breaking news
Mancherial
-
ముల్తానీలు వర్సెస్ అటవీశాఖ
● వివాదాస్పదంగా పోడు భూములు ● మొక్కలు నాటడాన్ని అడ్డుకున్న వైనం ● అటవీ భూములంటున్న అధికారులు ● రెండేళ్లుగా కొనసాగుతున్న పంచాయితీ ఇచ్చోడ: మండలంలోని సిరిచెల్మ అటవీ పరిధి చెలుకగూడ అటవీప్రాంతంలో కేశవపట్నం, జోగిపేట్ గ్రామాలకు చెందిన ముల్తానీలు సాగు చేస్తున్న వంద ఎకరాల పోడు భూములు వివాదాస్పదంగా మారాయి. టైగర్జోన్ పరిధి అటవీప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేసి మైదానంగా మార్చి కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముల్తానీలు అడ్డుకుంటున్నారు. గత రెండేళ్లుగా అటవీశాఖ, ముల్తానీల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. పోలీసు బందోబస్తు మధ్య అటవీ అధికారులు మొక్కలు నాటుతుంటే తరచూ అడ్డుకుంటున్నారు. అటవీ, పోలీసు శాఖలకు తలనొప్పిగా మారింది. తరచూ ఘటనలు గతేడాది ముల్తానీలు సాగు చేస్తున్న పోడు భూముల్లో అటవీ అధికారులు భారీగా మొక్కలు నాటారు. కొంత మంది ముల్తానీలు ఆ సమయంలో జేసీబీకి నిప్పుంటించడంతో పాక్షికంగా దగ్ధమైంది. పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈనెల 1న పోడు భూముల్లో అధికారులు మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలను ముల్తానీలు పూడ్చివేశారు. ఈనెల 5న మొక్కలు నాటేందుకు వెళ్తున్న అటవీ అధికారులను సిరిచెల్మ ఘాట్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. 8 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈనెల 19న అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతున్న ప్రాంతానికి ముగ్గురు మహిళలు అక్కడికి చేరుకుని ఇక్కడి నుంచి మీరు వెళ్లకపోతే కొడవలితో గొంతు కోసుకుంటామని హల్చేశారు. పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. సాయంత్రం మహిళల కుటుంబీకులను పిలిపించి బయటకు పంపే ప్రయత్నంలో ముల్తానీలు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు మహిళలను బయటకు పంపించారు. ఆదివారం మొక్కలు నాటే క్రమంలో బందోబస్తు వెళ్లిన పోలీసులపై ముల్తానీలు మూకుమ్మడిగా రాళ్లతో దాడి చేశారు. ఫుల్స్టాప్ పడేదెలా.. అటవీశాఖ, ముల్తానీల మధ్య వివాదాస్పదంగా మారిన అటవీ భూముల విషయంలో ఫుల్స్టాప్ పడేవిధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేతకు గురైంది ఎప్పుడు, వాటిలో ముల్తానీలు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు. వారికి సహకరించింది ఎవరు, వారి వద్ద ఉన్న ఆధారాలు, ముల్తానీల ఆందోళనల్లో రాజకీయ ప్రమేయం ఎంత అన్న కోణంలో జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైన ఉంది.చర్యలు తీసుకుంటాం అడవులను అక్రమించి భూములు సాగు చేస్తున్న వారిపై చట్టాపరమైన చర్యలు తీసుకుంటాం. సిరిచెల్మ అటవీ ప్రాంతంలో 50 ఎకరాల వరకు మొక్కలు నాటాం. కొందరు ముల్తానీలు అడ్డుకోవడంతో కొంత ఆలస్యం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటాం. – ప్రశాంత్ బాజీరావు పాటిల్ కధం, ఆదిలాబాద్ డీఎఫ్వో -
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
● బాలికల డబుల్స్లో రిదిమా దేవినేని, సరయు సూర్యనేని ● బాలుర డబుల్స్లో అమన్ అనీశ్, యూదజిత్రెడ్డి ● బాలికల సింగిల్స్లో ప్రసన్న బోనం ● బాలుర సింగిల్స్లో సాయి నచికేత్ విజయంనిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారు కొండాపూర్ వద్ద నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో ఈనెల 17న ప్రారంభమైన రాష్ట్రస్థాయి అండర్–19 జూనియర్స్ బాల, బాలికల బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, రాష్ట్రస్థాయి పోటీల కన్వీనర్లు కిశోర్, వన్నెల భూమన్న నేతత్వంలో పోటీలు నిర్వహించారు. 33 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా 166 మంది క్వాలిఫై అయ్యారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. కాసేపు క్రీడాకారులతో సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. ముందుగా ఫైనల్ మ్యాచ్లు నిర్వహించగా.. బాలికల డబుల్స్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన రీదిమ దేవినేని, సరయు సూర్యనేని గెలుపొందారు. రన్నర్లుగా రంగారెడ్డి జిల్లాకు చెందిన చందన గుర్రం, వేదస్వి వాసిరెడ్డి నిలిచారు. బాలుర డబుల్స్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన అమన్ అనీశ్, యూదజిత్రెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరి వాసన్ సర్వానకుమార్, సాయి సిద్ధార్థపై గెలుపొందారు. మిక్స్డ్ డబుల్స్లో వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన శౌర్య కిరణ్, రిషిత పాండే.. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన అమన్ అనీశ్, రియా సుశీల్పై గెలుపొందారు. బా లికల సింగిల్స్లో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న బోనం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన రిషిత పాండేపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి నచికేత్ బట్రాజ్.. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్రావు సూర్యనేనిపై గెలుపొందారు. విజేతలకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మెడల్స్, కప్లు అందజేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి వచ్చిన 10 మంది ఎంపైర్లు, రిఫరీ, మ్యాచ్ కంట్రోలర్ను సన్మానించారు. క్రీడలు అంటే ఎంతో ఇష్టం చిన్నప్పటి నుంచి తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. యుక్త వయసులో కబడ్డీ, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి సహకరించిన నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీకి అభినందనలు తెలిపారు. పీఈటీల వినతి మేరకు స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. నిర్మల్ జిల్లా క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ తనవంతుగా స్పోర్ట్స్ బ్యాగులు అందజేస్తానని పేర్కొన్నారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేశ్, ప్రణీత్, నందకుమార్, డాక్టర్లు అవినాష్, మనోజ్ భరత్, పీడీ భోజన్న, దీక్ష కాలేజ్ మేనేజ్మెంట్ వెంకట్రెడ్డి, ప్రమోద్రావు, పీఈటీలు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న డీజిల్ పట్టివేత
● 22న పోలీస్స్టేషన్లో వేలం నేరడిగొండ: మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న డీజిల్ను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 2,330 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకుని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో అదనపు కలెక్టర్ (పౌర సరఫరాలు) చర్యలు చేపట్టారు. పట్టుకున్న డీజిల్తో ప్రభుత్వానికి ఆదాయంగా మార్చేందుకు వేలం పాట ద్వారా విక్రయించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 22న ఉదయం 11 గంటలకు నేరడిగొండ పోలీస్స్టేషన్లో వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎంఏ కలీమ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ ఓపెన్ వేలంలో పాల్గొనాలని కోరారు. -
సెలవుల్లో ఇంటికి వచ్చి మృత్యుఒడిలోకి
● బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతిదండేపల్లి: హోంసిక్ సెలవుల్లో ఇంటికి వచ్చిన ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని నంబాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై తహాసీనొద్దీన్ కథనం ప్రకారం..లక్సెట్టిపేటకు చెందిన రుద్ర వంశీకృష్ణ(16) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. హోంసిక్ సెలవుల్లో భాగంగా శనివారం లక్సెట్టిపేట ఇంటికి వచ్చాడు. దీంతో ప ల్లెలోని పంట పొలాలు చూసేందుకు ఆదివారం తె ల్లవారు జామున స్నేహితులతో కలిసి బైక్లతో గూ డెం–మేదరిపేట రింగురోడ్డు గుండా బయల్దేరారు. నంబాల సమీపానికి చేరుకోగా, వంశీకృష్ట స్కూటీ రోడ్డుపక్కన ఉన్న మట్టికుప్పను ఢీకొట్టి పక్కనున్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయా డు. ఈత రాకపోవడంతో మునిగి చనిపోయాడు. స్కూటీ వెనకాల కూర్చుని ఉన్న స్నేహితుడు వర్షిత్వర్మ మట్టికుప్పపై పడటంతో గాయాలయ్యాయి. వెనకాల మరో బైక్పై వస్తున్న మిగతా మిత్రులు ఈ విషయాన్ని గమనించి కు టుంబసభ్యులకు సమాచా రం అందించారు. వా రంతా ఘటన స్థలానికి చే రుకున్నారు. మృతుడి తల్లి నా గమణి ఫిర్యాదుతో కేసు ద ర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల ్లడించారు. కాగా, వంశీతోపాటు మరికొంతమంది మిత్రులు బైక్ రేస్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది నెలల క్రితం గుండెపోటుతో తండ్రి.. వంశీకృష్ణ తండ్రి రవికుమార్ కారు మెకానిక్గా పనిచేస్తూ, పది నెలల క్రితం గుండెపోటు మృతిచెందాడు. ఇప్పుడు అతని చిన్న కొడుకు వంశీకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోవడంతో ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. పది నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. సెలవులు రాకపోయిన బతికేటోడని కుటుంబీకులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. -
అ‘పూర్వ’ సమ్మేళనం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం దొనబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991–92వ బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 33 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి ఆ పాఠశాల వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత చదువులు చదివి వ్యాపారాలు, ఉద్యోగాలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా అపూర్వ సమ్మేళనంతో కలిసి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో ఆనంద క్షణాలు పంచుకున్నారు. పాఠశాల హెచ్ఎం హన్మాండ్లు, ఉపాధ్యాయులు రాములు, సత్యనారాయణ, రాజ్కుమార్, పూర్వ విద్యార్థులు బేతి శ్రీనివాస్, గుండ లచ్చయ్య, జాడి విజయ్, చంద్రశేఖర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
