breaking news
Mancherial
-
● సెటిల్మెంట్లు, వసూళ్ల దందాపై పోలీస్ బాస్ సీరియస్ ● ‘విచ్చలవిడి’ ఉద్యోగులకు సీపీ కళ్లెం ● ఫిర్యాదు అందగానే విచారణ, చర్యలు
పోలీస్ శాఖ ప్రతిష్ట కాపాడేలా.. పోలీస్ శాఖకు అప్రతిష్ట తెచ్చే వారిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాల ద్వారా నిఘా ఉంచారు. ఈ విభాగాలు సేకరించిన సమాచారం సీపీకి అందుతోంది. చాపకింద నీరులా విచారణలు సాగుతున్నాయి. శాఖ ప్రతిష్టను కాపాడేందుకు నిరంతర నిఘా కొనసాగుతోంది. ఇటీవల ముగ్గురు పోలీసు ల సస్పెన్షన్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. క్రమశిక్షణ, నిబద్ధత, జవాబుదారీతనంతో పనిచేయాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పదేపదే హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్లు, సమస్యాత్మక ప్రాంతాలను పర్యటించి, ఒకే చోట దీర్ఘకాలం పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.మంచిర్యాలక్రైం: పోలీస్.. అంటే నాటులో సింహం.. ఈ కనిపించని కొందరు నాలుగో సింహాలు.. గాడితప్పుతున్నారు. పోలీస్ పవర్ ఉపయోగించి సెటిల్మెంట్లు, వసూళ్ల దందాలకు పాల్పడుతున్నారు. భూకబ్జాలు చేస్తున్నారు. పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు. ఇలాంటి వారిపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొరడా ఝళిపిస్తున్నారు. కఠిన చర్యలతో క్రమ‘శిక్ష’ణ నేర్పుతున్నారు. అప్రతిష్ట తెచ్చే అధికారులపై తీసుకుంటున్న చర్యలు ఇప్పడు ఆ శాఖలో కలకలం రేపుతున్నా యి. ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు చేపడుతుండడంతో పోలీసుల్లో గుబులు మొదలైంది. అక్రమాలకు పాల్పేందుకు జంకుతున్నారు. ఇక గతంలో పోలీసులపై ఫిర్యాదు చేయడానికి జంకిన బాధితులు ఇప్పుడు నేరుగా కమిషనర్ను సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఫిర్యాదులపై సత్వర విచారణ, చర్యల కారణంగా కమిషనరేట్ పరిధిలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జైపూర్ పోలీస్ స్టేషన్లో వరుస ఘటనలు.. జైపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. ఓ హెడ్ కానిస్టేబుల్ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, అదే మహిళతో పరిచయం ఉన్న ఓ హోం గార్డ్పై కక్ష పెంచుకున్నాడు. ఈ కక్షతో హోంగార్డ్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అయితే, హోంగార్డ్ కుటుంబ సభ్యులు అసలు విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో, విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేశారు. అదే స్టేషన్లో మరో కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ను వేధించి, అసభ్యకరమైన సందేశాలు పంపడంతో, బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాని స్టేబుల్ను సీపీ సస్పెండ్ చేశారు. ఒకే పోలీస్ స్టేషన్లో వరుస ఘటనలు శాఖలో కలకలం రేపాయి. అవినీతి, అక్రమాలపై నిఘా.. పోలీస్ శాఖలో అవినీతి, వివాహేతర సంబంధాలు, భూ సెటిల్మెంట్లు, అక్రమ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసులపై సీపీ నిఘా పెట్టారు. క్రైం మీటింగ్లలో క్రమశిక్షణ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వక వ్యవహారం, శాఖకు మచ్చ తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల, దండేపల్లి, బెల్లంపల్లి, చెన్నూర్, కోటపల్లి పోలీస్ స్టేషన్లలో రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి సెటిల్మెంట్లు చేస్తున్నవారి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల ముందు వీరిపై బదిలీ వేటు, శాఖాపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది.క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలుపోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వా రు ఎంతటి వారైనా.. శాఖపరమైన చర్యలు తప్పవు. పోలీసులు ప్రజలకు జవాబు దారీగా, మార్గదర్శకంగా ఉండాలి. పోలీస్ శాఖలో ప్రక్షళన చేస్తున్నాం. చట్టానికి పోలీసులు అతీతులు కారు. నేరం చేస్తే శిక్ష తప్పదు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
రెడ్ల సంక్షేమానికి కృషి
చెన్నూర్రూరల్: రెడ్డి కుల సంక్షేమానికి కుల బాంధవులంతా కృషి చేయాలని రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. కిష్టంపేట గ్రామంలోని బీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాస్రెడ్డితోపాటు జిల్లా అధ్యక్షుడు గుర్రాల మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీధర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రెడ్లందరూ ఏకం కావాలన్నారు. పేద రెడ్డి కులస్థులకు సహాయం చేయాలని కోరారు. అనంతరం అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన రెడ్డి జాగృతి సంఘం నాయకులు గొడిసెల బాపురెడ్డి, పోటు రాంరెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, రత్న లక్ష్మీనారాయణరెడ్డి, పోటు సత్యనారాయణరెడ్డి, వెన్నపురెడ్డి బాపురెడ్డి, మహిళలు పాల్గొన్నారు. -
విద్యారంగానికి నిధులేవి..?
మంచిర్యాలఅర్బన్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించడం లేదని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజ్ ప్రశ్నించారు. మంచిర్యాల మార్క్స్ భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రం ఆదివా రం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తోందన్నారు. విద్యారంగ సమస్యలు చెప్పుకోవడానికి కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేదని విమర్శించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్మెంట్, కాస్మొటిక్ చార్జీ లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా డీఈవో, ఎంఈవో, టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించే విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సహయ కార్యదర్శి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు సికిందర్, రాజ్కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
‘లాభాల ప్రకటనపై మౌనం ఎందుకు?
రామకృష్ణాపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలను ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటే, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మౌనం వహించడంలో ఆంతర్యం ఏమిటని సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు ఎస్.వెంకటస్వామి ప్రశ్నించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. లాభాల వాటాపై ఎప్పుడూ గొప్పలు చెప్పే ఏఐటీయూసీ ఆగస్టు వచ్చినా లాభాల ప్రకటనపై యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. లాభాల విషయంలో గుర్తింపు సంఘం వైఖరిపై కార్మికులు గుర్రుగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రత్యేక చొరవ తీసుకుని లాభాలు ప్రకటించేలా ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో నాయకులు వడ్లకొండ ఐలయ్య, సంజీవ్, ప్రవీణ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లాభాల లెక్క తేలేదెన్నడో?
సింగరేణి కార్మికులుశ్రీరాంపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల లెక్క తేల్చకుండా నానుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా లాభాలు ప్రకటించకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, 69.01 మిలియన్ టన్నులు సాధించింది. ఏప్రిల్ 1, 2025న లెక్కలను సమీక్షించిన యాజమాన్యం నాలుగు నెలలు గడిచినా లాభాల వివరాలను వెల్లడించలేదు. వాటా కోసం కార్మిక సంఘాల డిమాండ్.. సింగరేణి లాభాలను ప్రకటించిన తర్వాత, ఆ లాభాల్లో నిర్దిష్ట శాతాన్ని కార్మికులకు వాటాగా చెల్లించడం ఆనవాయితీ. కానీ, లాభాల ప్రకటనలో జాప్యం కారణంగా కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించిన తర్వాత, కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి లాభాల వాటా ప్రకటించాలని కోరుతున్నారు. ఈసారి కూడా లాభాల ప్రకటన ఆలస్యం కావడంతో కార్మికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాలు, లాభాల లెక్కింపు సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, క్రయవిక్రయాలు ఆర్థిక సంవత్సరం ఆధారంగా జరుగుతాయి. ఈ లెక్కల ఆధారంగానే లాభాలను నిర్ధారిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యంలో 69.01 మిలియన్ టన్నులు సాధించినప్పటికీ, లాభాల వివరాలు బయటకు రాకపోవడం కార్మికులను కలవరపెడుతోంది. ‘‘ఈసారైనా త్వరగా లాభాలు ప్రకటిస్తారని ఆశించాం, కానీ ఇంకా ఎలాంటి సమాచారం లేదు’’ అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాల ప్రకటన జాప్యంతో కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీ లాభాలను త్వరగా ప్రకటించి, కార్మికులకు వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా తేల్చని సింగరేణి లాభాల్లో వాటా కోసం కార్మికుల ఎదురు చూపు యాజమాన్యం తీరుపై అసంతృప్తిలాభాలు ప్రకటించాలికంపెనీ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి. అందులో కార్మికులకు వాటా చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే లాభాలు ప్రకటించకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదు. వాటా డబ్బులు సమయానికి చెల్లిస్తే పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు పనికొస్తాయి. – ఎస్కే.బాజీసైదా, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి35 శాతం వాటా చెల్లించాలిఈసారి బొగ్గు ఉత్పత్తి పెరిగినందున లాభాల వాటా కూ డా పెంచి ఇవ్వాలి. లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసి నా లుగు నెలలు గడిచినా లాభాలను ప్రకటించకపోవడం గుర్తింపు సంఘం వైఫల్యమే. – వి.అనిల్రెడ్డి, హెచ్ఎమ్మెస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు -
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనందండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర పెరగడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నాయి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) తన నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్రమాద బీమా పథకాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథ కం కింద రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతినిధులు, వ్యవసాయాధికారులు నానో యూరి యా ప్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంతోపాటు సంకటహరణ బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బీమా అర్హతలు.. సహకార సంఘాల ద్వారా ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరిమితి లేకుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్పై రూ.10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100% పరిహారం, రెండు అవయవాలు కోల్పోతే 50%, ఒక అవయవం కోల్పోతే 25% పరిహారం అందుతుంది. ఈ బీమా ఎరువులు కొనుగోలు చేసిననాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది. కొనుగోలు సమయంలో జాగ్రత్తలు.. ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీదుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలు దారుని సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగిన సందర్భంలో బీమా పరిహారం పొందడానికి అసలు రశీ దు తప్పనిసరి. దీంతోపాటు, విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్లెయిం పత్రాలు ప్రమాదం జరిగిన రెండు నెలల్లోగా సికింద్రాబాద్లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలి.రైతులకు ప్రయోజనకరంసహకార సంఘాల ద్వారా ఇప్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తుంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఆసంస్థ ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసుకోవాలి. – అంజిత్కుమార్, ఏవో, దండేపల్లి -
ఆశాజనకంగా పత్తి
బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గంలో పత్తి పంట ఆశాజనకంగా సాగవుతోంది. మొన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడగా, ఇటీవల అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలో భీమిని, బెల్లంపల్లి రెండు వ్యవసాయ డివిజన్లు ఉండగా వీటి పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు భీమిని, కన్నెపల్లి, నెన్నెల, బెల్లంపల్లి, వేమనపల్లి, తాండూర్ మండలాల్లో అక్కడక్కడా చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రేగడి నేలల్లో నీటితడి ఆరకపోవడం, లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునగడం కూడా పంటలను ప్రభావితం చేస్తున్నాయి. భా రీ వర్షాలు లేక పోవడంతో పంట నష్టం ఈసారి బాగా తగ్గిందని వ్యవసాయ అధికారులు పే ర్కొంటున్నారు. తెగుళ్ల నివారణ కోసం క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తుండడంతో చీడపీడల బెడద కాస్తా తగ్గిందని తెలిపారు. -
సింగరేణి గిరిజన ఉద్యోగుల కమిటీ అధ్యక్షుడి ఎన్నిక
జైపూర్: సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా ధరావత్ పంతులానాయక్ ఎన్నికయ్యారు. గోదావరిఖనిలో గిరిజ న ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం11 ఏరియాల గిరిజన ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీపీపీలో డీజీఎం డి.పంతులానాయక్ను సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆయన ఇప్పటికే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పలువురు ఉద్యోగులు, అధికారులు పంతులు నాయక్కు శుభాకాంక్షలు తెలిపారు.అధ్యక్షుడిగా ఎన్నికై న పంతులానాయక్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నస్పూర్: చిన్ననాటి నుంచి దేశానికి సేవ చేయాలని కన్న కలలు నెరవేరకుండానే రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడు మృత్యుఒడిలోకి చేరిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన చిలువేరు సాగర్(23), మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్, నిజామాబాద్కు చెందిన విష్ణువర్ధన్ మంచిర్యాల జిల్లా నస్పూర్లోని ఓ డిఫెన్స్ అకాడామీలో శిక్షణ పొందుతున్నారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఆదివారం సాయంత్రం ఓ ఫంక్షన్కు వెళ్లేందుకు గిఫ్ట్ కొందామని బైక్పై బయల్దేరారు. స్థానిక రాయల్ గార్డెన్ చౌరస్తా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ కట్టడంపై పడింది. దీంతో సాగర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్, విష్ణువర్ధన్ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాకేశ్ పరిస్థతి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించారు. సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
● ఐదుగురికి తీవ్రగాయాలుసారంగపూర్: మండలంలోని చించోలి(బి) శివారు లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం ఆదిలాబాద్ డిపోకు చెందిన ప్రైవేటు ఆర్టీసీ బస్సు నిర్మల్వైపు వెళ్తుండగా నిర్మల్ వైపు వస్తున్న ఇదే డిపోకు చెందిన మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఘటనలో వెనుకవైపు నుంచి ఢీకొట్టిన బస్సులో ప్రయాణిస్తున్న లక్ష్మణచాందకు చెందిన తోకల సునీత, ఆశీన్, ఆదిలాబాద్కు చెందిన కార్తీక్ గౌడ్, ఉట్నూర్కు చెందిన ఇందిరా, సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్కు చెందిన కాంతాబాయికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్ సిందే అజయ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పశువుల చోరీ కేసులో ఒకరి అరెస్టు
ముధోల్: ముధోల్లో ఇటీవల జరిగిన పశువుల చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ అవినాష్కుమార్ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల హంగీర్గ భోజన్న అనే రైతుకు చెందిన పశువులు దొంగిలించబడ్డాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ నైలు, ఎస్సైలు బిట్లా పెర్సీస్, జుబేర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మహ్మద్ ఫైజాన్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురు నిందితులు కేసులో ఉన్నారని, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ ముఠా సభ్యులు ముందుగా పశువులకు మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడుతున్నారన్నారు. పశువుల మాంసానికి మహారాష్ట్రలో డిమాండ్ ఉండడంతో ఈ పనులకు పాల్పడుతున్నారని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ నైలు, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిర్ పాల్గొన్నారు. -
నిర్మల్ ఏజెంట్లను స్ఫూర్తిగా తీసుకోవాలి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ ఎల్ఐసీ ఏజెంట్లను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు రాజయ్య పేర్కొన్నారు. పట్టణంలోని మంజులపూర్లో నూతనంగా నిర్మించిన సంఘ భవనాన్ని ఆదివారం ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోళ్ల మురళీధర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం బ్రాంచ్ కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, భాస్కర్, క్యాషియర్గా వినోద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ బ్రాంచ్ ఏజెంట్లు ఐక్యంగా ఉండి ఒక సొంత భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా నాయకులు ధర్మపురి, ఖానాపూర్ నాయకులు లింగన్న, నిర్మల్ నాయకులు రామారావు, రమేశ్, శ్రీనివాస్, జహీర్, గంగాధర్, రాజమోహన్ రెడ్డి, వసంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘నులి’పేద్దాం..!
● నులిపురుగులతో ఆరోగ్యానికి చేటు ● 19 ఏళ్లలోపు వారిపై తీవ్ర ప్రభావం ● నివారణకు నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● ఉమ్మడి జిల్లాలో 7,24,227 మంది గుర్తింపు రక్తహీనత.. పోషక లోపం.. ముఖ్యంగా 19 ఏళ్లలోపు పిల్లలపై నులి పురుగులు, ఏలికపాములు, కొంకి పురుగుల ప్రభా వం అధికంగా ఉంటుంది. ఇవి సంక్రమిస్తే పి ల్లల్లో రక్తహీనతకు గురవుతారు. పోషకాహార లోపం కనిపిస్తుంది. కడుపునొప్పితో పాటు శ రీరం బలహీనతగా అనిపిస్తుంది. ఆందోళనకు గురవుతారు. క్రమంగా బరువు కూడా తగ్గుతా రు. ఏకగ్రాత లోపిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. తదితర లక్షణాలు కనిపిస్తే నులి పురుగులు సంక్రమించినట్లుగా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు. మంచిర్యాలటౌన్/లక్ష్మణచాంద/ఆదిలాబాద్టౌన్/కౌటాల: చిన్నారులను పట్టిపీడించే ఆరోగ్య సమస్యల్లో నులి పురుగులు ప్రధానమైనవి. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి. రక్తహీనత, పోషకలోపంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన చేయడం, చెప్పులు తొడుక్కోకుండా తిరగడం, ఆడుకోవడం, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రపర్చుకోకపోవడంతో తరచూ పిల్లలు కడపునొప్పి, విరేచనాల బారిన పడుతుంటారు. చిన్నారుల పొట్టలో ఏళ్ల తరబడి తిష్టవేసి ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులతో జాగ్రత్తలు తప్పనిసరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వీటిపై ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ముందు జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. నులి పురుగుల నివారణలో భాగంగా ప్రభుత్వం ఏటా రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 11న జాతీయ నులి పురుగుల నివారణ దినంగా జరుపుతున్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7,24,227 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వారందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. నులి పురుగులు అంటే.. నులి పురుగులు అనేవి మానవుల్లో పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్నజీవులు. ఇవి పిల్లలు ఆరుబయట మట్టిలో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం, అపరిశుభ్ర పరిసరాలతో నులి పురుగులు చిన్నారుల చెంతకు చేరుతాయి. నులిపురుగులు కలిగిన చిన్నారులు నులి పురుగుల గుడ్లు కలిగిన మలంతో నేలను కలుషితం చేస్తాడు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఆరుబయట మట్టిని ముట్టడం, లేదా ఈ నులిపురుగుల గుడ్లు చేరిన ఆహారం తీసుకోవడం వల్ల ఇతర పిల్లల కడుపులోకి వెళ్లి అక్కడ వృద్ధి చెందడం మొదలు పెట్టి అక్కడే తిష్టవేస్తాయి. 19 ఏళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. చప్పరించి మింగాలి అల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్న భోజనం తరువాత అందించనున్నారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర, 2 నుంచి 3 సంవత్సరాల వారికి ఒక మాత్రను పొడి చేసి నీటితో మింగించాలి. 3 నుంచి 19 ఏళ్ల వారు ఒక మాత్రను చప్పరించి మింగాలి. ఇది నేరుగా మింగే మాత్ర కాదు. నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. సోమవారం మాత్రలు తీసుకోని వారికి ఈ నెల 18న మరోసారి మాత్రలు వేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1–19 ఏళ్లలోపు విద్యార్థులు జిల్లా విద్యార్థులు మంచిర్యాల 1,58,400 నిర్మల్ 1,91,998 ఆదిలాబాద్ 2,06,127 ఆసిఫాబాద్ 1,67,702తప్పనిసరిగా వేయించాలి 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – రాజేందర్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూడాలి. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి. స్వచ్ఛమైన నీటినే తాగాలి. చేతి గోర్లను చిన్నగా కత్తిరించుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ఉంటేనే బయటకు వెళ్లాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – హరీశ్రాజ్, జిల్లా వైద్యాధికారి, మంచిర్యాల ఏర్పాట్లు పూర్తి చేశాం జిల్లా వ్యాప్తంగా నేడు అ న్ని ప్రభుత్వ, ప్రేవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోల్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు తప్పనిసరిగా 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ మాత్రలు వేయించాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలను వేయించాలి. – సీతారాం, డీఎంహెచ్వో, ఆసిఫాబాద్ -
ప్రమాదవశాత్తు కాలువలోపడి ఒకరు..
సోన్: ప్రమాదవశాత్తు కాలువలోపడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని న్యూ వెల్మల్ గ్రామానికి చెందిన బొడ్డు సుధాకర్ (37) ఆదివారం వరుసకు సోదరుడైన బొడ్డు పెద్ద లస్మన్నతో కలిసి పంటచేనుకు వెళ్లాడు. సరస్వతి కాలువలో లస్మన్న ఏర్పాటు చేసిన మోటార్ నుంచి నీళ్లు రాకపోవడంతో సుధాకర్ ఫుట్బాల్ పైపుకు తట్టుకున్న చెత్తను తీసివేసే క్రమంలో కాలుజారి కాలువలోపడి మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్చార్జి ఎస్సై నర్సయ్య తెలిపారు. -
ఆదివాసీలకు అధికారుల కౌన్సెలింగ్
జన్నారం: అడవిలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న జైనూర్, సిర్పూర్ మండలాలకు చెందిన పలువురు ఆదివాసీ గిరిజనులకు ఆదివారం అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీధరచారితో పాటు లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై అనూష, దండెపల్లి ఎస్సై తహసీనొద్దీన్, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ ఇందన్పల్లి అటవీ రేంజ్, కవ్వాల్ అటవీ సెక్షన్, సొనాపూర్ బీట్ పాలఘోరి ప్రాంతానికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అటవీభూమిలో నివాసం ఉండటం చట్టవిరుద్ధమని, ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సీఐ సూచించారు. అయితే పూర్వీకుల నుంచి ఈ భూమి మాదే అని కాగితాలున్నాయని, అందుకే నివాసం ఉంటున్నామని వారు పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో, తహసీల్దార్కు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు ఆదివాసీలు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు..
