Mancherial
-
ఫార్మాసిస్టులు బాధ్యతగా వ్యవహరించాలి
మంచిర్యాలటౌన్: మందుల పంపిణీ, వ్యాక్సి న్లు నిల్వ చేయడంలో ఫార్మాసిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో సోమవారం జి ల్లాలోని ఫార్మసిస్టులకు ఎనీమియా ముక్త్ భారత్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి ఫార్మాసిస్టులు సూపర్ చైన్ మేనేజ్మెంటు వ్యాక్సినేషన్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాతావరణ మార్పులతో కీటక జనిత వ్యాధులు, అసంక్రమణ వ్యా ధులు వచ్చే వీలుండడంతో వాటికి సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలని తెలిపా రు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో రోజూ తీసుకున్న మందులు, వ్యాక్సిన్ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిత, జిల్లా ఫార్మాసిస్టు డాక్టర్ ప్రసాద్, డీపీహెచ్ఎన్ పద్మ, డెమో వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ కోసం రిలే నిరాహార దీక్ష
బెల్లంపల్లి: ఎస్సీ వర్గీకరణ పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఏఎంసీ క్రీడామైదానం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టా రు. పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో మాదిగ శ్రేణులు దీక్ష చేఽశారు. దీక్షా శిబి రాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సరిగా చే పట్టలేదన్నారు. ఏ, బీ, సీ, డీ చేయాల్సి ఉండగా ఏ, బీ, సీ చేసి చేతులు దులిపేసుకుందని అ న్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాల్సి ఉండగా అశాసీ్త్రయంగా చేశారని పేర్కొన్నారు. ఈ కారణంగా మాదిగలు, ఉపకులాల కు అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని స రి చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలకు మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు జిలకర శంకర్, మచ్చ రాజేష్, నాతరి శివ, పుల్లూరి రా ము, బి.రవీందర్, బి.రాంచందర్, రామకృష్ణ, పద్మక్క, రాజలింగు, భూమయ్య పాల్గొన్నారు. -
వేలంలో పాల్గొంటేనే సింగరేణి మనుగడ
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య శ్రీరాంపూర్: బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొంటేనే సంస్థకు మనుగడ ఉంటుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం ఆయన ఆర్కే 5గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బొగ్గు గనుల చట్టం ప్రకారమే గనులు కేటాయిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి వేలంలో పాల్గొనేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని అన్నారు. డైరెక్టర్(పా), ిసీఎండీ, జేసీసీ సమావేశాల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లను యా జమాన్యం ముందుంచామని తెలిపారు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, అలవెన్స్లపై ఆదాయ పన్నును సంస్థనే చెల్లించాలని, మెడికల్ అన్ఫిట్ మైనింగ్స్టాఫ్, టెక్నికల్ సూపర్వైజర్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని, 11 రకాల అలవెన్స్లను పెంచాలని తదితర డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.33 వేల కోట్ల బకాయిలను సింగరేణికి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఏరియా కార్యదర్శి ప్రసాద్రెడ్డి, ఫిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ఖాన్, నాయకులు అద్దు శ్రీనివాస్, గొల్లపల్లి రామచందర్, సత్తిరెడ్డి భోగ మదనయ్య పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ వార్డు, డయాలసిస్, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిష్టర్లు, హాజరు పట్టిక, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో నూతన భవనం నిర్మాణం మరో మూడు నెలల్లోపు పూర్తయి అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ భీష్మ పాల్గొన్నారు. -
పింఛన్ రావడం లేదు..
గత ఆరు నెలలుగా దివ్యాంగుల పింఛన్ రావడం లేదు. సదరం సర్టిఫికేట్ రెన్యూవల్ చేయలేదని నిలిపివేశారు. మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే సర్టిఫికేట్ రెన్యూవల్ చేసుకోవాలని అంటున్నారు. ఆ సైట్ ఎప్పుడూ బంద్ ఉంటుంది. దయచేసి నాకు పింఛన్ వచ్చేలా చూడాలి. – కే.తేజ, రాజీవ్నగర్, మంచిర్యాల రైతు బీమా రాలేదు..మా నాన్న తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబా న్ని పోషించేవాడు. గ త డిసెంబర్లో అనా రోగ్యం కారణంగా చనిపోయాడు. రైతుబీమా పరిహారం రాలే దు. వ్యవసాయ అధికారులను అడిగితే తిరస్కరణకు గురైందని చెబుతున్నారు. అన్ని అర్హతలున్నా ఎందుకు రావడం లేదో ఎవరు చెప్పడం లేదు. – డి.విక్రమ్, బెల్లంపల్లి -
లోఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు
భీమారం: వేసవి కాలంలో విద్యుత్ సరఫరాలో లో ఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. భీమారంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో రూ.కోటితో ఏర్పాటు చేసిన 8ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సబ్స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వేసవి ఎండల కారణంగా విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్లలో పలు పరికరాల ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణాలతోపాటు గ్రామాలకు కూడా నిరంత రం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీఈ కై సర్, ఏడీఏ బాలకృష్ణ, ఏఈ శంకర్ పాల్గొన్నారు. -
● ట్రేడర్ల నిరాసక్తత ● అవగాహన కల్పించినా ముందుకు రాని వైనం ● నిరుపయోగంగా మామిడి మార్కెట్ ● రైతులకు దక్కని ప్రయోజనం
ప్రయత్నాలు చేస్తున్నాంమామిడి కాయల వి క్రయాల కోసం ఎంతగానో యత్నాలు చేస్తున్నాం. నాలుగు నెలల క్రితం ట్రేడర్ల, కమీషన్ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అవగా హన కల్పించాం. కానీ ఇంతవరకు ఏ ఒక్క రు కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు. ఎందువల్ల ట్రేడర్లు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదు. మరోసారి కూడా సమావేశం నిర్వహించి మామిడికాయల కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – మహ్మద్ షాబుద్దీన్, మార్కెటింగ్ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్నో ఏళ్లుగా నష్టపోతున్నాం..ఎన్నో ఏళ్ల నుంచి మామిడికాయలు నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి వ్యాపారులు, దళారుల మో సానికి గురవుతూ గిట్టుబాటు ధర రాక మస్తు నష్టపోతున్నం. మోసపోతున్న మామిడి రైతుల ఇబ్బందులను గుర్తించి పదేళ్ల కిందట బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ నిర్మాణం చేసిండ్లు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క ఏడాది సుత కొనుగో ళ్లు చేపట్టలేదు. ట్రేడర్స్తో మాట్లాడి కొనుగో ళ్లు చేయించడంలో మార్కెటింగ్ అధికారులు పట్టింపు చేస్తలేరు. ఈసారైనా ట్రేడర్స్ను ఒ ప్పించి మ్యాంగో మార్కెట్లో మామిడి కా యలు అమ్ముకునే అవకాశాలు కల్పించాలి. – సాటపురి చందు, మామిడి రైతుబెల్లంపల్లిలోని మామిడి మార్కెట్ బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని మామిడి మార్కెట్లో మామిడి కాయల క్రయవిక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలి క్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రేడర్లకు అవగాహన కల్పించి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరూ ట్రేడ్లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో యేటా మాదిరిగానే ఈసారి కూడా నాగ్పూర్ మార్కెట్కు తరలించి పంట దిగుబడి అమ్ముకోవా ల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుబాటులో మామిడి మార్కెట్ ఉన్నా క్రయవిక్రయాలు చేపట్టకపోవడంతో అలంకార ప్రాయంగా మారింది. ఆది నుంచీ సమస్యే.. బెల్లంపల్లి పట్టణంలో మామిడి మార్కెట్ ఉన్న మాటే గానీ మామిడి రైతులకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోతోంది. క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. మామిడి దిగుబడి కొనుగోలు చేయడానికి ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు మార్కెటింగ్ శాఖ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉండగా.. ఏళ్ల తరబడి నుంచి విముఖత చూపుతున్నారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు గత డిసెంబర్లో ప్రత్యేక చొరవ తీసుకుని ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. నెలలు గడుస్తున్నా లైసెన్స్ తీసుకోవడానికి ట్రేడర్ల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడం నిరాశకు గురి చేస్తోంది. ట్రేడర్లు ముందుకు రాకపోవడం వల్లనే మామిడి మార్కెట్లో మామిడి దిగుబడుల క్రయవిక్రయాలు జరగడం లేదు. ట్రేడర్ల సమస్య ప్రతిబంధకంగా మారింది. సౌకర్యాలు కల్పించినా.. 2015 సంవత్సరంలో మ్యాంగో మార్కెట్ మంజూ రు కాగా నిర్మాణానికి రూ.1.26 కోట్లు వ్యయం చే శారు. రెండు మ్యాంగో కవర్ షీట్స్, ప్రహరీ ని ర్మించగా, అదనపు సౌకర్యాల కోసం 2023 సంవత్సరంలో మరో రూ.1.18 కోట్లు కేటాయించారు. వీటిలో నుంచి రూ.8 లక్షలతో ఆర్వో ఫ్లాంట్, రూ.36 లక్షలతో మ్యాంగో మార్కెట్ అంతర్భాగంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయగా మిగిలిన రూ.74 లక్షలతో మరో కవర్షీట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.పిందె దశలో తోటలు మామిడి తోటలు పూత దశను దాటి ప్రస్తుతం పిందెలు తొడుగుతున్నాయి. ఉగాది పండుగ నాటికి ఓ మోస్తరు పరిమాణం కాయలు మార్కెట్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ చివరి వారం నుంచి దాదాపు మామిడి కాయలు మార్కెట్కు రావడం మొదలవుతుంది. మామిడి దిగుబడుల అమ్మకాలకు సమయం ఆసన్నం అవుతుండగా మరోపక్క ట్రేడర్ల సమస్య మామిడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా రూ.వందల కోట్లకు పైగా సాగే మామిడి వ్యాపారంపై పాలకులు, ప్రభు త్వ అధికారులు శ్రద్ధ వహించకపోవడం రైతులకు శాపంగా మారింది. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు, సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, డీసీపీ భాస్కర్, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, డీఈవో యాదయ్యలతో కలిసి సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, నలుగురు సీ సెంటర్ కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, అంతరాయం లేకుండా విద్యుత్, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు. జిల్లాలో ఐదు రూట్లు ఏర్పాటు చేశామని, ప్రశ్న, జవాబు పత్రాల తరలింపు సమయంలో ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అంజయ్య, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ● కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామంలో గుడుంబా, బెల్ట్షాపుల నిర్వహణతో యువత పెడదారి పడుతున్నారని, గుడుంబా, మద్యం విక్రయాలు నియంత్రించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. ● హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్మికులకు అందిస్తున్న వేతనాలను మంచిర్యాల మున్సిపల్ కార్మికులకు అందించాలని జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ● కుటుంబ సర్వే దరఖాస్తుల డేటా ఎంట్రీ డబ్బులు ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన సురేష్కుమార్ దరఖాస్తు అందజేశారు. ● విద్యార్థినులు, ఉపాధ్యాయినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణల నేపథ్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ను విధుల్లో నుంచి తొలగించాలని, బెల్లంపల్లి ఎస్సీ బాలుర పోస్టుమెట్రిక్ వార్డెన్ కోరుట్ల శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మృతిచెందాడని, వార్డెన్ను సస్పెండ్ చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్, సికిందర్, బ్రహ్మానందం, శంకర్ కోరారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు ● మృతుల్లో చెన్నూర్ మండల వాసి ● హన్మకొండ జిల్లాలో ఘటన ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం హసన్పర్తి: దైవదర్శనానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి హన్మకొండ జిల్లా పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్(18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి.వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జారతకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ను ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెనుకాల బైక్పై వస్తున్న స్నేహితులు 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే సుశాంత్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. -
సికిల్సెల్ నిర్మూలనే లక్ష్యం
ఆదిలాబాద్టౌన్: సికిల్సెల్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బ్లడ్ సెల్ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ హీన దీక్షిత్ అన్నారు. డీఎంహెచ్వో సమావేశ మందిరంలో సికిల్సెల్పై జిల్లా స్థాయి టీవోటీ శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2047 వరకు సికిల్సెల్ (ఎనీమియా) అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. సికిల్సెల్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని ఎలా అరికట్టాలో మాస్టర్ ట్రైనర్ హెమటలాజీ ప్రొఫెసర్ రాధిక ప్రొజెక్టర్ ద్వారా మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రొగ్రామ్ అధికారి శ్రీధర్, ఏటీడీవో అనిల్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
తొలికాత విద్యార్థులకే..
● పాఠశాలలో ఏటా పుచ్చకాయలు అందజేస్తున్న రైతు ఆనంద్ ఆ రైతుకు పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారిని దైవంగా భావిస్తాడు. ఏటా తన చేనులో సాగైన పుచ్చకాయల తొలికాతను వారికే అందజేస్తాడు. ఐదేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు. అతడే తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండె ఆనంద్. తనకున్న రెండెకరాల్లో ఏటా పుచ్చ సాగు చేస్తున్నాడు. దిగుబడి షురూ అయ్యే క్రమంలో తొలికాతను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదేళ్లుగా అందజేస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు అందజేశాడు. ఇందులో మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, ఉపాధ్యాయులు సరిత,శిల్ప సిబ్బంది ఉన్నారు. – తాంసి -
దోపిడీ దొంగల అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మ్యాక్స్ భవన్ వద్ద ఈ నెల 14 దోపిడీకి పాల్పడిన ఇద్దరు దొంగలను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ తెలిపారు. సంబంధిత వివరాలను ఆయన కార్యాలయంలో వెల్లడించారు. స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి ప్యాగ పోశంపై దాడి చేసి ఆయన వద్ద ఉన్న బంగారు గొలుసును దోచుకున్నారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశామని, సీసీ పుటేజీ ఆధారంగా బండి నంబర్ను గుర్తించి దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించామని తెలిపారు. స్థానిక సంజీవయ్య కాలనికి చెందిన ఎండీ.సమీర్, ఎండీ.జుబీర్లను అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించారని తెలిపా రు. నిందితుల నుంచి బంగారు గొలుసు, కత్తి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ ప్రమోద్రావు, ఎస్సై ప్రవీన్కుమార్, సిబ్బంది సుబ్బరావ్, మహేష్, ఉపేందర్లను డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ అభినందించారు. -
హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక
బోథ్: మండలంలోని ధన్నూర్(బి) గ్రామానికి చెందిన మార రజినీకాంత్ రెడ్డి సోమవారం హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో సిటీ బస్కండక్టర్ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. కాగా హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తా చాటిన సిరాజ్ఖాన్ బజార్హత్నూర్: టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో మండలంలోని కొలారి గ్రామానికి చెందిన పటాన్ సిరాజ్ఖాన్ సత్తా చాటాడు. రైతు పటాన్ అంజత్ఖాన్, షకీలాబేగంల కుమారుడు సిరాజ్ఖాన్ రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతనెన్నెల: ఆదిల్పేట కాలువ నుంచి మందమర్రి మండలం మామిడిగట్టుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ మోహన్ను అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ను నెన్నెల పో లీస్స్టేషన్కు తరలించి తహసీల్దార్కు అప్పగించామని పేర్కొన్నారు. డ్రైవర్తోపాటు ట్రాక్టర్ యజమాని మోర్లె మల్లేష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోని వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని అందుగులపేట జా తీయ రహదారి ఫ్లై ఓవర్బ్రిడ్జి ముగింపు సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ల భ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి ఒంటిపై నీలిరంగు చొక్కా, జీన్స్ ప్యాంట్ ఉన్నాయని, ప్యాంటు జేబులో ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సు టికెట్ లభించిందని తెలిపారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 8712656570 నంబరులో సంప్రదించాలని తెలిపారు. -
సైకిల్ పై నుంచి పడి వ్యక్తి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ మద్దిమాడ శివారులో సైకిల్ పై నుంచి కిందపడి ఓరియంట్ రిటైర్డ్ లోడింగ్ కార్మికుడు గాసికంటి రాజయ్య(65) మృతిచెందాడు. దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజిపూర్ మండలం సబ్బపల్లికి చెందిన రిటైర్డ్ లోడింగ్ కార్మికుడు రాజయ్య ఈ నెల 16న దేవాపూర్లోని తన కుమారుడు మల్లేష్ ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 5గంటలకు తన స్నేహితుడిని కలవడానికి కొత్త గడ్పూర్కు వెళ్లి తిరిగి ఏడు గంటల ప్రాంతంలో కుమారుడి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో మద్దిమాడ శివారులోని కల్వర్టు వద్ద సైకిల్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అంబులెన్స్లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
తలరాతను మార్చేది చేతిరాతే
కెరమెరి(ఆసిఫాబాద్): అక్షరం విలువ తెలపడానికి.. మన భావాల్ని స్పష్టంగా వ్యక్తం చేయడానికి అందమైన దస్తూరి అవసరం. కానీ సాంకేతిక పుణ్యమా అని..ఆయుధం లాంటి అక్షరం అష్టవంకర్లు పోతోంది. ‘నేను క్షేమం.. మీరు క్షేమమా’అంటూ రాసే లేఖలు మాయమయ్యాయి. హలో.. హాయ్ అంటూ సంక్షిప్త సందేశాలు గిర్రున తిరుగుతున్నాయి. కంప్యూటర్లు, ట్యాబ్, మొబైల్ల కారణంగా కాగితంపై పెన్ను పెట్టాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఈ తరుణంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పాఠశాలల్లో చదివే సగం మంది విద్యార్థులు చేతిరాత గుండ్రంగా రాయలేక పోతున్నారు. ఫలితంగా మంచి మార్కులు పొందలేక పోతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. చేతిరాత బాగుంటే పరీక్షల్లో విద్యార్థులు మంచి గ్రేడులు సాధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేతిరాత భవిష్యత్కు సోపానంలా ఉపయోగపడేందుకు అవసరమైన నియమాలు, సూచనలు. దోషాలు చిన్న చిన్న దోషాలే విలువైన మార్కులకు కోత పెడతాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాలి. సాధారణ విద్యార్థులు పరీక్షల్లో నాలుగు రకాల తప్పులు చేస్తుంటారు. అవి మార్కులకు తగ్గట్టు సమాధానాలు రాయక పోవడం, వ్యాకరణ దోషాలు, అక్షర దోషాలు, చేతిరాత గజిబిజిగా ఉండడం. ఇందులో ఎక్కువగా మార్కులకు గండి కొట్టేది దస్తూరి అని నిపుణులు పేర్కొంటున్నారు. ● ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు విరామ చిహ్నాలు మర్చిపోతుంటారు. ● అక్షరాల ఖాళీ స్థలాన్ని వదులుతారు. ● అక్షరాలు, సంఖ్యలను స్పష్టంగా రాయడం. ● కాగితంపై పెన్ను ఒత్తిపట్టి రాస్తే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. ● కొట్టి వేతలు మనం పరీక్షకు సన్నద్ధం కాలేదని చెబుతాయి. ● ఏ4 సైజ్ కాగితంలో 20 నుంచి 25 వరుసలు రాస్తుంటారు. ● లైన్లు వంకర టింకరగా ఉంటాయి ● బొమ్మల్లో భాగాలను సరిగా గుర్తించరు. ● పదాల్ని కలిపేసి రాస్తుంటారు. ● కలాన్ని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకోవడంతో చేతిరాత గజిబిజిగా ఉంటుంది. ● ఎర్ర రంగు సిరా కలాన్ని ఉపయోగిస్తారు. ● ఇలాంటివి చేయకపోవడం వల్ల అధిక మార్కులు పొందే అవకాశం ఉంది. అందమైన రాత.. భవితకు బాట విద్యార్థులకు అవగాహన తప్పనిసరి అధిక మార్కుల సాధనకు ఉపయోగం పోషకులు దృష్టి సారించాలి‘మంచి చేతిరాత లేకపోతే చదువు పూర్తి కానట్లే. పెదవులపై చిరునవ్వు లేనిదే మేకప్ పూర్తి కాదు’ – ‘సత్యశోధన’లో మహాత్మాగాంధీనైపుణ్యం అలవర్చుకోవాలి రాసేటప్పుడు కూర్చునే భంగిమ, కలం పట్టుకునే విధానం, పుస్తక స్థాన విధానం, చేతిరాతపై ప్రభావం చూపుతాయి. బాల్పాయింట్ పెన్నుకన్నా సిరాపెన్నుతో చేతిరాత అందంగా వస్తుంది. సున్న, అరసున్న తెలుపు గీతలను బాగా సాధన చేయాలి. ఆంగ్లం, తెలుగు, చూచిరాత మెరుగుదల కోసం అపసవ్య దశలో రాసే నైపుణ్యం అలవర్చుకోవాలి. హింది రాత మెరుగుకోసం సవ్య దశలో రాయడం అలవాటు చేసుకోవాలి. చేతిరాతపై పిల్లలతో పాటు పెద్దలు దృష్టి సారించాలి. – పెందోర్ జైవంతా, తెలుగు పండితురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోయగాం సాధన చేస్తున్నా చక్కటి చేతిరాతపై సాధన చేస్తున్నా. ప్రతీరోజు తెలుగు, హింది, ఆంగ్లం చూచిరాత రాస్తున్నా. రాత పద్ధతులపై టీచర్ బాగా చెబుతున్నారు. పరీక్షల్లో గ్రేడులు అధికంగా సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. పేపర్ దిద్దేవారికి కూడా ఎంతో సులభమవుతుంది. అందమైన రాత విద్యార్థి క్రమశిక్షణను తెలియజేస్తుంది. ప్రతీ విద్యార్థి చేతిరాతపై ప్రాక్టీసు చేయాలి. – మోహర్లే జయ, 9వ తరగతి, గోయగాం ఉపయోగాలు చేతిరాత అందంగా ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే. ఉపాధ్యాయుల ప్రశంసలు పొందాలన్నా, ఉద్యోగం చేసే చోట యజమాని మెప్పు పొందాలన్నా అందమైన రాత కీలకం. ఉద్యోగ సంబంధ నోటిఫికేషన్లు స్వదస్తూరితో నింపిన దరఖాస్తులను మాత్రమే పంపాలని నిబంధన ఉందంటే చేతిరాత ప్రాముఖ్యత ఎంతగా ఉందో అవగతమవుతోంది. ప్రధానంగా మానవ వనరుల విభాగం బహుళజాతి సంస్థలు, ఉద్యోగ నియామకాల్లో చేతి రాతను కూడా ప్రాతిపదికగా తీసుకుంటారు. మనసులో అలజడులు చేతిరాతతో ప్రతిఫలిస్తాయి. కనుకనే మానసిక వైద్యశాస్త్రంలో చేతిరాతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవలి కాలంలో చేతిరాతను బట్టి, మనస్తత్వాన్ని బట్టి అంచన వేసే గ్రాఫాలజి శాస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. చేతిరాతతో ఒక వ్యక్తిలోని 200 విషయాలను తెలుసుకోవచ్చని లిపి నిపుణులు పేర్కొంటున్నారు. -
చెరువులోపడి ఒకరు మృతి
నర్సాపూర్(జి): కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవ శాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలని చర్లపల్లిలో సోమవారం జరిగింది. ఏఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... రాంపూర్ అనుబంధ గ్రామం చర్లపల్లికి చెందిన సుంకరి శ్రీనివాస్(45) సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి గ్రామ శివారులోని ఊర చెరువు వద్దకు వెళ్లాడు. ఉదయం 9 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి వెతకగా ఒడ్డుపై శ్రీనివాస్ చెప్పులు కనిపించాయి. వెంటనే ఈతగాళ్లతో చెరువులో గాలించగా శ్రీనివాస్ మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు చెరువుల పడి మృతిచెందాడని శ్రీనివాస్ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు ● మృతుల్లో చెన్నూర్ మండల వాసి ● హన్మకొండ జిల్లాలో ఘటన ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం హసన్పర్తి: దైవదర్శనానికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి హన్మకొండ జిల్లా పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్(18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి.వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితోపాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జారతకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ను ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెనుకాల బైక్పై వస్తున్న స్నేహితులు 108లో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే సుశాంత్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. -
తొలికాత విద్యార్థులకే..
● పాఠశాలలో ఏటా పుచ్చకాయలు అందజేస్తున్న రైతు ఆనంద్ ఆ రైతుకు పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారిని దైవంగా భావిస్తాడు. ఏటా తన చేనులో సాగైన పుచ్చకాయల తొలికాతను వారికే అందజేస్తాడు. ఐదేళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు. అతడే తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండె ఆనంద్. తనకున్న రెండెకరాల్లో ఏటా పుచ్చ సాగు చేస్తున్నాడు. దిగుబడి షురూ అయ్యే క్రమంలో తొలికాతను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐదేళ్లుగా అందజేస్తున్నాడు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ప్రాథమిక, జెడ్పీ పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు అందజేశాడు. ఇందులో మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, ఉపాధ్యాయులు సరిత,శిల్ప సిబ్బంది ఉన్నారు. – తాంసి -
సింగరేణి సీఎండీ ప్రోత్సాహం.. అమ్మానాన్నల ఆశీర్వాదం
● గ్రూప్–1 సాధించడమే నా డ్రీమ్ ● కోచింగ్ సెంటర్కు వెళ్లకుండానే.. ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ రాం సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే 19వ స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. సింగరేణి సీఎండీ బలరాం ప్రోత్సాహం, అమ్మానాన్నల ఆశీర్వాదంతో విజయం సాధించానన్నారు. తన సక్సెస్కు కారణాలు, అనుభవాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఒకటవ తరగతి నుంచి పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశు మందిర్లో చదువుకున్నానన్నారు. 2014లో బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్లో చేరానని, 2021లో ఇన్ఫోసిస్లో ఉద్యోగం సాధించి నెలకు రూ.50 వేల వేతనం పొందానన్నారు. 2022లో సింగరేణి నిర్వహించిన పరీక్షలో పాసై జాబ్ సంపాదించా. ఆ సమయంలో సీఎండీ బలరాం నేను జీవితంలో ఉన్నతస్థాయికి చేరేందుకు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఒక్కోమెట్టు ఎక్కుతున్నా. జాబ్ చేస్తున్న సమయంలోనే 2023లో గ్రూప్–4లో రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించానన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డిస్ట్రిక్ ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నానన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్–3లో రాష్ట్రంలో 12వ ర్యాంకు సాధించగా తర్వాత విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోనల్లో 4వ ర్యాంకు సాధించి తన లక్ష్యానికి చేరువవుతున్నానన్నారు. ఏ కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా ఇంటివద్దే ఉండి ఆన్లైన్లో తీసుకున్న పుస్తకాలనే చదువుతున్నానన్నారు. -
యూపీఎస్సీ టార్గెట్..
మంచిర్యాలరూరల్(హాజీపూర్):ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో 2016 నుంచి యూపీఎస్సీ సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతూ గ్రూప్ పరీక్షలోనూ విజేతగా నిలిచాడు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల శ్రావణ్కుమార్. శ్రావణ్కుమార్ తండ్రి లింగయ్య విశ్రాంత సింగరేణి ఉద్యోగి. తల్లి కళావతి గృహిణి. అక్క స్రవంతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చెల్లె స్వర్ణలత డీఎస్సీకి సమాయత్తం అవుతోంది. శ్రావణ్కుమార్ భార్య సౌమ్య గృహిణి. వీరికి కూతురు స్నిగ్దశ్రీ, కుమారుడు వేదంశ్కృష్ణ ఉన్నారు. ఇంటర్ వరకు మంచిర్యాలలో చదివి, బీటెక్ ఈసీఈ హైదరాబాద్లో చదివాడు. 2016 నుంచి యూపీఎస్సీకి సమాయత్తం అవుతుండగా, 2019లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. అయితే యూపీఎస్సీపై దృష్టి పెట్టాలని ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 2022లో మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాయగా, ప్రిలిమ్స్లో విజయం సాధించినా 4 మార్కులతో మెయిన్స్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే వరసగా గ్రూప్స్ నోటీపికేషన్లు వెలువడటంతో అన్ని పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్స్ పరీక్షలకు ఎలాంటి కోచింగ్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదివాడు. గ్రూప్–4లో జిల్లా స్థాయిలో 11వ ర్యాంకు సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గ్రూప్–3లో రాష్ట్ర స్థాయిలో 39 ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 15వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులతో అర్హత సాధించగా ర్యాంకులు ప్రకటిస్తే మంచి ర్యాంకు వస్తుందని ఆశగానే ఎదురు చూస్తున్నాడు. -
సింగరేణి ఉద్యోగం చేస్తూ..
