్తో అడ్వాన్స్కు ఎంపికయ్యారు. మైలారపు విశ్వతేజ, డౌనే ఆదర్శ్, గోదారి అంజన్న, రాంటెంకి గిరిధర్, దుర్గం అభిరామ్, రామటెంకి హవీశ్, ఆవునూరి మనీష్, దుర్గం యశోమార్, జాడి జయవర్ధన్, కామెర బెన్నీ, కలిసి ధనుష్, కొండగొర్ల రామ్చరణ్, ముడిమడుగుల రామ్తేజ, బట్టి క్రాంతి రణదేవ్, మడికొండ అవినాష్ ఉన్నారు. అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన సీవోఈ విద్యార్థులను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం రాత్రి ఆయన సీవోఈ గురుకులాన్ని సందర్శించారు. అడ్వాన్స్ పరీక్షల్లో అత్యుత్తమ పర్సంటైల్ తెచ్చుకుని ఐఐటీలో సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను సీవోఈ ప్రిన్సిపాల్ విజయ్సాగర్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
జ్వరంతో ఆశ్రమ విద్యార్థిని మృతి
కెరమెరి: సిర్పూర్(యూ) మండలంలోని మహా గాం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థిని బుధవా రం జ్వరంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పాఠశాల హెచ్ఎం రాంబాయి తెలిపిన వివరా లు.. కోట్నక గంగుబాయి(14) 9వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి ఆమెకు జ్వరం రాగా బుధవారం పాఠశాల ఏఎన్ఎం జ్వరానికి సంబంధించిన మాత్ర ఇచ్చారు. అనంతరం కాసేపు బాగా నే ఉంది. అకస్మత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే అంబులెన్స్లో జైనూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆదివాసీ సంఘాల ఆందోళన గంగుబాయి మృతి చెందిన సమాచారం అందుకున్న ఆదివాసీ సంఘాల ఐకాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనక యాదోరావు, ఇతర నాయకులు, మృతురాలి కుటుంబ సభ్యులతో కలిసి జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా పిల్లలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, తక్షణ సహాయం కింద రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీడీ రమాదేవి, ఏజెన్సీ డీఈవో చందన్, ఏపీవో భాస్కర్, జీసీడీవో శకుంతల, టీడీఏ శ్రీనివాస్, ఎంఈవో సుధాకర్, తహసీల్దార్ బీర్శావ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేశారు. మృతురాలి తండ్రి కోట్నాక సొంజీకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రం అందించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.20 వేలు అందించారు. దీంతో ఆందోళన కారులు ఆందోళప విరమించారు. పెందొర్ మాధవరావు, ఇంతియాజ్ లాలా, మెస్రం భూపతి తదితరులు ఉన్నారు. కాగా విద్యార్థిని మృతి నేపథ్యంలో డిప్యూటీ హెచ్డబ్ల్యూవో కె.శ్రీదేవి, ఏఎన్ఎం తీర్థాబాయిని సస్పెండ్ చేస్తూ డీడీ రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
నకిలీ సిగరెట్ల్లు పట్టివేత
నేరడిగొండ: నకిలీ సిగరెట్లను పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 20న మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి నేరడిగొండ వైపు ద్విచక్ర వాహనంపై డూప్లికేట్ గోల్డ్ఫ్లేక్ సిగరెట్లు తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న బైక్ను ఆపి తనిఖీ చేయగా వివిధ బ్రాండ్ల రూ.60 వేల 400 విలువ గల నకిలీ సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. వాటిలో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం, గోల్డ్ ఫ్లేక్ లైట్, గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, మార్ల్బోరో అడ్వాన్స్ కంపాక్ట్ బ్రాండ్ల ప్యాకెట్లు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి బైక్తో పాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నకిలీ సిగరెట్లను నిజామాబాద్కు చెందిన ఇమ్రాన్ వద్ద నుంచి విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆటోనగర్కు చెందిన మహ్మద్ సమ్దాని, ఆర్సపల్లికి చెందిన మండుల పవన్ కుమార్, ఇమ్రాన్లను అరెస్ట్ చేయగా, కిన్వట్కు చెందిన వాసే పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను నేరడిగొండ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు. -
మెడి‘కిల్’ బోర్డు..!
శ్రీరాంపూర్:సింగరేణిలో మెడికల్ బోర్డుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉన్న అనిశ్చితితో మెడికల్ బోర్డు నిర్వహిస్తారా? లేదా ఎత్తేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పదేళ్లుగా సక్రమంగా నిర్వహించిన మెడికల్ బోర్డు ఏడాది కాలంగా బంద్ చేశారు. కేవలం రిఫరల్ కేసులకు రెండుసార్లు బోర్డుపెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడిన కార్మికులు విధులు నిర్వర్తించలేక దరఖాస్తు చేసుకున్నవారు, గుండెకు స్ట్రంట్స్, బైపాస్, ఇతర సర్జరీలు చేసుకున్న సుమారు 2,500 మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరి సారిగా 2025, మార్చి 21లో బోర్డు నిర్వహించారు. ఆ తర్వాత జూలైలో 54 రిఫరల్ కేసులను పిలిచినా కేవలం ఐదుగురిని ఇన్వాలిడేషన్ (అన్ఫిట్) చేసి మిగిలిన వారిని డ్యూటీ చేసుకోవాలని తిప్పి పంపించారు. నవంబర్లో కూడా ఇలాగే 129 మందిని పిలిచి కేవలం 25 మందినే ఇన్వాలిడేషన్ చేశారు. పర్చేంటేజీ తగ్గించారు.. పదేళ్లలో జరిగిన మెడికల్ బోర్డులు పరిశీలిస్తే జబ్బుపడిన కార్మికుల్లో కనీసం 70 నుంచి 80 శాతం వరకు ఇన్వాలిడేషన్ చేశారు. దీంతో వేలాది మంది కార్మికుల పిల్లలు కారుణ్య ఉద్యోగాలు పొందారు. ఇప్పటి రెండు బోర్డులను పరిశీలిస్తే ఇన్వాలిడేషన్ శాతం చాలా తగ్గించారని, ఇది మున్ముందు ఎత్తివేసే కుట్ర అని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మళ్లీ పాత రోజులే వస్తున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో నిర్వహించిన మెడికల్ బోర్డులో కారుణ్య ఉద్యోగాలు పొంది మెడికల్ఫిట్ అయిన 350 మంది డిపెండెంట్లకు సైతం పోస్టింగ్ లెటర్లు ఇవ్వడం లేదు. ఎక్సెస్ ఉన్నారనే... కంపెనీలో అవసరానికి మించి సుమారు 2,500 మంది ఎక్సెస్ కార్మికులు ఉన్నారని, ప్రస్తుతం మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య ఉద్యోగాలు కొనసాగిస్తే మున్ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, అందుకే ఈ సంఖ్య తగ్గించాలనే బోర్డును బంద్ పెట్టారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కంపెనీని ప్రైవేటు పరం చేయడానికి దశల వారీగా యాజమాన్యం, ప్రభుత్వాలు కలిసి కు ట్రలు చేస్తూ కొత్త గనులు తీసుకురావడం లేదని, దీ ని ప్రభావం వల్లే ఉద్యోగుల సంఖ్య ఎక్సెస్ అయ్యిందని, ఆ సాకుతో కారుణ్య ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని కార్మికులు మండి పడుతున్నారు. ఏసీబీ విచారణ మంట... 2014 నుంచి 2024 వరకు జరిగిన మెడికల్ బోర్డు ఇన్వాలిడేషన్, అందులో పొందిన కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ చేత విచారణ జరిపిస్తామని సా క్షాత్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రకటించడం మంటలు రేపింది. దీనిపై అన్ని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. విచారణ పేరుతో కారుణ్య ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇ బ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించా రు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పాటు ప్రా తినిధ్య సంఘం ఐఎన్టీయూసీ, ఇతర సంఘాలు మెడికల్బోర్డు పెట్టాలని ఆందోళనలు చేస్తున్నాయి. -
రోడ్డు విస్తరణ పనులు అడ్డుకున్న వ్యాపారులు
చెన్నూర్: పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ నుంచి పెద్ద చెరువు రావి చెట్టు వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డ్రెయినేజీలపై ఉన్న కట్టడాలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది, అధికారులను బుధవారం వ్యాపారులు, ఇండ్ల యజమానులు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఎంత వరకు సమంజమన్నారు. రోడ్డు ఎన్ని ఫీట్లు వెడల్పు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తారనే వివరాలతో నోటీసులు ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు చేసేది లేక పనులు నిలిపివేశారు. శానిటరీ ఇన్స్స్పెక్టర్ ఉదయ్, టౌన్ ప్లానింగ్ అధికారి సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటి రుణం.. తీసింది ప్రాణం
నార్నూర్: ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలాంగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండల కేంద్రంలోని కోలాంగూడకు చెందిన అలవోజు వనిత (45), భర్త శంకరయ్యలు మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు దాదాపు రూ.8 లక్షల వరకు అప్పు చేశారు. మూడేళ్లుగా అప్పు తీర్చలేక వనిత మనోవేధనకు గురైంది. అప్పు ఎలా తీర్చాలి..? పిల్లల భవిష్యత్తు ఏంటి..? అని ఆమె నిరంతరం ఆందోళన చెందుతుండేదని శంకరయ్య కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉదయం ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని ఏఎస్సై గణపతి పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మక్కల దొంగలు అరెస్ట్