తాండూర్: రోడ్డు ప్రమాదంలో సింగరేణి మాజీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొత్త గుడిసెల కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు గణపతి రాజయ్య (60) ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తూ కొత్తపల్లి వైపు వెళ్తుండగా బైక్పై వచ్చిన దెబ్బటి శ్రావణ్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రాజయ్య అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రావణ్ను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గుండెపోటుతో అంగన్వాడీ టీచర్.. ఉట్నూర్రూరల్: మండలంలోని రామ్ లింగంపేటకు చెందిన అంగన్వాడీ టీచర్ సీహెచ్ విజయ (64) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమగ్ర బాలభ్యుదయ పథకంలో కొన్ని దశాబ్దాలుగా అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న విజయ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం చాతిలో నొప్పివస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిందని ఆమె భర్త స్వామి తెలిపారు. పేద కుటుంబానికి చెందిన విజయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
24 గంటల్లోనే దొంగ పట్టివేత
● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవికుమార్ రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి పద్మావతికాలనీలో భారీ చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీపుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్రెడ్డి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లిలో ఉంటున్న సింగరేణి కార్మికుడు మేకల రాజయ్య గద్దెరాగిడిలో నూతనంగా ఇల్లు నిర్మించాడు. శుక్రవారం కొత్తింట్లో వరలక్ష్మీ వ్రతం చేశారు. కుటుంబసభ్యులు, బంధువులు రాత్రి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున రాజయ్య లేచి చూసేసరికి ఇంట్లోని బ్యాగులు చిందరవందరగా పడి ఉన్నాయి. బ్యాగులో దాచిన దాదాపు 40 తులాల బంగారు ఆభరణాలు, ఓ సెల్ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీపుటేజీలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి పలుచోట్ల కనిపించడంతో పాత నేరస్థుడు జాడి సురేష్గా గుర్తించారు. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది తానేనని ఒప్పుకోవడంతో బంగారు ఆభరణాలతో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలలోని రాజీవ్నగర్కు చెందిన సురేష్పై గతంలోనూ పలు చోరీ కేసులున్నాయని, ముఖ్యంగా శుభకార్యాలు జరిగే ఇళ్లపై ఎక్కువగా దృష్టి సారిస్తాడన్నారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, మందమర్రి ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు. దొంగను పట్టుకోవటంలో చాకచక్యంగా వ్యవహరించిన పలువురు పోలీసులకు ఏసీపీ రివార్డులను అందించారు. -
పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెన్నూర్రూరల్: వర్షాలు కురవడంలో ఆలస్యమైన సమయాల్లో, వర్షాలు అధికంగా ఉన్న సమయాల్లో, వర్షాలు ముఖం చాటేసినప్పుడు పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ వివరించారు. కొన్ని సమయాల్లో అంతరపంటలు వేసుకోవాలని సూచించారు. వర్షాలు ఆలస్యంగా వచ్చిన సమయంలో.... రుతుపవనాలు ఆలస్యమైన సమయాల్లో పత్తిలో స్వల్పకాలిక బీజీ–2 రకాలను ఎన్నుకోవాలి. 1–3 వంతు నత్రజని, 1–3 వంతు పొటాషియం, పాస్పరస్ మొత్తాన్ని దుక్కిలో వేసుకోవాలి. ఇలా చేయడంతో మొక్క లేత దశలో పెరుగుదల బాగా ఉంటుంది. తరచూ అంతరకృషి చేయాలి. ఇలా చేయడం వలన మొక్కకు కావాల్సిన తేమ అందుతుంది. కలుపు ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. దీంతో భూమిలోని తేమకు, పోషకాలకు మధ్య పోటీ ఉండదు. తేమ ఉన్నప్పుడే.. వర్షాలు కురవడంలో ఆలస్యమైతే నేలలో సరిపడా తేమ ఉన్నప్పుడే ఎరువులు వాడాలి. లేదంటే 2 శాతం యూరియా ద్రావనాన్ని 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాలి. తరచూ అంతరకృషి చేయడం వల్ల పంట కలుపు లేకుండా అలాగే మొక్కకు కావాల్సిన తేమ అందుతుంది. రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచాలి. వర్షాలు అధికంగా కురిసిన సమయంలో.... వర్షాలు అధికంగా కురిసిన సమయంలో నీటిని కాలువల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేయాలి. బూస్టర్గా 30 కిలోల నత్రజనిని హెక్టారుకు అందించాలి. అంతరకృషి చేసి నేలను తెరిచినట్లయితే ఎక్కువగా ఉన్న నీరు ఆవిరై పోతుంది. హీలియంతున్ ఉదృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు డైప్లూటెంజురాన్ను హెక్టారుకు 250–300 గ్రాములు పిచికారీ చేయాలి. పెరుగుదల అతిగా ఉంటే కొనలను తుంచివేయాలి. కాయకుళ్లు తెగులు రావడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి దానిని అదుపులో ఉంచుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేసుకోవాలి. వర్షాలు ఆగిన సమయాల్లో వర్షాలు ఆగిన సమయాల్లో మొక్కకు పోషకాలు అందించాలి. ఇందుకు గానూ 2 నుంచి 3 సార్లు 2 శాతం యూరియా ద్రావణాన్ని ఆకులపైన పిచికారీ చేయాలి. తరచూ అంతరకృషి చేసి కలుపు నివారణతో పాటు మొక్కకు కావాల్సిన తేమను అందజేస్తూ ఉండాలి. అంతర పంటలుగా పెసర, సోయాబీన్, మినుము వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలి. వర్షాలు ముఖం చాటేస్తే.. వర్షాలు అసలే కురియకపోతే ఆగస్టు తర్వాత పత్తిని విత్తకూడదు. ఇలాంటి సూచనలు పాటించినట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆల య అర్చకులు వేకువజామున శ్రీమహాలక్ష్మీ, సరస్వతి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, హారతి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆలయంలో అమ్మవారి దర్మనానికి బారులు తీరా రు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంకాగజ్నగర్టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి డిసెంబర్ 13న నిర్వహించనున్న పరీక్షకు ఈ నెల 13లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆధార్కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని భగవంతంవాడకు చెందిన నులిగొండ మల్లేశ్ కూతురు అనుషా (23) డిగ్రీ వరకు చదివి ఇంటివద్దే ఉంటోంది. నాలుగేళ్ల క్రితం డిగ్రీ చదువుతున్న సమయంలో అదే కళాశాలలో చదువుతున్న జైపూర్ మండలం కుందారంకు చెందిన రంగుల శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరుకావడంతో అనుషా తల్లితండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదే అదనుగా భావించిన శ్రీకాంత్ నగలు, నగదు తెస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా తమవద్ద ఉన్న ఫొటోలు బయటపెడతానని బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతికి కారణమైన రంగుల శ్రీకాంత్, తండ్రి కిష్టయ్య, తల్లి రాజేశ్వరి, అన్నయ్య రమేశ్పై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వెండి కిరీటం బహూకరణకుంటాల: ప్రాచీన శ్రీకృష్ణ దేవాలయంలోని కృష్ణుని విగ్రహానికి కుంటాల గ్రామానికి చెందిన చిప్ప కృష్ణవేణి–సాయినాథ్ సీనియర్ సైంటిస్ట్ దంపతులు ఆదివారం రూ.1.45 లక్షల విలు వైన వెండి కిరీటాన్ని బహూకరించారు. 12 గ్రాముల బంగారం, 350 గ్రాముల వెండితో కిరీటం తయారు చేయించినట్లు దాత తల్లిదండ్రులు గంగామణి, హన్మాండ్లు తెలిపారు. -
పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారం
● హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ రెబ్బెన: పోరాటాల ద్వారానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. శనివారం గోలేటి టౌన్షిప్లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇప్పటి వరకు డైరెక్టర్ స్థాయి అధికారులతో కమిటీ సమావేశాలు జరిపినా కార్మికులకు సంబంధించిన ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. సొంతింటి పథకం అమలు, ఆదాయపు పన్ను మాఫీ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికై 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. యాజమాన్యంతో ములాఖత్ అయి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఇచ్చిన హామీలపై గనులపై నిలదీయాలని పిలుపునిచ్చారు. జూలై 31న జరిగిన మెడికల్ బోర్డులో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కార్మికులందరికి రీ మెడికల్ నిర్వహించి అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సారయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, ఏరియా కార్యదర్శి శివారెడ్డి, ఏరియా ఆర్గనైజర్లు ఎస్కే ఇనూస్, మరిశెట్టి దత్తు, పిట్ కార్యదర్శి ఎండీ ఆరీఫ్, ఖైరిగూడ పిట్ కార్యదర్శి రామకృష్ణ, నాయకులు తిరుపతి, బాలేష్, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి
● రాఖీ కట్టించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం ● బాసరలో పండుగపూట విషాదం బాసర/నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకుని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవిత దంపతులకు కుమార్తె సాయిప్రియ, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ (19) ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా శనివారం బబ్లూ నిజామాబాద్లోని గాజుల్పేట్లో ఉంటున్న కవిత వద్దకు చిన్నాన్న కుమారుడైన అరవింద్తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందుగా వెళ్తున్న కంటెయినర్ను ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గద్దెరాగిడిలో భారీ చోరీ
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధి గద్దెరాగిడిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సింగరేణి కార్మికుడి ఇంట్లో 40 తులాల బంగారం, ఐఫోన్ అపహరించుకెళ్లారు. బాధితుల కథనం ప్రకారం.. భూపాలపల్లిలో సింగరేణి కార్మి కుడిగా పనిచేస్తున్న మేకల రాజయ్య గద్దెరాగిడిలో నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఇతర శుభకార్యాలు ఉండడంతో గురువారం ఇక్కడికి వచ్చారు. రాజయ్య దంపతులతోపాటు సమీప బంధువు సింధు, శ్రీనివాస్ దంపతులు కూడా వచ్చారు. రాజయ్య భార్య స్వరూపకు చెందిన 30తులాల బంగారు ఆభరణాలు, ఆమె చెల్లి కూతురు సింధు, శ్రీనివాస్ దంపతులకు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు వేర్వేరు పర్సులో పెట్టి నిద్రకు ఉపక్రమించారు. కాగా, రాత్రి మూడు గంటల ప్రాంతంలో రాజయ్యకు మెలకువ వచ్చి చూడగా పర్సులు చిందరగా పడి ఉన్నాయి. బంగారు ఆభరణాలు, ఐఫోన్ చోరీకి గురయ్యాయని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, ఆర్కేపీ ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించి.. ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నూతన ఇంటి కిటికీలకు గ్రిల్ లేకపోవడంతో దొంగలు లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీ ఘటన పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. 40తులాల బంగారం, ఐఫోన్ అపహరణ -
ఆదివాసీల హక్కులను కాపాడుకుందాం
● రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి ● దండేపల్లిలో ఆదివాసీ దినోత్సవ వేడుకలుదండేపల్లి: ఆదివాసీల హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. దండేపల్లిలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాళ్లపేటలో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి దండేపల్లి వరకు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. దండేపల్లి అంగడిబజారులో ఆదివాసీ జెండాను తిరుపతి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కనక జంగు, ఆదివాసీ సంఘాల నాయకులు రాంపటేల్, సోము, కాంతరావు, జలపతి, అర్జున్, రవి, అనంత్, నరేందర్, కిషన్, విక్రమ్, ఎల్లయ్య, లాల్సాబ్, రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత గుట్కా పట్టివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాపల్లి స్టేజీ వద్ద శనివారం పోలీసుల తనిఖీల్లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచి ర్యాల వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని అనుమానంతో తనిఖీ చేశారు. నిషేధిత గుట్కా బ్యాగులు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 30బ్యాగుల గుట్కా విలువ సుమారుగా రూ.1.70 లక్షలు ఉంటుందని, గుట్కా నిల్వలను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, గంగాధర్, సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు. -
రాఖీ సంబరం
సెల్ఫీ విత్ రాఖీనస్పూర్/నెన్నెల: జిల్లాలో రాఖీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శనివారం అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. నస్పూర్లో శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గని కార్మికుడు జాడి రాజ్కుమార్ తన అక్కాచెల్లెలు మమత, మళ్లీశ్వరిలతో కలిసి మొక్కకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణ, ఇంటి ఆవరణలో పెంచిన మొక్కలకు రక్షణగా ఉంటామని తెలియజేయడానికి రాఖీ కట్టినట్లు తెలిపారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నెన్నెల మాజీ ఎంపీపీ రమాదేవి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సింగతి శ్యామల ఆయన నివాసంలో రాఖీ కట్ట శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నయ్య వారికి కానుకలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్రెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.రాఖీ పండుగ సందర్భంగా సెల్ఫీ విత్ రాఖీ పేరిట ఫొటోలను ‘సాక్షి’ ఆహ్వానించగా విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు రాఖీ వేడుకల ఫొటోలను పంపించారు. – మరిన్ని ఫొటోలు 9లోuయశ్వంత్కు రాఖీ కడుతున్న సోదరీమణులు, మంచిర్యాల -
ఘనంగా శ్రావణ పౌర్ణమి జాతర
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం శ్రావణపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యదేవుణ్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 196 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణాలు రద్దీగా కనిపించాయి. ఆలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సత్యనారాయణస్వామిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు దర్శించుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.. సామూహిక సత్యనారాయణవ్రతాలు.. -
ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందిద్దాం
● గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ ● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పాతమంచిర్యాల: అడవులనే ఆయువు పట్టుగా చేసుకుని జీవం సాగించే ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతోందని, విద్య, వైద్యం అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని తెలిపారు. గిరిజన మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, జిల్లాలోని ప్రతీ గిరిజన ప్రాంతానికి రోడ్డు రవాణా వసతి కల్పించి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. నాయకులు పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా గిరిజన బాలికలు కలెక్టర్కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నుంచి వైశ్యభవన్ సభా ప్రాంగణం వరకు ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డీటీడీవో జనార్ధన్, ప్రో గ్రాం కన్వీనర్ అలం బాపు, గిరిజన నాయకులు జేక శేఖర్, అడ జంగు, సోయం జంగు, భార్గవ్, రా జ్కుమార్, పెంద్రం హన్మంతు, ఆత్రం రవీందర్, చిలుకయ్య, మడావి శంకర్, నైతం లక్ష్మణ్, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
నాగోబాకు నొవోంగ్ పూజలు
ఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా మురాడి వద్ద మెస్రం వంశీయులు శనివారం నొవోంగ్ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన మెస్రం వంశ పెద్దలు ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన చిరు ధాన్యాలతో నైవేద్యం తయారుచేసి నాగోబాకు సమర్పించారు. అనంతరం తమ గ్రామాలకు వెళ్లి నొవోంగ్ పూజలు చేయనున్నట్లు తెలిపారు. నొవోంగ్ పూజల చేస్తేనే ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన చిరుధాన్యాలను తెంపడం జరుగుతుందని మెస్రం వంశ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు కోసేరావ్, హనుమంత్రావ్, దేవ్రావ్, లింబారావు, నాగ్నాథ్, ఆనంద్రావ్, తుకారాం, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలి
● ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ● అధికారికంగా ఆదివాసీ దినోత్సవం ఉట్నూర్రూరల్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్లోని కుమురంభీం కాంప్లెక్స్లో ఉన్న సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అధికారిక వేడుకలకు హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీతో కలిసి భీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, ప్రపంచ ప్రసిద్ధి పొందాయన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా పీవీటీజీ గిరిజనులు, ఒంటరి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా 180 అంబులెన్స్లను పీవీటీజీ గ్రామాల్లో ఏర్పాటు చేశామన్నారు. పీవో మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. పీవీటీజీ గిరిజనులకు ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా విద్య, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆదివాసీల సంప్రదాయ బద్ధమైన పూజలు, గుస్సాడీ నృత్యాలు, డోలు వాయిద్యాలతో కుమురంభీం ప్రాంగణం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, పేసా కోఆర్డినేటర్ వసంత్రావు, సర్మేడీలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఆదివాసీ గ్రామాల్లో.. మండల కేంద్రంతో పాటు ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసీ నాయకులు కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
తండాల్లో తీజోత్సవం
● గిరిజన గ్రామాల్లో మొదలైన సందడి ● పెళ్లికాని యువతులు నిర్వహించే పండుగతొమ్మిదో రోజు.. తొమ్మిదో రోజును ‘తీజ్ తోడేరో దాడో’ అని పిలుస్తారు. ఆ రోజు యువతులంతా ఇంటింటికీ వెళ్లి తీజ్లను తెంపడానికి అందరూ రావాలని ఆహ్వానిస్తారు. వారంతా వచ్చిన తర్వాత మంచె పైనున్న తీజ్ బుట్టలను కిందికి దించుతారు. కులదేవతలను పూజిస్తూ ‘తీజ్’ నారును తెంపుతారు. దానిని వరుసగా కూర్చున్న మగవారి తలపాగలో పెడతారు. ఆడవారైతే కొంగుకు కట్టుకుంటారు. మరికొందరు ఇంటి గుమ్మానికి కడుతారు. అనంతరం జొన్నరొట్టెలు చేసి డప్పు వాయిద్యాలతో తీజ్ నిమజ్జనానికి బయలు దేరుతారు. సమీపంలోని చెరువులు లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు ప్రక్రియను ‘తీజ్ ఎరాయోరో’ పిలుస్తారు. దీనిని ఒకరకంగా లంబాడీ బతుకమ్మగా కూడా భావిస్తారు. గోర్బంజారాలు నిర్వహించే ఈ పండుగలో వారి సంస్కృతి ఉట్టిపడుతుంది. పంచకట్టు, ఖమీజ్ రుపాట్ ధరించి పురుషులు, టుక్రి, కాంచ్లీ, చేతులకు బలియాలు వేసుకుని యువతులు, సంస్కృతికి తగ్గట్టుగానే తయారవుతారు. గడ్డి బతుకమ్మను తెచ్చి ఆడపడుచులు సోదరుల కాళ్లు కడుగుతారు. ఆపై పారే నీటిలో గడ్డి బతుకమ్మలను వదులుతారు. కెరమెరి : తీజ్.. గిరిజన తండాల్లో తేజాన్ని నింపే పండుగ. గిరిజన యువతులు తమ ఆశలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించుకునే ఉత్సవం. ఆటపాటలు, విందులు, వినోదాలు, వినూత్న ఆచారాలతో బతుకమ్మ తరహాలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ వేడుకలు గిరిజన బంజారా (లంబాడా) తండాల్లో రక్షాబంధన్కు ప్రారంభమై కృష్ణాష్టమికి ముగుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో నిమగ్నం.. గిరిజన లంబాడాలు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి నుంచి లంబాడా గిరిజనులంతా ‘తీజ్’ పండుగ జరుపుకోవడంలో నిమగ్నమయ్యారు. యువతులు కుల దేవతలను కొలుస్తూ బుట్టల్లో ఎర్రమట్టి నింపి అందులో గోధుమలు చల్లారు. వీటినే తీజ్ బుట్టలు అంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ‘తీజ్ భరాయిరో’ అని పిలుస్తారు. ఆ రోజు నుంచి యువతులంతా నియమ నిష్టలు పాటిస్తున్నారు. గ్రామ ప్రజలకు మంచి జరగాలని, తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ప్రతీరోజు మూడు పూటలా సమీపంలోని బావుల వద్దకు వెళ్లి నీటిని తీసుకువచ్చి బుట్టలపై చల్లుతున్నారు. ఆరు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడో రోజు ‘ఢమోళీ’ సందడి ఏడో రోజున ప్రతీ ఇంట్లో బియ్యపు పిండితో రొట్టెలు చేస్తారు. వాటిని బెల్లం, నెయ్యితో కలుపుతారు. ఈ మిశ్రమాన్నే చూర్మా అంటారు. ఈ చూర్మాను తీజ్ బుట్టలున్న ఇంటి ఆవరణలో నెలకొల్పిన కులదేవుడు ‘సేవాభయ్య’కు నైవేద్యంగా సమర్పిస్తారు. అదే రోజు ఇంటి సింహద్వారానికి ఎదురుగా జొన్నలతో నింపిన గోనె సంచులు, వాటి ముందు నీళ్ల కడవ ఉంచి అందులో వేప మండలు పేరుస్తారు. ఆ కడవ ముందు జొన్నపిండితో ముగ్గులు వేస్తారు. వాటి మధ్య వెండితో తయారు చేసిన ‘మేరామయాడి’ తల్లి విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించి పూజలు చేస్తారు. మేరామయాడి దేవత మాంసాహారి కావడంతో ఆమెకు మేకపోతును బలిస్తారు. ఆరోజు రాత్రి యువతులు ఇంటింటికీ వెళ్లి చూర్మా సేకరిస్తారు. వరసైన వారికి పూస్తూ నృత్యం చేయడంతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ కోలాహల ప్రక్రియనే ‘ఢమోళీ’గా వర్ణిస్తారు. ఎనిమిదో రోజు ‘ఘంగోర్’ వివాహం ఎనిమిదో రోజు యువతులంతా చెరువు వద్దకు వెళ్లి మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టితో ఆడ, మగ బొమ్మలను తయారు చేస్తారు. ఆడ బొమ్మకు గాంగ్రి, మగ బొమ్మకు ధోవతి, లాల్చితో వేషధారణ చేస్తారు. వాటిని మేళతాళాలతో తీజ్లు ఉన్న చోటుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ ఆ బొమ్మలకు ఘనంగా వివాహం జరిపిస్తారు. అక్కడే లాప్సీ (పాయసం) తయారు చేసి ఉత్సవ ప్రతిమలకు నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గణ’ అంటే వారి కులదేవత ‘మేరామయాడి’ అని ‘గోర్’ అంటే కుల దేవుడు సేవాభయ్యా అని గిరిజనులు పిలుస్తుంటారు. వారిరువురికి ఈ రోజు పెళ్లి చేసినట్లు చెప్పుకుంటారు. సంతోషంగా.. శ్రావణమాసంలో నిర్వహించే తీజ్ పండుగంటే మాకు ఎంతో ఇష్టం. బుట్టల్లో ఉన్న గోధుమలకు తొమ్మిది రోజులు నీళ్లు చల్లి చివరి రోజు ఉత్సవం జరుపుకుంటాం. ఇలా జరుపుకోవడం వల్ల అన్నికార్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. పాడి పంటలతో పాటు ఇంటిల్లిపాది, గ్రామస్తులు సుఖశాంతులతో ఉంటారు. – జే.దివ్యరాణి, చందుగూడ, కెరమెరి -
బస్టాండ్లలో పండుగ రద్దీ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో శనివారం ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు కిటకిటలాడాయి. రాఖీ పండుగ కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ప్రయాణికులతో మంచిర్యాల బస్స్టేషన్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. బస్సులన్నీ మహిళ ప్రయాణికులతో నిండిపోయాయి. బస్సు వచ్చిందంటే చాలు సీట్ల కోసం పరుగులు తీశారు. బస్సుల సమాచారం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఇంకోవైపు ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించారు. హైదరాబాద్కు వెళ్లే బస్సులన్నీ ముందస్తు రిజర్వేషన్లతో నిండిపోయాయి. బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు. రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. -
● జిల్లాలోనూ ఫెర్టిలిటీ సెంటర్లు ● పదికి పైగానే ఆస్పత్రుల నిర్వహణ ● ‘సృష్టి’ మోసంతో తనిఖీకి బృందాలు
చర్యలు తీసుకుంటాంజిల్లాలో అనుమతులు లేకుండా ఎలాంటి ఆసుపత్రిని నిర్వహించినా శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. సంతాన సాఫల్య కేంద్రాలుగా నిర్వహించుకునేందుకు పూర్తిస్థాయి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించాలి. అనుమతులు తీసుకోకుండా బోర్డులు ఏర్పాటు చేసినా, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్యాధికారిమంచిర్యాలటౌన్: తల్లి కావాలన్న కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని దంపతులకు వరంగా మారాల్సిన సంతాన సాఫల్య కేంద్రాలు ప్రభుత్వ అనుమతి పొందకుండానే నిర్వహణ సాగిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకే పరిమితమైన ఫెర్టిలిటీ సెంటర్లు జిల్లాలోనూ వెలుస్తున్నాయి. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రం మంచిర్యాలలో రెండు ఆస్పత్రులకు మాత్రమే ఫెర్టిలిటీ అనుమతులు లభించగా.. అందులో ఒక ఆస్పత్రికి ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్), మరో ఆస్పత్రికి ఐయూఐ(ఇంట్రా యూటిరైన్ ఇన్సెమినేషన్) విధానానికి మాత్రమే అనుమతి లభించింది. మరో రెండు ఆస్పత్రులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. రాకముందే గత కొంతకాలంగా నిర్వహిస్తుండడం గమనార్హం. ఇవి కాకుండా 10కి పైగా గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రసూతి ఆస్పత్రుల ముందు సంతాన సాఫల్య కేంద్రం బోర్డులు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ఆయా ఆస్పత్రులు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం, కనీసం దరఖాస్తు కూడా చేయకుండానే ఆస్పత్రుల ముందు బోర్డులు ఏర్పాటు చేసి.. ఆస్పత్రి లోపల నోటీసు బోర్డులో మాత్రం ఐవీఎఫ్ సేవలు అందుబాటులో లేవని చిన్నపాటి అక్షరాలతో పెడుతున్నారు. సంతాన సాఫల్య కేంద్రం బోర్డులు చూసి పిల్లలు లేని దంపతులు ఎంతో ఆశతో ఆస్పత్రులకు వెళ్తే వారికి ప్రసూతి ఆస్పత్రుల్లో అందించే చికిత్స మాత్రమే అందిస్తున్నారు. నగరాల్లోని ఆస్పత్రులతో కలిసి... హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో వెలిసిన ఫెర్టిలిటీ ఆసుపత్రులకు జిల్లాలోని పిల్లలు లేని దంపతులు వెళ్లేందుకు కొన్ని ఆస్పత్రులు సంతాన సాఫల్య కేంద్రాల బోర్డులను ఏర్పాటు చేసుకుని, ఆసుపత్రికి వచ్చిన దంపతులను నగరాల్లోని ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు సమాచారం. ప్రతీ నెలలో ఒకరోజు ఉచిత కన్సల్టెన్సీల పేరిట నగరాలకు చెందిన ఫెర్టిలిటీ కేంద్రాల ఆధ్వర్యంలో శిబిరాలను సంతాన సాఫల్య కేంద్రాల పేరిట బోర్డులను ఏర్పాటు చేసిన ప్రసూతి ఆసుపత్రుల్లో నిర్వహించి, ఆయా దంపతుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి మొదటగా వారి ఆసుపత్రుల్లోనే చికిత్స అందించడం, ఆ తర్వాత పిల్లలు కావాలంటే నగరంలోని ఆసుపత్రులకు పంపిస్తున్నారు. వీరికి జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గైనకాలజిస్టులు ఎలాంటి ఫెర్టిలిటీ నిర్వహణ అనుమతులు తీసుకోకుండానే, సంతాన సాఫల్య కేంద్రాలుగా చికిత్స అందిస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.జిల్లాల్లో తనిఖీలు షురూఇటీవల సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసంతో ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఫెర్టిలిటీ సెంటర్లతోపాటు అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో తనిఖీలకు టాస్క్ఫోర్స్ బృందాలను నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తనిఖీలు పూర్తి చేసింది. ఇక శుక్రవారం నుంచి జిల్లాల్లో తనిఖీలు మొదలు కాగా.. వరంగల్ జిల్లాలో తనిఖీలు చేశారు. మంచిర్యాల జిల్లాలో రెండింటికి మాత్రమే ఫెర్టిలిటీకి అనుమతులు ఉండగా, అనుమతులు లేకుండా పదికి పైగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. అందులో మరో రెండు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని, రాకముందే నిర్వహిస్తున్నారు. మిగిలిన ఆసుపత్రులకు అనుమతులు లేవు. పిల్లలు లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలపై తనిఖీ బృందం చర్యలు తీసుకుంటుందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఈవో కార్యాలయం ప్రారంభం
బాసర: బాసర ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆలయ కార్యనిర్వహణాధి కారి కార్యాలయాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గోమాతతో భవన ప్రవే శం, వాస్తుపూజ, మహా హోమంతో పాటు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి నూ తన కార్యాలయంలో అధికారులంతా విధులు నిర్వహిస్తారని ఆలయ ఏఈవో సుదర్శన్ గౌడ్ తెలిపారు. ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పా ఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆల య సీనియర్ అసిస్టెంట్లు, పీఆర్వో నారాయణ పటేల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కొండచిలువ కలకలం..ఆసిఫాబాద్అర్బన్: పట్టణంలోని దస్నాపూర్ కాలనీలో శుక్రవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన చెందిన స్థానికులు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అధికారి సిబ్బందిని అప్రమత్తం చేసి కాలనీకి పంపించారు. జిల్లా అటవీశాఖ అధికారి సీసీ ఇసాక్ ఆధ్వర్యంలో బీట్ అధికారులు కిషోర్, ఎం.వెంకటేష్, మారుతి, పి.వెంకటేష్ గంటపాటు శ్రమించి దానిని ఒక సంచిలో బంధించి అటవీప్రాంతంలో వదిలేశారు. సమయానికి స్పందించిన అటవీ శాఖ అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. -
చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆటో
ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని హరితవనం పార్కు సమీపంలో చెట్ల పొదల్లోకి ఆటో దూసుకెళ్లి బోల్తా పడింది. సిర్పూర్ మండలం చిలాటిగూడకు చెందిన ప్రయాణికులు మహారాష్ట్రలోని మహుర్ గ్రామానికి దైవదర్శనం కోసం ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మావల సమీపంలో ఆటో చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న దేవ్రావు, మారుతి, మంగావతి, నాగోబాయికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కిషన్, పైలట్ ముజఫర్ క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
లాభాల వాటా ప్రకటించాలి
జైపూర్: లాభాల వాటా ప్రకటించాలని ఇందారం ఐకే1ఏ గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం గని మేనేజర్ కోటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐకే1ఏ పిట్ సెక్రెటరీ సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సాధించిన లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు 35 శాతం లాభాల వాటా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2023–24 ఆర్థిక సంవత్సరం కార్మికులకు పంపిణీ చేయగా, మిగిలిన డబ్బులతో ఎంతమేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్రెడ్డి, ఖాదీర్ పాషా, వినయ్, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
శివసాగర్ చెరువులో ఎస్డీఆర్ఎఫ్ బృందం సాధన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం శుక్రవారం జిల్లా కేంద్రంలోని శివసాగర్ చెరువులో సాధన చేశారు. కమాండెంట్ వెంకటరాములు ఆధ్వర్యంలో సాధన చేస్తున్న బృందానికి మంచిర్యాల అగ్నిమాపక శాఖ సిబ్బంది సహకారం అందించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడే అధునాతన పరికరాలను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా వినియోగించాలనే పలు అంశాలతోపాటు కఠిన సమయాల్లో ఆపదలో ఉన్నవారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై సాధన చేశా రు. మంచిర్యాల జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్రావు, ఆర్ఐ అశోక్, ఆర్ఎస్సై సురేశ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
గోండి, కొలామి భాష పరిరక్షణలో..
ఆదిలాబాద్ రూరల్: మావల మండలం వా ఘాపూర్ గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కై లాస్ గోండి, కొలామి భాషల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రోబోటిక్ టెక్నాలజీ కంప్యూటర్ ద్వారా యాంకర్ను తయారు చేసి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నారు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబా డా భాషల్లో వందలాది పాటలు రాసి ఏఐ లో పొందుపర్చారు. మహాభారత గ్రంథాన్ని తెలుగు లిపితో గోండి భాషలో అనువదించారు. 18 పర్వాలు నాలుగు నెలలపాటు అనువదించి వంద పుస్తకాలు ప్రచురితం చేశారు. మన్కీబాత్లో పీఎం మోదీ కై లాస్ను ప్రశంసించారు. అప్పటి కలెక్టర్లు దివ్యదేవరాజన్, దేవసేన, ప్రస్తుత కలెక్టర్ రాజర్షిషా కై లాస్ను అభినందించారు. -
ఆర్టీసీకి రాఖీ కట్నాలు..!
● ప్రయాణికులపై అదనపు చార్జీల భారం ● రూ.100కు రూ.50 పెంపు..! ● రద్దీతో అదనపు బస్సులుమంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్స్టేషన్ శుక్రవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. తెల్ల వారితే శనివారం రాఖీ పండుగ కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. కాగజ్నగర్, గోదావరిఖని, చెన్నూర్ రూట్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో కొందరు నిల్చుండి గమ్యస్థానానికి పయనమయ్యారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన ఆర్టీసీ అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణికులపై చార్జీల భారం మోపుతోంది. హైదరాబాద్ జేబీఎస్, మియాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రోజువారీ బస్సులతోపాటు శుక్రవారం మరో 12 బస్సులు నడిపించింది. పండుగ నేపథ్యంలో స్పెషల్ సర్వీసుల్లో అదనపు చార్జీల భారం మోపింది. సాధారణ రోజుల్లో నడిచే బస్సు చార్జీల కంటే రూ.100కు రూ.50 పెంచింది. సాధారణ రోజుల్లో సూపర్లగ్జరీ బస్సు చార్జీ రూ.530 ఉంటే స్పెషల్ సర్వీసుల్లో టికెట్ చార్జీలు రూ.740కు పెంచారు. ఈ లెక్కన ఒక్కో ప్రయాణికుడు రూ.210 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో మంచిర్యాల నుంచి జేబీఎస్కు రూ.390 ఉండగా.. అదనంగా రూ.160వరకు పెంచారు. శుక్రవారం రెండు స్పెషల్ సర్వీసులు నడిపించారు. పండుగ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం అప్ ఖాళీగా వెళ్లి డౌన్(హైదరాబాద్ నుంచి) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుందని, పండుగ సమయంలో స్పెషల్ బస్సుల్లోనే చార్జీలు పెంపు వెసులుబాటు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. -
వాతావరణం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు బలంగా వీస్తాయి.
