Mancherial
-
డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు
● పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే మంచిర్యాలటౌన్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావుతో కలిసి జెడ్పీ బాలుర మైదానంలోని సభ ఏ ర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలనతోపాటు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. డిప్యూటీ సీఎం వెంట రా ష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర సమాచార సాంకేతి క, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్, కామ ర్స్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫ రా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వ స్తారని వివరించారు. అనంతరం కాలేజీరోడ్డులో ని ర్మించిన మహాప్రస్థానం పనులను పరిశీలించి, ప్రా రంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్రావు, ము న్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ, తహసీల్దార్ రఫతుల్లా పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రికి రిటైర్డ్ కార్మికుల వినతి
శ్రీరాంపూర్: కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డికి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నా యకులు వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్లో ఆదివారం మంత్రిని కలిశారు. సీఎంపీఎఫ్ శాఖ లో జరుగుతున్న లోపాలను వివరించారు. రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుదల చేయాలని కోరారు. రిటైర్డ్ కార్మికులు చాలీచాలని పెన్షన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సింగరే ణి రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వా సుదేవరావు, ప్రధాన కార్యదర్శి జేవీ.దత్తాత్రేయులు, కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్సీ బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.బాబురావు, ఉ ప ప్రధాన కార్యదర్శి ఆళవేందార్ వేణుమాదవ్, నా యకులు శ్రీధర్రావు, పులి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
నేడు డిప్యూటీ సీఎం, మంత్రుల రాక
మంచిర్యాలటౌన్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవా రం జిల్లాలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆదివారం మాట్లాడారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం హెలికాప్టర్లో మంచిర్యాల చేరుకుంటారని తెలిపారు. 11:15 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా కేంద్రంలో పర్యటిస్తారన్నారు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ, రాళ్లవాగు వద్ద కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వివరించారు. అనంతరం మాతా శిశు, సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలిస్తారన్నారు. తర్వాత ఓపెన్ టాప్ జీప్లో ఐబీ చౌరస్తా నుంచి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ర్యాలీ ఉంటుందని తెలిపారు. బహిరంగ సభ.. జెడ్పీ మైదానంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు కొత్త పథకాలు ప్రకటిస్తారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే వెల్ల డించారు. సభకు 40 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. డంప్యార్డు సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు ఖాయమన్నారు. మంగళవారం నుంచి మహాప్రస్థానం అందుబా టులోకి వస్తాయని పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు, డెత్ సర్టిఫికె ఇస్తామని తెలిపా రు. మంచిర్యాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు కోసం తాను నిరంతరం కృషి చే స్తున్నానని, కాంగ్రెస్ కార్యకర్తలు క్రమశిక్షణతో సభను విజయవంతం చేయాలని కోరారు. -
ఉత్తమ రచనలకు ప్రశంస
లక్సెట్టిపేట: న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల జస్టిస్ ఎట్ గ్రాస్ రూట్స్, రోల్ ఆఫ్ డిస్టి క్ జ్యూడీషియరీ అనే అంశంపై స్థానిక మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్ రాసిన వ్యాసాలకు మొదటి స్థానం లభించింది. తెలంగాణ న్యా యమూర్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శనివారం రాత్రి నిర్వహించిన స మావేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పీ ఎస్.నరసింహ ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజెపాల్, జస్టిస్ లక్ష్మణ్, తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.ప్రభాకర్రావు పాల్గొన్నారు. -
● ‘రాజీవ్ యువ వికాసం’కు నేడే ఆఖరు ● మూడు రోజులుగా పనిచేయని సైట్ ● వరుసగా సెలవులున్నా ఆఫ్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● జిల్లాలో ఇప్పటికే 47,431 మంది దరఖాస్తులు
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి క ల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించినప్పటికీ, సాంకేతిక సమస్యలతో దరఖాస్తు ప్రక్రియలో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినా మూడు రోజులుగా సైట్ పని చేయడం లేదు. దీంతో గడువు పెంచాలని పలువురు కోరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ.. రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే, వె బ్సైట్లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోడ్ కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి ఆఫ్లైన్ ద్వారా మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. గడువు సమీపిస్తున్నా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఆఫ్లైన్తో ఊరట ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో వెబ్సైట్ తెరవకపోవడం, దరఖాస్తుల సబ్మిషన్లో ఆటంకాలు వంటి సమస్యలతో యువత ఇబ్బందులు ఎదుర్కొంది. మూడు రోజులుగా వెబ్సైట్ సరిగా పనిచేయకపోవడంపై నిరుద్యోగులు ఫిర్యాదు చేశారు. రెండో శని వారం, ఆదివారం, అంబేద్కర్ జయంతి సెలవులతో మూడు రోజులు కార్యాలయాలు మూ తపడినప్పటికీ, సెలవు రోజుల్లోనూ దరఖాస్తుల స్వీకరణ కు సిబ్బందిని నియమించడంతో వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. ఆఫ్లైన్ విధానంతో మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచగా, సిబ్బంది వివరాలను నమోదు చేసేందుకు సహకరిస్తున్నారు. గడువు పెంచాలని వినతి..ఆన్లైన్ సమస్యలు కొనసాగుతుండడం, వరుస సెలవుల నేపథ్యంలో గడువును మరోసారి పొడిగించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఆఫ్లైన్ విధానం లేకపోతే దరఖాస్తు ప్రక్రియలో మరింత గందరగోళం నెలకొనేదని, ఈ విధానం యువతకు ఊరటనిచ్చిందని అభిప్రాయపడుతున్నారు. చివరి రోజుల్లో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో, అధికారులు కూడా గడువు పొడిగింపు అవసరాన్ని అంగీకరిస్తున్నారు. -
ఎల్లంపల్లిలో మరింత తగ్గిన నీటిమట్టం
మంచిర్యాలరూరల్(హాజీపూర్):వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రవాహం లేకపోవడంతో జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట వద్ద నిర్మించిన ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్) ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోంది. ఆదివారం నాటికి ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా 143 మీటర్లుగా ఉంది. 20.175 టీఎంసీల సామర్థ్యానికిగాను 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో కింద 574 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇందులో గూడెం ఎత్తిపోతల పథకానికి 145 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 308 క్యూసెక్కులు తరలిస్తుండగా, ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 20,192 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. -
పక్కా ప్రణాళికతో లక్ష్యసాధన
శ్రీరాంపూర్/భీమారం: పక్కా ప్రణాళికలతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీని ఆదివారం సందర్శించారు. క్వారీలోని వ్యూపాయింట్ నుంచి పని ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందారం ఓసీపీని సంప్ ఏరియాలో బొగ్గు నిల్వలను ఉత్పత్తికి భంగం కలుగకుండా వీలైనంత త్వరగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఇప్పటినుంచే ప్రణాళికలకు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అంతకు ముందు జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులతో బొగ్గు ఉత్పత్తి, రవాణా, రక్షణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓసీపీలో మాట్లాడుతూ ఓసీపీలో ఓబీ సంస్థలు తమకు నిర్దేశించిన మట్టి వెలికితీత పనులు చేయాలన్నారు. నెలవారీగా లక్ష్యాలను సాధిస్తేనే వార్షిక లక్ష్యాలను చేరకుంటామన్నారు. సీఆర్ఆర్, జీవీఆర్, వారాహి సంస్థలు తమ పని సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. దీనికి కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలన్నారు. 2025–26లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం గని అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి కంపెనీ లక్ష్యాల సాధన కోసం పాటుపడాలన్నారు. రక్షణ పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఉత్పత్తి అయిన బొగ్గును సకాలంలో రవాణా చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఇంజినీర్ చంద్రశేఖర్రెడ్డి, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రా జెక్టు అధికారి నాగరాజు, ఎస్సార్పీ ఓసీపీ పీవోటీ శ్రీనివాస్, సర్వే అధికారి సంపత్, ఇందారం ఓసీపీ మేనేజర్ రవికుమార్, రక్షణ అధికారి సతీశ్, వారా హి కంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సరస్వతి కెనాల్లో మృతదేహం లభ్యం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ శివారు గల సరస్వతి కెనాల్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై మాలిక్ రెహమాన్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. సరస్వతి కాలువ నుంచి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎత్తు 5 ఫీట్లు, మృతుడిపై ఆరెంజ్ కలర్ టీషర్ట్, బ్లూకలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే ఎస్సై నంబర్ 8712659521, సోన్ సీఐ గోవర్ధన్రెడ్డి 8712659519 నంబర్లలో సమాచారం అందించాలని సూచించారు. -
సేంద్రియ సాగు.. భేష్!
● స్వయంగా గోశాల ఏర్పాటు ● సేంద్రియ ఎరువులతో కూరగాయల సాగు ● పలు అవార్డులు, పురస్కారాలు అందుకున్న యువరైతు సతీశ్చెన్నూర్రూరల్: రసాయనిక ఎరువులకు స్వస్తిచెప్పి సహజ సిద్ధమైన ఎరువులను తయారుచేస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్కు చెందిన యువరైతు గోనె సతీశ్. ఇంటి వద్దే ఘన జీవామృతం, వర్మికంపోస్టు తయారు చేస్తున్నాడు. ఇందుకు ఆవుపేడ, ఆవు మూత్రం వాడుతున్నాడు. తనకున్న 20 గుంటల భూమిలో సేంద్రియ ఎరువులతో 18 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. గోశాల ఏర్పాటు... మూడేళ్ల క్రితం ఇంటివద్ద షెడ్డు నిర్మించి ఒక్క ఆవుతో గోశాల ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం గోశాలలో 120కి పైగా ఆవులు ఉన్నాయి. ఆవుల పేడతో ఘన జీవామృతం, వర్మికంపోస్టు తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకంపై ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. వారికి అతితక్కువ ధరకు ఎరువులు అందజేస్తున్నాడు. అంతేకాకుండా ఆవు పేడతో పిడకలు తయారుచేసి హోమాలకు, యజ్ఞాలకు అందజేస్తున్నాడు. కూరగాయల సాగు... ఇంటి వద్ద 20 గుంటల భూమిలో బీర, పూదీన, గ్రామ సమీపంలో ఐదెకరాల చేను కౌలుకు తీసుకుని మూడు రకాల వంకాయలు, సోరకాయలు సాగు చేస్తున్నాడు. వంకాయలు రోజుకు ఏడు నుండి ఎనిమిది క్వింటాళ్ల వరకు, సోరకాయలు, బీర కాయలు కలిపి రోజుకు రెండు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నాయి. వాటిని హోల్సేల్గా విక్రయించి ఆదాయం పొందుతున్నాడు. భార్య రజిత, తమ్ముడు భాస్కర్ సహకారం అందిస్తున్నారు. పలు అవార్డులు, ప్రశంసా పత్రాలు సేంద్రియ ఎరువులతో కూరగాయలు సాగు చేస్తున్న సతీశ్ను పలు సంస్థలు ఉత్తమ రైతుగా ఎంపిక చేసి పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశాయి. 2021లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అప్పటి కలెక్టర్ భారతి హోలీకేరి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. 2022లో సుస్థిర వ్యవసాయ రాష్ట్రస్థాయి రైతు చైతన్య సదస్సులో హైదరాబాద్లో పుడమి పుత్ర అవార్డు, నేషనల్ ప్రీమియర్ అవార్డుకు ఎంపికయ్యి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. 2024లో హైదరాబాద్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సహస్ర కంపెనీ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నాడు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లాలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ హైదరాబాద్ వారి చేతుల మీదుగా పుడమి పుత్ర పురస్కారం అందుకున్నాడు. సతీశ్ తయారు చేస్తున్న సేంద్రియ ఎరువులు, గోశాల, కూరగాయల సాగును బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు సందర్శించారు.పుడమితల్లిని కాపాడేందుకు.. నేను 18 ఏళ్లుగా సేంద్రియ ఎరువు తయారుచేస్తూ కూరగాయలు సాగు చేస్తున్నా. 120 ఆవులతో గోశాల ఏర్పాటు చేశా. పశువుల పేడతో పిడకలు కూడా తయారు చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా. రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి పుడమి తల్లిని కాపాడేందుకు సేంద్రియ ఎరువులు వాడాలి. – గోనె సతీశ్, రైతు, శివలింగాపూర్, చెన్నూర్ -
తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది
● అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ● అదనపు కట్నం కోసం టార్చర్.. ● పలుమార్లు పెద్దల పంచాయితీ ● అయినా తీరు మారకపోవడంతో బలవన్మరణం ● దండేపల్లిలో ఘటన.. కేసు నమోదు దండేపల్లి: అత్తింటి వారి అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లి జరిగి ఎనిమిదేళ్లయినా.. అత్తింటి వారి అదనపు కట్నం దాహం తీరలేదు. నాలుగేళ్లుగా భర్తతోపాటు అత్త, మామ, బావ, మరిది వేధింపులను తట్టుకుంది. ఆరు నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా అత్తింటివారి తీరు మారలేదు. చివరకు సున్నిత మనస్కు రాలైన ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. దీంతో ఆరేళ్ల బాబు, ఆరు నెలల పాప తల్లిలేనివారయ్యారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా... ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్కు, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘన(38)తో 2017లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. పెళ్లయిన నాలుగేళ్ల వరకు వీరి కాపురం బాగానేసాగింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భక్త మల్లేశ్కు అదనపు కట్నం కావాలన్న ఆశ పుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి లక్ష్మి, నర్సయ్యతోపాటు అన్న, తమ్ముడు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో వరలక్ష్మి భరించలేకపోయింది. ఈ విషయం పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. ఆరు నెలల క్రితం పాపకు జననం.. ఈ క్రమంలో వరలక్ష్మి రెండోసారి గర్భందాల్చింది. ఆరు నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. దీంతో అదనపు కట్నం వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండడంతో భరించలేకపోయింది. పది రోజుల క్రితం భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు ఫోన్ చేసి చెప్పింది. తాను యశ్వంత్రావ్పేటకు వచ్చిన తర్వాత.. దండేపల్లికి వస్తానని, పుట్టింటికి తీసుకువస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కద బిడ్డా.. అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు చావుకు కారకులైన అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు.. వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
ఖానాపూర్: పట్టణ శివారులోని అర్బన్ పార్క్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం..పట్టణంలోని నిర్మల్–ఖానాపూర్ ప్రధాన రహదారి మీదుగా కుమురం భీం చౌరస్తా నుంచి ఖానాపూర్ వైపు కారు వస్తుంది. నేరడిగొండ మండలం తరణమ్ గ్రామానికి చెందిన హన్మాండ్లు, ముత్యం బైక్పై ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తూ రాంగ్రూట్లో ఢీకొంది. వెనుక నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటోపై బైక్ పడడంతో ఆటో పల్టీకొట్టింది. ప్రమాదంలో హన్మాండ్లు, ముత్యం, ఆటోలో ఉన్న ఖానాపూర్లోని డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన చిన్నయ్య, రమేశ్, చిన్నక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నపట్పికి కారులో ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
విద్యుత్ కంచె తగిలి యువకుడి మృతి
సిర్పూర్(టి): విద్యుత్ కంచె తగలడంతోనే టోంకిని గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందినట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్, సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ స్పష్టం చేశారు. యువకుడి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) మండలం టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్(19) ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. గ్రామ సమీపంలోని తమ సొంత పొలం చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు ప్రమాదవశాత్తు తగిలి మృతి చెందాడు. జయేందర్ తండ్రి చౌదరి చిరంజీవి, పక్క పొలం యజమాని జయరాం పొలం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. విద్యుత్తు లైన్ తగిలి మృతి చెందడంతో తమపై కేసు నమోదవుతుందనే భయంతో ఇద్దరు కలిసి మృతదేహాన్ని పక్కనే ఉన్న పెన్గంగ నదిలో పడేశారు. ఆ తర్వాత చిరంజీవి సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో తన కుమారుడు చౌదరి జయేందర్ ఇంటి నుంచి బయటి వెళ్లి తిరిగి రాలేదని అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ నెల 12న పెన్గంగ నదిలో మృతదేహాన్ని కొందరు భక్తులు గుర్తించారు. పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జయేందర్ మృతదేహాన్ని అతడి తండ్రితోపాటు జయరాం నదిలో పడేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు చౌదరి చిరంజీవి, జయరాంపై అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు..
మంచిర్యాల జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మందమర్రిలో వృద్ధురాలి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. నెన్నెల మండలం మైలారంలో వ్యక్తి విద్యుత్ షాక్తో మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మందమర్రిరూరల్: పట్టణంలోని యాపల్ ఏరియాలోని జాతీయ రహదారిపై ఆదివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ మహంకాళి భూదేవి(65) మృతిచెందింది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. ఇల్లందు క్లబ్ సమీపంలో నివసించే భూదేవి సరుకులు కొనేందుకు యాపల్ ఏరియాలోని జాతీయ రహదారి దాటి సరుకులు తీసుకుని తిరిగి రోడ్డు దాటేందుకు వెళ్తోంది. బెల్లంపల్లి వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొనగా భూదేవి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు మోహన్న్రాజ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి.. నెన్నెల: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ధర్మరాజుల శ్రీనివాస్ (44) కరెంట్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం తన ఇంట్లో టేబి రికార్డర్ రిపేర్కు రాగా దానిని సాల్డరింగ్ చేసి సవరించే క్రమంలో శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ను కర్ర సాయంతో పక్కకు జరిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మహాప్రస్థానంకు సందర్శకుల తాకిడి
మంచిర్యాలటౌన్: పట్టణంలోని కాలేజ్రోడ్డులో నిర్మించిన మహాప్రస్థానం(వైకుంఠధామం)కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. పచ్చని మొక్కలు, గడ్డితో పర్యావరణం ఉట్టిపడేలా అత్యాధునికంగా, గ్రీనరీతో నిర్మించడంతో దానిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సివి రామన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్లో భాగంగా మహాప్రస్థానంను సందర్శించారు. అక్కడున్న వసతులు, నూతన టెక్నాలజీని పరిశీలించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. కాగా, ఈ మహాప్రస్థానం ఈ నెల 14నుంచి వినియోగంలోకి రానుంది. -
‘గడ్డి మందు’పై పోరాటం
● పారాక్వాట్ నిషేధానికి డాక్టర్ల సంఘం ఏర్పాటు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశంలో ఎంతో మంది నిండు ప్రాణాలను బలితీసుకుంటున్న గడ్డి మందు(పారా క్వాట్) నిషేధమే లక్ష్యంగా పోరాటానికి ఓ సంఘం ఏర్పాటైంది. రాష్ట్రంలో పలువురు ప్రైవేటు వైద్యులు కలిసి ‘డాక్టర్స్ అసోసియేషన్ అగెనెస్ట్ పారాక్వాట్ పాయిజ నింగ్’ పేరుతో ఓ సొసైటీని రిజిస్ట్రేషన్ చే యించారు. మంచిర్యాల కేంద్రంగా కార్యకలా పాలు సాగించనున్న ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఖ మ్మంకు చెందిన డాక్టర్ సతీశ్ నారాయణ చౌ దరి, ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన డాక్ట రాకేశ్ చెన్న, ప్రధాన కార్యదర్శిగా వరంగల్కు చెందిన డాక్టర్ మానస మామిడాలతో స హా మరో ఆరుగురి వైద్యులతో కార్యవర్గం ఏ ర్పడింది. ఈ సందర్భంగా సభ్యులు మా ట్లాడుతూ క్షణికావేశంలో గడ్డి మందు తాగి చా లామంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలి పా రు. అనేక దేశాల్లో నిషేధించినా ఇక్కడ విరి విరి గా వాడకంతో అనర్థాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విష రసాయన అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు, పౌరులు తమతో కలసి రావాలని కోరారు. -
సభకు గులాబీ శ్రేణులు దండుకట్టాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ రామకృష్ణాపూర్: వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు దండుకట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లిలోని ఆయన స్వగృహంలో రజతోత్సవ సభ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామం నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి 60కి పైగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు డాక్టర్ రాజరమేశ్, బడికల సంపత్, సుదర్శన్గౌడ్, రామిడి కుమార్, జాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకే యూనిఫాం కుట్టు పని
● యూనిఫాం క్లాత్ పంపిణీ షురూ ● 768 మంది మహిళలకు లబ్ధి ● మే 20లోపు పూర్తి చేయాలిమంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలు కుట్టే బాధ్యతలు మరోసారి మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. దుస్తులు ఎలా కుట్టాలి, కొలతలు వంటి మార్గదర్శకాలను వివరించారు. 2025–26 విద్యాసంవత్సరం నుంచి దుస్తుల డిజైన్లు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మారిన దుస్తుల ఆకృతితో కుట్టేందుకు సులభతరంగా మారింది. జిల్లాలో 10,417 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 1,15,018 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కుట్టు నైపుణ్యం కలిగిన 768 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మే 20నాటికి దుస్తులు కుట్టే పని పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. శనివారం నుంచి మండలాల వారీగా ముడివస్త్రం పంపిణీ చేస్తున్నారు. రెండేసి జతలు.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందించనున్నారు. 768 పాఠశాలల్లో 42,711 మంది ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 630 పాఠశాలల్లో 28,845మంది చదువుతున్నారు. బాలురు 13,774 మంది, బాలికలు 15,071 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతంలో 138 ప్రభుత్వ పాఠశాలల్లో 13,886 మంది ఉండగా.. బాలురు 6,247 మంది, బాలికలు 7,619 మంది ఉన్నారు. విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తులకు ముడివస్త్రం 1,86723 మీటర్లు కావాల్సి ఉండగా 58,059 మీటర్లు జిల్లాకు సరఫరా అయ్యింది. వేసవి సెలవుకు ముందే యూనిఫామ్కు అవసరమైన వస్త్రం జిల్లాకు చేరడంతో కుట్టే బాధ్యతలు మహిళలకు అప్పగించారు. వస్త్రం పంపిణీ.. స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో శనివారం ఏకరూప దుస్తుల వస్త్రాన్ని మహిళా సంఘాల సభ్యులకు డీఈవో యాదయ్య, డీఆర్డీవో కిషన్ పంపిణీ చేశారు. గ్రామీణ అభివృద్ధి ఏపీఎం, ప్రధానోపాధ్యాయులు, మెప్మా టీఎంసీలు మ్యాపింగ్ చేసిన సంఘాల సంభ్యులకు అందజేశారు. సభ్యుల సెల్ఫోన్ నంబర్లు ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. ప్రతీ పాఠశాలలోనూ విద్యార్థుల కొలతలు ఈ నెల 15లోపు పూర్తి చేయాలని డీఈవో యాదయ్య ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాళవీదేవి, సెక్టోరల్ అధికారి చౌదరి, టీఎంసీ చంద్రయ్య, టౌన్లెవల్ ప్రెసిడెంట్ జ్యోతి, స్వయం సహాయక సంఘాల పాల్గొన్నారు. -
వేడెక్కుతున్న ఓసీపీలు
● 40డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు ● ఉపశమన చర్యలు చేపట్టిన కంపెనీ ● పని వేళలు మార్చాలని డిమాండ్పని వేళలు మార్చాలి..ఎండ తీవ్రత దృష్ట్యా ఓసీపీల్లో పని వేళలు మార్చాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం షిఫ్ట్ 7గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఉంటుంది. దీన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్చాలని కోరుతున్నారు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దీన్ని సాయంత్రం 4 గంటల నుంచి 11 వరకు మార్చాలని అంటున్నారు. గతంలో వేసవి వచ్చిందంటే ఈ కొత్త పనివేళలు అమలు చేసేవారు. కానీ గత మూడేళ్ల నుంచి ఎన్నిసార్లు కార్మికులు డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఈసారైనా వేళలు మార్చాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి ఎస్కే బాజీసైదా డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్: రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఓపెన్ కాస్టు ప్రాజెక్టు(ఓసీపీ)లు వేడెక్కుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగడంతో ఓసీపీలు, ఇతర సర్ఫేస్ డిపార్టుమెంట్లలో పని చేస్తున్న కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోల్చితే సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఓసీపీ ప్రాంతాల్లో బొగ్గు అంతా ఎండలో ఉండడంతో దాని ప్రభావం వల్ల ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతుంది. ఎండ వేడి వల్ల కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా పరిధిలోని బెల్లంపల్లి రీజియన్లో ఉన్న ఓసీపీల్లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధి కై రిగూడ, మందమర్రి ఏరియా పరిధి కేకే ఓసీపీ, ఆర్కేపీ ఓసీపీ, శ్రీరాంపూర్ ఏరియా పరిధి ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీలు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఓసీపీలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదైంది. శనివారం 39 డిగ్రీలు నమోదు కాగా, మందమర్రిలో 38 డిగ్రీలు, బెల్లంపల్లిలో 39 డిగ్రీలు నమోదైంది. వీటిలో ఎండ తీవ్రతను కార్మికులు తట్టుకోవడం కోసం కంపెనీ ఉపశమన చర్యలు చేపట్టింది. చలువ పందిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ ఎండలు ముదురడంతో కార్మికులు వడదెబ్బ బారిన పడకుండా ఉండడం కోసం యాజమాన్యం ఉపశమన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని ఓసీపీల్లోని క్వారీల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే సమయంలో కార్మికులకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు కార్యాలయాల వద్ద వాటర్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. కార్మికులు పని స్థలాల వద్దకు చల్లని నీరు తీసుకెళ్లడం కోసం ప్రత్యేకంగా కూల్ బాటిళ్లు అందజేశారు. ఓసీపీల్లో ఓబీ పనులు, సీహెచ్పీల వద్ద బెల్ట్ క్లీనింగ్, షెల్పికింగ్, రోడ్లు ఊడ్చే ఇతర కార్మికులకు కూడా కాంట్రాక్టర్లు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అయితే కాలనీల్లో సివిక్ పనులు చేసే కాంట్రాక్టు కార్మికులకు మాత్రం ఇవ్వడం లేదు. వారికి కూడా వడదెబ్బ తగలకుండా ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆర్కేపీ ఓసీపీ మూసివేత కార్యక్రమం సాగుతుండడంతో అక్కడ వేసవి ఉపశమన చర్యలు నామమాత్రంగానే చేపట్టింది. వాహనాల్లో ఏసీ క్వారీల్లో నడిచే వాహనాలన్నీ ఏసీ కండీషన్లో ఉంచాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు షవ ల్స్, డంపర్లు, డోజర్లు ఇతర అన్ని భారీ వాహనాల్లో ఏసీలు చెడిపోతే మరమ్మతు చేయిస్తున్నారు. -
● మంత్రులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● అంబేడ్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
విగ్రహ పనులన్నీ పూర్తి చేయాలిమంచిర్యాలటౌన్: అంబేడ్కర్ విగ్రహ పనులను ఈ నెల 13న సాయంత్రంలోపు పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కొనసాగుతున్న అంబేడ్కర్ విగ్రహ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 14న అంబేడ్కర్ 134వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అంబేద్కర్ జయంతి రోజునే మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు చొరవతో ఈ నెల 14న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు పౌరసరఫరాల, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో పలు శాఖలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. జిల్లా కేంద్రంలో బైపాస్ అమరవీరుల స్తూపం మీదుగా రంగంపేట వైపు పాత మంచిర్యాల వరకు ఆరు వరుసల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. గోదావరి వరదలతో ముంపు రాకుండా రాళ్లవాగుపై నిర్మించనున్న రక్షణ గోడ పనులు ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరిస్తారు. తర్వాత జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పరిశీలిస్తారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంబేడ్కర్ జయంతి వేడుకలతోపాటు ఇతర అభివృద్ధి పనులకు మోక్షం కలుగనుంది. సాయంత్రం జిల్లా కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హామీలు కురిపిస్తారా? సీఎల్పీ నేతగా అసెంబ్లీ ఎన్నికల ముందు జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన డిప్యూటీ సీఎం ‘భట్టి’ స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్కు ఆప్తులుగా ఉన్నారు. చాలా రోజులుగా ఆయన చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించాలని ప్రణాళిక వేస్తున్నప్పటికీ వీలు కాలేదు. తొలిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్న ‘భట్టి’తో పలు హామీలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పార్టీ అధికారంలోకి రాగానే మంచిర్యాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీలు ఇచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పర్యటనలో అభివృద్ధి కోసం నిధుల ఇచ్చేలా హామీలు తీసుకునే అవకాశం ఉంది. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేయాలి మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 14న నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరయ్యే సమావేశం కావడంతో పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా చేపడుతున్న ఏర్పాట్లును శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. -
ప్రాణాలు తీసిన చేపల వేట
● ప్రమాదవశాత్తు వాగుకుంటలో పడి ఇద్దరి మృతి ● మృతులిద్దరూ బావ బామ్మర్దులు నందిపేట్(ఆర్మూర్): చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రమాదవశాత్తు బావబామ్మర్దులు ఇద్దరు నీట మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిద్దాపూర్లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. నిర్మల్ జిల్లాకు చెందిన షేక్ షాదుల్లా(46) తన కుటుంబంతో కలిసి 18 ఏళ్ల క్రితం ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి వచ్చి మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడప జిల్లా పొద్దుటూర్కు చెందిన అతని బావమరిది మహమ్మద్ రఫీక్(47) రంజాన్ పండుగ సందర్భంగా వారం క్రితం మచ్చర్లకు వచ్చాడు. కాగా, శుక్రవారం సా యంత్రం సరదాగా చే పలు పట్టేందుకు ఇద్ద రూ కలిసి నందిపేట మండలంలోని సిద్దాపూర్ శివారులోని చిన్నవాగు సంబంధించిన మునికుంటకు వెళ్లారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు రఫీక్ కాలు జారి కుంటలో పడిపోయాడు. దీంతో అతనిని రక్షించేందుకు షాదుల్లా కుంటలోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడం, మునికుంటలో లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి మృతి చెందారు. మృతుడు షేక్ షాదుల్లా కొడుకు షేక్ సులేమాన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. -
కన్న కొడుకునే కడతేర్చిన తండ్రి ?