కుంటాల: మండలంలోని వెంకూర్ గ్రామ శివారు కల్లూరు –కుంటాల రహదారిపై ఉన్న 107 మక్కల బస్తాలను చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ బుధవారం కుంటాల పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మండలంలోని కొత్త వెంకూర్ గ్రామానికి చెందిన రైతు మగ్గిడి చిన్న నారాయణకు చెందిన మక్కల బస్తాలు ఈనెల 4న వేకువజామున చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. మహారాష్ట్రలోని బోకర్ ఎక్స్రోడ్ వద్ద దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భైంసా పట్టణానికి చెందిన షేహెబాజ్ అహ్మద్, షేక్ అతీఫ్, మహమ్మద్ సాహిల్ ఉద్దీన్, షేక్ జలాల్ అలియాస్ అర్బాజ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. షేక్ నోమన్ అలియాస్ షేక్ మన్నాన్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన ఎస్సై అశోక్, కానిస్టేబుళ్లు రంజిత్ కుమార్, రాజేందర్, శంకర్ రావులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
కబేళాలకు తరలిస్తున్న ఆవులు పట్టివేత
బెల్లంపల్లి: మహేంద్ర బొలోరో వ్యాన్లో ఆవులను అత్యంత కర్కషంగా కబేళాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి పోచమ్మ గడ్డ చౌరస్తా వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మహేంద్ర బొలోరో వ్యాన్ అతి వేగంగా వెళ్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేపట్టారు. అందులో 7 ఆవులు, ఓ దూడను తాళ్లతో బంధించి గడ్డి, తాగునీరు ఇవ్వకుండా పరిమితికి మించి తరలిస్తున్నట్లు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ రామటెంకి పరమేశ్, పెద్దపల్లికి చెందిన గౌస్ఖాన్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా జీవాలను చింతలమానేపల్లి సంతలో కొనుగోలు చేసి సిద్దిపేటలో అమ్మడానికి తరలిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఆవులను స్వాధీనం చేసుకుని గోశాలకు పంపించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
తాండూర్: మండలంలోని రాజీవ్నగర్ గ్రామానికి చెందిన ఉపిరే ప్రణీత్(25) అనే సింగరేణి యువ కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూర్ ఏఎస్సై మనోహర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజీవ్నగర్లో నివాసం ఉండే రిటైర్డ్ కార్మికుడు ఉప్రే కిషన్ కుమారుడు ప్రణీత్ మందమర్రి ఏరియాలోని కాసిపేట 2 గనిలో ట్రామర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీలాగే మంగళవారం రెండో షిప్ట్ విధులు ముగించుకొని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. స్నానం చేసి తన రూమ్లోకి వెళ్లాడు. చాలా సేపటి వరకు టీవీ ఆన్ చేసి ఉన్నట్లు గమనించిన కిషన్ వెళ్లి తలుపు తీసి చూసే సరికి ప్రణీత్ ఫ్యాన్కు ఉరేసుకొని ఉన్నాడు. వెంటనే ప్రణీత్ను స్థానికుల సాయంతో కిందికి దించి బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ప్రణీత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కుమారుడికి ఎలాంటి సమస్యలు లేవని ఆత్మహత్యకు ఎందుకు పా ల్పడ్డాడో అర్థం కావడం లేదని కిషన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యాపారం కలిసి రాక.. అప్పులు తీర్చలేక..
జైపూర్: వ్యాపారం కలిసి రాలేదు. దాని కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన వ్యక్తి మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భీమారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం మండల కేంద్రానికి చెందిన పోటు తిరుపతిరెడ్డి(50) వ్యవసాయంతో పాటు ఎరువుల దుకాణాన్ని నడిపేవాడు. ఇందుకు అప్పులు చేయగా వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలోనని ఎప్పుడూ మానసికంగా బాధపడేవా డు. ఈక్రమంలో బుధవారం ఉదయం 3:30 గంట లకు పొలంకు వెళ్తున్నానని చెప్పి మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రత్యేక సర్వే నిర్వహించాలి
నస్పూర్: నేతకానీలకు ప్రత్యేక కులగణన సర్వే నిర్వహించాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు కో రారు. ఆదివారం ఆయన నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో నేతకానీలు సుమారు 15లక్షలకు పైబడి జనాభా ఉన్నప్పటికీ ఇటీవల జరిపిన కుల గణనలో లక్షా 70వేల జనాభా మాత్రమే ఉన్నట్లు చూపించారని ఆరోపించారు. నేతకానీ లను మాలలతో కలపడంతో తాము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నేతకానీలకు ప్రత్యేక కార్పొరేషన్ చైర్మన్ను నియమించాల ని, ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమ ల్లు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజు, జిల్లా మహిళా ఽఅధ్యక్షురాలు కామెర అ నూష, నాయకులు జాడి తిరుపతి, శ్రీనివాస్, దుర్గం శివరాం తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్లో ఘన స్వాగతం
జన్నారం: విద్యావిధానంపై అధ్యయనానికి ఫిన్లాండ్ వెళ్లిన జన్నారం మండలానికి చెందిన దాముక కమలాకర్, జాజల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దాసర రాజేశ్ సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈనెల 20 నుంచి 24 వరకు ఫిన్లాండ్లో విద్యావిధానంపై అధ్యయనం చేయనున్నట్లు ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యగుడిహత్నూర్: ఆర్థిక ఇబ్బందులతో ఆదిలా బాద్లోని రిక్షా కాలనీకి చెందిన మేకల దయాకర్ (44) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేకల దయాకర్ చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యాపారంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈక్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చి మేకలగండి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకునే ముందు తన సెల్ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు మేకల గండి వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ మెసేజ్ పంపాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకొని వెతుకగా ఓ చెట్టుకు వేలాడుతూ కన్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కుమారుడు మేకల మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘చెన్నూర్కు మంత్రి చేసిందేమీ లేదు’
చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిందేమీలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులతోనే పనులు చేస్తున్నారని, కొత్తగా ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆదివారం స్థానిక కొత్తగూడెం కాలనీలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. 16వ వార్డు మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేశ్తోపాటు కొత్తగూడెం, చింతలగూడెం కాలనీలకు చెందిన వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుమన్ మాట్లాడుతూ.. చెన్నూర్ వంద పడకల ఆస్పత్రి, బస్సు డిపో పనులు నిలిచిపోయాయని తెలిపారు. మంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చెన్నూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు వాల శ్రీనివాస్రావు, ఎన్నపురెడ్డి బాపురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుపతి తదితరులున్నారు. -
ఆర్టీసీ రక్షణ, సమస్యల సాధనకు సమ్మె
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ సంస్థ రక్షణ, సమస్యల సాధనకు ఈనెల 22 నుంచి నిరవధిక సమ్మె చేపట్ట నున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మే కల దాసు పేర్కొన్నారు. టీజీఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆదివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇ చ్చిన హామీలు రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవటంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడు తూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా వేలాది మంది కార్మిక కుటుంబాల బతుకుదెరువుకు చేస్తున్న ఉ ద్యమమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.. మహాలక్ష్మి బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత క ల్పించాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.లక్ష్మణ్, రీజినల్ అధ్యక్షుడు మామిడిపెల్లి శ్రీనివాస్, యూనియన్ డిపో అధ్యక్షుడు పోలు రాజేశం, చైర్మన్ శ్రీనివాసులు, టీఎంయూ డిపో సెక్రటరీ తిరుపతి, మహిళా కార్మికులు జ్యోతి, ప్రభావతి, పుష్పలత, చంద్రకళ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో మునిగి వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండలానికి చెందిన కుంచపొల్ల నర్సింలు (68) గత కొన్నేళ్లుగా పశువుల కాపరిగా జీవనం సా గిస్తున్నాడు. ఆదివారం మండల కేంద్రం సమీపంలోని ఊర చెరువు వద్ద పశువులు మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గేదెలు మేపుతుండగా కొన్ని గేదెలు నీటిలోనికి వెళ్లడంతో నర్సింలు వాటిని ఒడ్డుకు చేర్చడానికి నీటిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుమారుడు సాయిలు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం చెరువు సమీపంలో కుటుంబ సభ్యులు వెతికే క్రమంలో మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రావణి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