రెబ్బెన(ఆసిఫాబాద్): డిగ్రీ పూర్తి కాగానే సాఫ్ట్వేర్ వైపు విప్రోలో ఉద్యోగం సాధించా. కానీ ఎప్పుడూ కంప్యూటర్తోనే ఉండాల్సి వచ్చేది. ఎక్కడో చిన్న వెలితి. ప్రజలతో మమేకమై వారికి నేరుగా సేవలు అందించాలంటే గ్రూప్స్ కరెక్ట్ అనిపించింది. దీంతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టా. చివరికి అనుకున్నది సాధించగలిగా.. అని గ్రూప్–2 రాష్ట్రస్థాయి 229 ర్యాంకర్ కామ్రే భాస్కర్ పేర్కొన్నా రు. గ్రూప్–2లో సాధించిన విజయం సాధించేందుకు కష్టపడిన తీరుపై సాక్షి పలకరించగా ఆయ న మాటల్లోనే... మాది కౌటాల మండలంలోని గుడ్లబోరి అనే చిన్నగ్రామం. అమ్మనాన్న లాహనుబాయి, రావూజీ. 1 నుండి పదోతరగతి వరకు మా ఊరికి సమీపంలోని విజయనగరంలో, ఇంటర్ ముధోల్ గురుకుల కళాశాలలో, డిగ్రీ హనుమకొండలో పూర్తిచేశా. గ్రూప్–2 సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2016లో మొదటి ప్రయత్నంలో గ్రూప్–2లో ఆశించిన ర్యాంకు రాలేదు. అదే సంవత్సరంలో సింగరేణిలో క్లర్క్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పరీక్ష రాయగా జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని డో ర్లిలో విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్ కోసం ప్రిపరేషన్ కొనసాగించా. ఆన్లైన్లో కోచింగ్ తీసుకు న్నా. సింగరేణి ఆధ్వర్యంలోని గోలేటి లైబ్రరీ నా కు బాగా ఉపయోగపడింది. కష్టానికి ఫలితంగా గ్రూప్–2లో 381.06 మార్కులతో రాష్ట్రస్థాయిలో 229 ర్యాంకు వచ్చింది. గ్రూప్–1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నా ప్రతీ విజయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుంది. గ్రూప్–3లోనూ 296 మార్కులతో రాష్ట్రస్థాయిలో 154వ ర్యాంకు వచ్చింది. అయితే గ్రూప్–2 జాబ్లోనే జాయిన్ అవుతా. -
ఆదర్శం.. అశోక్కుమార్
రోజుకు పది గంటలు చదివా.. ప్రిపరేషన్లో భాగంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నా. తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా చేసుకున్నా. రోజుకు ఎనిమిది నుంచి పదిగంటల వరకు చదివేవాన్ని. సొంతంగానే నోట్స్ ప్రిపేర్ చేసకున్నా. ఆన్లైన్లో అశోక్ సార్ క్లాస్లు ఫాలో అయ్యా. అలాగే తెలంగాణ ఉద్యమం సంబంధించి వి.ప్రకాశ్ సార్ బుక్స్ కూడా చదివాను. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు భగవద్గీత, పంచతంత్ర కథలను చదివాను. కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరించడంతోనే ఇది సాధ్యమైంది. తాంసి: సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–1,2,3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు తాంసి మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్. ప్రస్తుతం సాత్నాల మండలం సుందరగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2014న కార్యదర్శిగా ఎంపికై న ఈయన సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగించాడు. ఈ క్రమంలో 2016లో సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే త్రుటిలో కొలువు చేజారింది. అయినా నిరాశ చెందకుండా గ్రూప్స్పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. గ్రూప్–1లో 399 మార్కులు సాధించగా, గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంకు, అలాగే గ్రూప్–3లో రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంకుతో సత్తా చాటాడు. -
అవసరం లేకున్నా ప్లేడేలు
● కిందిస్థాయి అధికారుల హవా ● మస్టర్ పడి వెళ్లిపోవడంపై కార్మికుల ఆగ్రహంకాసిపేట: సింగరేణిలో మస్టర్ పడి వెళ్లడం, విధులు తప్పించుకోవడం వదిలేయాలని, ప్రతీ కార్మికుడు ఉత్పత్తి, ఉత్పాదకతలో భాగస్వామి కావాలని సీ అండ్ఎండీ బలరామ్ సూచిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. సాధారణ రోజుల్లో కొందరు మస్టర్ పడి వెళ్లిపోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అవసరం ఉన్నవారి కి మాత్రమే ప్లేడే ఇవ్వాలని. కానీ, అధికారులు, సూపర్వైజర్లు తమకు అనుకూలమైన వ్యక్తులకు ప్లేడేలు రాసి మస్టర్ వేసి ఇంటికి పంపుతున్నట్లు ఆ రోపణలు ఉన్నాయి. మందమర్రి ఏరియా కాసిపేట 2గనిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహించే కార్మికుడికి వరుసగా మూడు ఆదివారాలు ప్లేడే కే టాయించినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. సద రు కార్మికుడు ప్లేడే రోజు మస్టర్ పడి ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు. దీనిపై అతడి గురించి ఆరా తీసేందుకు మీడియా ప్రతినిధులు వెళ్లగా గనిపై కనిపించలేదు. దీంతో స్థానిక కార్మికులను అడగగా, మధ్యాహ్నం అతడిని అధికారులు పిలిపించినట్లు తెలిసింది. సదరు కార్మికుడు మూడు వారాలు మస్టర్ పడటం మినహా అవుట్ టైం పడిన సందర్భం లేదని గు ర్తించారు. ఉన్నతాధికారులు అవుట్ టైం సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరిపించాలని కార్మికులు కోరుతున్నారు. రెండు గనుల్లో ఇష్టారాజ్యం.. కాసిపేట, కాసిపేట 2 గనులలో మస్టర్ల విషయంలో ఇష్టారాజ్యం నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు కొందరికి మస్టర్ వేసి ఇంటికి పంపిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇష్టమైనవారికి ప్లేడేలు ఇస్తున్నారని అంటన్నారు. బాధ్యతగా పనిచేసే కార్మికులకు కూడా వరుసగా మూడు ప్లేడేలు ఇవ్వరని, జనరల్ మజ్దూర్కు మాత్రం వరుసగా ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్న కార్మికులకే ప్లేడేలు కేటాయించాలని కార్మికులు కోరుతున్నారు. ఈవిషయమై గని మేనేజర్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా, ఈవిషయం తనదృష్టికి రాలేదని తెలిపారు. వరుసగా మూడు ప్లేడేలు సాధ్యం కాదని వెల్లడించారు. కొందరు కార్మికులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపి వరుసగా మూడు మస్టర్లు ఇస్తే బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. -
పట్టుబట్టి.. కొలువు కొట్టి..
● గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలకు ఉమ్మడి జిల్లావాసులు ఎంపిక ● ఉద్యోగాలు చేస్తూనే రాష్ట్రస్థాయి ర్యాంకులు ● కోచింగ్ లేకుండానే సత్తా చాటిన వైనం.. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్–1, 2, 3 ఫలితాల్లో ఉమ్మడి జిల్లావాసులు సత్తా చాటారు. ఉన్నతస్థాయి కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఆ మేరకు కష్టపడ్డారు. కొందరు ఉద్యోగాలు చేస్తూనే ‘గ్రూప్’ కొలువులకు ఎంపిక కాగా, మరికొందరు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగానే చదివి సత్తా చాటారు. ఇంకొందరు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం, స్ఫూర్తితో ఉద్యోగాలు సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి సర్కారు కొలువులకు ఎంపికై న పలువురి సక్సెస్ వారి మాటల్లో.. నెన్నెల: ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదల, ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రభుత్వ కొ లువు సాధించడం సులువే అంటున్నారు గ్రూ ప్–2 55వ ర్యాంకర్ చీర్ల సురేశ్రెడ్డి. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల మూడో కుమారుడు సురేశ్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. తమది వ్యవసాయ కుటుంబమని, తాను ఇంటర్లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడని తెలిపారు. అమ్మ, అన్న కిషన్రెడ్డి ప్రోత్సాహంతో గ్రూప్– 2లో ర్యాంకు సాధించానని తెలిపారు. పదో తరగతి వరకు ఆవుడం ప్రభుత్వ పాఠశాలలో చదివానని, బీటెక్ విశాఖపట్నంలో అభ్యసించినట్లు వెల్లడించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా మొదట కానిస్టేబుల్, అనంతరం ఎన్పీడీఎల్, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ కొలు వులు సాధించానని వెల్లడించారు. గ్రూపు–2లో ర్యాంకు సాధించేందుకు రోజుకు 8 గంటలు హైదరాబాద్లోని ప్రైవేట్ లైబ్రరీలో చదివానని తెలిపారు. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని, సొంతంగా నోట్స్ తయారు చేసుకుని ప్రపేర్ అయ్యానని చెప్పారు. ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడమీకి సంబంధించిన వివిధ రకాల స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ చదివానని వెల్లడించారు. గ్రూపు–3లో కూడా రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు వచ్చిందని తెలిపారు. గ్రూపు–1 ర్యాంకు సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కౌటాల: అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రణాళిక, లక్ష్యంతోనే విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నాడు కౌటాల మండలం తలోది గ్రామానికి చెందిన మండల సాయిరాం గౌడ్. తండ్రి రాజేశ్వంగౌడ్ వృత్తిరీత్యా గీత కార్మికుడు కాగా తల్లి తారక్క గృహిణి. పదోతరగతి వరకు కౌటాలలో, ఇంటర్ హన్మకొండలో, బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేశాడు. ప్రతీరోజు వార్తా పత్రికలు, ప్రామాణిక పుస్తకాలు చదవడం, ప్రభుత్వ వైబ్సైట్లో విషయాలు తెలుసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యానన్నారు. తెలుగు అకాడమీ, ఇతర ప్రైవేటు పుస్తకాలు, కరంట్ అఫైర్స్కు ‘సాక్షి’ దినపత్రికతో పాటు పలు మ్యాగజైన్లపై ఆధారపడ్డానన్నారు. పత్రికల్లో ఎడిటోరియల్ చదవడం ద్వారా అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకున్నానన్నారు. చదువుకునే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని, అక్కా, బావ, మిత్రులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. 2019 ఏప్రిల్లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించానన్నారు. అందరి సహకారంతోనే గ్రూప్స్ పరీక్షల్లో విజయం సాధించానని తెలిపారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం గ్రూప్ 1 సాధించాలని లక్ష్యంగా ఏర్పర్చుకున్నానన్నారు. కష్టపడితే కొలువు సులువేప్రణాళిక, లక్ష్యంతోనే విజయం -
ఎమ్మెల్సీ అంజిరెడ్డికి సన్మానం
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన అంజిరెడ్డిని జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించడంతోనే బీజేపీకి ప్రజల మద్దతు ఉందని నిరూపితమైందన్నారు. పట్టభద్రులు తనపై ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించారని, వారి తరఫున మండలిలో మాట్లాడి, పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూని వెంకటేశ్వర్గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, ముల్కల్ల మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్గౌడ్, తుల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, పెద్దపల్లి పురుషోత్తం పాల్గొన్నారు. -
చేపలు వేటకు వెళ్లి శవమయ్యారు
సోన్: చేపలు పట్టడానికి వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. సోన్ మండల కేంద్రానికి చెందిన గుమ్ముల సాయన్న (48) ఎప్పటిలాగే శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని గోదావరిలోకి చేపలు పట్టడానికి వెళ్లాడు. రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సాయన్న కోసం కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో సోన్ పాత బ్రిడ్జికి సమీపంలోని ఒక నీటి మడుగులో కాళ్లకు చేపల వల చుట్టుకొని వ్యక్తి చనిపోయి ఉన్నాడని అటుగా వెళ్లినవారు గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో అక్కడకు వెళ్లి చూడగా సాయన్న చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిసింది. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిలావర్పూర్లో మరొకరు.. దిలావర్పూర్: మండల కేంద్రానికి చెందిన గూండ్ల నడిపి పోశెట్టి (46) ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పోశెట్టి శనివారం స్థానిక కొత్త చెరువు వద్దకు వల తీసుకువెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఆదివారం కొత్త చెరువులో మృతి చెంది ఉండడాన్ని బంధువులు గమనించి అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదు
● ఎస్సీ, ఎస్టీ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్నజన్నారం: ఉద్యోగులకు రిటైర్మెంట్ తప్పదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ న్న అన్నారు. మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్లో బాదంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామేర రాజేశ్వర్–పద్మావతి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజన్న హాజరై రాజేశ్వర్ దంపతులను సన్మానించారు. ఉద్యోగ విరమణ అనంతరం రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పరస్పర బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్, ఎస్సీ, ఎస్టీ టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకటరావు, ప్రముఖ కవులు మురుమడుగుల రాజారావు, రాజేశ్వర్, ఎస్సీ ఎస్టీ టీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బూక్య రాజేశ్నాయక్, పిట్ట మండల అధ్యక్షుడు తుంగూరు గోపాల్, జిల్లా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రకాశ్నాయక్, రాజారావు, ఎంఈవో విజయ్కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కట్ట రాజమమౌళి పాల్గొన్నారు. -
కోచింగ్ లేకుండా కొలువు..
నెన్నెల: ‘పబ్లిక్ సర్వీస్ చేయాలనే లక్ష్యంతో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రపేర్ అయ్యాను. గ్రూపు–2లో రాష్ట్రస్థాయిలో 172వ ర్యాంకు సాధించాను’ అని తెలిపాడు. నెన్నెల మండలం ఆవుడం గ్రామానికి చెందిన మండల సుమంత్గౌడ్. మండల మురళిగౌడ్–ఉషారాణి దంపతుల కుమారుడు సుమంత్గౌడ్ పదో తరగతి వరకు మంచిర్యాల కృష్ణవేణి టాలెంట్స్కూల్లో, ఇంటర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. ధన్బాద్లో ఐఐటీలో మైనింగ్ ఇంజి నీర్ పూర్తిచేసి ఐదేళ్లుగా ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నారు. జాబ్ చేస్తూనే గ్రూపు–4లో రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఎన్సీఈఆర్టీ టెక్ట్బుక్స్, తెలుగు అకాడమీ వివిధ రకాల పుస్తకాల ద్వారా హైదరాబాద్లో స్టడీ హాల్లో రోజుకు పది గంటలు చదివి ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో, అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే తాను గ్రూప్–2 ర్యాంకు సాధించానని వెల్లడించారు. -
కాలువలో పూడిక తొలగింపు
వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువ పూడికతో నిండి పంటలకు సాగునీరు అందడంలేదు. దీనిపై ‘పూడిక తీయించండి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. డీఈ వెంకటస్వామి ఆదేశాల మేర కు ఏఈ విష్ణు, కాంట్రాక్ట్ కంపెనీ మేనేజర్ మల్లి కార్జున్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజలింగు ఆధ్వర్యంలో ఆదివారం గొర్లపల్లి వద్ద ఉన్న ఎడమ కాలువ వద్ద కు వెళ్లారు. పరిస్థితిని సమీక్షించి మీటర్నర లోతు ఉన్న మట్టి, తుంగ, పిచ్చి మొక్కలను జేసీబీ సహా యంతో తొలగించారు. బురద కారణంగా జేసీబీ దిగబడుతుండటంతో పనులకు కొంత ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల్లో పూడికతీత పూర్తి చేయిస్తామని అధికారులు తెలిపారు. పొలాలకు సాగునీరు ఇచ్చేలా చొరవ చూపిన ‘సాక్షి’, ఇరిగేషన్ కాంట్రాక్ట్ సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
స్పీకర్కు క్షమాపణ చెప్పాలి
● డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాలటౌన్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. టీ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్గౌడ్, మంచిర్యా ల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం నిరసన తెలిపారు. ప్రజాసమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీలో సభాపతిపై అనుచిత వ్యా ఖ్యలు చేయడం సరికాదన్నారు. సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్ర భుత్వంపై అక్కసుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం జగదీష్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. -
మూతబడిన సూపర్ బజార్
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని నస్పూర్ షిర్కే కాలనీలో ఉన్న సూపర్ బజార్ కొద్ది రోజులుగా తెరుచుకోవడం లేదు. రెండు వారాలుగా ఈ దుకాణం మూసే ఉంటుందని కార్మికులు తెలిపారు. కంపెనీలోనే అతిపెద్ద ఏరి యాలో సూపర్బజార్ మూత పడడంతో కార్మికు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాలనీల మ ధ్య ఉన్న ఈ సూపర్ బజార్లో నిత్యావసర సరుకులు, ఇతర గృహోపకరణాలు సరమైన ధరలకు ఇక్కడ లభిస్తాయి. నగదుతోపాటు కార్మికులకు ఇక్కడ క్రెడిట్ పద్ధతిలో కూడా సరుకులు ఇస్తారు. నెల తర్వాత ఈ డబ్బులను వారి వేతనం నుంచి రికవరీ చేసే వెసులుబాటు ఉంది. దీంతో కార్మిక కుటుంబాలు నెలాఖరున, డబ్బులకు ఇబ్బంది ఉన్న సమయంలో ఉద్దెరపై సరుకులు తీసుకెళ్తారు. రెండు వారాలుగా దుకాణం మూసి ఉండడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. సొసైటీ పేరిట నిర్వహణ.. సింగరేణిలో కార్మిక కుటుంబాలకు వంట గ్యాస్, నిత్యావసర సరుకులు అందించడం కోసం ప్రత్యేక సొసైటీ ఉంటుంది. సింగరేణి కాలరీస్ కోఆపరేటీవ్ సెంట్రల్ స్టోర్స్ లిమిటెడ్ పేరుతో సొసైటీ ద్వారా ఈ సేవలు అందిస్తారు. ఇందులో పనిచేసే ఉద్యోగుల వేతనాలు, వారి పేరోల్ అన్నీ కంపెనీలో పని చేసే ఇతర రెగ్యులర్ కార్మికులకు భిన్నంగా వీరికి ఉంటుంది. గతంలో కంపెనీ వ్యాప్తంగా ఈ సొసైటీలో 150 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేసేవారు. కాలక్రమేనా రిటైర్ అయిన వారిస్థానంలో కొత్తవారిని తీసుకోలేదు. ఆర్థిక సంస్కరణలో భా గంగా అన్నింటిలో కొత పెడుతున్న యాజమాన్యం ఈ సొసైటీల సేవలను కూడా కుదించాలనే ఆలోచనలో కొత్త రిక్రూట్మెంట్ చేపట్టడంలేదు. దీంతో మ్యాన్పవర్ తగ్గుతూ వస్తుంది. నస్పూర్ షిర్కే కాలనీలోని సూపర్బజార్లో ఒక పర్మినెంట్ సొసైటీ ఉద్యోగితోపాటు మరో ఇద్దరు డైలీ రేటెడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కౌంటర్పై పనిచేసే పర్మినెంట్ ఉద్యోగి ఫిబ్రవరి 28న రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో దుకాణం మూసి ఉంటుంది. సిబ్బంది కొరత కారణంగానే సూపర్బజార్ తెరవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో ఓపెన్ చేస్తాంసిబ్బంది కొరత కారణంగానే సూపర్బజార్ తెరువడం లేదు. ఇక్కడ పనిచేసే ఉద్యోగి రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే సిబ్బందిని సర్దుబాటు చేసి సూపర్ బజార్ తెరుస్తాం. కార్మికులకు సరుకులు అందిస్తాం. – పాలకుర్తి రాజు, డీఎం, సూపర్ బజార్స్ రెండు వారాలుగా తెరుచుకోని సింగరేణి దుకాణం ఉద్యోగుల కొరతే కారణం -
ప్రాణహితలో అరుదైన చేప
వేమనపల్లి: ఎన్నో జలచరాలకు నిలయమై న ప్రాణహి త నదిలో జాలరులకు ఆదివారం ఓ అరుదైన చేప చిక్కింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలోని బెస్తవాడకు చెందిన ఎల్లెల శ్రీనివాస్, ఎల్లెల గంగాధర్ ప్రాణహితలో చేపల వేటకు వెళ్లారు. దడంగి(పెద్దవల) వేయగా పెద్ద పులు సు, రౌవు చేపలతోపాటు మూడున్నర కిలోల నలుపు రంగు చేప దొరికింది. దీనిపేరు బొట్టు పిల్ల అని జాలర్లు తెలిపారు. కొందరు రాక్షసిచేప, మంగారా అని పిలుస్తారని పేర్కొన్నారు. దీనికి పొలుసులు ఉండకపోగా నలుపు, తెలు పు వర్ణంలో ఉంది. దీని మాంసం రుచితో పాటు ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. -
‘టెన్’షన్ వద్దు
● ఒత్తిడికి లోనుకావొద్దు.. ● ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు ● ఈ ఏడాది బుక్లెట్ రూపంలో ఆన్సర్ షీట్ ● ‘పది’ విద్యార్థులకు డీఈవో యాదయ్య సూచనమంచిర్యాలఅర్బన్: మరో ఐదు రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా సదుపాయాలు కల్పిస్తున్నామని డీఈవో యాదయ్య తెలిపారు. ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలోనూ జా గ్రత్త వహించాలని తెలిపారు. పరీక్షల్లో పొరపా ట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఈ ఏడాది కొత్తగా అమలు చేస్తున్న విధానాలు, కేంద్రాల్లో సౌకర్యాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు..?డీఈవో: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటితోపాటు ఫ్యాన్లు, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్ అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశాం. ప్రతీ సెంటర్లో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచుతాం. ప్రతీ సెంటర్లో ఏఎన్ఎంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుతాం. అన్ని కేంద్రాలకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షల వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తాం. సాక్షి: పరీక్ష విధానంలో ఈ ఏడాది తీసుకువచ్చిన మార్పులు ఏంటి? డీఈవో: ఈసారి కొత్త నిర్ణయాలు అమలు చేయనున్నాం. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 24 పేజీలతో కూడిన జవాబు పత్రం(అన్సర్షీట్) ఇవ్వనున్నారు. గతంలో నాలుగు పేజీలతో కూడిన బుక్లెట్ ఇచ్చేవారు. నాలుగు పేజీలు రాశాక విద్యార్థుల అవసరాన్ని బట్టి అదనంగా రెండు పేజీలతో కూడిన జవాబు పత్రాలు ఇచ్చేవారు. పిల్లల సమయం వృథా కాకుండా ఉండేందుకు 24 పేజీలతో బుక్లెట్ ఇవ్వనున్నారు. పరీక్షల సమయంలో ఇచ్చే ఓఎంఆర్ షీట్లో తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి. గతంలో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్షలు ఒకేరోజు 10 నిమిషాల వ్యవధిలో జరిగేవి. ఈ ఏడాది ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో జరుగనున్నాయి. సాక్షి: ఉత్తీర్ణత శాతం ఎలా ఉండబోతుంది?డీఈవో: పది ఉత్తీర్ణత పెంచడానికి పాఠశాలల్లో ఎవరి స్థాయిల్లో వారు కష్టపడ్డారు. విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణ అమలు చేశాం. ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాం. 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాం. సాక్షి: విద్యార్థులు, తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలు..?డీఈవో: పరీక్ష రాసే విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవాలి. పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు పరీక్షకు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రాల్లోకి తీసుకురావొద్దు. భయం వీడి.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి. పరీక్షల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను టీవీలు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఒత్తిడికి లోనుకాకుండా చూడాలి.సాక్షి: జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థులు ఎంత మంది, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? డీఈవో: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 370 స్కూళ్లకు చెందిన 9,189 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 4,725 మంది బాలురు, 4,464 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 49 సెంటర్లు ఎంపిక చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో చీఫ్ సూపరింటెండెంట్లు–49 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు–49, సీ సెంటర్ కస్టోడియన్స్–4, ఇన్విజిలేటర్లు 620 మందిని నియమించాం. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, 49 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తాయి. సీసీ కెమెరాలు అమర్చాం. సాక్షి: పరీక్షలపై సందేహాల నివృత్తికి ఎవరిని సంప్రదించాలి?డీఈవో: పరీక్షలకు సంబంధించి సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే 70324 63114 నంబర్లో సంప్రదించాలి. -
జపాన్ సకురాకు జిల్లా విద్యార్థిని
● దేశ వ్యాప్తంగా 54 మందికి అవకాశం ● అందులో మంచిర్యాల జిల్లా విద్యార్థినికి ఛాన్స్.. మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి సాయిలు సాయిశ్రీవల్లి వినూత్న ఆలోచనలను పంచుకునే అంతర్జాతీయ వేదిక జపాన్ సకురా సైన్స్ ఎకై ్సంజ్ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నుంచి 54 మంది విద్యార్థులను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన సాయిశ్రీవల్లి ఒకరు. జపాన్ సకురా కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి 21 వరకు విద్యార్థులు పర్యటించనున్నారు. జాతీయ ఇన్స్పైర్ కార్యక్రమం అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులు 15 ఏళ్ల వయసు కలిగి ఉండి 10 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జపాన్ సైన్స్ ఎకై ్సంజ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. రుతుమిత్ర కిట్ ప్రాజెక్టు ప్రదర్శనతో..సాయి శ్రీవల్లి సీ్త్రల నెలవారి రుతుక్రమంలో వినియోగిస్తున్న రసాయనిక శానిటరీ ప్యాడ్తో కలిగే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపాలని శ్రీస్ రుతుమిత్ర కిట్ రూపొందించింది. రుతుక్రమ సమయంలో రసాయనిక శానిటరీ ప్యాడ్ వినియోగ సమస్యలు దూరం చేసేందుకు క్లాత్ప్యాడ్ వినియోగం, వాటిని సులభంగా శుభ్రపరిచే పరికరం తయారు చేసి జాతీయస్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికై ంది. 2020–21లో ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ పోటీల్లో పాల్గొని ఉత్తమంగా నిలిచింది. 2023లో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంటర్ ప్యునర్షిప్ 2023ఫైన్ కార్యక్రమానికి ఆహ్వానం అందుకుని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మతో ప్రాజెక్టు రూపకల్పన అనుభవనాలపై పంచుకున్నారు. తాజాగా జపాన్ సకురాకు ఎంపికై ంది. శ్రీవల్లిని డీఈవో యాదయ్య అభినందించారు. -
నిషేధిత పత్తివిత్తనాలు పట్టివేత
● ఆరుగురు అరెస్ట్ మంచిర్యాలక్రైం: మంచిర్యాల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత పత్తి విత్తనాలు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఏఈవో తాడూరి మహేందర్కు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో దాడిచేసి కింటల్ నిషేధిత పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు సీఐ ప్రమోద్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందూర్ గ్రామానికి చెందిన పెట్యాల జగదీశ్వర్రావు నిషేధిత హెచ్టీ, జీటీ–3 పత్తి విత్తనాలు మంచిర్యాల జిల్లాలో అధిక ధరలకు విక్రయించేందుకు రైలు మార్గం తీసుకువచ్చాడు. మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన కడియాల ఉదయ్, పొట్టల మధుసూదన్, మరిశెట్టి నరేందర్, బెల్లంపెల్లి మండలం ఆకెనపెల్లికి చెందిన సిద్ధం శేఖర్, తిర్యాణికి చెందిన కాటవెణి సాయి, సుబ్బరావుపల్లికి చెందిన నాగెళ్లి మోహన్గాంధీతో కలిసి విక్రయించేందుకు తెచ్చాడు. స్థానికంగా ఉండే మల్లికార్జున్ అతనికి సహకరించాడు. అయితే పక్కా సమాచారంతో దాడిచేసిన టాస్క్ఫోర్స్ సిబ్బంది రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఏఈవో మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టుబడిన నిషేధిత పత్తి విత్తనాలతోపాటు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న విత్తనాల విలువ రూ.1.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: పదో తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. ఉ ట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో గల పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఆయా విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వరాదన్నారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఎస్ఏ–1, ఎస్ఏ–2, గ్రాండ్ టెస్ట్, ప్రీఫైనల్ పరీక్షల ఆధారంగా ఫలితాలను సమీక్షించారు. డీ, ఈ గ్రేడ్లలో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇందులో డీడీలు రమాదేవి, అంబాజీ, ఆర్సీవో ఆగస్టిన్, నాలుగు జిల్లాల ఏటీడీవోలు, ఏపీఎంలు, జీసీడీలు పాల్గొన్నారు. -
పూడిక తీయించండి
● నీల్వాయి ప్రాజెక్టు ఎడమ ఆయకట్టు రైతుల ఆందోళన వేమనపల్లి: నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువ పూడికతో నిండడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్లపల్లి గ్రామం వద్ద పూడికతో నిండి ఉన్న కాలువ వద్ద శనివారం ఆందోళన చేశారు. రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇరువైపులా ఉన్న మట్టితో కాలువలో పూడిక పేరుకుపోయిందని తెలిపారు. మీటర్నర లోతు మట్టి ఉండటంతో నీళ్లు దిగువకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. దీంతో గొర్లపల్లి, దస్నాపూర్, కొత్తపల్లి, వేమనపల్లి శివారు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయన్నారు. సుమారు 100 ఎకరాలకు నీరు అందడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి కాలువ వెంట ఉన్న పూడికతోపాటు తుంగ, పిచ్చి మొక్కలను తొలగించి పొలాలకు నీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ వెంకటస్వామికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా తన దృష్టికి రాలేదని, రెండు రోజుల్లో పూడిక తీయించి పొలాలకు నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
తండ్రిపై దాడికి సుపారీ..
● స్నేహితుడికి రూ.50 వేలు ఇచ్చిన కొడుకు ● దాడిచేసి గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు ● 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు మంచిర్యాలరూరల్(హాజీపూర్): తండ్రి, కొడుకు మధ్య కొన్ని రోజులుగా తలెత్తిన గొడవ చివరకు దాడి దారితీసింది. తండ్రి గొడవతో విసిగిపోయిన కొడుకు దాడి చేయించేందుకు స్నేహితుడికి సుపారీ ఇచ్చాడు. సుపారీ తీసుకున్న స్నేహితుడు దుండగులతో దాడి చేయించడంతోపాటు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, హాజీపూర్ ఎస్సై సురేశ్ హాజీపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం వివరాలు వెల్లడించారు. వేంపల్లికి చెందిన నాగిరెడ్డి సత్యానందం–సరస్వతి దంపతులకు కొడుకు రమేశ్ ఉన్నాడు. దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా తండ్రి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రమేశ్ తండ్రిపై దాడి చేయించేందుక అతని స్నేహితుడు సొల్లు అవినాశ్కు రూ.50 వేల సుపారీ ఇచ్చాడు. దీంతో అవినాష్ గర్మిళ్లకు చెందిన అందె అశోక్, అట్ల సంతోష్, ఎన్టీఆర్ నగర్కు చెందిన మామిడిపల్లి చందు, చింతల కృష్ణతో కలిసి దాడికి ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సత్యానందర్ ఇంట్లో ఉండగా దాడి చేయించాడు. అంతేకాకుండా అతని మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో బాధితుడు సాయంత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కొడుకుపై అనుమానంతో..ఈ క్రమంలో కొడుకుపై అనుమానం రావడంతో అతడిని విచారణ చేశారు. దీంతో జరిగిన విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అవినాశ్తోపాటు అశోక్, సంతోష్, చందు, కృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లో దాడి కేసును ఛేదించారు. అయితే విచారణలో రమేశ్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్కు గురయ్యారు. కేవలం కుటుంబ కలహాలతో కన్న తండ్రిపైనే దాడికి సుపారి ఇచ్చినట్లు రమేశ్ పోలీసులకు తెలిపాడు. నిందితుల నుంచి తులం బంగారు గొలుసు, సుపారీ కింద ఇచ్చిన రూ.30,670 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసు ఛేదించిన మంచిర్యాల రూరల్ సీఐ ఆశోక్, హాజీపూర్ ఎస్సై సురేశ్, సీసీసీ ఎస్సై సుగుణాకర్, ఏఎస్సై ఎజాజ్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, నరేందర్, ఎస్కే.పాషాను సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ అభినందించారు. -
వినియోగదారుడు హక్కులు తెలుసుకోవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వినియోగదారుడు తన హక్కుల గురించి తెలుసుకోవాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్తో కలిసి పెట్రోలియం సంస్థలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు చేసినప్పుడు మోసపోతే పోర్టల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిపారు. బ్యాంకుల్లో నగదు లావాదేవీల విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తినా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం నాణ్యతగా లేకపోయినా, సరైన ఆహారం అందించకపోయినా ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందించకపోయినా, వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందుల షాపులో ఇవ్వకపోయినా మెడికల్ బోర్డు/డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. కాలపరిమితి ముగిసిన వాటిని విక్రయిస్తే కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్తో కలిసి వినియోగదారుల హక్కుల సంబంధిత పోస్టర్ ఆవిష్కరించారు. -
మందులు సిద్ధంగా ఉంచాం
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ము ఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లక పోవడం మంచిది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, సబ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరిపడా అందుబాటులో ఉంచాం. సైలెన్ బాటిళ్లతోపాటు, అత్యవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆస్పత్రులతోపాటు, పనిప్రదేశాల్లోనూ అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకున్నాం. – డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్యాధికారి, మంచిర్యాల -
పండిద్దాం పొగాకు..