● విద్యుత్ షాక్ పెట్టి చంపేసి.. ● వాగులో పడేసి పోలీసులకు ఫిర్యాదు ● ఆస్తి వివాదమే కారణమని ప్రచారం సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్(19)ను భూ పంపిణీ వివాదంలో కన్న తండ్రే కడతేర్చాడనే ప్రచారం జరుగుతోంది. గతకొంత కొంతకాలంగా భూమి, ఆస్తులపై వివాదం ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కుమారుడు జయేందర్ తిరిగి రాలేదని తండ్రి చౌదరి చిరంజీవి సిర్పూర్(టి) పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 10న పోలీసులు విచా రణ చేపట్టగా యువకుడి ఆచూకీ లభించలేదు. శని వారం ఉదయం హనుమాన్ జయంతికి టోంకిని హనుమాన్ ఆలయానికి వచ్చిన భక్తులు పెన్గంగ నదిలో స్నానానికి వెళ్లగా మృతదేహం కనిపించింది. సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి జ యేందర్ తల్లిదండ్రులను పి లిచి విచారించగా తమ కుమారుడే అని గుర్తించారు. కాగా, ఈ నెల 10న టోంకిని స మీ పంలోని తమ స్వంత పొలంలో అడవి పందులు రాకుండా విద్యుత్తు వైర్లు అమర్చగా ప్రమాదవశాత్తు తగిలి జయేందర్ మృతిచెందాడని, తమపై కేసులు నమోదు అవుతాయనే భయంతో సమీపంలో ఉన్న పెన్గంగలో మృతదేహాన్ని పడవేసి పోలీసుస్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారనీ ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించామని, ఆదివారం పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు. -
భారత్ గౌరవ్ వేసవి ప్రత్యేక రైళ్లు
● ఈనెల 23 నుంచి మే 2 వరకు హరిద్వార్ రిషికేశ్–వైష్ణోదేవియాత్ర ● అతి తక్కువ ధరలతో దైవ దర్శనాలు ● మంచిర్యాల స్టేషన్లో హాల్టింగ్ మంచిర్యాలఅర్బన్: దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల దర్శనానికి భారత్ గౌరవ్ పేరిట వేసవి ప్రత్యేక రైళ్లను ఐఆర్సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని టూరిజం మానిటర్లు ప్రశాంత్, శ్రీకాంత్ తెలిపారు. మంచిర్యాల రైల్వేస్టేషన్లో పుణ్యక్షేత్రాలు, ప్యాకేజీలు, రైళ్ల వివరాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఈనెల 23 నుంచి జూన్ 12వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. 23 నుంచి మే 2 వరకు ప్యాకేజీ–1లో గురుకృప రైలు ద్వారా హరిద్వార్ రిషికేష్–వైష్ణోదేవి యాత్ర అతి తక్కువ ఽటికెట్ ధరలతో దైవదర్శనాలు చేసుకోవచ్చన్నారు. పది రోజులు కొనసాగే యాత్రలో భాగంగా విజయవాడ నుంచి బయల్దేరనున్న రైలు గుంటూరు, నల్గొండ, సిక్రిందాబాద్, కాజీపేట్ మీదుగా కాగజ్నగర్, బల్లార్షా, వార్థా నాగపూర్ మీదుగా వెళ్తుందన్నారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్లో నిలుపుదల (హాల్టింగ్) అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈనెల 25న హరిద్వార్ చేరుకుంటుందని అక్కడి నుంచి బస కేంద్రానికి తరలిస్తారన్నారు. మానసదేవి ఆలయ దర్శనం, గంగాహారతి, 26న రిషికేష్ చేరుకుని గంగాస్నానాలు, రామ్జూలా, లక్ష్మణ్జూలా, రాత్రి 9 గంటలకు ఆనంద్సాహేబ్కు బయల్దేరుతుందన్నారు. 27న గురుద్వారా, నైనాదేవి, ఆలయ సందర్శన రాత్రి 10 గంటలకు అమృత్సర్కు వెళ్తుందన్నారు. 28న హర్మిందర్ సాహెబ్, అకల్తక్తా వాఘా సరిహద్దు సందర్శన, అనంతరం రాత్రి 10 గంటలకు అమృతసర్ నుంచి మాతావైష్ణోదేవి కాట్రాకు రైలు వెళ్తుందని పేర్కొన్నారు. ఎకానమీ స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీలు ఉన్నాయన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహరం, లంచ్ డిన్నర్ ఉంటుందని పేర్కొన్నారు. రైలులో టూరిస్ట్ ఎస్కార్ట్లతోపాటు పర్యటన సమయంలో టూర్ మేనేజర్లు ఉంటారని వివరించారు. ప్యాకేజీ–2లో కాశీ గయ, ప్రయోగ అయోధ్య, (సరస్వతి పుష్కరాల ప్రత్యేకం), మే 8 నుంచి 17 వరకు, ప్యాకేజీ–3లో అరుణాచలం–మధురై–రామేశ్వరం మే 22 నుంచి 30 వరకు, ప్యాకేజీ–4లో పంచ జ్యోతిర్లింగాల యాత్ర జూన్ 4నుంచి 12 వరకు ప్రారంభమవుతుందన్నారు. వివరాలకు 040–27702407, 9701360701, 9281030711, 9281030712, 9281030749, 9281030750 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
‘అపూర్వ’ సమ్మేళనం
● 1980 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాచ్ల పూర్వ విద్యార్థులు హాజరు ● ప్రభుత్వ సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో సంబురంఆదిలాబాద్టౌన్: వారంతా ఒకేచోట చదువుకున్న మిత్రులు.. పదో తరగతి పూర్తయ్యాక జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరారు. చదువు పూర్తయిన తర్వాత ఎవరిదారిలో వారు వెళ్లారు. ఇంజినీర్లు, సైంటిస్టులు, లెక్చరర్లతో పాటు వివిధ హోదాల్లో, మరికొందరు సర్కారు కొలువుల్లో ఉండగా, ఉద్యోగ విరమణ పొందారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 45 ఏళ్ల తర్వాత మళ్లీ చదువులమ్మ ఒడిలో కలుసుకున్నారు. ఆత్మీ య పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి చిలి పి, అల్లరిచేష్టలు, మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. వారు చదువుకున్న తరగతి గదుల్లో కూ ర్చొని ఒక్కసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఈ అపురూపమైన ఘట్టానికి ఆదిలాబాద్లోని ప్రభుత్వ సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల వేదికై ంది. కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరు ఒకేచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. ఇక నుంచి టచ్లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకా లను సెల్ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు దిగా రు. పూర్వ విద్యార్థుల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 1980 నుంచి ఇప్పటివరకు.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1980లో ఏర్పడింది. ఇక్కడ మెకానిక్ సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, డీసీసీపీ ఇతర కోర్సుల్లో బోధన చేపడుతున్నారు. మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు చదువుతున్న పూర్వ విద్యార్థులు ఒకే చెంతకు చేరారు. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల శ్రమ ఎంతగానో ఉంది. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం పంపారు. దాదాపు 600 మంది పూర్వ విద్యార్థులు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందినవారు 250 మంది వరకు ఉండగా రాష్ట్రాలు, జిల్లాలు, దుబాయ్ నుంచి 62 ఏళ్ల రహీమొద్దీన్ హాజరయ్యారు. శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చంద్రశేఖర్, సెక్రెటరి టు గవర్నమెంట్ లా డిపార్ట్మెంట్కు చెందిన రేండ్ల తిరుపతి తన అభినందన పత్రాన్ని పంపించారు. నిర్మల్ డీఎఫ్వో రమేశ్రావు, హైదరాబాద్లోని టౌన్ప్లానింగ్ డిప్యూ టీ డైరెక్టర్ వసంత్రావు, జీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఏ ఈ రఘునందన్, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు ఎల్లారెడ్డి, బాలనర్సిములు, నిరంజన్, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చల్ల విజయ్బాబుతో పాటు ఇక్కడ పనిచేసిన ప్రి న్సిపాళ్లు, లెక్చరర్లు, వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అభయ్ రాజు, రిటైర్డ్ లెక్చరర్ విజయ్బాబు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘మలేరియా’లో బినామీ ల్యాబ్టెక్నీషియన్
ఆదిలాబాద్టౌన్: జిల్లాకేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో గల మలేరియా విభాగంలో ఓ ల్యాబ్ టెక్నీషి యన్ ఏళ్లుగా విధులకు ఎగనామం పెడుతున్నాడు. ప్రైవేట్ వ్యక్తిని బినామీ ల్యాబ్ టెక్నీషియన్గా ఏర్పర్చుకొని ఆయన ద్వారానే పనులు కానిచ్చేస్తున్నాడు. గత 13 ఏళ్లుగా విధులకు హాజరుకావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. జైనథ్ పీహెచ్సీలో ల్యాబ్టెక్నీషియన్గా పనిచేస్తున్న సదరు ఉద్యోగి రిమ్స్లో డిప్యూటేషన్పై ఉన్నాడు. ప్రైవేట్ ల్యాబ్లో పనిచేసే వ్యక్తితో వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఏళ్లుగా ఈతంతు సాగుతున్నా ఆ శాఖ అధి కారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగులతో ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులను సొంతగా నియమించుకుని మలేరియా టెస్టులు చేయిస్తున్న సమయంలో రిపోర్టులో ఎలాంటి పొరపాట్లు జరిగినా రోగులు ఇబ్బందులు పడాల్సిందే. పాజిటివ్కు బదులు నెగెటివ్, నెగెటివ్కు బదులు పాజిటివ్ వచ్చినా సమస్య ఎదురవుతుంది. అయితే గతనెలలో శ్రీసాక్షిశ్రీలో శ్రీఒకరికి బదులుశ్రీఅనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఆయన అప్పట్లో చేసిన బినామీ ఉద్యోగిని తప్పించి మళ్లీ కొత్త వ్యక్తిని సొంతగా నియమించుకున్నాడు. అతనికి నెలకు ఎంతోకొంత చెల్లించి తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పలువురు ల్యాబ్టెక్నీషియన్లు పేర్కొంటున్నారు. డీఎంహెచ్ఓ పరిధిలోని ఉద్యోగులు రిమ్స్ పనిచేస్తున్న వారికి ఆర్ఎంఓ డ్యూటీ సర్టిఫికెట్ అందజేస్తారు. ఆ అటెండెన్స్ ఆధారంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. ఈ విషయమై డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ను వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఏళ్లుగా పత్తాలేని అసలు ఉద్యోగి వేలల్లో వేతనం తీసుకుంటూ విధులకు ఎగనామం -
● 15 మంది ప్రయాణికులకు గాయాలు ● తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్, కండక్టర్ ● క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ ● జేసీబీతో బయటకు తీసి ఆస్పత్రికి తరలింపు ● చికిత్స పొందుతూ మృతి
నిర్మల్/నర్సాపూర్(జి): నర్సాపూర్(జి) మండలంలోని తురాటి గ్రామ ఎక్స్రోడ్ వద్ద 61వ జాతీయ రహదారి వద్ద శనివారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు, బస్సు డ్రైవర్ లతీఫ్, కండక్టర్ జంగం సుధారాణికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోకేశ్వరం మండలం రాజురా నుంచి నిర్మల్ వెళ్తోంది. నిర్మల్ నుంచి కెమికల్ లోడ్తో భైంసా వైపు వెళ్తున్న లారీ ఓవర్టేక్ చేసేక్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నిర్మల్, భైంసా ఏరియా ఆసుపత్రులకు తరలించారు. లక్ష్మి, భోజవ్వ, గంగవ్వ, రాజేశ్వరి, గణేశ్, సరస్వతి, సజన్ తదితరులు చికిత్స పొందుతున్నారు. లారీ క్యాబిన్లో డ్రైవర్ గజ్జల శ్రీను ఇరుక్కుపోయి గంటసేపు నరకయాతన అనుభవించాడు. జేసీబీ సాయంతో బయటకు తీసి 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు లారీ డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వాసిగా గుర్తించారు. నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై సాయికిరణ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నిర్మల్ డిపో మేనేజర్ పండరి, ఆర్టీసీ అధికారులతో ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నుజ్జునుజ్జయిన లారీ, బస్సు -
దొంగల ముఠా అరెస్ట్
● బ్యాంక్లో గ్యాస్ కట్టర్లతో చోరీకి యత్నం ● తొమ్మిది మందిపై కేసు ● ముగ్గురి అరెస్టు, పరారీలో ముగ్గురు ● వేరే కేసుల్లో ఇప్పటికే జైలులో మరో ముగ్గురు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆదిలాబాద్టౌన్: బ్యాంక్కు కన్నం వేసి గ్యాస్ కట్టర్లతో చోరీకి యత్నించిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్రూరల్ మండలం రామాయి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో గతేడాది డిసెంబర్ 12న లోనికి చొరబడ్డారు. బ్యాంక్లో అమర్చిన మిషన్ డిటెక్షన్ అలారమ్ మోగడంతో పారిపోయారు. ఈ కేసుకు సంబంధించి 9 మంది చోరీకి పాల్పడగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఆయా కాలనీలకు చెందిన వారు ఓ ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటుపడి పలు నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బ్యాంక్లో చోరీకి యత్నించారు. అలారం మోగడంతో పారిపోయారు. 9 మందిపై కేసులు నమోదు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారని, మరో ముగ్గురు వివిధ కేసుల్లో ఇదివరకే జైలులో ఉండగా, ప్రస్తుతం ముగ్గురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు వీరే.. ఆదిలాబాద్రూరల్ మండలం కచ్కంటి శివారులో పోలీసులకు ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని పట్టుకుని పోలీసులు విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి సిలిండర్, గ్యాస్ కట్టర్, గడ్డపార స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దగడ్ సాయి, అశోక్, మినుగు రాజేశంను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పుష్ప అలియాస్ పవన్, మణికంఠ, జాదవ్ రాజు పరారీలో ఉన్నారని తెలిపారు. చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీ, గోవిందుడు కార్తీక్లు హత్యాయత్నం, మర్డర్ కేసులు, రౌడీ షీట్ నమోదై ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ 9 మందిపై ఆదిలాబాద్రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై ముజాహిద్ పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. పాముకాటుతో చిన్నారి, దుబాయిలో యాకర్పల్లి వాసి అనారోగ్యంతో, విద్యుత్ షాక్తో వృద్ధురాలు, తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతిచెందారు. పాముకాటుతో చిన్నారి లక్సెట్టిపేట: పాము కాటుకు గురై చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకట్రావుపేటకు చెందిన వందన–సుధాకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుధాకర్ హోటల్లో పని చేస్తుండగా, తల్లి వందన కూలీ పని చేస్తోంది. వీరి చిన్నకుమార్తె ఉదయశ్రీ(4) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఆమె కాలిపై పాము కాటేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దుబాయిలో యాకర్పల్లి వాసి మృతి సారంగపూర్: బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన యాకర్పల్లి వాసి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని యాకర్పల్లి గ్రా మానికి చెందిన నిర్మల రాజు (41) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయిలోని జెబ్లాలీ ఏరి యాలో గల వేడామ్స్ కంపెనీలో కూలీ పని చేసేందుకు వెళ్లాడు. గతనెల క్రితం అనారోగ్యానికి గురి కాగా తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈనెల 7న మృతి చెందాడు. మృతుడికి భార్య రుక్మవ్వ, కుమారుడు అఖిల్(16), కుమార్తె శృతి(9)లు ఉన్నారు. ప్రభుత్వం ఆయన మృతదేహాన్ని త్వరగా రప్పించేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు. విద్యుత్షాక్తో వృద్ధురాలి దండేపల్లి: మండలంలోని ముత్యంపేటకు చెందిన వృద్ధురాలు ముత్తె రాజవ్వ (70) శనివారం విద్యుత్షాక్తో మృతి చెందింది. ఎస్సై తహాసీనొద్దీన్ కథ నం ప్రకారం.. రాజవ్వ ఇంటి వెనకాల గల పెరటిలో కూరగాయల తోటలోకి కోతులు రావడంతో వాటిని కొట్టేందు కు వెళ్లింది. ఇంట్లోకి తిరిగి వచ్చేక్రమంలో ఇంటి ముందు ఉన్న కూలర్ వైరు తెగిపడి ఉంది. గమనించకుండా వస్తుండగా వైరు ఆమె కాలికి తగిలింది. వైర్కు విద్యుత్ సరఫరా అయి షాక్తో కిందపడిపోయింది. గమనించిన భర్త రా యలింగయ్య, చుట్టుపక్కల వారిని పిలిచి కరెంట్ ఆఫ్ చేసి చూసేసరికి చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి కోటపల్లి: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతిచెందిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై రాజేందర్ తెలిపిన వి వరాలు.. వేమనపల్లి మండలం దస్నాపూర్కు చెందిన తాళ్లపల్లి రాకేశ్ (30) శుక్రవారం సాయంత్రం కోటపల్లిలో కల్లు గీసేందుకు తాటి చెట్టెక్కాడు. ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలైన అతన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల నుంచి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి చిన్నతనంలో మరణించగా కుటుంబాన్ని రాకేశ్ పోషిస్తున్నాడు. తల్లి పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
ఇచ్చోడ: మండలంలోని దూబార్పేట్ శివారులో ప్రమాదవశాత్తు నిప్పుంటుకుని మొక్కజొన్న పంట దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. జామిడి గ్రామానికి చెందిన రైతు తోరే సుభాష్ దూబార్పేట్ శివారులో రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. శనివారం ప్రమాదవశాత్తు పొలం చుట్టూ ఒక్కసారి మంటలు చెలరేగి మొక్కజొన్న పంటకు వ్యాపించాయి. గంట వ్యవధిలో కాలిబూడిదైంది. మరో వారంలో చేతికందే పంట కళ్ల ముందే దగ్ధమవడంతో బాధిత రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపాడు. -
అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలి
తాండూర్: తాండూర్, భీమిని, కన్నెపల్లి, మాదారం పోలీసుస్టేషన్ల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు, ఇసుక అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని, ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని మాదారం పోలీసుస్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తాండూర్ సీఐ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గిరిజనులతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్సై సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు. -
అత్తింటి రేషన్కార్డులో అల్లుడి కుటుంబం
దండేపల్లి: రేషన్కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుండగా తప్పులు దొర్లిన కార్డులతో విని యోగదారులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లు నమోదులో జరిగిన పొరపాట్లతో దరఖాస్తుదారులు కంగుతింటున్నారు. రేషన్కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదుకు గతంలో పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. కొన్నేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల అర్జీలు స్వీకరించడంతో మీ సేవ, ప్రజాపాలన, గ్రామసభలు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీటి సంఖ్య జిల్లా వ్యాప్తంగా వేలలోనే ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆయా కుటుంబాల్లో కలిపే ప్రక్రియతోపాటు కొత్త రేషన్కార్డుల జారీకి కసరత్తు చేస్తున్నారు. రేషన్కార్డులో లేని కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించిన వారు కొంద రు తమ ఆధార్, ఎఫ్ఏసీ నంబర్లతో ఆన్లైన్లో చూస్తే అల్లుడి పేరు అత్తింటి రేషన్ కార్డుల్లో, పిల్ల ల పేర్లు, అమ్మమ్మ, నానమ్మల రేషన్కార్డుల్లో కని పించడంతో అవాక్కవుతున్నారు. ● దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి గాజుల నగేష్కు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. తన తల్లిదండ్రుల రేషన్కార్డులో నుంచి తన పేరు డిలిట్ చేయించాడు. కొత్త రేషన్కార్డు కోసం ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకున్నాడు. అతడి పేరుతోపాటు ఇద్దరు పిల్లలు మహన్విత్, శ్రీనిత్ పేర్లు అత్తగారి రేషన్ కార్డు(నిర్మల్ జిల్లా కడెం మండలం దిల్దార్నగర్)లో నమోదయ్యాయి. ● దండేపల్లి మండలం ఎల్లయ్యపల్లెకు చెందిన సల్లూరి సురేష్–సంధ్య రేషన్కార్డు కలిగి ఉన్నారు. ప్రస్తుతం తమ కార్డులో కూతురు సుధీష పేరు నమోదుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా నానమ్మ లక్ష్మి రేషన్కార్డులో నమోదైంది. ● మంచిర్యాలకు చెందిన గొల్లపెల్లి సంగీత–పున్నం దంపతుల కూతురు అనన్య పేరు దండేపల్లిలో ఉండే అమ్మమ్మ సల్లూరి అమ్మాయి రేషన్ కార్డులో చేరింది. ● దండేపల్లికి చెందిన వేమునూరి శ్రీనివాస్ తన ఇద్దరు పిల్లల పేర్లు రేషన్కార్డులో లేకపోవడంతో మీ సేవ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించాడు. కూతురు పేరు మాత్రమే రేషన్ కార్డులో కనిపిస్తుంది. కొడుకు పేరు రాలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది బాధితులు ఉన్నారు. సాంకేతిక సమస్యలు కారణం..రేషన్కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదులో తప్పులు దొర్లడం, కొందరి పేర్లు రాకపోవడం అంతా టెక్నికల్ ఇష్యూ కారణంతోనే అయి ఉండవచ్చు. తప్పులు దొర్లినట్లు కొందరు నా దృష్టికి తీసుకు వచ్చారు. తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే సరి చేయవచ్చు. – సంధ్యారాణి, తహసీల్దార్, దండేపల్లి -
సేఫ్టీ కమిటీ సమావేశం బహిష్కరణ
భీమారం: జైపూర్ మండలం ఐకే 1ఏ గనిలో శుక్రవారం నిర్వహించిన స్టేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఫిట్ స్టేఫ్టీ కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ మేరకు కమిటీ కార్యదర్శి నవీన్రెడ్డి నేతృత్వంలో గని మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గతంలో సేఫ్టీ కమిటీ సభ్యుల సూచనలు అమలు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భద్రతపై దృష్టి సారించి ప్రమాదరహిత గనిగా మార్చాలని డిమాండ్ చేశారు. గనిలో ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం ప్రమాదస్థలానికి వెళ్లి జరిపే విచారణ కమిటీల్లో సేఫ్టీ కమిటీ సభ్యులను భాగస్వాములను చేయాలని అన్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులకు సస్పెండ్, చార్జిషీట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు సత్తయ్య, వెంకటస్వామి, రాజగోపాల్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
‘నులి’పేసేది లేదా..!