మొక్కజొన్న పంటకు నిప్పు
కుంటాల: మండలంలోని ఓల గ్రామంలో మో రేబాబు పటేల్ మొక్కజొన్న పంటకు సోమవారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. స్పందించిన సర్పంచ్ కట్ట రవి పంచాయతీ సిబ్బందితో కలిసి పంట చేనులోకి వాటర్ ట్యాంకర్ను తీసుకెళ్లి మంటలు ఆర్పి వేశారు. మోతక్పల్లిలో.. నర్సాపూర్(జి): మండలంలోని చాక్పల్లి అనుబంధ గ్రామం మోతక్పల్లి శివారులో సోమవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెలువడిన నిప్పు రవ్వలతో దగ్ధమైనట్లు రైతులు తెలిపారు. జాదవ్ మోతిలాల్ పటేల్కు చెందిన 4 ఎకరాల మొక్కజొన్న, జాదవ్ నరహరి పటేల్కు చెందిన ఎకరం మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
ఇంద్రవెల్లి గాయానికి 45 ఏళ్లు
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగా నే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కో టి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతోపాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి. అసలేం జరిగింది.. స్వాతంత్య్రం వచ్చి అప్పటికి మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధనకు పీపుల్స్వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరి ట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3గంటల వరకే ప్రాంగణం గిరిపుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరి జన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడిపై దాడి చేయగా నేలకొ రిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ, తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60మంది మృతి చెందినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. 33 ఏళ్లు.. నివాళులకు దూరం నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆరోజు నుంచి ఉమ్మడి రా ష్ట్రపాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా బందోబస్తు ఏర్పాటు చేసేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మె ల్యే సోయం బాపూరావ్ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఎంపీ మధుసూదన్రెడ్డితో కలిసి ఏప్రి ల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీలు ఆ రోజున ఆంక్షల మధ్య నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించింది. రెండు గంటల సమయం ఇవ్వడంతో ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేసి నివాళులర్పిస్తూ వచ్చారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. దానిని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్ల తో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో సర్కారు ఐటీడీఏ నిధులతో స్తూపం నిర్మించింది. అమరవీరుల ఆశయ సాధనకు రిలే దీక్షలు నాటి ఆదివాసీ అమరుల ఆశయ సాధన కోసం ఇటీవల కొద్ది రోజుల పాటు ఆదివాసీలు స్తూపం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు.1981 ఏప్రిల్ 20. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. వారి అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో స్తూపమై నిలిచింది. ఈ ఘటన కు 45 ఏళ్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. – ఇంద్రవెల్లి -
అమరులకు స్వేచ్ఛా నివాళి
ఇంద్రవెల్లి: భూమి కోసం, భుక్తి కోసం పోరాడి అసువులు బాసిన ఇంద్రవెల్లి అమరవీరులకు సోమవారం ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులర్పించారు. ముందుగా గొండ్గూడ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీగా స్తూపం వద్దకు వచ్చిన ఆదివా సీలు స్మారక జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. స్తూపం వద్ద ఖానాపూర్ ఎ మ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కో వ లక్ష్మి, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మాజీ ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేశ్ జాదవ్, ఆత్రం సుగుణలు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎంపీ గోడం నగేశ్, మాజీ మావోయిస్టు పూల్లురి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్నలు అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి ఘటనలో అమరులై న బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పా టు బాధిత కుటుంబాలకు ఇంటి స్థలాలు, ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొ జ్జు పటేల్ అన్నారు. ఐటీడీఏ ద్వారా వారికి ఇష్టమైన వాహనాలను రాయితీపై మంజూరు చేశామని, మిగితా బాధిత కుటుంబాలను కూడా గుర్తించి ఆదుకుంటామని తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం ముసుగులో కొంత మంది గిరిజన, గిరిజనేతర నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇ ప్పటి వరకు పరిష్కారం కాని పోడు భూముల కో సం, రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న అటవీ చట్టాలకు వ్యతిరేకంగా, తాగు నీటి స మస్య పరిష్కారానికి పోరాటాలు చేయాలి కానీ తమ స్వార్థం కోసం ఆదివాసీ సమాజాన్ని పక్కదారి పట్టించడం సరికాదన్నారు. న్యాయమైన హ క్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తే మద్దతిస్తామని పేర్కొన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారని, వాటిపై దాడులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్కు సూచించారు. అనంతరం అమరవీరు ల ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు ఆత్రం భుజంగ్రావ్ ఆధ్వర్యంలో ముద్రించిన ‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు చించు రామకృష్ణ, వీరమల్లు, ఆశారెడ్డి, వెంకట్రావ్, మనోహర్, అమృత్రావ్, గణేశ్, బాపురావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి చైర్మన్ మెస్రం నాగ్నాథ్, వైస్ చైర్మన్ సోయం రాందాస్, నాయకులు గేడం భరత్ తదితరులు ఉన్నారు. తొడసం కట్టికి ఘన నివాళి ఇంద్రవెల్లిలో జరిగిన సభకు సారథ్యం వహించిన ఉద్యమ సారథి తుమ్మగూడ గ్రామానికి చెందిన తొడసం కట్టి స్మారక జెండా వద్ద సోమవారం తుమ్మగూడ గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజాపోరాటంతోనే సమస్యలు పరిష్కారం.. ప్రజాపోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాద్రావ్ అలియాస్ చంద్రన్న అన్నారు. సోమవారం ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామాన్ని సందర్శించి ఉద్యమ కారుడు సిడాం శంభు సమాది వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు నిర్భందం విధించినా ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన సిడాం శంభు చరిత్రలో నిలిచిపోయాడని గుర్తు చేశారు. ప్రజా పోరాటాలతోనే న్యాయమైన హక్కులు సాధించుకోవచ్చన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి చేరుకుని అమరులకు నివాళులర్పించారు. -
వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు
నెన్నెల: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు, ఉపాధి కూలీలు ఎండలో ఎక్కువ సేపు పని చేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. తెలంగాణలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయం (ఎక్స్గ్రేషియా) అందిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) ద్వారా ఈ పరిహారం ఇస్తున్నారు. గతంలో ఈ మొత్తం రూ.50వేలుగా ఉండేది. ప్రస్తుతం ఆపద్బంధు పేరుతో రూ.4 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మండలానికి త్రిసభ్య కమిటీ ఆపద్బంధు పథకం కింద వడదెబ్బతో మృతి చెందిన వారిని నిర్ధారించేందుకు ప్రతీ మండలంలో ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. కమిటీలో స్థానిక వైద్యాధికారి, ఎస్సై, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారు. వడదెబ్బతో మరణిస్తే మృతుల కుటుంబీకులు పోలీసులకు, వైద్యాధికారికి సమాచారం అందించాలి. వైద్యులు మృతి ధ్రువీకరించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారు. అనంతరం పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీస్స్టేషన్కు అందజేసి ఎఫ్ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. ఈ నివేదికను తహసీల్దార్ ద్వారా ఆర్డీవోకు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారాన్ని విడుదల చేస్తారు. -
ఆశయాలు నెరవేర్చాలి
ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్తూపానికి మరో ఎకరం భూమి కేటాయించడంతో పాటు అమరుల కుటుంబాలకు ఐదెకరాల సాగు భూమి, పింఛన్ సౌకర్యం కల్పించాలి. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. – ఆత్రం భుజంగ్రావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులుగాయపడ్డ వారినీ ఆదుకోవాలిప్రభుత్వం అమరులైన 15 మంది కుటుంబాలను గుర్తించినట్లు నాడు గాయాల పాలైన వారినీ గుర్తించాలి. బాధిత కుటుంబాలకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్ల్లు మంజూరు చేయాలి. స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – మెస్రం నాగ్నాథ్, అమరవీరుల ఆశయ సాధన సమితి చైర్మన్ -
‘రియల్’ అంతంతే..