● చెన్నూర్ చేలల్లో సాగు.. ● పంట మార్పిడికి ముందుకు వస్తున్న రైతులు ● తక్కువ నీటి వసతి ఎక్కువ దిగుబడి ● పంటను ఆశించని తెగుళ్లు చెన్నూర్రూరల్: ఎప్పుడూ ఒకే రకం పంటల సాగుతో భూమిలో సారం దెబ్బతింటుంది. పంట మార్పిడి విధానం పాటించాలని వ్యవసాయాధికారులు కూడా తరచూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు దీనిని పట్టించుకోరు. కానీ, చెన్నూరు మండలంలో కొందరు రైతులు అధికారుల సూచనలతో పంట మార్పిడి విధానంతో లాభాలు గడిస్తున్నారు. మిర్చి పంట సాగు చేసి పురుగు ఆశించడం, సరైన దిగుబడి రాకపోవడం, మద్దతు ధర లేకపోవడంతో విసిగిపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. కొందరు మిర్చి పంటకు బదులుగా పొగాకు సాగుచేస్తున్నారు. ఈ పంటకు తక్కువ నీరు, తెగుళ్ల బెడద లేకపోవడంతో సాగుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. చెన్నూర్ మండలంలో గతేడాది కేవలం రెండెకరాల్లో పొగాకు సాగు కాగా, ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 20 ఎకరాల వరకు సాగు చేశారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, శివలింగాపూర్లో మాత్రమే సాగవుతుంది. మిర్చి, పత్తి పంట పెట్టుబడి తరహాలోనే పొగాకు పంటకు పెట్టుబడి అవుతుందని, లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయని రైతులు పేర్కొంటున్నారు. చీడ, పీడలు, తక్కువే..పొగాకు పంటలో కలుపు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక లద్దె పురుగు, తేనె మంచు మాత్రమే ఆశిస్తుంది. దీని నివారణకు లామ్డాసైహలోత్రిన్, ఇమిడాక్లోప్రిడ్ మందును ఎకరాకు 120 ఎంఎల్ పిచికారీ చేస్తే సరిపోతుంది. లేదా క్లోరాంధ్రనిలిప్రోల్ 60 ఎంఎల్ పిచికారీ చేయాలి. ఈ పంటకు కోతులు, అడవి పందులు, పశువుల బెడద ఉండదు. ఆరబెట్టే విధానం..పంట వేసిన ఐదు నెలలకు దిగుబడి చేతికి వస్తుంది. ఆకులను తెంపి సోలార్ కవర్ ఉన్నట్లయితే 8 నుంచి 10 రోజులు ఆరబెడితే సరిపోతుంది. లేదంటే తోరణాలుగా తయారు చేసి 20 రోజుల నుంచి 25 రోజులు ఆరబెట్టాలి. మార్కెట్కు తీసుకువెళ్లే సమయంలో బేల్లుగా తయారు చేసి తేమశాతం లేకుండా చూసుకోవాలి. క్వింటాల్ ధర రూ.15 వేల వరకు వస్తుంది. జనగామ జిల్లా ములకనూరులో పొగాకు మార్కెటింగ్ సౌకర్యం ఉన్నప్పటికి ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఆంధ్రకు వెళ్లాల్సి వస్తుంది. రైతులు ఒకే రకం పంట సాగు చేయకుండా ఇలా పంట మార్పిడి చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. రైతులు ముందుకు రావాలి పంట మార్పిడిని అవలంబించేందుకు రైతులు ముందుకు రావాలి. అక్కెపల్లి, శివలింగాపూర్ గ్రామాల రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఎలాంటి తెగుళ్లు ఆశించవు. పశువులు, ఆడవిపందులు, కోతుల బెడద ఉండదు. నీటి తడులు కూడా తక్కువగా ఉంటాయి. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. – యామిని, ఏవో, చెన్నూర్ పంట మార్పిడి చేయాలి ఎప్పటికీ ఒకే రకం పంటలు కాకుండా పంట మార్పిడి చేస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. మా క్లస్టర్లో కొందరు రైతులు పొగాకు సాగు చేశారు. పంట దిగుబడి కూడా బాగానే వస్తుంది. రైతులు ఆలోచించాలి. – రాజశేఖర్, ఏఈవో, అక్కెపల్లి, క్లస్టర్ సాగు విధానంపొగాకు ఐదు నెలల పంట. ఆగస్టు, సెప్టెంబర్లో సాగుచేయాలి. ఇక్కడి రైతులకు నారు ఆలస్యంగా రావడంతో నవంబర్లో మొక్కలు పెట్టా రు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొత్తూరులోని జీపీఏ కంపెనీ వారు నారును అందించారు. ఒక్కో మొక్కకు రూ.1 చొప్పున పడుతుంది. ఎకరాకు 10 వేల మొక్కలు నాటుతారు. జీపీఏ కంపెనీ వారే పండిన పంటను కొనుగోలు చేస్తారు. ఇక్కడ సాగు చేసే పొగాకు రకం వైట్బెర్లీ రకం. ఎకరాకు రూ.70 వేలు ఖర్చవుతుంది. మొక్కలు నాటుపెట్టే సమయంలో ఆఖరి దుబ్బులో 15 కిలోల యూరియా, ఒక డీఏపీ 50 కిలోల బస్తా వేస్తారు. నాటు పెట్టి ఆకులు వచ్చే సమయంలో 20 రోజులకు 50 కిలోల పొటాష్ని వేస్తారు. నీటితడులు మూడుసార్లు అందిస్తారు. 25 రోజుల్లో అందించాల్సి ఉంటుంది. నాటు పెట్టిన 50 రోజుల్లో అమ్మోనియా వేస్తారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. -
జీవో 3ను పునరుద్ధరించాలి
ఆదిలాబాద్టౌన్: కేంద్ర ప్రభుత్వం జీవో 3ను పునరుద్ధరించి ఆదివాసీలకు ఉద్యోగాలు దక్కేలా చూడాలని టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. బెంగుళూర్లో నిర్వహిస్తున్న ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాల్లో ఆయన రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. జీవో 3ను పునరుద్ధరణ చేసే అధికారం, అవకాశం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా కేంద్రం స్పందించి 5వ షెడ్యూల్లో ఆదివాసీ యువతకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
● పెరిగిన ఎండ తీవ్రత ● రాబోయే రెండు రోజులు మరింత పెరిగే అవకాశం ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు ● వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం
జిల్లాలో ఐదు రోజులుగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు తేదీ గరిష్టం కనిష్టం 11 38.8 22.8 12 39.2 23.3 13 39.4 24.0 14 40.4 20.3 15 39.6 24.4 జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారిమంచిర్యాలటౌన్: భానుడు భగ్గుమంటున్నాడు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గుతోంది. దీంతో వేడి తీవ్రత పెరుగుతోంది. మార్చి రెండో వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా నలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు సుర్రమంటున్నాడు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ వేడి పెరగడంతో అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తున్నారు. తలకు ఎండ తగలకుండా తగిన జాగ్రత్తలను తీసుకున్నా, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రెండు రోజులు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. వేసవిలో వచ్చే జలుబు, పలు రకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేశారు. వడదెబ్బతో జాగ్రత్త.. ఎండలు పెరగడంతో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేని స్థితికి చేరితే, శరీరంలోని ఎలక్ట్రోలైట్స్, మినరల్స్, నీటి శాతం తగ్గి(డీహైడ్రేషన్) సత్తువలేని స్థితికి చేరటం వల్ల వడదెబ్బ వస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు గట్టిపడడం, చర్మం ఎర్రగా మారటం, వామిటింగ్ సూచనలు ఉండటం, వాంతి చేసుకోవడం, మూర్చ రావడం, తలనొప్పి, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలు వడదెబ్బలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ సోకిన వారికి వైద్యుల సలహాతో మందులను వాడడం, రోజుకు 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలంటున్నారు. పండ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. తెల్లరంగు బట్టలు ధరించడం, బయటకు ఎండలో వెళ్లేవారు గొడుగు వాడటం, నల్ల కళ్లద్దాలు ధరించి, మసాలాలు, కారం, నూనెలు, ఫాస్ట్ఫుడ్, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి. చిన్నారులు జాగ్రత్తగా ఉండాలి వేసవి కాలం ప్రారంభం కావడంతో చిన్నారులను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో వెళ్లకుండా చూడాలి. కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి. ఎండకు వెళితే తలకు రుమాలు కట్టుకుని, టోపీ పెట్టుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం, వాంతులు, విరేచనాలతో శరీరం శక్తిని కోల్పోతుంది. అత్యవసరం అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. వేడి కారణంగా చెమట శరీరం నుంచి వెళ్లడంతో సోడియం, పొటాషియం, ఎలక్ట్రోపౌడర్ లేదా ఉప్పు, చెక్కర కలిపిన నీటిని బాగా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కడపడితే అక్కడి నీరు తాగడం వల్ల, అతిసార వ్యాధి ప్రబలే ప్రమాదం ఉంది. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తినడం, ఐస్క్రీంలు, కుల్ఫీలు కలుషిత నీటితో త యారు చేసే అవకాశం ఉన్నందున వాటిని పిల్లలకు తినిపించక పోవడమే మంచిది. వృద్ధుల్లో సమస్యలువృద్ధుల్లో దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావంతో పాటు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎండ వేడిని తట్టుకోలేరు. శరీరం డీహైడ్రేషన్కు గురైతే దీర్ఘకాలిక వ్యాధులపై మరింత ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. వేడిని తట్టుకునేందుకు శరీరానికి తగినంత నీరు అవసరం కాబట్టి, నీరు బాగా తాగడంతోపాటు, కొబ్బరి బోండాం, మజ్జిగ, నిమ్మర సం ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లో ఉండే గదిని చల్లగా ఉంచేలా చూడాలి. సౌకర్యంగా ఉండే కాటన్ దుస్తులను ధరించి, శరీర ఉష్ణోగ్రతలు పెరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వృద్ధుల్లో వేడిని తట్టుకునే స్థాయి తక్కు వ కావడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. చెమట అధి కంగా రావడంతో అలసటకు గురై, అనా రోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. -
ఆడబిడ్డకు అండగా ఉంటాం
● చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అండగా ఉంటుందని ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. హాజీపూ ర్ మండలం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్స్లో నియోజకవర్గంలోని హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాలతోపాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కల్యాణలక్ష్మి, షాదీముబార్ చె క్కులను శనివారం పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి కింద రూ.41.15 లక్షలను 132 మందికి, కల్యాణలక్ష్మి, షాదీముబార్ కింద రూ.2,76,32,016లను 276 మంది లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్ర భుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అ ధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్కు సేవారత్న అవార్డుబెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు గజ్జెల్లి మోహన్ను సేవారత్న అవార్డు, జాతీయ ఉగాది పురస్కారం వరించింది. హైదరాబాద్ తార అకాడమీ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రవీంద్ర భారతిలో భారతీయ సంప్రదాయ సాంస్కృతిక కళోత్సవంలో భాగంగా జాతీయ ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోహన్కు సేవారత్న అవార్డు, జాతీయ ఉగాది పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు సుమన్, ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి, ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంకె రాజేశ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్, పలువురు రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
ఏఐ బోధనను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ కుమార్దీపక్జైపూర్/లక్సెట్టిపేట/జన్నారం: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా అందిస్తున్న విద్యా బోధన ను ఎఫ్ఎల్ఎన్లో వెనుకబడిన విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్దీపక్ సూ చించారు. జైపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏఐ ల్యాబ్(ఎఫ్ఎల్ఎన్–ఏఏఎల్–ఏఐ)లను ఎమ్మె ల్యే ప్రేమ్సాగర్రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. జన్నారం మండలం మురిమడుగు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్ను ఎంఈవో విజయ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలో తొలి విడతగా ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. వచ్చే వారంలో మరికొన్ని పాఠఽశాలల్లో ల్యాబ్లు ప్రారంభిస్తామన్నారు. ఏఐ ల్యాబ్ ద్వారా చదువుల్లో వెనుకబడిన విద్యార్థులు వారికివారే నెర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. స్వీయ ప్రేరణ ద్వారా అభ్యసన అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతిలోనే కృతిమ మేధ ద్వారా బోధన అభ్యాసన చేయడం గొప్ప విషయమన్నారు. కృత్రిమ మేధ విద్యారంగంలో విప్లవాత్మకమైన ఆలోచన అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా బోధన చేయాలని సూచించారు. తల్లిదండ్రులు క్రమంతప్పకుండా విద్యార్థులను పాఠశాలలకు పంపించా లని తెలిపారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలపై ఉ పాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు మా ట్లాడుతు ప్రతీ విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలన్నారు. ఇందుకు ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు. అనంతరం పాఠశాలల ఆవరణ, వంట శాలలు, తరగతి గదుల ను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్య మైన నిత్యావసర సరుకులు వినియోగించాలన్నా రు. కార్యక్రమాల్లో సమగ్ర శిక్షణ సమన్వయకర్త చౌ దరి సత్యనారాయణముర్తి, డీఈవో యాదయ్య, మాస్టల్ ట్రైనర్ శ్రీధర్రెడ్డి, ఎంఈవోలు శ్రీనివాస్, హెలెన్ డారతి, హెచ్ఎంలు శ్యాంసుందర్, ప్రేమ ల, అజయ్కుమార్, శుభాష్, తహసీల్దార్ దిలీప్కుమార్, కంప్యూటర్ ఉపాధ్యాయుడు రాజేందర్, ఉన్నత పాఠశాల హెచ్ఎం అజయ్కుమార్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శుభాష్, ఎమ్మార్పీ శివ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం పరీక్ష కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ కిరణ్, సిబ్బంది ఉన్నారు. -
నమ్ముకున్న గంగమ్మే మింగిందా కొడుకా..
వేమనపల్లి: హోలీ పండుగ ఆ ఇంటి ఆశాదీపాన్ని ఆర్పేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్నేహితులతో హోలీ ఆడిన ఆ యువకుడు స్నానం కోసం ప్రాణహిత నదిలో దిగాడు. అయితే లోతు, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఈ విషాద ఘటన వేమనపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండల కేంద్రంలోని బెస్తవాడకు చెందిన కంపెల రాజ్కుమార్(21) చెన్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. పండుగ నేపథ్యంలో స్నేహితులు కంపెల నవీన్, అనిల్, బక్కి రాకేశ్, చింతల అభిషేక్, గుమ్ముల సాయికిరణ్తో కలిసి గ్రామంలో హోలీ జరుపుకున్నాడు. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ప్రాణహిత నది పుష్కరఘాట్ ఎగువన ఉన్న మొహిబిన్పేట రేవు వద్దకు స్నానాలకు వెళ్లారు. సాయికిరణ్, రాజ్కుమార్ నదిలో దిగగా, మరో నలుగురు ఒడ్డున ఉన్నారు. అయితే స్నానాలకు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండడం, వరద ఉధృతి కూడా ఎక్కువగా ఉండడంతో రాజ్కుమార్ కొట్టుకుపోయాడు. ఈత రాకపోవడంతో సాయికిరణ్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో మిగతా స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ సిబ్బందితో ఘటన స్థలికి చేరుకున్నాడు. జాలర్ల సాయంతో మూడు గంటలు గాలించగా సాయంత్రం రాజ్కుమార్ మృతదేహం లభించింది. పండుగను సంబురంగా జరుపుకున్న రాజ్కుమార్ను విగత జీవిగా నదిలో నుంచి తీసుకు వస్తుండగా చూసిన తల్లి లక్ష్మి ‘నువ్వు పురిటిలో ఉండగానే మీ నాన్న కాలం చేసిండు కద కొడుకా.. కూలీనాలి చేసి.. జిమ్మలు పట్టుకుంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటి.. మనం నమ్ముకున్న గంగమ్మే నిన్ను మింగిందా బిడ్డా.. నాకు కడుపు కోత మిగిల్చింది కొడుకా’ అంటూ గుండెలు పగిలేలా రోదించింది. ఒక్కగానొక్క కొడుకు మరణంతో కన్నీరుమున్నీరవుతున్న లక్ష్మిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు. ప్రాణహిత నదిలో మునిగి యువకుడు మృతి హోలీ ఆడి స్నానానికి వెళ్లడంతో ప్రమాదం పండుగపూట విషాదం -
● వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలు ● తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం ● సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు ● నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
హక్కులు, బాధ్యతలు ఉన్నాయివినియోగదారులకు నాణ్యమైన సేవలు పొందే హక్కులు ఉన్నాయి. అదే సమయంలో బాధ్యతలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు త మ హక్కులు పొందేలా అవగాహన ఉండా లి. మా సంస్థ తరఫున మోసపోయిన విని యోగదారులకు మద్దతుగా నిలుస్తున్నాం. – టి.చేతన సోనీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంస్థ.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందడంలో చాలా చోట్ల మోసపోతూనే ఉన్నారు. డబ్బులు చెల్లించి కంపెనీ ఉత్పత్తుల పేర్లు, బరువు, నాణ్యత, కల్తీ, ఉత్పత్తుల్లో మోసాలతోపాటు నిబంధనల మేరకు సర్వీస్ అందడం లేదు. నిత్యం వినియోగించే ఉప్పు, పప్పు నుంచి తినే తిండే, తాగే నీళ్లు, విలువైన వస్తువులు మార్కెట్లో జరిగే ప్రతీ లావాదేవీలు, పౌరసేవల్లో మోసం, నిర్లక్ష్యం తప్పడం లేదు. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. చాలా సంస్థలు నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవా రు. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జుమర్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. జిల్లాలో పలువురు వినియోగదారుల హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ, పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా చూసీచూడనట్లుగా వదిలేయడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోంది. ప్రశ్నిస్తేనే న్యాయం వినియోగదారుల సంరక్షణ చట్టం ప్రకారం తయారీ, నాణ్యత, తూకం, ప్రామాణిక ముద్ర, గడవు, ధర, జీఎస్టీ, తదితరాలు కచ్చితంగా ఉండాలి. చెల్లించిన ధరకు సేవలు పొందాలి. కానీ ఎక్కడైనా సేవల్లో అంతరాయం ఏర్పడితే కొందరే ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్ ఉంది. 2024లో మొత్తం 163 ఫిర్యాదులు రాగా, ఇందులో 29 పరిష్కరించగా, మరో 134 పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయా కంపెనీల, తయారీదారులపైనా జరిమానాలు విధించారు. ప్రస్తుతం వినియోగదారులు ఆన్లైన్లోనూ సెంటర్ అండర్ కన్జూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ (సీసీసీ), ఈ జాగృతి వెబ్సైట్, హెల్ప్లైన్ 1915కు కాల్ చేయెచ్చు. అవగాహనే శ్రీరామ రక్ష.. ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీసం ఫిర్యాదు సైతం చేయకుండా పోతున్నారు. నచ్చిన వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వాటి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అభిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు వినియోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. -
నేత్రదానంతో ఇద్దరికి చూపు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని మొదటి జోన్కు చెందిన జీదుల రాయమల్లు అ నారోగ్యంతో గురువారం మృతి చెందాడు. ఆ యన బతికి ఉండగానే తన మరణానంతరం కళ్లు దానం చేయాలని కుమారుడు దామోదర్కు చె ప్పేవాడు. రాయమల్లు మరణంతో దామోదర్ (ప్రభుత్వ ఉపాద్యాయుడు) తండ్రి కోరిక మేరకు ఎల్వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించాడు. వైద్యుడు కిషోర్ నేతృత్వంలో ఎంజీఎం వైద్యులు ప్రదీప్ రాయమల్లు ఇంటి కి చేరుకుని నేత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రా యమల్లు రెటీనాలతో ఇద్దరికి చూపు వస్తుందని తెలిపా రు. కార్యక్రమంలో సోపతి వెల్ఫే ర్ సొసైటీ అధ్యక్షుడు భీమ్పుత్ర శ్రీనివాస్, రహీమ్ బ్లడ్ డోనర్స్ అధ్యక్షుడు రహీం, అవయవ దాతలు, శరీర దాతల సంఘం సభ్యులు బాబ్జీ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సబ్స్టేషన్కు పవర్ ట్రాన్స్ఫార్మర్
భీమారం: మండలంలోని గ్రామాల్లో వేసవిలో లో ఓల్టేజీ సమస్యరాకుండా ఉండేందుకు విద్యుత్శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచి 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు శుక్రవారం తెప్పించారు. ఇప్పటి వరకు ఉన్న 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో వీటిని బిగించనున్నట్లు ఏఈ శంకర్ తెలిపారు. వేసవిలో గృహ అవసరాలతోపాటు వ్యవసాయరంగానికి కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ముందస్తుగానే పీటీఆర్ సామర్థ్యం పెంచుతున్నామని తెలిపారు. శనివారం సబ్స్టేషన్లో బిగిస్తామన్నారు. -
‘బోరు’మంటున్నారు
● 30 ఏళ్లుగా పనిచేసిన బోర్ మెకానిక్లు ● గత ప్రభుత్వం తొలగించడంతో రోడ్డున పడ్డ కుటుంబాలు ● ప్రభుత్వం స్పందించి అదుకోవాలని వేడుకోలుచెన్నూర్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చెడిపోయిన చేతిపంపులకు మరమ్మతులు చేస్తూ ఉపాధి పొందిన బోర్ మెకానిక్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. గత ప్రభుత్వం మెకానిక్లను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డు న పడ్డాయి. 1994 నుంచి 2021 వరకు 27 ఏళ్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ అధీనంలో పని చేశా రు. 2004లో మెకానిక్లను అప్పటి ప్రభుత్వం మండల పరిషత్ పరిధిలోకి తీసుకువచ్చింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిని తొలగించింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీ పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 22 మంది, రాష్ట్రంలో 337 మంది బోర్ మెకానిక్లు పనిచేశారు. రూ.15 వేల చాలీచాలని వేతనంతో 27 ఏళ్లు సేవలు అందించారు. మిషన్ భగీరథ పథకం రావడంతో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. కాంట్రాక్టు ఉద్యోగులుగా 27 ఏళ్లు పనిచేసివారిని క్రమబద్ధీకరించకపోగా, ఉన్న ఉద్యోగాల నుంచి తొలగించింది. అప్పటి నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని నాలుగేళ్లుగా ఆందోళనలు, ఉద్యమాలు చేసినా పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు, స్థానిక ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి చొరవతో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. మిషన్భగీరథ(ఈఎన్సీ)ఇంట్రా డిపార్టుమెంట్కు అప్పగించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అవస్థలు పడుతున్నాం ఆదుకోండి..28 ఏళ్లు పని చేశాం. నాలుగేళ్ల నుంచి పనులు లేక అవస్థలు పడుతున్నాం. పలు మార్లు మంత్రులు, ముఖ్య మంత్రిని కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. సీఎం సార్ మా బాధలను పట్టించుకుని మమ్ముల్ని అదుకోవాలి. మిషన్ భగీరథ పధకంలలో మమ్ముల్ని తీసుకుని ఉపాధి కల్పించాలి. – డొబ్బాల శంకర్, బోర్ మెకానిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
నేత్రదానంతో ఇద్దరికి చూపు
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని మొదటి జోన్కు చెందిన జీదుల రాయమల్లు అ నారోగ్యంతో గురువారం మృతి చెందాడు. ఆ యన బతికి ఉండగానే తన మరణానంతరం కళ్లు దానం చేయాలని కుమారుడు దామోదర్కు చె ప్పేవాడు. రాయమల్లు మరణంతో దామోదర్ (ప్రభుత్వ ఉపాద్యాయుడు) తండ్రి కోరిక మేరకు ఎల్వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించాడు. వైద్యుడు కిషోర్ నేతృత్వంలో ఎంజీఎం వైద్యులు ప్రదీప్ రాయమల్లు ఇంటి కి చేరుకుని నేత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రా యమల్లు రెటీనాలతో ఇద్దరికి చూపు వస్తుందని తెలిపా రు. కార్యక్రమంలో సోపతి వెల్ఫే ర్ సొసైటీ అధ్యక్షుడు భీమ్పుత్ర శ్రీనివాస్, రహీమ్ బ్లడ్ డోనర్స్ అధ్యక్షుడు రహీం, అవయవ దాతలు, శరీర దాతల సంఘం సభ్యులు బాబ్జీ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
● వస్తువు చిన్నదైనా.. పెద్దదైనా.. మోసాలు ● తయారీ, తూకం, నాణ్యత, ధరల్లో మాయాజాలం ● సేవల్లో వినియోగదారులకు తప్పని తిప్పలు ● నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
హక్కులు, బాధ్యతలు ఉన్నాయివినియోగదారులకు నాణ్యమైన సేవలు పొందే హక్కులు ఉన్నాయి. అదే సమయంలో బాధ్యతలు ఉన్నాయి. ప్రతీ ఒక్కరు త మ హక్కులు పొందేలా అవగాహన ఉండా లి. మా సంస్థ తరఫున మోసపోయిన విని యోగదారులకు మద్దతుగా నిలుస్తున్నాం. – టి.చేతన సోనీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంస్థ.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందడంలో చాలా చోట్ల మోసపోతూనే ఉన్నారు. డబ్బులు చెల్లించి కంపెనీ ఉత్పత్తుల పేర్లు, బరువు, నాణ్యత, కల్తీ, ఉత్పత్తుల్లో మోసాలతోపాటు నిబంధనల మేరకు సర్వీస్ అందడం లేదు. నిత్యం వినియోగించే ఉప్పు, పప్పు నుంచి తినే తిండే, తాగే నీళ్లు, విలువైన వస్తువులు మార్కెట్లో జరిగే ప్రతీ లావాదేవీలు, పౌరసేవల్లో మోసం, నిర్లక్ష్యం తప్పడం లేదు. వస్తువులు, సరుకులు కొనుగోలు చేసే సమయంలో అవగాహన లోపం, సేవలు పొందడం తెలియక చాలామంది వినియోగదారులు మోసపోతున్నారు. చాలా సంస్థలు నాసిరకం వస్తువులు, సరుకులు తయారు చేసి వినియోగదారులకు అంటగడుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇదివరకు ఏ వస్తువునైనా షాపులోకి వెళ్లి నేరుగా కొనుగోలు చేసేవా రు. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో మోసాలు సైతం మరింతగా పెరిగిపోతున్నాయి. హక్కులను మరింతగా రక్షించేందుకు కన్జుమర్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. వేల కేసుల పరిష్కారానికి చొరవ చూపింది. నష్టపోయినదానికంటే అధికంగా పరిహారం అందించి బాధితులకు అండగా నిలిచింది. జిల్లాలో పలువురు వినియోగదారుల హక్కులపై పోరాటం చేస్తున్నారు. ఆయా సంబంధిత శాఖ అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ, పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నా చూసీచూడనట్లుగా వదిలేయడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోంది. ప్రశ్నిస్తేనే న్యాయం వినియోగదారుల సంరక్షణ చట్టం ప్రకారం తయారీ, నాణ్యత, తూకం, ప్రామాణిక ముద్ర, గడవు, ధర, జీఎస్టీ, తదితరాలు కచ్చితంగా ఉండాలి. చెల్లించిన ధరకు సేవలు పొందాలి. కానీ ఎక్కడైనా సేవల్లో అంతరాయం ఏర్పడితే కొందరే ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోనే వినియోగదారుల వివాదాల పరిష్కారానికి కమిషన్ ఉంది. 2024లో మొత్తం 163 ఫిర్యాదులు రాగా, ఇందులో 29 పరిష్కరించగా, మరో 134 పెండింగ్లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయా కంపెనీల, తయారీదారులపైనా జరిమానాలు విధించారు. ప్రస్తుతం వినియోగదారులు ఆన్లైన్లోనూ సెంటర్ అండర్ కన్జూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ (సీసీసీ), ఈ జాగృతి వెబ్సైట్, హెల్ప్లైన్ 1915కు కాల్ చేయెచ్చు. అవగాహనే శ్రీరామ రక్ష.. ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా అవగాహన లేమితో అవి మెరుగైన ఫలితాలను సాధించడం లేదు. ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ ఎందరో వినియోగదారులకు తమ హక్కులపై సరైన చైతన్యం లేకుండా పోయింది. తమకు జరిగిన అన్యాయంపై కనీసం ఫిర్యాదు సైతం చేయకుండా పోతున్నారు. నచ్చిన వస్తువుల సేవలు ఎంచుకోవడంతో పాటు వాటి నాణ్యత, పనితీరు గురించి తెలుసుకోవడం, అభిప్రాయం తెలియజేయడం తదితర హక్కులు వినియోగదారులకు ఉంటాయి. వస్తుసేవల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే వాటి విలువ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. -
జీవితంపై విరక్తితో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జీవితంపై విరక్తితో సింగరేణి ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై దివాకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..జిల్లాకేంద్రంలోని గర్మిళ్లకు చెందిన సింగరేణి ఉద్యోగి వీర్ల శ్రీధర్ (43) సింగరేణి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం మానేయాలని భార్య శ్రీకరి మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం రాత్రి ఇంట్లో తన గదిలో లుంగీతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు రోహన్, వచ్చన్ ఉన్నారు. -
గొల్లపల్లిశివారులో అగ్నిప్రమాదం
నెన్నెల: మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి పెను ప్రమాదం తప్పింది. గ్రామశివారు ఒర్రేలోని పొదలకు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం నిప్పు పెట్టారు. దాదాపు అర కిలోమీటర్ మేర మంటలు వ్యాపించాయి. ఎస్సీ కాలనీ అతి సమీపానికి మంటలు రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పోలీసులు, ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కొంత ఆలస్యమైన కాలనీలోని ఇళ్లన్నీ బుగ్గిపాలయ్యేవని ప్రజలు పేర్కొన్నారు. సకాలంలో ఫైరింజన్ చేరుకోవడంతో ముప్పు తప్పిందన్నారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
గ్రూప్–3లో మెరిశారు
పట్టుదలతో చదివి.. మామడ: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రిటౌన్షిప్ కాలనీకి చెందిన లింగాల విజయలక్ష్మి–గోపాల్ దంపతుల కుమారుడు హరికృష్ణ. గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 96వ ర్యాంకు సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన హరికృష్ణ తల్లిదండ్రుల ప్రొత్సాహంతో పట్టుదలతో చదివి విజయం సాధించాడు. గ్రూప్–2లో 338వ ర్యాంకు సాధించాడు. పరీక్ష రాస్తే సెలెక్ట్ కావాల్సిందే.. మందమర్రిరూరల్: పట్టణంలోని ప్రాణహితకాలనీకి చెందిన బొడ్డు పోషక్క–భూమయ్య దంపతుల చిన్న కుమారుడు తిరుపతి. గ్రూప్–4, 2, 3లో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2016లో సింగరేణిలో జేఎంఈటీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూప్–4 పరీక్ష రాసి ఫలితాల్లో సత్తాచాటాడాడు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్–2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంకు, తాజాగా విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60 ర్యాంకు సాధించడంతో స్థానికులు ఆయన్ను అభినందించారు. గ్రూప్–1 ఉద్యోగం చేయడమే తన లక్ష్యమని తిరుపతి పేర్కొన్నాడు. మెరిసిన మలక్చించోలి వాసి సారంగపూర్: మండలంలోని మలక్చించోలికి చెందిన దాసరి పవన్ గ్రూప్–2, 3 ఫలితాల్లో మెరిశాడు. ఈయన తల్లిదండ్రులు దాసరి రమణయ్య–లక్ష్మి. స్థానికంగా వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గ్రూప్–2లో 667ర్యాంకు, గ్రూప్–3లో 542 ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని పవన్ అంటున్నాడు. -
కేబుల్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్రూరల్: కేబుల్ వైర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు దొంగలు శుక్రవారం మండలంలోని ఎల్లపల్లి శివారులో మోటార్ కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. రూరల్ ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో కొండాపూర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు అనుమానాస్పదంగా కనిపించారు. వాహనం తనిఖీ చేయగా అందులో కేబుల్ వైర్లు లభ్యమయ్యాయి. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వివరించారు. -
● సత్తాచాటిన అభ్యర్థులు ● రాష్ట్రస్థాయిలో మార్కులు
ఉత్తమ ర్యాంకు రావడం సంతోషం నస్పూర్: గ్రూప్–3 ఫలి తాల్లో నస్పూర్కు చెందిన పోలంపల్లి వెంకటేశ్ ఉత్తమ ర్యాంకు సాధించాడు. శ్రీపాదకాలనీకి చెందిన ఈయన 294 మార్కులతో 181 ర్యాంకు సాధించాడు. గ్రూప్–2 ఫలితాల్లో 375 మార్కులతో 337 ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్వో పరీక్ష రాశాడు. ఉమ్మడి జిల్లా టా పర్గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్ తహసీ ల్దార్ కార్యాలయంలో పని చేశాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు ప్రిపేరయ్యాడు. ఉత్తమ ర్యాంకు రావడంపై సంతోషంగా ఉందని వెంకటేశ్ తెలిపాడు. -
విద్యుత్ ఉచ్చులకు వేటగాడి బలి
రెబ్బెన: అడవి జంతువులను వేటాడేందుకు పొలంలో విద్యుత్ తీగలకు ఉచ్చు బిగుస్తుండగా వేటగాడు బలయ్యాడు. మండలంలోని నారాయణపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. నారాయణపూర్ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన పొల్క రమేశ్ (45) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అప్పుడప్పుడు అడవి జంతువులను వేటాడేవాడు. గురువారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరాడు. గ్రామానికి చెందిన గోలెం పెంటయ్య వ్యవసాయ పొలంలో అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ వైర్లు అమర్చాడు. విద్యుత్ సరఫరా అందించే క్రమంలో వైరు తగిలి షాక్ గురై అక్కడిక్కడే మృతిచెందాడు. తెల్లవారిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. పొలంలో ఎవరో పడిపోయి ఉన్నాడని గ్రామస్తుడు తోట నవీన్.. రమేశ్ కుమారుడికి తెలిపాడు. అక్కడికి వెళ్లి చూడగా రమేశ్ పడిపోయి ఉన్నాడు. ఘటన స్థలంలో ఆయన ఒంటిపై కరెంట్ తీగ చుట్టుకుని ఎడమ చేతిలో కరెంట్ తీగ పట్టుకుని, కుడి చేతిలో కర్ర ఉన్నట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుమారుడు సాయికృష్ణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సమగ్ర అభివృద్ధికి ఆదర్శంగా నార్నూర్