ప్రభుత్వ నిర్ణయం మేరకు వేస్తాంనులిపురుగుల నివారణ మాత్రలు వేసే కార్యక్రమాన్ని ఫిబ్రవరిలో చేపట్టాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం రద్దు చేసింది. మరోసారి నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిమంచిర్యాలటౌన్: చిన్నారుల్లో నులి పురుగులు నివారించేందుకు ప్రతియేటా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 1 నుంచి 19ఏళ్లలోపు పిల్లల్లో నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కారణమేమిటో తెలియదు గానీ ఆ కార్యక్రమానికి ఒక రోజు ముందుగానే రద్దు చేశారు. మాత్రలను జిల్లాలకు పంపిణీ చేసిన అనంతరం ఏదో సమస్యతో అన్నింటినీ తిరిగి వెనక్కి తీసుకోవడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి నిలిపి వేసినట్లు తెలిసింది. రెండు నెలలు గడుస్తున్నా మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. మరో పదిహేను రోజుల్లో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. జూన్ 12న తిరిగి ప్రారంభిస్తారు. మరో రెండు నెలల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లేదు. నులి పురుగుల బారిన పడిన పిల్లలు పలు రకాలుగా అనారోగ్యానికి గురవుతారు. ఈ ఆలస్యంతో వ్యాధిబారిన పడే చిన్నారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జిల్లాలో చిన్నారులు.. జిల్లాలో 1నుంచి 19ఏళ్లలోపు పిల్లలు 1,83,113మంది ఉన్నారు. వీరిలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన వారు 35,706, నమోదు కాని వారు 477మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 51,403మంది, నమోదు కాని వారు 197మంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నమోదైన వారు 7,049, నమోదు కాని వారు 1,033మంది, ప్రైవేటు స్కూళ్లలో నమోదైన వారు 72,229, నమోదైన ఇంటర్ విద్యార్థులు 15,370మంది ఉన్నారు. ఫిబ్రవరిలో పంపిణీ చేయాల్సిన మాత్రలు కారణం లేకుండానే నిలిపివేత మరికొద్ది రోజుల్లో పాఠశాలలకు సెలవులు వ్యాధి సంక్రమణ ఇలా..బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆటలు, చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోజనం చేయడం, చెప్పులు ధరించకుండానే మట్టిలో ఆడడం వల్ల పిల్లలు నులిపురుగుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి పిల్లల్లో సాధారణంగా వచ్చేదే అయినా.. వ్యాధిబారిన పడితే పలు రకాలుగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు వండిన ఆహార పదార్థాలపై దుమ్ము పడకుండా, ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టాలి. వేడిగా ఉండే ఆహారం భుజించి చేతి వేలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. గోళ్లలో మురికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మలమూత్ర విసర్జన బయట చేయకుండా, మరుగుదొడ్డిని వినియోగించిన అనంతరం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. నులిపురుగుల బారిన పడినా, పడకపోయినా ప్రభుత్వం చేపట్టే నులిపురుగుల నివారణ కార్యక్రమంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి. -
● పూర్తి స్థాయిలో ప్రారంభం కాని కేంద్రాలు ● అకాల వర్షాలతో ఆందోళనలో రైతులు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో ఇప్పటికే దిగుబడి వచ్చిన రైతులు వడ్లు ఆరబోసుకుని ఎదురు చూస్తున్నారు. మరికొందరు కోతలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజులుగా ఈదురుగాలులు, అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర క్వింటాల్కు ఏ గ్రేడ్కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలు కురిస్తే ధాన్యం నీటి పాలవుతుందని కొందరు క్వింటాల్కు రూ.1750 నుంచి రూ.1850 ధరతో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ముందుగా సాగు చేసిన జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లో వరి కోతకు వస్తోంది. ఇప్పటికే వరికోతలు పూర్తయిన వారు కేంద్రాలకు తరలించి ఎదురుచూస్తున్నారు. మబ్బులు కమ్ముకుని అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో ఉదయం ఆరబోసి సాయంత్రం కుప్పలు చేసి కవర్లు కప్పుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్లు అధికారులు ఈ నెల 10న ప్రకటించినా కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభమయ్యాయి. రెట్టింపు సేకరణ లక్ష్యం.. గతేడాది యాసంగిలో 1.08లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 1.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరించారు. ఈ ఏడాది జిల్లాలో 1,21,702 ఎకరాల్లో వరి సాగు కాగా, 3,41,795 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. గతేడాది కంటే రెట్టింపు 3,31,935 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఏజెన్సీల ద్వారా 321 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా..ఇప్పటివరకు జన్నారం, లక్సెట్టిపేట, కోటపల్లి మండలాల్లో 20వరకు ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరిలో నాట్లు వేసిన పంట పొట్ట, గొలక దశలో ఉంది. నెలాఖరు వరకు ఒకేసారి పెద్దయెత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈలోగా పూర్తి స్థాయి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎప్పటికప్పుడు ధాన్యం తరలిస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. గత ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి నీటి పాలైంది. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తే ఇబ్బందులు ఉండవని రైతులు కోరుతున్నారు.ఆలస్యం చేయొద్దు రెండు రోజులుగా మబ్బులు పడుతున్నాయి. ఈదురు గాలులు, చిరుజల్లులు కురుస్తున్నాయి. ఽహర్వేస్టింగ్ చేసి కొ నుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసుకు న్న. ఇప్పుడు భారీ వర్షం వస్తే పంట వరద పాలవుతుందని భయంగా ఉంది. ఆలస్యం చేయకుండా సెంటర్ ఓపెన్ చేయాలి. – ఎం.వెంకటేష్, గ్రామం : నమ్నూర్, మండలం : హాజీపూర్ తక్కువ ధరకే అమ్ముకున్నా..ఓ దిక్కు మూడు రోజుల నుంచి మబ్బులు పడుతున్నాయి. సెంటర్లు ఇంకా ఒపెన్ కాలేదు. పది రోజు ల కిందట నుంచి పంట కోతకు వచ్చింది. కొనుగో లు కేంద్రాలు ప్రారంభం కా లేదు. ఎక్కడ నీటి పాలువుతుందోనని రైస్మి ల్లు వద్దనే క్వింటాల్కు రూ.1850 ధరతో అ మ్ముకున్నా. ఈ ధర తక్కువే అయినా ఆలస్యమై తే వర్షానికి తడిసి నష్టపోవాల్సి వస్తుందని అమ్ముకోక తప్పలేదు. – కొట్టె బుచ్చయ్య, గ్రామం : కర్ణమామిడి, మండలం : హాజీపూర్ -
‘పంటలు బాగా పండాలి’
జన్నారం: భక్తిభావంతో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలని, భగవంతుని అనుగ్రహంతో రాష్ట్రంలో, నియోజకవర్గంలో సమృద్ధిగా వ ర్షాలు పడి పంటలు బాగా పండాలని ఖానాపూ ర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, సీనియర్ నాయకులు మచ్చ శంకరయ్య, గు ర్రం మోహన్రెడ్డి, సతీశ్కుమార్, శేషురావు, స్వామి, తదితరులు పాల్గోన్నారు. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి ‘పూలే’
● సమాజ మార్పుకు కృషి చేసిన మహోన్నతుడు ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సమాజంలో మార్పు కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మాజ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ చదువు లేకపోవడమే బలహీనవర్గాల అణిచివేత, వివక్షకు కారణమని, అందరికీ విద్యనందించే దిశగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షయ వ్యాధి రహిత పంచాయతీలుగా మార్చాలి మంచిర్యాలఅగికల్చర్: జిల్లాలో టీబీ, క్షయ వ్యాధి రహిత గ్రామ పంచాయతీలుగా మార్చాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, ఇన్చార్జి జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి, వెనుకబడిన తరగతుల అధికారి పురుషోత్తంలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15, 16న గ్రామాల్లో ఆరేళ్లలోపు పిల్లల బరువు, ఎత్తు ఎదుగుదలపై కార్యదర్శులు పర్యవేక్షించాలని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు కృషి చేయాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయతీల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. డీఎల్పీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సీడీపీవోలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి భీమిని: ప్రజల ఫిర్యాదులపై విచారణ చేపట్టి స్థానికంగానే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని అన్నారు. కన్నెపల్లి, చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రావణ్కుమార్, ఎంపీడీవో శంకర్, ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 14 అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్లతో కలిసి జిల్లా అధికారులతో జయంతి వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 14, 15న డిప్యూటీ సీఎం, మంత్రులు మంచిర్యాలలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ, అధికారులకు సూచించారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ పాల్గొన్నారు. విగ్రహం పనులు పూర్తి చేయాలి మంచిర్యాలటౌన్: పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆయన ఐబీ చౌరస్తాలో పనులు పరిశీలించి సూచనలు చేశారు. -
పిల్లలకు టీకాలు వేయించాలి
మంచిర్యాలటౌన్: ఏప్రిల్, మే, జూన్లో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాచ్ అప్ టీకాలను పిల్లలకు తప్పనిసరిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికా రి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని వైద్యాధికారులు, ఎంపీహెచ్పీలు, పర్యవేక్షకులతో జాతీయ టీకాల కార్యక్రమంపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లోనూ టీకాలు వేసుకోని వారిని గుర్తించి మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా వేస్తారని తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత చిన్నారులకు వేసే టీకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృపాబాయి, డాక్టర్ ప్రసాద్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీఎం ప్రశాంతి, పద్మ, ప్రవళిక పాల్గొన్నారు. -
జల సంరక్షణకు ‘కృషి’
చెక్డ్యాం (ఫైల్) పాత మంచిర్యాల: పరుగెత్తే నీటిని నడిపించాలి.. నడిచే నీటిని ఆపాలి.. ఆగిన నీటిని భూమిలో ఇంకింపజేయాలి.. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం 2022లో జిల్లాలో ప్రారంభమైంది. ఈ పఽథకం ద్వారా జిల్లాలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వలు పెంచేందుకు జల సంరక్షణ, మట్టి సంరక్షణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాళ్ల కట్టలు, ఊట కుంటలు, చెక్ డ్యాంలు నిర్మిస్తున్నారు. జిల్లాలోని కాసిపేట, జైపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. మరిన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్మించిన రాళ్ల కట్టలు, ఊట కుంటలు, చెక్డ్యాంల మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ పథకంలో భాగంగా రెండు మండలాల్లో 12 ఊట కుంటలు, మూడు చెక్డ్యాంలు, ఐదు విడిరాళ్ల కట్టల నిర్మాణ పనులు ప్రారంభించారు. కాసిపేట మండలంలోని సోనాపూర్లో రూ.1.30 లక్షల నిధులతో మట్టి సంరక్షణ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. రూ.45.6 లక్షలతో తొమ్మిది ఊట కుంటలు, రూ.17.4 లక్షల నిధులతో మూడు చెక్డ్యాంల పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కాసిపేట మండలంలోని ఐదు గ్రామపంచాయతీల పరిధిలో, జైపూర్ మండలంలోని ఆరు పంచాయతీల పరిధిలో రూ.11.49 కోట్ల నిధులతో 340 పనులు చేపట్టేందుకు ప్రభుత్వ ఆమోదం లభించిందని తెలిపారు. 2026 మార్చి నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పీఎం కేఎస్వై ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. పీఎంకేఎస్వైతో భూగర్భజలాల పెంపు పంటల సాగుకు, పర్యావరణానికి మేలు రైతులకు మేలు పీఎంకేఎస్వై పథకంలో భాగంగా చేపట్టే రాళ్ల కట్టలు, ఊటకుంటలు, చెక్డ్యాంల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరుగుతాయి. సమీప ప్రాంతాల్లోని రైతుల బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో రైతులు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. – కిషన్, మంచిర్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి భూగర్భజలాలు పెంచేందుకే.. భూగర్భ జల మట్టం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటి కొరత లేకుండా చేసేందుకు నీటి ఊట కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతున్నాం. ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే నిర్మించి ఉన్న కుంటలు, చెక్డ్యాంల మరమ్మతు చేస్తున్నాం. – శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ప్రాజెక్ట్ అధికారి, కృషి సించాయి యోజన -
వడదెబ్బ లక్షణాలతో గిరిజన రైతు మృతి
తాంసి: భీంపూర్ మండలం కరంజి (టి) గ్రామానికి చెందిన గిరిజన రైతు వెట్టి పురుషోత్తం (40) వ డదెబ్బ లక్షణాలతో గు రువారం రాత్రి మృతి చెందా డు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. పురుషో త్తం గురువారం మధ్యాహ్నం చేనులో పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. వడదెబ్బ లక్షణాలతో సాయంత్రం వాంతులు, విరోచనా లు చేసుకున్నాడు. గమనించిన అతడి కుటుంబీకులు సాయంత్రం స్థానికంగా చికిత్స అందించా రు. వాంతులు, విరోచనాలు తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ వాహనంలో మహారాష్ట్రలోని మాండ్వి పట్టణానికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. -
యువకుడి అదృశ్యంపై అనుమానాలు
సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామానికి చెందిన చౌదరి జయేందర్ (19) అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఈనెల 9న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు సిర్పూర్(టి) పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకున్ని హత్య చేసి పూడ్చి పెట్టారనే పుకార్లు రాగా శుక్రవారం కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కమలాకర్ టోంకిని గ్రామానికి వెళ్లి వచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు. -
కుస్తీతో పల్లెల దోస్తీ!
● ఉత్సవాల్లో ఆనవాయితీగా పోటీలు ● తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ● ‘సరిహద్దు’ గ్రామాల్లో ఆదరణభైంసా: పండుగైనా.. జాతరైనా.. కుస్తీ పోటీలు నిర్వహించడం ఇక్కడి పల్లెల ప్రత్యేకత. ముధోల్ నియోజకవర్గంలోని తెలంగాణ–మహారాష్ట్ర సరి హద్దు గ్రామాల్లో పండుగలు, వేడుకలు, జాతరల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జ నం తండోపతండాలుగా తరలివస్తారు. ఒకవైపు డప్పు చప్పుళ్లు, మరోవైపు ప్రేక్షకుల ఈలలతో పోటీలు నిర్వహించే ప్రాంతం దద్దరిల్లుతుంది. మల్లయోధులు కూడా అంతే ఉత్సాహంతో తొడగొట్టి తలపడుతుంటారు. దినమంతా సాగే పోటీల్లో చివరికి డాంగోర్ కుస్తీ పేరిట పేరున్న మల్ల యోధులు తలపడతారు. ఈ పోటీల్లో పలు సందర్భాల్లో కాళ్లు, చేతులు విరిగిన ఘటనలున్నాయి. ఏది ఏమైనా పోటీల్లో పాల్గొనే మల్లయోధులు అస్సలు వెనక్కి తగ్గరు. ఇంట్లోనే వస్తాదులు.. కుభీర్ మండలంలోని ధార్కుభీర్తోపాటు కుంటాల, తానూరు మండలాల్లో తాతల నుంచి మ నుమళ్ల వరకు ఒకే పోటీల్లో పాల్గొనే వారూ ఉన్నా రు. వ్యవసాయ పనులు చేస్తూనే కుస్తీ పోటీలో ఎలా తలపడాలో శిక్షణ పొందుతారు. పోటీల్లో పాల్గొనే సమయంలో నడుము, తొడలు, ఇతర శరీర భాగాలు పోటీదారునికి అందనివ్వకుండా చాకచక్యంగా వారి శరీరాన్ని పట్టుకుని క్షణాల్లో మట్టి కరిపిస్తూ అందరి మెప్పు పొందుతుంటారు. ఈ మల్లయోధులు ఉత్సవ కమిటీలు ఇచ్చే నగదు కంటే తమలో సత్తా ఉందని చాటుకునేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. గ్రామ సమీపాల్లోని వాగుల్లో ఇసుకపై, పంట పొలాల్లో నేలపై శిక్షణ పొందుతారు. పాలు తాగడం, పరుగెత్తడం ప్రధానంగా చేస్తుంటారు. అవలీలగా సంచులు ఎత్తుతూ.. బరువైన వస్తువులు లేపి పక్కన పెడుతూ శిక్షణ పొందుతారు. ఒక్కోసారి తమతో తలపడే మల్లయోధులను చేతులతో పైకి లేపి ఓడిస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా శ్రమి స్తూనే ఉంటారు. నాలుగు తరాల నుంచి ఇక్కడ కుస్తీపోటీలు నిర్వహించడం గమనార్హం. పోటీకి ఆదరణ కూడా ఎక్కువే..ముధోల్ నియోజకవర్గంలో కుస్తీకి ఎంతో ఆదరణ ఉంది. కామోల్లో శ్రీరామ నవమికి, మహాగాంలో మహాదేవుని జాతరకు, కుభీర్లో ఉగాదికి, కుంటాలలో హనుమాన్ జయంతికి, సూర్యపూర్లో శివరాత్రికి, ఓలాలో శివరాత్రి మరుసటి రోజున, బిలోలిలో శ్రీరామ నవమికి, భైంసా, తానూరు, ముధోల్, బాసర మండలాల్లో శివరాత్రి, ఉగాది పర్వదినాల సమయంలో, జాతరలు, పండుగలప్పుడు నిర్వహించే పోటీల్లో మల్లయోధులు తమ సత్తా చాటుకుంటారు. ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి కమిటీలు విజేతలకు నగదు బహుమతులు అందిస్తాయి. గత 40 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ముధోల్ ప్రాంతంలో జరిగే కుస్తీ పోటీల్లో మహారాష్ట్రలోని నాందేడ్, ఉమ్రి, ధర్మాబాద్, హిమాయత్నగర్, బిద్రెల్లి నుంచి ఎక్కువ మంది మల్లయోధులు పాల్గొంటారు. మా తాత నేర్పించాడు కుస్తీ ఎలా పట్టాలో మా తాత చిన్నప్పటి నుంచే నాకు నేర్పించాడు. మా నాన్న, చిన్నాన్న అందరూ కుస్తీ పట్టేవారు. కుస్తీ పట్టడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే. కుస్తీ పోటీలు ఎక్కడ జరిగినా వెళ్తుంటాను. శివరాత్రి పండుగ వచ్చిందంటే ఎక్కడో ఒక చోట కుస్తీ పోటీలు జరుగుతాయి. అక్కడికి వెళ్లి పాల్గొని విజేతగా తిరిగి వస్తా. – సొప్పరి నగేశ్, ధార్కుభీర్ఎక్కడ పోటీ ఉన్నా వెళ్తా కుస్తీ పోటీలు ఎక్కడ ఉన్నా వెళ్తాను. ఏడాదంతా ఈ పోటీల కోసం కష్టపడతాను. రోజూ పరుగెత్తి ప్రాక్టీస్ చేస్తుంటాను. నేలపై కుస్తీ పట్టడం అంత సులభంకాదు. కుస్తీ పోటీలు అందరూ చూస్తుండగా ఎదురుగా ఉన్న వ్యక్తిని ఓడిస్తే వచ్చే ఉత్సాహం చెప్పలేనిది. ఈ ప్రాంతంలో ఎక్కడ పోటీలు జరిగినా నేను అక్కడికి వెళ్తాను. – చంద్రకాంత్, హిప్నెల్లి -
స్వాతంత్య్ర సమరయోధుడు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా కేంద్రంలోని గోసేవా మండల్లో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు, శతాధిక వృద్ధుడు రేగళ్ల లక్ష్మణ రావు గురువారం రాత్రి మృతి చెందారు. స్వాతంత్య్రోద్యమంలో ఆయన పలుసార్లు జైలుకు వెళ్లారు. యుక్త వయస్సు నుంచి పురోహితుడిగా పని చేస్తు న్న ఆయన జిల్లా వ్యాప్తంగా సుపరిచితుడు. లక్ష్మణరావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. జిల్లా కేంద్రంలో మనుమడు రాజేంద్రప్రసాద్ వద్ద ఉంటున్నాడు. తనువు చాలించేదాకా దేవతార్చన చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరా వుకు అత్యంత సన్నిహితులు. స్వాతంత్య్రోద్యమంలో కేవీ రమణయ్య, కేశవులుతో పాల్గొన్నారు. మంచిర్యాలలో మూడు దశాబ్దాల క్రితం మొట్టమొదటి అటుకుల గిర్ని నడిపారు. దీంతో ఆయనకు అటుకుల అ య్యగారిగా, పెద్ద అయ్యగారి గా పేరుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగా రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్కోవింద్ చేతుల మీదుగా సనా ్మనం పొందే కార్యక్రమానికి ఢి ల్లీ వెళ్లాల్సి ఉండగా కరోనా పరిస్థితులు అడ్డురావడంతో వెళ్లలేదు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్ర భుత్వం అందించే ఐదెకరాల స్థలం చేతికందకుండా నే ఆయన పరమపదించారు. లక్ష్మణరావు పార్థీ వదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. -
రాములోరి తలంబ్రాలకు విశేష స్పందన
ఆదిలాబాద్: భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ఆధ్వర్యంలో ప్రారంభించిన శ్రీరాములోరి తలంబ్రాల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఆదిలాబాద్ ఆర్టీసీ ఇన్చార్జి రీజినల్ మేనేజర్ ప్రణీత్కుమార్ తెలిపారు. రాములోరి తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు శుక్రవారం కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎంతోమంది భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. మంచి ర్యాల డిపో పరిధిలో అత్యధికంగా 1,397 మంది బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం వీటి ద్వారా రూ. 6,56,850 ఆదాయం ఆర్టీసీకి సమకూరిందని పే ర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 రీజియన్లలో లక్ష్యాన్ని సాధించిన ఆదిలాబాద్ రీజియన్ మూడోస్థానంలో నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శివదాస్, అసిస్టెంట్ మేనేజర్ రాజేందర్, పర్సనల్ ఆఫీసర్ జిబ్లా, డిప్యూటీ సూపరింటెండెంట్ లావణ్య, సాయన్న, భక్తులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఆదిలాబాద్టౌన్(జైనథ్): ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జైనథ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జైనథ్ పోలీస్స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం, పోలీస్ సిబ్బంది శివాజీ, నర్సింగ్, మనోజ్ కలిసి జైనథ్ మండలం సాంగ్వి గ్రామంలో పెన్గంగా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. సాంగ్వి నుంచి ఆదిలాబాద్కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేసినట్లు తెలిపారు. వాటి డ్రైవర్లు గంగాధర్, షేక్ మోసిన్, వెంకటేశ్, సతీశ్, వాహన యజమానులు వంగల తిరుపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, కొండా లక్ష్మణ్, జ్ఞానేశ్వర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక సరఫరా చేస్తున్న పెందూరు గణేశ్, పెందూర్ మాధవ్, నాగుల నరేశ్పై ఇసుక దొంగతనం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
షార్ట్సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధం
సిరికొండ: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్తో మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలోని కొండాపూర్ శివారులో జరిగింది. కొండాపూర్ శివారులో మండల కేంద్రానికి చెందిన సాయిని స్వామి, సాయిని భూమన్న పంట పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న మొక్కజొన్న పంటకు మంటలు వ్యాప్తించాయి. సా యిని స్వామి రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తి గా దగ్ధమైంది. 80 పైపులు కాలి బూడిదయ్యాయి. సాయిని భూమన్న మొక్కజొన్న పంట కూడా దగ్ధమైంది. సాయిని స్వామికి రూ.2లక్షలు, సాయిని భూమన్నకు రూ.50 వేల ఆస్తి నష్టం జరిగింది. దీంతో బాధిత రైతులు బోరున విలపించారు. -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
● సన్నబియ్యం సరఫరాపై పటిష్ట నిఘా ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, అధికారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,41,795 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, స్థానిక అవసరాలు, విత్తనాలు, రైస్మిల్లర్ల కొనుగోలు పోను పౌ ర సరఫరాల సంస్థ ద్వారా 3,31,395 మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, 321 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,19,106 రేషన్కార్డులు ఉన్నాయని, 4,143 మెట్రిక్ టన్నుల ధా న్యం పంపిణీకి కేటాయించగా.. ఇప్పటివరకు 82.05 శాతంతో 3,400 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని తెలిపారు. సన్నబియ్యం పక్కదారి పట్ట కుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోషణ పక్షం పకడ్బందీగా నిర్వహించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు పోషణ పక్షం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఇన్చార్జి జిల్లా సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తంనాయక్, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావులో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీడీపీవోలు విజయలక్ష్యి, రేష్మ, మనోరమ, జిల్లా సమన్వయకర్త రజిత, ప్రాజెక్టు సహాయకురాలు శ్యామల పాల్గొన్నారు. గీత కార్మికుల సంక్షేమం దిశగా చర్యలు మంచిర్యాలఅగ్రికల్చర్: గీత కార్మికుల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ.పురుషోత్తంనాయక్తో కలిసి గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి నస్పూర్/మంచిర్యాలటౌన్: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ, నస్పూర్లోని 23వ వార్డు, శ్రీరాంపూర్, ఆర్కే–6, శ్రీరాంపూర్ బస్టాండ్, సీతారాంపల్లి ప్రాంతాల్లో అమృత్2.0 పనులు పరిశీలించారు. కాలేజీరోడ్డులో మహాప్రస్థానం సందర్శించి సౌకర్యాలు, పనులను పరిశీలించి మిగతా పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శివాజీ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదాలు
చిన్నపాటి నిర్లక్ష్యంవల్లే అగ్నిప్రమాదా లు ఎక్కువగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవన నిర్మాణంలో నాణ్యమైన విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు వినియోగించాలి. ఆసుపత్రులు, హోటళ్లు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, కళాశాలల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. – భగవాన్రెడ్డి, జిల్లా ఫైర్ అధికారి, మంచిర్యాల -
గీత కార్మికుల సంక్షేమానికి కృషి
చెన్నూర్: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. గురువారం స్థా నిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 70మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లు గీ త కార్మికులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ అధి కారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయం చెన్నూర్రూరల్/జైపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అ న్నారు. కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం చెన్నూర్ మండలం ఒత్కులపల్లి, జైపూర్ మండలం కుందారం గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. కుందారంలో రూ.20లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్రావు, జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్రావు పాల్గొన్నారు. -
అద్దె వాహనం.. సొంత పనులు!
● విద్యుత్ శాఖ అధికారుల తీరు ● డ్రైవరు, ఉన్నతాధికారి మధ్య వివాదం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విధి నిర్వహణలో వినియోగించాల్సిన అద్దె వాహనాలను సొంతానికీ వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు, విధుల్లో రాకపోకల కోసం ఏడీ, డీఈ, ఎస్ఈ స్థాయి అధికారులకు వాహనాల అనుమతి ఉంది. నెలవారీగా అద్దె చెల్లించే విధంగా ప్రైవేటు వాహనాలను సమకూర్చుతున్నారు. ప్రతీ నాలుగు నెలలకోసారి టెండర్ నిర్వహించి నిబంధనల ప్రకారం వాహనాలు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 17వాహనాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. కొందరు అధికారులు తమ సొంత వాహనాలే వాడుకుంటూ ఇతర వాహన పేర్లతో బిల్లులు తీసుకుంటున్నారు. చాలామంది అధికారులు తమకు కేటాయించిన చోట కాకుండా జిల్లా కేంద్రంతోపాటు ఇతర జిల్లాల నుంచి సైతం వస్తూ వెళ్తున్నారు. వాస్తవానికి కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు మాత్రమే వాహనం వినియోగించాలి. అయితే తమ ఇంటి నుంచి సైతం అద్దె వాహనాలనే ఉపయోగిస్తున్నారు. చాలాసార్లు వ్యక్తిగత పనులకు సైతం అద్దె వాహనాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాహన యజమానులు కొందరు డీజిల్, డ్రైవర్, వాహన నిర్వహణ, మరమ్మతులు, ఇతర ఖర్చులు భరించలేకపోతున్నామని అంటున్నారు. బిల్లుల చెల్లింపుల్లో.. టెండర్లలో ఎంపిక చేసిన వాహనానికి ప్రతీ నెలకు రూ.36వేలు చెల్లింపుతో 2500కి.మీ తిరగాలి. క్యాంపర్, కార్లు సమకూర్చుకోవచ్చు. నెలవారీగా వాహనం తిరిగిన ప్రకారం రికార్డులు నమోదు చేసి బిల్లులు మంజూరు చేయాలి. ఎవరైనా వాహనదారుడు తమకు అనుకూలంగా లేకపోతే మళ్లీ వా హనానికి అనుమతి ఇవ్వరని చాలామంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఇక అధికారులు తమకు కేటాయించిన కేంద్రాల్లో ఉండాలనే నిబంధన ఉన్నా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో డ్రైవర్లకు ఇబ్బందితోపాటు డీజిల్ ఖర్చులు పెరుగుతున్నాయి. వాహనదారులు, అధికారులు సత్సంబంధాలతో బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లా ఉన్నతాధికారికి కేటాయించిన వాహన అద్దె విషయంలో య జమాని మధ్య వివాదం నెలకొంది. జిల్లాలో కాకుండా కరీంనగర్ దాక వాహనం నడపాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనిపై జిల్లా ఎస్ఈ వి.గంగాధర్ను వివరణ కోరగా, అద్దె వాహనాల్లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని, ఓ వాహనదారు డు ఆరోపిస్తున్నట్లుగా ఏం జరగడం లేదన్నారు. -
సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి
దండేపల్లి: సాధారణ ప్రసవాలపై ప్రజలకు అవగాహన కల్పించి, శస్త్రచికిత్సలు తగ్గించాలని జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్ సూచించారు. మండలంలోని తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యక్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి అప్పాల ప్రసాద్, పీహెచ్సీ డాక్టర్ క్రాంతికుమార్ జిల్లా మాస్మీడియా అధికారి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాలో విఫలం
చెన్నూర్: చెన్నూర్ పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. పట్టణంలోని చోట హనుమాన్ మందిర్లో గురువారం ప్ర త్యేక పూజలు చేసి గావ్చలో బస్తీ చలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూర్లో 12 ట్యాంక్లున్నా ఒక్క ట్యాంక్ నుంచి బిందెడు నీళ్లు రావడం లేదని ఆరోపించారు. గోదావరి నది నుంచి రోజు వందలాది లారీల ఇసుక తరలిపోతోందని, స్థానిక అవసరాలకు ఇవ్వడం లేదని తెలిపారు. స్థాని కులకు గోదావరి ఇసుక ఇచ్చే విధంగా ఎమ్మె ల్యే చొరవ చూపాలని తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోలేదని దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, బ త్తుల సమ్మయ్య, గర్రెపల్లి నర్సయ్య, రాపర్తి వెంకటేశ్వర్, కేవీఏం శ్రీనివాస్, కమ్మల శ్రీని వాస్, తుమ్మ శ్రీపాల్, స్వరూపారాణి, ఏతం శివకృష్ణ పాల్గొన్నారు. -
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
సాక్షి, మంచిర్యాల: మది నిండా కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్టజెప్పినా ఆ అత్తింటి వరకట్న దాహం తీరలేదు. కాళ్ల పారాణీ ఆరకముందే ఆ నవ వధువు కలలను కల్లలు చేస్తూ అదనపు కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు శృతికి ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధి గొల్లపల్లికి చెందిన గర్షకుర్తి సాయితో గత నెల 16న వివాహం జరిపించారు. కట్నంగా రూ.5లక్షల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగారం, వెండి ఆభరణాలు, వంటసామగ్రి, ఇతర కానుకలు అందజేశారు. అనుకున్న దాని కన్న ఎక్కువే ముట్టజెప్పి ఘనంగా పెళ్లి జరిపించారు.అయితే, పెళ్లి జరిగిన వారం రోజులకే శృతికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలు.. తనను మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. పెళ్లికే ఆరు లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలని వేధించారు. వారం రోజుల క్రితం శృతి తండ్రి రూ.50వేలు సాయికి అందజేశాడు.ఇంటికి వెళ్తే బతికేది..!మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేయడంతో శృతి సోమవారం తండ్రికి ఫోన్ చేసింది. శృతి తల్లిదండ్రులు ఈ నెల 20న రూ.2లక్షలు ముట్టజెప్పుతామని అంగీకరించి.. తమ కూతురును ఇంటికి తీసుకెళ్తామంటే సాయి ఒప్పుకోలేదు. దీంతో ఆ రోజు రాత్రి శృతి తల్లిదండ్రులు టీకానపల్లికి వెళ్లిపోయారు. పెళ్లయిన వారం నుంచే వేధింపులు, అదనపు వరకట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి శృతి వేదనకు గురైంది. మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అత్తగారింట్లోనే స్నానాల గదిలో శృతి(21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానాల గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చనిపోయి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు. తన కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మామిడి తోటకు టెండర్
భీమారం: మామిడి తోటలను ఎవరైనా వ్యాపారులు గుత్తకు తీసుకుంటూ ఉంటారు. కానీ మండల కేంద్రంలోని రైతు చెరుకు శ్రీరాంరెడ్డి వినూత్నంగా ఆలోచించి తన మామిడితోటకు బుధవారం సీల్డ్కవర్ టెండర్లు నిర్వహించి అప్పగించాడు. భీమారంలో ఉన్న ఆయన తోటలో 500 మామిడిచెట్లు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం రైతులు వారి తోటలను కాయలను బట్టి ధర నిర్ణయించి వ్యాపారులకు గుత్తకు ఇస్తుంటారు. ఈ పద్ధతి అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. కానీ విద్యావంతుడైన శ్రీరాంరెడ్డి తన తోటను గుత్తకు తీసుకోవడానికి ఎవరు వచ్చినా మొదట తోట, అందులోని కాయలు పరిశీలించాలని సూచించాడు. సీల్డ్ కవర్ టెండర్ నిర్వహిస్తున్నానని, ఆసక్తి గల వ్యాపారులు ఈ టెండర్లో పాల్గొనాలని కోరాడు. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు పది మంది టెండర్లలో పాల్గొన్నారు. ఓ వ్యాపారి రూ.7లక్షలకు టెండర్ ద్వారా తోటను దక్కించుకున్నాడు. -
ఎంపీ సీట్లను తగ్గించేందుకు కుట్ర
రామకృష్ణాపూర్: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని చె న్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నా రు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి 5వ వార్డు అమరవాదిలో బుధవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్, గ్యాస్ ధరలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. బాల్క సుమన్ ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్యాతనపల్లి ఫ్లై ఓవర్ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ర్యాలీ సమన్వయకర్త అంజన్కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అజీజ్, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రిలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మందమర్రిరూరల్: కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమర్రి పట్ట ణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. అంగడిబజార్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్గాంధీతోపాటు కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటులో మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అ నుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మండలంలోని చిర్రకుంటలో నిర్విహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని పొన్నారంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి భూమిపూజ చేశారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అమరవాదిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ -
స్టేడియం నిర్మాణమెప్పుడో..!