పంపించాల్సిన నంబరు 90100 57302మా అన్నే వస్తున్నడు.. చెన్నూర్: ఉద్యోగరీత్యా మా అన్న హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రతీయేడు రాఖీ కట్టడానికి హైదరాబాద్ వెళ్తాను. ఈయేడు మా అన్నే మా ఇంటికి వస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. అన్ని రాఖీ పండుగల కంటే ఈసారి పండుగను మరింత సంతోషంగా జరుపుకుంటాం. – సుమలత, చెన్నూర్ కస్తూర్భా కళాశాల ప్రిన్సిపాల్ప్రతీ సంవత్సరం ఇక్కడే.. పాతమంచిర్యాల: హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చి అన్నయ్యకు రాఖీ కడుతాను. మేము ఇద్దరం అక్కాచెల్లెళ్లం నిర్మ ల, ప్రమీల. మా ఇద్దరు అన్నయ్యలు శ్రీనివాస్ గోదావరిఖనిలో, దామోదర్ గోదావరిఖనిలో ఉంటారు. వారికి రాఖీ కట్టడానికి పండుగకు ఒక్కరోజు ముందే మంచిర్యాలకు చేరుకుంటాను. దురదృష్టావశాత్తు పెద్దన్నయ్య శ్రీనివాస్ ఇటీవల మృతిచెందాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధం మాటల్లో చెప్పలేనిది. – ప్రమీల, హైదరాబాద్ -
బాలికల గురుకులంలో చొరబడిన నలుగురి అరెస్ట్
బెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం అర్థరాత్రి అక్రమంగా చొరబడి విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురిని శుక్రవారం తాళ్లగురిజాల పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామానికి చెందిన దుగుట సంజయ్, కోనూరి కిరణ్, కన్నెపల్లి మండలం చర్లపల్లి, ఎల్లారం గ్రామాలకు చెందిన గొల్లపల్లి కిరణ్, కొజ్జన కిరణ్ మద్యం మత్తులో బాలికల గురుకుల విద్యాలయంలో అక్రమంగా చొరబడ్డారు. కేకలు వేస్తూ, బూతులు తిడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా కోనూరి కిరణ్ పట్టుబడగా ముగ్గురు పారిపోయారు. అక్రమంగా విద్యాలయంలో చొరబడిన ఘటనపై విద్యాలయ ప్రిన్సిపాల్ నిరుపమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో యువత ఇష్టారీతిన వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరిగి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రాత్రి వేళ గస్తీ, భద్రతను ముమ్మరం చేసినట్లు తెలిపారు. -
● ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసినవే ● కొన్ని చోట్ల నడపలేక కేంద్రాలు మూసివేత ● అవకాశమివ్వాలని నిరుద్యోగుల వినతులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో మీ సేవ కేంద్రాల ఏర్పాటు ఉంటుందా? లేదా? అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అవసరమైన చోట్ల తమకు అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు. పౌరులకు సులభంగా, వేగంగా ఎలక్ట్రానిక్ సేవలు అందించాలని మీ సేవలు నిర్వహిస్తున్నారు. గత నిబంధనల ప్రకారం కొత్తవి ఏర్పడే అవకాశం ఉండగా, ఇటీవల సవరించిన నిబంధనలతో కొత్త కేంద్రాల ఏర్పాటు అవకాశాల కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఓఎస్ఎస్(వన్ స్టాప్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్), టీజీటీఎస్(తెలంగాణ టెక్నాలజీ సర్వీస్), తెలంగాణ ఆన్లైన్(టీజీఆన్లైన్) కింద మీ సేవలు సెంటర్లు నడుస్తున్నాయి. ఆయా శాఖల్లోని అధికారిక సేవలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. పౌరులకు మున్సిపల్ వ్యవసాయ, ఆర్టీఏ, విద్యుత్, పోలీసు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, టీ వాలెట్, దేవాదాయ శాఖలు ఇతర సేవలతోపాటు దాదాపు మూడు వందలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 19కేంద్రాలు రద్దు జిల్లాలో ఉన్న మీ సేవ కేంద్రాలు చాలా వరకు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. రాజకీయ పలుకుబడితో కొందరు దక్కించుకున్నారు. అయితే తర్వాత సరిగా నడపలేక, ప్రస్తుతం 139 మీ సేవ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో చాలా వరకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిర్వాహకులకు రెవెన్యూ సంబంధిత ఒక్కో డాక్యుమెంట్కు గరిష్టంగా రూ.12వరకు కమీషన్ వస్తోంది. ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తూ నెట్టుకొస్తునారు. కొన్ని చోట్ల ఆదాయం రాక మూత పడుతున్నాయి. ఇప్పటికే 19కేంద్రాలు రద్దయ్యాయి. జిల్లాలో చివరి సారిగా 2017లో కొత్త కేంద్రాలకు అనుమతి ఇవ్వగా, మరోసారి ఎక్కడెక్కడ అవసరం ఉందో స్థానిక తహసీల్దార్ల నుంచి నివేదిక తీసుకున్నాక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మారిన నిబంధనలు కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 5వేల జనాభాకు ఒక మీ సేవ ఏర్పాటు చేయాలి. పట్టణాల్లో 8వేల జనాభా, మూడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. నిర్వాహకులు డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. జిల్లా ఈ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్త మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఎంపిక చేసి మంజూరు చేస్తారు. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ సొసైటీకి అదనపు కలెక్టర్, సీపీతో సహా కార్మిక, గ్రామీణ, పౌరసరఫరాల, పంచాయతీ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు సభ్యులుగా ఉంటారు.జిల్లాలో మీ సేవ కేంద్రాలు ప్రభుత్వ 3 టీజీటీఎస్ 121 టీజీఆన్లైన్ 10 ఓఎస్ఎస్ 5 మొత్తం 139కొత్తవి వద్దంటున్న నిర్వాహకులు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తే తమ అవకాశాలను దెబ్బతిస్తాయని ప్రస్తుత నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. హాజీపూర్, లక్సెట్టిపేట, చెన్నూరు మండలాల్లో కొందరు కోర్టుకు వెళ్లడంతో కొత్త కేంద్రాల ఏర్పాటు నిలిచిపోయింది. మరోవైపు సేవ దృక్పథంతో కాకుండా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు, అధికంగా ఫీజుల వసూళ్ల కారణంగా నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల తాండూరులో జరిమానాలు వేశారు. కనీసం రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా, మూడోసారి వరకు తప్పు చేస్తే సెంటర్ రద్దు చేసే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి రెవెన్యూ వ్యవహారాల్లో అధికంగా వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ప్రసన్నాంజనేయనగర్కు చెందిన గంగాధరి వాణి(44) అనే మహిళ అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం దేవాపూర్కు చెందిన శంకర్తో వాణి వివాహం జరిగింది. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో వాణి టైలరింగ్ పని చేస్తూ ఇంటి భారాన్ని మోసింది. తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఉండడంతో మనోవేదనకు గురై ఈనెల 6న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గమనించిన భర్త వెంటనే గ్రామంలోని కంపెనీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరిస్థితి విషమించగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందింది. మృతురాలికి 11 ఏళ్ల కొడుకు విజ్ఞతేజ్ ఉన్నాడు. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో ఒకరు.. రెబ్బెన: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది మండలంలోని నంబాలకు చెందిన రత్నం నారాయణ (47) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే నారాయణ పదేళ్లుగా షుగర్తో బాధ పడుతున్నాడు. ఇటీవల మరికొన్ని అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. అనారోగ్య సమస్యలు భరించలేక చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులతో చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి తనకు అస్వస్థత ఉన్నట్లు భార్య ప్రమీలకు తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణను రెబ్బెన పీహెచ్సీకి తరలించారు. ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తమ్ముడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మృతి వాంకిడి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన చాప్లే వెంకటేశ్ (30) కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. దీంతో కడుపు నొప్పి వచ్చినప్పుడల్లా మద్యం సేవించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3న సాయంత్రం మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోగా బుధవారం ఇంటికి తీసుకువచ్చారు. కాగా, గురువారం సాయంత్రం అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య లలిత, ముగ్గురు కూతుళ్లు, కుమారుడున్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జన్నారం: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగిన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రోటిగూడకు చెందిన గాలి నాగేశం (40) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లి పని దొరకక ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినా అప్పు తీరకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 5న మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ, కూతురు, కొడుకు ఉన్నారు. విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మారని బతుకులు
ఉట్నూర్ మండలం వంకతుమ్మ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు ఉట్నూర్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఇలా గ్రామానికి తిరిగిరావడం నిత్యకృత్యం. అలాగే ఈ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో వాగు దాటాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో వీరిది దయనీయ పరిస్థితి. 2013లో జరిగిన రెండు ఘటనలు ఇప్పటికీ ఆ గ్రామస్తులు మరిచిపోలేరు. ఓ నిండు గర్భిణికి పురుటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వాగు దాటడం ఆలస్యం కావడంతో ఆమె మృత్యువాత పడింది. అదే ఏడాది పాము కాటుకు గురైన మారుతిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో వాగు ఉప్పొంగిన క్రమంలో ఆయన మృతిచెందాడు. -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కోటపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక అరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వార్డులు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం బొప్పారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మూత్రశాలలు, హాజరుపట్టిక పరిసరాలను పరిశీలించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను తయారు చేయాలని ఎస్వో హరితను ఆదేశించారు. తహసీల్దార్ రాఘవేందర్రావు, కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. అమృత్ 2.0 పనులు పూర్తి చేయండి చెన్నూర్: అమృత్ 2.0 పథకంలో నిర్మిస్తున్న ట్యాంక్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ట్యాంక్ పనులను పరిశీలించారు. పనులు పూర్తయ్యే వరకు ఇంటింటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని సూచించారు. -
ఆర్ఎంపీ క్లినిక్ల్లో ఆకస్మిక తనిఖీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్లను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర యగ్గన్న శ్రీనివాస్ నేతృత్వంలోని టీజీఎంసీ బృందం శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక భగత్సింగ్నగర్లో ఇటీవల ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న ఓ యువకుడు వైద్యం వికటించి మృతిచెందినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీజీఎంసీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో టీజీఎంసీ సభ్యులు ఆర్ఎంపీ కేంద్రాలను శుక్రవారం రాత్రి వరకు తనిఖీ చేశారు. కనీస విద్యార్హతలు, లైసెన్స్ లేకుండా వైద్యులమని ఎలా చెప్పుకుంటున్నారని, ఇంజక్షన్లు, మందులు, గర్భవిచ్ఛిత్తి ఇంజక్షన్లు ఎందుకు ఉన్నాయంటూ మందలించినట్లు సమాచారం. ఓ క్లినిక్లో రెండు పడకలు ఏర్పాటు చేసి రోగికి యాంటీబయోటిక్ ఇంజక్షన్ కూడా ఇస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో డాక్టర్ సంతోష్, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోడు కోసం పోరు
తాండూర్: దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటు న్న తమకు వాటిపై హక్కులు కల్పించాలని రైతులు పోరుబాట పట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జి ల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు మూడురోజు ల క్రితం చేపట్టిన పాదయాత్ర గురువారం రాత్రి తాండూర్కు చేరుకుంది. మండలంలోని రేపల్లెవాడ సమీపంలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లులో సేద తీరిన అనంతరం శుక్రవారం తెల్లవారుజామున రైతులు తమ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గ్రామ శివా రులోని సుమారు 1,200 ఎకరాలను సాగు చేసుకుంటూ 600 కుటుంబాలవాళ్లం జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది అటవీశాఖ అధికా రులు సాగు చేసుకోకుండా అడ్డుకున్నారని వాపోయారు. తమకు న్యాయం చేసి భూ హక్కు పత్రాలు ఇచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి, అటవీశాఖ మంత్రి, అధికారులకు తమ గోడు చెప్పుకొంటామని వారు పేర్కొన్నారు. -
‘రక్షా బంధన’మై..!
రాఖీ కట్టి ఒక్క రూపాయే తీసుకుంటారుబెల్లంపల్లి: నా చదువంతా హాస్టళ్లలో కొనసాగింది. పండుగలకు ఇంటికి దూరంగా ఉండేవాడిని. అక్కాచెల్లెళ్ల ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండుగకు కూడా తోబుట్టువులకు అందుబాటులో ఉండేవాడిని కాదు. కానీ ఆ పండుగ నాకెంతో ప్రత్యేకమైంది. నేనెంత దూరం వెళ్లి చదువుకుంటున్నా సరే మా అక్క లక్ష్మిమౌనిక, మా బాబాయి, పిన్నిల కూతుళ్లు ఇద్దరు కలిసి వచ్చి చేతికి రాఖీ కట్టి నిండు మనస్సుతో ఆశీర్వదించడం క్రమం తప్పక వస్తున్న ఆనవాయితీ. ఈ తీపి జ్ఞాపకాలు ఎన్నడూ మర్చిపోలేను. రాఖీ కట్టినందుకు మా అక్కాచెల్లెళ్లు నా నుంచి కట్నకానుకలు ఏమీ ఆశించేవారు కాదు. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడితే ససేమిరా ఒప్పుకునే వారు కాదు. నా తృప్తి కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒక్కొక్కరు ఒక్కో రూపాయి చొప్పున తీసుకుని సంతోషపడేవారు. నేటికీ అదే కొనసాగుతోంది. నా జీవితంలో రాఖీ పండుగకు ఎంతో అనుబంధం ఉంది. 2023లో నాగ్పూర్లో ఇన్కంట్యాక్స్ అధి కారిగా శిక్షణ పొందుతున్న సమయంలో పండుగ వచ్చింది. మా ముగ్గురు అక్కాచెల్లెళ్లు నాగ్పూర్కు వచ్చి నా చేతికి రాఖీ కట్టి దీవించారు. ఆ వేళ యాధృచ్చికంగా యూపీఎస్సీ ఫలితాలు వెల్లడై ఐఏఎస్గా సెలక్ట్ అయ్యాను. ఆ తీపి గుర్తు నేనెన్నడు మర్చిపోలేను. – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డీ మనోజ్ -
అడవి బిడ్డలు.. సంస్కృతి రక్షకులు
● సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ● యాస.. భాష పరిరక్షణకు చర్యలు ● భావితరాలకు అందించే యత్నం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంఇంద్రవెల్లి/ఉట్నూర్రూరల్: సంస్కృతి, సంప్రదాయాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొండ, కోనల నడుమ ప్రకృతితో మమేకమవుతున్నారు. ప్రకృతిని దైవంగా భావించి జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార, వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఏ పని చేసినా, ఈ కార్యం తలపెట్టినా ముందుగా ప్రకృతి దేవతలకు పూజలు చేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. వనదేవతలకు పూజలు చేశాకే సాగు పనులు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం, తోటి, నాయక్పోడ్, గోండు, పర్ధాన్, అంధ్, లంబాడీ తెగలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులు ప్రతీ పండుగ, కుల దేవతల పూజలు, పెళ్లి వేడుకలు ఇలా ఏవైనా వారి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వైభవంగా నిర్వహిస్తారు. ఆదివాసీ తెగలు.. పండుగలుగోండు, కొలాం, పర్ధాన్, తోటి ఆదివాసీ తెగలవారు కుల దేవతలతోపాటు ప్రకృతి దేవతలను ఆరాధిస్తారు. ఏ పూజ చేసినా.. తరతరాలుగా గ్రామస్తులంతా సామూహికంగా చేసే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభంలో అకాడి (వన దేవత) పూజలతో మొదలుకుని నాలుగు నెలలపాటు యేత్మసుర్ దేవతలను ఆరాధిస్తారు. శ్రావణ మాసానికి ముందు గావ్ సాత్ పేరుతో పోచమ్మ తల్లికి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో నెలపాటు గ్రామ దేవతలు శివ బోడి, నొవోంగ్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా యేత్మసుర్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ వేషధారణలతో వారంపాటు సంప్రదాయ వాయిద్యాల మధ్య డండారీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వైశాఖ, పుష్య మాసాల్లో సంవత్సరానికి రెండుసార్లు కులదేవతలైన జంగుబాయి, పెర్సాపేన్, భీందేవుడి పూజలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన, రాష్ట్రంలో రెండో పండుగైన నాగోబా మహాపూజ, నాగోబా జాతరను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహిస్తారు. అంద్ సమాజ్ ఆదివాసీలు తమ కులగురువు శ్రీశ్రీ సంత్ సద్గురు పులాజీబాబాను ఆరాధిస్తారు. వారివారి గ్రామాల్లో నిర్మించిన ధ్యాన్ మందిరాల్లో ప్రతీ సంవత్సరం వార్షికోత్సవ పూజలు చేస్తారు. నాగుల పంచమి మరుసటిరోజు శీరల్ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అంధ్ ఆదివాసీ సమాజ్ వారి వివాహాలు పులాజీబాబా ధ్యాన్ మందిరాల్లో సామూహికంగా జరిపిస్తారు. నాయక్పోడ్ ఆదివాసీ భీమన్న దేవుడిని ఆరాధ్యదైవంగా కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లంబాడా గిరిజనులు కులగురువు సంత్ సేవలాల్ మహరాజ్ను ఆరాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి తరువాత వారంపాటు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. ప్రతిరోజూ గ్రామాల్లోని ఆలయాల్లో సేవాలాల్, జగదాంబదేవిని ఆరాధిస్తారు. యాస.. భాషకు డిజిటల్ రూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు మాట్లాడే యాస.. భాష.. సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపర్చడానికి బోలి చేతో (భాష–చైతన్యం) ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చెరిగిపోకుండా భావితరాలకు అందించడానికి గోండి, కొలామీ భాషలో వికీపీడియా, విక్షనరీలను అంతర్జాలంలో భద్రపర్చి భావితరాలకు భాష, సాహిత్య సంపదను అందించడానికి కార్యశాల నిర్వహిస్తూ ఆదివాసీ యువకులను ప్రోత్సహిస్తోంది. – ఆత్రం మోతీరాం, బోలిచేతో ఫౌండేషన్ బోర్డు సభ్యుడువాయిద్యాలు.. ప్రత్యేకతలుగోండులు పెర్స్పెన్ పండుగలో దండారీ డప్పు ల దరువులతో తుడుం వాయిద్యాన్ని నిర్వహిస్తుంటారు. కొలాంలు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో మోగిస్తుండగా, గోండులు జంగుబాయి, పెర్స్పెన్, దండారీ ఉత్సవాల్లో తుడుంను డోలుకు సహ వాయిద్యంగా మోగిస్తుంటారు. అలాగే డెంసా నృత్యాలు చేస్తుంటారు. ఆదివాసీ లకు ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి, సంప్రదాయాలు వారసత్వంగా వస్తున్నాయి. తుడుంను పురుషవాద్యంగా భావిస్తారు. ఈ సంగీత వాద్యాన్ని పూజా కార్యక్రమంలో ఉంచి పూజిస్తారు. ఆదివాసీల చైతన్యానికి ‘తుడుం’ ఒక సంకేతంగా నిలిచింది. ఆదివాసీ ఉద్యమాల్లో ర్యాలీ, ధర్నా లాంటి నిరసన కార్యక్రమాల్లో ‘తుడుం’ మోగిస్తుంటారు. గోండి పూజారులైన ప్రధాన్లు, తోటి తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువులు, కర్మకాంఢలు, వివాహాలు, చావుల సందర్భంలో దీనిని వాయిస్తారు. గోండి సంప్రదాయాలు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు ‘పెప్రే’ అనే రెండు సన్నాయి వాయిద్యాలు, డక్కి అనే చర్మవాయిద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు. డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద గేయాలు, నృత్యాలు ఉంటాయి. హోలీ, వివాహ వేడుకలకు డోలు నృత్యాలతో కళాకారులు అలరిస్తుంటారు. ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల సందర్భంగా దీనిని వాయిస్తారు. డోలును వివాహ వేడుకల సందర్భంగా రాత్రి వేళ నృత్యాలు చేయడానికి వినియోగిస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఒక గ్రామంతో మరో గ్రామం మధ్య పాటల పోటీలు జరుగుతుంటాయి. డోలు వాయిస్తూ పురుషులు సీ్త్ర వేషధారణలో, ఒకరు జోకర్గా నృత్యాలు చేస్తుంటారు. -
పాము కాటుకు యువకుడి మృతి
దహెగాం: పాము కా టుకు గురైన యువకు డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలో ని పంబాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంబాపూర్ గ్రామానికి చెందిన కంబాల మహేశ్ (22) ఈనెల 2న ఇంట్లో ఉండగా లగ్గాం గ్రామానికి చెందిన బాబా అనే వ్యక్తి ఫోన్ చేసి బాత్రూమ్లో పాము ఉంది కొట్టడానికి రావాలని పిలిచాడు. దీంతో మహేశ్ వెంటనే బాబా ఇంటికి వెళ్లి బాత్రూమ్ డోర్ తీస్తున్న క్రమంలో పాము కాటు వేసింది. వెంటనే మహేశ్ కుటుంబీకులకు విషయం తెలుపగా దహెగాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేశ్ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి పెదనాన్న పోశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. -
గూడెంలో ముగిసిన పవిత్రోత్సవాలు
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో ఈ నెల 5న ప్రారంభమైన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు మహాపూర్ణాహుతి, పవిత్ర అవరోహణము, స్నపణ తిరుమంజనము, కుంభ ప్రోక్షణ, హా రతి, మంత్రపుష్పము, మహాదాశీర్వచనము, తీర్థ ప్రసాద వితరణ కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో యాజ్ఞికులు అభిరా మ చార్యులు, ప్రధాన అర్చకులు రఘుస్వామి, వేదపండితులు నారాయణశర్మ, భరత్శర్మ, అర్చకులు సంపత్స్వామి, సురేష్స్వామి, ఆల య ఈవో శ్రీనివాస్, సిబ్బంది చంద్రశేఖర్, సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు. -
చేనేత కార్మికుడికి రాష్ట్రస్థాయి పురస్కారం
నెన్నెల: మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు లిక్కి శంకరయ్యకు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం దక్కింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అందించే అవార్డును రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పట్టు పరిశ్రమల కమిషనర్ శైలజా రామయ్యార్ చేతుల మీదుగా అందుకున్నారు. రూ.25 వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. కళా నైపుణ్యంతో మగ్గంపై టస్సర్ పట్టువస్త్రం తయారు చేస్తూ చేనేత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుతున్నందుకు గానూ శంకరయ్యకు ఈ గౌరవం దక్కింది. -
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా పనిచేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రమాదా లను నివారించాలని సూచించారు. పల్లెబాట, పొలంబాట, పట్నంబాట నిర్వహించి విద్యుత్ ప్రమాదాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదకరంగా, శిథిలావస్థలో ఉన్న స్తంభాలు, లూస్లైన్లు, వంగిన పోల్స్, ఎత్తు తక్కువ, పిచ్చిమొక్కలతో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి సరిచేయాలన్నారు. సీఈ ఆపరేషన్ అశోక్, ఎస్ఈ ఉత్తం జాడే, డీఈ ఎంఎం ఖైసర్, బెల్లంపల్లి డీఈ రాజన్న, ఎస్ఏవో రాజేశం, ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
పంట పొలాల్లోకి మొసళ్లు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంనూర్ శివారు గోదావరినది తీర ప్రాంతాల్లోని పొలా ల్లో మొసలి పిల్లలు తిరుగాడుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో ఇప్పటికే మొసళ్లు ఉన్నట్లు ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇటీవల ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన మొస లి పిల్లను అటవీ అధికారులు బ్యాక్ వాటర్లో వదిలారు. రెండు రోజులుగా నంనూరు శివారులోని పొలాల్లో రైతులకు మొసలి పిల్లలు కనిపిస్తుండడంతో వాటిని జాగ్రత్తగా నీళ్లలోకి వెళ్లేలా చూస్తున్నారు. -
స్థానికం అంతా సిద్ధం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సమరానికి అంతా సిద్ధమైంది. తాజాగా గుజరాత్లోని జామ్ నగర్, ద్వారక జిల్లాల నుంచి 970 బ్యాలెట్ బాక్సులను పంచాయతీ అధికారులు గురువారం జిల్లాకు తీసుకొచ్చారు. ఎలక్షన్ ఆమోదం ఉన్న ఈ బ్యాలెట్ బాక్సులను వాటిని నస్పూర్లోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్లో బందోబస్తు మధ్య సురక్షితంగా భద్రపర్చారు. జిల్లాలో ఇప్పటికే 3,700 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. వీటికి అదనంగా ఈ బాక్సులు తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రెండు నెలల క్రితమే తొలి విడత ఆర్వో(రిటర్నింగ్ ఆఫీసర్ల) శిక్షణ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి మరోసారి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సౌకర్యాల కల్పన పూర్తయ్యాయి. జిల్లాలోని ఓటర్ల జాబితా సిద్ధం అయ్యింది. జాప్యంతో మరోమారు మార్పులు చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. తుది జాబితా వెలువడనుంది. జిల్లాలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అటు పంచాయతీ రాజ్, పరిషత్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండు నెలల నుంచే కసరత్తు మొదలైనప్పటికీ రిజర్వేషన్లు తేలక ముందుకు సాగలేదు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదానిపై స్పష్టత రావడం లేదు.తేలని రిజర్వేషన్ల పంచాయితీపల్లెలు, పట్టణాల్లో పాలక వర్గాలు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదల కాక పాలన సజావుగా సాగడం లేదు. పాలక వర్గాలు లేక ఏడాదికి పైగా అవుతోంది. హైకోర్టు సైతం సెప్టెంబర్లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంపుదల చట్టంపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో గత చట్టాన్ని సవరిస్తూ రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీ స్థాయిలో పోరాడుతోంది. రిజర్వేన్ల పెంపుపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తేలని, చెప్పలేని పరిస్థితి ఉంది. రెండు నెలల క్రితమే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. రెండు దశల్లో నిర్వహణ అంటూ ప్రచారం జరగడంతో ఆశావహులంతా సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటికీ రిజర్వేషన్లు తేలకపోవడంతో స్థబ్దుగా మారింది. మరోవైపు పంచాయతీ, పరిషత్ ఎన్నికలు పూర్తయితే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పట్టణాల్లో ఉన్న నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు సన్నద్ధమయ్యారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తేనే, పంచాయతీలు, వార్డులు, పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.జిల్లా ; వివరాలుగ్రామ పంచాయతీలు; 306వార్డులు; 2,680ఎంపీటీసీలు; 129ఎంపీపీలు; 16జెడ్పీటీసీలు; 16జిల్లా పరిషత్; 01పోలింగ్ కేంద్రాలు; 2,680బ్యాలెట్ బాక్సులు; 4,670 -
ఆటలకు వేళాయె..