● పీఎం అవార్డ్–2025 కోసం.. ● నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ)కి ఎంపిక ● 426 ఆస్పిరేషనల్ బ్లాక్స్లో టాప్ 30లో నార్నూర్ నార్నూర్: నాడు ఆదిలాబాద్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో నార్నూర్ మండలం మొదటి స్థానంలో ఉండేది. ఇక్కడి ఆదివాసీ గిరిజనుల జీవనాధారం వ్యవసాయం కాగా మౌలిక వసతుల లేమి, పరిమిత జీవనోపాధి అవకాశాలతో వెనుకబడి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. నేడు ఈ మండలం నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద ఒక సమగ్ర అభివృద్ధి మోడల్గా నిలుస్తోంది. ఈ మార్పు ఒక్కరోజులో దక్కింది కాదు.. పలు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్ఆర్ భాగస్వామ్యాల సమష్టి కృషి ఫలితం. జనవరి 7, 2023న నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కింద నార్నూర్ ఎంపికై ంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి, ఆర్థిక సమగ్రత వంటి కీలక రంగాల్లో పనితీరు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జూన్ 2023 నాటికి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. డెల్టా ర్యాంకింగ్లో ఇది గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. దీనికి గుర్తింపుగా నార్నూర్ బ్లాక్కు రూ.కోటి ప్రోత్సాహక నిధి మంజూరైంది. ఇది అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్ఫూర్తిదాయక ఘట్టం. అంతే కాదు.. పీఎం అవార్డ్స్ 2024 కోసం 426 ఆస్పిరేషనల్ బ్లాక్స్లో టాప్ 30లో ఒకటిగా నార్నూర్ ఎంపికై ంది. ● ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కేటగిరీలో ప్రధానమంత్రి ప్రశస్తి అవార్డు–2024 రెండో రౌండ్కు నార్నూర్ బ్లాక్ ఎంపికై న సందర్భంగా ఈనెల 10న సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా పాల్గొని బ్లాక్లో అమలు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్య విజయాలను ప్యానెల్కు సమర్పించారు. వ్యవసాయం– నీటి నిర్వహణ: స్థిరమైన అభివృద్ధి దిశగా ● హార్టికల్చర్లో మిల్లెట్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్, బీఏఐఎఫ్ చేపట్టడం. ● హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యంతో సుంగాపూర్, ఖంపూర్ గ్రామాల్లో చెక్ డ్యామ్లు నిర్మించి రైతులకు నీటి వనరులు మెరుగుపరిచే చర్యలు. ● దీర్ఘకాలిక సాగు కోసం సోలార్ బోర్వెల్స్, నీటి సంరక్షణ కార్యక్రమాల అమలు ● జల్ ఉత్సవంలో భాగంగా 500కు పైబడిన ప్రజలు నీటి పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం, నీటి నాణ్యత మెరుగుదల మహిళా సాధికారత, ఆర్థికవృద్ధి ● 601 స్వయం సహాయక సంఘాలు, 6,721 మహిళా సభ్యులు, ఆర్థిక స్వావలంబన లక్ష్యం. ● మహువా లడ్డూ ప్రాజెక్ట్, సంప్రదాయ ఆహారాన్ని ఆదాయ వనరుగా మార్చడం. ● పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాలు, మహిళలు– యువత కోసం వ్యాపార అవకాశాలు కల్పించడం. ● నైపుణ్య అభివృద్ధి శిక్షణ, సైకత శిల్పం, డిజిటల్ స్కిల్స్–బ్యాంబూ క్రాఫ్ట్పై ప్రత్యేక శిక్షణ. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన ● నార్నూర్ ప్రత్యేక వెబ్సైట్ ( www. abpnarnoor. in) ప్రగతిపై లైవ్ అప్డేట్స్– ట్రాకింగ్. ● నార్నూర్ మానిటరింగ్ యాప్, పాఠశాల పరిశీలన–సమస్యల పరిష్కారానికి. ● పైలట్ ప్రజావాణి, బ్లాక్స్థాయి సమస్యల పరిష్కారం కోసం వేగవంతమైన వ్యవస్థ. ● స్మార్ట్ సీఎస్సీ సెంటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను డిజిటల్ ద్వారా అందించడం. భవిష్యత్ దిశగా ముందడుగు 100 శాతం ఎన్క్యూఏఎస్ హెల్త్ సెంటర్ సర్టిఫికేషన్. గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు. ఆర్వో వాటర్ ప్లాంట్స్, కమ్యూనిటీ లైబ్రరీలు మరింత విస్తరణ మహిళల ఆరోగ్యంపై అవగాహన, టెలీమెడిసిన్ క్లినిక్స్. డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాసులను మరింత అభివృద్ధి చేయడం. దేశ గ్రామీణ అభివృద్ధ్దికి ఒక మార్గదర్శకం ఆస్పిరేషనల్ బ్లాక్గా మారిన నార్నూర్ ఇప్పుడు దేశంలోని గ్రామీణ అభివృద్ధికి గొప్ప మోడల్గా నిలుస్తోంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి పనిచేయడం ద్వారా సాధ్యమైన విజయగాథ ఇది. అభివృద్ధి కొనసాగుతూ, ప్రజల సంక్షేమానికి మరింత ప్రాముఖ్యత ఇస్తూ నార్నూర్ అభివృద్ధి జ్ఞాపకంగా నిలుస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందడుగు వేస్తాం. – రాజర్షిషా, కలెక్టర్, ఆదిలాబాద్ విద్య, స్మార్ట్ క్లాసులు– నూతన మార్గదర్శకాలు స్మార్ట్క్లాసులు, ఐసీటీ ల్యాబ్స్, వర్చువల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడం. ఇస్రో, ఎన్ఆర్ఎస్సీ, టీ–హాబ్ ఎక్స్పోజర్ విహారయాత్రల ద్వారా విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం– ఇన్నోవేషన్ అవగాహన కల్పించడం. యంగ్ ఓరేటర్స్ క్లబ్, ఇంగ్లిష్ లిటరసీ ప్రోగ్రాం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం. ఆరోగ్య పాఠశాల ద్వారా ఆరోగ్యం, మానసికోల్లాసం, వ్యక్తిత్వ వికాసంపై ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ. ఆరోగ్యం–పోషణ, సంక్షేమం వైపు అడుగులు.. వందశాతం ఏఎన్సీ నమోదు, సురక్షిత ప్రసవ సేవలు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు గిరిజన పోషణ మిత్ర ప్రోగ్రాం అమలుతో ఆశ్రమ పాఠశాల(బాలికల)ల్లో రక్తహీనత నివారణకు చర్యలు లంచ్ బాక్స్ సర్వీస్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ కుటుంబాలకు చెందిన గర్భిణులకు పోషకాహారం అందించేలా చర్యలు ఎన్క్యూఏఎస్, రెడీ హెల్త్ సెంటర్స్, పీఎం జన్మన్ ఎంఎంయూ హెల్త్ క్యాంపుల ద్వారా గ్రామీణ ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. -
రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంకు
తాంసి: తాంసికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–3 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్–1లో 399 మార్కులు, గ్రూప్–2లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–3లో 284 మార్కులతో రాష్ట్రస్థాయిలో 417వ ర్యాంక్ సాధించాడు. వరుసగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్న అశోక్ ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివానని అశోక్కుమార్ తెలిపాడు. -
పండుగ పూట విషాదం
● ద్విచక్రవాహనం అదుపుతప్పి విద్యార్థి మృతి ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు ● మిన్నంటిన రోదనలు ఆదిలాబాద్టౌన్: పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు హోలీ సంబరాల్లో స్నేహితులు, కుటుంబీకులతో గడిపిన ఓ విద్యార్థి ద్విచక్రవాహనం అదుపుతప్పి కానరాని లోకాలకు చేరాడు. తమ కుమారుడు లేడన్న నిజాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త కుమ్మర్వాడకు చెందిన జిల్లెడ్వార్ ఊశన్న మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు జిల్లెడ్వార్ రుషికుమార్ (16) ఆదిలాబాద్ పట్టణంలోని సేవదాస్ విద్యామందిర్లో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం రుషికుమార్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన ఆమ్లే ప్రేమ్, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్కంటికి చెందిన బడేన్వార్ అశ్విన్తో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. అనంతరం అశ్విన్ను ఇంటివద్ద దింపడానికి ముగ్గురు బైక్పై వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు తిరిగి వస్తుండగా పట్టణంలోని ఎరోడ్రాం సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అతివేగంగా నడపడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. కాగా రుషికుమార్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన ఆమ్లే ప్రేమ్ బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల్లో పరీక్షలు ఉండగా.. పదో తరగతి పరీక్షలు వారం రోజుల్లో జరగనున్నాయి. అంతలోనే హోలీ సంబరాల్లో కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకు ఇంటి వద్ద హోలీ సంబరాల్లో మునిగితేలిన కుమారుడు తిరిగిరాని లోకాలకు చేరాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలియడంతో తోటి స్నేహితులు, బంధువులు వారి నివాసానికి చేరుకున్నారు. తోటి విద్యార్థులు కంటతడి పెట్టారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందంజలో ఉన్న విద్యార్థి మృతి చెందడంతో పాఠశాల యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరో విద్యార్థికి గాయాలతో బతికి బయటపడ్డాడు. -
మద్యం మత్తులో యువకుడు..
కౌటాల: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఎన్.మధుకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలం గురుడుపేట గ్రామానికి చెందిన తలండి రవి (27) గతకొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం మద్యం మత్తులో హోలీ ఆడి రాత్రి తాగిన మైకంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కాగజ్నగర్ మండలం ఈజ్గాంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి తలండి చిన్నన్న ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సందేహాలున్నప్పుడు.. శిక్షలు విధించలేం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాక్షులు, మెడికల్ ఆధారాల్లో వ్యత్యాసం ఉండి.. ప్రత్యక్ష సాక్షి చెబుతున్నది సందేహాస్పదంగా ఉన్నప్పుడు శిక్షలు విధించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదు చేసిన తర్వాత అది కోర్టుకు చేరడానికి పదహారున్నర గంటల సమయం పట్టిందని.. ఇంత సమయం ఎందుకు పట్టిందో దర్యాప్తు అధికారి వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. ఆలస్యం పరిస్థితులను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ప్రత్యక్ష సాక్షి (పీడబ్ల్యూ 6) వాంగ్మూలం ప్రకారం.. కార్తీక్ చేతిపై షంషీర్ ఖాన్ దాడి చేశాడని.. తలపై దాడి చేసినట్లు పేర్కొనలేదని చెప్పింది. కానీ, పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పుర్రెపై బలమైన గాయం కారణంగా కార్తీక్ మరణించినట్లు ఉందని చెప్పింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రధానంగా అతని వాంగ్మూలంపై ఆధారపడ్డారని అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2018లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నామని తెలిపింది. నిందితుడు షంషీర్పై ఇతర కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 ప్రస్తావన లేదు..పోలీసుల కథనం మేరకు.. ‘ఓ అమ్మాయికి సంబంధించిన విషయంలో షంషీర్, కార్తీక్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో కాగజ్నగర్లోని లారీ చౌరస్తాలో కార్తీక్ను షంషీర్ కత్తితో దాడి చేసి చంపాడు. 2014, ఫిబ్రవరి 20న కార్తీక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత షంషీర్ను పోలీసులు అరెస్టు చేశారు.’ ఈ కేసు విచారణ చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. షంషీర్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ షంషీర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో షంషీర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.దామోదర్రెడ్డి, పోలీసుల తరఫున ఏపీపీ అరుణ్కుమార్ వాదనలు వినిపించారు. ‘కోర్టుకు పంపిన ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 పేరు ప్రస్తావించలేదు. విచారణ సమయంలోనూ అతని పేరు లేదు. పీడబ్ల్యూ 6 చెప్పిన దానికి మెడికల్ ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి. మరణించిన వ్యక్తి తల, మెడపై దాడి జరిగిందని సాక్షి చెప్పలేదు. మెడికల్ ఆధారాల్లో తల, మెడ, ఎడమ చెవిపై గాయాలున్నాయి. ఎడమ మణికట్టు వద్ద కూడా గాయాలున్నాయి. పీడబ్ల్యూ 6 సాక్షాలు సందేహాస్పదంగా ఉన్నా యి. అందువల్ల 2018లో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.న్యాయం గెలిచిందిఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడిపి ఈ రోజే విడుదలయ్యాను. శిక్షా కాలంలో సెంట్రల్ జైలు, వరంగల్లో ఓపెన్ జైలు పెట్రోల్ బంకులో పని చేశాను. ఇన్నేళ్లకు మళ్లీ న్యాయం గెలిచిందని నమ్ము తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. – షంషీర్ ఖాన్ -
మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య
బెజ్జూర్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కావుడే లస్మయ్య (52) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య కమలాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. వృద్ధుడు బలవన్మరణంతాండూర్: మనస్తాపంతో పురుగుల మందు తాగి వృద్ధుడు బలవన్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలి పిన వివరాల మేరకు మండలంలోని గోపాల్ నగర్కు చెందిన రావుల సాంబయ్య (60) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈక్రమంలో నిత్యం మద్యం సేవించి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. గురువారం మద్యం సేవించి భార్య కౌసల్యతో గొడవ పడడంతో ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. జగిత్యాల ఇన్చార్జిగా ప్రదీప్కాసిపేట: కాసిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రత్నం ప్రదీప్ను జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా నియమిస్తూ రాష్ట్ర యూత్కాంగ్రెస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను జిల్లాల ఇన్చార్జీలుగా నియమిస్తూ ఈనెల 12న ఉత్తర్వులు వెలువడ్డాయి. -
తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ తల్లి మృతి ● కూతురు పరిస్థితి విషమంమంచిర్యాలక్రైం: మద్యం మత్తులో తల్లీకూతురు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్రావు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని చున్నంబట్టివాడ వందఫీట్ల రోడ్లో నివాసం ఉంటున్న పస్తం పోశమ్మ (80) భర్త భీమయ్య పదేళ్ల క్రితమే చనిపోగా రాజమ్మ వివాహమైన కొద్దిరోజులకే భర్తను వదిలిపెట్టి తల్లితో కలిసి ఉంటోంది. ఇద్దరూ కలిసి ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త కాగితాలు ఏరుకుంటూ అవి విక్రయించగా వచ్చిన డబ్బులతో మద్యం సేవించి గొడవపడేవారు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అనంతరం ఇద్దరూ గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో క్షణికావేశంలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఇద్దరి గొడవ వినిపించకపోవడంతో కొంతసేపటికి సమీపంలోనే ఉంటున్న పోశమ్మ మనవడు భీమేశ్ వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. వెంటనే ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పోశమ్మ గురువారం మృతి చెందింది. రాజమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పోశమ్మ కుమారుడు గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
భీమారం(చెన్నూర్): మంచిర్యాల జిల్లా భీమారంలో గంజాయి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. గురువారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల–చెన్నూరు జాతీయరహదారిలో భీమారం ప్రభుత్వ కలప డిపో వద్ద దుర్గం సందీప్, దుర్గం సంజయ్, వనపర్తి కరుణాసాగర్, రావుల ఆదర్శ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్సై శ్వేత వారిని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి లభించింది. చెడు వ్యసనాలకు అలవాటుపడిన కాసిపేటకు చెందిన సందీప్, అంకుసాపూర్కు చెందిన సంజయ్ మహారాష్ట్రలోని చంద్రాపూర్ రైల్వేస్టేషన్ సమీ పంలో గుర్తుతెలియని వ్యక్తులవద్ద గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈనెల 11న ఇద్దరూ కలిసి చంద్రాపూర్లో కిలోన్నర గంజాయి కొనుగోలు చేసి గురువారం భీమారంలో కిష్టంపేటకు చెందిన వనపర్తి కరుణాసాగర్, రావుల ఆదర్శ్కు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నలుగురితో పాటు భీమారంకు చెందిన రాంటెంకి స్వస్తిక్కుమార్, జువేరి శ్రీనివాస్ను బస్టా ండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజ రు పర్చినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్వేత పాల్గొన్నారు. గంజాయి పట్టివేతగుడిహత్నూర్(బోథ్): మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తిడికే రంజనాతో పాటు వినాయక్ గంజాయి పొట్లాలు అమ్ముతుండగా తమకు అందిన సమాచారం మేరకు పట్టుకుని వారి వద్ద నుంచి 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
● 17నుంచి 30వరకు కార్యక్రమాలు ● డీఎంహెచ్వో డాక్టర్ హరీశ్రాజ్మంచిర్యాలటౌన్: ఈ నెల 17నుంచి 30వరకు జాతీ య కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా సర్వే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని, కుష్ఠు వ్యా ధి నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్వో డా క్టర్ హరీశ్రాజ్ అన్నారు. గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కుష్ఠు వ్యాధి సర్వే కా ర్యక్రమాల పోస్టర్లను వైద్యులతో కలిసి విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జి ల్లాలో 149 ఆరోగ్య ఉపకేంద్రాల్లో 650 మంది ఆశా కార్యకర్తల ద్వారా కార్యక్రమాలు చేపడుతా మని తెలిపారు. కుష్ఠువ్యాధి నిర్మూలనకు చేపట్టాల్సిన ప్రణాళికలు సిద్ధం చేశామని, వ్యాధి లక్షణాలు బ యటపడడానికి దాదాపు మూడేళ్ల నుంచి ఐదేళ్లు పడుతుందని అన్నారు. ఆరు నెలల నుంచి 12 నెలల్లోపు మందులతో వ్యాధి పూర్తిగా నయం చేయవచ్చన్నారు. చర్మంపైన మచ్చలు ఉంటే ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కుష్ఠువ్యాధిపై ఉన్న భయాన్ని వీడి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపవైద్యాధికారి డాక్టర్ సుధాకర్నాయక్, డాక్టర్ ఏ.ప్రసాద్, డాక్టర్ అనిల్, సబ్ యూనిట్ అధికారులు నాందేవ్, జగదీశ్, కాంతారావు, పద్మ, చందు పాల్గొన్నారు. -
‘ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను బహిష్కరించాలి’
నస్పూర్: కాంట్రాక్టర్లకు తొత్తులుగా వ్యవహరిస్తూ సింగరేణి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను బహిష్కరించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. సింగరేణి ఐక్యవేదిక సంఘాల నాయకులతో కలిసి ఆయన గురువారం నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనాలని ఆయా సంఘాల నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బొగ్గు బ్లాకుల వేలానికి విరుద్ధమని ఎన్నికలకు ముందు ప్రకటించిన గుర్తింపు సంఘం నాయకులు నేడు మాటమార్చడంలో మర్మమేమిటో కార్మికులు ఆలోచించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ సెంట్రల్ కమిటీ నాయకులు తిప్పారపు సారయ్య, వి.అనిల్రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పి.అశోక్కుమార్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోళ్ల అంజన్న, కార్యదర్శి మేకల పోషమల్లు, ఐఎఫ్టీయూ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. స్థానికులకు అన్యాయం జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో స్థానిక భూనిర్వాసిత, కాంట్రాక్టు కార్మికులకు పవర్మేక్ కంపెనీ తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇతర రాష్ట్రాల కార్మికులు, ఉద్యోగులకు వేలల్లో జీతాలు, ఇంటి కిరాయిలు చెల్లిస్తోందని, ఇక్కడి కార్మికులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. జైపూర్ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీపీపీ నుంచి పవర్మేక్ కంపెనీ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు సారయ్య, సాయికృష్ణరెడ్డి, సంపత్, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గూడేల్లో ‘పులారా’ ఉత్సవం
కెరమెరి(ఆసిఫాబాద్): ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో గురువారం సంప్రదాయబద్ధంగా పులారా ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతీ ఇంటి నుంచి కుడుకలను తీసుకువచ్చి గ్రామ పటేల్కు ఇచ్చారు. అంతకు ముందే అడవి నుంచి తీసుకువచ్చిన రెండు వెదురు బొంగులకు మాతారా, మాతరల్గా నామకరణం చేసి వాటికి కుడుకలు, గారెలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, చక్కెర బిళ్లలు అమర్చారు. ఆయా గ్రామాల గ్రామ పటేళ్లు వాటికి పూజలు చేశారు. ఆ తర్వాత వాటికి మంటపెట్టారు. ఆచారం ప్రకారం కొందరు యువకులు వరుసగా అందులోంచి దూకారు. అనంతరం డోలు, సన్నాయిలతో కాముడి దహనం వరకు వెళ్లారు. గ్రామంలోని ప్రతీ కుటుంబం రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముని దహనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సహపంక్తి భోజనం చేశారు. రాత్రంతా అక్కడే బస చేశారు. అక్కడున్న బూడిదను ఎవరూ దొంగిలించకుండా కాపాడారు. నేడు దురాడి (రంగులు చల్లుకోవడం)సంబరాలు జరుపుకోనున్నారు. గిరిజన సంప్రదాయాలతో పూజలు ఘనంగా కాముని దహనం -
సంఘటన జరిగిన తక్షణమే స్పందించాలి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● సీపీ అంబర్ కిషోర్ ఝూమంచిర్యాలక్రైం: ఏదైనా సంఘటన జరిగిన తక్షణమే స్పందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు. గురువారం రా మగుండం కమిషనరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ఎస్సైలతో సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్నదని, ప్రతీ అధికారి వారి వ్యక్తిగత జీవి తానికి, తోటి సిబ్బంది జీవితాలకు విలువనివ్వాలని అన్నారు. సిబ్బందితో మాట్లాడి దర్బార్ వంటివి నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అధికారులు క్రమశిక్షణ, నిబద్ధతతో కష్టపడి సరైన మార్గంలో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒంటరిగా కాకుండా ఇద్దరు ముగ్గురు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుంటే విలువైన సమాచారం లభిస్తుందని తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో హోలీ జరుపుకోవాలి సంప్రదాయ పద్ధతిలో హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝూ అ న్నారు. హోలీ వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పోలీస్ అధికా రులను ఆదేశించారు. హోలీ పండుగకు సహజ సిద్ధమైన రంగులు వినియోగించాలని అన్నారు. మ ద్యం సేవించి సంబరాలు చేసుకోవద్దని, స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని వాగులు, బావులకు వె ళ్లకూడదని తెలిపారు. మద్యంమత్తులో మహిళలపై రంగులు చల్లడం, మోటారుసైకిళ్లపై అల్లర్లు చేయ డం, గుంపులు గుంపులుగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఓటరు జాబితా సిద్ధం చేయాలి
● రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డిమంచిర్యాలఅగ్రికల్చర్: గుర్తింపు పొందిన రాజకీ య పార్టీల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లే కుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాల ని రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జి ల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల జాబి తా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ నెల 19లోగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఓటరు జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ అంశాలపై సమావేశాలు నిర్వహించాలని తెలిపా రు. వీడియో, ఫొటోలు కవరేజ్ చేయాలని, రిజిష్ట ర్లు నిర్వహించాలని తెలిపారు. పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితా సంబంధిత దరఖాస్తు ఫారా లు 6, 7, 8పై వివరించాలని, నూతన ఓటరు నమో దు, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులపై వచ్చే దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిష్కరించడంపై అవగాహన క ల్పించాలని తెలిపారు. ఈ నెల 21లోగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎ న్నికల విభాగం అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. -
బాడీ బిల్డర్స్ అడ్డా బెల్లంపల్లి
● పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులు ● ప్రాచీన క్రీడకు చేరువవుతున్న యువకులు బెల్లంపల్లి: బాడీ బిల్డింగ్ యువతలో క్రేజీని పెంచుతోంది. దేహదారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి నేటితరం యువకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. రోజువారీగా జిమ్కు వెళ్లి శిక్షకుల పర్యవేక్షణలో దేహదారుడ్యాన్ని పెంచుకునే మెలకువలు నేర్చుకుంటున్నారు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే మరోవైపు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చా టుతున్నారు బెల్లంపల్లికి చెందిన క్రీడాకారులు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని ప్రతిభా పాటవా లను ప్రదర్శిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. మెడల్స్ సాధించి బెల్లంపల్లికి వన్నె తెస్తున్నారు. జిమ్లు వేదికగా... బెల్లంపల్లి పురాతన కార్మిక క్షేత్రం. క్రీడాకారులకు నిలయమైన బెల్లంపల్లిలో బాడీ బిల్డర్లు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతున్నారు. ఎంతోమంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తూనే బాడీ బిల్డింగ్పై మక్కువ పెంచుకున్నారు. కోలిండియా, సింగరేణిస్థాయి, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. స్థానికంగా ఉన్న జిమ్లను వేదికగా ఎంచుకుని ప్రత్యేక సాధన చేస్తున్నారు. సీనియర్ బాడీ బిల్డర్లు మురహరిరావు, బాలకృష్ణ, చంద్రశేఖర్, మోబిన్, తదితరులు వారిని తీర్చిదిద్దడంతో కృతార్థులవుతున్నారు. నస్పూర్లో జరిగిన పోటీల్లో... మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సీఈఆర్ క్లబ్లో ఈనెల 9న ఆదివారం రాత్రి నస్పూర్ ఎలిఫెంట్ జిమ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. ఇందులో బెల్లంపల్లి స్కైజిమ్ క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. 80 కిలోల విభాగంలో జి.లక్ష్మణ్ బంగారు, మాస్టర్ విభాగంలో పి.కృష్ణస్వామి బంగారు, 50 కిలోల విభాగంలో వెండి పతకం, 70 కిలోల విభాగంలో కె.అక్షయ్ బంగారు పతకం, జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించారు. 55 కిలోల విభాగం, జూనియర్స్ విభాగంలో జరిగిన పోటీల్లో కె.రేవంత్ ప్రథమస్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. మరో క్రీడాకారుడు జి.రవి 55 కిలోల విభాగంలో చతుర్థ స్థానంలో నిలిచాడు. ఎం.మహేష్, ఎం.రోహిత్, హూమాయున్ ఆయా విభాగాల పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు. గతేడాది మహబూబ్నగర్లో.. మహబూబ్నగర్లో గతేడాది నవంబర్ నెలలో మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో బెల్లంపల్లి స్కైజిమ్ కోచ్ సదానందం 65 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. గతేడాది బెల్లంపల్లిలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో లక్ష్మణ్, కృష్ణ స్వామి బంగారు పతకాలు సాధించారు. ప్రస్తుతం ప్రాచూర్యంలో ఉన్న బాడీ బిల్డింగ్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులు పతకాలు సాఽధిస్తూ అబ్బుర పరుస్తున్నారు. నేటితరం యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. -
ఐకే1ఏ గనిలో కార్మికుడికి గాయాలు
జైపూర్: ఇందారం ఐకే1ఏ గనిలో గురువారం జరిగిన ప్రమాదంలో సపోర్టుమెన్ కార్మికుడు అంగల రాజయ్యకు గాయాలయ్యాయి. ఉదయం షిఫ్టు విధులుకు వచ్చిన రాజయ్య గనిలో ఎన్–8 ప్యానెల్ 13డీప్ ఆఫ్ సెవెన్ లెవల్లో పని చేస్తుండగా హఠాత్తుగా సైడ్ ఫాల్ కావడంతో గాయాలయ్యాయి. తోటి కార్మికులు రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు కరీంనగర్కు తరలించారు. కార్మికుడిని ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ నాయకులు పరామర్శించారు. పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ కేంద్రకమిటీ నాయకులు తిప్పరపు సారయ్య డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతిచింతలమానెపల్లి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి చెందినట్లు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు. మండలంలోని లంబాడిహేటి గ్రామానికి చెందిన అజ్మీర శాంతాబాయి (53) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో అప్పులు కావడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 11న మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతురాలి కుమారుడు అజ్మీర ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. విద్యుత్ షాక్తో ఒకరు..ఆదిలాబాద్రూరల్: విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన సంఘటన మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్కు చెందిన కొజుర్ రంజిత్ (35) మావల మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మేసీ్త్ర పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో కూలర్ స్విచ్ వేయడంతో షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య జోశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. -
యువతీ, యువకుడిపై దాడి
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం–టేకుమట్ల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం రాత్రి 7.20గంటల ప్రాంతంలో ఓ యువతీ, యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం జిల్లా రెబ్బెనకు చెందిన ఆరికెళ్ల సుమన్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూడడానికి వెళ్లాడు. సాయంత్రం 7గంటల ప్రాంతంలో సుమన్ తన బంధువైన యువతి(25)తో కలిసి సీసీ సీ నస్పూర్ వైపు వెళ్తున్న క్రమంలో టేకుమట్ల క్రాస్ రోడ్డు వద్ద ఆగారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి దాడి చేశారు. ఇద్దరిని కొట్టుకుంటూ చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి వారి వద్ద ఉన్న రూ. 4వేలు నగదు, సెల్ఫోన్ లాక్కొని ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీధర్ వివరించారు. గురువారం సంఘటన స్థలాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పరిశీలించారు. కాగా, రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు యువకుడిపై దాడి చేసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే ప్రచారం జరిగింది. రోజంతా విచారణ జరిపిన పోలీసులు యువతీ, యువకులపై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. -
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం సబ్బెపల్లి శివారులోని మామిడి తోటలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న ముగ్గురు వేట గాళ్లను గురువారం అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట అ టవీ రేంజ్ అధికారి అత్తె సుభాశ్ తెలిపారు. టీకానపల్లికి చెందిన చాకేపల్లి సత్తయ్య, చాకేపల్లి వెంకటేశ్, ధర్మారం గ్రామానికి చెందిన రావుల లక్ష్మణ్ పాంగోలిన్(అలుగు) వేటాడి మాంసం విక్రయిస్తుండగా వారిని అరెస్ట్ చేసి అలుగు మాంసం, పొ లుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాజీపూర్ డెప్యూటీ రేంజ్ అటవీ అధికారి సునీత, ఎఫ్బీవోలు ఫరీదాబాను, సుభాశ్ పాల్గొన్నారు. -
బొగ్గు గనుల వేలం రద్దు చేయాలి
శ్రీరాంపూర్: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం చేపట్టిన వేలం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నా యకులు డిమాండ్ చేశారు. గురువారం యూ నియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కు మారస్వామి, రీజియన్ అధ్యక్షుడు సమ్ము రాజ య్య ఆర్కే 7గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. బొగ్గు గనుల వేలం వల్ల సింగరే ణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అ న్నారు. ఇప్పటివరకు గనులన్నీ సింగరేణికే కే టాయించారని, నేడు ప్రైవేట్ సంస్థలకు ధారా దత్తం చేయడం కోసం వేలం ప్రక్రియ మొదలుపెట్టారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలంటే వేలాన్ని అడ్డుకోవాలని కా ర్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్సింగ్, నా యకులు చంద్రయ్య, భీరయ్య, పోగుల శేఖర్, ఉదయ్ పాల్గొన్నారు. -
కొత్త అధ్యాపకులు వచ్చారు..