మంచిర్యాలటౌన్: జిల్లాలో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ క్రీడలు, అథ్లెటిక్స్లో రాణిస్తుండడంతో మంచిర్యాలలో స్టేడియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెలంగాణ ఏర్పడక ముందు నుంచే ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎట్టకేలకు 2014లో వెయ్యి గజాల్లో మినీస్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.60 కోట్లు విడుదల చేసింది. బస్టాండ్ పక్కనే జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలోని స్థలాన్ని కేటాయించారు. స్టేడియం పనులు చేపట్టి పిల్లర్లు వేస్తుండగా.. పాఠశాలకు చెందిన పేరెంట్స్ కమిటీ కోర్టుకు వెళ్లగా స్టే ఆర్డర్తో నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్ని ఎంపిక చేయకపోవడంతో నిధులు మూలుగుతున్నాయి. పదేళ్లుగా స్టేడియం నిర్మాణానికి నోచుకోవడం లేదు. క్రీడాకారులు సాధన చేయడానికి సరైన మైదానాలు, స్టేడియం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించాలంటే జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఏదో ఒక పాఠశాలలో వసతి కల్పిస్తున్నారు. స్టేడియం నిర్మాణం పూర్తయితే క్రీడాకోర్టులు, క్రీడాకారుల బసకు అవసరమైన గదుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. 2014లోనే నిధులు మంజూరు పలు కారణాలతో నిర్మాణానికి నోచుకోని వైనం ఎమ్మెల్యే చొరవతో 12ఎకరాల స్థలం ఎంపిక స్పోర్ట్స్ అథారిటీ నుంచి అనుమతులు ఆలస్యంస్పోర్ట్స్ స్టేడియం దిశగాజిల్లాలో కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి ఎన్నో క్రీడల్లో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. క్రీడా మైదానాలు, స్టేడి యం లేకపోయినా రాణించడం గమనార్హం. ఖేలో ఇండియా సెంటర్ను జిల్లాకు కేటాయించగా, స్టేడియం లేకపోవడంతో తాత్కాలికంగా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలోనే ఖేలో ఇండియా బాక్సింగ్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో భాగంగానే జిల్లాకు స్పోర్ట్స్ స్టేడియం మంజూరు కాగా, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారు. జిల్లా కేంద్రంలోని సాయికుంటలో 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించగా, అందులో రెండెకరాలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి, 12 ఎకరాలను స్పోర్ట్స్ స్టేడి యం కోసం కేటాయించారు. స్థలాన్ని కేటా యించి ఐదు నెలలు గడుస్తున్నా స్పోర్ట్స్ అథా రిటీ నుంచి స్టేడియం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యం అవుతోంది. స్టేడియం నిర్మిస్తే అథ్లెటిక్స్ కోసం సింథటిక్ ట్రాక్, వాలీబాల్, హ్యాండ్బా ల్ కోర్టులు, ఇతర క్రీడల కో సం అవసరమైన ఏర్పాట్లకు అవకాశం ఉంది. -
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మంచిర్యాలక్రైం: పోలీసులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. సిబ్బందితో సమావేశమై జిల్లా కేంద్రంలో నేరాలు, నియంత్రణ చర్యలపై సమీక్షించారు. పట్టణ శివారు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గంజాయి సేవించడం, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాల ని సూచించారు. పట్టణంలో రాత్రి 10.30గంటల తర్వాత మద్యం దుకాణాలు, హోటళ్లు, బార్లు, వ్యాపార సముదాయాలు, టీ స్టాళ్లు మూసి వేయించాలని తెలిపారు. రాత్రివేళ బ స్టాండ్, రైల్వేస్టేషన్, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించాలని, అనుమానిత వ్యక్తుల వివరాలు సే కరించాలని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, కిరణ్కుమార్, వినీత, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బధవారం కలెక్టరేట్లో డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 20లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ఎంబీ రికార్డులు సమర్పించాలని తెలిపారు. అనంతరం స్వయం సహాయ సంఘాల సభ్యులకు హైదరాబాద్లో అందించిన శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. అర్హులందరికీ రాజీవ్ యువవికాసం ఫలాలు మంచిర్యాలరూరల్(హాజీపూర్): నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం హాజీపూర్ ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్డెస్క్ను సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకుని రాయితీ పొందాలని తెలిపారు. ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాల, కర్ణమామిడిలోని కేజీబీవీ సందర్శించి వంటశాల, తరగతి గదులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, అధికారులు పాల్గొన్నారు. -
నిధులున్నా నిరుపయోగమే..
● టెండర్కు నోచుకోని మినీ స్టేడియం ● ప్రభుత్వ భూమి కేటాయించినా ప్రయోజనం శూన్యం ● క్రీడలకు దూరమవుతున్న యువతబెల్లంపల్లి: బెల్లంపల్లి కేంద్రంగా ప్రతిపాదించిన మినీస్టేడియం నిర్మాణానికి నోచుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత కారణంగా ముందడుగు పడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికో మినీస్టేడియం ఏర్పాటుకు నిర్ణయించింది. బెల్లంపల్లిలో మినీస్టేడియం మంజూరు కోసం ప్రతిపాదనలు చేశారు. మున్సిపాల్టీ శివారు ఇంద్రానగర్ సర్వే నంబరు 170లో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని స్టేడియం ఏర్పాటుకు గుర్తించారు. మినీస్టేడియం మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిర్మాణం మరుగున పడింది. రూ.2.86 కోట్లు మంజూరు మినీస్టేడియం నిర్మాణానికి రూ.2.86కోట్లు మంజూ రయ్యాయి. టెండర్ ప్రక్రియ జరగకపోవడంతో ని ర్మాణం దిశగా ముందడుగు పడలేదు. పిచ్చిమొక్కలతో నిండి ఉన్న ప్రతిపాదిత స్థలాన్ని చదును చే యించడంతో ఆటలకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యువకులు అడపాదడపా వాలీబాల్, క్రికె ట్ ఇతర క్రీడలు ఆడుతున్నారు. ఆటలకు సౌకర్యాలు, క్రీడల నిర్వహణ లేక క్రీడాకారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మినీస్టేడియం కాగితాలకే పరిమి తమైంది. సింగరేణికాలరీస్ యాజమాన్యం నిర్మించిన బజార్ ఏరియాలోని తిలక్ స్టేడియం, ఏఎంసీ ఏరియా క్రీడా మైదానాల్లో క్రీడాకారులు, యువజనులు, విద్యార్థులు క్రీడలు సాధన చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ ఒకరు..
వేమనపల్లి: గత నెల 20న మద్యం మత్తులో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గొర్లపల్లి కొత్త కాలనీకి చెందిన నికాడి నగేష్ (25) విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ హెల్పర్(ఎన్ఎంఆర్)గా పనిచేస్తున్నాడు. తనకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో గత నెల 20న గ్రామ సమీపంలో ఉన్న మామిడి తోటకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నూర్, మంచిర్యాల, కరీంనగర్, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని సోదరుడు సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు. మృతుని తండ్రి విజయ్కుమార్ సైతం 11 నెలల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద కుమారుడు మృతి చెందడంతో తల్లి అమృత విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. -
ఎస్ఏ–2 పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మ క మూల్యాంకన(ఎస్ఏ–2) పరీక్షలు బుధవా రం ప్రారంభమయ్యాయి. 96,038 మంది వి ద్యార్థులు ఉండగా.. వీరిలో బాలురు 49,846, బాలికలు 46,192 ఉన్నారు. ఈ నెల 17వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి ప్రశ్నపత్రాలను ఆయా మండల కస్టోడియన్(ఎంఈవో) జాయింట్ కస్టోడియన్ సహా యంతో అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. 6 నుంచి 9వ తరగతుల ప్రశ్నపత్రాలను ఉద యం ఎనిమిది గంటలకు సంబంధిత ఎంఆర్సీ, కస్టోడియన్ హైస్కూల్ స్కూల్ నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. -
విహారయాత్రలో విషాదం
● ఛత్తీస్గఢ్లో నీటమునిగి నస్పూర్ వాసి మృతి నస్పూర్: పట్టణ పరిధిలోని షిర్కేకాలనీకి చెందిన దొరిసెట్టి పృథ్వీరాజ్ (32) మంగళవారం ప్రమాదవశాత్తు ఛత్తీస్గఢ్లోని అమృతధార జలపాతంలో నీటమునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు షిర్కే కాలనీకి చెందిన దొరిసెట్టి తిరుపతి కుమారుడు పృథ్వీరాజ్ ఛత్తీస్గఢ్లోని (ఎస్ఈసీఎల్) కోలిండియాలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకుని తోటి ఉద్యోగులతో కలిసి సమీపంలోని అమృతధార జలపాతాన్ని వీక్షించడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో నీటమునిగి అతనితో పాటు మరో ఉద్యోగి మృతి చెందాడు. మృతునికి భార్య నిహారిక, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని బుధవారం నస్పూర్కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
● సర్కారు భూమిలో రియల్ వ్యాపారం ● అక్రమంగా నిర్మాణాలు
మందమర్రిరూరల్: మండలంలోని పలుచోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ భూమి పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ భూమిని కలిపి అక్రమంగా వెంచర్లు చేస్తున్నారు. రిటైర్డు ఉద్యోగులు, వ్యాపారులు ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన తర్వాత తెలిసి మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. పాలచెట్టు ఏరియా సమీపంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు వెలిసాయి. పదేళ్ల క్రితం సింగరేణి ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో ఇష్టారీతిగా నిర్మాణాలు జరిగాయి. అమ్మేశారు.. మున్సిపాల్టీలో 1/70 గిరిజన చట్టం అమలులో ఉన్నా పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూమిని అమ్మేసి లక్షల్లో సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి సమీపంలో అందుగులపేట వద్ద 364 సర్వేనంబర్లో ఓ వ్యాపారి వెంచర్ చేసి విక్రయించగా మందమర్రి పట్టణానికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకున్నాడని బీఎస్పీ చెన్నూర్ నియోజవవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మండలంలోని ఆదిల్పేట్ గ్రామ పంచాయతీ పరిధి ఎర్ర చెరువు అభివృద్ధి కోసం పదేళ్ల క్రితం ప్రభుత్వం కొనుగోలు చేసిన సుమారు 30 ఎకరాల భూమిని ఇంతవరకు అధికారులు గుర్తించలేదు. రికార్డులు అందుబాటులో లేవని పేర్కొనడం గమనార్హం. కబ్జా చేస్తే ఊరుకునేది లేదు మండలంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. 148 సర్వేనంబర్లో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం స్వా ధీనం చేసుకుంది. 364 సర్వేనంబర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఫాం హౌజ్ వేసారని తెలిసింది. సర్వే చేయించి ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం. సర్వేనంబర్ 195 రామకృష్ణాపూర్ రోడ్డు వెళ్లే మార్గంలోని ఎమ్మెల్యే కాలనీలో సుమారు 16 గుంటలు ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేశాం. – సతీశ్కుమార్, తహసీల్దార్ -
నాగోబాకు జలాభిషేకం
ఇంద్రవెల్లి: చైత్రమాసాన్ని పురస్కరించుకుని బుధవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా దేవతకు జలాభిషేకం చేశారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు యువతులు పవిత్రమైన కోనేరు నీటిని తీసుకెళ్లి నాగోబాకు జలాభిషేకం చేశారు. చైత్రమాసంలో నిర్వహించే గావ్సాత్ (పోచ్చమ్మ) తల్లిపూజలకు ముందు ఐదురోజుల పాటు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పటేల్ మెస్రం వెంకట్రావ్ తెలిపారు. ఈ నెల 13 వరకు అభిషేకం చేసిన అనంతరం గ్రామంలో గావ్సాత్(పోచ్చమ్మ) పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. -
● సులువుగా డబ్బు సంపాదనపై ఆశ ● బెట్టింగ్లు, గేమ్స్, యాప్లకు ఆకర్షణ ● రూ.లక్షలు కోల్పోతున్న బాధితులు ● మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఘటనలు
చైన్మార్కెటింగ్తోనూఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చు, తమ ఉత్పత్తులను ప్రచారం చేసి పైసలు కూడబెట్టవచ్చంటూ చేసే ప్రచారంతో నష్టపోతున్నారు. చైన్, ఆన్లైన్ మార్కెటింగ్ తదితర వాటితోనూ దెబ్బతింటున్నారు. ఒకరిని చేర్పించి, మరొకరిని చేర్పిస్తే డబ్బులు వస్తాయంటూ ఆశ చూపుతున్నారు. మొదట కొందరికి డబ్బులు వచ్చేలా చేసి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. అప్పట్లో మంచిర్యాలలో ఓ వ్యాపారి వందలాది మందిని చైన్ మార్కెటింగ్లో వాట్సాప్ గ్రూపుగా ఏర్పాటు చేసి రూ.లక్షల్లో కట్టాక ఆ డబ్బులు సైతం రాకపోయే సరికి అందరూ కలసి ఆయనపై కేసు పెట్టారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ బాధితులు ఎక్కవగా ఉన్నారు. ఇటీవల కాగజ్నగర్లో మహిళలకే రుణాలు అంటూ ప్రచారం చేసి డబ్బులు వసూలు చేసి పరారయ్యారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఈజీ మనీ.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆన్లైన్ వేదికగా సాగుతున్న కార్యకలాపాల్లో రూ.లక్షలు పోగోట్టుకుంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువత, విద్యార్థులు స్మార్ట్ఫోన్లలో అనేక రూపాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చాలామందికి ఇవి నష్టాలే తెస్తు న్నా.. సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలతో వేలాది మంది ఆకర్షితులు అవుతున్నారు. ఇలాంటి ప్రకటనలు, ఆన్ౖలైన్ మోసాల బారిన పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ మోజులో పడి చాలామంది యువత తమ భవిష్యత్ను పాడు చేసుకుంటున్నారు. మంచిర్యాలతోపాటు కాగజ్నగర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ వంటి గిరిజన ప్రాంతాల్లోనూ అనేకమంది ఐపీఎల్ క్రికె ట్ మ్యాచ్ల్లో బెట్టింగ్ పెడతున్నారు. కాగజ్నగర్లో కొందరు సట్టా, మట్కా ఆడిస్తూ డబ్బులు అధికంగా సంపాదించవచ్చని చెబుతూ ఊబిలోకి దింపుతున్నారు. మహారాష్ట్రలో కళ్యాణ్, ముంబయితోపాటు నగరాల కేంద్రంగా నడిచే సట్టా, మట్కాలో సింగి ల్, డబుల్, అంటూ రూ.10కి వంద, వెయ్యి, పది వేలు దాక లాభం ఉంటుందని ప్రచారం చేస్తున్నా రు. పలానా నంబర్ వస్తే మీకు లక్ కలిసి వస్తుందని చెబుతూ రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల కాగజ్నగర్కు చెందిన నలుగురు యువకులు మట్కా కేసులో హైదరాబాద్లో పట్టుబడ్డారు. ఆన్లైన్ యాప్స్, గేమ్స్ ఆన్లైన్లో గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనూ అనేక మంది స్మార్ట్ఫోన్లలో ఆడుతున్నారు. రమ్మీతోపాటు పలు గేమ్స్ డబ్బులు పెట్టి ఆడుతున్నారు. విద్యార్థులతోపాటు ఉద్యోగస్తులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు యాప్లతోనూ ఆన్లైన్లోనే లావా దేవీలు జరుపుతున్నారు. మందమర్రికి చెందిన ఓ పేకాట వ్యసనపరుడు ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ రూ.లక్షలు పోగోట్టుకున్నాడు. మంచిర్యాల కేంద్రంగా ఓ యాప్ పేరుతో సభ్యులను చేర్పిస్తూ డబ్బులు వసూలు చేశారు. రిజిస్ట్రేషన్లు చేసి, వందలాది మందితో ఆ యాప్ డౌన్లోడ్ చేయించారు. డబ్బులు జ మ చేశాక కొందరికి మాత్రమే లాభాలు వచ్చి మిగతా వారు మోసపోయామని బాధపడ్డారు. బయటకు చెప్పుకోలేక.. ఆన్లైన్ మోసాల బాధితులు చాలామంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సైబర్ నేరాల్లో మా త్రమే కేసులు నమోదవుతున్నాయి. తెలిసి పెట్టుబ డి పెట్టి కోల్పోయిన ఘటనల్లో బయటకు రావడం లేదు. ఇటీవల ఆర్కేపీకి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి ప్రకటనలో చూపించినట్లుగా రాలేదని నిర్వాహకులను అడిగితే అక్కడి నుంచి స మాధానం రాలేదు. ఉద్యోగిగా సమాజంలో ఇబ్బందిగా మారుతుందని ఆయన ఫిర్యాదు ఇవ్వలేదు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
లోకేశ్వరం: పంటలను కాపాడుకునేందుకు బోర్లు వేసినా నీరు పడక, అప్పులు తీర్చే దారిలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని రాజూర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పతాని నడిపి మల్లన్నకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత పదేళ్లుగా పంటలు సాగు చేసేందుకు అప్పు చేసి 30 బోర్లు వేయించాడు. బోర్లలో చుక్క నీరు రాలేదు. ఈసారి యాసంగిలో రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. పంటకు నీరందక కళ్ల ముందే ఎండిపోయే దశకు చేరింది. పంటను కాపాడుకునేందుకు ఈ యాసంగిలోనే రెండు బోర్లు తవ్వించినా ఫలితం లేకపోయింది. బ్యాంకు, ప్రైవేటు అప్పులు రూ.8లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది. అప్పులు తీర్చాలో తెలియక నడిపి మల్లన్న(56) చేనులోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య నర్సవ్వ, కుమారుడు మహేష్, కూతురు మానస ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేతఆదిలాబాద్టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని పెన్గంగ నుంచి ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. భోరజ్ వద్ద జైనథ్ ఎస్సై పురుషోత్తం, సిబ్బంది రాఘవేంద్ర, శివాజీ, రజినీకాంత్ తనిఖీ నిర్వహిస్తుండగా ట్రాక్టర్లలో ఉన్న ఇసుకపై ఎలాంటి కవర్ కప్పకుండా తీసుకెళ్తుండగా పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. -
కార్మికుల రక్షణకు ప్రాధాన్యత
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గంగాధర్రెడ్డి అన్నారు. ఎస్టీపీపీలో బుధవారం బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ యూనియన్ల ప్రతినిధులు, సింగరేణి, పవర్మేక్ అధికారుల నేతృత్వంలో రక్షణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ల ప్రతినిధులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భద్రతపై అన్నిస్థాయిల కార్మికులకు శిక్షణ ఇవ్వాలని, కార్మికుల పనికి అనుగుణంగా రక్షణ పరికరాలు సరఫరా చేయాలన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్లాంటులో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ జీఎం శ్రీనివాసులు, వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఐఎన్టీయూసీ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ, బీఎంఎస్ జనరల్ సెక్రెటరీ దుస్స భాస్కర్, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ విక్రమ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్బాసర: బాసర గోదావరినదిలో దూకేందుకు యత్నించిన మహిళను కానిస్టేబుల్ మోహన్సింగ్ అడ్డుకుని ప్రాణాలు రక్షించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా పట్టణంలోని గుంటగల్లికి చెందిన మహిళ బుధవారం కుటుంబ సమస్యలతో నదిలో దూకేందుకు ప్రయత్నించడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్ అడ్డుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం మహిళను పోలీస్ స్టేషన్కు తరలించి ఎస్సై గణేశ్ కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రైలు కిందపడి యువకుడు బలవన్మరణం
మంచిర్యాలక్రైం: రైలు కిందపడి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన నాగవెళ్లి శివశంకర్ (35)కొంతకాలంగా ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శివశంకర్ బుధవారం తెల్లవారు జామున స్థాఽనిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఏ క్యాబిన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య జయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
సింగరేణిలో ఆర్కే 6 గనికి ప్రత్యేక స్థానం
శ్రీరాంపూర్: సింగరేణిలో ఆర్కే 6 గనికి ప్రత్యేక స్థానం ఉందని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ అన్నారు. ఈ గని ఏర్పాటు చేసి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం గనిపై వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీఎం మాట్లాడుతూ వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేసి బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగస్వామ్యం అయ్యారన్నారు. ఎస్డీఎల్ సెక్షన్లో అత్యధిక ఉత్పత్తిని సాధించి కంపెనీలోనే రికార్డు నమోదు చేసుకుందన్నారు. బొగ్గు నిల్వలు అడుగంటడంతో మరో రెండు నెలల్లో గనిని మూసివేస్తున్నామన్నారు. ఏరియా ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, గని మేనేజర్ ఈ.తిరుపతి, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, బ్రాంచి సెక్రెటరీ ఎస్కే బాజీసైదా, గని రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. -
వాల్వో డ్రైవర్ల పోరుబాట
● వేతనాలు పెంచాలని 12 రోజులుగా సమ్మె ● ఐకే ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి జైపూర్: వేతనాలు పెంచాలని ఐకే ఓసీపీలో పనిచేస్తున్న వాల్వో డ్రైవర్లు గత నెల 29 నుంచి పోరుబాట పట్టారు. ఇతర ఏరియాల్లో మాదిరి తమకూ అమలు చేయాలని సమ్మెకు దిగారు. 12 రోజులుగా కార్మికులు సమ్మెకు దిగడంతో ఐకే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జైపూర్ మండలంలోని ఇందారం ఐకేఓసీపీలో వోబీ మట్టి తవ్వకం, బొగ్గు ఉత్పత్తి పనులను వరాహ కంపెనీ చేపడుతోంది. కంపెనీలో వాల్వో డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్లు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది సుమారు 500కు పైగా పనిచేస్తున్నారు. డ్రైవర్లకు రూ.19,040, మెకానిక్లు, హెల్పర్లకు రూ.12వేల నుంచి 18వేల వరకు, సూపర్వైజర్లు, సిబ్బందికి రూ.20 వేలకు పైగా చెల్లిస్తున్నారు. వేతనాలు పెంచాలని మూడేళ్లుగా కోరుతున్నా వరాహ కంపెనీ, సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వాల్వో డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్లు సుమారు 400 మంది సమ్మెలోకి దిగారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలకు అదనంగా రూ.5వేలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం... గతంలో ఐకే ఓసీపీ నిర్ణీత గడువుకు ముందుగానే రికార్డు స్థాయిలో వందశాతంకు పైగా బొగ్గు ఉత్పత్పి సాధించింది. ప్రస్తుతం వోబీ మట్టి తవ్వకాలు చేపడుతున్న వరాహ కంపెనీ నిర్వహణ సంక్రమంగా చేపట్టకపోవడం, కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, వాల్వో వాహనాలు, డోజర్లు సరిపడా లేకపోవడం బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వేతనాలు పెంచాలి గోదావరిఖని ఏరియాలో చెల్లిస్తున్న విధంగా ఇక్కడి కార్మికులకు సైతం వేతనాలు పెంచాలి. మూడేళ్లుగా వేతనాలు పెంచలేదు. సింగరేణి అధికారులు చొరవ చూపి వేతనాల పెంపునకు కృషి చేయాలి.– టి.కిష్టయ్య, కాంట్రాక్టు కార్మికుడు -
ప్రమాదాలు పునరావృతం కావొద్దు●
శ్రీరాంపూర్: సింగరేణిలో ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్) ఎన్.నాగేశ్వర్రావు సూచించారు. బుధవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్హౌజ్ కాన్ఫరెన్స్ హాల్లో బెల్లంపల్లి రీజియన్లోని భూగర్భ గనుల్లో రూఫ్ ప్రమాదాలు, రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలపై విచారణ జరిపి మరో సా రి అలా జరుగకుండా చూడాలన్నారు. రూఫ్ ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీని వాడుకోవాలన్నారు. ఇన్డ్యూస్ బ్లాస్టింగ్లో తగు జాగ్రత్తలు తీ సుకోవాలన్నారు. సీఎంఆర్ 2017 కోల్మైన్స్ రూల్స్ను పాటిస్తూ సపోర్టింగ్ చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ప్రేంకుమార్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం కే.రఘుకుమార్, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, మందమర్రి జీఎం దేవేందర్, బెల్లంపల్లి జీఎం విజయ భాస్కర్రెడ్డి, ఏరియా సేఫ్టీ అధికారులు శ్రీధర్రావు, రాయమల్లు, ఏజెంట్లు రాజేందర్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..!
తహసీల్దార్ కార్యాలయం ముందు హాల్నిరుపయోగంగా కమ్యూనిటీ హాల్ మందమర్రి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 148 సర్వే నంబరులో సుమారు 20 గుంటలు కబ్జా చేసి కమ్యూనిటీ హాల్ నిర్మించారు. అక్రమ నిర్మాణంపై అప్పుట్లో ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో అప్పటి కలెక్టర్ కర్ణన్ పర్యవేక్షణలో విచారణ జరిపి ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. నిర్మాణానికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం హాల్ నిరుపయోగంగా ఉంది. రైతులకు గోదాము, ప్రజల సౌకర్యార్దం ఫంక్షన్ హాల్, ప్రభుత్వ కార్యాలయాల సమావేశ మందిరంగా గానీ వినియోగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్జీయూకేటీకి ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్
● రూ.15 లక్షల చెక్కు అందించిన గవర్నర్ జిష్ణుదేవ్ బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్ బుధవారం ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్కు రాజ్భవన్లో రూ.15 లక్షల చెక్కును అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రగతి అవకాశాలను వినియోగించుకునేలా వినూత్న పారిశ్రామిక ఆలోచనల ఏర్పాటే లక్ష్యంగా ఈ సెంటర్ పని చేయనుంది. తదనుగుణంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆర్జీయూకేటీలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక, వివిధ సంస్కరణలను ప్రశంసించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ గవర్నర్ జిష్ణుదేవ్కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. -
ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నం
ఇంద్రవెల్లి: ప్రియుడితో కలిసి భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్పూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపిన వివరాల మేరకు గోపాల్పూర్కు చెందిన లాండ్గే సాహెబ్రావ్కు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని దోందరి గ్రామానికి చెందిన ఎల్లవ్వతో రెండేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు కుమార్తె సంతానం. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరుసకు చిన్నమ్మ కుమారుడైన సట్ల దశరథ్ ఏడాది నుంచి సాహెబ్రావ్ ఇంట్లోనే ఉంటూ ఎల్లవ్వతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గమనించిన సాహెబ్రావ్ భార్యను మందలించాడు. దీంతో తమకు అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా చంపాలనుకుంది. ప్రియుడు దశరథ్తో కలిసి బుధవారం తెల్లవారు జామున సాహెబ్రావ్పై గొడ్డలి, రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఘటనలో సాహెబ్రావ్కు తలకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు 108లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యయాత్రానికి గల కారణలను అడిగి తెలుసుకున్నారు. బాధితుని సోదరుడు లాండ్గే బాపురావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉరి శిక్ష అమలు చేయాలి!