మంచిర్యాలటౌన్: జిల్లాలో 2022–23 ఆర్థిక సంవత్సరం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. అప్పటివరకు బాగా నే ఉన్నా ఆ తర్వాత ఆదాయం తగ్గుతూ వస్తోంది. ‘రియల్’ వ్యాపారం ఒక్కసారిగా పెరిగి, క్రమక్రమంగా తగ్గిపోతుండడం, ప్రజలకు అందుబాటులో లేనివిధంగా భూముల ధరలు పెంచడంతోనే క్రయవిక్రయాలు ఏటా తగ్గిపోతున్నాయి. గతంతో పోలిస్తే ఏటా పెరగాల్సిన ఆదాయం తగ్గుతుండడంతో పాటు రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్లు కూడా తగ్గుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘రి యల్’ వ్యాపా రం బాగా సాగుతుందని, భూ ముల విలువ అమాంతంగా పెంచడంతోనూ వ్యాపారంపై ప్రభావం పడింది. ‘రియ ల్’ వ్యాపారులు పెంచిన భూ ముల ధరలు, ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు సామాన్యులు భరించడం కష్టంగా మారింది. దీంతో క్రమక్రమంగా ఏటా భూముల రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అలాగే, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతోంది. గతేడాది కొంత మెరుగే.. మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2023–24లో 20,173 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, రూ.53.02 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 –25లో 13,881 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా, రూ.53.20 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శా తం రాయితీ ప్రకటించడంతో పాటు 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని వారికి నేరుగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఎల్ఆర్ఎస్ ఫీజు 25శాతం రాయితీతో చెల్లించి, వారి భూములు అ మ్ముకునేందుకు అవకాశం కల్పించడంతో గతేడాది కొంత మెరుగైన ఆదాయాన్ని పొందింది. ఎల్ఆర్ఎస్ పుణ్యమాని గతేడాది మార్చిలోనే దాదాపు రూ.4 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.3 కోట్ల మేర ఆదాయం తగ్గింది. భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరగడం లేదు. కొత్త వెంచర్లు ఏర్పా టు కావడంలేదు. గతంలోని వెంచర్లలోని ప్లాట్లు అమ్ముడుపోవడం లేదు. అవసరం నిమిత్తమే కొనేవారితో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది. భూముల ధర కంటే బంగారం ధరలు అమాంతంగా పెరుగుతుండడంతో పలువురు గోల్డ్పై పెట్టుబడులు పెట్టడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఇతర వ్యాపారాలపై దాని ప్రభావం పడుతోంది.మంచిర్యాల ‘సబ్రిజిస్ట్రార్’ లో రిజిస్ట్రేషన్ల వివరాలుసంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం (రూ.కోట్లలో) 2021-22 16,758 42.77 2022-23 20,038 57.08 2023-24 20,173 53.02 2024-25 13,881 53.20 2025-26 14,955 50.86 -
చోరీకి గురైన ఆటో పట్టివేత
కుభీర్: మండల కేంద్రానికి చెందిన పుప్పాల ద త్తాత్రికి చెందిన ప్యాసింజర్ ఆటో చోరీకి గురి కాగా దొడర్నా వద్ద పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 17న రాత్రి 10గంట లకు దత్తాత్రి తన ఇంటి ముందు ఆటో నిలిపి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చూ సేసరికి ఆటో చోరీకి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకు న్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆది వారం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో చో రీకి గురైన ఆటోతో పాటు నిందితుడిని పట్టుకు ని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
విద్యుత్షాక్తో వివాహిత మృతి
తాంసి: భీంపూర్ మండలం అర్లి(టి) పంచాయతీ పరిధి మందపల్లి గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (27) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కూలర్లో నీరు నింపింది. అనంతరం స్విచ్ ఆన్చేసే క్రమంలో స్విచ్బోర్డు తీగలు నేరుగా చేతికి తగలడం.. కాళ్ల కింద నీరు ఉండటంతో విద్యుత్షాక్కు గురై మృతిచెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని ఎస్సై ప్రణయ్ కుమార్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. మీనాక్షికి భర్త, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. భర్త సురేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇంట్లో పాముకాటుతో వ్యక్తి..ఖానాపూర్: ఖానాపూర్ పట్టణం రాజీవ్నగర్కు చెందిన ఎనుగుల రాజేశ్వర్ (54) నాగుపాము కాటుకు గురై మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో తన ఇంటిలోనే రాజేశ్వర్ను నాగుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే నిర్మల్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు రాజేశ్వర్ మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్ల లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. తానూరు: మండలంలోని జౌలా(బి) గ్రామానికి చెందిన గంగుల్వార్ నగేశ్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మృతుడు నగేశ్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందాడు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వ్యక్తి..నిర్మల్రూరల్: నిర్మల్ మండలంలోని మేడిపల్లి వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై నింపాది తెలిపారు. ఆయన కథనం ప్రకారం మామడ మండలం గాయదుపల్లికి చెందిన జాదవ్ ప్రకాశ్ (30) బైక్పై ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వస్తుండగా మండలంలోని మేడిపల్లి బస్స్టాప్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కూలీ పని చేసుకొని జీవించే జాదవ్ ప్రకాశ్కు భార్య, సంవత్సరం వయసు గల కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. వడదెబ్బతో ఒకరు..శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 కాలనీకి చెందిన గొడిశెల శ్రీనివాస్(46) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనివాస్ టెంట్హౌజ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న ఓ శుభకార్యానికి టెంట్ వేసిన తర్వాత కొంత అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో స్థానిక వైద్యుని వద్ద చికిత్స పొందాడు. సోమవారం మరింత నీరసించడంతో కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు చోరీమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన రాదండి పోసు అనే వృద్ధురాలి పుస్తెలతాడు చోరీకి గురైంది. హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం మేరకు.. రాదండి పోసు ఉదయం పోచమ్మ ఆలయం పరిసరాలను శుభ్రం చేసేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒక్కసారిగా మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. పోసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘సింగరేణి సంరక్షణే ధ్యేయం’
నస్పూర్: సింగరేణి సంరక్షణే ధ్యేయమని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పే ర్కొన్నారు. ఆదివారం ఆయన నస్పూర్ శ్రీరాంపూ ర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీకి హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని పే ర్కొన్నారు. సింగరేణి కార్మికులు, ప్రజలంతా మద్ద తు తెలుపాలని కోరారు. సింగరేణిలో ఏడాదికి ఐ దు కొత్త బొగ్గు బావులు, మెడికల్ బోర్డు ఏర్పాటు, మారు పేర్ల సమస్య పరిష్కారానికే కవితతో కలిసి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కవిత పార్టీ ఏర్పాటు త ర్వాత సింగరేణిలో కై రిగూడ నుంచి సత్తుపల్లి వరకు ‘బొగ్గుబాయి బాట’ నిర్వహిస్తామని తెలిపారు. హ క్కులు సాధించడంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ విఫలమయ్యాయని ఆరోపించారు. దేశంలో ఎక్క డా లేనట్లు ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి ప డ్డ రూ.53 వేల కోట్లు వెంటనే చెల్లిస్తే కొత్త బొగ్గుబా వులు తెరవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కవిత పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సింగరేణి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సారయ్య, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రె సిడెంట్ అనిల్రెడ్డి, నాయకులు అశోక్, కొముర య్య, రాజశేఖర్, సురేశ్, లక్ష్మణ్ తదితరులున్నారు. -
బాల్య వివాహం అడ్డగింత
నార్నూర్: అమ్మాయికి కేవలం 13 ఏళ్లు మాత్రమే. ఆటపాటలతో గడపాల్సిన వయసు అది. కానీ ఆ కుటుంబం బాలికకు పెళ్లి చేయాలని నిశ్చయించింది. అన్నీ సిద్ధమయ్యాయి. సోమవారం ముహూర్తం కూడా ఖరారైంది. విషయం తెలుసుకున్న గాదిగూడ ఎస్సై జి.రమ్య తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. పెళ్లిని అడ్డుకుని బాలిక భవిష్యత్తుకు భరోసానిచ్చారు. జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతం, మహారాష్ట్ర సరిహద్దు గ్రామం గాదిగూడ మండలంలోని మేడిగూడలో సోమవారం జరగాల్సిన బాల్య వివాహాన్ని ఎస్సై అడ్డుకున్నారు. బాల్య వివాహం ఎందుకు చేయకూడదో కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అర్థమయ్యేలా వివరించారు. పోలీసుల మాటలతో కళ్లు తెరిచిన కుటుంబ సభ్యులు, తమ తప్పు తెలుసుకుని వివాహాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సకాలంలో స్పందించి చిన్నారి జీవితం చితికిపోకుండా కాపాడిన ఎస్సై రమ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం
రామకృష్ణాపూర్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్కు స్పష్టమైన వైఖరి ఉందని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందకపోవటానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ చేస్తున్న ప్రచారం అసత్యమని పేర్కొన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో 2008లో బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో అప్పుడు మెజార్టీ లేక ఆమోదం పొందలేదని పే ర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారత కోసం నిజమైన చిత్తశుద్ధి కలిగిన పార్టీ కాంగ్రెస్సేనని స్ప ష్టంచేశారు. 2023లో బీజేపీ ప్రభుత్వం బిల్లు ఆమోదించినప్పటికీ దానిని వెంటనే చట్టంగా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పునర్విభజనతో బిల్లును అనుసంధానం చేసి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని విమర్శించారు. మహిళల హ క్కులు రాజ్యాంగబద్ధమైనవని, వాటి సాధనకు కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టంచేశారు. ఆయన వెంట పట్టణ మాజీ అధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, కూతురు ప్రభాకర్, గుర్రం శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఎండ తీవ్రతకు స్పృహ తప్పిన విద్యార్థిని
ఆదిలాబాద్టౌన్: ఎండ తీవ్రత కారణంగా ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రంలో సొమ్మసిల్లి పడిపోయిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం బేల మండలం చప్రాల గ్రామానికి చెందిన ధనశ్రీ అనే విద్యార్థిని డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన తర్వాత ఎండ తీవ్రతను తట్టుకోలేక కళాశాల ప్రాంగణంలోనే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా బేల పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్కు మార్చడం వల్లే విద్యార్థులు మండుటెండలో ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. కాగా విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
భానుడి భగభగ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. సూర్యప్రతాపంతో వేడి పెరుగుతోంది. సాయంత్రం 6గంటలు దాటినా వాతావర ణం చల్లబడడం లేదు. జిల్లావాసులు పెరుగుతున్న వేడిని తట్టుకోలేక పోతున్నారు. మంగళవారం మందమర్రిలో ఒకరు వడదెబ్బతో మృతి చెందారు. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత పరిశీలిస్తే ఇదేరోజు 42.8 డిగ్రీల సెల్సీయస్గా ఉండగా, మంగళవారం 43.4 డిగ్రీల సెల్సీయస్గా నమోదైంది. అంటే, ఈసారి 1.2 డిగ్రీలు అధికంగా ఉంది. గ్రామాల్లో ఇంకా వ్య వసాయ పనులు పూర్తి కాలేదు. వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ధాన్యం ఆరబెట్టడం, కేంద్రాలకు తరలింపు, కాంటాపూర్తయి రవాణా చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ఉపాధి పనులు జోరందుకుంటాయి. రోజువారీగా పనులు చేసుకునే వా రు, వీధి వ్యాపారులు, ఇతర పనులు చేసుకునే వా రంతా ఎండవేడిమి తట్టుకోవడం లేదు. వేడిని తట్టుకునేందుకు స్థాయిని బట్టి పలువురు ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తుండడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. జాగ్రత్తలు తప్పనిసరివేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పా టించాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లకపోవడమే ఉత్త మం. ఒంట్లో నీరు తగ్గకుండా తగినంత ద్రవాలు తీసుకోవాలి. ఒకవేళ డీ హైడ్రేషన్కు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలుంటే సమీప ఆస్పత్రికి వెళ్లాలి. మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలుమండలం గ్రామం కనిష్టం గరిష్టం దండేపల్లి వెల్గనూరు 32.1 43.8 భీమారం భీమారం 31.9 43.7 నస్పూర్ జీఎం ఆఫీస్ శ్రీరాంపూర్ 32.6 43.2 చెన్నూరు కొమ్మెర 32.8 43.2 జైపూర్ కుందారం 31.4 43.1 మందమర్రి అందుగులపేట 33.5 42.7 కాసిపేట కొండాపూర్ 36.4 42.4 దండేపల్లి లింగాపూర్ 35.4 42.4 నస్పూర్ నస్పూర్ 31.8 42.4 బెల్లంపల్లి బెల్లంపల్లి 33.4 42.4 హాజీపూర్ ర్యాలీ 33.1 42.2 కన్నెపల్లి జన్కాపూర్ 34.0 42.2 భీమిని భీమిని 34.5 42.1 తాండూరు తాండూరు 34.6 42.1 కోటపల్లి దేవులవాడ 32.9 41.9 హాజీపూర్ హాజీపూర్ 33.6 41.7 జన్నారం జన్నారం 36.6 41.6 లక్సెట్టిపేట శాంతాపూర్ 33.1 41.3 వేమనపల్లి నీల్వాయి 31.2 41.3 కన్నెపల్లి కన్నెపల్లి 32.6 41.2 నెన్నెల నెన్నెల 31.6 41.0 కోటపల్లి కొల్లూరు 32.9 41.0 కోటపల్లి కోటపల్లి 32.1 40.9 జన్నారం తపాలాపూర్ 34.9 40.7 చెన్నూరు చెన్నూరు 32.9 40.7 -
అక్రమ రవాణా చేస్తే చర్యలు
కోటపల్లి: ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమంగా రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రాములు హెచ్చరించారు. మంగళవారం రాపన్పల్లి సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ప్రాణహిత నది వంతెన వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును ప్రారంభించారు. జిల్లాలోని రైతులకు మద్దతు ధర అందించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునేందుకు ఈ చెక్పోస్టును ప్రారంభించినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో 24గంటలు నిరంతరం నిఘా పెడతామని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టు ద్వారా వాహనాల తనిఖీ క్రమం తప్పకుండా చేపడతామని, నియమావళిని ఉల్లఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి బ్రహ్మారావు, తహసీల్దార్ రాఘవేందర్రావు, ఏవో సాయికృష్ణారెడ్డి, సీఐ కృష్ణ పాల్గొన్నారు. -
సమ్మె రూట్లో ఆర్టీసీ
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్యలు విఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగుతుండడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోయాయి. సమ్మె విరమించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినా కార్మికులు తమ డిమాండ్లపై పట్టు వీడలేదు. దీంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 30శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ, కొత్త బస్సుల ప్రవేటీకరణ నిలిపివేయాలంటూ సంఘాలు డిమాండ్ చేశాయి. సాయంత్రం సచివాలయంలో అధికారుల కమిటీతో ఆర్టీసీజేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరంఆర్టీసీలో గతంలో జరిగిన సమ్మె అనుభవాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. మంచిర్యాల డిపోలో 148 బస్సులు ఉండగా అద్దె బస్సులు 69 వరకు ఉన్నాయి. మొత్తం డిపోలో 468 మంది ఉద్యోగులు ఉండగా డ్రైవర్లు 151 మంది, కండక్టర్లు 199 మంది ఉన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు విధులకు దూరంగా ఉంటే ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. మొదటి రోజు తర్వాత ఎంతమంది సమ్మెలో పాల్గొంటారు.. ఏయే రూట్లలో బస్సులు నడపాలనే విషయాలపై స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అద్దె బస్సులపై విధులు నిర్వహించే డ్రైవర్లు ఉన్నారు. వీరికి తోడు ఇటీవల కాలంలో 28 మంది అవుట్సోర్సింగ్(ఓఎస్) డ్రైవర్లు ఉన్నారు. కారుణ్య నియామకం కింద 33 మంది కండక్టర్లు(రెగ్యులర్ కాలేదు) ఉన్నారు. మొదటి రోజు జరిగే సమ్మె తీరును బట్టి మరుసటి రోజు తాత్కాలిక కండక్టర్ల నియామకం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రద్దీ రూట్లలో రాకపోకలు..ఆర్టీసీ బస్సుల్లో సగం అద్దె బస్సులు కావడంతో రద్దీ రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నడపాలని యాజమాన్యం యోచిస్తోంది. ప్రైవేట్ డ్రైవర్లు, కారుణ్య నియామకాల కింద విధులు నిర్వర్తిస్తున్న కండక్టర్లు విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. చెన్నూర్, కాగజ్నగర్, లక్సెట్టిపేట వైపు రద్దీ మార్గాల్లో బస్సుల రాకపోకలు ఎక్కువగా సాగనున్నాయి. మరోవైపు ఆర్టీసీలో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లతోపాటు మిగిలిన ఉద్యోగులు కలిసి వస్తారని ఘంటాపథంగా సంఘాల నేతలు చెబుతున్నారు. అద్దె బస్సుల డ్రైవర్ల మద్దతు ఉందని తేల్చి చెబుతున్నారు. సమ్మె సక్సెస్కు సంఘాలు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యల్లో ఆర్టీసీ యాజమాన్యం తలోదారిగా వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. -
ప్రజాసమస్యల పరిష్కారానికి చర్యలు
మంచిర్యాలటౌన్: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ, డీసీ సీ అధికార ప్రతినిధి రఘునాథ్రెడ్డితో కలిసి ఎంపీ సుమారు 200 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన అంశాలపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. అర్హులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులను ప్రణా ళికాబద్ధంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. బొ క్కలగుట్ట, పులిమడుగు, అందుగులపేట పొలాల మీదుగా మామిడిగూడెం వరకు పాతరోడ్డు మంజూరు గురించి స్థానికులు ఎంపీకి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎంపీతోపాటు కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి రూ.50లక్షల వరకు నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. -