● జూనియర్ కళాశాలల్లో చేరిక ● జిల్లాలో 26 పోస్టులు భర్తీమంచిర్యాలఅర్బన్: జిల్లాలోని పది ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 28 ఖాళీలకు గాను 26మందిని నియమించింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కాలేజీల్లో అధ్యాపకులు రిపోర్టు చేశారు. చెన్నూర్లో తెలుగు, కాసిపేటలో కామర్స్ సబ్జెక్టు లెక్చరర్లు మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ చేశారు. పన్నెండేళ్ల తర్వాత.. పన్నెండేళ్ల క్రితం ఒప్పంద అధ్యాపకుల నియామకాలు నిలిచిపోయాయి. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానాల్లో విశ్రాంత అధ్యాపకులు, అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను అతిథి అధ్యాపకులుగా నియమించారు. అప్పట్లో నెలకు రూ.10వేలు వేతం ఉండడంతో బోధనకు విముఖత చూపారు. తర్వాత కాలంలో పీరియడ్కు రూ.150 చొప్పున కనీస వే తనం రూ.21వేలకు మించకుండా ప్రభుత్వం అందజేసింది. కాలక్రమేణా పీరియడ్కు రూ.390కి పెంచి నెలకు రూ.28వేలకు మించకుండా ప్రతీయేటా రె న్యూవల్ చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇంటర్ బోర్డు నో టిఫికేషన్ విడుదల చేయడం, భర్తీలో పలు కారణాలతో ఆలస్యమైంది. చివరికి ఎంపిక చేసిన జాబి తాను ఇంటర్ బోర్డుకు అందజేసింది. మరో పది ఒకేషనల్ లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. భర్తీ ఇలా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 28 పోస్టుల ఖాళీలకు గాను 26 మంది నియామకం అయ్యారు. జైపూర్ కళాశాలలో 3, మందమర్రిలో 5, మంచిర్యాలలో 3, జన్నారంలో 1, కాసిపేటలో 2, దండేపల్లిలో 1, బెల్లంపల్లిలో 3, బెలంపల్లి(బాయ్స్)లో 1, లక్సెట్టిపేట కళాశాలలో నలుగురు అధ్యాపకులు బాధ్యతలు చేపట్టారు. ఖాళీల భర్తీతో కళాశాలలు బలోపేతం అవుతాయని, ఉత్తీర్ణత శాతం, అడ్మిషన్లు పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు విజిత్కుమార్ తెలిపారు.సంతోషంగా ఉంది..12 ఏళ్లుగా జేఎల్ రిక్రూట్మెంట్ జరగకపోవడంతో ఒత్తిడికి లోనయ్యాను. ప్రభు త్వ లెక్చరర్గా చే యాలన్నది నా లక్ష్యం. 2019లో టీజీటీ ఇంగ్లిష్గా ఉద్యోగం రావడంతో ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జైపూర్లో విధులు నిర్వహిస్తున్నాను. 2022 నోటిఫికేషన్ జారీ కావడం.. 2023 పరీక్ష రాశాం. 2024 ఫలి తాలు రావడంతో లెక్చరర్గా నియామక పత్రం అందుకోవడం సంతోషంగా ఉంది. – కమలాకర్, నూతన లెక్చరర్, చెన్నూర్ -
సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి
బెల్లంపల్లి: సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని పట్టణంలోని ప్రభు త్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీవోఈ) విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. గురుకులం నుంచి పుర వీధుల మీదుగా మార్కెట్ కాంటా చౌ రస్తా వరకు ప్లకార్డులతో సాగింది. పీఎంశ్రీ స్కూల్, సీవోఈ క్లబ్ యాక్టివిటీలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీవోఈ ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ రసాయనిక రంగులు చల్లుకోవద్దని, రసాయనాలు కలిపిన రంగులు ప్రమాదకరమైన జబ్బులకు గురి చేస్తాయని వివరించారు. ప్రకృతిలో లభించే సహజ రంగుల వాడకానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమలాకర్, మల్లికార్జున్, మహేష్, శ్రీలత, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
● ‘మధ్యాహ్న’ ఏజెన్సీ మహిళలకు ఊరట ● సర్కారు పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం ● రూ.5నుంచి రూ.6కు పెంచుతూ ఉత్తర్వులు జారీ
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్డు అందిస్తోంది. ఇటీవల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ధరాభారం తాము మోయలేమంటూ మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని పాఠశాలల్లో వారంలో గుడ్డుకు బదులు అరటిపండు ఇస్తుండగా.. ఇంకొందరు వారంలో ఒక గుడ్డుతో సరిపెడుతున్నారు. కోడిగుడ్డు కొనుగోలు అంటేనే వంట ఏజెన్సీ మహిళలు తమవైపు గుర్రుగా చూస్తున్నారని టీచర్లు వాపోయిన సందర్భాలు లేకపోలేదు. మార్కెట్లో గుడ్డు ధరలకు ప్రభుత్వం చెల్లించే ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ఏజెన్సీలకు అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్డు ధరను ఒక రూపాయి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కోడిగుడ్డు ధర రూ.5నుంచి రూ.6 వరకు పెంచింది. దీంతో ఏజెన్సీ మహిళలకు ఉపశమనం కలుగనుంది. ఆకాశాన్నంటిన ధర కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో ఆకాశాన్ని అంటుతోంది. మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు భారంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలోని 747 ప్రభుత్వ పాఠశాలల్లో 37,241మంది విద్యార్థులు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వండి పెట్టేందుకు రూ.6.19, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రూ.9.29 స్లాబ్ ధరలతోపాటు కోడిగుడ్డుకు అదనంగా రూ.5 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 9, 10వ తరగతుల వరకు రూ.10.68 పైసలు బిల్లులో కోడిగుడ్డు ధర కలిపి చెల్లిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తోంది. కూరల కోసం పప్పు, కూరగాయలు, నూనెను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటారు. విద్యార్థులందరికీ సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్డు అందించాలి. గతంలో గుడ్డుకు రూ.4 చెల్లించే ప్రభుత్వం 2022లో అప్పటి ధరల ప్రకారం రూ.5కు పెంచింది. కానీ కొద్ది నెలలుగా గుడ్డు ధర అమాంతం పెరగడంతో చాలా పాఠశాలల్లో వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థులు పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఒక్కో గుడ్డుకు రూ.5 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ప్రస్తుతంమార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7వరకు పలుకుతున్న సందర్భాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కోడిగుడ్డు ధర ఇంకెంత పెరుగుతుందోనని ఏజెన్సీ నిర్వాహకులు ధరలు పెంచాలని ఆందోళన చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం వంట ధరలను పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత మధ్యాహ్నం భోజనం వంట ధరల పెంపుతో ఏజెన్సీలకు కాస్త ఊరట కలిగిస్తోంది. కోడిగుడ్లు -
క్లినిక్ల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
జన్నారం: మండల కేంద్రంలోని ప్రైవేట్ క్లినిక్ల్లో మంచిర్యాలకు చెందిన టీజీఎంసీ, ఐఎంఏ టాస్క్ఫోర్స్ కమిటీ బృందం గురువారం తనిఖీలు నిర్వహించారు. జన్నారం బొక్కల దవాఖానా, మణికంఠ క్లినిక్లో తనిఖీ చేసినట్లు టీజీఎంసీ సభ్యుడు ఎగ్గన శ్రీనివాస్ తెలిపారు. మోతాదుకు మించి యాంటీబయోటిక్, నొప్పి మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, ఇతర హై షెడ్యూల్ మందులు ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. బొక్కల దవాఖానాలో విరిగిన ఎముకలకు వచ్చీరాని వైద్యం చేస్తూ అంగవైకల్యానికి కారణం అవుతున్నారని తెలిపారు. అనారోగ్య సమయంలో దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలని సూచించారు. టీజీఎంసీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సంతోష్, టాస్క్ఫోర్స్ సభ్యులు డాక్టర్ అనిల్, డాక్టర్ విశ్వేశ్వర్రావు పాల్గొన్నారు. -
సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
చెన్నూర్: చెన్నూర్ ప్రాంత ప్రజలు ఆరోగ్య కేంద్రంలోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం ఆయన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వార్డుల్లో పర్యటించి వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం క్షయ వ్యాధిని గుర్తించే మాలిక్యుర్ యంత్రాన్ని ప్రారంభించి, డయాలసిస్ దినోత్సవం సందర్భంగా వైద్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సత్యనారాయణ, డీపీసీ సురేందర్, ఎస్టీఎస్ అశోక్, ఎస్టీఎల్ఎస్ వేణు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
బెల్లంపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు, మందుల నిల్వ, ల్యాబ్, రిజిష్టర్లు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఐటీఐ ఏర్పాటు కోసం పలు చోట్ల స్థల పరిశీలన చేశారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, సిబ్బంది పాల్గొన్నారు.సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ కుమార్ దీపక్ -
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● ప్రజల భఽద్రత, బాధ్యత పోలీసులదే.. ● రామగుండం పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ ఝూకరెంటు లేని బడికి రూ.23వేలు బిల్లుమంచిర్యాలక్రైం: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బుధవారం మంచిర్యాల పోలీసుస్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పెండింగ్ కేసులు, అధికంగా నేరాలు జరుగుతున్న తీరు, రౌడీషీటర్ల బైండోవర్, కౌన్సెలింగ్ తదితర విషయాలపై అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు, ఎఫ్ఐఆర్ రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, బాధ్యత పోలీసులదేనని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసు బాధితులకు మాత్రమేనని, నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. అంతకుముందు డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్రావు, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేష్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మంచిర్యాలక్రైం: పోలీసులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. బుధవారం రామగుండం కమిషనరేట్లోని సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అధికారులందరూ సమన్వయంతో ఒక బృందంగా పని చేసినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తామని, ఫిట్నెస్ కలిగి క్రమశిక్షణతో ఎదుటివారికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్ అ ధికారుల పాత్ర కీలకమని, 24గంటలు అప్రమత్తంగా ఉండాలని, డయల్ 100కు ఫోన్ రాగానే నిర్ణీత సమయంలో సంఘటన స్థలానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాలని సూ చించారు. ఎస్బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, సీఐలు, ఎస్సైలు, వర్టికల్ ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
● సులభ బోధన కోసమే వినియోగం ● జిల్లాలో ఆరు పాఠశాలల్లో అమలు ● త్వరలో ప్రారంభానికి సన్నాహాలు
ఆరు పాఠశాలలు ఎంపికజిల్లాలో ఏఐ ఆధారిత బోధనకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరు పాఠశాలలు ఎంపికయ్యా యి. సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేస్తారు. కంప్యూటర్లలో పొందుపరిచిన సాఫ్ట్వేర్ను అనుసంధానం చేస్తా రు. కృత్రిమ మేధస్సు సహకారంతో విద్యార్థులు చదవడం, రాయడం విధానంలో పొరపాట్లను మదింపు చేసి విద్యార్థులకు వివరిస్తుంది. ఏఐ బోధన అమలుపై జిల్లా నుంచి నలుగురు రిసోర్స్పర్సన్లు శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లారు. త్వరలోనే ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు అమలులోకి రానున్నాయి. – యాదయ్య, జిల్లా విద్యాధికారిరిసోర్స్ పర్సన్లకు శిక్షణజిల్లా నుంచి ఏఐ బోధన అమలుపై నలుగు రు సభ్యులతో కూడిన బృందానికి అవగాహన కల్పించారు. బృందంలో సెక్టోరియల్ అధికారి, ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఎస్జీటీలను రిసోర్స్పర్సన్లుగా నియమించారు. వీరందరికీ మంగళవారం హైదరాబా ద్లో కృత్రిమ మేధపై శిక్షణ ఇచ్చారు. సాఫ్ట్వేర్ డౌన్లోడ్, అప్డేట్ చేయడం, కంప్యూటర్లలో పొందపరిచిన సాఫ్ట్వేర్ను అనుసంధానం, ఏఐ బోధన సమగ్రవంతంగా అమలు, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన బృంద సభ్యులు జిల్లాలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో టీచర్లకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ పర్యవేక్షించనున్నారు. మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) బోధన అందుబాటులోకి తెస్తోంది. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరు పాఠశాలల ను ఇందుకు ఎంపిక చేశారు. ఎంపికై న పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చేప్పేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యంగా ఏఐ బోధన సాగనుంది. ఎఫ్ఎల్ఎన్కు సాంకేతికత జోడించి విద్యార్థుల్లో స్వీ య ప్రేరణ కలిగించి అభ్యసన అనుకూల పరిస్థితి కల్పించేందుకు ఏఐ బోధన వారం చివరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆరు పాఠశాలల్లో అమలు విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృతిమ మేధ స్సు సహకారం తీసుకోవాలని అధికారులు నిర్ణయించి తగిన కసరత్తు పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన అమలుకు జిల్లాలో ఆరు పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఇందులో ఎంపీపీఎస్ వెంకట్రావ్పేట్, ఎంపీపీఎస్ రా పల్లి, ఎంపీపీఎస్ ముడిమడుగు, ఎంపీపీఎస్ ఏపీ వాడ చెన్నూర్, ఎంపీపీఎస్ దుగ్నేపల్లి, ఎంపీపీఎస్ చాకెపల్లి పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలకు ఐదు కంప్యూటర్లను విద్యాశాఖ అధికారులు సమకూర్చాల్సి ఉంది. విద్యార్థులు తెలుగు, ఆంగ్లం బాగా చదివి.. రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించేందుకు కృతిమ మేధ బోధన దోహదపడనుంది. ప్రతీ పాఠశాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతిలో వెనుకబడిన 10మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వారంలో 80నిమిషాల పాటు కేటాయించిన టైంటేబుల్ ప్రకారం ఏఐ బోధన సాగనుంది. తెలుగు, ఆంగ్లం, గణితంపై ప్రతీ విద్యార్థి కంప్యూటర్ మీద సాధన చేయాల్సి ఉంటుంది. ప్రతీ సాధన రికార్డు కానుంది. దీంతో విద్యార్థుల ప్రగతి అంచనా వేయడం సులభతరం కానుంది. ప్రస్తుతం ఉన్న సిలబస్ను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్లకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపిస్తారు. వీటికి ఆన్లైన్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్పై వచ్చే వాక్యం(సెంటెన్స్) తప్పుగా అభ్యసనం చేసినప్పుడు సరిద్దిద్దుకునే వీలు కలుగనుంది. దీంతో విద్యార్థులు మళ్లీ ఆ తప్పు చేయకుండా ముందుకు వెళ్లేలా భయం లేకుండా సొంతంగా నేర్చుకునేందుకు వీలవుతుంది. -
సింగరేణి కార్మికుల పింఛన్ పెంచాలి
శ్రీరాంపూర్: బొగ్గుగని రిటైర్డు కార్మికులకు ఇ ప్పుడిస్తున్న పింఛన్ ఏమాత్రం సరిపోవడం లే దని, పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లోకసభ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఆ యన ప్రశ్నోత్తరాల సమయంలో రిటైర్డు కార్మి కుల పింఛన్ సమస్యపై మాట్లాడారు. 35ఏళ్ల క్రి తం కాక వెంకటస్వామి బొగ్గుగని కార్మికులకు పింఛన్ హక్కు కల్పించారని, అప్పటి నుంచి పెంచలేదని, రూ.1500 మాత్రమే ఇప్పటికీ పొందుతున్నారని అన్నారు. సింగరేణి కార్మికులు తెలంగాణ కోసం కొట్లాడారని, దేశం కో సం వెలుగు ఇస్తున్న కార్మికుల జీవితం ఉద్యోగ విరమణ తర్వాత చీకట్లో మగ్గుతోందని తెలి పారు. దశాబ్దాల క్రితం నిర్ణయించిన పింఛన్ ఇప్పుడెలా సరిపోతుందని, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
కిడ్నీలు జర భద్రం..!
మంచిర్యాలటౌన్: జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని డయాలసిస్ కేంద్రాలకు రోగుల తాకిడి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను మూత్రపిండాలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. బీపీ, ఎలక్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. కానీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు డయాబెటీస్, హైబీపీ వంటి వ్యాధుల కారణంగా కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీంతో శరీరం మొత్తానికి ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయి. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం, బీపీ, షుగర్ వంటి వాటిని అదుపులో ఉంచుకుంటే మూత్రపిండాల వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని, ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ రోజు 90మందికి పైగా రోగులు డయాలసిస్ చేయించుకుంటున్నారంటే వ్యాధి తీవ్రత అర్థమవుతోంది. నేడు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో.. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డయాలసిస్ కేంద్రాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ చేస్తున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పది పడకలు ఉండగా రోజుకు 28మందికి, బెల్లంపల్లి ఆస్పత్రిలో ఐదు పడకలు ఉండగా ఎనిమిది మందికి, చెన్నూర్లో ఐదు పడకలు ఉండగా 10మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఇప్పటివరకు మంచిర్యాలలో 10,330 మంది, బెల్లంపల్లిలో 7,172మంది, చెన్నూర్లో 3,010మంది డయాలసిస్ చేయించుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచితంగా డయాలసిస్ చేస్తుండగా.. ఆరోగ్యశ్రీ లేని వారు ప్రైవేటు ఆస్పత్రల్లో నెలకు రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పాడైన మూత్రపిండాలకు చికిత్స తీసుకున్నా పూర్తి సమర్థవంతంగా మారవు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. కిడ్నీని మార్పిడికి దాతలు దొరకడం కష్టం కాగా, ఆపరేషన్ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రభుత్వ, ప్రైవేటు డయాలసిస్ కేంద్రాలకు రోగుల తాకిడి నేడు వరల్డ్ కిడ్నీ డేనీరు ఎక్కువగా తాగాలిప్రాథమిక దశలోనే కిడ్నీ సమస్యలను గు ర్తించి చికిత్స తీసుకుంటే డయాలసిస్ వరకు వెళ్లే ప్రమాదం ఉండ దు. ఎక్కువగా నీరు తాగుతూ నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్గా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవడంలో భాగంగా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, చేపలు, చిలగడ దుంపలు, కాలిఫ్లవర్, పండ్లు ఆహారంగా తీసుకోవాలి. ధూమపానం, ఆల్కాహాల్ తాగడం, గుట్కా, కర్ర నమలడం, చుట్ట తాగడం, పెయిన్ కిల్లర్ మందులు గాని, డాక్టర్ అనుమతి లేకుండా హైడోస్ మందులు తీసుకోవద్దు. ఉప్పు తగ్గించి, తగినంత నీరు, పౌష్టికాహారం తీసుకుంటూ శరీర బరువు, గుండె పనితీరు అదుపులో ఉంచుకోవాలి. మూడు నెలలకు ఒకసారి కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ రాకేశ్కుమార్ చెన్న, నెఫ్రాలాజిస్టు, మంచిర్యాల -
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో ట్రాఫిక్ సమస్య పరి ష్కారానికి తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని మెయిన్ బజార్, అంబేడ్కర్ చౌర స్తా ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌరస్తాతోపాటు మెయిన్ రోడ్డు, ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయరాదని అ న్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఐదు మీటర్ల దూరం వరకు ఎలాంటి వాహనాలు పా ర్కింగ్ చేయకుండా చూడాలని వన్టౌన్ ఎస్ హెచ్వో దేవయ్యను ఆదేశించారు. అనంతరం వన్టౌన్, టూటౌన్ పోలీసుస్టేషన్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, వన్టౌన్ ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
కోల్ కంట్రోల్ అధికారుల తనిఖీ
శ్రీరాంపూర్: సెంట్రల్ కోల్ కంట్రోల్ అధికారులు బుధవారం శ్రీరాంపూర్లో మూసివేసిన ఆర్కే8 గనిని తనిఖీ చేశారు. ఆ శాఖ నాగపూర్ రీజియన్ ఓఎస్డీ సందీప్ ఎస్ పరాంజ పే, కొత్తగూడెం రీజియన్ ఓఎస్డీ డీవీ సుబ్రమణ్యం ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్తో కలిసి గని మూసి వేసిన తర్వాత తీసుకున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. భూసార పరిరక్షణ ఏ విధంగా చేశారు, పచ్చదనం పెంపులో భాగంగా నాటిన మొక్కలు, గని మ్యాన్వే, ఇతర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా వేసిన కంచెను పరిశీలించారు. ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, గ్రూప్ ఏజెంట్ కే.రాజేందర్, ఎన్వి రాన్మెంట్ అడిషనల్ మేనేజర్ వీ.తిరుపతి, ఆర్కే 7గని మేనేజర్ ఈ.తిరుపతి, అధికారులు శేఖర్, వరలక్ష్మీ, చంద్రమణి పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ నీరందించేలా చర్యలు
చెన్నూర్రూరల్: ‘బావురుమంటోన్న బావురావుపేట’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించారు. బుధవారం మండలంలోని బావురావుపేట గ్రామంలో ఎస్టీ కాలనీని సందర్శించారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి మిష న్ భగీరథ నీరు రెండు పూటల సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని డీఈ విద్యాసాగర్ తెలిపా రు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సరిత, పంచాయతీ కార్యదర్శి రమణ పాల్గొన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
సహజ హోలీ.. సంతోషాల కేళి
● ఇప్పటికీ మోదుగుపూల రంగులే వాడుతున్న ఆదివాసీలు ● రసాయనాలతో ముప్పుఅడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలు జరుపుకునే ప్రతీ పండుగకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. అందరిలా కాకుండా వారంతా ప్రత్యేకంగా వైవిధ్యంగా పండుగలు జరుపుకుంటారు. శుక్రవారం హోలీ పండుగను కూడా ప్రత్యేకంగా జరుపుకునేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. హోలీ వేడుకల్లో ప్రత్యేకంగా మోదుగుపూలతో తయారు చేసిన రంగులతో రంగోలి ఆడడం ఆనవాయితీగా వస్తోంది. రేపు శుక్రవారం సంబరాలకు ఉమ్మడి జిల్లావాసులు సిద్ధమయ్యారు. వేడుకల్లో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన పూరిత రంగులు ఆరోగ్యానికి హానికరమని, సహజ సిద్ధమైన రంగులు వాడడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. – కెరమెరి/నిర్మల్చైన్గేట్/నిర్మల్ఖిల్లాకుడుకలు ఇస్తే లెక్క మార్పుకోసం కృషి రసాయన రంగులు మానుకోవాలి. ప్రకృతిలో దొరికే పూలు, ఆకులతో తయారయ్యే రంగులను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా పర్యావరణాన్ని కాపాడినట్టే. ఇదే విషయం మా పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యేలా చెబుతున్నా. వారితో స్వయంగా సహజసిద్ధమైన రంగులు తయారు చేసే విధానం నేర్పిస్తున్నా. – వీఎస్ శ్రీనివాస్, ఎంపీపీఎస్ వెంకటాపూర్, మామడ, నిర్మల్ రసాయన రంగులతో ముప్పు రసాయన రంగులతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో మంట, దురద వస్తాయి. రంగుల నుంచి వచ్చే పొగ పీల్చుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సమస్యలతో పాటు శ్వాస సంబంధిత వ్యాధుల ముప్పు ఉంటుంది. – డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్, నిర్మల్ కృత్రిమ రసాయనాలతో ప్రమాదంరంగులు ఏవైనా కళ్లల్లో పడకుండా జాగ్రత్త పడాలి. హానికర రసాయనాలతో కూడిన రంగులతో రెటినా దెబ్బతినే ప్రమాదం ఉంది. అల్సర్లు, పుండ్లు ఏర్పడి శాశ్వతంగా కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది. – సురేశ్, కంటి వైద్యనిపుణుడు, నిర్మల్ తాతాలకాలం నుంచి.. మోదుగ పూలతో రంగులు తయారు చేసుకుని చల్లుకోవడం తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. ఇప్పటికీ మేము ఇదే ఆచారాన్ని పాటిస్తున్నాం. ఎన్ని రంగులు బయట నుంచి తీసుకవచ్చినా మోదుగు పూ లతో తయారు చేసిన రంగులతో సరిపోవు. – సెడ్మకి దుర్పతబాయి, మాజీ జెడ్పీటీసీ పూర్వీకుల నుంచి.. ఉట్నూర్రూరల్/ఇంద్రవెల్లి: మా చిన్నతనం నుంచి హోలి పండుగ వచ్చిందంటే ప్రకృతి ప్రసాదించిన మోదుగ పూలతోనే రంగులు ఆడుతాం.. తెల్లవారు జామున నిద్రలేచి అడవికి వెళ్లి పూలు తెచ్చి రంగులు తయారు చేస్తాం. మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. – పెందూర్ చందు, సమాక, ఇంద్రవెల్లి రాబోయే తరానికి.. ఉట్నూర్రూరల్/ఇంద్రవెల్లి: మార్కెట్లో లభించే రంగులు వాడితే అనేక రోగాలు వస్తాయని, అవి వాడవద్దని, అడవిలో లభించే మోదుగు పూలతో తయారు చేసిన రంగులనే వాడాలని మాపిల్లలకు నేర్పిస్తున్నాం. రాబోయే తరానికి కూడా నేర్పిస్తున్నాం. – భీంరావు, సమాక, ఇంద్రవెల్లి పూలతో నిండుగా ఉన్న మోదుగు చెట్టుఅనాదిగా వస్తున్న ఆచారం ఆదివాసీలు ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తున్నారు. అనేక పండుగలను వైవిద్యంగా జరుపుకుంటున్నప్పటికి ఈ హోలి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గతంలో బయట మార్కెట్లో ఎక్కడ కూడా అనుకున్న విధంగా రంగులు లభించేవి కాదు. అందుకు వీరంతా ప్రకృతి ప్రసాదించిన మోదుగు పూలనే రంగులకు వాడుకునేవారు. ఈ పూలు మార్చి నెలలో మాత్రమే ఉంటాయి. రంగుల తయారీ ఇలా.. హోలీకి ఒక రోజు ముందు మోదుగ పూలను తీసుకువచ్చి నీటిలో నానబెడతారు. తెల్లవారు జామున రోట్లో వేసి రోకలితో దంచుతారు. లేదా గ్రైండింగ్ చేస్తారు. ఆతర్వాత నీటిలో కలిపి హోలీ ఆడుతారు. సహజ రంగులైతే మేలు.. సహజ సిద్ధమైన రంగులు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో వివిధ రకాలైన రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో ఎలాంటి హాని జరగదు. దానిమ్మ, టమాటతో ఎరుపు రంగు, మోదుగుపూలు, క్యారెట్తో ఆరెంజ్ రంగు, బీట్ రూట్ ఊదారంగు, ఆకు కూరలతో ఆకుపచ్చ రంగు, పసుపు కొమ్ములతో పసుపు రంగు ఇలా సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకోవచ్చు. తాతమ్మ నేర్పిన మార్గంలోనే... నిర్మల్ఖిల్లా: మోదుగ పూలు ఆరోగ్యరీత్యా పలు సుగుణాలు కలిగి ఉన్నాయి. నేను చిన్నప్పుడు దుకాణాల్లో కొనుగోలు చేసిన రంగులను వినియోగించే సందర్భంలో మా తాతమ్మ వాటికి బదులుగా మోదుగు పూలను తెచ్చి నానబెట్టి ఉడికించిన తర్వాత చేసిన కాషాయవర్ణపు సహజ సిద్ధ రంగులను వినియోగించమని ప్రోత్సహించేది. అలా నాకు దీని తయారీ అలవాటైంది. ఇప్పటికీ నా పిల్లలకు ఇదే సంప్రదాయాన్ని నేర్పిస్తూ కొనసాగిస్తున్నా. – నల్ల మన్మోహన్రెడ్డి, సేంద్రియ రైతు, చించోలి(బి), నిర్మల్● రంగుల్లో పాదరసం, సిలికా, మైకా, సీసం, వంటి వివిధ రకాల రసాయనాలు కలుపుతారు. ఇవి చర్మానికి, కళ్లకు, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ● రంగుల పొడి చల్లినప్పుడు అవి గాలిలో కలిసి పోయి నోటిలోకి, శ్వాసనాళాల్లోకి వెళ్లి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. గాలి పీల్చినప్పుడు ఈ రంగులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అస్తమా, ఎలర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ● రసాయన రంగులతో శరీరం దురద, మంట, నొప్పి కలుగుతుంది. కళ్లలో రంగులు పడితే కంటి పొరలు దెబ్బతినే అవకాశం ఉంది. ● రంగులు నోట్లోకి వెళ్తే వాంతులు, విరోచనాలు అవుతాయి. కడుపునొప్పి వస్తుంది. ● నలుపురంగులో లెడ్ ఆకై ్సడ్తో మూత్రపిండాల వైఫల్యాలకు దారితీస్తుంది. ● కృత్రిమ ఆకుపచ్చ రంగుతో కాపర్ సల్ఫేట్ కంటి దురద, వాపు వైఫల్యాలకు దారితీస్తుంది. ● వెండి రంగు అల్యూమినియం బ్రోమైడ్ క్యాన్సర్ కారకం. ● నీలి రంగు చర్మ సంబంధ వ్యాధులు, మెర్క్యూరీ సల్ఫేట్ (ఎరువు) క్యాన్సర్కు కారణమవుతుంది. ● పౌడర్లు, గులాల్, లెడ్, బ్రోమియం, నికెల్, మెర్క్యురీ, కాపర్, జింక్, వినిడికి లోపం, ఎలర్జీ, ఆయాసం మొదలగు దుష్ఫలితాలకు దారితీస్తాయి. రసాయన రంగులతో ప్రమాదం.. కెరమెరి/ఇంద్రవెల్లి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయం ప్రకారం హోలీకి ముందురోజు గ్రామ పటేల్, దేవారికి గ్రామస్తులంతా కుడుకలు ఇస్తా రు. ఇలా కుడుకలు ఇచ్చిన వారే గ్రామస్తులుగా పరిగణించబడుతారు. గ్రామంలో ఉండి కూడా కుడుకలు ఇవ్వని వారికి గ్రామంతో సంబంధం లేదని గుర్తిస్తారు. ఈ కార్యమంతా కాముని దహ నం రోజు జరుగుతుంది. గురువారం సాయంత్రం జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఈ ఆచారం కొనసాగుతుంది. కుడుకలతో పాటు చక్కెర బిళ్లలు గ్రామ పటేల్, దేవారికి అందజేస్తారు. అనంతరం వాటిని లెక్కిస్తారు. వాటి ప్రకారం గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాటికి సమానంగా కుడుకలు, పేర్లు వచ్చాయో లేదో పరిశీలిస్తారు. పులారా అలంకరణ వెదురు కర్రలతో రెండు పులారాలను తయారు చేస్తారు. వాటికి ఐదుచోట్ల కుడుకలు, గారెలు, గోగుపూలు, చక్కెర బిళ్లలు, వంకాయ అమరుస్తారు. అనంతరం గ్రామ పొలిమేర వరకు డోలు, సన్నాయిలతో తరలివెళ్లి కాముని దహనం చేస్తా రు. అనంతరం రెండు వెదుర్లకు వృద్ధుడు, వృద్ధురాలు అని నామం పెట్టి ఆ పులారాలను కడుతా రు. కిందిభాగంలో మంట అంటిస్తారు. ఆ తర్వా త ఆ మంట పై నుంచి వరుసగా కొందరు దూకుతారు. అనంతరం గ్రామంలోని ప్రతీ కుటుంబం నుంచి రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముని దహనం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆతర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. కాముడిని దహనం చేసిన చోటే రాత్రంతా బస చేస్తారు. కేరింతలకూ..చరిత్ర! హోలీ రోజు ప్రతీ గ్రామంలో రంగులు చల్లుకుంటారు. కానీ ఆదివాసీ గిరిజనుల మాత్రం అందుకు కొంత భిన్నంగా ఉంటారు. రంగులు చల్లుకోవడంతో పాటుగా డోలు వాయిస్తూ.. జాజిరి ..జాజిరి.. బోబోబోబో.. అంటూ కేరింతలు పెడతారు. రావణాసురునిపై శ్రీరాముడు బాణం విసిరినప్పుడు అది తప్పిపోవడంతో రావణ సైన్యం అలాగే కేరింతలు పెట్టిందని, రావణుడు మరణించాక ఆ ఆనందంలో రాముని సైన్యం ఇలా తిరిగి కేరింతలు పెడుతూ ఉత్సాహంగా జరుపుకుంటారు. దానికి ప్రతీకగా ఈ కేరింతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పటేళ్లు చెబుతున్నారు. బూడిదకు అత్యంత ప్రాధాన్యం కాముడి దహనం తర్వాత అట్టి బూడిదను ఆది వాసీ సంప్రదాయం ప్రకారం ఇళ్ల ముఖద్వారాల వద్ద గీత వేస్తారు. అలా వేస్తే ఎలాంటి దుష్టశక్తులు తమ ఇళ్లకు రావని ఆదివాసీల నమ్మకం. అంతేకాకుండా దండారీ ఉత్సవాల్లో కాముడి బూడిదకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గుస్సాడీ వేషధారణలో ఈ బూడిదను ఉపయోగిస్తారు. నేడు పులారా.. రేపు దురాడి సంప్రదాయబద్ధంగా కాముడి దహనం డోలు, బాజాలతో తరలివెళ్లనున్న ఆదివాసీలు కామున్ని దహనం చేసిన చోటే రాత్రంతా బస పాటించాల్సిన జాగ్రత్తలు చర్మానికి రంగులు పట్టుకోకుండా ముందస్తుగా ఆవాల నూనె, జెల్లీని రాసుకోవాలి. కళ్లకు అద్దాలు పెట్టుకుంటే రంగునీళ్లు కళ్లలో పడకుండా ఉంటాయి. హోలీ ఆడిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే చేతి గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తాత, ముత్తాతల నుంచి.. మాతాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారమిది. అన్ని గ్రామాల్లోని ఆదివాసీలు ఈ పండుగలకు అతీతులే. ప్రతిఒక్కరూ ఈ ఆచారాన్ని పాటించాల్సించే. కానీ హోలి, దురాడి కార్యక్రమాల్లో మహిళలు అంతగా పాల్గొనరు. ఎక్కువగా ఈ కార్యక్రమాలను పురుషులు మాత్రమే జరుపుకుంటారు. – రాధాబాయి, చౌపన్గూడఅన్ని పండుగలకు భిన్నంగా.. అన్ని పండుగలకంటే హోలి, దురాడి చాలా భిన్నంగా జరుపుకుంటాం. అంతా ఒక్కటై కాముని పున్నమిని జరుపుకుంటాం. కుడుకల ఆచారం చాలా ముఖ్యం. గ్రామ పటేల్కు కుడుకలు ఇస్తేనే ఆ గ్రామంలో ఉన్నట్టు. లేదంటే లేనట్టే. కాముని దహనం తర్వాత అక్కడే బస చేస్తాం. – దంబీరావు, గ్రామ పటేల్, చిన్న సాకడ -