● ఈ నెల చివరిలో ఎస్జీఎఫ్ పోటీల నిర్వహణ ● వేదికలు ఖరారుమంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని భావించిన రాష్ట్ర ప్రభుత్వం బాలబాలికలు క్రీడల్లో రాణించేలా ఏటా ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్ ఫెడరేషన్) పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఆగస్టులో నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్రీడల నిర్వహణకు సంబంధించిన వేదికలను కూడా ప్రకటించింది. పోటీలను మూడంచెల పద్ధతిలో నిర్వహించనున్నారు. అండర్–14, 17 విభాగంలో పాఠశాలల విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిలో విడతల వారీగా పోటీలు తలపెట్టనున్నారు. జిల్లాస్థాయిలో జరిగే పోటీల నిర్వహణకు వేదికలతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపాళ్లను కన్వీనర్లుగా ప్రకటించారు. జోనల్, స్టేట్మీట్ వేదికలు ఖరారు కావాల్సి ఉంది. ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడి నుంచి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. క్రీడా పోటీలు ఇలా.. జిల్లా స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీలకు వేదికలు ప్రకటించారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ పోటీలు (జెడ్పీహెచ్ఎస్ భీమారం), బాక్సింగ్ (మోడల్స్కూల్, రాజీవ్నగర్), రెజ్లింగ్ (మధర్థెరిస్సా స్కూల్, మంచిర్యాల), టెన్నిస్ (జెడ్పీహెచ్ఎస్, నెన్నెల), బాస్కెట్ బాల్ (కార్మెల్ హైస్కూల్, మంచిర్యాల), చదరంగం (జెడ్పీహెచ్ఎస్, ఆకెనపల్లి), కబడ్డీ, అండర్–17 (ట్రినిటీ హైస్కూల్), అండర్–14, 17 (జెడ్పీహెచ్ఎస్, అచ్చలాపూర్), టేబుల్ టెన్నిస్ (జెడ్పీహెచ్ఎస్, ముల్కల్ల), వాలీబాల్, అండర్–17 బాలురు (జెడ్పీహెచ్ఎస్, జన్నారం), వాలీబాల్ అండర్–17 బాలికలు (లక్సెట్టిపేట్), వాలీబాల్ అండర్ 14, 17, బాలురు, బాలికలు (జెడ్పీహెచ్ఎస్, రెబ్బనపల్లి), ఉషూ, హ్యాండ్బాల్, అండర్–17 (సదన డిఫెన్స్ అకాడమి, మంచిర్యాల), త్రోబాల్ (జెడ్పీహెచ్ఎస్, కన్నెపల్లి), హ్యాండ్బాల్, అండర్–14 (జెడ్పీహెచ్ఎస్, నస్పూర్), బాస్కెట్బాల్ (జెడ్పీహెచ్ఎస్, బెల్లంపల్లి), పెన్సింగ్ (స్పింగ్ ఫీల్డ్ స్కూల్, మంచిర్యాల), ఖోఖో (జెడ్పీహెచ్ఎస్, భీమారం), సాఫ్ట్బాల్ (జెడ్పీహెచ్ఎస్, బెల్లంపల్లి), లాన్టెన్నిస్, టెన్నికాయిట్ (జెడ్పీహెచ్ఎస్, నెన్నెల) టగ్ ఆఫ్ వార్ (ఆక్స్ఫర్డ్ స్కూల్, మంచిర్యాల), క్రికెట్ (ట్రినిటీ హైస్కూల్, పల్లవి మోడల్ స్కూల్ మంచిర్యాల), ఫుట్బాల్ (హెవెన్ ఆఫ్ హోప్ స్కూల్)లో పోటీలు నిర్వహించనున్నారు. ఇతర క్రీడాపోటీలకు వేదికలు కేటాయించాల్సి ఉంది. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు చివరలో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ మహ్మద్ యాకూబ్ తెలిపారు. పోటీలకు సంబంధించి వేదికలు ఖరారు చేశామని, కన్వీనర్లను కూడా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ కుమార్ దీపక్దండేపల్లి: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. గురువారం దండేపల్లి పీహెచ్సీని తనిఖీ చేసి వైద్యులు, రోగులతో మాట్లాడారు. మందుల నిల్వలపై ఆరా తీశారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం దండేపల్లి కేజీబీవీ, లింగాపూర్ మోడల్స్కూల్ను సందర్శించారు. ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రతిభ, సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం లింగాపూర్ గ్రామంలో వర్షం కురుస్తుండడంతో గొడుగు పట్టుకుని డ్రెయినేజీలు పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధర్మరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ద్వారక ఉన్నత పాఠశాలను పరిశీలించారు. బీసీ హాస్టల్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏఈ బషీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రసాద్, ఆయా గ్రామాల కార్యదర్శులు ఉన్నారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్బాధ్యతల స్వీకరణ..మంచిర్యాలఅగ్రికల్చర్: బెల్లంపల్లి సబ్ కలెక్టర్గా గురువారం బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. బుగ్గలో ప్రత్యేక పూజలుబెల్లంపల్లిరూరల్: బెల్లంపల్లి మండలం క న్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీబుగ్గ రాజేశ్వరస్వామి ఆలయంలో సబ్ కలెక్టర్ మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఆలయ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ శ్రీదేవి, కన్నాల మాజీ సర్పంచ్ స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి న భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం ఇ స్తానని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ ఈశ్వర సత్యసాయి దుర్గ (ఐఈఎస్ఎస్డీ) మనోజ్ అన్నా రు. గురువారం సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టా రు. అంతకు ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, చి న్ననా టి జ్ఞాపకాలు, తదితర అంశాలు పంచుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం తండ్రిగారి స్వస్థలం. తల్లిదండ్రులు ఇనుకొండ గంగాభవాని, వెంకటేశ్వర్లు. సోదరి లక్ష్మీ మౌనిక. తండ్రి పోలీసు శాఖలో ఏసీబీ సీఐగా పనిచేస్తున్న క్రమంలో రాజమండ్రికి బదిలీ అయిన సమయంలో అక్కడ జన్మించాడు. విద్యాభ్యాసం మంచిర్యాల జిల్లా తాండూర్లోని విద్యాభారతి పాఠశాలలో 4, 5 తరగతులు, మెట్పల్లిలో ఆరోతరగతి, 7 నుంచి 10 వరకు హైదరాబాద్లో పూర్తి చేశాడు. 2013 నుంచి 2015 వరకు గుంటూరులోని భాస్యం విద్యాసంస్థలో ఇంటర్, 2015లో పోటీ పరీక్షకు హాజరై వరంగల్లో నీట్లో సీటు సాధించాడు. 2019లో కంప్యూటర్ సైన్స్ గ్రూపులో బీటెక్ పూర్తి. 2021లో సివిల్స్ రాయగా ఐఆర్ఎస్కు ఎంపికకావడంతో ఇన్కంట్యాక్స్ అధికారిగా ఉద్యోగం వచ్చింది. నాగ్పూర్లో ట్రైనింగ్ చేస్తుండగా 2022లో ఐఏఎస్ పాసయ్యా. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ వరకు ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి. 2024 నుంచి 2025 మార్చి వరకు సంగారెడ్డిలో ట్రెయినీ కలెక్టర్గా విధులు. 2025 ఏప్రిల్, మేలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో అసిస్టెంట్ సెక్రెటరీగా బాధ్యతలు. జూన్, జూలైలో రెండు నెలల పాటు మరోసారి ముస్సోరిలో శిక్షణ. గత జూలై 25న ఐఏఎస్ శిక్షణ పూర్తికాగానే బెల్లంపల్లి సబ్ కలెక్టర్గా పోస్టింగ్. బెల్లంపల్లి ప్రాంతంపై అవగాహన నాన్న తాండూర్ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేసిన సమయంలో ఆయనతో కలిసి ఆయా ప్రాంతాలన్నీ తిరిగా. ఆ జ్ఞాపకాలు నేటికీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన ఉంది. -
చిరస్మరణీయుడు జయశంకర్ సార్..
● ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్మందమర్రిరూరల్: తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ప్రొఫెసర్ జయశంకర్సార్ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ కూడలి ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. పోరాటాలు, ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాయకులు ఆగం పట్టిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు డబ్బు సంచులతో దొరికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే నెపంతో కేసీఆర్ను జైలుకు పంపించే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష రామకృష్ణాపూర్: తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, రాష్ట్రాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ప్రజలు బీఆర్ఎస్ పక్షాన నిలవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీని వాస్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి గురువారం ఆర్కేపీలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. సూ పర్బజార్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 నెలల కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా మోసమే అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి పరిపాలన గా లికొదిలేసి తరచూ ఢిల్లీకి వెళ్లడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఆగమవుతున్న తెలంగాణాను తిరిగి గాడిలో పెట్టేందు కు ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒ క్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రాజరమేశ్, కంభగోని సుదర్శన్గౌడ్, రామిడి కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి తెలపాలి
నస్పూర్: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తమ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు వనం సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం సీసీసీలోని నర్సయ్య భవన్లో బీసీ హక్కుల సాధన సమితి మండల సమావేశం నిర్వహించారు. నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దన్నారు. బీజేపీ ప్రభుత్వం కుల గణన చేయకుండా 11 సంవత్సరాలుగా కాలయాపన చేస్తోందని విమర్శించారు. అనంతరం మండల అధ్యక్షుడిగా బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా జోగుల ఆంజనేయులు, కోశాధికారిగా కొత్తపల్లి మహేశ్, తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులను, 17 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టె కిషన్రావు, జోగుల మల్లయ్య, లింగం రవి, ముస్కె సమ్మయ్య, దొడ్డిపట్ల రవీందర్, సదానందం, పోశం, తదితరులు పాల్గొన్నారు. -
దూది గొండలే ప్రత్యేకం
● భైంసాలో నేటికి అవే.. ● రాఖీ పౌర్ణమికి ముందుగానే ఇంటింటా పంపిణీభైంసా: అక్కాతమ్ముళ్ల అనురాగానికి, అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా భైంసా ప్రాంతంలో పూజార్లు, అర్చకులు ఇంటింటా ఇప్పటికీ దూది గొండలే ఇస్తారు. ఈ ప్రాంతం మహారాష్ట్రకు ఆనుకుని ఉండడంతో రాఖీలను గొండలు అని పిలుస్తారు. సన్నని దారానికి దూదిని పసుపులో, కుంకుమలో, చంద్రం, గులాలు ఇలా పూజకువాడే వాటిలో కలుపుతారు. ఇలా కలిపిన దూది నుంచి దారాన్ని బయటకు తీసి గొండగా కడుతారు. ఇలా తయారు చేసిన గొండలను గ్రామాల్లో ముందుగా అక్కడి పూజార్లు ప్రత్యేక పూజలు చేస్తారు. పౌర్ణమికి రెండు రోజుల ముందుగానే ఇంటింటికి వెళ్లి ఈ దూదిగొండలను పంచిపెడతారు. ఇవి తీసుకున్నవారు ఇంటికివచ్చిన పూజార్ల కాళ్లు కడిగి వారిని లోనికి ఆహ్వానిస్తారు. ఇచ్చిన దూదిగొండలు తీసుకుని ఇంట్లో పండించిన బియ్యం, జొన్నలు, పప్పులు దానం చేస్తుంటారు. రాఖీపౌర్ణమి రోజున ఇంటికి వచ్చే ఆడపడుచులు పూజార్లు ముందుగా ఇచ్చిన ఈ దూదిగొండలనే కడతారు. ఆడపడుచులకు పుట్టింటి కానుకలు తోబుట్టువులకు దూదిగొండలు చేతికి కట్టగానే కానుకలు అందిస్తారు. సోదరులు పుట్టింటి ఆడపిల్లకు కాళ్లు మొక్కి నగదు, బట్టలు కానుకగా ఇస్తుంటారు. రాఖీ పౌర్ణమి నుంచి పొలాల అమావాస్య వరకు 15 రోజులపాటు వీలు దొరికినప్పుడల్లా దూరప్రాంతంలో ఉండే పుట్టింటి ఆడపడుచు ఎప్పుడైనా వచ్చి తోబుట్టువులకు రాఖీలు కట్టి వెళ్తుంది. రాఖీ పౌర్ణమి అంటే ఇక్కడి వారు ప్రత్యేకంగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపిల్లలు పుట్టింటికి రావడం భైంసా చుట్టుపక్కల ఇప్పటికీ ఆనవాయితే. నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి వెంటవెంటనే వచ్చే ఈ రెండు పండుగలకు ఆడపిల్లలు తప్పకుండా పుట్టింటికివస్తుంటారు. చేతికి రాఖీ కట్టిన వెంటనే ఆడపిల్లకు కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. చేతికిరాఖీ కట్టి నోరు తీపిచేసి తోబుట్టువులను ఆశీర్వదిస్తారు. సంఘాల ఆధ్వర్యంలో.. ఇంట్లో రాఖీ పౌర్ణమి సందర్భంగా తోబుట్టువులతో పండుగ చేసుకున్న అనంతరం అంతా బయటకు వస్తారు. సంఘాల ఆధ్వర్యంలో సామూహికంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటారు. ప్రతి పల్లెటూరిలోనూ ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి. హిందువాహిని, ఆర్ఎస్ఎస్లతోపాటు సరస్వతీ శిశుమందిరాల విద్యార్థులు భైంసా డివిజన్లోని అన్ని ప్రాంతాలకు వెళ్లి రాాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. భైంసాలో విధుల్లో ఉండే పోలీసులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆసుపత్రి సిబ్బంది, అత్యవసర సేవలు అందించేవారికి భైంసావాసులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుతారు. -
జూడో చాంపియన్గా ఆదిలాబాద్
● 22 పతకాలతో స్పోర్ట్స్ విద్యార్థుల సత్తా ● 12 మంది జాతీయస్థాయికి ఎంపికఆదిలాబాద్: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు 22 పతకాలతో సత్తాచాటారు. తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు వరంగల్ జిల్లా కేంద్రంలోని కెమిస్ట్రీ నిర్వహించిన కేడెట్, సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో 12 స్వర్ణాలు, 4 రజతం, 5 కాంస్య పతకాలతో ప్రతిభ కనబర్చారు. కేడెట్ విభాగంలో మొత్తం 9 బంగారు పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకోవడం విశేషం. ఈ పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు సెప్టెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు బీహార్ రాజధాని పాట్నాలో జరగనున్న జాతీయస్థాయి జూడో పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అదేవిధంగా కేడెట్ విభాగంలో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగే జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని జూడో కోచ్ రాజు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్లుగా నిలవడం పట్ల డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నజీర్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారధి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డి, క్రీడా పాఠశాల హెచ్ఎం భూమన్న, డీఎస్ఏ సిబ్బంది తదితరులు అభినందించారు. సబ్–జూనియర్ బాలికల విభాగం (స్వర్ణం) ఉషశ్విని (–48 కేజీలు), ఝాన్సీ (–52), అక్షిత (–57). కేడెట్ బాలుర విభాగం (స్వర్ణం) సతీశ్ (–50), తరుణ్ (–55), హర్షవర్ధన్ (–60), మధు (–81) కేడెట్ బాలికలు (స్వర్ణం) నాగిణి ప్రియా (–44), రమ్య (–48), చాందిని (–52), అలేఖ్య (–57), శ్రీజ (–63) సబ్–జూనియర్ బాలుర (రజతం) మనోజ్ కుమార్ (–40) కేడెట్ బాలురు (రజతం) శ్రీహరి (–60), సంతోష్ (–90) కేడెట్ బాలికల (రజతం) డి. సునీత (–44), జి. సహస్ర (–48) సబ్–జూనియర్ బాలుర (కాంస్యం) విశ్వనాథ్ (–45), ఈశ్వర్ (–50), శ్రీజిత్ (–55), దీపక్ (–60) కేడెట్ బాలురు (కాంస్యం) రామ్ చరణ్ నాయక్ (–66కేజీలు) -
ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి
శ్రీరాంపూర్: ఇప్పటివరకు జరిగిన డైరెక్టర్ (పా), సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశాల్లో జరిగిన ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీచేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కోరారు. యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.బలరాం నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ చర్చల్లో అవగాహనకు వచ్చి ఒప్పందం చేసుకున్న ప్రతీ డిమాండ్ నెరవేర్చాలన్నారు. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు మెడికల్ అన్ఫిట్ అయితే వారికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ కల్పించడానికి ఒప్పందం జరిగిందని దీన్ని అమలు చేయాలన్నారు. ఈపీ ఆపరేటర్ల సమస్య, ప్రమోషన్లు, మారుపేర్ల సమస్య ఇంకా ఇతర డిమాండ్లపై చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటీవల మెడికల్ బోర్డులో అర్హులైన వారికి న్యాయం జరగలేదనితిరిగి మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. -
తెలంగాణ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టాలి
బెల్లంపల్లి: తెలంగాణ రాష్ట్రం పేరుతో న్యూఢిల్లీకి ప్రత్యేక సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు ఫణి కోరారు. గురువారం ద.మ రైల్వేజోన్ సికింద్రాబాద్ సీపీటీఎం రవిచందర్ను రైల్వే నిలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ రైలును హైదరాబాద్–న్యూఢిల్లీకి వయా కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల మీదుగా నడిపించాలని సూచించారు. పెద్దపల్లి జంక్షన్లో తిరువనంతపురం స్వర్ణ జయంతి వీక్లీ, వైన్ గంగా బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఓదెలలో కరీంనగర్–తిరుపతి బై వీక్లీ సూపర్ ఫాస్ట్, విశాఖపట్నం స్వర్ణజయంతి బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును మంచిర్యాలలో ఆపాలని విన్నవించారు. బల్లార్షా–కాజీపేట ఎక్స్ప్రెస్ రైలును చర్లపల్లికి, కాచిగూడ–కరీంనగర్ డెము రైలును పెద్దపల్లి, తిరుపతి–కరీంనగర్ రైలును నిజామాబాద్కు, రాయలసీమ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును బోధన్కు, నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలును కాజీపేటకు పొడిగించాలని కోరారు. ఐఆర్సీటీసీ రైల్వే రిజర్వేషన్ పోర్టల్లో పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల, జమ్మికుంట, రామగుండంలో ఏవైతే ప్రయోగాత్మకంగా రైళ్ల హాల్ట్లను నవీకరించలేదో, వాటి గురించి సీపీటీఎంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి, ఆయా రైల్వే స్టేషన్లలో ప్రతిపాదిత రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తామని సీపీటీఎం హామీ ఇచ్చినట్లు ఫణి తెలిపారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు
భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్గల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో మూడురోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు గురువారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ శిశుమందిరాల నుంచి 954 మంది విద్యార్థులు పాల్గొనగా, వారికి వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యాపీఠం రాష్ట్ర సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రీడాకారులకు గెలుపోటములు సహజమన్నారు. కార్యక్రమంలో ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్ కృష్ణమాచార్యులు, విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ వేణుమాధవ్, విభాగ్/జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రావమ్మా మహాలక్ష్మి..!
● నేడు వరలక్ష్మివ్రతం ● అష్టైశ్వర్యాలకు వరం ● సౌభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని ప్రతీక కెరమెరి(ఆసిఫాబాద్): నేడు శ్రావణ శుక్రవారం.. మహిళలకు ఈ వారం అత్యంత శ్రేష్టమైనది. ఈ వ్రతాలను నిండు మనస్సుతో చేసేవారికి సకల సౌభాగ్యాలు, పుత్రప్రాప్తి కలిగి సుఖంగా ఉంటారని విశ్వాసం. మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయం. ఈరోజు ఇళ్లను శుభ్రపర్చి, ముంగిట ముగ్గులతో అలంకరించి కలశాన్ని ఏర్పర్చి పూజలు నిర్వహిస్తే సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే వరలక్ష్మి వ్రతం గురించి వివిధ కథలు, పురాణాలు, ప్రాచుర్యంలో ఉన్నాయి. దీనిపై సాక్షి అందిస్తున్న కథనం. పూజా విధానం.. ఓం శ్రీ వరలక్ష్మిదేవ్యైనమః ఆచమ్య ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధావాయాస్వాహా అని జలము తీసుకోవాలి. ప్రాణాయామం జపించాలి, పుష్పాంక్షతలు పట్టుకుని సంకల్పం చెప్పాలి. పుష్పంతో కలశంలోని పూజ వస్తువులు, దేవునిపై, తనపై చల్లుకోవాలి. మంటపం తయారు చేయాలి మంటపం మాదిరిగా తయారు చేసి అందులో వరలక్ష్మి ఫొటో పెట్టి, అలంకరణం చేయాలి. పటం ముందు ఒక కొత్త తెలుపు వస్త్రం పర్చాలి. బియ్యం పోసి తమలాపాకులు ఉంచి, కలశాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. అనంతరం పూజ ప్రారంభించాలి. వైభవ లక్ష్మి అవతారాలు.. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. అనుగ్రహాలు పొందాలి.. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరుపై శుక్రవారం ఏర్పడిందని హిందు పురాణాలు చెబుతున్నాయి. శుక్రచార్యుని తండ్రి బృగుమహార్శి. బ్రహ్మదేవుని సంతానంలో ఒకరు. ఇతను లక్ష్మిదేవికి తండ్రి కూడా. అందుకే లక్ష్మిదేవికి భార్గవి అని పేరు. ఈవిధంగా లక్ష్మిదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకు శుక్రవారమంటే ఆమెకు ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మిదేవి రూపురేఖలో, వస్త్రాధారణలు, రంగులకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మిదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగులు ధరించినట్లు చిత్రాలు చిత్రిస్తారు. ఎరుపు రంగుశక్తికి, ఆకుపచ్చ సాపల్యతకు, ప్రకృతికి చిహ్నాలు, ప్రకృతికి లక్ష్మిదేవి ప్రతినిధి. లక్ష్మిదేవి ధరించే బంగారు ఆభరణాలు బంగారం ఐశ్వర్యానికి సంకేతం. విష్ణు ఆరాధనలో లక్ష్మిపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మిదేవి అనుగ్రహంతో కాని విష్ణుమూర్తిని దరిచేరలేం. లక్ష్మిప్రసన్నత లేకుండా విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మిదేవికి ఆహ్వానాలు. ఈ రెండు ఉంటే లక్ష్మిదేవి, విష్ణుమూర్తి అనుగ్రహాలు పొందవచ్చు. వరలక్ష్మి పూజ అత్యంత శ్రేష్టం.. ఆనాటి నుంచి నేటి వరకు వివిధ గ్రామాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కొనసాగుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించేందుకు మహిళలు ఆలయాలకు చేరుకుంటారు. మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తే అత్యంత శ్రేష్టమని భావించి పూజ నిర్వహిస్తారు. శుక్రవారమే లక్ష్మి ఆరాధన ఎందుకు? లక్ష్మిదేవిని గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజుల్లో దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మిదేవికి ప్రీతికరమైన స్త్రోత్రాలు, స్తుతులు పాటిస్తారు. ఆ రోజు నుంచి కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈ నాడు మానవులే కాదు, పురాణాల్లో రాక్షసులు కూడా శుక్రవారం లక్ష్మిదేవిని పూజించేవారనడానికి ఎన్నో కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మిదేవికి ఎందుకు అనుకూలమైన దినంగా పేరు గాంచింది? అందులో రాక్షస సంహారి అయినా విష్ణుమూర్తి భార్యను రాక్షసులు కొలవడమేమిటి అనే సందేహాలు అనేకుల్లో ఉన్నాయి. -
దూడ మృతితో.. తల్లడిల్లిన ఆవు
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మూడురోజుల వయస్సు ఉన్న లేగదూడ ను బస్సుఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ దూడను చూసి ఆవు తల్లడిల్లింది. బ స్టాండ్లో నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏ ర్పాటు చేశారని హడావుడి చేసిన ఆర్టీసీ ట్రా ఫిక్ ఇన్స్పెక్టర్, దూడ మృతికి కారణమైన వా రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని పలువురు ప్రశ్నించారు. మూడురోజుల క్రి తం రోడ్డుపై దూడ ప్రసవించిన ఆవును యజ మానికి చేరవేయాలని సోషల్మీడియాలో షేర్చేసిన సమయంలో స్పందించి ఉంటే దూడ మృతిచెందేది కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మృతిచెందిన దూడను బజరంగ్దళ్, ఏబీవీపీ కార్యకర్తలు బైక్పై తరలించారు. -
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి
మంచిర్యాలటౌన్: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వారికి చేరవేయాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని జిల్లా పరిశీలకులు, తెలంగాణ మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీఈబీ కార్యాలయంలో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణాలు, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్స్ అందేలా చూడాలన్నారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర మండల విద్యాశాఖ అధికారులదేనన్నారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ ఎంఈవోలు రోజుకు రెండు పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
11న నులి పురుగుల నివారణకు మాత్రలు
మంచిర్యాలటౌన్: 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నులి పురుగుల నివా రణ మాత్రలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11న జిల్లాలోని దాదాపు 1,58,480 మంది పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. 930 అంగన్వాడీ కేంద్రాలు, 650 మంది ఆశా కార్యకర్తలు, 17 ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలు, 149 ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్ర భుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు జూని యర్ కళాశాలల్లో మాత్రలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లల్లో నట్టలు ఉండడం వల్ల రక్తహీనత, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఆకలి మందగించడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, పోషకాహారంతో బాధపడడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిత, డీపీహెచ్ఎన్ పద్మ, డెమో బుక్క వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి పేరిట పట్టా చేయలేదని ఆత్మహత్య
తలమడుగు: వారసత్వంగా ఉన్న భూమిని తండ్రి పేరిట పట్టా చేయలేదని మనస్తాపం చెందిన యువకుడు వాగులో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మండలంలోని సుంకిడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుంకిడి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్ (30), సుజాత దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. తన తాత పేరు మీద ఉన్న భూమి వారసత్వంగా వచ్చిన 7.5 ఎకరాల వ్యవసాయ భూమిని పెద్దనాన్న దాసరి లింగన్న పట్టా చేసుకున్నాడు. ఈక్రమంలో ప్రశాంత్ నిత్యం మద్యం తాగి వచ్చి ఆ భూమిని తండ్రి ఏర్రన్న పేరిట పట్టా చేయాలని పెద్దనాన్నతో గొడవ పడుతుండేవాడు. పట్టా ఉండి ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని తల్లిదండ్రులతో గొడవపడేవాడు. అయినా పెద్దనాన్న పట్టా చేయకపోవడంతో బుధవారం ఉదయం మద్యం తాగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రయిన రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం సుంకిడి సమీపంలోని వాగులో మృతదేహం తేలింది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రశాంత్గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాధిక తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడర్ గ్రామానికి చెందిన కృష్ణ (22) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. నాలుగో సంవత్సరంలో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందాడు. తండ్రి గంగన్న ధైర్యం చెప్పాడు. 20 రోజుల క్రితం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఈనెల 5న తిరిగి వస్తున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఈక్రమంలో బుధవారం నిర్మల్లో ఆగి ఓ లాడ్జిలో రూం అద్దెకు తీసుకున్నాడు. అర్ధరాత్రి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇలేగాంలో వృద్ధ్దుడు.. భైంసారూరల్: మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన అవదూత్ పాపన్న(85) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు శంకర్ తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. అవదూత్ పాపన్న భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడి వద్ద ఉంటున్నాడు. గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు స మాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చే రుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించా రు. మృతుడి కుమారుడు అవదూత్ శంకర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై వ్యక్తి.. సిర్పూర్(టి): మండలకేంద్రంలోని డౌనల్ ప్రాంతానికి చెందిన పందిర్ల శంకర్(45) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. పందిర్ల శంకర్ మంగలిషాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత రెండేళ్లుగా మద్యానికి బానిసై షాపు నడిపించడం లేదు. మద్యం మత్తులో బుధవారం రాత్రి ఇంటికి వచ్చి ముందు ఉన్న షెడ్డుకు ఉరేసుకున్నాడు. పిల్లలు లోపలి నుంచి చూసి అరిచారు. శంకర్ తండ్రి నాగయ్య వచ్చి చూసేసరికి ఉరేసుకుని ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సరస్వతి కెనాల్కు నీటి విడుదల
సోన్: ఎస్సారెస్పీ సరస్వతి కాలువ ద్వారా నీటిని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి గురువారం దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. సరస్వతి కెనాల్ పరివాహక ప్రాంత రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ సురేష్, ఈఈ అనిల్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, చిన్నయ్య, నాయకులు రావుల రాంనాథ్, సరికెల గంగన్న, హరీశ్రెడ్డి, రమేశ్, రాజేశ్వర్, ముత్యంరెడ్డి, నర్సారెడ్డి, గోవర్ధన్రెడ్డి, సాగర్, అశోక్, ఉదయ్, జీవన్రెడ్డి, నవీన్, నరేశ్, సాయన్న, సంతోష్, గంగారెడ్డి, గంగయ్య, నాగయ్య, సాయినాథ్, నర్సయ్య, గణేశ్, నాగరాజ్, భూమేశ్, ప్రశాంత్ ఉన్నారు. చెట్లు నరికిన ఐదుగురిపై కేసు●జన్నారం: జన్నారం అటవీ రేంజ్ పైడిపల్లి బీట్లో అక్రమంగా టేకు చెట్లు నరికిన ఐదుగురిపై కేసు నమోదు చేశామని రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. చెట్లు నరుకుతున్నారనే సమాచారంతో సెక్షన్ అధికారి శివకుమార్ సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి తనిఖీ చేపట్టారు. దుంగలతో వస్తున్న ఐదుగురిని పట్టుకునేందుకు వెళ్లారు. వారిని గమనించిన మైనేని తిరుపతి, డేగ మహేశ్, మైనేని సురేశ్, ఎండీ తహార్ పాషాలు దుంగలు పడేసి పరారీ అయ్యారు. మరొకరు కండ్లె కమలాకర్ను పట్టుకుని ఎఫ్ఎస్వో శివకుమార్, బీట్ అధికారి లాలుబాయి, కానిస్టేబుల్ చంద్రమౌళి గురువారం తహసీల్దార్ రాజమనోహర్రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. -
తల్లి తీరు నచ్చక కొడుకు ఆత్మహత్య
నెన్నెల: తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ కొడుకు క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నెన్నెల మండలం గంగారాం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (21) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనిల్ తల్లి ఆవుడం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మంగళి తిరుపతితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై అనిల్ తండ్రి తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. ఈ విషయం తెలిసిన అనిల్ కూడా తల్లిని మందలించాడు. అంతేకాకుండా తిరుపతి ఇంటికి వెళ్లి హెచ్చరించాడు. అయితే తిరుపతి వినకపోగా, అనిల్నే చంపుతానని బెదిరించాడు. తల్లి తీరు మారకపోవడం, తిరుపతి బెదిరింపులతో మనస్తాపం చెందిన అనిల్.. బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుని, మిత్రులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. వారు అనిల్ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువులు గురువారం అనిల్ మృతికి కారణమైన తిరుపతి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంటి ముందే ఆందోళన చేశారు. తిరుపతి అప్పటికే ఇంటికి తాళం వేసి పారిపోయాడు. దీంతో తాళం బద్దలుకొట్టి సామాగ్రిని ధ్వంసం చేసి కిచెన్షెడ్కు నిప్పు పెట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, తిరుపతిపై కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హామీ ఇవ్వడంతో అనిల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
ముందస్తు రిజర్వేషన్ ఇలా..పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.118 ప్రత్యేక బస్సులు..ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వరలక్ష్మివ్రతం, రాఖీ పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ బట్టి బస్సులను ఏర్పాటు చేస్తాం. – ఎస్.భవాని ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్ ఆదిలాబాద్/మంచిర్యాలఅర్బన్: రాఖీ పండుగతో పాటు వరలక్ష్మి వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరుస సెలవుల దృష్ట్యా ఉద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ మేరకు రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది. 118 ప్రత్యేక బస్సులు.. ఈ నెల 8న వరలక్ష్మివ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 10, 11, 12వ తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరాబాద్కు 72 బస్సులను నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుబాటులో రాఖీ బుకింగ్ కౌంటర్లు.. పండుగకు సొంత గ్రామాలకు వెళ్లలేని మహిళలు తమ సోదరులకు రాఖీలను బుక్ చేసి పంపించే విధంగా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. రీజియన్ పరిధిలో మూడు బస్టాండ్లు, 26 ఏజెంట్ కౌంటర్లలో వీటిని ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో రాఖీలతో పాటు మిఠాయిలు సైతం పంపించుకునే వెసులుబాటు కల్పించారు. బుకింగ్లో సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వినియోగదారులు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో సెల్ నంబర్ 91542 98531, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో 91542 98547, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో 91542 98541, రీజినల్ మేనేజర్ కార్యాలయం సెల్ నంబర్ 9154298553 పై సంప్రదించాలని కరీంనగర్ జోన్ కార్గో మేనేజర్ వెంకటనారాయణ కోరారు. పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు రాఖీల బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లు -
లారీ బోల్తా
తాంసి: మండలంలోని బండల్నాగాపూర్, పొ చ్చర గ్రామాల మధ్య బుధవారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర గ్రామం నుంచి తాంసి మండలంలోని కప్పర్ల వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మారింది. బుధవారం ఇదే రోడ్డుపై వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజా చైతన్యానికి విశేష కృషి చేసిన తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో తనవంతు పాత్ర పోషించారని తెలిపారు. చిన్నతనం నుంచి ప్రశ్నించడం అలవాటుగా చేసుకుని తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు, నీరు, నిధులు నియామకాల్లో అసమానతలను తొలగించేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు పుస్తకాలు రచించారని, తన రచనలతో గ్రామగ్రామాన తెలంగాణ వాదాన్ని తీ సుకువెళ్లడంలో కృషి చేశారని తెలిపారు. అనంతరం నెన్నెల తహసీల్దార్ జ్యోతి మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి లక్సెట్టిపేట: అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపేట పీహెచ్సీ, అంగన్వాడీ కేంద్రం, దౌడపల్లి, చందారం, మున్సిపాలిటీ పరిధి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని, పీహెచ్సీలో రోగులకు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపా రు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఎంపీడీవో సరోజ, ఏపీవో వేణుగోపాల్ పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సీఎస్ఆర్ నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురు గు కాల్వలు, రహదారులు, చెరువు పూడికలు, ఓపెన్ జిమ్, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేయాలన్నారు. సీపీవో పూర్ణచందర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
పర్వతారోహణకు కార్తీక్●
● ఈ నెల 9నుంచి మౌంట్ యూనమ్కు సాహస యాత్ర కెరమెరి: కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని కెలికే గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్ ఈ నెల 9 నుంచి 19 వరకు హిమాచల్ప్రదేశ్లోని స్పీటీవ్యాలీలో నిర్వహించనున్న మౌంట్ యూనమ్ పర్వతారోహనకు బుధవారం బయలుదేరి వెళ్లాడు. 9 నుంచి పర్వతా రోహణ ప్రారంభించనున్నాడు. సాహస యాత్ర 6,111 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ యూనం వరకు శిఖ రోహణ కొనసాగుతుంది. సుమారు పది రో జులపాటు కొనసాగే ఈ సాహస యాత్రకు సికింద్రాబాద్కు చెందిన గ్లోబల్ హిందూ ఫెడరేషన్, ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ప్రత్యామ్నాయంగా మౌంట్ కానామో శిఖరంతో మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఈడీలో ప్రవేశ గడువు పొడిగింపుఉట్నూర్రూరల్: ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీఈడీ కళాశాలలో 2025–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికిగానూ దరఖాస్తు గడువును ఈ నెల 8 నుంచి 14 వరకు పొడిగించినట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కౌన్సెలింగ్ తేదీ ఈనెల 14 నుంచి 21వ తేదీకి మార్చినట్లు ఆమె పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న ఒకరి అరెస్టునస్పూర్: చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను ఇన్స్ట్రాగామ్లో షేర్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలిపారు. బుధవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్లో మాట్లాడుతూ తాళ్లపల్లి ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన కర్రు సందీప్ చిన్నారుల అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తుండడంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్, సైబర్ సెక్యురిటీ సహకారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్సై ఉపేందర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. టీఎంసీకి షాకాజ్ నోటీసు జారీచెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీ మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్(టీఎంసీ) రామకృష్ణకు బుధవారం జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీఎంసీ వేధింపులకు గురి చేస్తున్నారని చెన్నూర్ మెప్మా సభ్యులు సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. షోకాజ్ నోటీసులపై మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ ఆర్పీలను కార్యాలయానికి పిలిచి విలేకరులకు తమ విషయం చెప్పలేదని రాసివ్వాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇదే విషయమై గురువారం ఆర్పీలతో కమిషనర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
భోరజ్ అక్రమాలకు ‘చెక్’!