ఉక్కపోత.. నీటి గోస!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిస్థితి అధ్వానంగా మారింది. ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ లేదు. మూడేళ్లుగా ఎలాంటి నిధులు రావడం లేదు. ఇటీవల కాయకల్ప కింద జిల్లాలోని ప లు మండల, అర్బన్ పీహెచ్సీలకు రూ.50 వేల నుంచి రూ.2లక్షల వరకు నిధులు మంజూరైనా హాజీపూర్ పీహెచ్సీకి మాత్రం రా లేదు. ఆరుబెడ్ల పీహెచ్సీ భవనం పాతది కా వడంతో నిత్యం విద్యుత్ వైరింగ్, ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు కాలిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్లోని ఏసీ, విద్యుత్ వైరింగ్ షార్ట్సర్క్యూట్తో కాలిపోయాయి. దీంతో ఆస్పత్రి లోని ఓటీ గది స్టోర్ రూంగా మారింది. రోగులకు తాగునీటి వసతి కూడా లేదు. ఇప్పటికే మినరల్ వాటర్ యజమానికి రూ.వేలల్లో డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. ఆస్పత్రిలో ఫార్మసిస్ట్ లేక సిబ్బందే రోగులకు మందులు ఇస్తున్నారు. వడదెబ్బ చికిత్సకు అ వసరమైన మందులు అందుబాటులో ఉన్నా యి. ముల్కల్ల సబ్ సెంటర్కు మాత్రం ఎంఎల్హెచ్పీ వైద్యురాలు ఉండగా దొనబండ, కర్ణమామిడి, నంనూర్ సబ్ సెంటర్లకు ఎంల్హెచ్పీవోలు లేక రోగులకు సేవలందడం లేదు. నంనూర్–1, ముల్కల్ల సబ్ సెంటర్లో రెండు ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచిర్యాలటౌన్: రోగులకు మెరుగైన సేవలందించాల్సిన జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరై న మౌలిక వసతులు కరువయ్యాయి. వైద్యులు, సి బ్బంది సరిపడా లేక రోగులకు పూర్తిస్థాయి సేవలందడం లేదు. ఫ్యాన్లు, తాగునీటి వసతి లేక కొన్ని ఆ స్పత్రుల్లో వేసవిలో రోగులు ఇబ్బంది పడుతున్నా రు. మంచిర్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అ నుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆ స్పత్రిలో సరిపడా ఫ్యాన్లు లేక రోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాగునీటి కోసం ఇటీవలే వాటర్ ప్యూరిఫైర్లు మరమ్మతు చేశారు. నిత్యం 300 ఓపీ ఉంది. వివిధ వ్యాక్సిన్ల కోసం మరో 60 మంది నిత్యం వస్తుంటారు. ఓపీతో పాటు వ్యాక్సిన్ వేసే విభాగం రెండూ ఒకేచోట ఉన్నాయి. వీటిలో పాడైన ఫ్యాన్లకు మరమ్మతు చేపట్టకపోవడంతో వే సవిలో రోగులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. వార్డుల్లో నిత్యం 150 మంది వరకు వివిధ వ్యాధులతో వచ్చి చికిత్స పొందుతున్నారు. వార్డుల్లోని కొన్ని ఫ్యాన్లూ పనిచేయడం లేదు. వేసవికి ముందే పాడైన ఫ్యాన్లకు మరమ్మతు చేయగా మళ్లీ ఏదో ఒకచోట పాడవుతూనే ఉన్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఉక్కపోత ఇబ్బందులు తప్పడం లేదు. దండేపల్లిలో రెగ్యులర్ వైద్యుడు లేక.. దండేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మందుల కొరత లేదు. వసతులు బాగా నే ఉన్నాయి. రెగ్యులర్ డాక్టర్ లేక కాంట్రాక్ట్ వైద్యురాలితో పాటు మండలంలోని పల్లె దవాఖానాల్లో ప నిచేసే ఎంఎల్హెచ్పీలను రోజుకొకరిని అందుబా టులో ఉంచి సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులను పరీక్షలు నిర్వహించి మందులు ఇదిస్తున్నారు. అవసరమైనవారికి సైలెన్స్ ఎక్కిస్తున్నారు. పెద్ద జబ్బు చేస్తే పెద్దాస్పత్రులకే..చెన్నూర్: చెన్నూర్ ఏరియా ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. సాధారణ వ్యాధులకే చికిత్స అందుబాటులో ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, కు క్క, కోతి, ఎలుక కాటు మందులు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సేవలందించేందుకు అల్ట్రాస్కానింగ్ సౌకర్యం లేదు. పెద్ద జబ్బులతో బాధ పడేవారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించాల్సిన ప రిస్థితి నెలకొంది. రేడియాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఎని స్తీయా వైద్యులు లేక ప్రమాద బాధితులను మంచి ర్యాల ప్రభుత్వాత్రికి తరలించాల్సిన దుస్థితి ఉంది. అంగ్రాజ్పల్లిలో అందని హోమియో వైద్యంచెన్నూర్రూరల్: మండలంలోని అంగ్రాజ్పల్లి ప్రా థమిక ఆరోగ్యకేంద్రంలో నిత్యం 60 నుంచి 70 వర కు ఓపీ ఉంటుంది. ఓఆర్ఎస్, సైలెన్ బాటిళ్లు, మందులు సరిపడా ఉన్నాయి. పేషెంట్లకు చికిత్స చేసే గదిలో ఫ్యాన్లున్నాయి. ల్యాబ్లో టెస్టులు చేసేందు కు పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మసిస్ట్ లేరు. ఇక్కడ పని చేసే కాంట్రాక్ట్ హోమి యో వైద్యురాలు వేరే ఉద్యోగం వచ్చి వెళ్లగా 11 నెలలుగా పోస్టు ఖాళీగా ఉంది. హోమియో వైద్యం అందక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అధ్వానంగా హాజీపూర్ పీహెచ్సీ -
కమీషన్ల కోసమే కేసీఆర్ ఉద్యమం
జైపూర్: బీఆర్ఎస్ పాలనలో కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మించి రూ.వేల కోట్లు దండుకున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రస్తుతం మళ్లీ ఉద్యమిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించడం కమీషన్లు దండుకోవడానికేనని విమర్శించారు. మండల కేంద్రంలో మంగళవారం సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. గోదావరి తీర ప్రాంతాల్లో బొగ్గు, నీరున్న వద్ద పవర్ ప్రాజెక్ట్లు నిర్మించకుండా యాదాద్రిలో నిర్మించి రూ.25వేల కోట్లు ఖర్చు చేశారని, వనరులున్న వద్ద కాకుండా కమీషన్ల కోసమే ప్రాజెక్ట్లు నిర్మించారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని, రూ.60వేల కోట్ల నుంచి రూ.8లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక సీసీ రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ‘కాళేశ్వరం’ పేరుతో ప్రజాధనం వృథా చెన్నూర్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట గత ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజకవర్గంలో బాల్క సుమన్ హయాంలో వచ్చిన నిధులతోనే కాంగ్రెస్ అభివృద్ధి చేస్తోందని ఆరోపించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నిధులు తేస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. అభివృద్ధి జరిగితే ప్రజలు నిన్ను ఎందుకు ఓ డగొట్టారో ఆత్మ విమర్శ చేసుకోవాలని తెలిపారు. యువకులు జర్మనీలో ఉపాధి పొందేందుకు ఎమ్మె ల్యే కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూ చించారు. డిప్యూటీ తహసీల్దార్ సనత్కుమార్, ము న్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు అంబాటి శంకర్, కొమ్మెర జయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన సెల్ఫోన్లను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. సీడీపీవో మనోరమ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ఇందిరమ్మకాలనీ వెనకాల బుధాకలాన్ గ్రామ సర్వే నంబర్ 170లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు, షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్రమార్కులు గుట్టుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మించి విక్రయిస్తున్న తీరుపై మంగళవారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి తహసీల్దార్ ఎల్.కృష్ణ స్పందించారు. మంగళవారం గిర్దావర్ రమేశ్, పంచాయతీ అధికారి, ఇతర సి బ్బంది వెళ్లి ఇళ్లు, షెడ్లను ట్రాక్టర్తో కూల్చివేయించారు. ప్లాట్లుగా చేసి హద్దుల కోసం ఏ ర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను ధ్వంసం చేయించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్లు, షెడ్లు నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటశాల, సామగ్రి నిల్వ గదిని పరిశీలించి ఆహార తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత పాటించాలన్నారు. ఇంటర్లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆదర్శ గృహంలో కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల్లో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమై విద్యను అందించడం జరుగుతుందన్నారు. ధరిత్రి దినోత్సవం విజయవంతం చేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 22న ధరిత్రి దినోత్సవం విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డీఈవో యాదయ్యతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ప్రణాళిక సమన్వయకర్త భరత్ కుమార్, నాణ్యత సమన్వయకర్త జంబోజు సత్తయ్య, జెండర్ అండ్ ఈ క్వింటీ సమన్వయకర్త విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
బసవేశ్వర కృషి చిరస్మరణీయం
మంచిర్యాలఅగ్రికల్చర్: కుల వివక్ష నిర్మూలన కోసం బసవేశ్వర చేసిన కృషి చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాములు, సంక్షేమశాఖ అధికారులు భాగ్యవతి, దుర్గప్రసాద్ బసవేశ్వర చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో స మానత్వం శ్రామిక గౌరవం, కుల వివక్ష నిర్మూలన, నైతిక విలువల ప్రోత్సాహం కోసం బసవేశ్వర చేసిన కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. -
మంత్రులను కలిసిన ఐఎన్టీయూసీ నేతలు
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ జనక్ప్రసాద్ ఆధ్వర్యంలో నేతలు సోమవారం రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ, ఇతర అధికారులను కలిసి వినతిపత్ర ం అందించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కార్పొరేట్ మెడికల్ బోర్డును తక్షణమే నిర్వహించి 95 శాతం కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేయాలని, మెడికల్ ఫిట్ పూర్తయిన 400 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, నూతన గనులను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలవె న్స్లపై కార్మికులు చెల్లిస్తున్న ఆదా య పన్ను సంస్థనే చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, మెరుగైన క్యాడర్ స్కీమ్, ఇన్సె ంటివ్ వంటి సమస్యలు పరిష్కరించాలని కో రారు. మంత్రులను కలిసిన వారిలో యూ ని యన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహా రెడ్డి, పీ.ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మ య్య, జెట్టి శంకర్రావు, తదితరులు ఉన్నారు. -
‘కాంగ్రెస్ వ్యతిరేకించడంతోనే మహిళలకు అన్యాయం’
మంచిర్యాలటౌన్: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం మహిళా బిల్లును వ్యతిరేకించడం వల్ల తెలంగాణలో 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా, తొమ్మిది మంది మహిళలు ఎంపీలు అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగదని చెప్పడం కూడా సరికాదని, ఈ బిల్లును సైతం అడ్డుకున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్, కార్పొరేటర్ అనిత, నాయకులు వెంకటేశ్వర్రావు, కృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆంజనేయులు, స్వాతి, సుజాత, స్వప్న, రజిత, జయరామారావు, రాజ్కుమార్, స్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
డయాలసిస్ సెంటర్ పరిశీలన
లక్సెట్టిపేట: ఈ నెల 19న ‘కిడ్నీ రోగులకు ఊరట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి అనిత, ఆర్ఎంవో శ్రీధర్ స్పందించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఏర్పా టు చేయనున్న డయాలసిస్ సెంటర్ను పరి శీలించారు. డయాలసిస్ గదిలో ఉండాల్సిన సౌకర్యాలు పరిశీలించారు. తక్షణమే సెంటర్ ను ప్రారంభించి రోగులకు వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యులు ప్రసాద్, ప్రశాంతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్!