● దిల్సుఖ్నగర్లో బాంబు పేలుళ్ల మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు ● హైకోర్టు తీర్పుపై హర్షం ● పేలుళ్లలో అప్పట్లో ఇద్దరు మృతి ● మరో ఇద్దరికి గాయాలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులకు హైకో ర్టు ఉరి శిక్ష ఖరారు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఉరి శిక్షను అమలు చేయాలని నాటి పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 16మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల్లో హాజీపూర్ మండలం నంనూర్ గ్రా మానికి చెందిన ఒడ్డె దేవక్క, లచ్చయ్య దంపతుల కుమారుడు ఒడ్డె విజయ్కుమార్(23), ముత్యాల పద్మ, పోచయ్య దంపతుల కుమారు డు ముత్యాల రాజశేఖర్(24) ఉన్నారు. బాంబు పేలుళ్లలో ముత్యాల రంజిత్, ఇత్తినేని మహేశ్ తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. మృతులు, క్షతగాత్రులు అంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. ఉన్న త చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి బాంబు పేలుళ్లలో చిక్కుకున్నారు. పేలుళ్లకు కారణమైన ఐదుగురు నిందితులకు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేస్తూ మంగళవారం తీర్పునివ్వడంతో మృతుల కుటుంబ సభ్యులు, ఘటనలో గాయపడిన వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఘనమైన నివాళి.. దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు మా కుమారుడి మృతికి ఘనమైన నివాళి ఇది. ఇన్నాళ్లు మానని గాయంగా ఉన్న ఘటనకు కోర్టు తీర్పుతో న్యాయం జరిగింది. పన్నెండేళ్ల తర్వాత వచ్చిన తీర్పుతో సంతోషంగా ఉంది. వెంటనే నిందితులకు ఉరి శిక్ష అమలు చేయాలి. ప్రభుత్వం కూడా ఇంకా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. కోర్టు తీర్పుతో కుమారుడి ఆత్మకు శాంతి లభిస్తుంది. – ముత్యాల రాజశేఖర్ తల్లిదండ్రులు పద్మ, పోచయ్య, కుటుంబ సభ్యులుకోర్టు తీర్పుతో న్యాయం.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష పడడంతో న్యాయం లభించింది. ఎంతోమంది మృత్యువాతకు గురికాకా వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. కష్టపడి చదువు పూర్తి చేసినా ఉద్యోగం చేయలేక ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటున్నాను. ఇక దిల్సుఖ్నగర్ బాంబ్ ఘటన అందరికీ జీవితంలో ఎప్పటికీ మరవలేని చేదు జ్ఞాపకమే. 12 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించి మృతుల, బాధిత కుటుంబాలతోపాటు మాలాంటి వారిలో ఒక తెలియని అనుభూతికి గురి చేసింది. – ఇత్తినేని మహేశ్, నంనూర్, హాజీపూర్ఆనందంగా ఉంది.. 12ఏళ్ల నాటి చేదు ఘటనకు న్యాయం లభించింది. బాంబు పేలుళ్లతో ఒళ్లంతా గాయాలై పడి ఉండగా ఆస్పత్రిలో చేర్పించారు. ఏడాదిపాటు చికిత్స పొందాను. ఇప్పటికీ ఇంకా నా శరీరంలో కుట్లు, అక్కడక్కడ గాయాలు ఉంటూ ఎప్పుడు ఆ ఘటనను గుర్తు చేస్తూ ఉంటాయి. చదువు పూర్తి చేసినా గాయాల బాధతో చేసేది లేక చదువులకు స్వస్తి పలికి టెంట్హౌజ్తో కుటుంబ పోషణలో ఉన్నాను. ఇప్పుడు ఆ నిందితులందరికీ కూడా కోర్టు ఉరిశిక్ష విధించడంతో కొంత ఊరట దక్కింది. – ముత్యాల రంజిత్, గ్రామం: నంనూర్, మం: హాజీపూర్ -
వంటింటిపై గ్యాస్ భారం
● సిలిండర్పై రూ.50 పెంపు ● జిల్లాపై రూ.1.56 కోట్లు మంచిర్యాలఅగ్రికల్చర్: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతుండగా.. వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో మరింత భారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర మంగళవారం నుంచే అమలులోకి వచ్చింది. జిల్లాలో దీపం, ఉజ్వల, సీఎస్ఆర్, జనరల్ కనెక్షన్లు, కమర్షియల్ మొత్తం కలిపి 3,13,028 ఉన్నాయి. సరాసరిన నెలకు ఒక్కో గ్యాస్ సిలిండర్ చొప్పున వినియోగిస్తే వంటింటి బడ్జెట్పై అదనంగా రూ.50 చొప్పున రూ.1,56,51,540 మేర ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.877 ఉండగా.. పెరిగిన ధరతో రూ.927కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద రూ.500కే సిలిండర్ అందజేస్తోంది. సిలిండర్ బుక్ చేసినప్పుడు రూ.927 చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద రూ.500కే సిలిండర్ పొందుతున్న వినియోగదారులు పెరిగిన ధరతో రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. సిబ్బంది అదనపు వసూళ్లు..నిబంధనల మేరకు గ్యాస్ ఏజెన్సీకి ఐదు కిలోమీటర్ల పరిధిలోని కనెక్షన్లకు రవాణా చార్జీలు వసూలు చేయకూడదు. 15 కిలోమీటర్ల వరకు రూ.20, ఆపైన దూరంలోని వినియోగదారులకు ఇంటి చేర్చినందుకు రూ.30 చార్జీలుగా నిర్ణయించారు. గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే సిబ్బంది నిబంధలను పట్టించుకోవడం లేదు. ఐదు కిలోమీటర్లలోపు అదనంగా రూ.40 నుంచి రూ.50 వరకు, 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటే రూ.100కు తక్కువ తీసుకోవడం లేదు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు, కనెక్షన్లుగ్యాస్ ఏజెన్సీలు 22గృహ సింగిల్, డబుల్ కనెక్షన్లు 2,04,360దీపం 50,582ఉజ్వల 32,009 సీఎస్ఆర్ 23,620కమర్షియల్ 2,457మొత్తం 3,13,028పెంపుతో పడే భారం రూ.1,56,51,400 -
గుణాత్మక విద్య అందించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● గిరిజన ఆశ్రమ పాఠశాల తనిఖీ భీమారం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని జిల్లా కలెక్టర్ కమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, తాగునీటి సౌకర్యం, భోజనశాల, తరగతి గదులు పరిశీలించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని, అన్ని పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ, అదనపు గదుల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. నూతన మెనూ ప్రకా రం విద్యార్థులకు సకాలంలో పోషకాహారం అందించాలని, వంట సమయంలో తాజా కూరగాయలు వినియోగించాలని తెలిపారు. ప్రతీరోజు విద్యార్థులకు గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహించి రా యడం, చదవడం నేర్పించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. -
సన్న బియ్యం కావాలి
● రేషన్దుకాణం వద్ద వినియోగదారుల బారులు ● లబ్ధిదారుల ఇంటికి సర్కారు బియ్యం ● సన్న బియ్యం రాకతో పరిస్థితిలో మార్పుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సన్న బియ్యం పంపిణీతో లబ్ధిదారులు రేషన్ దుకాణల వద్ద బారులు తీరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ సన్న బియ్యం కారణంగా ముందుకు వస్తున్నారని రేషన్ డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో పంపిణీ మొదలైన వారం రోజుల్లోనే 75శాతం పూర్తయింది. మిగతాది ఈ రెండు మూడు రోజుల్లోనే పూర్తి కానుంది. కొన్ని దుకాణాల్లో మొదటి మూడు, నాలుగు రోజుల్లోనే బియ్యం పంపిణీ పూర్తయింది. అమ్మడం ఆగింది..రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నప్పుడే పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిపోయేది. గతంలో దొడ్డు బియ్యం తినని చాలామంది రేషన్ దుకాణాల్లోనే బియ్యం బదులు డబ్బులు తీసుకునే వారు. కొందరు డీలర్లే బియ్యం కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. వీరే కాకుండా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అలా పెద్ద ఎత్తున బియ్యం జిల్లా దాటిపోయేది. ప్రస్తుతం సన్న బియ్యం రాకతో ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. కార్డుదారులు ఇంటి తీసుకెళ్తుండడంతో పక్కదారి పట్టకుండా వీలు కలుగుతోంది. అందరికీ మేలు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వడం మంచిదే. ఇది అందరికీ మేలు చేసే ఆలోచన. ఎప్పటికీ ఇలాగే సన్న బియ్యం ఇవ్వాలి. – కూన బుచ్చమ్మ, జైపూర్ వండితే బాగున్నాయి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. మేం వండుకుని తిన్నాం. బియ్యం బాగున్నాయి. – డి.రాజమల్లు, గ్రామం: ఎర్రగుంటపల్లి, మం: చెన్నూరు రేషన్కార్డులు 2,19,106రేషన్షాపులు 423జిల్లాలో ప్రజాపంపిణీ స్వరూపంబియ్యం కేటాయింపు 4,143.692 మెట్రిక్ టన్నులు పంపిణీ చేసింది 3,118.113 మెట్రిక్ టన్నులుడీలర్లకు తిప్పలుసన్న బియ్యం పంపిణీతో డీలర్లకు తమకు కేటాయించిన కోటా కంటే తక్కువగా వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బస్తాకు అరకిలో వరకు తక్కువ రావడం, లోడింగ్, అన్లోడింగ్లో బియ్యం వృథా కావడం, చినిగిన సంచులతో ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తూకంలో తక్కువగా వస్తే కార్డుదారులకు సరిపడా అందజేయడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి కొంతమంది డీలర్లకు ముందుగా, మరికొందరికి ఆలస్యంగా రవాణా అవుతున్నాయని చెబుతున్నారు. అన్నిషాపులకు నిర్ణీత కోటా, సకాలంలో వచ్చేలా సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాలో 75శాతం పైగా సన్న బియ్యం పంపిణీ చేశామని, మిగతాది మరో రెండ్రోజుల్లో పూర్తవుతుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సీహెచ్.బ్రహ్మారావు తెలిపారు. -
వరకట్న వేధింపులకు నవ వధువు బలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మది నిండా కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్టజెప్పినా ఆ అత్తింటి వరకట్న దాహం తీరలేదు. కాళ్ల పారాణీ ఆరకముందే ఆ నవ వధువు కలలను కల్లలు చేస్తూ అదనపు కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలే క ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. ఈ సంఘటన హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయ తీ పరిధి గొల్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, హాజీపూర్ పోలీసుల కథ నం ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రా మానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు శృతికి ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామ పంచా యతీ పరిధి గొల్లపల్లికి చెందిన గర్షకుర్తి సాయితో గత నెల 16న వివాహం జరిపించారు. కట్నంగా రూ.5లక్షల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగా రం, వెండి ఆభరణాలు, వంటసామగ్రి, ఇతర కానుకలు అందజేశారు. అనుకున్న దాని కన్న ఎక్కు వే ముట్టజెప్పి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయి న వారం రోజులకే శృతికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్య మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. పెళ్లికే రూ.6లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకు రావాలని వేధించారు. వారం రోజుల క్రితం శృతి తండ్రి రూ.50వేలు సాయికి అందజేశాడు. ఇంటికి వెళ్తే బతికేది..!మరో రూ.2లక్షల కోసం ఒత్తిడి చేయడంతో శృతి సోమవారం తండ్రికి ఫోన్ చేసింది. శృతి తల్లిదండ్రులు ఈ నెల 20న రూ.2లక్షలు ముట్టజెప్పుతా మని అంగీకరించి.. తమ కూతురును ఇంటికి తీసుకెళ్తామంటే సాయి ఒప్పుకోలేదు. దీంతో ఆ రోజు రాత్రి శృతి తల్లిదండ్రులు టీకానపల్లికి వెళ్లిపోయా రు. పెళ్లయిన వారం నుంచే వేధింపులు, అదనపు వరకట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి శృతి వేదనకు గురైంది. మంగళవారం ఉద యం 6గంటల ప్రాంతంలో అత్తగారింట్లోనే స్నానా ల గదిలో శృతి(21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానాల గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చనిపోయి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు. అదనంగా రూ.6లక్షల కోసం వేధింపులు ఇష్టపడి పెళ్లి చేసుకున్న 22రోజులకే ఆత్మహత్య -
నేటి నుంచి ఎస్ఏ–2 పరీక్షలు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బుధవారం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకన(ఎస్ఏ–2) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వరకు కొనసాగుతా యి. ఒకటి నుంచి 7వ తరగతులకు ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు, 8వ తరగతికి ఉదయం 9గంటల నుంచి 11.45గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తా రు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రశ్నపత్రాల ను అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు. 6నుంచి 9వ తరగతి ప్రశ్నపత్రాలను ఎంఆర్సీ, కస్టోడియన్ హైస్కూల్లో అందుబాటులో ఉంచారు. ప్రధానో పాధ్యాయులు ఏ రోజు ప్రశ్నపత్రాలను ఆరోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలను పాత పద్ధతిలో ప్రధానోపాధ్యాయుల వద్ద భద్రపర్చాలని, మండలానికి కేంద్రం ఏర్పాటు వల్ల రవాణాలో ఇబ్బందులు ఏర్పడుతాయని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డీఈవో యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. హాల్టికెట్లు పంపిణీపది పరీక్షల మాదిరిగా జన్నారం మండలం తపాలపూర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు హాల్టికెట్లు పంపిణీ చేశారు. జబ్లింగ్ విధానంలో బెంచీలు కేటాయించారు. మాస్కాపీయింగ్కు పాల్పడితే చర్యలు ప్రశ్నపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్కు పాల్పడిన ఉపాధ్యాయులు, పాఠశాలలపై శాఖపరమైన చర్యలుంటాయి. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చే స్తాం. విద్యాసంవత్సరం ముగింపు రోజు ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి వి ద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేయాలి. ప్రశ్నపత్రాల సమాచారం కోసం డీసీఈబీ సహాయ కార్యదర్శి 9490092767 నంబరులో సంప్రదించాలి. – డీఈవో యాదయ్యతరగతి బాలురు బాలికలు విద్యార్థుల సంఖ్య 6నుంచి 9వ తరగతి వరకు 1 6004 5496 11500 2 5184 4802 9986 3 5249 4865 10114 4 5773 5480 11253 5 5259 4702 9961 6 5865 5411 11276 7 5693 5300 10993 8 5584 5120 10704 9 5235 5016 10251 మొత్తం 49846 46192 96038 -
నాణ్యమైన వరిధాన్యం కొనుగోలు చేయాలి
లక్సెట్టిపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముంద స్తు ఏర్పాట్లు చేయాలని, నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మంగళవారం లక్సెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లక్సెట్టిపేట, జన్నారం, దండేపల్లి, హాజీపూర్ మండలాల వ్యవసాయ, పౌరసరఫరాల, సహకార, రవాణా, మార్కెటింగ్, డీఆర్డీఏ, సెర్ప్, మెప్మా అధికారులతో కలిసి యాసంగి 2024–25 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ సన్న, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయాలని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగింగ్ చేసిన రైస్మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, డీఆర్డీవో కిషన్, పౌరసరఫరాల మేనేజర్ శ్రీకళ, లక్సెట్టిపేట తహసీల్దార్ దిలీప్కుమార్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థుల చేయూత
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులంతా కలిసి ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవసరమున్న వారికి చేయూతనందిస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు 300 మంది ప్రతీ నెల రూ.100 చొప్పున జమ చేసి కళాశాలలో అవసరమున్న విద్యార్థులతోపాటు సాయం కోసం చూస్తున్న వారికి అందిస్తూ అండగా నిలస్తున్నారు. ఒక విద్యార్థికి సంబంధించిన ఏడాది ఫీజును చెల్లించారు. మంగళవారం మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు న్యాప్కిన్స్ అందజేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. -
ప్రదర్శనకు ఎంపికై న చిత్రం
జైపూర్: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఏలూరి శేషబ్రహ్మం కాకతీయ శిల్ప సంపద గురించి తెలుసుకునేందుకు జనవరి 25, 26 తేదీల్లో నిర్వహించిన కాకతీయ టెంపుల్ స్కెచింగ్ స్టడీ టూర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 60 మంది ఆర్టిస్టులు పాల్గొని పలు చిత్రాలు గీశారు. వాటిలో నుంచి ఎంపికై న చిత్రాలతో ఈ నెల 12 నుంచి 14 వరకు మాదాపూర్లోని తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు చిప్పకుర్తి శ్రీనివాస్ కాకతీయ శిల్పసంపదపై గీసిన చిత్రం ప్రదర్శనకు ఎంపికై ంది. మట్కా నిందితుల అరెస్టుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని గాంధీనగర్కు చెందిన అగ్ని బాబులాల్ అమాయక ప్రజలకు మట్కా చీటీలు అందజేస్తూ పట్టుబడినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తాంసి బస్టాండ్ వద్ద మట్కా చీటీలు రాస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.730 నగదుతో పాటు సెల్ఫోన్, మట్కా పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఆన్లైన్ మట్కా నిర్వాహకుడు.. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్కు చెందిన మసూద్ ఖాన్ ఆన్లైన్లో మట్కా నిర్వహణ చేస్తున్నాడు. మహారాష్ట్రలోని గుర్లాయికి సంబంధించిన సంస్థకు డబ్బులు పంపిస్తుండగా పట్టుకున్నట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు సెల్ఫోన్లతో పాటు రూ.5,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు వివరించారు. -
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
కోటపల్లి: ప్రేమ విఫల మై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల మే రకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం రాము (23) ఇంటి వద్దే ఉంటూ తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్తుండేవాడు. తాను ప్రేమించిన యువతి ప్రేమకు నిరాకరించడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. మృతుని తండ్రి బాపు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆదిలాబాద్లో పశువుల వ్యాపారి...ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన ఫిరోజ్ సిద్దిఖి (35) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. పశువుల వ్యాపారం చేస్తున్న ఫిరోజ్ సిద్దిఖికి నష్టం రావడంతో అప్పుల బాధ తాళలేక అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్లో చేర్పించగా మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. మనస్తాపంతో బాలిక.. ఇచ్చోడ: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల మేరకు మండలంలోని ముకురా(బి)కి చెందిన రఫీక్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంట్లో గొడవలకు దిగేవాడు. దీంతో మనస్థాపానికి గురైన అతని కుమార్తె పిర్ధోసి (16) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. మృతిరాలి తల్లి జాబినాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చెక్బౌన్స్ కేసులో ఏడాది జైలుమంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఏడాది జైలుశిక్షతో పాటు అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని స్థానిక సివిల్ కోర్టు జడ్జి కే.నిరోష మంగళవారం తీర్పునిచ్చారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎస్.పారిజాత మంచిర్యాలకు చెందిన గుమ్మి జగన్నాథ్రెడ్డి వద్ద రూ.12లక్షలు అప్పుగా తీసుకుంది. ఒప్పందం ప్రకారం పారిజాత చెక్కులను అందజేసింది. గడువు తీరిన తర్వాత చెక్కును స్థానిక ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో జగన్నాథ్రెడ్డి 2017లో కోర్టును ఆశ్రయించగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్రూరల్: జిల్లా కేంద్రం శివారులోని బొమ్మరిల్లు టౌన్షిప్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. కాలనీలో నివాసం ఉంటున్న బొబ్బిలి శ్రీకాంత్రెడ్డి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. సోమవారం రాత్రి దొంగలు ఇంటి మెయిన్ డోర్ పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బెడ్రూంలో బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన శ్రీకాంత్రెడ్డి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్సై లింబాద్రి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ఇద్దరు మట్కా నిర్వాహకుల అరెస్ట్
ఆదిలాబాద్టౌన్(జైనథ్): జైనథ్ మండలంలోని పూసాయి గ్రామ శివారులో మంగళవారం మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. మంగళవారం జైనథ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై పురుషోత్తం, ఏఎస్సై సిరాజ్ ఖాన్, కానిస్టేబుళ్లు శివాజీ, స్వామి దాడులు నిర్వహించి ఆదిలాబాద్రూరల్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు గంగన్న, తాంసి మండలంలోని హస్నాపూర్కు చెందిన రాకేందర్ల నుంచి రూ.4,100 నగదుతో పాటు సెల్ఫోన్, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మహారాష్ట్రలోని బోరికి చెందిన గజ్జుకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. జైనథ్ మండలంలో మట్కా, పేకాట, దేశీదారు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే 8712659916, 8712659929 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. -
ఇలా.. ఇంకెన్నేళ్లు..!?
● వాళ్ల ప్రాణాలకూ విలువనివ్వరా? ● వెయ్యిమంది త్యాగాలకు లెక్కలేదా? ● అధికారికంగా నివాళులూ అర్పించలేరా? ● ‘వెయ్యి ఉరులమర్రి’ సాక్షిగా వివక్ష ● నేడు ఆ అమరవీరుల త్యాగాలదినం దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపుగా తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. అడవుల్లోకి చొచ్చుకొస్తూ.. ఆదివాసుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న గోండువీరుడు మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిజాం సేనలతో కలిసి నిర్మల్ కలెక్టర్ ప్రజలను పీడిస్తున్నాడని రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు ఆయనకు తోడయ్యారు. రోహిల్లా సర్దార్ హాజీతో కలిసిన రాంజీ.. ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా దట్టమైన అడవులు, సహ్యాద్రి కొండలు, గోదావరి నదులను ఆసరాగా చేసుకుని వారిపై దాడులు చేసి దెబ్బతీశారు. ఒకే మర్రికి.. వెయ్యిమంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన జలియన్వాలాబాగ్ కంటే దాదాపు 60 ఏళ్ల ముందే చోటు చేసుకోవడం గమనార్హం. ఆ దారుణం కంటే ఇక్కడ ఎక్కువమందే ప్రాణత్యాగాలు చేసినా.. చరిత్రలో సరైన గుర్తింపు దక్కకపోవడం శోచనీయమని నిర్మల్ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నిర్మల్గడ్డపై జరిగిన పోరుకు, వారి త్యాగాల తీరుకు తగిన గుర్తింపు తీసుకురావాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో రాంజీగోండు విగ్రహం‘సాక్షి’ అక్షర నివాళులు.. స్వాతంత్రం కోసం సర్వస్వం అర్పించిన సమరయోధులనూ గుర్తించాలని, రాంజీసహా వెయ్యిమంది అమరవీరుల త్యాగాలకు విలువనివ్వాలని అవకాశం దొరికినప్పుడల్లా.. ‘సాక్షి’ గొంతెత్తుతూనే ఉంది. వరుస కథనాలను ప్రచురిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ నాటి చరితను, వారి ఘనతను ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. వెయ్యిమంది వీరుల త్యాగాలదినం సందర్భంగా బుధవారం నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్లైన్లో గల డా.కావేరి లైబ్రరీలో సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బళ్లారి నుంచి దళం..రాంజీసేనల దాడుల విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో అప్పటి రెసిడెంట్ డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్టల్ఉద్దౌలా వరకు తెలిసింది. వీరి పోరును తీవ్రంగా పరిగణించిన పాలకులు అణచివేత కోసం కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న 47వ నేషనల్ ఇన్ఫ్రాంటీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళానికీ ఇక్కడి ప్రాంతంపై పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో కల్నల్ రాంజీసేనను దొంగదెబ్బ తీసి, సోన్–కూచన్పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున పట్టుకున్నాడు. వాళ్ల పోరాటం తెలుసుకుంటే రోమాలు నిక్కబొడ్చుకుంటయ్. తమపై సాగిస్తున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు.. వారు ముందుకురికిన తీరు రక్తాన్ని ఉడికిస్తుంది. చరిత్ర సైతం గోసపెట్టుకునేలా వారు చేసిన ప్రాణత్యాగాలు కళ్లను చెమరుస్తాయి. వారి వీరగాథ గుర్తుకొచ్చినప్పుడల్లా చేతులు వాటంతటవే జోడిస్తాయి. కానీ.. అలాంటి వీరుల ప్రాణత్యాగాలను ప్రభుత్వాలు చిన్నచూపు చూడటమే కలచివేస్తోందని నిర్మల్ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గడ్డపైనే పోరాడి, తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల త్యాగాలకు ఇంకెప్పుడు అధికారిక నివాళులర్పిస్తారు..!? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రావడం లేదు. నేడు (ఏప్రిల్ 9) రాంజీసహా వెయ్యిమంది వీరుల త్యాగాలదినం.. – నిర్మల్మనవంతు ప్రయత్నం.. జిల్లాలో ఎన్నో చారి త్రక కట్టడాలు ఉన్నాయి. వెయ్యి ఉరులమర్రి ఘటన ఇక్కడే చోటు చేసుకుంది. వీటిని ముందుతరాలకు అందించేందుకు మావంతు ప్రయత్నం కొనసాగుతోంది. – అభిలాష అభినవ్, కలెక్టర్ -
గుట్టుగా గంజాయి దందా..