● అంతర్రాష్ట చెక్పోస్టుల ఎత్తివేతకు రంగం సిద్ధం ● అవినీతి, ఆరోపణల నేపథ్యంలో సర్కారు నిర్ణయం కొరవడనున్న నిఘా.. భోరజ్ చెక్పోస్టుపై అవినీతి, ఆరోపణలను పక్కనబెడితే దీనిని తొలగిస్తే నిఘా కొరవడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్ మీదుగా వెళ్లే వాహనాలకు పర్యవేక్షణ కరువవుతుంది. ప్రస్తుతం ఈ చెక్పోస్టు మీదుగా వెళ్లే వేలాది వాహనాలను 24 గంటల పాటు తనిఖీ చేస్తున్నారు. ఓవర్లోడ్, పత్రాలు లేకపోవడం, పర్మిట్లు, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నారు. చెక్పోస్టును ఎత్తివేస్తే వీటన్నింటిపై నిఘా కొరవడనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సైతం తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిబ్బందిని తనిఖీ అధికారులుగా నియమించినప్పటికీ 24 గంటల పాటు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టే అవకాశం కనిపించడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాగా ఆన్లైన్లోనే పర్మిట్లు, ఇతర పత్రాలను పరిశీలించనున్నారు. ఇందుకోసం వాహన సారధి యాప్ను అమలులోకి తీసుకొస్తారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. చెక్పోస్టు ఎత్తివేత విషయమై మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో చెక్పోస్టు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల కావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సాత్నాల: భోరజ్ సమీకృత చెక్పోస్టు ఎత్తివేతకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్పోస్టులను తొలగించేందుకు ప్రభుత్వం ఇటీవల చర్యలు షురూ చేసింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ చెక్పోస్టులపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో పాటు ఏసీబీ తనిఖీల సమయంలో పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలు, లెక్కపత్రాలు అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. ప్రతీసారి తనిఖీ చేసిన సమయంలో వేలల్లో పట్టుబడుతున్నాయి. అయితే ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని అధికారులు చేతులెత్తేయడం, అనంతరం అక్రమ దందా యథాతథంగా సాగుతుండం ఇక్కడ షరా మామూలే. గతంలో డ్యూటీ, డబ్బుల విషయంలో గొడవలు జరగగా, ఆ పంచాయితీ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చెక్పోస్టులను ఎత్తివేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. అయితే ఈ చెక్పోస్టును ఎత్తివేస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా కొరవడే అవకాశం లేకపోలేదు. ఆన్లైన్లోనే ఫిట్నెస్, ఇతర పర్మిట్లను జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం వాహన సారధి అనే యాప్ను అనుసంధానం చేయనున్నట్లు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డా.. భోరజ్ చెక్పోస్టు అనేక అక్రమాలకు అడ్డాగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది వాహనాలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయి. ఓవర్లోడ్, పర్మిట్ లేకపోవడం, ఫిట్నెస్ సమస్య, డ్రైవర్లకు లైసెన్సు తదితర అనేక అంశాలపై వాహనాలను ఇక్కడ తనిఖీ చేస్తుంటారు. ఈ చెక్పోస్టు 24 గంటల పాటు కొనసాగుతుంది. అయితే ఇందులో నలుగురు ఎంవీఐలు, ఆరుగురు ఏఎంవీఐలు, ఒక హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, అటెండర్లు, నలుగురు హోంగార్డులు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు మొత్తం 20 మంది వరకు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇందుకోసం చెక్పోస్టులో ఓ డబ్బాను సైతం ఏర్పాటు చేశారని, వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను కూడా నియమించుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యక్తుల వద్దనే డబ్బులు జమచేసి అధికారులు వాటా తీసుకుంటారని ప్రచారం ఉంది. నిబంధనల ప్రకారం.. వాహనదారులు చెల్లించే డబ్బులు తక్కువగా ఉంటాయి. అయితే ఏసీబీ తనిఖీల సమయంలో లెక్కకు తేలని వేలాది రూపాయలు ఉండటం అంతుచిక్కని విషయం. గతేడాది డిసెంబర్ 4న భోరజ్ చెక్పోస్టును ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సమయంలో లెక్కకురాని రూ.62,500 నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. లెక్కకురాని డబ్బులను పైస్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు వాటాలు పంచుకుంటారనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు ఏరోజుకారోజు డబ్బులు చెల్లిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చెక్పోస్టును తొలగించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భోరజ్ చెక్పోస్టు (ఫైల్) -
అదుపుతప్పి ఆటో బోల్తా..●
● మహారాష్ట్ర కూలీలకు గాయాలు కుంటాల: అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన పదిమంది కూలీలకు గాయాలయ్యాయి. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన దత్తనగర్తండాకు చెందిన కూలీలు వరినాట్లు వేసేందుకు బుధవారం ఆటోలో కుంటాలకు బయలుదేరారు. దౌనెల్లితండా వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో డ్రైవర్ ఇందల్తో పాటు కూలీలు జీవంత్రావు, రాథోడ్ కవితరాం, శాంతాబాయి, శేషారావు, లక్ష్మి, లత, పూర్ణిమ, సక్కుబాయికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
గుండెపోటుతో తహసీల్దార్ మృతి
నెన్నెల: నెన్నెల మండల తహసీల్దార్ ముద్దమల్ల జ్యోతి(50) మంగళవారం రాత్రి గుండెపోటుతో చనిపోయా రు. మంగళవారం సా యంత్రం 6గంటలకు విధులు ముగించుకుని మంచిర్యాల సమీపంలోని నస్పూర్కు వెళ్లిపోయారు. అక్కడ ఒంటరిగా ఉంటున్న ఆమెకు రాత్రి 11గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో కారు డ్రైవర్కు ఫోన్ చేశారు. డ్రైవర్ వచ్చేసరికి అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు. ఆమె స్వగ్రామం జగిత్యాలలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో డీఏఓగా పని చేసిన ఆమె గత నెల 9న నెన్నెల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. కోటపల్లి, జైపూర్, నస్పూర్ మండలాల్లో తహసీల్దార్గా పని చేశారు. జ్యోతిమృతితో తహసీల్దార్ కార్యాలయంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. భీమిని ఏడీఏ సురేఖతోపాటు కార్యాలయ సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాడికొండ రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని అనేకమార్లు విమర్శించిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదని విమర్శించారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడు మణిచరణ్, నాయకులు రెహమాన్, సంజయ్, ఆకాష్, వెంకటచరణ్, దినేష్, కార్తీక్, మణిదీప్, అనిల్, సిద్ధార్థ పాల్గొన్నారు. -
పరిహారం చెక్కు అందజేత
లక్సెట్టిపేట: జెండావెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తలమల గ్రామ అటవీ శివారులో ఈ నెల 5న చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందింది. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం యజమాని పూసం లచ్చుకు రూ.12 వేల పరిహారం చెక్కును ఒక్కరోజులోనే అందజేసినట్లు రేంజి అధికారి అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ అల్తాఫ్, ఎఫ్బీవో చంద్రశేఖర్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. 8న ఆర్జీయూకేటీలో ఐదోవిడత కౌన్సెలింగ్బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్నగర్ కేంద్రాలకు సంబంధించిన స్పోర్ట్స్, ఎన్సీసీ, జనరల్ కోటా అభ్యర్థులకు ఈనెల 8న ఐదోవిడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు బుధవారం ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అర్హత పొందిన అభ్యర్థులు నిజధ్రువీకరణ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ www.rgukt.ac.in ను సందర్శించాలన్నారు. -
పాము కాటుకు యువతి మృతి
దహెగాం: పాముకాటుకు యువతి మృతి చెందిన సంఘటన మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన లోహాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మడే రమాదేవి (22) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. వేడి నీళ్లు పెట్టుకోవడానికి ఇంటివద్ద ఉన్న పొయ్యిల కట్టెలను తీస్తుండగా చేతికి పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అంబులెన్సు బెజ్జూర్ నుంచి రావడానికి ఆలస్యం అవుతుందని ద్విచక్ర వాహనంపై కుంచవెల్లి మీదుగా పీపీరావు కాలనీ వరకు వచ్చారు. దహెగాం అంబులెన్సు పీపీరావు కాలనీ వరకు వెళ్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పిడుగుపాటుకు ఒకరు..కౌటాల: పిడుగుపాటుతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పార్డీ గ్రామానికి చెందిన కుడ్మెత శంకర్(60) బుధవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మార్గమధ్యలో పిడుగు వేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రియుడి మోసం వల్లే యువతి ఆత్మహత్యఆదిలాబాద్టౌన్: ఉట్నూర్ మండలం గంగన్నపేటకు చెందిన మౌనిక(24)ను ప్రియుడు మోసం చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందని వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. గత రెండేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ఆదిలాబాద్లోని భుక్తాపూర్లో అద్దె ఇంట్లో ఉంటోందని తెలిపారు. రెండేళ్లుగా ఆదిలాబాద్లోని సూపర్మార్కెట్లో పని చేస్తుండగా.. అదే మార్కెట్లో పని చేసే బంగారుగూడకు చెందిన గణేష్తో ప్రేమ వ్యవహారం సాగుతోందని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో మనస్తాపం చెందిన మంగళవారం ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
‘పోడు’పై హక్కుల కోసం పాదయాత్ర
చింతలమానెపల్లి: పోడు భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని దిందా గ్రామస్తులు బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. పోడు భూముల సాధన ర్యాలీ పేరుతో హైదరాబాద్లోని ప్రజాభవన్కు బయలు దేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులో ఉన్న భూముల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. అటవీశాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తూ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను రాజధానిలో తెలియజేసేందుకు పాదయాత్రగా బయలుదేరామన్నారు. తమ సమస్యకు పరిష్కారం లభించేంత వరకు పోరాడుతామన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కండి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు బెల్లంపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన బెల్లంపల్లి మీదుగా ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్తుండగా కన్నాల నేషనల్ హైవే హన్మాన్ జంక్షన్ వద్ద పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. పార్టీ పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, మహిళలు ఆయన చేతికి రాఖీ కట్టారు. శివ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వరగౌడ్, మాజీ ఎంపీ బి.వెంకటేష్నేత, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 8వ సబ్ జూనియర్ ఆత్య–పాత్య జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన ఏడుగురు బాలురు, ఏడుగురు బాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 10న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో అత్యా–పత్యా జిల్లా అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి ఉప్పలయ్య, కనపర్తి రమేశ్, సంతోష్, దేవేందర్, వర్ష, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన సీఆర్టీల డెమో ప్రక్రియ
ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని పీఎంఆర్సీ భవనంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీఆర్టీ అభ్యర్థుల డెమో ప్రక్రియ సజావుగా ము గిసిందని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. బుధవారం డెమో ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ 6 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ పోస్టులను భర్తీ చేసేందుకు డెమో ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. 96 మంది అభ్యర్థులకుగానూ 90 మంది హాజరైనట్లు తెలిపారు. తుది జాబితాను ప్రకటించి ఖాళీగా ఉన్న పోస్టులలో నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీడీటీడబ్ల్యూ అంబాజీ, ఆసిఫాబాద్ డీడీటీడబ్ల్యూ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టాలి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు కాగజ్నగర్టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు డిమాండ్ చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన కా ళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టులో ఎన్ని ఎకరాలకు సాగు నీరందుతుందని, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ ఏటీఎం లాగా వాడుకుందని ఆరోపించారు. ఘోష్ ప్యానల్ నివేదిక ప్రకారం అవినీతి జరిగిందని స్పష్టమైందని, కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వ్యర్థం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయకుండా కాంట్రాక్టర్లు, నాయకులతో కుమ్మకై వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలంటే తుమ్మిడిహెట్టిలోని వార్ధా, పెన్గంగ నదుల సంగమం వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు. -
అమాయక చూపులకేం తెలుసు.. అమ్మ లేదని..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నానమ్మ, నాన్న ఆస్పత్రి ముందు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక దిక్కులు చూస్తున్న ఆ చిన్నారి అమాయక చూపులు అందరినీ కంటతడి పెట్టించాయి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన దూలం వెంకటేశ్, సోని దంపతులకు నాలుగేళ్ల పాప రిత్విక ఉంది. సోని రెండో ప్రసవం కోసం ఈ నెల 4న నస్పూర్ ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లింది. సాధారణ ప్రసవం కాగా బాబు జన్మించాడు. కొద్ది సేపటికే అధిక రక్తస్రావమై ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే బుధవారం చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే సోని మృతికి కారణమంటూ ఆస్పత్రి ముందు వెంకటేశ్ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. వారి పక్కనే ఉన్న రిత్విక అమాయకపు చూపులు అందరినీ కంటతడి పెట్టించాయి. -
రైతులకు యూరియా కొరత లేదు
లక్సెట్టిపేట/మందమర్రిరూరల్/దండేపల్లి: రైతుల కు యూరియా కొరత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కొరత ఉన్నట్లు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు ఎన్.రాంచందర్రావు అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు దండేపల్లి మండలం గూడెం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లక్సెట్టిపేట మండల కేంద్రంలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతు సమ్మేళనం, మందమర్రి పా తబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. కేంద్రం నుంచి 12లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందిస్తోందని, కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతూ రైతులను తప్పుదారి పట్టిస్తోందని తెలిపా రు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎఫ్సీ ఎల్ను ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్న ట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ రైతులకు ఏం చేయలేదని, ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్తో అభివృద్ధి శూన్యంచెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ఈవీఎం ఓటింగ్ ద్వారా మోసం జరిగిందని మాట్లాడుతోందని, మరి ఆ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో కూడా మోసం జరి గిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఏకతాటిపై ఉ న్నాయని, వారి అవగాహన బయటపడుతోందని తెలిపారు. దేశంలో నక్సలిజాన్ని అంతమొదిస్తామ ని, ఇప్పటికై నా ప్రాణాలు దక్కాలంటే నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. మంత్రి వివేక్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్రావు, మాజీ ఎంపీ వెంకటేశ్నేత, శ్రీదేవి, నాయకులు గోమాస శ్రీనివాస్, లింగయ్య, దుర్గం అశోక్, దీక్షితులు, ఆరుముల్ల పోశం పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం మంచిర్యాలక్రైం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సన్మానించారు. ఆయన మాట్లాడు తూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, ఉపాధ్యక్షుడు భుజంగరావు, జనరల్ సెక్రెటరీ మురళీకృష్ణ, న్యాయవాది తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
పనులు త్వరగా పూర్తిచేయాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● భవన నిర్మాణాల పరిశీలన ● వసతిగృహ పర్యవేక్షకులతో సమీక్ష భీమిని: కన్నెపల్లి మండలంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణ పనులు త్వరగా పూ ర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం భీమిని, కన్నెపల్లి మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. భీమి నిలో పీహెచ్సీని తనిఖీ చేశారు. మందుల నిల్వలు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలు పరిశీలించారు. రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని వై ద్య సిబ్బందికి సూచించారు. అనంతరం మల్లీడి గ్రా మంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. బి ల్లులు త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లీడిలోని నర్సరీ పరిశీ లించి మొక్కల నిర్వహణ సరిగా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమిని, కన్నెపల్లి కేజీబీవీలను సందర్శించారు. వెనుకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. కలెక్టర్ వెంట ఎంపీడీవోలు గంగామోహన్, శ్రీనివాస్రెడ్డి, ఎస్వోలు పద్మ, శారద తదితరులున్నారు. భవన నిర్మాణ స్థల పరిశీలనబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి రాంనగర్ బస్తీలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవ నం శిథిలావస్థకు చేరుకోగా నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పాఠశాల భవన నిర్మాణానికి ప్రతి పాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిథిల భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించి వాటిని వినియోగంలోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. క్రమం తప్పకుండా తనిఖీ చేయాలిమంచిర్యాలఅగ్రికల్చర్: సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను సంబంధిత అధికారులు క్రమంతప్పకుండా తనిఖీ చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ చాంబర్లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, వసతి గృహాల పర్యవేక్షక అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు నెలకోసారైనా వసతిగృహాన్ని సందర్శించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యలుంటే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. -
దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గద్దెరాగిడి భవానీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఈ నెల 3న ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడు పంగ శ్రీధర్ను మంగళవారం అరెస్టు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్రెడ్డి, పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గద్దెరాగిడికి చెందిన ఊటూరి హరీష్ భవానీ బార్ దగ్గర ఉండగా అక్కడే ఉన్న శ్రీధర్ తనకు మద్యం ఇప్పించాలని కోరగా నిరాకరించడంతో మహేందర్, తిరుపతి అనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీధర్ను అరెస్టు చేసి అతనిపై రౌడీషీట్కు కూడా ఓపెన్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. -
ఎరుకల సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఓదెలు
రామకృష్ణాపూర్: ఎరుకల ప్రజా సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన రేవెల్లి ఓదెలును ఎన్నుకున్నారు. మంగళవారం శ్రీరాంపూర్లో జరిగిన సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నియామకపత్రం అందజేశారు. ఎరుకల ప్రజల అభివృద్ధి కోసం, ఎరుకల జాతి చైతన్యం కోసం తనవంతు కృషి చేస్తానని ఓదెలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికఆదిలాబాద్: జాతీయ స్థాయి జూనియర్ హాకీ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. ఆదిలాబాద్ ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాలకు చెందిన కొడప ప్రదీప్, వెట్టి సుదర్శన్ ఎంపికయ్యారని, ఈ నెల 12 నుంచి పంజాబ్లోని జలంధర్లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఒకరిపై గంజాయి కేసుఇంద్రవెల్లి: మండలంలోని దనోరా(బి)లో ఒకరిపై గంజాయి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గ్రామానికి చెందిన పరశురాం తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు సాగు చేసినట్లు తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు నిర్వహించగా 23 గంజాయి మొక్కలు లభ్యమైనట్లు తెలిపారు. మొక్కలను ధ్వంసం చేసి నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అన్నింటికీ ముఖమే!