కొలువుల సాధనలో మేటి అశోక్
● చదివిన కళాశాలలోనే జూనియర్ లెక్చరర్గా ఉద్యోగంకాసిపేట: కష్టపడి చదివి నాలుగు ఉద్యోగాలు సాధించడంతో పాటు తాను విద్యను అభ్యసించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే జేఎల్గా ఉద్యోగం సాధించాడు జిల్లాకు చెందిన పెద్ది అశోక్. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కొండపూర్కు చెందిన రిటైర్డ్ సింగరేణి కార్మికుడు పెద్ది పెంటయ్య, మధునమ్మ దంపతుల కుమారుడు అశోక్ 2012లో ఫారెస్టు బంగ్లా వాచర్ పరీక్షలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి ర్యాంకుతో ఉద్యోగం సాధించాడు. కొలువు చేస్తూనే 2016లో ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగో ర్యాంకు సాధించాడు. 2024లో జరిగిన గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించి నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల వెలువడిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాల్లో హిస్టరి సబ్జెక్టులో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించి బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నాడు. తాను ఇంటర్ చదివిన కాసిపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఎల్గా పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నాడు. 1 నుంచి పదోతరగతి వరకు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన అశోక్ ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కాసిపేటలో సీఈసీ, డిగ్రీ ప్రభుత్వ జూనియర్ కళాశాల మంచిర్యాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజీ హైదరాబాద్లో పూర్తి చేశాడు. కాగా పీజీ ఎంట్రెన్స్లో సైతం మూడవ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నాడు. ఉద్యోగాల సాధనలో పట్టుదలతో ముందుకు వెళ్లడంతోనే విజయం సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్లో గ్రూప్1 సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తానని, అందుకు ప్రిపరేషన్ ప్రారంభించనున్నట్లు అశోక్ పేర్కొన్నాడు. -
బైక్లు ఢీకొని ఒకరికి గాయాలు
కడెం: మండల కేంద్రంలోని ఎస్బీఐ సమీపంలో బుధవారం రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు దస్తురాబాద్ మండలం మున్యాల్కు చెందిన ఇద్దరు యువకులు ఇంటర్ పరీక్షలు రాసేందుకు ద్విచక్ర వాహనంపై కడెం వస్తుండగా ఽఎస్బీఐ బ్యాంక్ వైపు నుంచి బైక్పై వస్తున్న ధర్మాజీపేట్ గ్రామానికి ఎల్ల య్య బైక్ను ఢీకొట్టారు. ఘటనలో ఎల్లయ్య కాలుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. బావిలోపడి యువకుడు మృతికౌటాల: ప్రమాదవశాత్తు బావిలోపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మొగడ్దగడ్కు చెందిన ఉ ర్వత్ దౌలత్ (26) కొంతకాలంగా మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. మంగళవారం మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తల్లి నిర్మలబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కలిసికట్టుగా ఆడితేనే విజయం
● హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్రెడ్డిఆదిలాబాద్: క్రీడాకారులు కలిసికట్టుగా పట్టుదలతో ఆడితేనే విజయం సాధ్యమని హాకీ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మేజర్ ధ్యాన్చంద్ హాకీ ఫీల్డ్లో ఏర్పాటు చేసిన హాకీ ఉమ్మడి జిల్లాస్థాయి సీనియర్ పురుషుల ఎంపిక పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికతో ఆడితే విజయం సులభం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను కనబరుస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. నిరంతరం సాధన చేస్తూ క్రీడా నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జరిగే 8వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ప్రాతి నిధ్యం వహిస్తారన్నారు. వారికి మేనేజర్గా డేవిడ్ రాజు, శిక్షకునిగా జే.రవీందర్ వ్యవహరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాస్, సీనియర్ ప్లేయర్ అతుల్, పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వీరే.. కొడప జంగు, వెట్టి జాకు, వెట్టి భీమ్రావ్, పవార్ అమర్నాథ్, విజయ్రెడ్డి, సుదర్శన్, హాడ్సే గజానంద్, చౌహన్ వంశీ, మెస్రం అజయ్, శేఖర్, సంగం గౌతమ్, రామ్కుమార్, కిరణ్ కుమార్, పెద్దివార్ శ్రీనివాస్, అశోక్, షేక్ మహమ్మద్, కొడప ప్రదీప్, ఆత్రం జగ్జీవన్ ఉన్నారు. -
సారీ మమ్మీ.. జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేను..
మంచిర్యాల: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సాయంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపార -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. -
‘సైబర్’ కుట్ర భగ్నం
● ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కేసు ● పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ● 2,125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్ ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ను ఎస్పీ అభినందించారు. -
కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి
శ్రీరాంపూర్: కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యజమాన్యాన్ని కోరారు. మంగళవారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుర్తింపు సంఘం నుండి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరీ కొమురయ్య, తదితరులు హాజరై సమస్యలపై చర్చించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో జీఎల్ బంకర్, సైట్ ఆఫీస్ వద్ద మరుగుదొడ్లు, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఇందారం 1ఏ గనిపై కార్మికులకు స్నానం గదులను ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఏరియా ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) భీబత్సా, ఓసీపీ పీఓలు టీ శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్రావు, డీజీఎంలు అరవిందరావు, ఆనంద్ కుమార్, ఏజెంట్లు శ్రీధర్, రాజేందర్, వెంకటేశ్వర్లు, అధికారులు డాక్టర్ రమేశ్బాబు, మల్లయ్య, కిరణ్ కుమార్, దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కొట్టే కిషన్ రావు, ప్రసాద్ రెడ్డి, నరసయ్య, రాంచందర్ పాల్గొన్నారు. యువతి ఆత్మహత్యశ్రీరాంపూర్: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల మేరకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే 6 హట్స్ ఏరియాకు చెందిన మేరుగు సౌమ్య (22)కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. యువతి తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందగా తల్లి కీర్తనతో కలిసి ఉంటుంది. సోమవారం సా యంత్రం కీర్తన సంతకు వెళ్లిన సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంటి పైకప్పుకు ఉరేసుకుంది. తనకు పెళ్లంటే ఇష్టం లేదని, జీవితంలో ఇంకో స్టెప్ తీసుకోలేనని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, సారీ మమ్మీ.. సారీ డాడి అని లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎస్టీపీపీకి అవార్డు
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)ను మరో అవార్డు వరించింది. మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ ఎఫీషియెన్సీ అవార్డ్స్–2025లో భాగంగా ఏడో సంవత్సరానికి గాను నెట్ హీట్ రేట్ తగ్గింపు కేటగిరీలో 1000మెగావాట్లపైన గల దక్షిణ భారత థర్మల్ పవర్ ప్లాంట్లలో ఎస్టీపీపీకి బెస్ట్ ఎనర్జీ ఎఫీషియెంట్ ప్లాంటు–2025 అవార్డు లభించింది. ఒక కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పతికి అవసరమయ్యే హీట్ను నెట్ హీట్ రేట్గా పరిగణిస్తారు. హీట్ రేట్ ఎక్కువగా ఉంటే బొగ్గు వినియోగం కూడా పెరిగి తద్వారా ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. ఎస్టీపీపీలో వినియోగిస్తున్న సాంకేతికత వల్ల తక్కువ హీట్ రేట్తోనే ఒక కిలోవాట్ అవర్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మేరకు ఎస్టీపీపీ నుంచి డీజీఎం మహేందర్ గోవాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. వరుసగా అవార్డు అందుకోవడంపై సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ ఇంచార్జీ ఈడీ శ్రీనివాసులు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. -
38.0 /23.0
గరిష్టం/కనిష్టంఇసుక బంగారమాయె! ఇసుక రవాణాకు అనుమతి లేక 18 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ప్రహరీ నిర్మాణాలు నిలిచాయి. అధికారుల అనుమతి కోసం నెలరోజులుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు.9లోu వాతావరణం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం ఉక్కగా ఉంటుంది. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చలి తగ్గుతుంది. -
భూసుపోషణ నిర్వహణపై సన్నాహక సమావేశం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా గ్రామ వికాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని మాధవ నిలయంలో భూసుపోషణ కార్యక్రమాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ ఉగాది పండుగ నుంచి నెలపాటు భూసుపోషణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లోని రైతులను భాగస్వాములను చేస్తూ సేంద్రియ సాగులోనూ రా ణించేలా చూడాలని సంకల్పించారు. తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ సత్యనారాయణరెడ్డి, జిల్లా కార్యవాహక్ రాజేశ్, జిల్లా సంయోజక్ కృష్ణభాస్కర్, సహ సంయోజక్ బొలిశెట్టి తిరుపతి, సభ్యులు వెంబడి కిషన్, బక్కయ్య, తిరుపతి పాల్గొన్నారు. -
బీసీ మహిళలకు ఉపకోటా ప్రకటించాలి
పాతమంచిర్యాల: మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ఉప కోటా ప్రకటించాలని బీసీ హక్కుల పో రాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సూ పరింటెండెంట్ సంతోష్కు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 60 శాతం బీసీ జనాభా ఉంటే ఇందులో సగం మంది బీసీ మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు సముచిత స్థానం లభించలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్తో మహిళా బిల్లు తీసుకురావాలని చూస్తోందని పేర్కొన్నారు. ఇందులో బీసీ మహిళలకు 18శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల వాటా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అంకం సతీశ్, భీంసేన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–2లో మెరిసిన మనోళ్లు
టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారుసైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.250 ర్యాంక్ సాధించిన అశోక్కుమార్● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ర్యాంకులు191 ర్యాంకు సాయిరాం కౌటాల: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్–తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ గ్రూప్–2లో 383 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించాడు. సాయిరాం ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–4లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ కావడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్లో 436 మార్కులు సాధించాడు. 97వ ర్యాంక్ లెక్కల శ్రావణ్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. 2019లోనే జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్తో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన శ్రావణ్ సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గతేడాది గ్రూప్–4లో జిల్లాస్థాయిలో 11వ ర్యాంక్ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో 394 మార్కులతో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులు సాధించాడు. మెరిసిన ‘బజార్హత్నూర్’ యువకులు బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్, సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్కుమార్ 404 మార్కులతో రాష్ట్రస్థాయిలో 51వర్యాంకు సాధించాడు. ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన బుద్దేవార్ రాధ, నర్శింహులు దంపతుల కుమారుడు బుద్దేవార్ ముఖేష్ గ్రూప్–2 ఫలితాల్లో 418 మార్కులతో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి, 2021లో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–2లో ఫలితాల్లో 380 మార్కులతో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 399 మార్కులు సాధించాడు. సోదరుడు శ్రీకాంత్ అందించిన సహకారంతో గ్రూప్–1, 2 పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించినట్లు అశోక్ కుమార్ పేర్కొటున్నాడు.337వ ర్యాంకు సాధించిన వెంకటేశ్ నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన పోలంపల్లి వెంకటేశ్ గ్రూప్–2 ఫలితాల్లో 375 మార్కులతో రాష్ట్రస్థాయిలో 337వ ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్వో పరీక్షలలో ఉమ్మడి జిల్లా టాపర్గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. 19వ ర్యాంక్ శివకృష్ణ ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: కుమురంభీం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోన్స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సత్యనారాయణ స్థానిక సరస్వతి శిశుమందిర్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి ట్రిపుల్ఐటీలో సీటు సాధించాడు. గతేడాది ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సత్తా చాటిన యువకులు నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన యువకులు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటారు. చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల కుమారుడు సురేష్రెడ్డి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించగా మండల మురళిగౌడ్, ఉష దంపతుల కుమారుడు సుమంత్ 172వ ర్యాంకు సాధించాడు. సురేష్రెడ్డి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూపు–2లో ర్యాంకు సాధించాడు. సుమంత్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.188వ ర్యాంకు సాయికృష్ణ సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన బట్టు నర్సన్న–సురేఖ దంపతుల కుమారుడు సాయికృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో 188వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు. నర్సన్న స్థానికంగా బిజినెస్ చేస్తుండగా సురేఖ దేగాం ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్విర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఉన్న సాయికృష్ణ ఇంటర్ హైదరబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే విజయం సాధించానని పేర్కొన్నాడు. గ్రూప్–1 ఫలితాల్లో సత్తా నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రవోతు శ్యామల, ముత్తన్న దంపతుల కుమారుడు సాయి ప్రణయ్ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 557 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. సాయి ప్రణయ్ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్లోని గురుకులంలో, ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజీలో, బీటెక్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించాడు.గోలేటివాసికి 229వ ర్యాంకు రెబ్బెన: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరికి చెందిన కామ్రే రావూజీ, లహనుబాయి దంపతుల కుమారుడు భాస్కర్ రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రూప్–2 కోసం సంసిద్ధమయ్యాడు. ఆన్లైన్లో కోచింగ్, సొంత ప్రిపరేషన్తో గ్రూప్–2 ఫలితాల్లో 381.065 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 229 ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని భాస్కర్ అంటున్నాడు. శ్రావణ్కుమార్ -
ఎల్ఆర్ఎస్ కోసం హెల్ప్డెస్క్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్–2020 దరఖాస్తులకు సంబంధించిన హెల్ప్డెస్క్కు స్పందన లభిస్తోంది. మంగళవారం 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు, ఎంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది.. వా రి దరఖాస్తు ఎక్కడ పెండింగ్ ఉంది.. తదితర వివరాలు తెలుసుకునేందుకు అధికసంఖ్యలో వచ్చారు. వారి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో, కార్పొరేషన్ పరి ధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వందశా తం పూర్తి చేసేందుకు టౌన్ ప్లానింగ్ అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు గడువు పెంపు మంచిర్యాలఅర్బన్: ఆరు నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20వరకు పొడిగించినట్లు రాజీవ్నగర్ మోడ ల్ స్కూల్ ప్రిన్సిపాల్ బుచ్చన్న ఓ ప్రకటలో తెలిపారు. ఆరో తరగతిలో 100 సీట్లు, ఏడు నుంచి 10వ తరగతి వరకు మిగులు సీట్ల కోసం htpp//telanganams,cgg.gov. inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్టీ బాలుర హాస్టల్ తనిఖీ మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్టీ కళాశాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి (డీటీడీవో) అంబాజీ తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, రికార్డులు, వసతిగృహ పరిసరాలు, ఫర్నిచర్ను పరిశీలించారు. మెనూ అమలుపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఇబ్బంది గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని నిర్వాహకుడు లక్ష్మణ్ను ఆదేశించారు. -
చెన్నూర్ ప్రజలకు బతుకమ్మ వాగునీరే..
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీగా ఏర్పడ్డప్పటికీ ప్రజల తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు సరఫరా చేయకపోవడంతో మహిళలు బిందెలు, పురుషులు క్యాన్లు పట్టుకుని నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా సక్రమంగా నీటి సరఫరా లేక 60 ఏళ్లుగా బతుకమ్మ వాగు వద్ద గల సంపునీరే దిక్కవుతోంది. బతుకమ్మ వాగు, మిషన్ భగీరథ నీరు కొన్ని వార్డులకే సరఫరా అవుతుండటంతో జెండావాడ, మహంకాళివా డ, గంగపుత్ర కాలనీ, కాజీపూర, లైన్గడ్డ, ఇందిరానగర్, రజకవాడ, కుమ్మరిబొగుడ, శిశుమందిర్ కాలనీల వాసులు మైసమ్మ ఆలయం వద్ద గల బతుకమ్మ వాగు నుంచి వచ్చే నల్లా వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో గత నెల తాగునీరు కలుషితం కావడంతో బట్టిగూడెం, పద్మశాలివాడ, కొటబొగుడ కాలనీలకు చెందిన సుమా రు 100 మంది డయేరియా బారిన పడ్డారు. దీంతో కలెక్టర్ కుమార్ దీపక్ బతుకమ్మ వాగు సంపును సందర్శించారు. రెండురోజుల పాటు బతుకమ్మవాగు నీటిని నాలుగు వాడలకు నిలిపివేశారు. వాటర్ ప్లాంట్లతో పాటు బతుకమ్మ వాగు సంపు నుంచి వచ్చే నీటికి పరీక్షలు నిర్వహించారు. నీటి నాణ్యతలో ఎలాంటి లోపం లేకపోవడంతో నీటి సరఫరాను పునరుద్ధరించారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వాటర్ ప్లాంట్లున్నాయి. ప్లాంట్కు 500 లీటర్ల చొప్పున 10వేల లీటర్ల నీటిని విక్రయిస్తున్నారు. వేసవి వచ్చిందంటే మరో 5వేల లీటర్ల డిమాండ్ ఉంటుందని వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన మున్సిపాలిటీలో ప్రజలు 80శాతం మంది రోజుకు 20లీటర్ల ప్లాంట్ వాటర్ కోనుగోలు చేస్తున్నారు. మురికినీరు వస్తోంది బతుకమ్మ వాగు పైపులైన్ వేసి 60 ఏళ్లు దాటింది. దీంతో నల్లాల నుంచి మురికినీరు వస్తోంది. మైసమ్మ గుడి పక్కనున్న నల్లా నీటిని తెచ్చుకుంటున్నాం. మిషన్ భగీరథ నల్లాలు పేరుకే ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలి. – మండెల రమేశ్, జెండావాడ, చెన్నూర్ -
కంటి సమస్యల బారిన పడొద్దు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● విద్యార్థినులకు కళ్లద్దాల పంపిణీమంచిర్యాలఅర్బన్: విద్యార్థినులు కంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ లో 20మంది విద్యార్థినులకు కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్బీఎస్కే బృందాలతో జిల్లాలోని 568 పాఠశాలలు, 164 రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 1,274 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఓ ఆర్ఎస్ ఫ్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో హరీశ్రాజ్, జిల్లా వైద్యారోగ్యశాఖ ఉప వైద్యాధికారి అనిత, జిల్లా అంధత్వ నివారణాధికారి యశ్వంత్రావు, వైద్యాధికారులు ప్రసాద్, కృపాబాయి, వైద్యులు శ్వేత, చంద్రభాను, శిల్పశ్రీ, ఆప్తాల్మిక్ అధికారులు శంకర్, భాస్కర్రెడ్డి, ఎస్వో స్వప్న పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలిజైపూర్: విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్దీపక్ సూచించారు. జైపూర్ కేజీబీవీని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహం ఆవరణలో నూతనంగా చేపట్టిన కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. మెనూలో ఏం భోజనం పెడుతున్నారని ఆరా తీశా రు. వంట గదిలో పిల్లలకు అందించే భోజనం, వంటను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థినుల కు భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు భయం వీడి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం రసూల్పల్లి, నర్వ, టేకుమట్ల, కిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించి జాతీయ రహదారి పనుల పురోగతిని పరిశీలించారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో, సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతి బాపురావు, ఎస్వో ఫణిబాల తదితరులున్నారు. -
కన్నేశారో.. కాజేస్తారు!
● జిల్లాలో పెరిగిన బైక్ చోరీలు ● రెక్కీ నిర్వహిస్తూ అపహరణ ● ఈజీ మనీ కోసం అడ్డదారులు ● జాగ్రత్తే మేలంటున్న పోలీసులుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ మార్గాలు, శివారు కాలనీల్లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, రెస్టా రెంట్లు తదితర రద్దీ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం కొందరు నిలిపి ఉంచి న బైక్లు, ఆటోలతోపాటు లారీలను మాయం చే స్తున్నారు. ఈ నెల 1న జిల్లా కేంద్రంలోని సురభి గ్రాండ్ లాడ్జ్ పక్కన రహదారిపై నిలిపి ఉంచిన బి య్యం లోడ్తో ఉన్న లారీని ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఫి బ్రవరి వరకు జిల్లాలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు కలిపి 45 చోరీకి గురయ్యాయి. ఈజీ మనీ కోసమే..జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్, బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి, షాపింగ్ మాల్స్ తదితర రద్దీ ప్రాంతాల్లో రాత్రి, పగలు తేడా లేకుండా దొంగలు క్షణాల్లో వాహనాలు మాయం చేస్తున్నారు. కొందరు మద్యానికి బానిసై ఈజీ మనీ కోసం ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ఇక కొందరు పగలంతా రెక్కీ నిర్వహించి రాత్రి వేళ వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. దొంగలు ఎక్కువగా పాత వాహనాలనే టార్గెట్ చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే పాత బైక్లు పోతే వాటి యజమానులు ఠాణాల్లో ఫిర్యాదు చేసేదాకా వెళ్లరని వారి నమ్మకం. కొందరైతే బైక్లు ఎత్తుకెళ్లి వడ్డీ వ్యాపారుల వద్ద కుదువ పెట్టి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు అప్పుగా తీసుకుని ఉడాయిస్తున్నారు. కొందరు స్క్రాప్ దుకాణాల్లో విక్రయిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాలకు తరలించి రాత్రికి రాత్రే విడిభాగాలను స్క్రాప్ కింద విక్రయిస్తున్నట్లు సమాచారం. రికవరీలో కనిపించని పురోగతి జిల్లా కేంద్రంలో చోరీకి గురైన వాహనాల కేసుల దర్యాప్తులో రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. మంచిర్యాలకు చెందిన ఓ న్యాయవాది తన ఇంటి ఎదుట నిలిపిన బైక్ చోరీకి గురై మూడేండ్లు గడిచింది. ఇప్పటికీ అది దొరకలేదు. ప్రస్తుతం పోలీస్ సిబ్బంది కొరత ఉండటంతో ముఖ్యమైన కేసుల దర్యాప్తు, బందోబస్తు, ఇతర కార్యక్రమాలకే ఉన్న కొద్దిమంది పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో 1.50లక్షల జనాభా ఉండగా ఒక్కటే పోలీస్స్టేషన్ ఉంది. సుమారు ఏడాదికి 700కు పైగా వివిధ కేసులు నమోదు కావడం, సరిపడా సిబ్బంది లేక పోవడంతో బైక్ చోరీల కేసులను ఛేదించలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి పలు చోరీ ఘటనలు జిల్లా కేంద్రంలో ఈ నెల 1న ఏసీసీ ఎఫ్సీ ఐ గోదాము సమీపంలో బియ్యం లోడ్తో ఉన్న లారీని దొంగలు ఎత్తుకెళ్లారు. లారీ ని ఎత్తుకెళ్లిన దొంగలు అందులోని బి య్యం మహారాష్ట్రలో విక్రయించారు. లారీని కూడా విక్రయించే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. జనవరి 14న జిల్లా కేంద్రంలోని ఇందిరనగర్కు చెందిన ఎలుగం సాయినాథ్ తన పల్సర్ బైక్ను సాయంత్రం 5గంటలకు ఇంటి ముందు నిలిపి ఉంచాడు. కాసేపటికి బయటకు రాగా బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు చోరీ ఐనట్లు గుర్తించి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 27న తిలక్నగర్కు చెందిన కొంగ సాయినాథ్ తన బైక్ను రైల్వేస్టేషన్ సమీపంలోని ఫారెస్ట్ కార్యాలయం ప్రహ రీ పక్కన నిలిపాడు. రైల్వేస్టేషన్లోకి వెళ్లి 10 నిమిషాల తర్వాత రాగా బైక్ అపహరణకు గురైంది. దీంతో బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జాగ్రత్తలు తప్పనిసరి వాహనం పోయిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాహనానికి ఉండే తాళంతో పాటు చక్రాలకూ వేయాలి. రోజుల తరబడి వాహనాన్ని వదిలేసి ఉంచరాదు. ఇంటి ఎదుట వాహనం పార్కింగ్ చేస్తే కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద పార్కింగ్ షెడ్లలో నిలిపితేనే భద్రత ఉంటుంది. బైక్ దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. ప్రతి ఒక్కరూ ఇంటి ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. లేదా కాలనీవాసులంతా కలిసి ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. – ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల డీసీపీ -
గ్రూప్–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ
మంచిర్యాల: గ్రూప్–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్నాగాపూర్కు చెందిన సురుకుంటి సచిన్.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్గా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి.. తాంసి మండలం హస్నాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు. -
ప్రజావాణి.. టైంపాస్కు కాదు..!