ఉట్నూర్రూరల్: మండలంలో గంజాయి దందా గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 2 కిలోల గంజాయి పట్టుబడింది. ఆదివారం రాత్రి రాములుగూడెంలో రైతు సాగు చేస్తున్న 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం ఉట్నూర్ ఇన్చార్జి ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో బీర్పాయిపేటలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మండలంలోని లక్సెట్టిపేటకు చెందిన సట్ల గంగన్న , బీర్సాయిపేటకు చెందిన జైనేని ఎల్లయ్య అనుమానస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 4.900 గంజాయి లభించింది. గంజాయి విలువ రూ.లక్షా 22 వేలు ఉంటుందన్నారు. వారిని విచారించగా మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కరీంనగర్ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జైపూర్: జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన సంధ్యారాణి (40) కుటుంబసభ్యులతో కలసి మంచిర్యాలలోని బంధువుల ఇంటికి వచ్చింది. కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఇందారం క్రాస్రోడ్డు వద్ద జైపూర్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి భర్త తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్టుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని మార్కెట్ యా ర్డు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులను చూసి పరుగులు తీయడంతో అనుమానం వ చ్చి వారిని వెంబడించగా 210 గ్రాముల గంజా యి లభించింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి ద్విచక్ర వాహనంతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. యాక్సిడెంట్ కేసులో నిందితునికి జైలు సోన్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి తొమ్మిది నెలల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ నిర్మల్ కోర్టు న్యాయమూర్తి అజయ్కుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. 2016లో సోన్ బ్రిడ్జి వద్ద ద్విచ క్ర వాహనం ఢీకొట్టడంతో గంగయ్య మృతి చె ందగా అతని భార్యసంగర్తనకు గాయాలయ్యా యి. ఇందుకు కారణమైన కొండ సంతోశ్గౌ డ్కు న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. 12 డొమెస్టిక్ సిలిండర్ల సీజ్ఉట్నూర్రూరల్: మండల కేంద్రంలోని పలు హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, స్వీట్హౌజ్లలో మంగళవారం అధికారులు త నిఖీలు నిర్వహించి 12 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రేంని వా స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే వాడాలని సూచించారు. -
డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంపు
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో పెంచిన డైట్, కాస్మెటిక్ చార్జీలు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లోనూ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు పౌష్టికాహారం, కాస్మెటిక్ చార్జీల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదివరకు అన్ని తరగతులకు కలిపి రూ.1,225 చెల్లిస్తుండగా.. ప్రస్తుతం తరగతుల వారీగా మెనూ, కాస్మెటిక్ చార్జీలు పెంచారు. 6, 7వ తరగతులకు రూ.1,330, 8వ, 9వ, 10వ తరగతులకు రూ.1,540, ఇంటర్ బాలికలకు రూ.2,100 డైట్ చార్జీలు ఉన్నాయి. కాస్మెటిక్ చార్జీలు 6నుంచి 8వ తరగతి వరకు రూ.100 నుంచి రూ.175, 8నుంచి 10వ తరగతి ఆపై 11సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ రూ.100 నుంచి రూ.275కు పెరిగాయి. కానీ ఎప్పటి నుంచి అమలు అవుతుందనేది ఉత్తర్వుల్లో స్పష్టత లేకుండా పోయింది. మరో పదిహేను రోజులు గడిస్తే వేసవి సెలవులు రానున్నాయి. వచ్చే 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇటీవల సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచినా కేజీబీవీల్లో పాత చార్జీలే అమలవుతున్నాయి. ప్రభుత్వం చెల్లించే డైట్ చార్జీలకు నిత్యం సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్కు చెల్లించే ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేజీబీవీల్లో విద్యార్థినులకు ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంపుపై హర్షం వ్యక్తమవుతోంది. మోనూ అమలు ఇలా.. జిల్లాలో 18 కేజీబీవీలు ఉండగా.. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4,587 మంది బాలికలు చదువుతున్నారు. బాలికలకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మాంసాహారం, పౌష్టికాహారానికి శ్రీకారం చుట్టింది. వారంలో ఆరు రోజులు బుధవారం మినహా అ రటిపండు, లేదా సీజనల్ పండ్లు, సేమియా, గులా బ్జామ్, అటుకులు మిక్చర్, పల్లిపట్టి, స్నాక్స్, టీ అందించాల్సి ఉంది. ధరల్లో వ్యత్యాసాల వల్ల అరకొర మోనూ అమలు చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. కొన్ని చోట్ల మటన్ పెట్టిన సందర్భాలు తక్కువే. చికెన్ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు డైట్ చార్జీలు ఇచ్చేది తక్కువ.. పక్కాగా మో నూ అమలు చేయాలనడంతో తల పట్టుకున్నారు. ప్రభుత్వం చార్జీలు పెంచడం ఉపశమనం కలిగిస్తుంది. చార్జీల పెంపు వల్ల బాలికలకు ప్రయోజనం చేకూరనుందని డీఈవో యాదయ్య తెలిపారు. కేజీబీవీల్లో బాలికలకు ప్రయోజనం భోజన నిర్వహణకు తొలగిన అడ్డంకులు -
రాష్ట్రంలో పులుల రక్షణకు చర్యలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులుల సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ టైగర్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో ‘కవ్వాల్’ టైగర్ రిజర్వు మరింత పటిష్టం కాబోతోంది. ఏటా ఉమ్మడి జిల్లా పరిధిలోకి అనేక పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది పులుల వరకు సంచరిస్తున్నాయి. ప్రసిద్ధ బెంగాల్ టైగర్లూ ఇక్కడ సంచరించాయి. కోర్ ఏరియా వరకు వెళ్లకుండా కారిడార్ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా అంధేరి, తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. పెన్గంగా, ప్రాణహిత నదులు దాటి ఉమ్మడి జిల్లాకు అడుగుపెడుతున్నాయి. ఈ పులులకు వేట ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ పులులను కాపాడుకోవాలంటే మరింత నిఘా అవసరం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ 41.09శాతం విస్తరించి ఉండగా, కుమురంభీం ఆసిఫాబాద్లో 40.24, ఆదిలాబాద్లో 29.51, నిర్మల్లో 29.83శాతాల్లో విస్తరించి ఉంది. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు’ 2022 రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 115.50, నిర్మల్లో 45.34చ.కి.మీ.చొప్పున అటవీ విస్తీర్ణం తగ్గినట్లు తేలింది. ఈ క్రమంలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు టైగర్ఫోర్స్ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా అడవుల రక్షణకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి.ఎన్నో ఏళ్లుగా డిమాండ్లుటైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కవ్వాల్ పరిధిలో పులులు ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇప్పుడున్న సిబ్బంది, అధికారులకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సరిపడా సిబ్బంది లేమితోపాటు పని ఒత్తిడితో ఉన్నారు. చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఇక పులి సంచారం ఉన్న చోట్ల వేటగాళ్ల నిరోధం, ముప్పు తప్పించేందుకు అటవీ అధికారులు శ్రమించాల్సి వస్తోంది. ప్రతీ ఏటా పులులు ఏదో కారణంగా ఇక్కడ మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ కంచెలు, వేటతో ప్రమాదంలో పడుతున్నాయి. కాగజ్నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పులులు ప్రాణాలు కోల్పోయాయి. క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా లోపం ఏర్పడుతోంది. పులుల సంరక్షణ కోసమే దళం ఏర్పాటు చేస్తే భవిష్యత్లో పులుల సంతతి పెంపునకు ఉపయోగపడనుంది. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం సేకరణకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి ధాన్యం సేకరణ ఏజెన్సీలు, అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 104 దొడ్డురకం, 90 సన్నరకం కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 80 దొడ్డురకం, 39 సన్నరకం, మెప్మా ఆధ్వర్యంలో 4 దొడ్డురకం, 2 సన్నరకం కొనుగోలు కేంద్రాలు మొత్తం 319 ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన, సీఎంఆర్ డెలివరీ సకాలంలో చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు, సీసీలు, పీఏసీఎస్ కార్యదర్శులు, రైస్మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లను జిల్లా అదనపు కల్టెర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హరీష్రాజ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి ఆవిష్కరించారు. ప్రోగ్రాం అధికారులు అనిత, ప్రసాద్, కృపాబాయి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
● బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల వేతనాలు ఆపి వేయండి ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో వచ్చిన అర్జీదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి అర్జీలు స్వీకరించారు. పింఛన్, భూ సమస్యలు, పరిహారం తదితర వాటిపై పలువురు దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల వేతనాలు నిలిపి వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దరఖా స్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. -
విద్యార్థులకు వైద్య పరీక్షలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగవంతం వాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యా ధులు, కంటి పరీక్షలపై అవగాహన కల్పించా రు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని 60 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. సీనియర్ సి విల్ జడ్జి అర్పితరెడ్డి, జిల్లా ఉపవైద్యాధికారి ఎస్.అనిత, జిల్లా ఇంచార్జి సంక్షేమ శాఖ అధికా రి రాజేశ్వరి, డెమో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘పది’ మూల్యాంకనం ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్ష జవా బు పత్రాల మూల్యాంకనం సోమవారం స్థాని క ఏసీసీ కార్మెల్ హైస్కూల్లో ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ఉదయం 8గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉండగా మధ్యాహ్నం వరకు రాకపోవడంతో మూల్యాంకనం ఆలస్యమైంది. రిపో ర్టు చేయని టీచర్లకు నోటీసులు జారీ చేస్తామని మైకులో హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. అనారోగ్యం, ఇతర అత్యవసర కారణాలు చూపుతూ విధులకు దూరంగా ఉండేందుకు ప డరాని పాట్లు పడ్డారు. మధ్యాహ్నం తర్వాత మూల్యాంకనం మొదలైంది. ఇతర జిల్లాల నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన 1,29,281 జవాబు పత్రాలు మూల్యాంకన కేంద్రానికి చేరాయి. మొదటి రోజు 7280 పేపర్లు మూల్యాంకనం చేశారు. అసిస్టెంట్ క్యాంపు ఆ ఫీసర్లు 7, చీఫ్ ఎగ్జామినర్లు65, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 390, స్పెషల్ అసిస్టెంట్లు 130మంది మూల్యాంకన విధులకు హాజరయ్యారు. డ్యూటీ చేస్తారా.. వెళ్లిపోతారా..? రిపోర్టు చేయకుండా చెట్ల కింద, వరండాలో తిరుగుతున్న ఎగ్జామినర్లను డీఈవో యాద య్య మందలించారు. మధ్యాహ్న సమయం దాటినా హిందీ, బయోసైన్స్ టీచర్ల కొరత కనిపించింది. చాలామంది విధుల ఉత్తర్వులు రద్దు చేయించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. సమయం దాటిపోతున్నా రిపోర్ట్ చేయనిటీచర్ల వద్దకు డీఈవో వెళ్లి డ్యూటీ చేస్తారా.. వెళ్లిపోతారా అంటూ మందలించారు. -
ఎమ్మెల్యేలకు అభివృద్ధిపై ధ్యాస లేదు
● కార్యకర్తలపై అక్రమ కేసులు సహించబోం ● బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్బెల్లంపల్లి: బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేకుండా పోయిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. సోమవారం బెల్లంపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ తీరని అన్యాయం చేస్తున్నాయని, రాష్ట్రానికి ప్రథమ శత్రువులని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెడితే ఊరుకోబోమని, ప్రతీ కార్యకర్తకు అండగా ఉండి జిల్లాలో గులాబీ సైనికులుగా తయారు చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమ కేసులపై రామగుండం కమిషనరేట్ ముట్టడిస్తామని అన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నాయకులు టి.సత్యనారాయణ, కోళి వేణుమాధవ్, బత్తుల సుదర్శన్, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతన్పల్లిలోని తన నివాసంలో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన నిరుద్యోగ యువతకు 45 వేల ఉద్యాగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
క్రికెట్ పోటీలు ప్రారంభం
నస్పూర్: సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనుల కార్మిలకు ఏఐటీయూసి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను స్థానిక నాయకులు ఆదివారం నిర్వహించారు. యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ఏరియా కార్యదర్శి బాజీసైదా పోటీలు ప్రారంభంచి మాట్లాడారు. త్లాళపల్లి మాజీ సర్పంచ్ సీపీఐ నాయకుడు పి.నర్సయ్య స్మారకార్ధ ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణాకాలనీలోని శాంతి స్టేడియంలో జరిగిన పోటీలలో ఆర్కే–5 గని కార్మికులు పోటీలలో పాల్గొన్నారు. బ్రాంచి ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు, నాయకులు సకినాల నర్సయ్య, నర్సింగరావు, సురేష్, అఫ్రోజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాలటౌన్/చెన్నూర్: భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు చెన్నూర్లోని తన స్వగ్రామంలోనూ ఆయన జెండా ఎగురవేశారు. జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్, నాయకులు దుర్గం అశోక్, పరుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, జోగుల శ్రీదేవి, వంగపల్లి వెంకటేశ్వర్గౌడ్, బోయిని హరికృష్ణ, కర్రె లచ్చన్న, మల్యాల శ్రీనివాస్, తోట మల్లికార్జున్, దేవరకొండ వెంకన్న పాల్గొన్నారు. చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.నాయకులు కేవీఎం.శ్రీనివాస్, బత్తుల సమ్మయ్య, శ్రీపాల్, దాసరి రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
● ‘100 యాప్’ తో పెట్రోలింగ్ పర్యవేక్షణ ● 2023లో సరాసరి లెక్కించిన పోలీస్ శాఖ ● ప్రాణాలు కాపాడుతున్న పోలీసులు
మంచిర్యాలక్రైం: రాష్ట్ర పోలీస్ శాఖ నేరాల నియంత్రణ, సత్వర సమాచారం, సమస్యల పరిష్కారం కోసం డయల్ 100 నంబర్ను ప్రవేశపెట్టింది. అత్యవసర సమయాల్లో ప్రజలకు తక్షణ సాయం అందించే లక్ష్యంతో ఈ సేవను ఏర్పాటు చేశారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రైవేట్ సంస్థ దీనిని నిర్వహించగా, ప్రస్తుతం ఇది పోలీస్ శాఖ అధీనంలో సమర్థవంతంగా కొనసాగుతోంది. సాంకేతికతను ఉపయోగించి స్పందన సమయాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ‘100 యాప్’ను ప్రవేశపెట్టారు. గతంలో సవాళ్లు.. గతంలో ఎవరైనా డయల్ 100కు కాల్ చేస్తే, అది నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరేది. అక్కడి సిబ్బంది బాధితుడు ఏ ఠాణా పరిధిలో ఉన్నాడో తె లుసుకుని, కాల్లోని వివరాలను సంక్షిప్త సందేశంగా మార్చి సంబంధిత ఠాణా, జోన్ కార్యాలయం, కమిషనరేట్ కంట్రోల్ రూమ్లకు పంపేవారు. వాకీటాకీ ద్వారా గస్తీ వాహనాలు, బ్లూ కోల్ట్స్ను అప్రమత్తం చేసేవారు. అయితే, గస్తీ వాహనం ఎక్కడ ఉంది, బాధితుడికి ఎంత దూరంలో ఉంది అనే వివరాలు తెలుసుకునే సాంకేతికత లేకపోవడంతో స్పందన సమయం ఎక్కువగా ఉండేది. ఘటనా స్థలానికి చేరిన తర్వాత సిబ్బంది నివేదించిన వివరాల ఆధారంగా కాల్ను మూసివేసేవారు. దీంతో అధికారులకు ఘటనపై స్పష్టత లభించేది కాదు. ఇప్పుడు సమర్థవంతమైన స్పందన ప్రస్తుతం డయల్ 100 సేవలు సాంకేతికతతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. బాధితుడు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ సెంటర్ సిబ్బంది అతని స్థానాన్ని గుర్తిస్తారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గస్తీ వాహనం, బ్లూ కోల్ట్స్ టీమ్కు ట్యాబ్లను అందించారు. ఈ ట్యాబ్లు జీపీఎస్ పరికరాలుగా పనిచేస్తూ, ఏ వాహనం ఎక్కడ ఉందో కంట్రోల్ సెంటర్కు తెలియజేస్తాయి. బాధితుడికి సమీపంలోని వాహనానికి కాల్ను డైవర్ట్ చేసే ప్రక్రియ కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ట్యాబ్లో ప్రత్యేక రింగ్టోన్ ద్వారా కాల్ వచ్చినట్లు సిబ్బందికి తెలుస్తుంది. బాధితుడి వివరాలు, ఫిర్యాదు స్వభావం ట్యాబ్ తెరపై కనిపిస్తాయి. సిబ్బంది ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడం ద్వారా కాల్ అందినట్లు ధ్రువీకరిస్తారు. 7 నిమిషాల్లో పోలీస్ రెస్పాన్స్.. 2023లో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం, డయల్ 100 కాల్కు సగటున 7 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దీనిని ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’ అంటారు. ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు ట్యాబ్లను జీపీఎస్గా మార్చి, ప్రతీ పెట్రోలింగ్ టీమ్కు అందజేశారు. కాల్ అందిన వెంటనే సమీప టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని, సమస్యను అధికారులకు వివరిస్తూ అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రమాదాల్లో క్షతగాత్రులకు సహాయం, ఫోటోలు, వీడియోలు తీసి ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు పంపడం జరుగుతోంది. -
ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రాంత ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐబీ వద్ద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఆదివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జి+5తో నిర్మిస్తున్నా.. జి+10 కోసం డిజైన్ చేశామన్నారు. రూ.50 కోట్లతో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నాలుగు నెలల రికార్డుస్థాయిలో 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 650 పడకలతో నిర్మిస్తున్న ఇందులో 225 బెడ్లతో మాతా శిశు ఆసుపత్రి, 425 బెడ్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొనసాగిస్తామన్నారు. 2027 జూన్లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు. రాజీవ్నగర్లోని కస్తూరిబా పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థినులు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని చెప్పడంతోనే, మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. నూతన అంబేడ్కర్ విగ్రహం.. ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ఐబీ చౌరస్తాలో నూతన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విగ్రహం చుట్టూ పచ్చదనంతో కూడిన గార్డెన్ను ఉంటుందన్నారు. ఈ నెల 14వ తేదీన మహాప్రస్థానంలో అంత్యక్రియలను సైతం ప్రారంభించి, పేదలందరికి ఉచితంగా కర్మకాండలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మంచిర్యాలలో 20 వేల మంది విద్యార్థులు అన్ని సౌకర్యాలతో కూడిన హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసించేలా సొంత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. -
● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్ఆర్ఎస్ చెల్లింపులతో కాస్త ఊరట
మంచిర్యాలటౌన్: జిల్లాలో మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోంది. దీంతో ఆదాయం తగ్గుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు పరిస్థితి బాగున్నప్పటికీ, ఆ తర్వాత ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏటా పెరగాల్సిన ఆదాయం తగ్గడంతోపాటు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా క్షీణిస్తోంది. 2023–24లో 20,173 డాక్యుమెంట్లు రిజిస్టరై, రూ.53.02 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–25లో కేవలం 13,881 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఆదాయం రూ.53.20 కోట్లుగా నమోదైంది. ఎల్ఆర్ఎస్తో ఆదాయం.. ప్రభుత్వం మార్చి నెలలో ఎల్ఆర్ఎస్(లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ఫీజులపై 25 శాతం రాయితీ ప్రకటించడంతో ఆ నెలలోనే రూ.4 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని వారికి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో నేరుగా రాయితీతో ఫీజు చెల్లించి, భూములను అమ్మే అవకాశం కల్పించడం కూడా ఈ ఆదాయానికి కారణమైంది. ఎల్ఆర్ఎస్ గడువు మార్చి 31 వరకు ఉండగా, దాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో ఈ ఏప్రిల్లో మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం కనిపిస్తోంది. రియల్ వ్యాపారం ఊపందుకుంటేనే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ ఊపందుకుంటేనే ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ఆదాయం గతంతో సమానంగా ఉంటోంది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే కార్యాలయాల్లో రెండో స్థానంలో నిలిచిన చరిత్ర కూడా ఉంది. ఎల్ఆర్ఎస్ చెల్లింపులే కీలకం మంచిర్యాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్తో పోటీ పడుతుందనే అభిప్రాయం ఉంది. ఇక్కడి భూముల ధరలు హైదరాబాద్లోని ధరలతో సమానంగా, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సామాన్యంగా సాగుతుండగా, ఎల్ఆర్ఎస్ లేని భూముల రిజిస్ట్రేషన్లు గత నెల వరకు ఆగిపోయాయి. గత నెలలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజుపై 25 శాతం రాయితీ ప్రకటించడంతో పరిస్థితి మారింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోని వారు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో నేరుగా ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. చెల్లింపులు పెరిగే ఛాన్స్..గత నెల 31 వరకు జిల్లాలో 31,093 దరఖాస్తుల్లో 7,593 మంది 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించారు. ఈ నెలాఖరు వరకు రాయితీ గడువు పొడిగించడంతో మరికొంత మంది ఫీజు చెల్లించే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు, అమ్మకాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది మార్కెట్ ధరలను పెంచే అవకాశం ఉండగా, ధరలు పెరగకముందే కొనుగోళ్లు, అమ్మకాలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.డాక్యుమెంట్లు తగ్గాయిమంచిర్యాల సబ్ రి జిస్ట్రార్ కార్యాలయంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 20,173 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ అయితే, 2024–25లో 13,881 మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. డాక్యుమెంట్ల వారీగా చూస్తే 31.19 శాతం దరఖాస్తుల రిజిస్ట్రేషన్లు త గ్గాయి. ఆదాయం 2024 మార్చి వరకు రూ. 53.02 కోట్లు రాగా, 2025 మార్చి వరకు రూ.53.20 కోట్లు వచ్చాయి. ఆదాయం ప రంగా చూస్తే 00.34 శాతం మాత్రమే పెరి గింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులతో కొంత మేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. – ప్రియాంక, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్మూడేళ్లుగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు, ఆదాయంసంవత్సరం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సమకూరిన ఆదాయం 2022–23 20,038 రూ. 57.08 కోట్లు 2023–24 20,173 రూ. 53.02 కోట్లు 2024–25 13,881 రూ. 53.20 కోట్లు -
పోలీస్ సేవల్లో సాంకేతిక విప్లవం
2024 డిసెంబర్ 16న జిల్లా కేంద్రంలోని చున్నంబట్టీ వాడకు చెందిన మైదం పురుషోత్తం మద్యం మత్తులో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేస్తున్నాడని డయల్ 100కు సమాచారం అందింది. స్పందించిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రదీప్, సాయి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పురుషో త్తంను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.2021 అగస్టు 11న జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్కు చెందిన వేముల లక్ష్మీనారాయణను కుటుంబ సభ్యులు మందలించడంతో మద్యం మత్తులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఫోన్ సిగ్నల్ను ట్రాక్ చేసిన పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే లక్ష్మీనారాయణ ప ట్టాలపై పడుకుని ఉన్నారు. అప్పటి సీఐ ముత్తి లింగ య్య, గన్మెన్ భరత్ వెంటనే అతడిని కాపాడారు. -
హోరెత్తిన రామనామం..!
భైంసాటౌన్/నిర్మల్టౌన్: శ్రీరామనవమి పర్వదినాన జైశ్రీరామ్ నినాదాలతో జిల్లాకేంద్రంతో పాటు భైంసా పట్టణాలు మారుమోగాయి. ఆదివారం జిల్లాకేంద్రంలో హిందూవాహిని, భజరంగ్దళ్ సంఘాల ఆధ్వర్యంలో శ్రీరామ వీరహనుమాన్ విజయయాత్ర చేపట్టారు. స్థానిక దేవరకోట దేవస్థానం వద్ద నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకిషర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్సింగ్, స్వామివివేకానంద, చత్రపతి శివాజీ చిత్రపటాలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా ఎస్పీ జానకిషర్మిల, ఏఎస్పీలు రాజేశ్ మీనా, ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భైంసా పట్టణంలో ఉదయం 11 గంటలకు పురాణబజార్లోని గోశాల వద్ద రాముడి విగ్రహానికి ఎమ్మెల్యే పి.రామారావు పటేల్, ఎంపీ గోడం నగేశ్, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాశ్కుమార్తోపాటు హిందూవాహిని, ఆర్ఎస్ఎస్ నాయకులు పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభించారు. -
కేదారేశ్వర ఆశ్రమంలో పూజలు
బాసర: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం బాసరలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కన్యపూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు అతుల్ మహరాజ్ బాలికల కాళ్లు కడిగి పూజలు చేశారు. పార్వతీదేవి తొమ్మిది అవతారాలకు చిహ్నంగా తొమ్మిది మంది బాలికలకు కన్యపూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం అన్నప్రసాదం అందజేశారు. పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. టీవీషోలో గురుకుల విద్యార్థుల ప్రతిభఇచ్చోడ: ఓ తెలుగు టీ వీషోలో మండల కేంద్రంలోని గురుకుల విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ధనుశ్, వినోద్లు జీతెలుగు టీవీషోలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పథకాలు గెల్చుకున్నారు. ఆదివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గోవర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, బోజన్నలు విద్యార్ధులను అభినందించారు. -
బిలోలిలో కుస్తీ పోటీలు
లోకేశ్వరం: మండలంలోని బిలోలి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. తానూర్, ముధోల్, లోకేశ్వరం మండలాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు కుస్తీపోటీల్లో పాల్గొన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుస్తీ పోటీల్లో నాందేడ్ జిల్లా బోర్దండీ గ్రామానికి చెందిన సాయినాథ్ అనే మల్లయోధుడు ప్రథమ బహుమతి రూ.5001లు అందుకున్నాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోకేశ్వరం ఏఎస్సై దిగంబర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నాయకులు కాంతారావు, నర్సింగ్రావు, ప్రభాకర్రావు, సతీశ్రావు, రాజశేఖర్రావు, లింగారావు, సుకుమార్రావు, రవీందర్రావు, ముత్యం, నాగారావు, భూమరావు, శ్రీనివాస్రావు, రాజు, రాజన్న, ఈరన్న, మనోహర్రావులు ఉన్నారు. -
కూరగాయలు @ కిష్టంపేట
● పందిళ్లు వేసి సాగు చేస్తున్న రైతులు ● అధిక దిగుబడులు పొందుతూ ఆదర్శంచెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామంలో రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇళ్ల వద్ద పెరళ్లలో, చేలలో కూరగాయలను పండిస్తూ ప్రతీరోజు రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలను ప్రతీరోజు చెన్నూర్, మంచిర్యాల, గోదావరిఖని ప్రాంతాలకు తీసుకెల్లి విక్రయిస్తున్నారు. మండలంలో మొత్తం 400 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా ఒక కిష్టంపేటలోనే 290 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో తీగజాతి బీర 160 ఎకరాలు, దొండ 90 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మిగతా అల్చంత, బెండ, మిర్చి, గోంగూర, తోటకూర, వంకాయలు సాగు చేస్తున్నారు. తీగజాతి కూరగాయలపై దృష్టి.. రైతులు ఎక్కువగా తీగజాతి కూరగాయలు బీర, దొండలను సాగు చేస్తున్నారు. బీర సాగు వరి పంట పొలాల్లో గట్టలపై చేస్తుండగా పెరళ్లలో పందిళ్లు వేసి దొండసాగు చేస్తున్నారు. గ్రామంలో రైతులు సుమారు 30 ఏళ్ల నుంచి దొండ సాగు చేస్తున్నారు. తీగజాతి కూరగాయల కోసం ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. పందిరి కోసం రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కూలీలకు రూ.10వేల వరకు ఖర్చవుతోంది. దొండ విత్తన కొమ్మలకు సుమారు రూ.500ల వరకు ఖర్చవుతోంది. ఒకసారి తోట పెడితే 30 నుంచి 40 ఏళ్ల వరకు కాపు వస్తుంది.దొండ విత్తన కొ మ్మలు పెట్టిన తర్వాత ఏడాదికి కాపుకు వస్తుంది. వారానికి సుమారు 50 కిలోల వరకు దొండకాయలు దిగుబడి వస్తాయి.వీటిని చెన్నూర్, మంచిర్యా ల, గోదావరిఖని మార్కెట్లలో విక్రయిస్తున్నారు. సస్యరక్షణ చర్యలు.. కాగా తీగజాతి పంటలకు వారానికి రెండు సార్లు నీటి తడులు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సస్యరక్షణలో భాగంగా ప్రధాన పంటలో గడ్డి తొలగించాలి. రాలిన కాయలను ఏరివేయాల్సి ఉంటుంది. దొండ పంటకు ప్రధానంగా పండు ఈగ ఆశించి నష్టపరుస్తుంది. దీని నివారణకు అ సిఫేట్ ఎకరానికి 400 గ్రాములు లీటర్ నీటికి కలి పి పిచికారీ చేయాలి. సహజ సస్యరక్షణలో భాగంగా పండు ఈగను నివారించేందుకు రైతులు పిరమిన్ ట్రాప్స్ ఉపయోగిస్తున్నారు. పందిళ్ల ద్వారా తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పండుగ వేళ విషాదం..!
● దైవదర్శనానికి వెళ్తూ విద్యార్థి దుర్మరణం ● బైక్ను ఢీకొన్న టాటాఏస్ హసన్పర్తి: పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. స్నేహితురాలితో కలిసి బైక్పై దైవదర్శనానికి వెళ్తుండగా టాటాఏస్ ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన హనుమకొండ –కరీంనగర్ ప్రధాన రహదారిపై హసన్పర్తి నలగట్టుగుట్ట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేటకు చెందిన రామటెంకి శ్రవణ్ కుమారుడు ఉదయ్(18) హసన్పర్తి పరిధి అన్నాసాగరంలో అద్దెకు ఉంటూ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అదే కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న స్నేహితురాలితో కలిసి బైక్పై అన్నాసాగరం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో హసన్పర్తి మండల కేంద్రంలోని నల్లగట్టుగుట్ట సమీపంలో హనుమకొండ నుంచి ఎల్కతుర్తి వైపునకు వస్తున్న ఓ టాటాఏస్ బస్సును అనుసరిస్తూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఉదయ్తో పాటు అతని స్నేహితురాలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఉదయ్ మృతి చెందాడు. ఉదయ్ తండ్రి శ్రవణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. -
ఇక మహిళలు సేఫ్!
● అందుబాటులో టీ –సేఫ్ యాప్ ● అతివల రక్షణకు పోలీస్శాఖ చర్యలు ● ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్కు అవకాశం నిర్మల్ఖిల్లా: ప్రతీరోజు ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జర్మనీ యువతిపై రాష్ట్ర రా జధాని హైదరాబాద్ నగరంలో జరిగిన అత్యాచార ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ టీ–సేఫ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల రక్షణ కోసం ఈ యాప్ను రూపకల్పనచేసి దాదాపు ఏడాది గడుస్తున్నా సరైన అవగాహన లేక యాప్ను వినియోగిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మహిళలు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు టీ –సేఫ్ యాప్లో నమోదు చేసుకోవడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే సేఫ్.. మొబైల్లో ప్లేస్టోర్ ద్వారా టీ– సేఫ్ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన యాప్ కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. హెల్ప్ సిటిజన్ విభాగంలో క్లిక్ చేసి ప్రయాణిస్తున్న ప్రాంతం పేరు ప్రయాణించే వాహనం, దాని రిజిస్ట్రేషన్ నంబరు నమోదు చేయాలి. ఒకవేళ రైలు ప్రయాణం చేస్తే ఆ రైలు రూట్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ప్రయాణం ప్రారంభించే ముందు స్టార్ట్ బటన్ నొక్కగానే సదరు సమాచారం పోలీసుల పర్యవేక్షణలోకి వెళ్తుంది. ఇక అప్పటి నుంచి ఆ వాహనం లొకేషన్ గమ్యం చేరేవరకు పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది. అనుకోని ఘటన ఎదురైతే.. ప్రయాణిస్తున్న వాహనం రూటు మారినా, ప్రామాణిక సమయానికన్నా ఆలస్యమైనా పోలీసుల నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి హెచ్చరిక సందేశం వస్తుంది. దానికి వినియోగదారు నుంచి రిప్లయ్ ఇవ్వకుంటే కేసును అనుమానాస్పదంగా పరిగణించి నేరుగా ప్రయాణిస్తున్న వాహనం వ్యక్తి వివరాలు డయల్ 100కు వెళ్తాయి. లొకేషన్ ఆధారంగా సమీప పోలీస్స్టేషన్ లేదా పెట్రోలింగ్ వాహనానికి సమాచారం చేరవేస్తారు. నిమిషాల వ్యవధిలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అనుకోని సందర్భాల్లో విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడే మహిళలను పరిరక్షించేందుకు టీ సేఫ్ యాప్ చక్కగా ఉపయోగపడుతుందని ఒంటరి మహిళలకు, యువతులకు రక్షణ కవచంలా పని చేస్తుందని జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు. -
బైక్లో దూరింది.. హడలెత్తించింది!
నిర్మల్ఖిల్లా: ద్విచక్రవాహనంలో దూరిన విషసర్పం కొన్ని గంటలపాటు హడలెత్తించింది. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని ముక్టాపూర్ సబ్స్టేషన్లో విధులు నిర్వహించే ఉద్యోగి సాగర్కు చెందిన బైక్ డోమ్ను ఆనుకొని నాగుపాము దాక్కుంది. బయటకు వెళ్లేందుకు యజమాని బైక్ స్టార్ట్ చేయగా అందులో దాగి ఉన్న విషసర్పం కన్పించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్ గిరిగంటి వినీల్కు సమాచారం అందించారు. ఆయన అక్కడకు చేరుకుని చాకచక్యంగా ప్రాణాలతోనే పామును పట్టుకున్నాడు. పాముకు హాని కలిగించకుండా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
కాసిపేట: మండల కేంద్రానికి చెందిన దుర్గం రమ్య (27)అనే వివాహిత ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. కాసిపేటకు చెందిన దుర్గం రాజమల్లుతో వెంకటపూర్కు చెందిన రమ్యకు 2016లో వివాహం జరిగింది. కొద్దిరోజుల క్రితం రాజమల్లుకు పక్షవాతం రాగా రమ్య వివిధ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అప్పులై మనస్తాపానికి గురి కాగా తండ్రి కుమ్మరి రాజన్న ధైర్యం చెప్పేవాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా రమ్య దంపతులకు ఏడేళ్ల కూతురు ఉంది. రమ్య తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
యువతను ప్రోత్సహించేందుకు చెస్ పోటీలు
బాసర: గ్రామీణ యువత, విద్యార్థుల్లో చెస్ ఆటను ప్రోత్సహించేందుకు క్యాంపస్లో చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఆదివారం ఆర్జీయూకేటీ క్యాంపస్లో రెండు రోజుల చెస్ పోటీలను డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్తో జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చెస్ నెట్వర్క్ సంస్థ, హైదరాబాద్లోని గ్యాప్స్కిల్స్ లెర్నింగ్ సొల్యూషన్స్ మద్దతుతో టోర్నమెంట్ నిర్వహిస్తోందన్నారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటిని పక్కన పెట్టి చెస్ ఆడాలన్నారు. ఆటల వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. చెస్ నెట్వర్క్ బృంద సభ్యులు సంజయ్ గజ్జల, అధ్యక్షుడు హరి, ప్రధాన కార్యదర్శి రాజన్న, కిరణ్, కార్యవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సెలవు చావుకొచ్చింది!