● ఉద్యోగుల నుంచి ఉపాధి కూలీల వరకు ● ఫేస్రికగ్నిషన్తోనే విధులకు హాజరు నమోదు ● ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈకేవైసీ మొదలు ● ఈ నెల 15నుంచి పకడ్బందీగా అమలుకు ఆదేశాలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల/పాతమంచిర్యాల: ప్రభుత్వం ప్రజలకు మరింత పకడ్బందీగా సేవలు అందించేలా సాంకేతికతను అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా తదితర కార్యక్రమాల్లో బయోమెట్రిక్, జియో ట్యాగింగ్తో కూడిన హాజరు అమలు చేస్తోంది. ఉద్యోగుల ముఖం చూపిస్తేనే హాజరును ప్రామాణికంగా తీసుకుంటోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు అమలవుతోంది. ఇటీవలే విద్యాశాఖలో సర్కారు బడుల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ తప్పనిసరి చేసింది. ఫేస్ రికగ్నిషన్ పద్ధతిలోనే రోజువారీగా విధుల హాజరు, గైర్హాజరు పరిశీలనలు జరుగుతున్నాయి. ఉదయం పూట ఒకసారి, సాయంత్రం మరోసారి ఈ మేరకు ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు కచ్చితంగా ముఖ గుర్తింపు విధానంలో కార్యదర్శులు తప్పుగా ఫొటోలు నమోదు చేయడంతోనే సస్పెన్షన్కు గురయ్యారు. జిల్లాలోనూ 21మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమాధానాలు సంతృప్తికరంగా లేనిపక్షంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఉపాధి హామీ పథకంలోనూ కూలీలకు ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఇప్పటికే ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం(ఎన్ఎంఎంఎస్)’ హాజరు నమోదును ఫీల్డ్ అసిస్టెంట్లు అప్లోడ్ చేస్తుండగా.. ఇక నుంచి మరింత పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నమోదైన కూలీలే హాజరయ్యేలా..నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం సాఫ్ట్వేర్ యాప్ ద్వారా పనులు పారదర్శకంగా చేపట్టేలా కొత్త విధి విధానాలు రూపొందించారు. వీటి ప్రకారం పనులు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో చాలాచోట్ల జాబ్కార్డులు ఉన్న ఇంట్లో ఒకరి పేరు మీద జాబ్కార్డు ఉంటే వారి బదులు మరొకరు హాజరవుతున్నారు. దీంతో వేతనాల చెల్లింపుతోపాటు పని ప్రదేశంలో ఎవరికై నా ప్రమాదం జరిగితే పరిహారం చెల్లించడం సమస్యగా మారుతోంది. దీంతో బాధిత కుటుంబాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ క్రమంలో తప్పనిసరిగా జాబ్కార్డు ఉండి పనికి హాజరైన కూలీల వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తూ ఈకేవైసీ చేస్తున్నారు. దీంతో పనికి హాజరైన కూలీ ఫొటో తీయగానే ఆధార్ నమోదై ఉన్న బయోమెట్రిక్ కారణంగా ఎవరు హాజరయ్యారో సులువుగా తెలిసిపోతుంది. రోజుకు రెండుసార్లు ఉదయం పని మొదలయ్యాక ఒకసారి, నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసుకుంటారు. ఫొటోలో ఉన్న కూలీలే హాజరైతే మస్టర్ పడుతుంది. ఫొటోల్లో తేడాలు ఉంటే మస్టర్ నమోదు కాదు. ఒక ఫొటోకు మరో ఫొటోకు తప్పనిసరిగా నాలుగు గంటల వ్యత్యాసం ఉండాలి. నమోదైన కూలీలే హాజరై పని చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. వీటితోపాటు జియోట్యాగింగ్ ప్రదేశంలో జియో ఫెన్సింగ్ అప్డేట్ చేస్తూ పని ప్రదేశాలను సైతం గుర్తించే వీలు కలుగనుంది. పాత చోట్ల మళ్లీ పనులు చేయకుండా చర్యలు తీసుకోనుంది. సిగ్నల్లేని, సాంకేతిక సమస్యలు ఉన్నా జిల్లా కోఆర్డినేటర్తో పరిష్కరించనున్నారు. కాగా, ఈ అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు సోమవారం కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్వేర్కు అనుగుణంగా పనులు, కూలీల నమోదుపై వివరించారు. ఈ నెల 15నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.పనుల్లో పారదర్శకత ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచడానికే కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కూలీ లు పని స్థలాల్లో పని చేస్తేనే కూలి చెల్లింపులు జరుగుతాయి. జాబ్కార్డు కలిగిన కూలీలే పనులకు హాజరు కావాలి. వారికే వేతనం లభిస్తుంది. కొత్త సాఫ్ట్వేర్తో పనుల్లో జరిగే అక్రమాలను నియంత్రించవచ్చు. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి -
అల్లుడిని హతమార్చిన అత్త
● కర్రతో తలపై బాది గొంతునులిమి హత్య ● ముధోల్ మండలంలోని తరోడలో ఘటన తానూరు(ముధోల్): అత్త చేతిలో అల్లుడు హతమైన సంఘటన ముధోల్ మండలంలోని తరోడలో చోటు చేసుకుంది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్నగర్కు చెందిన షేక్నజీమ్(45) కుటుంబం పదేళ్ల క్రితం ముధోల్ మండలంలోని తరోడలో నివాసం ఉంటోంది. ఇటుకబట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నజీమ్ అత్తగారైన రహీమున్నీసా వారితో కలిసి ఉంటోంది. వర్షాకాలం కావడంతో ఇటుకల తయారీ పనిలేక పోవడంతో మృతుని భార్య షేక్ సాహెబి ఈనెల 2న శనివారం మహారాష్ట్రలోని శివాని గ్రామానికి మేసీ్త్ర పనికోసం వెళ్లింది. ఈ నెల 4న తెల్లవారు జామున నజీమ్ మద్యం సేవించి వచ్చి అత్తను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమైపె చేయి చేసుకున్నాడు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం మత్తులో ఉన్న నజీమ్ మళ్లీ ఆమెతో గొడవపడడంతో కర్రతో తలపై దాడిచేసి గొంతునులిమి హత్య చేసింది. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం సీఐ మల్లేశ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య షేక్ సాహెబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు రహీమున్నీసాను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. -
ఆగని పోడుపోరు
దండేపల్లి: మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలోగల లింగాపూర్ బీట్లోని 380 కంపార్ట్మెంట్లోని అటవీభూమిలో కొద్దిరో జులుగా కొందరు సమీప గ్రామాల ఆదివాసీ గిరిజనులు చెట్లపొదలు తొలగించారు. దీంతో అప్పటినుంచి అటవీ అధికారులు, గిరిజ నులకు మధ్య పోడు పోరు సాగుతోంది. అట వీ, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు పలు సార్లు గిరిజనులకు కౌన్సిలింగ్ ఇవ్వగా కొద్ది రోజులు ఆగినట్లే ఆగినవారు తొలకరి వర్షాల కు చెట్లపొదలు తొలగించిన భూముల్లో విత్తనాలు చల్లారు. అవి మొలకెత్తగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం అక్కడి కి వెళ్లి వాటిని తొలగించారు. విషయం తె లు సుకున్న ఆదివాసీ గిరిజనులు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. త హసీల్దార్ రోహిత్దేశ్పాండే, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసిద్దీన్ సి బ్బందితో అక్కడికి చేరుకున్నారు. గిరిజనుల కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు విని పించుకోలేదు. విషయాన్ని సీఐ జన్నారం ఎ ఫ్డీవో రామ్మోహన్ దృష్టికి తీసుకెళ్లగా వెంట నే ఆయన అక్కడకు చేరుకున్నారు. ఎఫ్డీవో రావడంతోనే కొంతమంది గిరిజనులు ఆయ న కాళ్లపై పడి తాము సాగు చేసుకుంటున్న భూమి తమకివ్వాలని వేడుకోగా, వారు కుదరదని చెప్పారు. అటవీ భూములు వదిలి వెళ్లకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొద్దుపోయేదాకా అక్కడే ఉన్నవారంతా ఆ తర్వాత వెళ్లిపోయారు. -
పర్యాటకం.. అభివృద్ధికి దూరం
● కడెం.. సహజ సౌందర్య నిలయం ● ఏడాది పొడవునా పర్యాటకుల రాక ● శిథిలావస్థకు డీలక్స్ బోటు ● మూలనపడిన స్పీడ్ బోటు ● పట్టించుకోని పర్యాటక శాఖ కడెం: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచిన కడెం ప్రాజెక్టు, రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. 2010లో పర్యాటక శాఖ బోటింగ్ను ప్రవేశపెట్టడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ అందమైన ప్రాజెక్టును తిలకించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అయితే, పెరిగిన పర్యాటకుల సంఖ్యకు తగ్గ సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కడెంను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా.. 2010లో బోటింగ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కడెం ప్రాజెక్టు పర్యాటక రంగంలో గణనీయమైన ఆదరణ పొందింది. 2015లో 12 విడిది గదులు, రెస్టారెంట్తో కూడిన హరిత రిసార్ట్స్ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం హరిత రిసార్ట్స్ను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. పర్యాటకుల విడిది కోసం ఒక రిసార్ట్, రెండు లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాలతో కడెం రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపొందింది. అభివృద్ధి లేక ఇబ్బందులు.. కడెం బోటింగ్ యూనిట్లో ఒక డీలక్స్ బోటు, స్పీడ్ బోటును ప్రవేశపెట్టినప్పటికీ, సౌకర్యాల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గతంలో రూ.30గా ఉన్న బోటింగ్ టికెట్ ధరను రూ.50కి పెంచారు, కానీ సౌకర్యాలు మెరుగుపరచకపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గింది. స్పీడ్ బోటు మోటారు చెడిపోయి సంవత్సరాలు గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో అది మూలన పడింది. డీలక్స్ బోటు శిథిలావస్థలో ఉన్నప్పటికీ, తాత్కాలిక మరమ్మతులతో నడుపుతున్నారు. బోటింగ్కు 16 మంది లేదా రూ.600 చెల్లించాల్సిన నిబంధన వల్ల చాలా మంది పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. శిథిలావస్థలో సౌకర్యాలు.. కడెం బోటింగ్ స్టాండ్ను గతంలో రాత్రికి రాత్రి నాగర్కర్నూల్ జిల్లా సోమశీలకు తరలించారు, దాని స్థానంలో పాత స్టాండ్ను వదిలేశారు. ప్రస్తుతం ఈ స్టాండ్ కూడా శిథిలావస్థకు చేరింది. బోటింగ్ సిబ్బంది తాత్కాలికంగా తాళ్లు, తెప్పలతో దాన్ని నడిపిస్తున్నారు, దీంతో పర్యాటకులకు ప్రమాద భయం పొంచి ఉంది. సౌకర్యాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల గతంలో లక్షల్లో వచ్చిన ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.అభివృద్ధి చేయాలి మిత్రులతో కలిసి కడెం ప్రాజెక్టు సందర్శనకు వచ్చాం. కడెం ప్రాజెక్ట్, పరిసర ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. నీటి మధ్యలో ఉన్న ఐ ల్యాండ్ వరకు బోటును తీసుకెళ్తే బాగుంటుంది. ప్రాజెక్ట్లో వాటర్ గేమ్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. – చంద్రశేఖర్, పర్యాటకుడు, విజయవాడ ప్రాజెక్టు అందాలు బాగున్నాయి కడెం ప్రాజెక్టును విజిట్ చేశాం. ప్రకృతి సిద్ధమైన కడెం ప్రాజెక్టు అందాలు బాగున్నాయి. బోటింగ్ చేశాం. ఇక్కడ ఒకటే బోటు ఉంది. స్పీడ్ బోటుతో పాటు పైడల్ బోటు లాంటిివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – దివ్య, పర్యాటకురాలు, రాజమండ్రి -
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల వేటగాళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా పది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టి నాలుగు కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి ఒక డబుల్ బోర్గన్, ఒక ఎయిర్గన్, జింక కొమ్ములతో కూడిన తల, రెండు జింక కొమ్ములు, కత్తులు, టార్చ్లైట్లు, వేట సామగ్రి, వైర్లు, బరిసెలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మావల పోలీసు స్టేషన్లో 2, తాంసి పోలీసు స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఆదిలాబాద్ పట్టణంలోని పంజేషా మొహల్లాకు చెందిన షోయబ్ అఫ్జల్ వద్ద ఒక డబుల్ బోర్గన్, జింక తల, రెండు జింక కొమ్ముల ముక్కలు, వేటకు ఉపయోగించిన సామగ్రి, కత్తులు, జాకెట్లు, షూలు లభించినట్లు చెప్పారు. మావల మండలంలోని వాగాపూర్కు చెందిన ఆత్రం మారుతి, ఆత్రం భీంరావు వద్ద 50 మీటర్ల జేవైర్, నైలన్ మెష్, జంతువులను వేటాడే సామగ్రి, ఒక ఈటె, ఎలక్ట్రిక్ వైర్ లభించినట్లు తెలిపారు. తాంసి మండలంలోని ఘోట్కురికి చెందిన షేక్ షరీఫ్ వద్ద ఎయిర్గన్ లభించినట్లు పేర్కొన్నారు. వారిపై ఆయా పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై ఇసాఖ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
ఇంద్రవెల్లి: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దొడందా గ్రామంలోని మెస్రం తుల్సిరాం అనే రైతుకు చెందిన ఎద్దు మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మేత మేస్తుండగా ఎర్తింగ్ వైర్కు తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ రూ.40 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎర్తింగ్ వైర్కు విద్యుత్ సరఫరా కావడంతో ఎద్దు మృతి చెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
తెలంగాణను అగ్రస్థానాన నిలబెట్టిన ఘనత కేసీఆర్దే
నస్పూర్: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చి తెలంగాణను దేశంలో అగ్రస్థానాన నిలబెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు కాళేశ్వరం ప్రాజెక్ట్పై మంగళవారం నిర్వహించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ను నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో డిజిటల్ స్క్రీన్పై వీక్షించారు. అనంతరం దివాకర్రావు మాట్లాడు తూ.. ప్రతీ ఎకరాకు సాగునీరందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించలేరని పేర్కొన్నారు. -
అవకతవకల నిరోధానికే సామాజిక తనిఖీలు
జన్నారం: ఉపాధి పనుల్లో అవకతవకల నిరోధానికే ఏటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీ వో పీడీ కిషన్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావేదికకు హాజరై మాట్లాడా రు. 2024 ఏప్రిల్ 1నుంచి 2025 మార్చి 31వరకు చేపట్టిన పనులపై జూలై 24 నుంచి ఆగస్టు 4వరకు పంచాయతీల వారీగా సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 442 పనులకు గాను రూ.7.30 కోట్లు కూలీలకు వేతనాల రూపంలో, రూ.1.17 కోట్లు మెటేరియల్ రూపంలో ఇచ్చిన ట్లు తెలిపారు. 195 పంచాయతీరాజ్ రోడ్లకు రూ.5.59 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు గ్రామాలవారీగా సామాజిక తనిఖీ బృందం నివేదికలు చదివి వినిపించారు. ఇందులో రేండ్లగూడలో పాత షెడ్డుకే నిధులు మంజురు చేయించారని ఆ గ్రామానికి చెందిన దాముక కరుణాకర్ ఆరోపించగా, వివరణ ఇవ్వకపోతే డబ్బులు రికవరీ చేయాల్సి ఉంటుందని డీఆర్డీవో తెలిపారు. దుర్వినియోగమైన రూ.13వేలు రికవరికీ రాశారు. సామాజిక తనిఖీ అనంతరం జరిగిన ప్రజావేదిక సాదాసీదాగా జరిగింది. నివేదికలు చదివి వినిపించగా, డబ్బులు లెక్క తేలనివారికి రికవరీ రాశారు. ఆన్లైన్లో పనులు వివరాల నమోదుతో అక్రమాలు తగ్గినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో రాష్ట్ర టెక్నికల్ సభ్యుడు వేణు, సామాజిక తనిఖీ రాష్ట్ర కోఆర్డి నేటర్ రవి, సాయిలు, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఏపీవో రవీందర్, ఈసీ విలాస్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
గూడెంలో పవిత్రోత్సవాలు
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనా రాయణస్వామి ఆలయంలో మూడురోజులు నిర్వహించనున్న పవిత్రోత్సవాలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అ ఖండ దీపస్థాపన, విశ్వక్సేనారాధన, వాసుదేవా పుణ్యాహావాచనం, రుత్విక్వరణం, అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, స్థా పిత దేవతా హవనములు, మంత్రపుష్పం, తీ ర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వై భవోపేతంగా నిర్వహించారు. ఆలయ పవిత్ర త, భక్తుల శ్రేయస్సు కోసం నిర్వహించే వేడుకల్లో ఆలయ ఈవో శ్రీనివాస్, యాజ్ఞికులు అ భిరామాచార్యులు, వేదపండితులు నారాయణశర్మ, భరత్శర్మ, ప్రధానార్చకుడు రఘుస్వామి, అర్చకులు సంపత్స్వామి, సురేశ్స్వామి, రామకృష్ణస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై మజారొద్దీన్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని భగవంతంవాడకు చెందిన గోపు సత్యనారాయణ, భారతమ్మ దంపతుల కుమార్తె నీలిమ (37)కు గద్దెరాగడికి చెందిన లారీ డ్రైవర్ మానేం రాజేందర్తో వివాహమైంది. దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. సదరు మహిళ కొంతకాలంగా కడుపునొప్పి, గర్భసంచి సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇటీవల తల్లిగారింటికి వచ్చింది. ఈ నెల 3న పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందింది. మహిళ తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీసుస్టేషన్ పరిధిలోని అందుగులపేట మేడారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం రాత్రి 10.30గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారపు వంశీ(32) మృతిచెందాడు. మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్కు చెందిన వంశీ తన భార్య స్వాతితో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తగారి ఊరైన తాండూర్కు వెళ్తున్నాడు. అందుగులపేట వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఉంచగా.. వెనుక నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో వంశీ తీవ్రంగా గాయపడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. వంశీకి భార్య స్వాతి, కుమారుడు ఉన్నారు. -
ఉపాధ్యాయుల పనితీరు భేష్
జన్నారం: విద్యార్థుల సంఖ్య పెంచి, నాణ్యమైన వి ద్యనందించడంలో ఉపాధ్యాయుల పని తీరు అభినందనీయమని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో దిక్చూచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికా నుంచి అమలు చేస్తున్న డిజిటల్ తరగతులను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిష్టాపూర్ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటిస్థానంలో ని లవడం అభినందనీయమని కొనియాడారు. మారుమూల గ్రామ ప్రాథమిక పాఠశాలలో అమెరికా నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. గుణాత్మకమైన, సాంకేతికమైన, శాసీ్త్రయమైన విద్యను అందించేందుకు ఈ కార్యక్రమం సౌకర్యవంతంగా ఉంటుంద ని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు, వి ద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఈవో విజయ్కుమార్, హెచ్ఎంలు రామన్న, సుధాకర్నాయక్, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శిశుమందిరాల్లో విద్యతోపాటు క్రమశిక్షణ
● ఎమ్మెల్యే రామారావు పటేల్ ● రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు ప్రారంభం భైంసాటౌన్: విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశం పట్ల భక్తిభావన పెంపొందించడంలో సరస్వతి శిశుమందిరాలు విశేష కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని కిసాన్గల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో మంగళవారం రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమేనన్నారు. కార్యక్రమంలో విద్యాపీఠం ప్రాంత అధ్యక్షుడు తిరుపతిరావు, సంఘటన కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రాంత శైక్షనిక్ ప్రముఖ్ కృష్ణమాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. -
గిత్తే కార్తీక్కు ఆర్థికసాయం
కెరమెరి: హిమాచల్ ప్రదేశ్లోని స్పీటీ వ్యాలిలో ఈ నెల 9నుంచి 19 వరకు నిర్వహించే మౌంట్ యూనమ్ పర్వతారోహనకు కుమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని కెలికే గ్రామానికి చెందిన మౌంటేనీయర్ గిత్తే కార్తీక్ ఎంపికయ్యాడు. సికింద్రాబాద్కు చెందిన గ్లోబల్ హిందూ ఫెడరేషన్, ఛత్రపతి శివాజీ మహరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ సీడీ చౌహాన్ మంగళవారం ఛత్రపతి శివాజీ ప్రతిమతో పాటు రూ.20 వేల ఆర్థికసాయం అందజేశారు. సాహసయాత్ర పూర్తి చేసుకున్నాక మరో రూ.30 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. కాగా కార్తీక్ హైదరాబాద్లోని ఏఐఎంఎస్ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మౌంటనీరింగ్ కోర్సును గతంలో పూర్తి చేశాడు. ఎన్నో సాహస కృత్యాల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నాడు. -
మలుపు తిరుగుతున్న సైబర్ నేరగాళ్ల కేసు
● దేశవ్యాప్తంగా నమోదైన కేసులు ● నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులుజన్నారం: సైబర్క్రైం, రామగుండం పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్న సైబర్ నేరగాళ్ల కేసు మలుపులు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా వారిపై కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. జన్నారం ఎస్సై అనూష కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్పై విడుదలైన వారిని హైదరాబాద్లోని రాచకొండ సైబర్క్రైం పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. గతంలోనే హైదరాబాద్కు చెందిన వ్యక్తికి సదరు నిందితులు ఫోన్ చేసి రూ.10.20 లక్షలకు టోకరా వేసినట్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేయగా, జన్నారంలో పట్టుబడిన సైబర్ నేరగాళ్ల నుంచి ట్రేస్ చేసిన ఒక సెల్ నంబర్ నుంచే బాధితునికి ఫోన్ కాల్ పోయినట్లు తేలగా అక్కడి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల్లోనూ కేసులుమారుమూల జన్నారాన్ని కేంద్రంగా చేసుకున్న నిందితులు సుమారు వెయ్యి వివిధ నెట్వర్క్ల సిమ్లు వాడారు. కంబోడియా నుంచి ఆపరేటింగ్ చేస్తూ పెద్ద సైబర్ నెట్వర్క్ నడిపారు. వీరిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహాయంతో రామగుండం కమిషనరేట్ పోలీసులు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సైబర్ క్రైం అధికారులు, జన్నారం ఎస్సై అనూష సహకారంతో జూలై 30న పట్టుకున్నారు. కంబోడియాలో ఉంటున్న జాక్ అనే వ్యక్తి సూచనలతో పని చేస్తున్న మాన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన కాండ్రపు కామేశ్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బావు బాపయ్య, మధుకర్, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని గత నెల 30న జన్నారం ఎస్సై అనూష కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారికి బెయిల్ మంజూరైంది. అయితే వీరిపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైబర్ క్రైం కేసులు నమోదైనట్లు సైబర్క్రైంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులో 18 కేసులు, తెలంగాణ లో 11 కేసులతోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వీరిపై కేసులు నమోదైనట్లు సదరు అధికారి ద్వారా తెలిసింది. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు రూ.24 లక్షలకు మోసం చేయగా, అక్కడి సైబర్క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశా డు. విచారణ జరుపుతున్న అక్కడి పోలీసులకు ప ట్టుబడిన సైబర్ నేరగాళ్ల విషయం సమన్వయ పో ర్టల్ ద్వారా తెలియగా వారు దర్యాప్తు చేయగా కంబోడియాలో ఉంటున్న జాక్ సూచనలతో వీరి ప్యా నల్ ద్వారానే సైబర్ క్రైం జరిగినట్లు గుర్తించారని తెలిసింది. ప్రస్తుతం చంచలగూడ సెంట్రల్జైలులో ఉన్న నిందితులపై ఢిల్లీలోనూ కేసు నమోదైనట్లు సమాచారం. చిన్న గ్రామంలో సైబర్ నేరాలు ప్రా రంభించిన నిందితులు దేశవ్యాప్తంగా నేరాలకు పా ల్పడగా వారిపై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. త్వరలో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, మరి కొందరినీ అరెస్ట్ చేసే అవకాశముందని సదరు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై జన్నారం ఎస్సై అనూషను సంప్రదించగా, నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన మాట నిజమేనని ధ్రువీకరించారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
దండేపల్లి: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు నంబాల గ్రామానికి చెందిన కొండ గణేశ్ (32), ప్రవళిక దంపతులు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. ఇద్దరూ కష్టపడి పనిచేస్తున్నా కుటుంబ అవసరాలకు డబ్బులు చాలడం లేదని గణేశ్ పలుమార్లు భార్యతో చెప్పుకుంటూ బాధపడేవాడు. ఈక్రమంలో మంగళవారం కూలీ పని నిమిత్తం ప్రవళికను బైక్పై తీసుకెళ్లి గ్రామ సమీపంలోని పత్తిచేను వద్ద దింపి వెళ్లాడు. మధ్యాహ్నం నంబాల బ్రిడ్జివద్ద పురుగుల మందు తాగి విషయాన్ని సోదరుడు రమేశ్కు ఫోన్చేసి చెప్పడంతో వెంటనే లక్సెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. రైలు కిందపడి ఒకరు.. కాగజ్నగర్టౌన్: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ సురేష్గౌడ్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని కాపువాడకు చెందిన మహ్మద్షబ్బీర్ (52)మద్యానికి బానిసై ఇంట్లో కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం తెల్లవారుజామున రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బెల్లంపల్లి నుంచి బల్లార్షాకు వెళ్ళే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భుక్తాపూర్లో యువతి.. ఆదిలాబాద్టౌన్: ఉరేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో చోటు చేసుకుంది. ఉట్నూర్కు చెందిన మౌనిక (25) ఆదిలాబాద్ పట్టణంలోని ఓ చెప్పుల దుకాణంలో పనిచేస్తూ భుక్తాపూర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. సాయంత్రం షాపు నుంచి ఇంటికి వెళ్లిన యువతి ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించినట్లు తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని ఒకరు.. మందమర్రిరూరల్: భార్య కా పురానికి రావడం లేదని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఏఎస్సై మజీద్ఖాన్ తెలిపిన వివరాల మేరకు మందమర్రిలోని రెండవ జోన్కు చెందిన సింగరేణి కార్మికుడు శనిగారపు కార్తీక్ (30)కు హనుమకొండకు చెందిన లాస్యతో 2018లో వి వాహమైంది. దంపతులకు కుమారుడు ఆర్యన్ (7), కూతురు ఆరాధ్య (5) ఉన్నారు. కుటుంబంలో గొడవలు జరగడంతో నెలరోజుల క్రితం లాస్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గు రై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించాడు. మృతుని అన్న సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. కడెం కాలువలో గుర్తుతెలియని మృతదేహందస్తురాబాద్: కడెం ఎడమ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. మల్లాపూర్ గ్రామ సమీపంలోని కడెం ఎడమ కాలువలోని ముళ్లపొదల్లో మంగళవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థాని కుల సాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. పూర్తిగా కుళ్లిపోయి ఉందని, మృతునికి 45 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
జాతీయ రహదారి పనులు చేపట్టండి
చెన్నూర్: నియోజకవర్గ పరిధిలోని భీమారం–చెన్నూర్ మధ్యగల జోడువాగు 63వ జాతీయ రహదారి పనులు త్వరగా చేపట్టాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ మేరకు వివేక్ ఢిల్లీలో కేంద్ర మంత్రిని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిశారు. జోడువాగు ఎన్హెచ్ 63 పనులు వేగవంతం చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై ఏడాదైనా డీపీఆర్ దశలోనే ఉందని తెలిపారు. త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మె రుగవుతుందని, ప్రజల ఇబ్బందులు తీరుతాయని పేర్కొన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. అంతర్జాతీయ రోడ్ల నిర్మాణంతో చెన్నూర్ ప్రాంతం అ భివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని, డీపీఆర్ ఆమోద పనులను స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారని మంత్రి, ఎంపీ తెలిపారు. -
నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
దండేపల్లి: నేతకానీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన నేతకానీ మహర్ సంక్షేమ సంఘం మండల సమావేశానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా ప్రకటించాలని, నామినేటెడ్ పదవుల్లో ప్రత్యేక స్థానం కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గోళ్ల రాజమల్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశ్, నర్సయ్య, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు యువరాజు, జిల్లా అధ్యక్షుడు రాంబాబు, నాయకులు శ్రీనివాస్, రాములు, రాజలింగు, పోశన్న, తదితరులు పాల్గొన్నారు. -
ఒకరికి ఏడాది..