సోన్: పురుగుల మందు తా గిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తమ్మిశెట్టి శ్రీను(34) బతుకుదెరువు కోసం లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామానికి వచ్చి కొన్నినెలలుగా తాీ పమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. గ్రామంలో నూతన ఇళ్ల నిర్మాణం చేపట్టాడు. పట్టుకున్న ఇళ్లను పూర్తి చేయలేక, కూలీలు దొరకక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మనస్తాపం చెందాడు. శనివారం సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామ శివారు సరస్వతీ కెనాల్ సమీ పంలో గుర్తుతెలియని పురుగు ల మందు తాగాడు. స్థానికులు గమనించి అతన్ని ప్రభుత్వాసుపత్రికి త రలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆ సుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ ఆది వారం మృతి చెందాడు. భార్య శిరీష ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గో పి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైదరాబాద్ నిమ్స్లో రైతు.. భీమారం: ఎడ్లబండిపై నుంచి జారి కిందపడ్డ గాయపడిన రైతు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని లాల్బహుదూర్పేటకు చెందిన రైతు కంకణాల మల్లారెడ్డి ప్రతిరోజు మాదిరి ఈనెల 15న పొలం వద్దకి ఎడ్లబండిపై వెళ్తుండగా అకస్మాత్తుగా జారి కిందపడి గా యాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు సతీశ్, కుమార్తె మానస ఉన్నారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
కుంటాల: కొత్త ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేనన్న బెంగతో మద్యానికి బానిసై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని విఠాపూర్కు చెందిన వెంగళం సాయినాథ్(38) పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కల్లూరు గ్రామానికి వచ్చి వడ్రంగి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కల్లూరులో సొంత ఇంటి నిర్మాణ కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. అప్పులు ఎలా తీర్చేదనని మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి కొత్త ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆదివారం ఉదయం సాయినాథ్ చిన్న కుమారుడు ఆడుకుంటూ వంటగదికి వెళ్లగా తండ్రి విగతజీవిగా శవమై కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పురుగుల మందు తాగి యువకుడు..కుభీర్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పార్డి(కె) గ్రామానికి చెందిన మెటిపల్లి శ్రీనివాస్(32)–గంగాసాగర దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస్ హైదరాబాద్లో 108లో పనిచేసేవాడు. గత 15రోజుల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. శ్రీనివాస్ స్వగ్రామమైన పార్డి(కె)కు వచ్చాడు. అప్పటి నుంచి మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందాడు. శనివారం రాత్రి గ్రామశివారులోని రేకుల షెడ్డులో మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లక్ష్మీపూర్లో వివాహిత.. సిరికొండ: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వివాహిత గురుజల చిట్టి శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్కు 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మద్యానికి బానిసై వృద్ధుడు.. తానూరు: మద్యానికి బానిసై వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని భోసి గ్రామానికి చెందిన చిక్కల్వార్ సురేశ్ (60) టైలరింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్లుగా అనారోగ్యం బారినపడి వైద్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతని భా ర్య గంగాసాగర అనారోగ్యం పాలైంది. ఈక్రమంలో సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. తన భార్య, తాను అనారోగ్యం బారినపడడంతో మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి మహాలింగి రోడ్డుకు ఉ న్న గుట్ట ప్రాంతానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. అక్కడ ఉన్న కొందరు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని అతన్ని భైంసా ఆస్పత్రికి తరలించే లోపు మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో ఆదివారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి నలు గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
‘జీవో 49తో ఆదివాసీల మనుగడకు ముప్పు’
పాతమంచిర్యాల: జీవో 49తో ఆదివాసీల మనుగడకు ముప్పు ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తడోబా, అందేరీ రిజర్వ్ ఫారెస్టును కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో కలుపుతూ కుమురం భీం జిల్లాలోని 339 గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకువచ్చిన జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5 వషెడ్యూల్లో ఉన్నందున జిల్లాలో గ్రామసభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా, పెసా చట్టం అమలు చేయకుండా జీవో తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జీవో 49 రద్దు కోసం ఈ నెల 21న (నేడు) చేపట్టిన ఏజెన్సీ బంద్కు సీపీఎం మద్దతు ప్రకటిస్తోందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్, దుంపల రంజిత్, అశోక్, చందు, మల్లీశ్వరి, ఉమారాణి, లింగన్న, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల రక్షణలో వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కీలకం