ఆదిలాబాద్రూరల్: సెలవు ఆ విద్యార్థుల చావుకొ చ్చింది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని వైజాగ్కు చెందిన కాంబ్డే దుర్గాప్రసాద్, సత్యభామ దంపతులు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఆదిలాబాద్కు వచ్చారు. మావల మండల కేంద్రంలోని 170 కాలనీలో గుడిసెలు వే సుకుని నివాసం ఉంటున్నారు. వారికి రాహుల్ (9) (నాలుగో తరగతి), విశాల్ ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ మావల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్2లో చదివిస్తున్నారు. శనివారం పాఠశాలకు సెలవు ఉండడంతో రాహుల్, విశాల్, స్నేహితుడు చిప్పకుర్తి సంజీవ్ (10)తో కలిసి ఈత కొట్టేందుకు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న ఎర్రకుంట చెరువు వద్దకు వెళ్లారు. రాహుల్, సంజీవ్ స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. విశాల్ చెరువు చుట్టుపక్కల ఆడుకుంటూ ఉన్నాడు. కొంత సేపటికి రాహుల్, సంజీవ్ నీటిలో మునిగిపోవడంతో గమనించిన విశాల్ విషయాన్ని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులకు స మాచారం అందించాడు. మావల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు.రెండు రోజుల్లో పుట్టిన రోజు..గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన చిప్పకుర్తి రాజ్కుమార్ కుమారుడు సంజీవ్ నానమ్మ తారా బాయి వద్ద ఉండి మావల పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మరో రెండు రోజుల్లో అతని పుట్టినరోజు ఉంది. ఇందుకోసం తారాబాయి తన పింఛన్ డబ్బులతో కొత్త బట్టలు కొనిచ్చేందుకు తీసుకెళ్దామని అనుకుంది. అంతలోనే స్నేహితులు రావడంతో వారితో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఈ విషాదకర వార్త తెలియడంతో తారాబాయి అక్కడికి చేరుకుని నా కోరిక తీరక ముందే వెళ్లిపోయావా.. అంటూ గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. -
నూతన గనులు ఏర్పాటు చేయాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో నూతన గనులను ఏర్పాటు చేయాలని ఐఎన్టీయూసీ నేతలు శనివారం కంపెనీ డైరెక్టర్ను కోరారు. ఆర్జీవన్ ఏరియాలో పర్యటన నిమిత్తం వచ్చిన సింగరేణి డైరెక్టర్(పా) కొప్పుల వెంకటేశ్వర్లును ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బీ.జనక్ప్రసాద్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో సుదీర్ఘకాలం ఒకేస్థానంలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలన్నారు. ప్రస్తుతం పదేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, దీన్ని ఐదేళ్లకు కుదించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉద్యోగుల రక్షణ, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అధికారుల పనితీరును అంచనా వేసే విధంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు. అనంతరం డైరెక్టర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ధర్మపురి, కాంపల్లి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతిగౌడ్, ఆర్జీ 1 ఏరియా ఉపాధ్యక్షులు సదానందం, నాయకులు వడ్డేపల్లి దాస్, గడ్డం కృష్ణ, లింగమూర్తి, సాయి, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం
చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేటలో శనివారం రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్రం నిధులతోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని, అందు కు ప్రతీ రేషన్ షాపు వద్ద బీజేపీ నాయకులు ప్రధాని నరే ంద్ర మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు మోదీ ఫ్లెక్సీని తొలగించడంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరుపార్టీల నాయకులను శాంతింపజేశారు. -
సింగరేణి విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన
శ్రీరాంపూర్: సింగరేణి విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన చేస్తున్నామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సీసీసీలోని సింగరేణి హైస్కూల్లో పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అరవిందరావు, పాఠశాల కరస్పాండెంట్ ఏ.రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు సంతోష్, రిటైర్డ్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంద్ర ప్రకాష్రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు సమ్మయ్య, వాణిశ్రీ, రాజారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, కృష్ణ్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయలు అమ్మేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..
● విద్యుత్షాక్తో యువరైతు మృతితాంసి: కూరగాయలు విక్రయించేందుకు వచ్చి విద్యుత్ షాక్తో యువరైతు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన అశిలీ పొచ్చన్న (38) తనకున్న ఎకరంతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని 20 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. వాటిని జిల్లా కేంద్రంలోని రైతుబజార్కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం కూరగాయలు విక్రయించడానికి జిల్లా కేంద్రంలోని రైతుబజార్కు వచ్చాడు. విక్రయించిన అనంతరం రాత్రి సమయంలో విద్యుత్బల్బును తొలగించే క్రమంలో షాక్ కొట్టడంతో పక్కనున్న రాళ్లపై పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య మమత ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్ వాసి...
నేరడిగొండ: మండలంలోని కుప్టి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రాజస్థాన్కు చెందిన దిలీప్ గుజర్ (20) కుప్టి వద్ద గల ధాబా హోటల్లో పనిచేస్తున్నాడు. హోటల్ యజమాని పని నిమిత్తం రాజస్థాన్కు వెళ్తున్న క్రమంలో అతన్ని బస్సు ఎక్కించి హోటల్కు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంలక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్ శివారులోని సరస్వతి కాలువలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. రాచాపూర్ కారోబార్ రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ వర్మ, ప్రొబేషనరీ ఎస్సై జుబేర్ తెలిపారు. సిర్పూర్(టి): మండలంలోని టోంకిని గ్రామ సమీపంలో పెన్గంగ నదిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతునికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. -
హీరాసుకా జెండా తొలగింపుపై చర్చావేదిక
● తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ఆదివాసీలుఇంద్రవెల్లి: మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పర్ధాన్ సమాజ్ కుల గురువు హీరాసుకా స్మారక జెండాను ఇటీవల గుర్తు తెలియని దుండగులు తొలగించారు. దీనిపై శనివారం కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నాలుగు సగల ఆదివాసీలతో చర్చావేదిక నిర్వహించారు. నాగోబా ప్రాంగణంలో హీరాసుక జెండాను ఏర్పాటు చేయడం సరికాదని, వేరేస్థలంలో ఏర్పాటు చేయాలని తీర్మాణించారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి కేస్లాపూర్ నాగోబా దర్బర్ హాల్లో కొనసాగుతున్న ఆదివాసీల చర్చావేదికను ఉట్నూర్ సీఐ మొగిలి, ఎస్సై దుబ్బక సునీల్ ద్వారా తెలుసుకున్నారు. -
కళాకారులకు ఉపాధి కల్పిస్తాం
● టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేశ్ ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని కళాకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలంగాణ టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పిక్చర్ టైం థియేటర్లో ఔత్సాహిక కళాకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యువ దర్శకుడు దండనాయకుల మానస్తో కలిసి మాట్లాడారు. జిల్లాలో అనేక ప్రకృతి వనరులు ఉన్నాయని, వీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే సినిమా, సీరియల్స్ షూటింగ్లకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటి వరకు 27 సీరియల్స్, 927 డాక్యుమెంటరీలు నిర్మించినట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 110 మందిని బుల్లితెరకు పరిచయం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మందికి అవకాశం కల్పిస్తామన్నారు. షూటింగ్ కోసం జిల్లాకు వచ్చే కళాకారులకోసం ప్రత్యేక స్టూడియోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని సీఎంతో పాటు, సినిమా ఇండస్ట్రీ చైర్మన్ దిల్రాజు దృష్టికి తీసుకెళ్లానన్నారు. సమావేశంలో నవజ్యోతి సాంస్కృతిక సారధి అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, సభ్యులు రాధాకృష్ణాచారి, జిల్లాలోని కళాకారులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీల విజేత హైదరాబాద్
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి టౌన్షిప్లోని భీమన్న స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ వేణుగోపాల్ మెమోరియల్ ఇన్విటేషనల్ వాలీబాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. హైదరాబాద్ జట్టు విజేతగా బెల్లంపల్లి జట్టు రన్నరప్గా నిలిచాయి. నాకౌట్ కం లీగ్ పద్ధతిలో నిర్వహించిన సెమీ ఫైనల్, ఫైనల్ పోటీల్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. హైదరాబాద్ జట్టు అద్భుత ఆటతీరును ప్రదర్శించి విజయ కేతనం ఎగురవేసింది. సింగరేణిలో క్రీడలకు పెద్దపీట సింగరేణి యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తోందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. శనివారం భీమన్న స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో పని చేసిన ఓ ఉద్యోగి పేరుతో 36 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ, క్రీడాస్పూర్తి ఎంతో అవసరమన్నారు. పోటీల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమని, ఓటమిని కారణాలను విశ్లేషించుకుంటూ గెలుపు దిశగా క్రీడాకారులు పయనించాలన్నారు. అనంతరం విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.30 వేల నగదు, రన్నరప్గా నిలిచిన బెల్లంపల్లి జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 20 వేల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్, ఆర్జీ–2 ఏరియా స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్రెడ్డి, బెల్లంపల్లి రీజియన్ స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కిరణ్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే పల్లెల అభివృద్ధి
● బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్భీమిని: కాంగ్రెస్తోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కన్నెపల్లి, భీమిని మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. కన్నెపల్లి మండలంలోని చెర్లపల్లి పాఠశాలలో నిర్మించిన అదనపు గదిని ప్రారంభించారు. జన్కాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రానికి, ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ గదికి శంకుస్థాపన చేశారు. టేకులపల్లి, మల్లీడి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు, నాయకన్పేట్ పరిధిలోని గొల్లగూడ గ్రామానికి బీటీ రోడ్డుకు భూమిపూజ చేశారు. భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన డాక్టర్స్, నర్సు క్వార్టర్లను ప్రారంభించారు. భీమిని, కన్నెపల్లి రైతువేదికల్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదా రులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో హరీష్రాజ్, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు బికార్ణదాస్, శ్రవణ్కుమార్, ఎంపీడీవో గంగమోహన్, పీఎచ్సీ వైద్యుడు అనిల్కుమార్, నాయకులు పాల్గొన్నారు. హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వినోద్ బెల్లంపల్లి: బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీలోని శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు చేశారు. మనుమత్ మన్యు సూక్త సహిత రుద్రహోమంలో హన్మాన్ భక్తులతో కలిసి హోమం చేశారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకుడు విజయ్శర్మ, హన్మాన్ భక్తులు సన్మానం చేశారు. -
నేడు రాములోరి పెళ్లి..
● జిల్లాలో ముస్తాబైన ఆలయాలు ● భక్తుల కోసం ఏర్పాట్లు ● నేడు శ్రీరామనవమిమంచిర్యాలఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి జిల్లాలోని కోదండ రామాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగే కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాలకు రంగులు వేసి మామిడి తోరణాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేశారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న చెన్నూర్ మండలం సుద్దాల గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, వందేళ్లనాటి పాత మంచిర్యాల రామాలయం, శివాలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల విశ్వనాథ స్వామి ఆలయం, గౌతమినగర్ కోదండరామాలయం, ఏసీసీ, గర్మిళ్ల హనుమాన్ టెంపుల్ తదితర ఆలయాల్లో కల్యాణం నిర్వహించనున్నారు. దండేపల్లిలో సీతారాముల కల్యాణంలో భాగంగా శనివారం హనుమాన్ దీక్షాపరులు, భక్తులు బ్యాండుమేళాలు, మంగళహారతులతో ఎడ్లబండ్లలో పాలపొరకను తీసుకొచ్చారు. రామాలయం వద్ద పందిళ్లపై పాలపొరకను వేసి పెళ్లి వేడుకలు ప్రారంభించారు. మంచిర్యాలలోని ఆలయం వద్ద చలువ పందిళ్లుమందమర్రిరూరల్: ఎంవీటీసీ పక్కన కల్యాణ వేదిక ఏర్పాట్లు -
మంగెనపల్లిలో ఉద్రిక్తత
● యజమాని ఇంటి ఎదుట పాలేరు మృతదేహం ● పరిహారం కోసం కుటుంబ సభ్యుల ఆందోళనవేమనపల్లి: మండలంలోని మంగెనపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాలేరు కన్నయ్య, అతడి యజమాని ఎనగంటి చిన్నన్న మధ్య శుక్రవారం గొడవ జరగడం, కన్నయ్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మృతదేహానికి చెన్నూర్ సివిల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని యజమాని చిన్నన్న ఇంటి ఎదుట ఉంచి వెళ్లిపోయారు. మృతికి కారణమైన యజమాని రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని, అప్పటివరకు మృతదేహాన్ని తీయబోమని భీష్మించుకు కూర్చున్నారు. స్థానిక కుల పెద్దలు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం యజమాని బంధువులతో సంప్రదింపులు జరిపారు. యజమాని కుటుంబ సభ్యులు పరారీలో ఉండడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో మృతదేహాన్ని అక్కడే ఉంచారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి అలాగే ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై శ్యాంపటేల్ సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. -
ఎస్టీపీపీ ఈడీగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) నూతన ఈడీగా చెన్నకేశవుల చిరంజీవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్టీపీపీ ఈడీగా చిరంజీవిని నియమిస్తూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఉత్తర్వులు జారీ చేశారు. చిరంజీవి ముందుగా ఎస్టీపీపీ మైసమ్మతల్లి ఆలయం, సీతారామచంద్రాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అడ్మిన్ భవన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జీఎం శ్రీనివాసులు, సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాసులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు ప్రసాద్, మురళీధర్, అజ్మీరాతుకారం, తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుని ఆశయ సాధనకు కృషి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా జగ్జీవన్రామ్ జయంతి వేడుకలుమంచిర్యాలఅగ్రికల్చర్: దేశంలో సమానత్వం కోసం పోరాడి, సమాజ హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ అని, ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి కలెక్టర్తోపాటు మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు, కార్పొరేషన్ ఈడీ పోటు రవీందర్రెడ్డి, దుర్గప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, దళితుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. 27ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఉప ప్రధానమంత్రిగా, రక్షణ, వ్యవసాయ, కార్మిక, రవాణా, తదితర శాఖల కేంద్రమంత్రిగా సేవలందించారని తెలిపారు. వినూత్న సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతికి విశిష్ట కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, నీరటి రాజేశ్వరి, రౌఫ్ఖాన్, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ముడివస్త్రం వచ్చిందోచ్..
● పాఠశాల తెరిచే నాటికి యూనిఫామ్లు ● ఎమ్మార్సీలకు చేరిన క్లాత్ మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలలు పునః ప్రారంభం నాటికే విద్యార్థులకు ఏకరూప దస్తులు(యూనిఫామ్) అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతియేటా పాఠశాలలు పునః ప్రారంభమైన కొద్ది రోజుల వరకు యూనిఫామ్ పంపిణీలో జాప్యం జరుగుతూ వస్తోంది. రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరిచే నాటికే యూనిఫామ్లు అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ముందుస్తుగా ప్రతిపాదనలు పంపడంతో అవసరమైన యూనిఫామ్ క్లాత్(ముడివస్త్రం) సరఫరా సాగుతోంది. మండలాల వారీగా ఎమ్మార్సీలకు పంపిణీ జరుగుతోంది. శనివారం జిల్లాలోని కొన్ని మండలాలకు చేరింది. అక్కడి నుంచి దుస్తులు కుట్టేందుకు స్వయ సహాయక సంఘాలకు అప్పగించనున్నారు. 2025–26 విద్యాసంవత్సరం దుస్తుల డిజైన్లలో మార్పులు చేశారు. బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించనున్నారు. చొక్కాలు, లాంగ్ ప్రాక్లకు పట్టీలు, భుజాలపట్టీలపైన కప్స్, ప్యాచ్వర్క్ లేకుండా సాధారణ యూనిఫాంలను డిజైన్గా మార్చడంతో కుట్టుపని సులువు కానుంది. జిల్లాలో విద్యార్థులు ఇలా.. జిల్లాలో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు రెండేసి యూనిఫామ్ జతలు అందించనున్నారు. 761 పాఠశాలల్లో 42,711 మంది చదువుతున్నారు. 20,021 బాలురు, 22,690 మంది బాలికలు ఉన్నారు. ముడివస్త్రం 1,86,723 మీట్లర్లు అవసరం కాగా.. 58,059 మీటర్ల వస్త్రం జిల్లాకు సరఫరా అయ్యింది. వేసవి సెలవుకు ముందే యూని ఫామ్కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. -
పేదలందరికీ సన్నబియ్యం
చెన్నూర్రూరల్: రాష్ట్రంలోని పేదలందరికీ స న్న బియ్యం అందించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీకి శ్రీకా రం చుట్టిందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. శనివారం మండలంలోని కిష్టంపేట గ్రామంలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను నెరవేరుస్తోందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సన్న బి య్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్రావు, కాంగ్రెస్ నాయకులు హే మంత్రెడ్డి, గజ్జెల అంకాగౌడ్, ముత్యాల బాపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారు ఇంట్లో ఎమ్మెల్యే, కలెక్టర్ భోజనం చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సన్నబియ్యంతో భోజనం చేశారు. రేషన్దుకాణంలో బియ్యం పంపిణీ అనంతరం లబ్ధిదారుడు మేడ తిరుపతిరెడ్డి ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం తిన్నారు. తహసీల్దార్ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికి వాపస్ ఎల్తన్నం
పదిహేనేళ్ల నుంచి భవన నిర్మాణ కార్మి కుడిగా పని చేస్తున్న. గిన్నేళ్ల సంది గిప్పుడున్నట్లు ఎన్నడు సూడ లే. ఇప్పుడు వారంల మూడు రోజులకు మించి పనులు దొర్కుతలేవ్. దినాం అడ్డమీదికి వచ్చి పని దొర్కుతదేమోనని గంటలకొద్ది చూసి ఇంటికి వాపస్ ఎల్తన్నం. గిట్ల చేయబట్టి పూట గడవడానికి మస్తు తక్లీబైతంది. – కంబాల రాజేశం, తాపీ కార్మికుడు బతుకుదెరువుకు గోసైతందిరెక్కల కష్టం మీద బతికేటోళ్లం. దినాం పని దొరికితే సంతోష మే కానీ గిప్పుడు పనుల కోసం వెతుకుడైతంది. రోజు ఎవలు పిలుస్తరా అని ఎదురు చూసుడైతంది. నా లెక్కనే చాలామంది పని లేక బతుకు దెరువుకు గోస పడ్తండ్లు. కూరగాయలకు సుత పైసలుంటలేవ్. ఎట్ల బతుకుడో ఏమో సమజైతలేదు. – కల్లూరి సురేష్, తాపీ కార్మికుడుఇళ్ల నిర్మాణాలు తగ్గినయ్ఎక్కడైన ఎవరైన ఇళ్లు మొదలు పెడితే అనేకమందికి పనులు దొర్కుతయ్. గత రెండేళ్ల సంది నుంచి ఇళ్ల నిర్మాణాలు బాగా తగ్గుతున్నయ్. కొత్తగా ఇళ్లు కట్టేటోళ్లు ముందుకు వస్తలేరు. ఈసారైతే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఒకలో ఇద్దరో ఇళ్లు కట్టడానికి ముందుకు వస్తండ్లు. గిట్ల భవన నిర్మాణ రంగం పడిపోయి కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారు కార్మికులను ఆదుకోవాలే. – తాడిశెట్టి రామ్కుమార్, తాపీ కార్మిక సంఘం అధ్యక్షుడు -
విచారణకు కలెక్టర్ ఆదేశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘బతికుండగానే చంపేశారు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించారు. పట్టాదారుకు తెలియకుండా అక్రమ పట్టా ఎలా చేశారు? దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణను ఆదేశించారు. దీంతో ఆయన నెన్నెల మండల ఇన్చార్జి తహసీల్దార్ ప్రకాశ్ను ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం నెన్నెల తహసీల్దార్ సెలవులో ఉండగా, డీటీ ప్రకాశ్ ఇన్చార్జి తహసీల్దార్గా ఉన్నారు. దీంతో అసలు పట్టాదారు చనిపోయినట్లుగా సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన వారిపై, అందుకు సహకరించిన రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు పూర్తి నివేదిక తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు తెరవెనుక తంతగం నడిపింది అక్కడ ధరణి ఆపరేటర్గా పని చేస్తున్న వ్యక్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ మార్గంలో భూమి పొందాలనుకున్న వారిలో సైతం తాజా పరిణామాలతో వణుకు మొదలైనట్లుగా తెలుస్తోంది. -
భక్తుల భద్రత.. గాలిలో దీపమే!
● బాసరలో ప్రధాన రోడ్లపై చీకట్లు ● రైల్వే స్టేషన్ బయట కానరాని సెక్యూరిటీ ● జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఇదే పరిస్థితిభైంసా/బాసర: అక్షర జ్ఞానం అందించాలని.. ఆపదలను తొలగించాలని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వ,చ్చే భక్తుల భద్రత గాలిలో దీపంలాగే మారింది. తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు బాసరకు వస్తారు. అయితే దైవ దర్శనం కోసం వచ్చిన వారి రక్షణ బాధ్యత అధికారులపై ఉంది. వందలాది మంది భక్తులు రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోతుంటారు. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులైన ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, ఆటో డ్రైవర్, వంటవాళ్లు, ఎలక్ట్రీషియన్ తదిరులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయమైన బాసరకు వచ్చే భక్తుల భద్రత తెలుసుకునేందుకు ‘సాక్షి’ బాసర పట్టణాన్ని అర్ధరాత్రి సమయంలో విజిట్ చేసింది. ఈ సందర్భంగా భద్రతాలోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. పోలీసులు, విద్యుత్, ఆలయ అధికారుల మధ్య సమన్వయం లోపం భక్తులకు షాపంగా మారింది. వేసవి సెలవుల్లో ఆలయాల్లో భక్తుల సందడి పెరుగుతుంది. ఈ సమయంలో దొంగతనాలు, అఘాయిత్యాలు జరగకుండా జిల్లా పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని ఆలయాల పరిస్థితి..నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతి ఆలయం, లోకేశ్వ రం బ్రహ్మేశ్వర ఆలయం, కుంటాల గజ్జలమ్మ ఆలయం, కల్లూరు సాయిబాబా ఆలయం, కదిలి పాపహరేశ్వరాలయం, బీరవెల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సారంగాపూర్ అడెల్లి పోచమ్మ ఆల యం, నిర్మల్ వెంకటేశ్వర ఆలయం, గండి రామన్న ఆలయం వంటి అనేక ఆలయాలు ఉన్నాయి. భక్తులకు సౌకర్యాల కొరత..ప్రముఖ ఆలయాల వద్ద వసతి, మూత్రశాలలు ఉన్నప్పటికీ, నిర్వహణ సరిగా లేదు. చిన్న ఆలయాల్లో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. జాతరలు, ఉత్సవాల సమయంలో రాత్రిళ్లు ఆలయాలకు వెళ్లేవారు ఎక్కువ. ఖర్మకాండల కో సం కూడా ఆలయాల్లో నిద్రపోతుంటారు. గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్న ఆలయాల వద్ద సౌకర్యాలు, భద్రత లోపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చీకటి పడితే మద్యం ప్రియులు సంచరి స్తూ సీసాలు పగలగొడుతున్నారు. రాత్రి సమయంలో పోలీసు గస్తీ ఉంటే ఇలాంటి పరిస్థితులను నియంత్రించవచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు. బాసర రైల్వేస్టేషన్ వద్ద రాత్రివేళలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం బాసరలోని ప్రధాన కాలనీతోపాటు రహదారుల్లో అక్కడక్కడ సెంట్రల్ లైటింగ్ వెలగడం లేదు. వీధి దీపాలు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో వెలిగేలా చూస్తాం. పంచాయతీ సిబ్బంది ప్రధాన వీధుల్లో ఎప్పటికప్పుడు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూస్తాం. – పంచాయతీ కార్యదర్శి ప్రసాద్గౌడ్, బాసరభద్రతా లోపాలు..నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో రాత్రి సమయంలో భద్రత సరిగా కనిపించ డం లేదు. రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులు దిగే ప్రధాన రోడ్డుపై బస్టాండ్ లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు. గోదావరి నది ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. బాసర గ్రామంలో బస్టాండ్ వద్ద సెక్యూరిటీ లేదు, ఆలయానికి వెళ్లే ఏటీఎం వద్ద ప్రైవేట్ గార్డు కూడా కనిపించడం లేదు. పోలీసులు గస్తీ తిరుగుతున్నామని చెప్పినా ఆలయ ప్రాంగణంలో పికెటింగ్ కనిపించలేదు. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో సెంట్రల్ లైటింగ్ అలంకారప్రాయంగానే మారింది. రైల్వే స్టేషన్ ప్రాంతంలో రాత్రిళ్లు మందుబాబులు సంచరిస్తున్నారు. రాత్రి రైళ్లలో వచ్చే యాత్రికులు ప్రైవేట్ ఆటోలపై ఆధారపడాల్సి వస్తోంది. బాసర ఆలయానికి బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో అది అందుబాటులో ఉండడం లేదు. రైలు మార్గంలో వచ్చే భక్తులు, ట్రిపుల్ఐటీ విద్యార్థులు, స్థానికులు ప్రధాన రోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వందలాది ప్రయాణికులు ఉండే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేవు. -
ట్రాక్టర్, ఆటో ఢీ.. ఐదుగురికి గాయాలు
భైంసారూరల్: భైంసా–బాసర జాతీయ రహదారిపై శుక్రవారం జరగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా నుంచి దేగాం వైపు ప్రయాణీకులతో ఆటో వెళ్తుంది. అదే మార్గంలో హరియాలీ కన్వెన్షన్ ముందున్న ట్రాక్టర్ యూటర్న్ చేస్తుండగా ఆటోఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇలేగాం గ్రామానికి చెందిన ఆకాశ్, సాయి, ఉమ్రి(కె) గ్రామానికి చెందిన చంద్రకాంత్, మహాగాం గ్రామానికి చెందిన గంగాధర్, శివలింగుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై విచారణ చేపట్టారు. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పురుగుల మందు తాగగా, ఒకరు ఉరేసుకున్నారు. మరొకరు భవనంపై నుంచి దూకారు.యజమాని దూషించాడని పాలేరు.. వేమనపల్లి: మండలంలోని మంగెనపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు నాయిని కన్నయ్య(35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నయ్య గ్రామంలోని రైతు ఎనగంటి చిన్నన్న వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం పొలానికి పురుగుల మందు పిచికారీ చేశాడు. స్ప్రేయర్ పంపు చెడిపోయిందని, ఎవరు బాగు చేయిస్తారని చిన్నన్న కన్నయ్యతో గొడవపడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెందిన కన్నయ్య అక్కడే పురుగుల మందు తాగాడు. 108 అంబులెన్స్లో చెన్నూర్కు తరలిస్తుండగా మృతిచెందాడు. యజమాని వేధింపుల వల్లే కన్నయ్య మృతి చెందాడని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, జిల్లా అధ్యక్షుడు బాగాల రాజన్న, నాయకురాలు మల్లేశ్వరితో మృతుడి కుటుంబ సభ్యులు మంగెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి ధర్నా చేశారు. మృతికి కారణమైన చిన్నన్న, భార్య లక్ష్మీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నీల్వాయి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి బైక్ ఇవ్వలేదని కొడుకు..నార్నూర్: తండ్రి బైక్ ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నాగ్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం ఖడ్కి కొలాంగూడ గ్రామానికి చెందిన మాడవి భీంరావు(19) శుక్రవారం తన తండ్రి మాధవ్రావును బైక్ అడిగాడు. భీంరావు తాగిన మైకంలో ఉండడంతో బైక్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన భీంరావు పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆదిలాబాద్ రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిపై నుంచి దూకి వ్యక్తి..బెల్లంపల్లి: బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీకి చెందిన హన్మాండ్ల నారాయణ(55) శుక్రవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ తండ్రి పోశం అనారోగ్యంతో బాధ పడుతుండగా చికిత్స చేయించడం కోసం నిమ్స్ ఆసుపత్రికి గత నెల 24న తీసుకెళ్లారు. అటెండర్గా వెళ్లిన నారాయణ ఆకస్మికంగా పైఅంతస్తు నుండి కిందికి దూకి మృతిచెందాడు. తాగుడు అలవాటు ఉన్న నారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. మృతుడికి భార్య రేణుక, సోదరులు ఉన్నారు. మద్యానికి బానిసై యువకుడు..ఆదిలాబాద్టౌన్(జైనథ్): ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భోరజ్ మండలం గూడ గ్రామంలో చోటుచేసుకుంది. జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుమ్మ కార్తిక్ (19) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లి గంగమ్మతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించగా మనస్తాంపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో వేద పాఠశాల విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన రాజేందర్ తనయుడు మణికంఠ(17) వేద పాఠశాలలో చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నది పుష్కరఘాట్ వద్దకు వెళ్లిన మణికంఠ నది కింద భాగంలో బురదలో పడి ఉన్నాడు. గమనించిన భక్తులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది మణికంఠను బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న బాసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్, సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ పుష్కర ఘాట్లను పరిశీలించారు. విద్యార్థి విద్యుత్షాక్తో మరణించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మణికంఠ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. గతనెల 21న వేద పాఠశాలకు చెందిన విద్యార్థి మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన లోహిత్పై దాడి జరిగింది. 13 గంటల తర్వాత గుర్తించి ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్కు తీసుకెళ్లారు. తాజాగా అదే పాఠశాలకు చెందిన విద్యార్థి మణికంఠ అనుమానాస్పదంగా మృతిచెందాడు. దీంతో వేదపాఠశాలలో ఏం జరుగుతుందో అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
కాసిపేట: మండలంలోని పెద్దనపల్లి నాయకపుగూడకు చెందిన మేసినేని మల్లు(53) అనే మహిళ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కాసిపేట ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం మల్లు ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి, మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రులకు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందింది. ముఖం మీద పుండు కావడంతో నొప్పి తగ్గక మద్యానికి అలవాటు పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆమె భర్త రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దండేపల్లి మండలంలో.. దండేపల్లి: మండలంలోని గూడెం గ్రామానికి చెందిన ముత్తినేని మొండయ్య(42) చికిత్స పొందుతూ వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం మృతిచెందాడు. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మొండయ్య భార్య పద్మ గత రెండు నెలల క్రితం అతడిని విడిచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉండలేక జీవితంపై విరక్తి చెంది గత నెల 29న పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతుడి మేనమామ ఉగ్గె రాజలింగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
బెట్టింగ్ మత్తులో యువత
● రూ.లక్షల్లో పందెం.. ● యువకుల జేబులు ఖాళీ ● గ్రామీణ ప్రాంతాలకు చేరిన జూదం చెన్నూర్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువతను చిత్తు చేస్తోంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది. జూదం వ్యసనంలా మారి జేబులు ఖాళీ చేస్తోంది. క్రికెట్, ఆటగాళ్లపై అభిమానం హద్దు మీరి యువతలో వ్యసనంగా మారుతోంది. ఆటను చూసి ఆనందించాల్సి పోయి ఏకంగా బెట్టింగ్కు పాల్పడుతూ ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. వేలాది రూపాయలు బెట్టింగ్ కాస్తూ కొందరు యువకులు అప్పుల పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ చేరింది. బెంగళూరు రాయల్ చాలెంజ్, గుజరాత్ టైటాన్స్ జట్లపై కోటపల్లి మండలంలోని ఒక గ్రామంలో పది మంది యువకులు రూ.10వేల చొప్పున రూ.లక్ష బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన కోటపల్లిలోనే కాకుండా జిల్లాలో ఏ మేరకు బెట్టింగ్ సాగుతుందో చెప్పకనే చెబుతోంది. ‘‘మామ పది వేలు పోయినయిరా. బుధవారం ఆర్సీబీ గెలుస్తుందని పది వేలు బెట్టింగ్ పెట్టిన జీటీ గెలిచిందిరా. నా డబ్బులే కాదురా పది మందిమి ఆర్సీబీ గెలుస్తుందని పది వేల చొప్పున బెట్టింగ్ పెటినం. అందరి డబ్బులు పోయినయ్..’’ ఇదీ చెన్నూర్లో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతుందనడానికి వీరి సంభాషణే ఉదాహరణగా చెప్పొచ్చు. ముందుగానే అంచనా..మ్యాచ్కు ముందుగానే జట్టు బలాలను అంచనా వేస్తూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. కొందరు అభిమాన కెప్టెన్లపై నమ్మకంతో బెట్టింగ్కు దిగుతుండగా.. మరికొందరు జట్టులోని క్రీడాకారులు ఆటతీరుపై బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలిసింది. ఒక్కోసారి వారి అంచనాలు తారుమారై నష్టపోతున్నట్లు తెలిసింది. ఫోన్ పే ద్వారా చెల్లింపులు..బెట్టింగ్ చెల్లింపులు అన్నీ ఫోన్ పే ద్వారానే సాగుతున్నాయి. బెట్టింగ్లో పాల్గొనే వ్యక్తులు మధ్యవర్తికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తరపున బెట్టింగ్ కాచిన వ్యక్తికి మధ్యవర్తి డబ్బులు చెల్లించే విధంగా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అధికారులు స్పందించి బెట్టింగ్లకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మే నెల 25న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వరకు బెట్టింగ్ల జోరు కొనసాగే అవకాశాలున్నాయి. -
అర కిలో బంగారం ఆశ చూపి..