మంచిర్యాలఅర్బన్: టీజీఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 22నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె తలపెట్టారు. 32 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి మార్చి 13 న సమ్మె నోటీస్ అందజేసి దశలవారీగా ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ అంశాలు పరిష్కారం కాకపోవటంతో కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కార్మిక సంఘాలు, లేబర్ కమిషనర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యా యి. దీంతో ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి కార్మికులు సిద్ధంగా ఉండాలని జేఏసీ ప్రకటించగా.. ప్రభుత్వ స్పందనపైనే ప్రతిష్టంభన నెలకొంది. సంఘాలపై సమ్మె ప్రభావం గతంలో ఆర్టీసీలో 53 రోజుల సుదీర్ఘ సమ్మె కార్మిక సంఘాలపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి ప్రభుత్వం కార్మిక సంఘాల స్థానంలో 2019 డిసెంబర్లో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన హామీపై ఊసేలేకుండా పోయింది. పెండింగ్ సమస్యలు, కార్మికుల పనిభారం నేపథ్యంలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్తో సంతకాల సేకరణకు దిగారు. ఆర్టీసీలో రెండేళ్లకోసారి నిర్వహించే ఎన్నికల్లో ప్రతి ఓటరూ రాష్ట్ర, జిల్లా కమిటీకి రెండు ఓట్లు వేసే అవకాశముండేది. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు 2016లో చివరిసారి నిర్వహించగా.. కార్మిక సంఘాలకు బదులుగా సంక్షేమ మండళ్లు కొనసాగుతున్నాయి. డిపోలో తగ్గిన కార్మికులుఆర్టీసీలో 2019నుంచి ఇప్పటివరకు కార్మికుల సంఖ్య తగ్గింది. అప్పటి సమ్మె కాలంలో మంచిర్యాల డిపోలో 572 మంది ఉండగా, ప్రస్తుతం 468 మందికి పడిపోయింది. అద్దె బస్సులు పెరిగిపోవటం.. మునుపెన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ డ్రైవర్లను నియమించటంతో రెగ్యులర్ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. నూతన నియామకాలు చేపట్టకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం డిపోలో 148బస్సుల్లో సంస్థ బస్సులు 79 కాగా 69 అద్దె బస్సులున్నాయి. ఆర్టీసీ ౖడ్రైవర్లు 151 మంది, కండక్టర్లు 199 మంది, అవుట్సోర్సింగ్ (ఓఎస్) డ్రైవర్లు 28మంది ఉన్నారు. ట్రాఫిక్ విభాగంలో 20మంది, గ్యారేజ్, స్టోర్, సెక్యూరిటీ, ఆఫీస్ ఉద్యోగులు 70మంది విధులు నిర్వహిస్తున్నారు. -
ప్రభుత్వ స్థలం కబ్జా..!
బెల్లంపల్లి: ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు సెంట్ భూమిని సైతం వదలడం లేదు. విలువైన భూములను కబ్జా చేసి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ శివారు బుధాకలాన్ సర్వేనంబర్ 170లో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే ఆక్రమణకు గురైంది. మిగిలి ఉన్న కొద్దిపాటి భూమికూడా పరాధీనం అవుతోంది. బెల్లంపల్లి ఆర్ముడ్ రిజర్వుడు, ఇందిరమ్మ కాలనీ వెనకాల ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు హద్దురాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడక్కడ దర్జాగా శాశ్వత కట్టడాలు కడుతున్నారు. నిరుపేదలను ముందుపెట్టి కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో ప్లాట్కు రూ.4లక్షలు కబ్జా చేసిన స్థలంలో అక్రమార్కులు షెడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. ఓపెన్ ప్లాట్లను రూ.4 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. నయాపైసా పెట్టుబడి లేకుండా కబ్జాలకు తెరలేపి లక్షలు కూడబెట్టుకుంటున్నారు. ఈ దందా లాభసాటిగా ఉండటంతో సెంటు భూమి కూడా మిగలకుండా ఆక్రమిస్తున్నారు. చేతులు మారిన ఇందిరమ్మ ఇళ్లు గురిజాలకు వెళ్లే మార్గంలో దశాబ్దకాలం క్రితం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఈ స్థలాన్ని నిర్ధేశించగా క్రమంగా పరాధీనమైంది. నిజమైన లబ్ధిదారులు పదిమందికి మించి లేనట్లు తెలుస్తోంది. అట్టి భూమిపై అర్ధంతరంగా ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లపై కన్నేసిన ఓ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఏకంగా రియల్ ఎస్టేట్ దందా నిర్వహించారు. కొందరి ఇందిరమ్మ ఇళ్లను కబ్జా చేసి, మరికొందరి ఇళ్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒక్కో ఇంటిని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు చేయడంలో ఆరితేరిన ఓ మహిళ సంబంధిత అధికారులతో కుమ్మకై ్క పేదల ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను అక్రమించి అమ్ముకున్న సంఘటన అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మిగిలి ఉన్న భూమిని కబ్జా చేయడానికి పక్షం రోజుల నుంచి గుట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు.సీవోఈ గురుకులం కోసం...ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకు ల సెంటర్ ఆఫ్ఎక్స్లెన్సీ (సీవోఈ )పాఠశాల/కళాశాల ప్రహరీని ఆనుకుని ఉన్న ప్రభు త్వ భూమి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడేలా ఎవరికీ కేటాయించలేదు. మూ డేళ్లక్రితం అప్పటి ఆర్డీవో హరికృష్ణ దగ్గరుండి సర్వే చేయించారు. భూ ఆక్రమణ జరగకుండా హద్దులు ఏర్పాటు చేయించారు. ఖాళీ భూమిని సీవోఈ అనుబంధంగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు ఉపయోగించాలని, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో ప్రకటించారు. కానీ ఆయన బదిలీపై వెళ్లిపోవడం అక్రమార్కులకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే షెడ్లను ఏర్పాటు చేసి కబ్జా పర్వం సా గిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అటువైపు తొంగి చూ డక పోవడం ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై తహసీల్దార్ కృష్ణను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, రాములుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నెన్నెల మండలం నార్వాయిపేటకు చెందిన కై రత్ పాషా వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాలకు చెందిన సాయిని శ్రీనివాస్ పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని, తాండూర్ మండలం బోయపల్లికి చెందిన ఎలిగేటి సాయికుమార్ తమ తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు తమకు తెలియకుండా విక్రయించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. కన్నెపల్లి మండలం సాలిగాంకు చెందిన తాళ్లపల్లి నరేష్ తాను రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరిట ఆన్లైన్లో నమోదు చేయాలని, దండేపల్లికి చెందిన గుండా రవీందర్ తల్లితండ్రుల పోషణ చట్టం ప్రకారం తన కుమారుని నుండి ప్రతీనెల నగదు ఇప్పించాలని, మంచిర్యాలకు చెందిన కొత్త మాధవి, కొత్త కిరణ్ దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని, తిలక్నగర్కు చెందిన లింగన్నపేట సత్యనారాయణ వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని, లక్సెట్టిపేట మండలం పోతపల్లికి చెందిన ఆవునూరి రాయలింగు తనకున్న భూమి ప్రభుత్వ రికార్డులోకి ఎక్కించి పట్టా ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. -
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికా రులు, సహాయ ఎన్నికల అధికారులతో ఓటర్ల ప్ర త్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో త్వరలో చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితాను ఏబీసీడీ కేటగిరీలుగా విభజించి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు ఇంటింటా సందర్శించి వివరాలు సేకరించాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేసుకునేలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో స్పష్టమైన జాబితా రూపకల్పన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
విస్తృత ప్రచారం చేస్తున్నాం
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలోని 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలందరికీ ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తున్నాం. బాలికలతో పాటు తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పిస్తు న్నా వ్యాక్సిన్ వేసుకునేందుకు కొందరే ముందుకు వస్తున్నారు. దీంతో గ్రామాలు, పట్ట ణాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నాం. గర్భాశయ క్యాన్సర్ వస్తే దానిని ఎదుర్కోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది ప్రజల కు మరింతగా అవగాహన కల్పించి, అర్హులై న బాలికలందరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అనిత, జిల్లా వైద్యాధికారి -
బంగారం దుకాణంలో..