నష్టపరిహారం అందించాలిమేము మందమర్రి మండలం బుర్రెగూడెం నివాసులం. మా కు మందమర్రి శివా రు సర్వే నంబర్ 146 లో భూములు ఉండగా ఎన్హెచ్ 363 రోడ్డు విస్తరణలో పోయింది. ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు పరిహారం అందలేదు. పరిహారం అందించాలి. – దుగుట రాజలింగు, బుర్రెగూడ, మందమర్రి మంచిర్యాలఅగ్రికల్చర్: ‘ప్రజావాణి టైం పాస్ కోసం కాదు.. అర్జీదారుల నుంచి పదే పదే వస్తున్న ఫిర్యాదులను తమ పరిధిలో కాకుంటే కాదని చెప్పాలి. లేదా పరిష్కరించాలి. పెండింగ్లో ఎందుకు పెడుతున్నారు. ప్రజావాణికి చాలా మంది అధికారులు రావడం లేదు. ఎందుకు డుమ్మా కొడుతున్నారు’ అని కలెక్టర్ కుమార్ దీపక్ ఆయా శాఖల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖల పరిధిలో పెద్ద ఎత్తున అర్జీలు పెండింగ్ ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హ రికృష్ణతో కలిసి సోమవారం ఫిర్యాదులు స్వీకరించా రు. భూసమస్యలు, పరిహారం, పెన్షన్, నీటి సమ స్య, విద్యుత్, తదితర సమస్యలపై అర్జీలు వచ్చా యి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి రాని వివిధ శాఖలకు నోటీసులు అందించాలని ఏవోను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. ● లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన అంబటి పద్మ తన భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాను గతంలో మహిళా సంఘాల రాష్ట్రస్థాయి శిక్షకురాలిగా రైతు సంఘాల శిక్షకురాలిగా, ఎన్నికల సర్వేలో సైతం పని చేశానని తెలిపారు. తనకు ఉపాధి కల్పించాలని కోరారు. ● భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన పోతురాజుల పోచయ్య తనకు అక్కపల్లి గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, ధరణి వచ్చిన తర్వాత లావోణి పట్టాగా చూపుతుందని తెలిపాడు. సవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. ● దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లింగం రేవతి తాను అంగన్వాడీ టీచర్గా పని చేసి పదవీ విరమణ పొందానని, తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందించి, ఆసరా ఫించన్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. ● జన్నారం మండల కేంద్రానికి చెందిన సంబారి అంజయ్య తన పట్టా భూమి నిషేధిత జాబితాలో చూపుతుందని, తొలగించి తనకు న్యాయం చేయాలని దరఖాస్తు అందజేశాడు. ● చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలోని బోరుమోటర్ కాలిపోయిందని, తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని గ్రామానికి చెందిన మల్లేశ్ ఫిర్యాదు చేశాడు. గ్రామ సభలు నిర్వహించాలి బెల్లంపల్లిరూరల్: శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టుపై అధికారులు మరోమారు ప్రజాభిప్రాయ గ్రామసభలు నిర్వహించాలని ప్రభావిత గ్రా మాల రైతులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్కు ఈమేరకు వినతిపత్రం అందించారు. ఈ నెల 6న శాంతిఖని గని ఆవరణలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో అ ధికారులు రైతుల గోడు వినలేదని తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణలోని తీసుకోవా లని కోరారు. లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలైన బట్వాన్పల్లి, పెర్కపల్లి, లింగాపూర్, ఆకెనపల్లి, పాత బెల్లంపల్లి, తాళ్లగురిజాల గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయం సేకరించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో మాజీ ఎంపీపీలు మల్లేశ్, శ్రీనివాస్, రైతులు శంకర్, కిరణ్, రాకేశ్, శంకర య్య, వినోద్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అర్జీలు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అధికారులు ఎందుకు డుమ్మా కొడుతున్నారు.. కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం.. హాజరు కానివారికి షోకాజ్ నోటీసులు -
జంక్షన్ల కుదింపు
● ప్రారంభమైన కూల్చివేత పనులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాసగార్డెన్ వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జంక్షన్ల కుదింపు పనులను సోమవారం ప్రారంభించారు. ఐబీ చౌరస్తాలోని జంక్షన్ను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఆరులేన్ల రోడ్డుకు సరిపోయేలా జంక్షన్ను కుదించనున్నారు. రూ.4 కోట్లకుపైగా నిధులను ఖర్చు చేసి నిర్మించిన జంక్షన్లు పెద్దగా ఉండడంతో వాటిని కుదిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కక్షకట్టి కూల్చివేస్తున్నారని, ఇలాంటి ధోరణిని వీడాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఐబీ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ చౌరస్తా వరకు రూ.4 కోట్లతో నాలుగు జంక్షన్లు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే రోడ్లు విస్తరణ పేరిట వాటిని కుదించడం సరికాదన్నారు. రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వమే రూ.35 కోట్లను మంజూరు చేసిందన్నారు. రోడ్డు విస్తరణతో జంక్షన్లు ఎలాంటి ఆటంకం కాదని తెలిపారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే కూల్చివేయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కొద్దిసేపు పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి, ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్రావు, గాదె సత్యం, అంకం నరేశ్, శ్రీపతి వాసు, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, అత్తి సరోజ, మందపల్లి శ్రీనివాస్, మొగిలి శ్రీనివాస్, అన్నపూర్ణ, నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో మమేకమై..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ సోమవారం విద్యార్థులతో మమేకమయ్యారు. హాజీపూర్ మండలం ముల్కల్ల జిల్లాపరి షత్ పాఠశాలను సోమవారం ఉదయం 9:30 గంట లకు తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో నే రుగా కలిసిపోయి చదువుల గురించి ఆరాతీశారు. సబ్జెక్ట్ల వారీగా పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ఎలాంటి సందేహాలు లేకుండా సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని సూచించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల ఉ న్నతికి కృషి చేస్తున్న హెచ్ఎం గణపతిరెడ్డి, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాలలోని రిజిస్టర్లు, హాజరు పట్టికలను పరిశీలించారు. వంటశాలను పరిశీలించి జాగ్రత్తలు సూచించారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడి ఆహారం అందించాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్ష కేంద్రం తనిఖీ మండలంలోని వేంపల్లిలోని ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం తనిఖీ చేశారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. హాజీపూర్ పీహెచ్సీ తనిఖీ హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుమార్దీపక్ తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని రిజిస్టర్లు పరిశీలించారు. మందుల నిల్వలు, వార్డులను పర్యవేక్షించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను పలకరిస్తూ వైద్య సేవలు అందుతున్న తీరు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కలెక్టర్ వెంట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లహరి, సిబ్బంది ఉన్నారు. -
సైక్లింగ్లో గిరిజన యువతి ప్రతిభ
నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామానికి చెందిన కున్సోతు రవి–తార దంపతుల కుమార్తె కున్సోతు స్నేహ సైక్లింగ్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కోహెడలో ఈనెల 7 నుంచి 10 వరకు నిర్వహించిన 9వ రాష్ట్రస్థాయి బైక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు సాధించింది. విజేతగా నిలిచిన గిరిజన యువతి స్నేహను తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి భూలోకం జయకాంతారావు, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, వెంకటనర్సయ్య, కోచ్ సంజీవ్, పీఈటీ హారిక అభినందించారు. ఆసిఫాబాద్లో డిగ్రీ చదువుతున్న స్నేహ గతంలో రాష్ట్రస్థాయి సీఎం కప్లో రెండుసార్లు, జార్ఖండ్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. -
వ్యాధులపై అప్రమత్తం చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులందరూ ప్రజలతో మమేకమై పనిచేయాలని, వ్యాధులపై ప్రజ లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్ హరీశ్రాజ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గెజిటెడ్ అ ధికారుల టూర్ డైరీ, క్యాలెండర్లను సోమవా రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జాతీయ వైద్య కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కా ర్యకర్తలు, ఇతర సిబ్బందితో సమన్వయం చేసి పనిచేయాలని పేర్కొన్నారు. వాతావరణ మా ర్పులతో వచ్చే వ్యాధులు, కీటక జనిత వ్యాధులు, అసంక్రమణ వ్యాధులపైనా అవగాహన క ల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎ.ప్రసాద్, డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ కృపాబా యి, డాక్టర్ శివప్రతాప్, సూపరింటెండెంట్ వి శ్వేశ్వర్రెడ్డి, కాంతారావు, కె.వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, కె.వెంకటేశ్వర్, కె.రమేశ్, సీహెచ్వో రా ఘవ, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
నాలుగు గంటల సాధన
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన రాజశేఖర్–సుగుణ దంపతుల కుమార్తె బి.స్వాతి. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు స్టీపుల్ చేజ్, జావెలిన్ త్రో ఈవెంట్లలో రెండు పతకాలతో మెరిసింది. ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నాలుగు గంటలు సాధన చేస్తున్నానని చెబుతోంది. మరిన్ని క్రీడా ఈవెంట్లలో సత్తా చాటడానికి, నిరంతరం క్రీడా నైపుణ్యాలు అలవర్చుకుంటానని తెలుపుతోంది. – స్వాతి -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేరడిగొండ: మండలంలోని బోరిగాం బస్టాండ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బొడిగే గణేశ్ (26) ఆదివారం రాత్రి నిర్మల్లో ఉంటున్న ఆయన భార్య వద్దకు బైక్పై వెళ్తున్నాడు. గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. గోడ మీదపడి కూలీ.. రెబ్బెన: మండలంలోని నవేగాంలో కూలీపై గోడపడి మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నవేగాం గ్రామానికి చెందిన కొద్దెన లస్మయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామానికి చెందిన బొల్లు తిరుపతి ఇంటి పనుల కోసం సోమవారం లస్మయ్యను కూలీని పిలిచారు. పని నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా లస్మయ్యపై గోడ కూలి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కాగజ్నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న రాజయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదంగా యువకుడు.. ఆదిలాబాద్రూరల్: మావల శివారు ప్రాంతంలో గల ఎర్రకుంటలో ఒకరు అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మావల గ్రామానికి చెందిన షేక్ ఫర్వేజ్ అదే గ్రామంలోని పెట్రోల్ పంపులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాలేదు. కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించిన ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం ఎర్రకుంట ప్రాంతం వైపు వెళ్లిన మావలకు చెందిన సతీశ్.. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి రెహనా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి ఒకరు.. ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన పిండి విజయ్ (36) ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. విజయ్ ఇంటి అవసరం నిమిత్తం కట్టెలు ఏరేందుకు మండలంలోని కామాయిపేట అటవీ ప్రాంతానికి ఆదివారం వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దాహం వేయగా గ్రామ సమీపంలోని కుంటలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. ఆదివారం రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం కుంట వద్ద చెప్పులు చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వడంతో స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకం
ఉట్నూర్రూరల్: అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు..ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులకు లంచ్ బాక్స్లు అందజేశారు. నారీశక్తి పురస్కారాల ప్రదానంనిర్మల్ఖిల్లా: అన్నిరంగాల్లో మహిళలు రాణించడం శుభ పరిణామమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం ‘పాటే మా ప్రాణం’సంగీత ఆకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ’నారీశక్తి పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్లు రజిని, చంద్రిక, న్యాయవాది నివేదిత, సుగుణ, ఎస్సై రోహిణి, ఎఫ్ఆర్వో శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాణి, కేజీబీవీ ఎస్ఓ లతాదేవి, విజయలక్ష్మి, స్వాతి, లక్ష్మి, శ్రీలత, రాజ్యలక్ష్మి పురస్కార గ్రహీతలు ఉన్నారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యంరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, ప్రముఖవైద్యులు యు.కృష్ణంరాజు, సంగీత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య, కార్యదర్శి శ్రీకాంత్ సభ్యులు వాణిశ్రీ, కవిత, మమత, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో ఆగిన ఊపిరి..
● ఐకే–1ఏ గనిలో యువ కార్మికుడి మృతి ● విధులు నిర్వహిస్తుండగా కుప్పకూలిన వైనం.. ● గని ప్రమాదంగా గుర్తించాలని కార్మిక సంఘాల డిమాండ్జైపూర్:ఆయన ఓ యువ కార్మికుడు. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ద్వారా మూడేళ్ల క్రితం సింగరేణి ఉద్యోగం పొందాడు. శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఐకే–1ఏ గనిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం దాసరిపల్లి నుంచి నిత్యం విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే సోమవారం ఉదయం విధులకు వచ్చాడు. విధులు నిర్వహిస్తూనే కుప్పకూలాడు. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాసరిపల్లి గ్రామానికి చెందిన పసునూరి సుభద్ర–రాజమల్లు దంపతుల కుమారుడు రాంచందర్(32) తన తండ్రి మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ద్వారా మూడేళ్ల క్రితం ఉద్యోగం పొందాడు. ఐకే–1ఏ గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాంచందర్ భూగర్భ గనిలోకి కార్మికులు వెళ్లే రెండో మ్యాన్రైడింగ్ వద్ద మోటార్ ఆన్, ఆఫ్ సిస్టం మెయింటెన్స్ వర్కక్ కేటాయించారు. ఉదయం 7 నుంచి 8:30 గంటల వరకు రెండో మ్యాన్ రైడింగ్ ద్వారా కార్మికులు గనిలోకి దిగగా రాంచందర్ మ్యాన్ రైడింగ్ ఆపరేట్ చేశాడు. 9:20 తర్వాత కళ్లు తిరగడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన సహచర కార్మికులు సపర్యలు చేశారు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో సీపీఆర్ కూడా చేశారు. అయినా స్పందన లేకపోవడంతో హుటాహుటీగా రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు.. సుభద్ర–రాజమల్లు దంపతులకు రాంచందర్, ఇద్దరు కూతుళ్లు సంతానం. ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు కావాలని రాజమల్లు మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ద్వారా తన ఉద్యోగాన్ని మూడేళ్ల క్రితం కొడుకుకు పెట్టించాడు. అప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అకస్మాత్తుగ ఒకకగానొక్క కొడుకు విధి నిర్వహణలో మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజమల్లు ఫిర్యదు మేరక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గని ప్రమాదంగా గుర్తించాలి.. రాంచందర్ మరణాన్ని గని ప్రమాదంగా గుర్తించి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల స్పెషల్ ఎక్స్గ్రేషియా చెల్లించాలని హెచ్ఎంఎస్ నాయకులు తిప్పారపు సారయ్య, అనిల్రెడ్డి డిమాండ్ చేశారు. యువ కార్మికుడు విధినిర్వహణలో మరణించడం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో కార్మికుడు ఏ కారణంతో మరణించినా ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఐకే–1ఏ గనిలో శ్రీనివాస్ అనే యువ కార్మికుడు చనిపోయాడని తెలిపారు. -
బాడీబిల్డింగ్ ఓవరాల్ చాంపియన్ వెంకటేశ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాడీబిల్డంగ్ ఓవరాల్ చాంపియన్గా మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలకు చెందిన మాసు వెంకటేశ్ నిలిచాడు. సీసీసీలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ జూనియర్, సీనియర్, మాస్టర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. మాసు వెంకటేశ్ అన్ని కేజీల విభాగాల్లో మంచిర్యాల జిల్లా చాంపియన్గా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చాంపియన్ ఆఫ్ ద చాంపియన్ పోటీల్లోనూ విజేతగా నిలిచాడు. -
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమే లక్ష్యం
నిర్మల్ జిల్లా చిట్యాలకు చెందిన రాజు–సరోజ దంపతుల కుమార్తె దివిటి అరుణ. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) సెకండియర్ చదువుతోంది. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హ్యమర్ త్రో, డిస్కస్ త్రో ఈవెంట్లలో మొత్తం ఐదు పతకాలు సాధించింది. హ్యమర్ త్రోలో రెండు రజతం, 2 కాంస్య, డిస్కస్ త్రోలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తానని ధీమాగా చెబుతోంది. – అరుణ -
అథ్లెటిక్స్లో మెరిశారు..
● ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● పతకాలతో సత్తాచాటుతూ.. ● అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వారందరిది నిరుపేద కుటుంబ నేపథ్యం. అయినప్పటికీ భవిష్యత్లో ఉన్నతంగా ఎదగాలని చదువును కొనసాగిస్తూనే క్రీడారంగాన్ని ఎంచుకున్నారు. అథ్లెటిక్స్లో నిరంతరం సాధన చేసి ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు దేశం తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – ఆదిలాబాద్ఎన్ఐఎస్ శిక్షకుడినవుతా బజార్హత్నూర్ మండలం మంజారం తండాకు చెందిన గురుదయాల్ సింగ్–శారదబాయి దంపతుల కుమారుడు అజాడే అనిల్. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈయన అథ్లెటిక్స్లో హేమర్ త్రో, స్టీపుల్ చేజ్, ట్రిపుల్ జంప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నాడు. 2019 పూణెలో జరిగిన స్విమ్మింగ్ జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఒక వెండి, కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్గా వ్యవహరించడమే తన లక్ష్యమని, ఇందుకోసం శిక్షకులు వీజీఎస్ రాకేశ్, వీజీఎస్ జోల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నా. – అజాడే అనిల్ శిక్షకుల ప్రోత్సాహంతోనే.. బేల మండలం సిర్సన్నకు చెందిన ఎస్కే ఫిరోజ్– షరీఫా దంపతుల కుమార్తె ముస్కాన్. అథ్లెటిక్స్ పోటీల్లో విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డీ.పెడ్ కోర్సు చేస్తున్న ఆమె హ్యామర్త్రో ఈవెంట్లో మూడు పతకాలు సాధించింది. హైదరాబాద్, హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, రజతం, ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో కాంస్య పతకాలతో మెరిసింది. శిక్షకులు రేణుక, వీజీఎస్ రాకేశ్ ప్రోత్సాహంతో రాగలిగింది. జాతీయ అథ్లెటిక్స్ శిక్షకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. – ముస్కాన్ అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఇచ్చోడ మండలం దేవుల్ నాయక్ తండాకు చెందిన రమేశ్ రాథోడ్–లక్ష్మీబాయి దంపతులకు కుమారుడు రాథోడ్ వంశీ. గతేడాది జూలైలో నేపాల్లో జరిగిన టార్గెట్ బాల్పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో భారత్ రెండో స్థానంలో నిలువగా, వెండి పతకం నిలబెట్టుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో హామర్ త్రో ఈవెంట్లో రెండుసార్లు రజత పతకాలు సాధించగా, ఓసారి కాంస్య పతకంతో విజేతగా నిలిచాడు. కాకతీయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రాతినిధ్యం వహించి రాణించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా కావడమే లక్ష్యంగా ప్రతీరోజు నాలుగు గంటలు మైదానంలో శ్రమిస్తున్నాడు. – వంశీ గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యం.. ఆదిలాబాద్కు చెందిన ప్రవీణ్–గీత దంపతుల కుమారుడు డి.చంద్రసిద్ధార్థ.. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఐదో తరగతి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుని, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తున్నాడు. అథ్లెటిక్స్లో రేస్వాక్ ఈవెంట్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం గెలుపొందాడు. 2022లో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించాడు. సైనికుడిగా విధులు నిర్వర్తిస్తూనే, తన చిన్ననాటి కల అయిన గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. – డి.చంద్రసిద్ధార్థ -
వ్యాయామ ఉపాధ్యాయురాలవుతాను
నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన చిన్నయ్య–చిన్నక్క దంపతుల కుమార్తె సీహెచ్. వసంత. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటుతోంది. పోటీల్లోని ట్రిపుల్ జంప్, హ్యామర్ త్రో ఈవెంట్లలో ఇప్పటివరకు 8 పతకాలు సాధించింది. యూనివర్సిటీ లెవల్లో హ్యామర్ త్రో ఈవెంట్లో కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతున్న ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలిగా కెరియర్ ఎంచుకుంటా అంటోంది. – సీహెచ్. వసంత -
‘లాంగ్వాల్ ప్రాజెక్టుపై వైఖరి చెప్పాలి’
బెల్లంపల్లి: శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టుపై ప్రజా ప్రతినిధులు తమ వైఖరి చెప్పాలని బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ప్రభావిత గ్రా మాల రైతులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. లాంగ్వాల్ ప్రాజెక్టు వల్ల ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి, లింగాపూర్, తాళ్లగురిజాల, బట్వాన్పల్లి, పెర్కపల్లి గ్రామాలు ప్రభావితం అవుతాయని తెలిపారు. ఆ గ్రామాల్లో సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతాయన్నారు. చెరువుల్లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయిందన్నారు. పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణలో రైతులు, ప్రజలు పాల్గొని ఈ ప్రాజెక్టు వద్దని నిరసన తెలిపినా ఎమ్మెల్యే వినోద్, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభావిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభావిత గ్రామాల వాసులు రామటెంకి ప్రసాద్, గోమాస వినోద్కుమార్, దుర్గం జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్
● ఒకరు మృతి బజార్హత్నూర్: ఎడ్లబండిని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందాడు. ఎస్సై అప్పారావ్ కథనం ప్రకారం.. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన కాలే కాశీనాథ్ (54) బైక్పై మండల కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వస్తున్నాడు. శనివారం రాత్రి కొలారి సమీపంలో బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన కాశీనాథ్ను వెంటనే బజార్హత్నూర్ పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గం
జన్నారం: తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి(టీజీడబ్ల్యూడబ్ల్యూసీ) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూ మయ్య, రాష్ట్ర ఇన్చార్జి ఎరుకల రాజుగౌడ్ తెలిపారు. సంస్థ కోసం నిబద్ధతతో పనిచేసిన సభ్యులను గుర్తించి నూతన రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినట్లు పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షుడిగా సేపూరి గోపాల్, రాష్ట్ర ఇన్చార్జిగా పు రంశెట్టి నాగేశ్, ఉపాధ్యక్షులుగా పెరుగు మల్లికార్జున్, అమరగుండ తిరుపతి, ప్రధాన కార్యదర్శులుగా పాలాజీ శ్రీనివాస్, పరకాల మహేశ్, కన్వీనర్గా సంద సుదర్శన్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కాశెట్టి తిరుపతి, అలీమ్, కోశాధికారిగా అమర కొండ మల్లేశ్, అధికార ప్రతినిధిగా సందెల తిరుపతి, కార్యదర్శిగా కొడిజుట్టు నరేశ్, సంయుక్త కార్యదర్శి గా హసన్, ప్రచార కార్యదర్శిగా జునుగూరు నాగరాజు, ముఖ్య సలహాదారుగా లింగం అంజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
విజయవంతంగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
బాసర: ఆర్జీయూకేటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం, ఎన్ఐటీటీటీఆర్ చండీగఢ్తో కలిసి ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు ‘ఉచిత సిమ్యులేటర్లను ఉపయోగించి ఈసీఈ ల్యాబ్ సబ్జెక్టులు బోధించడం‘అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడారు. సిమ్యులేటర్లలో వర్చువల్ ల్యాబ్లు, మల్టీసిమ్లైవ్, ల్యాబ్లైవ్, టింకర్క్యాడ్, వా వ్కి, సైల్యాబ్, ఆరెంజ్, నోడ్ రెడ్, మస్కిటో, ఈజీఈడీఏ సిమ్8085 ప్రదర్శనలో ఉన్నాయన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్ ఏవో రణధీర్, అసోసియేట్ డీన్లు చంద్రశేఖర్రావు, మహేశ్ తదితరులు ఉన్నారు. క్లుప్తంగాతాళం వేసిన ఇంట్లో రూ.లక్ష చోరీ భైంసాటౌన్: పట్టణంలోని పాండ్రిగల్లిలో తా ళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పట్టణ ఎస్సై శ్రీనివాస్ యాదవ్ కథనం ప్రకారం..కాలనీకి చెందిన పాలెపోల గంగాదాస్ ఈనెల 6న సా యంత్రం ఇంటికి తాళం వేసి కుభీర్లో శుభకార్యం నిమిత్తం వెళ్లారు. ఆదివారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ప క్కింటివారు గంగాదాస్కు సమాచారమిచ్చా రు. దీంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో వస్తువులు, బీరువా చిందరవందరగా ఉండడం చూసి పోలీసులకు సమాచారమివ్వగా, వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బెడ్రూంలోని బీరువా నుంచి రూ.లక్ష వరకు నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
భవితకు భరోసా..!