● రూ.4.50 లక్షలు వసూలు ● గుప్తనిధుల పేరిట మోసం.. ● ముగ్గురి రిమాండ్.. పరారీలో ఒకరు ● రూ.1.47 లక్షలు రికవరీ.. ఖానాపూర్: అరకిలో బంగారం ఆశ చూపి రూ.4.50 లక్షలు వసూలు చేసిన ఉదంతం ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని కడెం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఖానాపూర్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏఎస్పీ రాజేశ్మీనా, సీఐ సీహెచ్.అజయ్, కడెం ఎస్సై కృష్ణసాగర్రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ఖానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన సాదుల నరేశ్ హైదరాబాద్కు చెందిన మహ్మద్ అక్బర్ వద్ద కొంతకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కడెం మండలం అటవీ ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయని రూ.4.50 లక్షల చెల్లిస్తే అరకిలో బంగారం ఇస్తామని ఆశ చూపుతూ నమ్మబలికాడు. గత నెల 31న కడెం మండలానికి వచ్చిన అక్బర్ను నరేశ్తోపాటుమరో ముగ్గురు యువకులు కడెం మండలంలోని కొత్త మద్దిపడగ శివారులోని అటవీ ప్రాంతానికి కారులో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక డబ్బులు లాక్కొని బెదిరించి వెళ్లగొట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అక్బర్ వెంటనే ఈ విషయమై అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. నరేశ్ తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని రూ.4.50 లక్షలు అవసరం ఉందని అందుకు బదులుగా బంగారం, ఆస్తి పేపర్లు కుదువ పెడతానని తనకు చెప్పడంతో తాను పై నగదును నరేశ్కు ఇచ్చానని బాధితుడు ఫిర్యాదులో తమకు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. గుప్త నిధుల కోసం సదరు యువకులతో కలిసి అన్వేషించి మోసపోయిన అక్బర్ తమను సైతం తప్పుదోవ పట్టించేలా తప్పుడు ఫిర్యాదు చేసినట్లు విచారణలో వెలుగు చూసిందన్నారు. ఈ ఘటనలో అక్బర్ నుంచి డబ్బులు వసూలు డబ్బుల నుంచి రూ.1.47 లలు రికవరీ చేయడంతోపాటు గోసంపల్లె గ్రామానికి చెందిన సాదుల నరేశ్, అదే గ్రామానికి చెందిన భూక్యా వంశీ, ఖానాపూర్ పట్టణానికి చెందిన మగ్గిడి నితిన్, పెంబి మండల కేంద్రానికి చెందిన ఆరె చింటుతోపాటు తప్పుడు ఫిర్యాదు చేసిన హైదరాబాద్కు చెందిన మహ్మద్ అక్బర్పై సైతం కేసు నమోదు చేశామని వివరించారు. శుక్రవారం వంశీతోపాటు నితిన్, చింటులను రిమాండ్ చేశామని తెలిపారు. నరేశ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నాలుగు రోజుల వ్యవధిలో సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్న ఖానాపూర్ సీఐతోపాటు కడెం ఎస్సై, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. -
‘ముందస్తు’ రాయితీ
● గత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు అంతంత మాత్రమే ● పూర్తి ఆస్తిపన్ను చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ పథకం ● వసూలైతేనే మున్సిపాలిటీలకు నిధులుమంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం ‘ఎర్లీబర్డ్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చెల్లించిన వారికి పన్నులో 5శాతం రాయితీ కల్పిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు మార్చి నెలాఖరున ముగిశాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంతో ముందస్తు పన్ను వసూళ్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వసూళ్లు అంతంత మాత్రంగానే రావడం, పన్ను వసూళ్లు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడడం వంటివి జరగకుండా ఉండేందుకు, 2025 మార్చి వరకు ఉన్న పూర్తి పన్ను బకాయిలను చెల్లించిన వారికి ముందస్తుగా 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చె ల్లించేందుకు ఈ పథకాన్ని మరోసారి అమల్లోకి తీ సుకు వస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్ను చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశ్యం. 5శాతం రా యితీ అందించనుండడంతో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తేనే పథకం వర్తిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రచారం కల్పిస్తేనే.. ఎర్లీ బర్డ్ పథకంపై మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది ఇప్పటి నుంచే ప్రచారం చేపట్టి పన్నులు వసూలు చేయాలి. సరైన ప్రచారం లేక గత ఏడాది చాలామంది ఈ పథకం, రాయితీ విషయం తెలియక వినియోగించుకోలేదు. దీంతో మొన్నటి ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేయడం మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సవాలుగా మారింది. పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ అధికా రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని సూచించింది. గత మార్చి 2025 వరకు పన్ను బకాయిలు పూర్తిగా చెల్లించని వారికి ఈ పథకం వర్తించదని, పూర్తి బకాయిలు చెల్లించిన వారు మాత్రమే అర్హులనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మున్సిపల్ అధికారులు సమాయత్తం అయ్యారు. సద్వినియోగం చేసుకోవాలిఅన్ని మున్సిపాలిటీల్లోనూ 31 మార్చి 2025 వరకు ఇంటి పన్ను పూర్తిగా చెల్లించిన వారికి ఎర్లీబర్డ్ స్కీం వర్తిస్తుంది. ఈ అవకాశం ఈ నెల 30వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించని వారు ఆయా బకాయిలను చెల్లించి, ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకో వచ్చు. ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు సద్విని యోగం చేసుకుని రాయితీ పొందాలి. – శివాజి, మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ -
● నెన్నెల రెవెన్యూ అధికారుల చిత్రాలు ● ఎమ్మెల్యే అనుచరుడి కోసం అధికారుల దాసోహం ● చిక్కులో పడ్డానని తెలిసి సెలవులో తహసీల్దారు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బతికి ఉండగానే చనిపోయినట్లుగా చిత్రీకరించి దొంగ పట్టా చేసి రెండెకరాలు కాజేసే ఉదంతమిది. ఎమ్మెల్యే అనుచరుడి కోసం రెవెన్యూ అధికారులు తప్పు చేసి చిక్కుల్లో పడ్డారు. నెన్నెల మండలంలో జరిగిన ఈ ఘటనను గత నెల రోజులుగా రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు బయటకు పొక్కకుండా తొక్కి పెడుతున్నారు. రెవెన్యూ అధికారుల బరితెగింపు మంచిర్యాలకు చెందిన కుందూరు అశోక్రెడ్డి కుటుంబానికి నెన్నెల మండలం చిన్నావెంకటాపూర్లో వారసత్వ భూములు ఉన్నాయి. వీటిలో 132సర్వేనంబరు నాలుగు ఎకరాలను గంగారానికి చెందిన చిర్రం రమేశ్కు 2020లో అమ్మాలని అనుకున్నారు. మొత్తం రూ.14.80లక్షలకు గాను రూ. 8.50లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వడంలో జాప్యంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగా యి. చివరికి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తూ భూ అమ్మకం రద్దు చేసుకున్నారు. రెండేళ్ల క్రితమే ఇరుపక్షాలు స్థానిక సర్పంచ్లు, పెద్దల సమక్షంలో లిఖిత పూర్వకంగా అంగీకరించారు. ఇటీవల అశోక్రెడ్డి కోడలు శ్రావ్యరెడ్డి పేరుతో 132/2సర్వే నంబరులో ఉన్న రెండెకరాలు చిర్రం రమేశ్ పేరిట పట్టా కావడంతో ఆశ్చర్యపోయారు. గత నెల 13న తమ భూమి సర్వే కోసం ధరణిలో చూస్తే పట్టాదారు పేరు మారినట్లు వెలుగులోకి వచ్చింది. ఎలా జరిగిందని స్థానిక తహసీల్దారును అడిగితే తమ పరిధిలో జరగలేదని తెలిపారు. చివరకు సీసీఎల్ఏను సంప్రదిస్తే.. శ్రావ్యరెడ్డి చనిపోయిందని, ఆమె స్థానంలో వారసుడిగా చిర్రం రమేశ్ను పేర్కొంటూ నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. దీనిపై అశోక్రెడ్డి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణ గుర్తించి, తహసీల్దార్తో గత నెల 22న శ్రావ్యరెడ్డి పేరుతో భూమి కోనుగోలు చేసినట్లు కొత్తగా 132/3సర్వే నంబరుపై ఆ రెండెకరాలను తిరిగి పట్టా చేశారు. మొదట పట్టాదారుకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేస్తూ అధికారులు ఇంత రిస్కు ఎందుకు చేశారనేది అంతుచిక్కని ప్రశ్న. అంతా తెలిసి చర్యల్లేవు శ్రావ్యరెడ్డి చనిపోయినట్లు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అశోక్రెడ్డి గత కొద్దిరోజులుగా ఫిర్యాదు చేస్తున్నా చర్యలు కరువయ్యాయి. సీసీఎల్ఏ, కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. చివరకు నెన్నెల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, చిర్రం రమేశ్పై చీటింగ్ కేసు నమోదైంది. -
ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందాలి
● ఇబ్బందులు తలెత్తకుండా పంపిణీ చేయాలి ● రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిమంచిర్యాలఅగ్రికల్చర్: అర్హులైన ప్రతీ ఒక్కరికి సన్నబియ్యం అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సన్న బియ్యం పంపిణీ, రేషన్కార్డులు, ప్రజల స్పందనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్కార్డులు కలిగిన వారికి ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సన్నబియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని స్వీకరించాలని, సన్న బియ్యం పంపిణీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రజాపాలన, గ్రామసభల్లో నూతన రేషన్కార్డులు, కార్డుల్లో పేర్లు మార్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి అర్హులకు త్వరగా రేషన్కార్డులు అందించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ నూతన రేషన్కార్డులు, పేర్ల మార్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీ లించి అర్హులకు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు. -
‘పది’ మూల్యాంకనం
● 7నుంచి 15వరకు జవాబు పత్రాల దిద్దుబాటు ● కొనసాగుతున్న కోడింగ్ మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఫలితాలు సకాలంలో విడుదల చేసేలా విద్యాశాఖ చర్యలు వేగవంతం చేస్తోంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుండగా పదో తరగతి జవాబు పత్రాల మూ ల్యాంకనానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో 9,198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గురువారం నాటితో ఒకేషనల్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 7నుంచి 15 వరకు స్థానిక కార్మెల్ హైస్కూల్లో జవాబు పత్రాల మూల్యాంక నం చేయనున్నారు. మధ్యాహ్నం గంటపాటు భోజ న విరామం మినహాయిస్తే ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు ఉ దయం 8గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని డీఈవో యాదయ్య తెలిపారు. 1.34లక్షల జవాబు పత్రాలు ఇతర జిల్లాల నుంచి పరీక్షలకు సంబంధించిన 1.34 లక్షల పేపర్లకు గాను 1.20లక్షల జవాబు పత్రాలు జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రానికి చేరాయి. ఇంకా 14వేల జవాబు పత్రాలు రావాల్సి ఉంది. ఇప్పటికే పటిష్టమైన భద్రత మధ్య ఏడు సబ్జెక్టుల్లో ఐదు సబ్జెక్టులకు సంబంధించిన కోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతికరసాయన శాస్త్రం, జీవశాస్త్రం కోడింగ్ ప్రక్రియ పూర్తి కాగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన జవాబు పత్రాలకు కోడింగ్ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. డీఈవో యాద య్య శిబిరం అధికారిగా, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామోదర్రావుతోపాటు మరో ఇద్దరు ఎంఈవోలు సహాయ క్యాంపు అధికారులుగా వ్యవహరిస్తారు. పేపర్ కోడింగ్ అధికారులుగా ఏడుగురు, చీఫ్ కోడింగ్ అధికారితోపాటు సహాయకులు ఆరుగురు ఉంటారు. అసిస్టెంట్ ఎగ్జామినర్(ఏఈ)లుగా 426మందిని నియమించారు. చీఫ్ ఎగ్జామినర్లుగా 71 మంది, ప్రత్యేక సహాయకులుగా 150 మంది ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించా రు. పోలీస్ బందోబస్తు మధ్య సమాధాన పత్రాలు స్ట్రాంగ్లో రూమ్లో భద్రపరిచారు. -
ఇంటర్ మూల్యాంకన వేతనం చెల్లించాలి
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ మూ ల్యాంకన వేతనం త్వరగా చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్–475 ఆధ్వర్యంలో శుక్రవారం డీఐఈవో అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. మూ ల్యాంకనం పూర్తయిన వెంటనే ఎలాంటి కోతలు లేకుండా పూర్తి నగదును ఖాతాలో జమ చేయాలని కోరారు. ఇంటర్మీడియెట్ పరీక్షల వి ధులకు సంబంధించి సీఎస్, డీవోలు, సిట్టింగ్స్క్వాడ్ రెమ్యూనరేషన్ చెల్లించాలని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసా ద్, కార్యదర్శి సందీప్కుమార్, కోశాధికారి సో మయ్య, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, జిల్లా మహిళా కార్యదర్శులు సత్తెమ్మ, శైల జ, సునీత తదితరులు పాల్గొన్నారు. -
‘వక్ఫ్ బిల్లు ఆమోదం దేశానికి గర్వకారణం’
చెన్నూర్: వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం దేశానికి గర్వకారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శుక్రవా రం వక్ఫ్ బిల్లు ఆమోదంపై స్థానిక బీజేపీ కా ర్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చి త్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లు సవరణతో అన్ని మతాలతోపాటు ముస్లింలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, కేవీఏం శ్రీనివాస్, మానికరావు శంకర్, దుర్గాప్రసాద్, వంశీగౌడ్, రాజన్న పాల్గొన్నారు. -
చదువుతో జీవితంలో అన్నీ సాధించవచ్చు
కాసిపేట: చదువుతో జీవితంలో అన్నీ సాధించుకోవచ్చని, విద్యార్థినులు ఇష్టపడి చదివి భవిష్యత్లో తమ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం మండలంలోని దేవాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓరియంట్ సిమెంటు కంపెనీ అందించిన స్కూల్ బ్యాగులను ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతువేదికలో జిల్లా ఆరోగ్యశాఖ, వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. బుగ్గగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ భోజన్న, ఏంపీడీవో సత్యనారాయణసింగ్, ఏంపీవో సబ్ధర్ అలీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం: ఎమ్మెల్యే వినోద్ మహాత్మాగాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తెలి పారు. మండల కేంద్రంలో జై బాపు, జై భీం, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం, పాదయాత్రలో పాల్గొని అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం ప్రదీప్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, మైదం రమేష్, నస్పూరి నర్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
రెండు బార్లకు దరఖాస్తుల ఆహ్వానం
మంచిర్యాలక్రైం: జిల్లాలో రెన్యూవల్ చేసుకో కుండా ఆగిపోయిన రెండు బార్లకు తిరిగి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి కేజీ.నందగోపాల్ తెలిపారు. శుక్రవా రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక్కో బార్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కలెక్టరేట్, ఆదిలాబా ద్లోని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్లోని రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 26ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు. 29న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రూ.లక్ష దరఖాస్తు ఫీజు చెల్లించాలని, ఎంపికై న వారు బార్లకు ఏడాదికి రూ.42లక్షలు ట్యాక్స్ రూంలో చెల్లించాల్సి ఉంటుందని తెలి పారు. సీఐలు గురువయ్య, సమ్మయ్య, ఇంద్రప్రసాద్, హరి పాల్గొన్నారు. -
పని గంటలు తగ్గించాలి
మంచిర్యాలటౌన్: వేసవి కాలం దృష్ట్యా పని గంటలు తగ్గించాలని మంచిర్యాల నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు కమిషనర్ శివాజికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్మికులకు బట్టలు, చె ప్పులు, గ్లౌజులు ఇప్పించాలని, ప్రతీ కార్మికునికి కా ర్పొరేషన్ ఐడీ ఇవ్వాలని, డ్రైవర్లను పాత పద్ధతిలో నే వారి స్థానంలోనే పంపించాలని పేర్కొన్నారు. పీ ఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమ కావడం లే దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, అధ్యక్షుడు గోగర్ల ఆశయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యాంకుమార్, కోశాధికారి శ్రీనివాస్, కార్మికులు గోగర్ల ఆశయ్య, ఆవునూరి లింగయ్య, చిప్పకుర్తి లింగయ్య, ఆవుల శ్రీనివాస్, రేగుంట రాయలింగు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతు
జైపూర్: మండలంలోని ఇందారం ఐకే ఓసీపీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర తిరుపతి, బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అప్రోజ్ఖాన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందారం ఓసీపీ గనిలో పనిభారం ఎక్కువని, వారాహ కంపెనీలో వాల్వో డ్రైవర్లకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నారని, సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని తెలిపారు. వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్రావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శులు పాల్గొన్నారు. -
గురుకుల ఫలితాల్లో సత్తా చాటారు
జన్నారం: ఉత్తమ విద్యాబోధన, ఉత్తమ ఫలితాలతో జిల్లాలోనే పేరు తెచ్చుకున్న మండలంలోని అక్కపెల్లిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గురుకుల ఫలితాల్లోనూ సత్తా చాటింది. పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు జాజల శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో మొదటి స్థానం సాధించిన పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ను శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో యాదయ్య, ఎంఈవో విజయ్కుమార్ అభినందించారు. మండలంలోని రేండ్లగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గురుకుల సీట్లు సాధించినట్లు హెచ్ఎం రాజన్న తెలిపారు. కలమడుగు వివేకానంద పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించినట్లు హెచ్ఎం సతీశ్గౌడ్ తెలిపారు. భీమారం: మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన నిహాన్, పూజ గురుకుల పాఠశాలకు ఎంపికై నట్లు హెచ్ఎం హరికృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. -
‘పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
బెల్లంపల్లి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని బజారు ఏరియా, బుధాకలాన్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం అందించడం వల్ల పేదలు కడుపునిండా భోజనం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కలెక్టర్ కు మార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా స న్నబియ్యం నిల్వలు ఎల్ఎంఎస్ పాయింట్లలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బుధాకలాన్లో స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ, తహసీల్దార్ యు.జ్యోత్స్న, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జే.శ్వేత, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, ముచ్చర్ల మల్ల య్య తదితరులు పాల్గొన్నారు. -
సోదాల కలకలం
● రవాణా శాఖ చెక్పోస్టులో ఏసీబీ తనిఖీలు ● రాత్రిపూట రంగంలోకి దిగిన వైనం ● వాంకిడి వద్ద రూ.45,100 నగదు లభ్యంనగదు ముట్టుకోకుండాఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపైనే కేసులు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటా రు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు ఉంటే వారు ఏ అధికారి ప్రోద్బలంతో ఉన్నారు? వారివెనక ఎవరున్నారనేది స్పష్టమైన ఆధారాలు తీసుకుంటారు. లేకపోతే అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం లేదు. సాధారణంగా లంచం తీసుకునేటప్పుడు నేరుగా దొరికిన ఆ అధికారి చేతులు, నగదుతో రసాయన పరీక్ష చేసి, సాంకేతిక ఆధారాలతో కోర్టులో సమర్పిస్తారు. కానీ చెక్పోస్టుల్లో ఏ అధికారీ చేతితో పైసలు ముట్టుకోరు. దీంతో లెక్కచూపని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేవి మిస్టరీగా మారుతోంది. అవినీతి కేసులో పక్కా ఆధారాలు ఉంటే కేసు ముందుకు వెళ్తుంది. గతంలో పట్టుబడిన నగదుపైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తా జాగా దొరికిన నగదుపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో వాంకిడి చెక్పోస్టులో రూ.45,100 పట్టుబడ్డాయి. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్, కరీంనగర్ డీఎస్పీలు విజయ్కుమార్, రమణమార్తి, మరో నలుగురు సీఐలు ఏకకాలంలో అక్కడి రికార్డులు పరిశీలించారు. రెండు ఫోన్లు సీజ్ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఏఎంవీ మాత్రమే ఉండగా, ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో గతేడాది మేలో భోరజ్ చెక్పోస్టు వద్ద రూ.11,630, గత డిసెంబర్ 4న రూ.62,500 నగదు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. చెక్పోస్టుల్లో నిత్యం వాహనదారులు, డ్రైవర్లు, సహాయకుల నుంచి బండికో రేటుగా అనధికారికంగా ప్రైవేటు సిబ్బంది వసూళ్లు చేస్తున్నది బహిరంగ రహస్యమే. ఏసీబీ సోదాలతో గురువారం వాంకిడిలో ఎలాంటి తనిఖీలు లేకుండానే వాహనాలు రాకపోకలు సాగించాయి. మూడు చోట్ల ఇదే తంతు ఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుతో, ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రోడ్డు మార్గంగా ఉంది. ఆదిలాబాద్లోని ఎన్హెచ్–44పై భోరజ్, ఆసిఫా బాద్ జిల్లా ఎన్హెచ్–363పై వాంకిడి, నిర్మల్ పరిధి ఎన్హెచ్–61 వద్ద తానూరు మండలం బెల్తరోడా వద్ద అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఉన్నాయి. ఇక్కడే సమీకృత చెక్పోస్టులు ఉన్నాయి. రవాణా శాఖ చెక్పోస్టులో నిత్యం వందల వాహనాలను అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీలు చేస్తూ అధికారులు అనుమతి ఇవ్వాలి. అయితే పరిశీలన పేరుతో వాహనదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నరనేది ప్రధాన ఆరోపణ. డ్యూటీకి కోసం పోటీ రవాణా శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది చెక్పోస్టుల్లో డ్యూటీకి మొగ్గు చూపుతున్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబు ళ్లు, సిబ్బంది వరకు రాజకీయ, ఉన్నతాధికారుల పైరవీలతో అక్కడ డ్యూటీలు తెచ్చుకుని చేస్తున్నా రు. చెక్పోస్టు డ్యూటీకి వెళ్తే ‘లాభదాయకం’గా మారడంతో పోటీ పడుతున్నారు. అధికారుల సంఖ్యను బట్టి రోజువారీగా డ్యూటీల్లో ఉంటున్నారు. -
ప్రజల ఆహ్లాదం కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. నిర్వహణ లోపం.. నిర్లక్ష్యం వెరసి కళావిహీనంగా మారాయి. మొక్కలు ఎండిపోతుండడంతో పచ్చదనం కరువైంది. కొన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో నిర్వహణ లోపించింది
● ఎండిపోతున్న వనాలు ● ఆహ్లాదం ఎండమావే..చెన్నూర్రూరల్: శివలింగాపూర్ వద్ద ప్రకృతి వనంలో ఎండిపోయిన మొక్కలుదండేపల్లి: కళావిహీనంగా నంబాల పల్లెప్రకృతివనంవేమనపల్లి: ప్రకృతివనంలో ఎండిపోయిన మొక్కలుభీమిని: వీగాంలో పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా పల్లె ప్రకృతి వనందండేపల్లి/చెన్నూర్రూరల్/భీమిని/మందమర్రిరూరల్/తాండూర్/వేమనపల్లి: దండేపల్లి మండలం నంబాలలో పల్లె ప్రకృతి వనాన్ని గ్రామానికి దూరంగా ఏర్పాటు చేశారు. అప్పట్లో 2000 మొక్కలు నాటారు. నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా నాటిన మొక్కల్లో సగానికిపైగా ఎండిపోవడంతో పచ్చదనం కరువైంది. చెన్నూర్ మండలం శివలింగాపూర్ గ్రామ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో రూ.2.50లక్షలతో సుమారు ఐదు వేల మొక్కలు నాటి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొక్కలకు నీరందించేందుకు బోరు వేశారు. బోరుకు అమర్చిన విద్యుత్ మోటారు కాలిపోవడంతో మొక్కలకు నీరందక ఎండిపోతున్నాయి. భీమిని మండలం వీగాం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో కానుగ చెట్లు మినహా ఇతర మొక్కలు కనిపించడం లేదు. ఆహ్లాదం కరువై ప్రజలు అటువైపు వెళ్లకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండి నిరుపయోగంగా మారింది. ● మందమర్రి మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే చిర్రకుంట, ఆదిల్పేట్, సారంగపల్లి, శంకర్పల్లి బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 20 ఎకరాల్లో ఉపాధి హామీ సిబ్బంది సుమారు 60వేల మొక్కలు నాటారు. రెండేళ్ల తర్వాత ఆడిట్ నిర్వహణ అనంతరం గ్రామ పంచాయతీలకు అప్పగించారు. నిర్వహణ లోపించడంతో మొక్కలన్నీ ఎండిపోయి పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. ● తాండూర్ మండలం మాదారం(పోచంపల్లి) ప్రకృతి వనం కళావిహీనంగా తయారైంది. తాండూర్, కిష్టంపేట, గోపాల్నగర్, మాదారం త్రీ ఇంక్లైన్తోపాటు పలు ప్రకృతి వనాల్లో పిచ్చిమొక్కలు పెరిగి, నాటిన మొక్కలు ఎండిపోయి నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. వినియోగానికి వీలు లేకుండా మారి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించలేకపోతున్నాయి. ● వేమనపల్లి మండల కేంద్రంలోని మంగెనపల్లి, ఒడ్డుగూడం ప్రకృతి వనాల్లో పర్యవేక్షణ లోపించింది. గొడ్డలి వేటుకు కొన్ని మొక్కలు నేలకూలగా.. మరికొన్ని నీళ్లు లేక ఎండిపోతున్నాయి. రెండేళ్లు మాత్రమే ఉపాధి హామీ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రకృతి వనాల్లో వసతులు లేక నిరుపయోగంగా ఉన్నాయి. పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు పెరిగాయి. మందమర్రిరూరల్: శంకర్పల్లిలో.. -
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి జిల్లా అధికారులు, నూతనంగా ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి శంకర్ పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి దరఖా స్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి జిల్లా అధికారులతో ప్రజ వాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్లో లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య
మంచిర్యాలఅగ్రికల్చర్: నిజాం నిరంకుళ పాలనలో ప్రజల సంక్షేమం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, కుల సంఘాల నాయకుల ప్రతినిధులతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.