భీమిని: మహిళను వివస్త్రను చేయడమే కాకుండా దుర్భాషలాడినందుకు ఒకరికి ఏడాది జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ బెల్లంపల్లి కోర్టు న్యాయమూర్తి జే.ముఖేష్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. 2017లో భీమిని మండలంలోని వీగాం గ్రామానికి చెందిన గాండ్ల అంకమ్మ అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వివస్త్రను చేసి, బూతులు తిట్టడంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శేఖర్ కేసు నమోదు చెశారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆరుగురు సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. పాతకక్షలతో ఒకరిపై దాడిలక్ష్మణచాంద: పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఒకరిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని రాచాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గైనం చిన్నయ్య కొన్నేళ్ల క్రితం లక్ష్మణచాందకు ఇల్లరికం వెళ్లాడు. మూణ్నెళ్ల క్రితం తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో రాచాపూర్కు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద భజనకు వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన భూషి రాకేష్ పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని చిన్నయ్యను దుర్భాషలాడడమే కాకుండా అతనిపై కర్రతో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుమారుడు ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
భార్యను హత్యచేసిన భర్త అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ వేణుచందర్ జైపూర్: మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వడం లేదని భార్యను అతి కిరాతకంగా హత్యచేసిన భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వేణుచందర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని నర్వ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గోదారి రాజయ్య మద్యానికి బానిసయ్యాడు. వచ్చిన పెన్షన్ డబ్బులు తాగుడుకు సరిపోకపోవడంతో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న అతని భార్య రాజమణిని తరచూ డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఈ విషయంలో ఇద్దరికి తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 2న ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కర్రపై రాజమణి తలపై కొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎస్సై శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
● ఆస్పత్రిలో చికిత్స అందించిన సిబ్బంది ● నిలకడగా బాలికల ఆరోగ్యం ● పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో శంకరమ్మ రెబ్బెన(ఆసిఫాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెబ్బెనలోని గురుకుల బాలికల పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో బాలికలు పగలంతా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. రాత్రి భోజనం ముగించుకుని పడుకోగా.. పదో తరగతి చదువుతున్న స్పందన, సంకీర్తన, సంజన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి స్పందన, సంజనను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సంకీర్తన ఆరోగ్యం కుదుటపడడంతో బెల్లంపల్లి నుంచి ఇంటికి పంపించారు. మళ్లీ సోమవారం ఉదయం మరో విద్యార్థిని అక్షర సైతం అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను రెబ్బెన పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం బెల్లంపల్లికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంపీడీవో శంకరమ్మ సోమవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలతో పాటు పరిసరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఆరోగ్య సమస్యలతోనే అస్వస్థత బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇన్చార్జి ప్రిన్సిపాల్ రజిని తెలిపారు. ఆదివారం విద్యార్థులంతా ఆనందంగా ఉన్నారని, రాత్రి భోజనాలు చేసి పడుకున్న తర్వాత ముగ్గురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. సోమవారం ఉదయం మరో విద్యార్థిని అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించామన్నారు. బాలికలు గైనక్ సమస్యతో పాటు ఆస్తమా, ఆయాసం వంటి కారణాలతో అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇదే విషయంపై రెబ్బెన పీహెచ్సీ వైద్యాధికారి సుజిత్ను వివరణ కోరగా.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. స్కానింగ్, ట్యూల్ కల్చర్ పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. కడుపునొప్పి, ఆయాసంతో పీహెచ్సీకి రాగా ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలించినట్లు తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ‘గురుకులం’ విద్యార్థులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 2న శనివారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జావెలిన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ముల్కల్ల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఏ.ఉల్లాస్ జావెలిన్త్రోలో బంగారు పతకం, బి.కార్తీక్ పరుగు పందెంలో రజత పతకం, స్టాండింగ్ బ్రాడ్ జంప్లో కాంస్య పతకం, రిత్విక్ 60 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, స్టాండింగ్ బ్రాడ్ జంప్లో రజత పతకం సాధించారు. ఈ నెల 7న జనగామ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పాల్గొననున్నారు. సోమవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మారయ్య, ప్రిన్సిపాల్ కుమ్మరి మోహన్, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, పీడీ శ్రీకాంత్, పీఈటీ సాగర్, ఉపాధ్యాయులు అభినందించారు. -
పట్టపగలే రూ.5 లక్షలు చోరీ
భైంసాటౌన్: పట్టపగలే ఓ దుండగుడు స్కూటీ డిక్కీ తెరిచి రూ.5 లక్షలు అపహరించిన ఘటన భైంసా పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. ముధోల్ మండలం ఎడ్బిడ్కు చెందిన బి.ఆనంద్గౌడ్ కూతురు అమెరికాలో ఉంటోంది. ఈ క్రమంలో తండ్రిని అమెరికాకు రప్పించుకునేందుకుగానూ ఆమె తన తండ్రి ఖాతాకు డబ్బు పంపింది. వాటిని డ్రా చేసేందుకు సోమవారం పట్టణంలోని యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. బ్యాంక్ నుంచి రూ.5లక్షలు విత్డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టాడు. కుభీర్ చౌరస్తాలోని సాయిలక్ష్మి బార్లో భోజనం చేసేందుకు స్కూటీని బయట నిలిపి లోనికి వెళ్లాడు. ఇదంతా గమనిస్తూ అతన్ని అనుసరించిన దుండగుడు స్కూటీ డిక్కీ తెరిచి నగదును అపహరించుకుపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుడు బయటకు వచ్చి చూసేసరికి డిక్కీ తెరిచి ఉండడం, నగదు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జి.గోపినాథ్ తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆగంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రెండు ఎడ్లు, ఆవు అపహరణ
తానూరు(ముధోల్): ముధోల్ మండల కేంద్రంలోని ముక్త దేవి కాలనీలో ఆదివారం రాత్రి హంగిర్గ భోజన్నకు చెందిన రెండు ఎడ్లు, ఒక ఆవును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. భోజన్న తన రెండు ఎడ్లు, ఒక ఆవును సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న నీటి ట్యాంకు కింద కట్టేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వాటిని దొంగిలించారు. గమనించిన బాధితుడు భోజన్న సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్సై బిట్ల పెర్సిస్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాడు. పశువుల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఉట్నూర్రూరల్: ప్రజలు ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. ఆదివారం ఉట్నూర్లోని మల్టీ లెవెల్ మార్కెటింగ్లో డ్రీమ్ డాలర్ లైఫ్ పేరుతో టోకెన్ ప్యాకెట్ అనే అప్లికేషన్ నందు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ను జిల్లా పోలీసులు గుర్తించారన్నారు. ఇందులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. సోమవారం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని వణికి చెందిన రితేష్ వాతేకర్ ద్వారా ఉట్నూర్ మండలంలోని షాంపూర్కు చెందిన చౌకటే సంగ్రామ్, మెండె నారాయణ మల్టీ లెవెల్ మార్కెటింగ్లోని అప్లికేషన్ నందు రూ.1500 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇరువురు దాదాపు 11 మందిని చేర్పించగా ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వారికి వెళ్లినట్లు విచారణలో తెలిసిందన్నారు. ప్రజలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
న్యాక్ ఏడీ నాగేంద్రం బదిలీ
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) ఏడీగా పనిచేస్తున్న నాగేంద్రం హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బెల్లంపల్లికి చెందిన స్వప్నరాణిని ఏడీగా నియమించారు. సోమవారం బదిలీపై వెళ్తున్న ఏడీని, బాధ్యతలు చేపట్టిన నూతన ఏడీలను కార్యాలయ ఉద్యోగులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ సిబ్బంది రమేశ్, దీపక్, మహేష్, తిరుపతి, మేరి విక్టోరియా, తదితరులు పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగంపై సీఐడీకి ఫిర్యాదునిర్మల్టౌన్: బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం విడుదలయ్యే నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లోని వివిధ జిల్లాల కార్యదర్శులతో కలి సి సోమవారం హైదరాబాద్లో సీఐడీకి ఫిర్యా దు చేశారు. పదేళ్లుగా హెచ్సీఏ జిల్లాల పేరుతో ఖాతాల్లో నమోదు చేసిన సుమారు రూ.12 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు హెచ్సీఏ ఆఫీస్ బేరర్లు, జిల్లా కార్యదర్శులు చేకూరి వెంకట్ (ఖమ్మం), చాగంటి శ్రీనివాస్(వరంగల్), కోదాటి ప్రదీప్ (ఆదిలాబాద్), ఎం.రాజశేఖర్(మహబూబ్ నగర్), ఏ.రాజేందర్రెడ్డి (మెదక్), వెంకట్రెడ్డి(నిజామాబాద్), ఆగం రావు (కరీంనగర్), సయ్యద్ అమీనుద్దీన్ (నల్గొండ) ఉన్నారని వివరించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిధులు రికవరీ చేయాలని కోరారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికఆదిలాబాద్: ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఎస్.చరణ్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ రమేశ్ తెలిపారు. హన్మకొండలో ఈనెల 3, 4 తేదీ ల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ట్రయాథ్లాన్–ఏ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. సెప్టెంబర్ 9 నుంచి 11వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తాడని వెల్లడించారు. అదేవిధంగా హన్మకొండ వేదికగా జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సోమవారం క్రీడ పాఠశాలకు చెందిన విద్యార్థి శివాని 600 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డీవైఎస్వో జక్కుల శ్రీనివాస్ అభినందించారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీల భర్తీమందమర్రిరూరల్: సీసీసీ (నస్పూర్)లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గానూ సింగరేణి కోటాలో వివిధ కోర్సుల్లో ఇంకా మిగిలి ఉన్న 66 సీట్లను భర్తీ చేయనున్నట్లు యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సివిల్ కోర్సులో 27, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 06, మెకానికల్లో 23, మైనింగ్లో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసిన తర్వాత ప్రభుత్వ కన్వీనర్ కోటాలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 7న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9010222161 నంబర్లో సంప్రదించాలని సూచించింది. -
కరత్వాడ ప్రాజెక్టు కుడికాలువకు లీకేజీ
● వృథాగా పోతున్న నీళ్లు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు బోథ్: మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు కుడి కాలువకు లీకేజీ ఏర్పడి కొంతకాలంగా నీరు వృఽథాగా పోతోంది. వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటిని ఆపాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాలు లేక ప్రాజెక్టు లోకి నీరు రావడం లేదని, నీరు వృధాగా పోతుండడంతో ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని, రబీ సీజన్లో నీటికొరత ఏర్పడే అవకాశం ఉందని వాపోతున్నారు. విషయాన్ని బోథ్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి రాజు అనే యువ రైతు, పలువురు రైతులతో కలిసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేశారు. దీంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు కుడి కాలువ ద్వారా వెళ్తున్న నీటిని ఆపివేశారు. -
ఆర్టీసీ బస్టాండ్లో దొంగల బెడద
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దొంగల చేతివాటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఎర్వచింతల్ గ్రామానికి చెందిన కొడారి మంజుల, ఎడ్ల వనిత సోమవారం స్వగ్రామాలకు వెళ్లేందుకు ఖానాపూర్ బస్టాండ్కు వచ్చారు. బస్సు ఎక్కే క్రమంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు మంజుల పర్సులో ఉన్న రూ.11,300, వనిత పర్సులో ఉన్న రూ.500 నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టారు. పర్సులో నగదుతో పాటు ఏటీఎం కార్డు, పాన్కార్డు, ఆధార్కార్డు, ఫొటోలను చోరీ చేశారని బాధితులు పేర్కొన్నారు. -
టైగర్జోన్లో భారీ వాహనాలకు త్వరలోనే అనుమతి
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్జన్నారం: కవ్వాల్ టైగర్జోన్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలకు త్వరలోనే అనుమతులు వస్తాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర అటవీ శాఖ వైల్డ్ లైఫ్ బోర్డ్ సమావేశంలో పలు విషయాలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం విలేకరులతో ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు అటవీ చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకకు సహకరించాలని, అటవీ హక్కు చట్టం ప్రకారం అడవిలో ఉండే ఆదివాసీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీలు, ఇతర రైతులను ఇబ్బంది పెట్టవద్దని, పోడు భూముల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు సహకరించాలని, గ్రామాల్లో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, బఫర్జోన్ను రద్దు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు. తాత్కాలికంగా రోడ్లు, వంతెనలకు సహకరించాలని, ఈ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఒంటెద్దు పోకడలకు పోతే ఓపిక నశించి ప్రజలు తిరుగుబాటు చేస్తారని, ఈ విషయంపై ఆలోచించాలని, పై విషయాలపై వైల్డ్లైఫ్ బోర్డ్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. త్వరలోనే భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేస్తారని ఆశభావం వ్యక్తం చేశారు. -
ఆర్జీయూకేటీలో యక్షగాన కళా ప్రదర్శన
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీ క్యాంపస్లో సోమవారం స్పీక్ మాకే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో యక్షగాన కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు యువతలో సాంస్కృతిక అవగాహన పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ‘స్పీక్ మాకే’ సంస్థ తెలంగాణ 4వ రాష్ట్ర కన్వెన్షన్ను ఈ ఏడాది బాసర క్యాంపస్లో నిర్వహించడం గర్వకారణమన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుడు శ్రీ కేరమనే శివానంద హెగ్డే మాట్లాడుతూ ఇంత గొప్ప వేదికపై ప్రదర్శించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా రామాయణంలోని ‘సీతాపహరణం’ ఘట్టాన్ని ఆధారంగా తీసుకుని, రావణుని అధర్మపు చర్యలు, సీతమ్మ త్యాగం, రామలక్ష్మణుల బాధలను అత్యంత హృద్యంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య మురళీదర్శన్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మంచిర్యాలటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తలపెట్టిన బీసీ రిజర్వేషన్ ధర్నాకు టీఎన్జీవోస్ మద్దతునిస్తుందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవోస్ సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి అనుముల సతీశ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, ఉపాధ్యక్షుడు ప్రకాశ్ పాల్గొన్నారు. -
అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు తీసుకోవాలి
జన్నారం/దండేపల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున వైద్యసిబ్బంది అత్యవసర పరిస్థితుల్లోనే సెలవులు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్రాజ్ అన్నారు. సోమవారం ఆయన జన్నారం, దండేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జన్నారంలో సెలవులో ఉన్న వైద్యురాలు లక్ష్మికి మెమో జారీ చేయనున్నట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మలేరియా, డెంగీ, చికున్గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పరిశుభ్రత, దోమలు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అసంక్రమణ వ్యాధుల ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారి ఉమాశ్రీ, జిల్లా మాస్మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. -
కొడుకు పట్టించుకోవడం లేదు
నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నా భర్త చనిపోయి 15ఏళ్లు అవుతుంది. ఒంటరిగా బతుకుతున్న. నా చిన్న కుమారుడు సమ్మయ్య కరోనాతో మరణించాడు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ భూమి మొత్తం పట్టా చేసుకుని అనుభవిస్తూ పట్టించుకోవడం లేదు. ఆ పట్టా రద్దు చేసి నా పేరిట చేయాలి. నేను మరణించే వరకు ఆలనాపాలన చూసుకునే వారికి చెందేలా చర్యలు తీసుకోవాలి. – మేడ ఆంకు, శంకరపూర్, కోటపల్లి అక్రమాలపై విచారణ జరపాలిప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం జిల్లా కన్వీనర్గా గాజుల ముకేష్గౌడ్ ప్రకటించుకుని అనేక అవకతవకలకు పాల్పడుతున్నాడు. నెలకు రూ.2.80లక్షల వరకు తీసుకుంటున్నాడు. ప్రశ్నిస్తే సభ్యత్వం తొలగిస్తామని బెదిస్తున్నారు. అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలి. – కోల రాజగౌడ్, మంచిర్యాల -
టీచర్ల సర్వీసు రికార్డుల పరిశీలన
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా సర్వీసు రికార్డులు, ధ్రువపత్రాల పరిశీలన సోమవారం స్థానిక జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించారు. స్కూల్అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎం పదోన్నతి జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తరలివచ్చారు. పదోన్నతుల కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హత సర్టిఫికేట్లతోపాటు డీఎస్సీలో వచ్చిన మార్కులు, ర్యాంకు, ఉద్యోగంలో చేరిన తేదీ, రూల్ రిజర్వేషన్ ప్రకారం సాధించిన రోస్టర్ పాయింట్లు తదితర వివరాలపై ఆరా తీశారు. స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎన్, పీడీ పోస్టుల కోసం పదోన్నతుల కమిటీ పరిశీలించింది. పదోన్నతులకు 1ః3 నిష్పత్తిలో సీనియార్టీ జాబితా ప్రకటించారు. సబ్జెక్టుల వారీగా 90ఖాళీలు చూపించారు. జనరల్, వర్గీకరణ మేరకు ఎస్సీలకు గ్రూపులు, దివ్యాంగులకు కేటగిరీ వారీగా పదోన్నతులకు రోస్టర్ విధానంలో కేటాయించారు. ప్రతీ సబ్జె క్టు ఎంఈవో, జీహెచ్ఎంతోపాటు కంప్యూటర్ సహాయకులు పరిశీలన చేస్తున్నారు. రెండ్రోజులపాటు దస్త్రాల పరిశీలన కొనసాగనుంది. -
సమావేశం విజయవంతం చేయాలి
లక్సెట్టిపేట/మందమర్రిరూరల్: ఈ నెల 5న లక్సెట్టిపేటలోని ఎస్పీఆర్ ఫంక్షన్హాల్లో, మందమర్రిలో నిర్వహించే సమావేశాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన లక్సెట్టిపేట ఐబీ ఆవరణలో, మందమర్రిలోని బీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతు సమ్మేళన సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో నాయకులు దుర్గం అశోక్, నరేష్, హరిగోపాల్, నరేష్చంద్, ముత్తె సత్తయ్య, స్వామిరెడ్డి, దీక్షితులు, సంజీవరావు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
టీఏంసీ వేధింపులపై కలెక్టర్కు ఫిర్యాదు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీ టౌన్ మిషన్ కోఆర్డినేటర్(టీఎంసీ) రామకృష్ణ వేధింపులకు గురి చేస్తున్నారని చెన్నూర్ మెప్మా సభ్యురాళ్లు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గతంలో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని మరింత వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రుణగ్రహీతల నుంచి డబ్బులు ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలి సింది. రుణాలు పొందిన వారి నుంచి డబ్బు ఇప్పించని సభ్యురాళ్లను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని సమాచారం. గతంలో ఇక్కడ పని చేసిన మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా.. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తానని టీఎంసీ హామీపత్రం రాసిచ్చినట్లు తెలిసింది. ఆ కమిషనర్ బదిలీ కావడంతో మళ్లీ వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్న టీఎంసీపై చర్యలు తీసుకోవాలని, ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఇటీవల చెన్నూర్లో పర్యటించిన మంత్రి వివేక్కు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
లాభాల బోనస్ ప్రకటించాలి
నస్పూర్: సింగరేణి యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో నుంచి కార్మికులకు బోనస్ వెంటనే ప్రకటించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నాయకులతో కలిసి నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. లాభాల్లో 35శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం 7న అన్ని గనులు, డిపార్ట్మెంట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన, 14న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, 21న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి త్వరలో 11 ఏరియాల్లో రణభేరి యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శులు ఏనుగు రవీందర్రెడ్డి, జీవన్జోయల్, నాయకులు రాంశెట్టి నరేందర్, స్వామి, తిరుపతి రాజు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, జీవన్, ప్రకాశ్రావు, రౌతు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఇంటర్లో ముఖగుర్తింపు
● నిలిచిన బయోమెట్రిక్ సేవలు ● కళాశాలల్లో విద్యా సంస్కరణలు ● విద్యా నాణ్యత పెంపొందించే చర్యలు ● ఆధునిక సాంకేతికతతో హజరు పర్యవేక్షణ మంచిర్యాలఅర్బన్:ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో అనేక మార్పులు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు విషయంలో ఫేషియల్ రికగ్నేషన్ అమలు చేస్తోంది. పూర్వ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించింది. ఇక, జూనియర్ కళాశాలల్లోనూ సంస్కరణలపై దృష్టి పెట్టింది. జూనియర్ కళాశాలల్లో బోధనా పద్ధతులు, హాజరు పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకే తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక విద్యార్థులు, అధ్యాపకుల హాజరు కోసం ముఖ గుర్తింపు హాజరు నమోదుకు కసరత్తు చేస్తోంది. ఈ సంస్కరణలు విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి దోహదపడనున్నాయి. ఆధునిక సాంకేతికతతో హాజరు.. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేస్తున్నారు. అయితే, 20 రోజులుగా కేంద్ర ప్రభుత్వ యుడాయి సంస్థతో ఒప్పందం ముగియడంతో నెట్వర్క్ సమస్యలు, బ్యాటరీ లోపాలు వంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని అధిగమించేందుకు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ముఖ గుర్తింపు సాంకేతికత (ఎఫ్ఆర్ఎస్ఏ)ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థ హాజరు నమోదులో కచ్చితత్వాన్ని, సమయపాలనను నిర్ధారిస్తుందని అధికారులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.. ఉమ్మడి జిల్లాలో 49 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 20,083 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే కళాశాలల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.6 కోట్లు మంజూరయ్యాయి. ప్రతీ క్లాస్రూమ్, ల్యాబ్, ప్రిన్సిపాల్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించబడతాయి. దీంతో హైదరాబాద్ నుంచి అధికారులు తరగతులు, బోధనా పద్ధతులు, సమయపాలనను పర్యవేక్షిస్తారు. ఇంటరాక్టివ్ సీసీ కెమెరాలు లోపాలను సవరించుకోవడానికి మరియు బోధన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. బయోమెట్రిక్లో సాంకేతిక సమస్య.. గతంలో అమలు చేసిన బయోమెట్రిక్ విధానంలో నెట్వర్క్ సమస్యలు, సిమ్ లేదా బ్యాటరీ లోపాలు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ముఖ గుర్తింపు సాంకేతికత అమలు చేయడం ఒక వినూత్న చర్య. ఈ విధానం హాజరు నమోదులో పారదర్శకతను పెంచడంతోపాటు, సాంకేతిక లోపాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త విధానం విజయవంతంగా అమలు కావాలంటే, సిబ్బంది, విద్యార్థులకు తగిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అవసరం.జిల్లాల వారీగా కళాశాలలు, విద్యార్థుల వివరాలు.. జిల్లా ప్రభుత్వ విద్యార్థులు కళాశాలలు మంచిర్యాల 10 4,320 నిర్మల్ 15 4977 ఆదిలాబాద్ 13 6,606 ఆసిఫాబాద్ 11 4180 -
ఆదివాసీ దినోత్సవానికి తరలిరావాలి
ఆదిలాబాద్రూరల్: జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో ఈనెల 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు తరలి రావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. ఆదివాసీ తొమ్మిది తెగల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా కుమురం భీం గూడ నుంచి భారీ ర్యా లీతో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, డోలు, స న్నాయి, కాళీకోమ్ పేప్రే తుడుం వాయిద్యాలతో భారీ ర్యాలీగా ఆదిలాబాద్లోని కుమురం భీం చౌక్ కు చేరుకుంటారని పేర్కొన్నారు. అనంతరం సభకు చేరుకుని ఆదివాసీల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు జయవంత్రావు, ప్రధాన కార్యదర్శి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రేణుక, జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పరాణి, ఉపాధ్యక్షురాలు ఇందిరా, నాయకులు రాజు, గణపతి, విష్ణు, రజినీకాంత్, సొనేరావు, భుజంగ్రావు పాల్గొన్నారు. గాదిగూడలో నిర్వహించాలి నార్నూర్: ఆదివాసీ దినోత్సవాన్ని గాదిగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని గొండ్వాన పంచాయతీ రాయిసెంటర్ సార్మేడి జుగ్నా క భీంరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ సంతోష్ పేర్కొన్నారు. గాదిగూడలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు గణేశ్, జిల్లా కోశాధికారి మహేందర్, గ్రామపటేల్ నాగోరావు, గ్రామపెద్దలు లింబా రావు, మారోతి, మాడవి మాన్కు, ఆత్రం మాన్కు, మాజీ సర్పంచ్ జైవంతరావు పాల్గొన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం కార్యవర్గం.. ఆదివాసీ విద్యార్థి సంఘం మండల కార్యవర్గాన్ని ఏ కగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మె స్రం కేశోరావు, అధ్యక్షుడిగా పెందూర్ మధు, ప్రధా న కార్యదర్శిగా మెస్రం వామన్, ఉపాధ్యక్షుడిగా కుడ్మేత రామేశ్వర్, సలహాదారుడు సాక్కర్ శంకర్, కోశాధికారిగా టెకం అయ్యు, ప్రచార కార్యదర్శిగా కోట్నాక్ శ్యామ్రావు, సాంస్కృతిక సలహాదారుగా కుంరం హన్మంతరావు, సభ్యులుగా హెచ్కే మారు, ఆత్రం భీంరావు, చిక్రం తిరుపతి ఎన్నికయ్యారు. ● తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ -
పశుమాంసం పట్టివేత
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామం మీదుగా ఆటోలో తరలిస్తున్న పశుమాంసాన్ని బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పట్టుకున్నారు. కడెం నుంచి గోవధ చేసి తీసుకువస్తున్నారని సమాచారంతో ఆటోను పట్టుకున్నట్లు జిల్లా సంయోజక్ కాసవేణి ప్రణయ్ తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై రాహుల్ గైక్వాడ్ చేరుకున్నారు. వెటర్నరీ ఇన్చార్జి మండల అధికారి సౌందర్యతో పోస్టుమార్టం నిర్వహించారు. పశుమాంసం శాంపిళ్లు సేకరించి ఆవుదా, ఎద్దుదా అని నిర్ధారణ కోసం ల్యాబ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. ఆటోడ్రైవర్ మహమూద్పై కేసు నమోదు చేసి, ఆటోను పోలీసుస్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. కడెం మండల కేంద్రంగా గత ఆరు నెలలుగా ఆవులను వధిస్తూ వివిధ ప్రాంతాలకు మాంసాన్ని తరలిస్తున్నారని జిల్లా సంయోజక్ కాసవేణి ప్రణయ్ ఆరోపించారు. ఆటో వెనకభాగంలో సైతం ఇతర దేశానికి చెందిన జెండాతో ఉన్న వాల్పోస్టర్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు పడాల రాజశేఖర్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజం సురేశ్, నాయకులు పంబాల శ్రీకాంత్, భూమేశ్, సాయిప్రణీత్, ప్రతాప్, ప్రశాంత్, శ్రీకాంత్, సాయికిరణ్, విన్ను, సనత్, నాగేంద్ర ఉన్నారు. -
● చించోలి(బి)కి చెందిన యువకుడు ● 16 ఏళ్ల వయస్సులో మతిస్థిమితం లేక వెళ్లి.. ● ఇటీవల స్వచ్ఛంద సంస్థకు వివరాలు వెల్లడి ● కుటుంబ సభ్యులకు అప్పగింత
22 ఏళ్ల తర్వాత ఇంటికి..●సారంగపూర్: 16 ఏళ్ల వయస్సులో మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిన యువకుడు 22 ఏళ్ల తర్వాత తిరిగివచ్చాడు. స్థానికులు, హైదరాబాద్లోని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపిన వివరాలు.. మండలంలోని చించోలి(బి) గ్రామానికి చెందిన గొల్ల నడిపి లింగయ్య గత 34 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్లాడు. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో చిన్నకుమారుడు మల్లయ్య చిన్నతనం నుంచే మతిస్థిమితం లేకుండా బయట తిరుగుతూ ఉండేవాడు. అతనికి 16 ఏళ్ల వయస్సులో ఎక్కడికో వెళ్లిపోయాడు. తల్లి మల్లవ్వ, అక్కలు, అన్నయ్య ఆతని కోసం వెతికిన ఆచూకీ దొరకలేదు. ఆయన సోదరుడు ఇటీవల మృతి చెందాడు. ఈక్రమంలో ఆకస్మాత్తుగా హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థకు ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సద రు యువకుడు మల్లయ్య (38) కనిపించాడు. తన కుటుంబ వివరాలు తెలపడంతో ఆదివారం చించోలి(బి) గ్రామానికి తిరిగి తీసుకువచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కుటుంబీకుల ఆధ్వర్యంలో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
నిర్మల్: మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..నర్సాపూర్(జి) మండలం కుస్లీ గ్రామానికి చెందిన తోకల చిన్న సాయిలు (28) గత నాలుగేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెందాడు. ఆదివారం గ్రామంలోని క్రీడాప్రాంగణం బోర్డుకు ఉరేసుకున్నాడు. గ్రామస్తురాలు ముచ్చల గంగామణి గమనించి మృతుడి అన్న నడిపి సాయిలుకు సమాచారం అందించింది. నడిపి సాయిలు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కడుపునొప్పి భరించలేక వృద్ధుడు.. బోథ్: కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీసా యి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రైతు దాసరి లక్ష్మారెడ్డి (76) గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గతనెల 31న నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చాడు. ఎంతకీ కడుపు నొప్పి తగ్గలేదు. ఆ బాధ భరించలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య భోజాబాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పురుగుల మందు తాగి యువకుడు.. సిరికొండ: మతిస్థిమితం కోల్పోయి యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై కాంత్లే రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన కినక జుగదీరావ్(26) గతకొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. శనివారం ఉదయం తల్లి గమనించి వెంటనే 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. తల్లి మందలించిందని యువతి.. చింతలమానెపల్లి: తల్లి మందలించిందని యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని రవీంద్రనగర్–2 గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ఇస్లావత్ నరేశ్ కథనం ప్రకారం.. మండలంలోని రవీంద్రనగర్–2 గ్రామానికి చెందిన రీమా మండల్(20) ఇంటర్ విద్య అనంతరం హైదరాబాద్లో ఉన్నత చదువుల కోసం వెళ్లింది. అక్కడ ఆర్థిక పరిస్థితి అనుకూలించక పోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం తల్లి రంజితతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. తల్లి తీవ్రంగా మందలించింది. ఇరువురి మధ్య పెనుగులాట చోటు చేసుకోగా రీమా ఆవేశానికి లోనైంది. తల్లి, మరో సోదరి ఉన్న గదికి గడియపెట్టి పక్కన ఉన్న మరో గదిలో ఉరేసుకుంది. గడియ పెట్టిన విషయాన్ని ఫోన్ ద్వారా పొరుగువారికి తెలియజేయగా వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రీమా మండల్ మృతిచెందింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు..