● ఆటాపాటలతో విద్యాబోధన ● ఉమ్మడి జిల్లాలో 17 కేంద్రాలకు నిధులు ● ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు విడుదల మంచిర్యాలఅర్బన్: ప్రత్యేకావసరాలు కలిగిన పిల్ల లకు ఆటపాటలతో విద్య అందించేందుకు ప్రభుత్వం భవితకేంద్రాలు ఏర్పాటు చేసింది. 21 రకాల వైకల్యాలతో బాధపడే పిల్లలను గుర్తించి సేవలందించేందుకు 2010లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు వారికి భరోసా ఇస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించడం, మాట్లాడడం, నడిపించడం కోసం నిపుణులను నియమించారు. ఉమ్మడి జిల్లాల వారీగా మండలానికో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సొంత భవనాలు ఉన్న వాటికి రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్తోపాటు జూన్ 20 నుంచి సంవత్సరం వరకు బాలికలకు స్టైఫండ్, రీడర్ అలవెన్స్ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొనుగోలు చేయాల్సినవి..సులభంగా అర్థమయ్యేలా బోధన పరికరాలు, ఐఆర్పీలకు కుర్చీలు, బాస్కెట్బాల్, డంబుల్స్, రౌండ్ టేబుల్, అల్మారాలు, గ్రీన్ బోర్డు మ్యాగ్నిట్, వైల్డ్ ఎనిమాల్స్, ఫ్రూట్స్, టెడ్డీ రింగ్స్, గ్రీన్బోర్డు, బెడ్షీట్, సాండ్ బ్యాగ్, వాకింగ్బోర్డు, ప్లాస్టిక్ బాల్స్ తదితర 115 రకాల పిల్లలకు అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సి ఉంది. ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, భవిత కేంద్రాలకు అనుసంధానంగా ఉన్నత పాఠశాల ప్రఽధానోపాధ్యాయుల కమిటీ నేతృత్వంలో వీటిని సమకూర్చనున్నారు. నిధులు మంజూరు..ఉమ్మడి జిల్లాలోని పక్కా భవనాలు ఉన్న భవిత కేంద్రాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేశారు. ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు కేంద్రాలు, కుమురం భీం జిల్లాలో నాలుగు, నిర్మల్లో నాలుగు కేంద్రాలకు రూ.8 లక్షల చొప్పున, మంచిర్యాలలో ఐదు కేంద్రాలకు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్, ఇచ్చోడ, జైనథ్, ఉ ట్నూర్, జైనూర్, కాగజ్నగర్, సిర్పూర్(టీ), జన్కపూర్, బెల్లంపల్లి, దండేపల్లి, కోటపల్లి, మందమర్రి తాండూర్, భైంసా, ముథోల్, నిర్మల్, ఖానాపూర్ కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. గతేడాది జూన్ నుంచి జవనరి వరకు..భవిత కేంద్రాలకు వచ్చి వెళ్లే ప్రత్యేక అవసరాలు క లిగిన పిల్లలకు రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్, బాలికలకు స్టైఫండ్, రీడర్ అలవెన్స్ నిధులు మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 8 నెలల వర కు నిధులు మంజూరు చేశారు. మొత్తం ఆదిలాబాద్లో రూ.9,05,400, కుమరంభీం జిల్లాలో రూ. 7,80,480, మంచిర్యాలలో రూ. 8,26,800, నిర్మల్లో రూ.13,59120 నిధులు మంజూరయ్యాయి. రవాణా భత్యం ఇలా..ఆదిలాబాద్ జిల్లాలో 92 మంది సీడబ్ల్యూఎస్ఎన్ పి ల్లలకు రూ.3.68 లక్షలు, మంచిర్యాలలో 93 మంది కి రూ.3.72 లక్షలు, కుమురం భీం ఆసిఫాబాద్లో 92 మందికి రూ.3.92 లక్షలు, నిర్మల్లో 116 పిల ్ల లకు రూ.46,400 రవాణా భత్యం విడుదల చేశారు. ఎస్కార్ట్ నిధులు..సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలను భవిత కేంద్రాలకు తీసుకువచ్చేందుకు రూ.500 చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్లో 40 మందికి రూ.1.60 లక్షలు, ఆసిఫాబాద్కు 68 మందికి రూ.2.72 లక్షలు, మంచిర్యాలలో 43 మందికి రూ.1.72 లక్షలు, నిర్మల్లో 121 మందికి రూ.4.81 లక్షల నిధులు మంజూరయ్యాయి. స్టైఫండ్ నిధులు..సీడబ్ల్యూఎస్ఎన్ బాలికలకు రూ.200 చొప్పున స్టై ఫండ్ నిధులు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జి ల్లాలో 224 మందికి రూ.3,58,200, కుమురంభీంలో 152 మందికి రూ.2,43,200, మంచిర్యాలలో 168 మందికి రూ. 2,68,400, నిర్మల్లో 246 మందికి రూ.3,93,000 నిధులు మంజూరు చేశారు. రీడర్ నిధులు..సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు రీడర్ అలవెన్స్ మంజూరయ్యాయి. ఒక్కొక్కరికి రూ.60 చొప్పున మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40 మందికి రూ.19,200, కుమురంభీంలో 36 మందికి రూ.17,280, మంచిర్యాలలో 30 మందికి రూ.14,400, నిర్మల్లో 44 మందికి రూ.21,120 నిధులు మంజూరయ్యాయి.చర్యలు తీసుకుంటున్నాం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నిధులు మంజూరయ్యాయి. ఆటపాటలతో విద్యాబోధ న సాగనుంది. భవిత కేంద్రంలో విద్యార్థుల అభ్యున్నతి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
చెరువులో పడి వ్యక్తి మృతి
సోన్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై గోపి కథనం ప్రకారం..మండలంలోని సిద్దలకుంటకు చెందిన దేవోల్ల శ్రీను(30) శనివారం మాదాపూర్, సిద్దులకుంట గ్రామాల శివారులో చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి బావ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్షాక్తో వివాహిత.. లక్సెట్టిపేట: స్నానానికి వేడి నీళ్లు పెడుతుండగా విద్యుత్ షాక్తో వివాహిత మృతిచెందింది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల(42), తిరుపతి భార్యభర్తలు. ఇద్దరు పిల్లల సంతానం. భర్త కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం తిరుమల స్నానం చేసేందుకు బకెట్లో నీళ్లు పోసి వాటర్ హీటర్ వేసి స్విచ్ ఆన్ చేసింది. ఆమె కాలు బకెట్ను ఆనుకుని ఉండడంతో విద్యుత్ సరఫరా అయి షాక్కు గురైంది. కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం తిర్యాణి: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తితో కానిస్టేబుల్ గడ్డి మందుతాగిఆత్మహత్యాయత్నంచేశాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్కథనంప్రకారం..మంచిర్యాల జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన ముద్దసాని పవన్(25)2024లో టీఎస్ఎస్పీలో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. తిర్యాణి పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా కళ్లలో మంట, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం బయటికి వెళ్లిన పవన్ తిర్యాణి, తాండూర్ మార్గమధ్యలో గడ్డి మందు తాగాడు.గమనించిన కొందరుపోలీసులకుసమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునితిర్యాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనలతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బైక్ చోరీ ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని అశోక్రోడ్ కాలనీకి చెందిన బి.కిషన్ బైక్ చోరీకి గురైంది. ఈనెల 8నకూరగాయల మార్కెట్లో పార్కింగ్ చేసి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. చుట్టూపక్కల గాలించిన దొరకకపోవడంతో బాధితుడు ఆదివారం వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్కుమార్ తెలిపారు. -
అ‘పూర్వం’..ఆత్మీయం
ఇచ్చోడ/నిర్మల్టౌన్/నర్సాపూర్(జి)/మందమర్రిరూరల్/బోథ్: ఇచ్చోడ మండలంలోని బోరిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1991–92 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం పేరిట ఆదివారం కలుసుకున్నారు. అలాగే నిర్మల్లోని జుమ్మెరాత్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994–95 బ్యాచ్ విద్యార్థులు, నర్సాపూర్ (జి) జెడ్పీసెకండరీ పాఠశాలలో 1997–98 బ్యాచ్, మందమర్రిలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని జెడ్పీ గర్ల్స్, ఒర్రెగడ్డ ఏరియాలోని జెడ్పీ బాయ్స్ హైస్కూళ్లలో 1999–2000 బ్యాచ్, బోథ్లోని ప్రగతి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2004–05 బ్యాచ్ విద్యార్థులు చదువులమ్మ ఒడికి చేరారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. గురువులను సన్మానించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. -
నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత
భీమిని: కన్నెపల్లి మండలం సుర్జాపూర్ గ్రామంలో ఆదివారం 140 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయాధికారులు పట్టుకున్నారు. సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో గ్రామానికి చెందిన బేర నారాయణ ఇంట్లో వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొండగొర్ల రాజన్న అనే వ్యక్తి నాలుగు బస్తాల(140 కిలోల) పత్తి విత్తనాలు దాచి ఉంచాడు. వీటి విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తాండూర్ సీఐ కుమారస్వామి మాట్లాడుతూ ఆంధ్రాకు చెందిన సురేశ్ నుంచి కొనుగోలు చేసినట్లు నిందితులు తెలిపినట్లు వెల్లడించారు. సురేశ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
● ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టిన బస్సు ● బస్సులోని ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం ● పలువురికి గాయాలు.. రిమ్స్కు తరలింపు ● ఆదిలాబాద్ జిల్లాలో ఘటన ఆదిలాబాద్రూరల్: వారంతా రాత్రి వేళలో బస్సులో ప్రయాణిస్తున్నారు.. గాడనిద్రలో ఉన్నారు.. ఒ క్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో ఉలిక్కిపడ్డారు.. అప్పటికే ఎదురుగా ఉన్న ఐచర్ వాహనాన్ని బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. కొంద రు అద్దాలు పగులగొట్టి కిందికి దూకారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్తోపాటు అదనపు డ్రైవర్ తీవ్రగాయాలతో క్యాబిన్లో చిక్కుకు ని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘట న ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధి 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వేకువజా మున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కు వయా నాగపూర్ మీదుగా ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. అదే మార్గం గుండా నిర్మల్ వైపు నుంచి మహారాష్ట్ర వైపునకు కట్టెల లోడ్తో ఐచర్ వాహనం వెళ్తుంది. ఆదిలాబాద్రూరల్ మండల పరిధిలో గల జాతీయ రహదారిపై జియో పె ట్రోల్ పంపు ఎదుట ఐచర్ వాహనం టైర్ పగిలిపోయింది. డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక ఏర్పాటు చేయకుండా వాహనాన్ని రోడ్డుపైనే నిలిపాడు. దీంతో వెనక నుంచి వస్తున్న బస్సు ఐచర్ను వేగంతో ఢీ కొ ట్టడంతో బస్సు డ్రైవర్ ప్రదీప్ సాహు (35), పక్కనే ఉన్న అదనపు డ్రైవర్ లొచన్ సాహు (33) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రిమ్స్కు తరలించారు. బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ల మృతదేహాలను క్రేన్ సాయంతో తీశారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంబంధిత పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్పీ గౌస్ అలం, డీఎస్పీ జీ వన్రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై ముజాహిద్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమా దం జరిగిన తీరుపై ఆరా తీశారు. పోలీసులు తెలి పిన ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లొచ న్ సాహు, ఛత్తీస్గఢ్కు చెందిన ప్రదీప్ సాహులు కన్కెర్ ట్రావెల్స్పై బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నారు. వీరు శనివారం హైదరాబాద్ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు బయలుదేరారు. ఈక్రమంలో ఆదిలాబాద్ వద్ద ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. ప్రమాద సూచిక లేకుండా రోడ్డుపై వాహనం నిలిపిన ఐచర్ వాహన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిలో.. చత్తీస్గఢ్కు చెందిన కమ్లేష్ పాల్, జబల్పూర్కు చెందిన ముఖేష్ సాహు, మన్షి, సునిత సాహు, బన్స్కార్ అనిత, ప్రయాగ్రాజ్కు చెందిన ఎండీ సాహు, మధ్యప్రదేశ్కు చెందిన శివ్రి దీపక్, జైస్వాల్ ప్రదీప్ కుమార్, ప్రజ్ఞా ఉన్నారు. లొచన్ సాహు, ప్రదీప్ సాహు మృతదేహాలునుజ్జునుజ్జయిన బస్సు ముందు భాగం -
బాసరలో భక్తుల రద్దీ
బాసర(ముధోల్): బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించారు. శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. -
సర్వేకు సిద్ధం
● నేటి నుంచి 50 పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే ● విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఆరా..మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో భాష, గణిత సామర్థ్యాలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని తెలంగాణ విద్య పరిశోధన శిక్షణ మండలి నిర్ణయించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈనెల 10 నుంచి 12 వతేదీ వరకు రెండో తరగతి చదువుతున్న బాలబా లికలకు ఆయా అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. ప్రా థమికస్థాయి విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ–భాష, గణిత భావనలు ఏమేరకు అభివృద్ధి చెందాయో తెలుసుకుంటారు. చదవడం, రా యడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయటం తదితర అంశాలపై సర్వే నిర్వహించేందుకు ప్రశ్నపత్రాన్ని రూపొందించింది. విద్యార్థులు తెలుగు, ఆంగ్లం అక్షరాలను గుర్తిస్తున్నారా?, గణితంపై ఎంపిక చేసిన పాఠశాలల్లో సర్వే నిర్వహించనున్నారు. 50 పాఠశాలల్లో సర్వే.. జిల్లాలో 50 పాఠశాలల్లో సర్వే కొనసాగనుంది. 55 మంది డిగ్రీ విద్యార్థులు, సీఆర్పీలతో సర్వే నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండో తరగతికి చెందిన 8 మంది విద్యార్థుల చొప్పున స ర్వే చేయనున్నారు. ఇందులో ఫీల్డు ఇన్వెస్టిగేటర్లను నియమించారు. పాఠశాలకు వెళ్లి ఈనెల 10న తెలుగు, 11న గణితం, 12న ఆంగ్లం సబ్జెక్టులపై సు మారు 26 ప్రశ్నలతో సర్వే చేయనున్నారు. ఈ వివరాలన్నీ టాంజరిన్ యాప్లో నమోదు చేస్తారు. రిసోర్స్ పర్సన్లకు శిక్షణ .. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ నిర్వహణపై జిల్లాలో ఉపాధ్యాయులకు మూడు రోజుల చొప్పున ఆరుగురు రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇచ్చారు. ఆయా మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు కార్యక్రమం అమలుపై 108 మంది ఆర్పీలు అవగాహన కల్పించారు. వీరికి మూడు రోజుల క్రితం ఒక్కొక్కరికి రూ.400 చొప్పున భత్యం మంజూరు చేశారు. జిల్లాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు రూ.97,200 నిధులు రాగా ఖాతాలో జమచేశారు. ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలు ఇవీ.. ఎఫ్ఎల్ఎన్తో బడుల్లో చిన్నారులు కనీస సామర్థ్యాలతోపాటు తరగతి అభ్యసన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ లక్ష్యం పెట్టుకుంది. ఇందుకు ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ ఇచ్చారు. వీరందరూ సంబంధిత పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందించటం.. సామర్థ్యాలు పెంపునకు విద్యార్థులకు అభ్యసన పుస్తకాలు విడతల వారీగా పంపిణీ చేసింది. నిర్దేశించిన సామర్థ్యాల కార్యక్రమం అమలుకు మండలానికి నోడల్ అధికారిని ఎంపిక చేశారు. ఎంఎన్వోల పర్యవేక్షణలో ఉపాధ్యాయుల ద్వారా చదవటం, రాయటం పూర్తిస్థాయిలో అందించాలనేదే ముఖ్య ఉద్దేశం. పకడ్బందీగా సర్వే... సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తాం. భవిష్యత్ కార్యాచరణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఎంఈవోల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరూ సర్వేలో భాగస్వాములవుతారు. – యాదయ్య, డీఈవో -
● జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు ప్రణాళిక ● రాళ్లవాగు కాజ్వేకు మోక్షం ● రూ.199 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో
తొలగనున్న కాజ్వే కష్టాలుఈ రోడ్డు విస్తరణలో భాగంగా రాళ్లవాగుపై గతంలో ఉన్న కాజ్వేను తొలగించి బ్రిడ్జిని నిర్మించేందుకు 2024 మార్చి 10న స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు భూమిపూజ చేశారు. ఏటా కాజ్వే రాళ్లవాగు ఉధృతికి కొట్టుకుపోతోంది. వర్షాకాలం ముగిసిన తర్వాత మరమ్మతులు చేసి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైలెవల్ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. కాజ్వే స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని రంగంపేట్, ఆండాళమ్మ కాలనీ, పవర్సిటీ కాలనీ ప్రజలు డిమాండ్ చేయడంతో గతేడాది మార్చిలో బ్రిడ్జిని నిర్మించేందుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమిపూజ చేశారు. వివిధ కారణాలతో పనులు ఆలస్యం కావడం, ఈ మార్గం గుండా ఆరులేన్ల రోడ్డు విస్తరణ జరుగుతుండడంతో, బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం అయింది.మంచిర్యాలటౌన్: పల్లె, పట్టణ అభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మెరుగైన రవాణా సౌకర్యం ఉంటే మారుమూల ప్రాంతాలు కూడా వేగంగా అభిృద్ధి చెందుతాయి. అందుకే ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి తాజాగా మంచిర్యాల నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయింది. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ బండలంలోని 8 గ్రామాలను కలిపి ప్రభుత్వం మంచిర్యాల కార్పొరేషన్గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధికి తగిన విధంగా రహదారుల విస్తరణకు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయించారు. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ ఈనెల 6న మంచిర్యాల అభివృద్ధికి రూ.199 కోట్లు కేటాయిస్తూ జీవో 99 విడుదల చేశారు. ఈ నిధులతో మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారులను ఆరు లేన్లుగా విస్తరించనున్నారు. నిధులు మంజూరు కావడంతో పనులను ప్రారంభించడమే తరువాయి. రోడ్ల విస్తరణకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు ఇటీవలే మార్కింగ్ చేశారు. ఆక్రమణలు తొలగించి రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్ర వరకు ఉన్న జాతీయ రహదారికి జిల్లా కేంద్రంలోని రోడ్లను అనుసంధానించనున్నారు. ఈమేరకు ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు ఆరులైన్ల రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఈ మార్గంలోనే ఉన్న లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి రాళ్లవాగు మీదుగా ప్రస్తుతం ఉన్న కాజ్వే స్థానంలో హైలెవల్ వంతెనను నిర్మిస్తారు. ఈ రోడ్డును పాతమంచిర్యాల–ఆండాళమ్మ కాలనీ రోడ్డును విస్తరించి, పాతమంచిర్యాల స్టేజి వద్ద ఎన్హెచ్ 63కు అనుసంధానిస్తారు. దీంతో ప్రస్తుతం లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల మీదుగా ఆసిఫాబాద్వైపు వెళ్లే వాహనాలు, ఆసిఫాబాద్వైపు నుంచి మంచిర్యాల మీదుగా లక్సెట్టిపేట్ వైపు వెళ్లే వాహనాలకు ప్రస్తుతం లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి వైశ్యభవన్ వరకు ఉన్న బైపాస్ రోడ్డు అనుకూలంగా లేదు. రెండు వాహనాలు ఒకేసారి వెళ్లలేనంత ఇరుకుగా ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణతో పాతమంచిర్యాల మీదుగా లక్సెట్టిపేట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. ఆరు లైన్లుగా విస్తరించనుండడంతో ఒకేసారి మూడు వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. రోడ్ల విస్తరణతో భారీ వాహనాలతోపాటు, పట్టణంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. మంచిర్యాల పట్టణం నుంచి ఎటు వైపు వెళ్లినా జాతీయ రహదారులకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. -
బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ్యూల్ కోరారు. మంచిర్యాలలో డీటీఎఫ్ జిల్లా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా సామ్యూల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పీఆర్సీ, డీఏలు పెండింగ్లో ఉన్నాయని తె లిపారు. రిటైర్ అవుతున్న టీచర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నూతన కమిటీ ఎన్నిక.. డీటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేశ్, ఉపాధ్యక్షుడిగా కుమార్, ప్రధాన కార్యదర్శిగా జయకృష్ణ, జిల్లా కార్యదర్శులుగా ప్రకాశ్, కళావతి, అప్పారావు, సురేశ్, రాష్ట్ర కౌన్సిలర్లుగా జాకీర్హుస్సెన్, సంతోష్, ఆడిట్ కమిటీ కన్వీనర్గా విష్ణువర్థన్, సభ్యులుగా శ్రీనివాస్, రాజన్న ఎన్నికయ్యారు. సమావేశంలో సీనియర్ నాయకులు కొండయ్య, సత్యనారాయణ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
వార్షిక ఉత్పత్తి సాధించిన ‘ఆర్కేన్యూటెక్’
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 18 రోజుల ముందే సాధించింది. మార్చి 31 నాటికి గని వార్షిక ఉత్పత్తిలక్ష్యం 1.6 లక్షల టన్నులు సాధించాల్సి ఉండగా ఆదివారం నాటికే సాధించిందని గని మేనేజర్ స్వామి రాజు తెలిపారు. ఉత్పత్తితోపాటు ఉ త్పాదకతలో 1.28 ఓఎంఎస్ సాధించినట్లు పే ర్కొన్నారు. 18 రోజుల ముందే వార్షిక ఉత్పత్తి ని సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశా రు. ఇందుకు కృష చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులను ఆయన అభినందించా రు. ఈ గనిలో 1983లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ఇంకా రెండేళ్ల జీవితకాలం ఉందని తెలిపారు. అండర్ గ్రౌండ్మైనింగ్లో ఈ గని జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ నమోదు చేసుకుందని వెల్లడించారు. -
నూతన బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలి
● డిప్యూటీ సీఎంకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వినతి శ్రీరాంపూర్: సింగరేణికి నూతన గనులను కేటా యించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతి నిధ్య సంఘం ఐఎన్టీయూసీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్లో భట్టి నివాసంలో ఆదివారం కలిసి వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థకు భవిష్యత్ ఉంటుందన్నారు. సత్తుపల్లి ఓసీపీ 3, ఇల్లెందు ఓసీపీ 3తోపాటు గతంలో అనుమతి ఇచ్చిన తాడిచర్ల గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. వీటిలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీవీకే ఓసీపీ, కేటీకే ఓసీపీ, ఇల్లెందు ఓసీపీలలో బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లతో కాకుండా సింగరేణి కార్మికులతో చేపట్టాలని కోరారు. తమ విన్నపాలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీకి చెందిన మిర్యాల రంగయ్య, కె.వీరభద్రయ్య, సారయ్య, వైవీ.రావు, మడ్డి ఎల్లయ్య, షేక్ బాజీసైదా, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, త్యాగరాజన్, సమ్మయ్య శంకర్రావు, వికాస్ కుమార్ పాల్గొన్నారు. -
బాలుడిని బలిగొన్న బాటిల్ క్యాప్
లక్సెట్టిపేట: తొమ్మిది నెలల బాలుడు కూల్డ్రింగ్ బాటిల్ క్యాప్ మింగి మరణించిన ఘటన లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఆదివారం జరిగింది. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సురేందర్కు భార్య, కుమార్తె, కుమారుడు రుద్రాయన్ ఉన్నారు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంత కొమ్ముగూడెం వెళ్లారు. అక్కడ బాలుడు కూల్డ్రింక్ బాటిల్ మూత నో ట్లో పెట్టుకుని ఆడాడు. తర్వా త అది గొంతులోకి జారింది. ఊపిరి ఆడకపోవడంతో తల్లి దండ్రులు వెంటనే క్యాప్ తీసి కారులో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. -
కవులు, కళాకారులకు పుట్టినిల్లు
చెన్నూర్: కవులు, కళాకారులకు చెన్నూర్ పుట్టినిల్లని డాక్టర్ దేవరాజు రాంబావు అన్నారు. స్థానిక అన్నపూర్ణ అంజుమన్ సాంబయ్య మ హావాది స్మారక భవనంలో మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సీతా చరి తము, రుక్మిణి కళ్యాణం పుస్తకాలను అదివా రం ఆవిష్కరించారు. సమావేశంలో రాంబావు మాట్లాడుతూ కవి రచయిత వానమామలై వ రదాచార్యులు నడియాడిన గడ్డపై ఎందరో రచయితలు వివిధ రకాల రచనలు చేశారని గుర్తు చేశారు. అనంతరం రచయిత కొమ్మెర రాజేశ్వర్రావు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో కాకిరాల పద్మకర్రావు, సురేశ్బాబు, పనకంటి రామ్మోహన్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
● బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్మందమర్రిరూరల్: డ్రగ్స్ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ క్రికెట్ మ్యాచ్లో మందమర్రి సర్కిల్ పోలీస్, మందమర్రి ప్రెస్క్లబ్ తలపడ్డాయి. పోలీస్ టీం నిర్ణీత 14 ఓవర్లలో 111 పరుగులు చేయగా ప్రెస్క్లబ్ టీం 110 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో మందమర్రి సర్కిల్ పోలీస్ టీం విజయం సాధించింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏసీపీ హాజరై మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. డ్రగ్స్ క్రయ విక్రయదారులపైనే కాకుండా సేవించిన వారిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది, ప్రెస్క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
టైర్ పేలి లారీబోల్తా
గుడిహత్నూర్: లారీ టైర్ పేలి బోల్తాపడిన ఘటన మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన లారీ దుస్తుల లోడ్తో వెళ్తోంది. మార్గమధ్యలో ఒక్కసారిగా టైరు పేలి పక్కనే నిలిచి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టి అండర్మ్యాన్ పాస్ వద్ద రోడ్డుపై పడింది. దీంతో క్యాబిన్ నుజ్జునుజ్జుయింది. అటు నుంచి వెళ్తున్న పలువురు, ఎన్పీడీసీఎల్ హెల్పర్ హన్మంతు, మధ్యప్రదేశ్కు చెందిన దుస్తుల వ్యాపారి వేర్వేరు బైక్లపై వస్తున్నారు. దుస్తుల వ్యాపారి బైక్పై పైనుంచి టైర్లు పడడంతో వాహనం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన క్షణంలో హెల్పర్ బైక్పై పడ్డ రివిట్మెంట్ బండలతో వాహనం దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నుజ్జునుజ్జుయిన క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ మురుగేశన్ (49) బయటకు తీయించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. తప్పిన పెను ప్రమాదం ఈ ఘటన శుక్రవారం జరిగి ఉంటే పెను ప్రమాదంగా మారేది. అంగడి బజార్ సంత వల్ల ఈ ప్రాంతమంతా కిక్కిరిసిన జనాలతో ఉండేది. ఈ ప్ర మాదం జరిగి ఉంటే పదుల సంఖ్యలో మృతి చెందేవారు. జాతీయ రహదారి నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై నిత్యావసరాల కోసం లారీలను నిలపడం సైతం ఒక కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడిహత్నూర్లో ఘటన డ్రైవర్ మృతి -
కుటుంబంలో మహిళల పాత్ర కీలకం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వరకు అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ఖాన్లతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు సా మాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతోపాటు ముఖ్య మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎ యిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని, ప్ర తీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. లింగ భేదం లేకుండా అబ్బాయిలు, అమ్మాయిలను ఒకేలా చూస్తూ సమాన అవకా శాలు కల్పించాలని అన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికా రులు, ఉద్యోగులను ప్రశంసాపత్రాలు, శాలు వాలతో సత్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
మహిళా శక్తి మహోన్నతమైన శక్తి
● డీసీపీ ఎగ్గడి భాస్కర్ ● ఘనంగా మహిళా దినోత్సవం మంచిర్యాలక్రైం: మహిళా శక్తి మహోన్నతమైన శక్తి అని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అ న్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డీసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడు తూ శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పో లీస్ల పాత్ర కీలకమని కొనియాడరు. పురుష పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తించ డం అభినందనీయమని అన్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ సీపీ ఆర్.ప్రకాష్, సీఐలు ప్రమోద్రావు, కుమారస్వామి, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేష్కుమార్, షీ టీమ్ ఎస్సై హైమా, భరోసా, సఖీ సెంటర్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
వారబందీ.. ఇబ్బంది!
● సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు ● నాలుగు తడుల్లో రెండు తడులే అందాయి.. ● పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదనదండేపల్లి: కడెం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో అందించే సా గునీరు సక్రమంగా అందడం లేదంటూ మండలంలోని నాగసముద్రం మూలమలుపు వద్ద కడెం ఆయకట్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ–22, 23, 24 కాలువల ఆయక ట్టు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. తాళ్లపే ట, నాగసముద్రం, మాకులపేట గ్రామాల రైతులు పలువురు మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు నీటిని వారబందీ పద్ధతిలో డిస్ట్రిబ్యూటరీ–28 వరకు అందిస్తామని చెప్పారని, మొక్కజొన్న, వరి తదితర పంటలు సాగు చేసుకున్నామని తెలి పారు. ఇటివరకు నాలుగు తడులు వచ్చాయ ని, ఇందులో రెండు మాత్ర మే సక్రమంగా ఇ చ్చారని, మూడో తడి నుంచి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదో తడి రావాల్సి ఉన్నా ఇంతవరకు రాలేదని తెలిపారు. నాలుగో తడి సక్రమంగా అందలేదని పది రోజుల క్రితం ప్రధాన కాలువలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు ఐదో తడి విషయంలో నిర్లక్ష్యం చేయడంతో రోడ్డెక్కారు. అధికారులు సాగునీరందిస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్సై తహసీనొద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నర్సాపూర్(జి): అప్పుల బాధతో రైతు ఉరేసుకుని ఆ త్మహత్యకు పాల్ప డ్డాడు. మండలంలో ని గొల్లమాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఎండీ.జలాలుద్దీన్ కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన రైతు నీరటి గంగాధర్ (44) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత రెండేళ్లుగా పంట సాగుచేస్తున్నాడు. సరైన దిగుబడి రాలేదు. పంట పె ట్టుబడి కోసం ఇతరుల వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లిస్తాననో లే దో అని మనస్తాపం చెంది శనివారం గ్రామ శివారులోని వేపచెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య సవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో మూడిళ్లు దగ్ధం
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని ఆడదస్నాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మూడిళ్లు దగ్ధమైంది. ఇంట్లో నిత్యావసరాలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ధరవత్ బలరాం, నాందేవ్ జమిందార్ ఇళ్లపై నుంచి విద్యుత్ వైర్లు ఉండగా రాత్రి సమయంలో గాలికి ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలో గడ్డి వాముపై నిప్పు పడటంతో ఇళ్లకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో ఓ ఎద్దు మృతిచెందింది. రెండు ఎడ్లకు గాయాలయ్యాయి. సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్ శనివారం దగ్ధమైన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఎమ్మెల్సీ దక్కేనా..!
● ఎమ్మెల్యే కోటా కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఆశలు ● రేఖానాయక్, నరేశ్జాదవ్ ప్రయత్నాలు ● ఒకటి ఎస్టీకి కేటాయిస్తారనే ప్రచారం ● అధిష్ఠాన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి సాక్షి, ఆదిలాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే విషయంలో రాష్ట్రంలో అందరూ ఆసక్తిగా గమనిస్తుండగా, అందులో ఒకటి ఎస్టీ సామాజికవర్గానికి కేటా యిస్తామని పార్టీ చెబుతుందని ప్రచారం జరుగుతు ండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేఫథ్యంలో ఆదిలా బాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు నే తలు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సీనియ ర్ నాయకుడు నరేశ్ జాదవ్ పదవీని ఆశిస్తున్నారు. ఈ నేఫథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరికై న దక్కుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఆదివారం పార్టీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుండగా ఎవరికి దక్కుతుందని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కాంగ్రెస్కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక స్థానాన్ని ఎస్టీ నుంచి భర్తీ చేసే యోచనలో పార్టీ ఉందని ప్రచారం నడుస్తోంది. అందులో మహిళగా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ను పార్టీ పరిశీలన చేస్తుందనే ప్రచారం లేకపోలేదు. మహిళా అభ్యర్థుల పరంగా రాష్ట్రంలో విజయశాంతితోపాటు రేఖానాయక్లో ఎవరికై న ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజికవర్గంలో రేఖానాయక్ను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్జాదవ్ కోరుతున్నాడు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను కలిసి తన ప్రాతినిధ్యం పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇద్దరి నేతల్లో ఎవరినైన ఆదరిస్తుందా అనేది ఎదురుచూడాల్సిందే. లంబడాలు ప్రాతినిధ్యం కల్పించలేదనే.. ఉత్తర తెలంగాణ పరిధిలో గతంలో కాంగ్రెస్ని ఆదరించిన లంబడాలు క్రమంగా బీజేపీ వైపు వెళ్తున్నారని, ప్రధానంగా వారికి ప్రాతినిధ్యం కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ఆ పార్టీకి చెందిన ఆ సామాజికవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి పరిస్థితిలో మార్పు రాకపోతే పూర్తిగా దూరమవుతారని పార్టీకి హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎస్టీ కోటాలో లంబడాల నేతలను ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థిగా ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు రేఖానాయక్, అటు నరేశ్జాదవ్ రాష్ట్ర ముఖ్య నేతలను కలుస్తూ ఎమ్మెల్సీ కేటాయించాలని కోరుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే. పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితుల నేఫథ్యంలో.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే ఒకరు మాత్రమే ఉన్నారు. మిగతా స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ, రెండింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం పార్టీకి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరగా, ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఫలితాలు లభించలేదన్న ప్రచారం లేకపోలేదు. అప్పట్లో పార్టీ పరంగా అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారే మిగతా నియోజకవర్గాల్లో ఇన్చార్జీలుగా ఉన్నారు. అధికారంలో ఉండటంతో సులువుగా పార్లమెంట్ స్థానాన్ని సాధిస్తామని అనుకున్నప్పటికి ఫలితం తారుమారైంది. ఈ స్థానంలో కమలం పార్టీ గెలుపొందడం కాంగ్రెస్ శ్రేణులకు నిరాశను కలిగించింది. తాజాగా పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీలో కాషాయం పార్టీకే ఆదరణ లభించింది. ఇలాంటి పరిస్థితిలో పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీకి జవజీవసత్వాలు కలిగించేందుకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమ్యెల్యే కోటా ఎమ్యెల్సీల్లో ఇక్కడి నేతలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
ఇస్రో పిలుస్తోంది!
● అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన ● తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ● యువికా కార్యక్రమానికి 23వ తేదీ తుది గడువు మంచిర్యాలఅర్బన్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఏటా ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)–25 పేరిట నిర్వహిస్తోంది. మే 19 నుంచి 30 ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఏడా ది దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆ హ్వానిస్తోంది. మార్చి 23 తేదీలోపు www. isro. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వడపోత అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న వారి జాబితా విడుదల చేస్తారు. తర్వాత 14 రో జులపాటు అవగాహన తరగతులు నిర్వహిస్తారు. ఎంపిక ఇలా.. ఆయా పాఠశాలలో ప్రస్తుతం మార్చి 1, 2025 నాటికి తొమ్మిదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యతోపాటు సహపాఠ్యంశాలపై మంచి పట్టు ఉండాలి. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పెస్, సైన్స్క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ స్వ్కాట్ అండ్ గౌడ్ విభాగంలో 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికై న విద్యార్థులకు..ఇస్రో నిర్వహిస్తున్న యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం భోజనం, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తోంది. వారికి మే నెలలో 14 రోజుల పాటు ఇస్రో స్పెస్ సెంటర్లకు తీ సుకెళ్తారు. అక్కడ స్పెస్కు సంబంధించి విశేషాలు, సప్తగ్రహ కూటమి, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖీగా మాట్లాడే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఏడు కేంద్రాల్లో నిర్వహణఇస్రో ఈకార్యక్రమాన్ని దేశంలో ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) తిరువనంతపురం, యూఆర్ఎస్ (ఎన్ఆర్ఎస్సీ) బెంగుళూరు, స్పేస్ ఆఫ్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) ఆహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సె న్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) హైదరాబాద్, ఈశన్యస్పెస్ ఆఫ్లికేషన్ సెంటర్(ఎన్ఈ–ఎస్ఏసీ) శి ల్లాంగ్, ఎస్డీఎస్సీ శ్రీహరికోట, ఐఐఆర్ఎస్ డెహ్రడూన్లో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. విద్యార్థులకు అవకాశం యువికా ద్వారా విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. 150 మందికి అవగాహన తరగతులు నిర్వహిస్తారు. నిపుణులు, శాస్త్రవేత్తలతో అంతరిక్ష విజ్ఞానంపై బృందచర్చ, ప్రాక్టికల్ ఫీడ్ బ్యాక్ తరగతులు చూపిస్తారు. ఆయా ప ట్టణాల్లో ఇస్రో ప్రయోగ కేంద్రాలు, ప్రయోగశాలలను చూపిస్తారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబును సంప్రదించాలి. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
● పంట రక్షణకు వెళ్లి..విద్యుత్ తీగలకు తగిలి రైతు మృతి
కంచె ప్రాణం తీసింది●తానూరు: విద్యుత్ కంచె ఓ రైతు ప్రాణం తీసింది. అడవి జంతువుల బారి నుంచి పంట రక్షణ కోసం వెళ్లి కరెంట్ తీగలకు తగిలి మృతిచెందాడు. మండలంలోని మహలింగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై శ్యాముల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తురాఠి గంగాధర్ (60) వ్యవసాయం చేస్తుంటాడు. అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించేందుకు విద్యుత్ కంచె తీగలు ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం చేనులో పంట రక్షణ కోసం వెళ్తున్నానని కుటుంబీకులకు చెప్పి బయల్దేరాడు. రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. శనివారం ఉదయం వారు చేనులో వెళ్లి చూసేసరికి విద్యుత్ కంచె తీగలకు తగలి విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య గంగామణి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
శ్రామిక మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం
● ఐఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి కామిల్ల జయరావు మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రామిక మహిళలకు రక్షణ కలిపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి కామిల్ల జయరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఆర్టీయూ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం హాజీపూర్ మండలం ముల్కల్ల ఇటుక బట్టీల వద్ద మహిళా కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఇటుక బట్టీ కార్మికులు లక్ష్మీ, మదునక్క, పద్మ, వెంకటమ్మ, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.