తానూరు: మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పి.సాయిప్రసాద్ బంగారు ఆభరణాలు తయారుచేసే దుకాణంలో చోరీ జరిగినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. శనివారం రాత్రి దుండగులు దుకాణం షెటర్ పైకిలేపి లోనికి చొరబడ్డారు. దుకాణంలో ఉన్న 300 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచి ఉండడంతో గమనించిన స్థానికులు యాజమానికి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై దుకాణంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించి క్లూస్టీం సిబ్బందిని రప్పించడంతో వేలిముద్రలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. -
సెంట్రల్ కస్టమ్స్ అధికారిగా నిర్మల్ యువకుడు
నిర్మల్ఖిల్లా:‘విజయం అంటే ఒక గమ్యం కాదు.. నిరంతర ప్రయాణం.’ సాధించిన దానితో సంతృప్తి చెందకుండా, ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలనే స్ఫూర్తిని ఆచరణలో చూపుతున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముడారపు విఘ్నేష్. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతిష్టాత్మకమైన కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించినప్పటికీ తన లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధన దిశగా అడుగులు వేస్తున్నాడు. విజయపథంలో సాగుతున్న ప్రయాణం.. జిల్లా కేంద్రానికి చెందిన ముడారపు వాణి–శ్రీనివాస్ దంపతుల కుమారుడు విఘ్నేష్. తన పాఠశాల విద్యాభ్యాసాన్ని స్థానిక వాసవి హైస్కూల్లో, ఇంటర్ ఐఐటీ రామయ్య కళాశాలలో పూర్తి చేశాడు. తన ప్రతిభతో ఎన్ఐటి నాగ్పూర్లో బీటెక్ సీటు సాధించాడు. గేట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 800 ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటిలో అవకాశం పొందినా, సివిల్స్ లక్ష్యంతో ఆ సీటును వదులుకోవడం ఆయన పట్టుదలకి నిదర్శనం. అంతటితో ఆగకుండా, రాష్ట్ర స్థాయి గ్రూప్–1 పరీక్షలో 488 ర్యాంకు సాధించినా, ఆశించిన స్థాయి ఉద్యోగం రాకపోవడంతో దానిని కూడా వదిలేశాడు. చివరకు ఆలిండియా స్థాయిలో నిర్వహించే ఎస్ఎస్సీ సీజీఎల్–2025 పరీక్షలో సౌత్ జోన్లో 700 ర్యాంకు సాధించి తాజాగా జీఎస్టీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. ఉన్నతోద్యోగం రావడం ఆనందమేం కానీ నా అసలైన లక్ష్యం సివిల్ సర్వీసెస్ అని, ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదే దిశగా సిద్ధమవుతున్నానని విఘ్నేష్ స్పష్టం చేస్తున్నాడు. -
మానవత్వంతో వైద్యం చేయాలి
నిర్మల్చైన్గేట్: వైద్యులు మానవత్వంతో వైద్యం చేయాలని ఏపీఐ (అసోసియేషన్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ జీ.నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ బ్యాంకెట్ హాల్లో ఆదివారం ఏపీఐ తెలంగాణ చాప్టర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ దామెర రాములు ఆధ్వర్యంలో ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్సింహులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా ఈ సభ నిర్మల్లో నిర్వహించడం హర్షనీయమన్నారు. ఆన్లైన్పై ఆధారపడి, సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. వైద్య విద్యను అభ్యసించి, అనుభవంతో కూడిన చికిత్స అందించే వైద్యుల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ రాజారావు, రాష్ట్ర బాధ్యులు ప్రొఫెసర్ నావల్ చంద్ర, ప్రొఫెసర్ చందర్, ప్రొఫెసర్ రమేశ్, ప్రొఫెసర్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ముధోల్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని కాల్వ గల్లీకి చెందిన కారగిరి రాందాస్(45) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం అతని భార్య లేచి చూసేసరికి ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో మహిళ మృతినెన్నెల: వడదెబ్బతో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గుండ్లసోమారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన చల్లూరి రుక్మ (55) తమ కూతురు శోభతో కలిసి ప్లాస్టిక్ కవర్లతో ఏర్పాటు చేసిన గుడిసెలో నివాసం ఉంటోంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన ఎండకు ప్లాస్టిక్ కవర్ కిందనే ఉన్న రుక్మకు వడదెబ్బ తాకింది. దీంతో వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురైంది. కూతురు శోభ 108కు సమాచారం అందించడంతో గ్రామస్తుల సాయంతో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. -
ఆత్మీయ కలయిక.. అనుబంధాల వేడుక
శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని ప్రగతి మైదానం ఆత్మీయ కలయికకు.. అనుబంధాలకు వేదికై ంది. ఆదివారం ‘ప్రగతి స్టేడియం పిలు స్తోంది.. రా’ పేరుతో మహా ఆత్మీయ సమ్మేళనం ని ర్వహించారు. ముందుగా సంత మైదానం నుంచి ప్రగతి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. అన ంతరం మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ శ్రీనివాస్, ఏఐటీయూసీ అధ్యక్షు డు వీ.సీతా రామయ్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావనీర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ మైదానం ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిందన్నారు. ఇక్కడి సీ ఈఆర్ క్లబ్లో ఎంతోమంది కళాకారులు తమ కళ ను మెరుగుపర్చుకోవడానికి వేదికై ందన్నారు. అనేక మంది క్రీడాకారులు, కళాకారులు ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించారన్నారు. రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను ఒకే వేది కపై చేర్చిన నిర్వాహక కమిటీని వక్తలు అభినందించారు. సింగరేణి ప్రగతిని కీర్తించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం సత్యనారాయణ, రిటైర్డ్ జీఎంలు పురుషోత్తం, జయరావు, పాండురంగారావు, ప్రేంకుమార్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ పిన్నింటి రఘునాథ్రెడ్డి, డీవైఎస్వో హన్మంతరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, కార్పొరేటర్ వేల్పుల రవీందర్, నిర్వాహక కమిటీ కోఆర్డినేటర్ యాదిరెడ్డి పాల్గొన్నారు. -
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 20 నుంచి 27 వరకు ఉమ్మడి జిల్లాలో జరిగే ఓపెన్ పదో తరగతి, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. – భోజన్న, డీఈవో, నిర్మల్ సెల్ఫోన్ నిషేధం ఓపెన్ పరీక్షలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశాం. హాల్టికెట్ల పంపిణీ పూర్తి అయ్యింది. ఇప్పటకే హాల్ టిక్కెట్ల పంపిణీ పూర్తి అయ్యింది. పరీక్ష నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. సెంటర్లోకి సెల్ఫోన్ నిషేధం. – జనార్దన్గౌడ్, పరీక్షల సహాయ కమిషనర్ -
‘ఓపెన్’కు సర్వం సిద్ధం
లక్ష్మణచాంద/కెరమెరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్త అశోక్ తెలిపారు. పదో తరగతి అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన.. ఎంత తీవ్రను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యసిబ్బంది, మందులు అందుబాటులో ఉంచనున్నారు. నిర్మల్ జిల్లాలో.. నిర్మల్ జిల్లాలో ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 1,035 మంది, ఇంటర్ పరీక్షలకు 747 మంది వి ద్యార్థులు హాజరుకానున్నారు. పదోతరగతికి 5, ఇంటర్కు 4 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. 9 మంది సీఎస్లు, 9 మంది డీవోలు, 9 మంది సిట్టింగ్ స్క్వాడ్, నలుగురు ఫ్లయింగ్ టీమ్, 95 మంది ఇ న్విజిలేటర్లను కేటాయించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.... మంచిర్యాల జిల్లాలో ఓపెన్ పది పరీక్షలకు 475 మంది, ఇంటర్ పరీక్షలకు 1,226 మంది హాజరుకానున్నారు. 8 పరీక్షా కేంద్రాలు, సీఎస్లు 8 మంది, డీవోలు 8 మందిని కేటాయించారు. ఆన్లైన్లో హాల్టికెట్లు... పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఓపెన్ పాఠశాలలో హాల్ టికెట్లు తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లు కూడా అనుమతిస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా సమాచారం ఓపెన్ ‘పది’ అభ్యర్థులు 3,053 ఇంటర్ అభ్యర్థులు 2,912 ‘పది’ పరీక్ష కేంద్రాలు 15 ఇంటర్ పరీక్ష కేంద్రాలు 14 సీఎస్లు 29 డీవోలు 29 ఆదిలాబాద్ జిల్లాలో... ఆదిలాబాద్ జిల్లాలో ‘పది’ పరీక్షలకు 900 మంది, ఇంటర్కు 584 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 7 పరీక్షా కేంద్రాలు, ఏడుగురు డీవోలు, ఏడుగురు సీఎస్లు, ఏడుగురు సిట్టింగ్ స్క్వాడ్ను కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాలో... ఆసిఫాబాద్ జిల్లాలో పది పరీక్షలకు 643 మంది, ఇంటర్ పరీక్షలకు 360 మంది హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలు 5, ఐదుగురు సీఎస్లు, ఐదుగురు డీవోలను కేటాయించారు. -
నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం నుంచి నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏ (ఎల్) కోర్సుల రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు, మొదటి, మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల (బ్యాక్ లాగ్) నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6, 8, 12, 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు.. కేయూ పరిధిలోని డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ సబ్జెక్టుల విద్యార్థులకు మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11, 13న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7, 8, 11, 13, 15, 18, 20, 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు మే 12, 14, 16, 21, 23, 25, 26, 28 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను సందర్శించిన అధికారులు.. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 69,427 మంది, ఖమ్మం జిల్లాలో 38,143 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 73,421 మంది విద్యార్థులు మొత్తం 1,80,991 మంది పరీక్షలు రాయనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 115 మంది అబ్జర్వర్లను నియమించారు. ఆన్లైన్లో జవాబుపత్రాల మూల్యాంకనం.. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో తొలిసారిగా ఆన్సర్షీట్లపై స్టిక్కర్లు అంటించనున్నారు. హాల్టికెట్ నంబర్, సబ్జెక్టుల పేర్లు, పరీక్ష కేంద్రంపేరు, కోడ్నంబర్తో కూడిన స్టిక్కర్లను రూపొందించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. హాల్టికెట్ నంబర్ను బట్టి విద్యార్థి ఆన్సర్షీట్పై స్టిక్కర్ను అతికిస్తారు. ఇక విద్యార్థి ప్రత్యేకంగా హాల్టికెట్ నంబర్రాసే అవసరం ఉండదు. ఈ సెమిస్టర్ల జవాబుపత్రాల మూల్యాంకనం ఇక ఆన్లైన్లో నిర్వహించనున్నారు. విద్యార్థి ఆన్సర్షీట్పై ఉండే స్టిక్కర్ను కాకుండా మిగతా ఆన్సర్షీట్ను స్కాన్చేసి ఆన్లైన్లో జవాబుపత్రాలను మూల్యంకనం చేసే అధ్యాపకులకు పంపుతారు. మూల్యాంకనం తర్వాత ఇక మాన్యువల్గా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ లేకుండానే విద్యార్థి ఆన్సర్షీట్పై ఉన్న స్టిక్కర్ ఆధారంగానే ప్రక్రియ పూర్తిచేస్తారు.