● భార్యను కొట్టి చంపిన భర్త ● మద్యానికి బానిసై డబ్బుల కోసం వేధింపులు ● పోలీసుల అదుపులో నిందితుడు ● ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ వెంకటేశ్వర్జైపూర్: చివరి వరకు తోడుగా ఉంటానని బాసచేసిన భర్తే కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్యచేశాడు. మద్యం మత్తులో అతిదారుణంగా కట్టెతో కొట్టి చంపాడు. మండలంలోని నర్వ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రానికి చెందిన రాజమణి(48), నర్వ గ్రామానికి చెందిన గోదారి రాజయ్యను ప్రేమించి వివాహాం చేసుకుంది. వీరికి ఒక్క కుమార్తె పూజిత ఉంది. రాజమణి..నర్వ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తుండగా రాజయ్య సింగరేణిలో సపోర్టుమెన్గా పనిచేసి 2020న రిటైర్డ్ అయ్యాడు. కొంతకాలంగా రాజయ్య మద్యానికి బానిసయ్యాడు. వచ్చిన పెన్షన్ డబ్బులతో మద్యం తాగుతూ ఇంకా డబ్బులు ఇవ్వాలని భార్యతో గొడవపడేవాడు. తరచూ మద్యం తాగి భార్యను వేధించేవాడు. ఎప్పుటికై న ఆమెను చంపుతానని బెదిరించేవాడు. శనివారం మద్యం తాగిన రాజయ్య భార్య రాజమణితో రాత్రి గొడవపడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను ఆదివారం ఉదయం కట్టెతో తలపై, శరీరభాగాలపై కొట్టి హత్యచేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు రాజయ్యను అదుపులో తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. మృతురాలి కుమార్తె పూజిత కాగా ఆమె శ్రీరాంపూర్కు చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. -
బాసర క్షేత్రంలో ఎర్రజెండాలు కలకలం
బాసర: జ్ఞాన సరస్వతి క్షేత్రంలో సీపీఐ(ఎం) ఎర్రజెండాలు శనివారం రాత్రి వెలుగుచూశాయి. ఆలయ సమీపంలోని 6వ నంబర్ గది డార్మెటరీ హాల్ అతిథి గృహంలో ఎర్రజెండాలు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టడం కలకలం రేపాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి వాటిని తొలగించారు. ఎర్రజెండాలు ఎందుకు పెట్టారో ఆలయ అధికారులు స్పందించకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ భరోసా ప్రతిఒక్కరికీ అందించడమే లక్ష్యంమంచిర్యాలరూరల్(హాజీపూర్): కుటుంబ భరోసా పథకం ప్రతిఒక్కరికీ అందడమే లక్ష్యంగా యూనియన్ కృషి చేస్తుందని ప్రొఫెషనల్ ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేష న్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే.హుస్సేన్ అన్నారు. ఆ దివారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల ఎన్నికై న అధ్యక్షు డు అప్పాసు రాము, ప్రధాన కార్యదర్శి శ్వాస తిరుపతి, కోశాధికారి ముక్కెర స్వామితో ప్ర మాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు ఫొటో మాంత్రికుడు డ్యాగురే చిత్ర పటా నికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం హుస్సేన్ మాట్లాడుతూ యూనియ న్ నుంచి నీట్, ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు రూ.5 వేలు, కుటుంబ పెద్ద మరణిస్తే పిల్లలకు రూ.5 వేలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కుటుంబ భరోసా పథకం ద్వారా రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి, ఉపాధ్యక్షులు మహేశ్, ఉదయ్, మహిళా అధ్యక్షురాలు జయమాధురి, ఉపాధ్యక్షురాలు ఆశాల శారద, దక్షణ భారత ప్రతినిధి రాజేశ్వర్రెడ్డి, మాజీ గౌరవ అధ్యక్షుడు ఎంకే.రాము, మాజీ ఉపాధ్యక్షుడు కనకయ్యగౌడ్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, ఫొటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు. ‘పంచమి’ ఆవిష్కణ మంచిర్యాలక్రైం: గంజాయి సేవించడం వలన కలిగే దుష్పరిణామాలపై అక్షయ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించిన ‘పంచమి’ షార్ట్ ఫిల్మ్ను డీసీపీ భాస్కర్ ఆదివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కర్రె తిరుపతి, నిర్మాత బోడకుంట రవీందర్ షార్ట్ ఫిల్మ్ కథను వివరించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ గంజాయి సేవించడంతో కలిగి నస్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేలా షార్ట్ఫిల్మ్ రూపొందించడం అభినందనీయమన్నారు. గంజాయి సేవించే వారిలో యువతే ఎక్కువగా ఉందని, గంజాయి రహిత కమిషనరేట్గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో చిత్ర యునిట్ సిబ్బంది, డీవోపీ దుర్గం విజయ్, కుమార్ పాల్గొన్నారు. ప్రధాన పాత్రలో రవీందర్, సిరి నటించారు. -
గ్యాస్ సిలిండర్ లీకేజీ●
● ఇంట్లో వ్యాపించిన మంటలు ● ఏడుగురికి తీవ్ర గాయాలు బోథ్: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి మంటలు వ్యాపించి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పిప్పల్ధరి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోనేరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ అయింది. కుటుంబీకులు గమనించి సోనేరావుతోపాటు ఆయన కుమారుడు గంగ ప్రసాద్ లో నికి వెళ్లి చూశారు. సిలిండర్ నుంచి మంటలు వచ్చా యి. ఇంటి పక్కన ఉన్న వారి కుటుంబీకులు లక్ష్మణ్, చందు, బాపూరావు, మహేశ్, లక్ష్మి ఇంట్లోకి వెళ్లి చూడగా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో వారికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మంట లార్పే ప్రయత్నం చేశారు. గాయపడ్డ వారిని బోథ్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108లో రిమ్స్కు తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గోడ్కే మిలింద్ కుమార్ (38) చికిత్సపొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి..జిల్లాకేంద్రంలోని అంబేద్కర్నగర్కు చెందిన మిలింద్ కుమార్ ఇచ్చోడలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్తుండగా దేవాపూర్ వద్ద రోడ్డు పక్కన బైక్తో సహా పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే రిమ్స్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలిస్తుండగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజమ్మ తెలిపారు. చుచుంద్లో ఒకరు.. భైంసారూరల్: మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన మహాలింగి పోశెట్టి(47) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పోశెట్టి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం లేక మదనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్య మహాలింగి కవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రాణం తీసిన బీడీ అలవాటు
● నిర్మల్ జిల్లా దేవునిగూడెంలో ఘటన దస్తురాబాద్: బీడీ తాగే అలవాటు ఓ వృద్ధుడిని సజీవ దహనం చేసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్పుల లింగన్న(80)కు కంటిచూపు సరిగా ఉండదు. కూతురు రమ్య ఇంట్లో ఉంటున్నాడు. బీడీ తాగే అలవాటు ఉన్న లింగన్న శనివారం రాత్రి, లింగన్న బీడీ తాగేందుకు అగ్గి వెలిగించుకున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు దుప్పట్లకు అంటుకుంది. మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసే సరికి, లింగన్న పూర్తిగా కాలిపోయి ఉన్నాడు.కూతురు రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. ఖానాపూర్ ప్రభుత్వ వైద్యులు సంఘటనా స్థలంలోనే పోస్ట్మార్టం నిర్వహించారు. -
● మళ్లీ ముఖం చాటేసిన వరుణుడు.. ● రెండు నెలల్లో 30 శాతం లోటే.. ● వెలవెలబోతున్న జలాశయాలు ● వర్షాభావంతో రైతుల్లో ఆందోళన ● ఖరీఫ్ సాగుపై ప్రభావం
ముదిరిన నారు వేసుకోవద్దు..నారు పోసుకుని 30 రోజులు దాటిన నారు నాట్లు వేయొద్దు. అలా వేస్తే చీడపీడలు వ్యాపించి దిగుబడి తగ్గుతుంది. తప్పనిసరిగా రైతు చిగుర్లు తుంచి రెండు మూడు మొలకలను నాట్లు వేసుకోవాలి. ఎరువులు మోతాదు సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా వాడాలి. 40 రోజులు దాటిన నారు వేసుకోకపోవడం మంచిది. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడి వచ్చే వరి డ్రమ్సీడర్, నేరుగా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి. – రాజశేఖర్, ఆదిలాబాద్ కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తమంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు జిల్లాలోకి వచ్చి రెండు నెలలు గడిచినా... ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు గత నెలలో రెండు మూడు భారీ వర్షాలు ఆశలు రేకెత్తించినా.. తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. వారం రోజులుగా చినుకు జాడలేదు. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 30% లోటు ఉంది. జిల్లాలో 487.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 340.4 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 580.4 మిల్లీమీటర్లతో 20% అధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది, భీమిని, బెల్లంపల్లి మినహా మిగిలిన 16 మండలాల్లో 20–50% వర్షపాతం లోటు నెలకొంది. ఈ పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్ సాగుకు ఆటంకం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా ఉండగా, ఇప్పటివరకు కేవలం 47 వేల ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. సుమారు 70–80 వేల ఎకరాల్లో నారు పోసిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. నారు ముదిరిపోతుండడంతో, నాట్లు వేయాలా వద్దా అని సంకోచిస్తున్నారు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండకపోవడంతో, ఆయకట్టు కింద సాగు చేసే రైతులు నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు నాట్లు వేయడం కన్నా.. బీడుగా వదిలేయడం మంచిదని భావిస్తున్నారు. ఇతర పంటల పరిస్థితి ఇలా.. జిల్లాలో పత్తి, వరి ప్రధాన పంటలుగా ఉన్నాయి. 1.58 లక్షల ఎకరాల పత్తి సాగు లక్ష్యంలో 1.57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కంది, మొక్కజొన్న, పెసర వంటి ఇతర పంటలు 12 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే, వర్షాభావంతో పత్తి పంటకు నీటితడి అందక, ఎదుగుదలలో లోపం ఏర్పడుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు స్వల్పకాలిక వరి రకాలను ఆగస్టు 15 వరకు డ్రమ్సీడర్ లేదా వేద పద్ధతి ద్వారా సాగు చేయాలని సూచిస్తున్నారు. జలాశయాలు ఖాళీ.. జిల్లాలో 40 వేల ఎకరాలు బావులపై, 67 వేల ఎకరాలు చెరువులు, ప్రాజెక్టుల కాల్వలపై, 35–45 వే ల ఎకరాలు వర్షాధార సాగుపై ఆధారపడి ఉన్నా యి. అయితే, జలాశయాలు కనీస నీటి మట్టానికి చేరుకోకపోవడంతో, కేవలం 37 ఎకరాల్లోనే వరినా ట్లు వేశారు. నీటి నిల్వ లేకపోవడంతో రైతులను నా ట్లు వేయడానికి సంకోచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు కురవకపోవడంతో నారు మళ్ల ను కాపాడుకోవడం రైతులకు సవాల్గా మారింది. ఆగస్టుపై ఆశలు.. నాలుగేళ్లుగా ఆగస్టు రెండో వారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది కూడా ఆగస్టు వర్షాలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత నెల 20–24 తేదీల మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కానీ, ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. వ్యవసాయ అధికారులు దీర్ఘకాలిక వరి రకాలను వేసుకోవద్దని, స్వల్పకాలిక రకాలను మాత్రమే ఈ నెలాఖరు వరకు నాటాలని సూచిస్తున్నారు.జిల్లాలో ఇప్పటి వరకు విత్తుకున్న పంటలుపంట ఎకరాలు పత్తి 1,57,564వరి 47,972కందులు 461మొక్కజొన్న 133పెసర్లు 93ఇతర పంటలు 980మొత్తం 2,07,203 -
వంద సీట్లు గెలుస్తాం
నిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షు డు మహేశ్కుమార్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికారంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటామని వెల్లడించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ఏసీల్లో కూర్చోకుండా తమ నేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయా త్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాలని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబాద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివాసీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని, గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి, తెలంగాణకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని, దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాది న్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలుపుతూ.. సమస్యలు పరిష్కరించేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వస్తాం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఖానాపూర్లో ‘జనహిత’ పాదయాత్ర భారీగా తరలివచ్చిన నేతలు, శ్రేణులు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి, పలువురు మంత్రులు హాజరు -
జన్నారం.. కేరాఫ్ సైబర్ క్రైం!
● అడ్డాగా మార్చుకున్న మోసగాళ్లు ● సైబర్ నేరగాళ్ల పట్టివేతతో ఆందోళన ● పట్టుబడనివారెందరో? అపరిచితులను నమ్మొద్దు..అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వాట్సప్ మెస్సేజ్, ఫోన్ కాల్స్ను నమ్మొద్దు. లాటరీ తగిలిందని, లోన్ ఇప్పిస్తామని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అడిగితే సమాచారం ఇవ్వొద్దు. అలాంటి వాటికి స్పందించొద్దు. మోసపూరిత కాల్స్ వచ్చినట్లు అనుమానం వస్తే సైబర్క్రైం నంబర్ 1930కు ఫోన్ చేయాలి. మోసపోయినవారు పోలీస్టేషన్కు వచ్చేముందే 1930 కు ఫోన్ చేసి రిపోర్టు చేయాలి. – రమణమూర్తి, సీఐ, జన్నారం జన్నారం: చుట్టూ.. కవ్వాల్ అభయారణ్యం. దట్టమైన అడవి మధ్యలో పచ్చని పల్లెలు.. నేరాలు మోసాలు తెలియని అమాయక ప్రజలు. ఎవరి పని వారు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారిపై కొందరు మోసగాళ్ల కన్ను పడింది. జన్నారాన్ని అడ్డాగా మార్చుకుని.. ప్రజల అమాయకత్వానే పెట్టుబడిగా మార్చుకుని మోసాలకు పాల్ప డుతున్నారు. ఇటీవల పట్టుబడిన సైబర్ నేరగాళ్లే ఇందుకు నిదర్శనం. మారుమూల ప్రాంతమైతే ఎవరికీ అనుమానం రాని జన్నారాన్ని అడ్డాగా చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల్లో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే రోజూ లాభాలు, రెండు గుంటల భూమి రిజిస్ట్రేషన్ వంటి ఆకర్షణీయమైన హామీలతో సైబర్ నేరగాళ్లు సుమారు రూ.5 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసానికి మేధావులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు సహా అనేకమంది బలయ్యారు. వివిధ రూపాల్లో మోసాలు.. ఈ మోసాలు ఒకేరకంగా లేవు. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్లతో లక్షలు సంపాదించవచ్చని ఆన్లైన్ మోసాలు, నకిలీనోట్ల చలామణి వంటి విభిన్నరూపాల్లో జన్నారంలో నేరాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేరగాళ్లు మాయమాటలతో స్థానికులను మోసం చేస్తున్నారు. జన్నారంలోనే సైబర్ నేరాల సెటప్ను ఏర్పాటు చేసి, ఈ మోసాలను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలు స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. బాధితుల కథనాలు.. గత ఐదేళ్లలో జన్నారంలో సైబర్ మోసాలు అనేకమందిని బాధితులను చేశాయి. ఒక రిటైర్డ్ అటవీ శాఖ ఉద్యోగి రూ.3 లక్షలు, ఒక ఉపాధ్యాయుడు ఓటీపీ షేర్ చేయడం ద్వారా రూ.2 లక్షలు, ఒక ప్రైవేట్ ఉద్యోగి మొబైల్ లింక్ ద్వారా రూ.40 వేలు నష్టపోయారు. ఇటీవల ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సైబర్ నేరగాళ్లు తమ్ముడిపై కేసు నమోదైందని బెదిరించి మోసం చేయబోయారు. అయితే, అతను అప్రమత్తంగా తమ్ముడితో సంప్రదించడంతో మోసం నుంచి తప్పించుకున్నాడు. ఇలా తెలిసిన బాధితులే ఇంతమంది ఉంటే, తెలియని వారి సంఖ్య వందల్లో ఉందని సమాచారం. జన్నారం నుంచే సైబర్ మోసాలు.. జన్నారం మండలంలో సైబర్ నేరగాళ్లు స్థానికంగానే సెటప్ ఏర్పాటు చేసి మోసాలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. చిన్న సంఘటనలు జరిగే ఈ మండల కేంద్రంలో ఇంత పెద్ద నేరాలు జరుగుతుండడం, ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్యాదవ్, స్థానికంగా అందరికీ సుపరిచితుడు. అతనే ఈ నేరాలకు సహకరించినట్లు తెలిసి స్థానికులు నిర్ఘాంతపోయారు. రామగుండం పోలీసులు, సైబర్ క్రైం అధికారులు వీరిని అరెస్టు చేసినప్పటికీ, స్థాని కంగా నేరాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తతే శ్రీరామ రక్ష.. నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకుని తెలిసినవారే మోసాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఎవరికివారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మొబైల్ ద్వారా ఆన్లైన్ గేమ్లు, రుణాలు, బిజినెస్ ఆఫర్లు వంటి మాయమాటలతో లక్షలు కొల్లగొడుతున్నారు. కొందరు ఆన్లైన్ గేమ్లతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇంకా చైతన్యం అవసరం. గుర్తు తెలియని వ్యక్తుల మాటలను నమ్మకుండా, ఓటీపీలు, లింక్లు షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. -
చదువుతోనే గౌరవం
● తెలంగాణ రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఉషారాణి కాసిపేట: సమాజంలో ప్రతీఒక్కరికి చదువుతోనే గౌరవం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ ఉషారాణి అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యంపల్లి రైతువేదికలో నిర్వహిస్తున్న వందరోజుల్లో వందశాతం అక్షరాస్యత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అక్షరాలు నేర్చుకున్న వయోజనులతో మాట్లాడి ప్రతిభను పరిశీలించా రు. కొంతమంది అక్షరాలు మంచిగా రాయడంతో వారికి స్వయంగా రూ.500ల చొప్పున ప్రోత్సాహకాలు అందించారు. వందశాతం అక్షరాస్యత సాధించిన అధికారులు, ఐకేపీ సిబ్బందిని అభినందించా రు. మొదటిసారిగా మండలానికి విచ్చేసిన వయోజన విద్యాశాఖ డైరెక్టర్ను అధికారులు శాలువాతో సత్కరించి మొక్కను బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తం నాయక్, సెక్టోరల్ అధికారి సత్యనారాయణ మూ ర్తి, డీఆర్పీలు సుమన్, బండ శాంకరీ, తిరుపతి, ఐకేపీ ఏపీఎం రాజ్కుమార్, అసిస్టెంట్ ప్రొవిజన్ అధికారి శ్రీనివాస్, సీసీలు రాజమల్లు, అశోక్, లక్ష్మి, శారద, వసంత, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సర్టిఫికెట్లు సమర్పించాలిమంచిర్యాలఅర్బన్: పీఎస్ హెచ్ఎం పదోన్నతి సీని యారిటీ లిస్ట్ జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు ఈ నెల 4న జిల్లా సైన్స్ సెంటర్లో సంబంధిత సర్టిఫికెట్లు అందించాలని డీఈవో యాదయ్య తెలి పారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు సర్వీస్ రిజిస్టర్ జిరాక్స్ ప్రతులను తీసుకుని ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. -
అగ్రికల్చర్ యూనివర్సిటీ టాపర్గా జోగాపూర్ విద్యార్థి
నెన్నెల: మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన నికాడి శ్యామల–మధునయ్య దంపతుల కూతురు నికాడి తేజశ్విని జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. ఎంఎస్సీ అగ్రికల్చర్లో ఉత్తమ ప్రతిభకనబర్చి రెండు బంగారు పతకాలు సాధించింది. యూనివర్సిటీస్థాయిలో అన్ని సబ్జెక్టులలో, ఓవరాల్ గ్రేడ్ పాయింట్లలో మెరిట్ వచ్చినందుకు ఒక గోల్డ్మెడల్, ఎంఎస్సీ అగ్రికల్చర్ మేజర్ ఫీల్డ్ జెనటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్లో మెరిట్ సాధించినందుకు మరొక బంగారు పతకం సాధించింది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనిర్సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డాక్టర్ మంగిలాల్జత్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్, వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య ఆదివారం సన్మానించి బంగారు పతకాలు ప్రదానం చేశారు. -
భావోద్వేగాలు నియంత్రించుకోవాలి
బెల్లంపల్లి/నెన్నెల: విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకోవాలని, భావోద్వేగాలు నియంత్రించుకోవాలని జిల్లా ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల ఉపసంచాలకులు సీహెచ్.దుర్గాప్రసాద్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల వసతి గృహం, నెన్నెలలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి ఎం.రవీందర్తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? సౌకర్యాలు, భోజనం బాగుంటుందా అని ఆరా తీశారు. బాలికలు ఉన్నతంగా చదువుకోవాలన్నారు. గొప్పగా చదువుకుంటే ఉన్నత భవిష్యత్ ఉంటుందని తెలిపారు. వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, స్పెషల్ క్లాస్ల కోసం ట్యూటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థినులు అన్నిరంగాల్లో రాణించేలా చర్యలు తీసుకోవా లని తెలిపారు. నెన్నెలలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వార్డెన్ జయశంకర్ను ఆదేశించారు. బెల్లంపల్లి ఎస్సీ సమీకృత బాలికల వసతి గృహం విద్యార్థినులకు కార్పెట్లు, బెడ్షీట్లు, చెప్పులు, స్కూల్ షూస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమ అధికారులు వి.విజయలక్ష్మి, కె.సుజాత పాల్గొన్నారు. -
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కలవేన శంకర్ పాతమంచిర్యాల: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కలవేన శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా, మండల కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదరం సర్టిఫికెట్ల కోసం దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని, నిబంధనలు సడలించాలన్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్లోని మేడ్చల్లో జరిగే జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రశేఖర్, చిప్ప నర్సయ్య, దాగం మల్లేశ్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, లింగం రవి, రేగుంట చంద్రకళ, కే.నగేష్, జిల్లా సమితి సభ్యులు సమ్మయ్య, లక్ష్మీనారాయణ, దేవి పోచన్న, రాజమౌళి, బానేష్, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు. -
‘13న మహాగర్జన విజయవంతం చేయాలి’
కాసిపేట: ఈ నెల 13న మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే చేయూత ఫించన్దారుల మహాగర్జన మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు చెన్నూర్ సమ్మయ్య, మండల ఇన్చార్జి జీలకర శంకర్ కోరారు. ఆదివారం పింఛన్ దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమంలో భాగంగా మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగురారపు సుమన్, మండలాధ్యక్షుడు కనుకుల సంతోష్, ఉపాధ్యక్షుడు పొలగాని తిరుపతి, రాంటెంకి రాజయ్య, ముంతమల్ల రోజా, కనుకుంట్ల కళావతి, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ గొడిసెల క్రాంతి, నాయకులు గొడిసెల కృష్ణ, కాంపెల్లి వెంకటేష్, లంక లక్ష్మణ్, దాసరి శంకర్, చొప్పదండి కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి మృతికి కారకుడి అరెస్ట్
నిర్మల్టౌన్: యువకుడి మృతికి కారకుడిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. స్థానిక వెంకటాద్రిపేట్ కాలనీకి చెందిన సల్ల అభిలాష్ తన స్నేహితుడితో కలిసి గతనెలలో స్కూటీపై వెళ్తున్నాడు. బంగల్పేట్ కాలనీకి చెందిన బైండ్ల స్వామి మద్యం మత్తులో బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అభిషేక్ తీవ్రంగా గాయపడి, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి బైండ్ల స్వామిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
బాలింతకు దారి కష్టాలు
● 2 కి.మీ కాలినడకతో ఇంటికి.. ఆదిలాబాద్రూరల్: మండలంలోని చిట్యాల్బోరి గ్రామస్తులకు వర్షాకాలంలో దారి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో రెండుచోట్ల వాగులు ప్రవహిస్తాయి. వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోతాయి. నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఆడ లక్ష్మి ఆదిలాబాద్ ఆస్పత్రిలో ప్రసవమై డిశ్చార్జి ఇంటికి పయనమయ్యారు. గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేక బాలింత 2 కి.మీ పసికందుతో కాలినడకన వెళ్లారు. రోడ్డు సౌకర్యం, వాగులపై వంతెనలు లేక అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు పే ర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. -
మానవత్వం చాటుకున్న కార్మికులు
● గాయపడ్డ ఎద్దుకు చికిత్స శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని కార్మికులు మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్క న గాయాలతో మూలుగుతున్న ఎద్దును చూసి దా నికి సపర్యాలు చేసి సంరక్షణ కేంద్రానికి తరలించా రు. వర్క్షాప్ నుంచి ఆర్కే 7 గనికి వెళ్లేదారిలో మూడురోజుల క్రితం గుర్తుతెలియని వాహనం ఓ ఎద్దును ఢీకొట్టి గాయపర్చింది. కాళ్లకు తీవ్ర గా యమై రక్తస్రావం జరగడంతో కదలకుండా అక్కడే పడి ఉంది. శనివారం ఉదయం డ్యూటీకి వెళ్లే కార్మి కులు గమనించి రామకృష్ణపూర్కు చెందిన పశుసంరక్షణ కేంద్ర నిర్వాహకులు శ్రీధర్, రాజసమ్మయ్య సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకో గా దాన్ని తరలించడం ఇబ్బందిగా మారింది. కా ర్మికులు.. ఏజెంట్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్కు చెప్పడంతో ఆయన ఆదేశాలతో ఏరియా వర్క్షాప్ డీజీఎం రవీందర్ క్రేన్, వాహనాన్ని సమకూర్చారు. ఎద్దును లారీలో ఎక్కించి సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గని కార్మికులు మారుపల్లి సారయ్య, నాగరాజ్, రాజ్కుమార్, చిలుక రమేశ్ పాల్గొన్నారు.