మందమర్రిరూరల్: కార్మికుల రక్షణలో వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కీలకమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని యూని యన్ కార్యాలయంలో ఏరియాస్థాయి వర్క్మెన్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జరుగనున్న సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశంలో సమస్యలు డీజీఎంఎస్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కేకే–5 గనికి చెందిన సీఐటీయూ నాయకుడు కోరె సిద్దాంత్ ఏఐటీయూసీలో చేరగా కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాసిపేట బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘కొప్పుల’ శకం
● టీబీజీకేఎస్ ఇన్చార్జిగా నియామకం ● యూనియన్లో కవిత ఎపిసోడ్ క్లోజ్ ● పొమ్మన లేక పొగ బెట్టారని ప్రచారం ● నేడు గోదావరిఖనిలో ఈశ్వర్ పర్యటనశ్రీరాంపూర్: టీబీజీకేఎస్ ఇన్చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ నియామకంతో ఆ యూనియన్ కొత్త జవసత్వాలు నింపుకోబోతోంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన టీబీజీకేఎస్ ముఖ్యనేతల సమావేశంలో యూనియన్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్ను నియమించిన విషయం తెలిసిందే. కొప్పులకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గతంలో సింగరేణి కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉంది. క్షేత్రస్థాయిలో కార్మికులతో సంబంధం ఉన్న ఆయనకు యూనియన్ బాధ్యతలు అప్పగించడంపై గులాబీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఆయన సోమవారం గోదావరిఖని ఏరియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం రాజ్యలక్ష్మి ఫంక్షన్హాల్లో సింగరేణి స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి బ్రాంచినేతలు, పిట్ నేతలు, కేంద్ర కమిటీ నాయకులు హాజరు కానున్నారు. పొమ్మన లేక...పొగబెట్టి టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పొమ్మన లేక పొగబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి ఆమె యూనియన్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. 13 ఏళ్లుగా యూనియన్ ఆధిపత్యం చెలాయిస్తున్న ఆమె స్థానాన్ని భర్తీ చేసేలా నేడు ‘కొప్పుల’కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. కవితను గౌరవాధ్యక్షురాలిగా తొలగించినట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఇన్చార్జి నియామకంతో ఆమెను నైతికంగా తప్పించినట్లేనని యూనియన్ నేతలు భావిస్తున్నారు. కాగా, కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో తనపట్టు కాపాడుకునేందుకు ఆమె పార్టీ, యూనియన్తో సంబంధం లేకుండా సింగరేణి జాగృతి విభాగం ఏర్పాటు చేశారు. దీనికి 11 ఏరియాల ఇన్చార్జీలనూ నియమించింది. ఆ తరువాత శ్రీరాంపూర్ లాంటి ఏరియాల్లో స్వయంగా పర్యటించారు. సింగరేణి జాగృతి నాయకుల ఇళ్లకు వెళ్లినా ఆమెకు టీబీజీకేఎస్ నేతల మద్దతు లభించలేదు. పార్టీ నుంచి ఆమె దూరం అవుతుందనే భావనతో యూనియన్ నేతలెవ్వరూ ఆమె కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో టీబీజీకేఎస్లో మార్పులు జరుగబోతాయనే సంకేతాలు అప్పుడే రాగా, తాజాగా కొప్పుల ఈశ్వర్ నియామకంతో తేటతెల్లమైంది. పుట్టి ముంచింది పార్టీనే..తెలంగాణ వాదంతో సింగరేణిలో పురుడు పోసుకుని జాతీయ సంఘాలకు దీటుగా నిలబడి రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ రెండేళ్లుగా చతికిలా పడింది. ట్రేడ్ యూనియన్ను స్వతంత్రంగా ఉంచి పని చేయించాల్సిన బీఆర్ఎస్ యూనియన్ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుని చివరికి పుట్టిముంచిందనే వాదనలు ఉన్నాయి. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామని పార్టీ చేసిన సర్వేలో తేలడంతో పోటీ చేయలేమని ముందుగా ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెంది అప్పటి యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా చేసి పక్కకు తప్పుకొన్నారు. తీరా తేరుకొని ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీబీజీకేఎస్ పోటీకి సై అన్నప్పటికీ ఫలితాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. తరువాత నాయకులు, కార్యకర్తలు చెల్లాచెదురై ఇతర సంఘాల్లో చేరిపోయారు. దీనికి కారణం పార్టీ నాయకత్వం, కల్వకుంట్ల కవిత కూడా బాధ్యురాలేనని విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో యూనియన్ బలపడే అవకాశాలు ఉంటాయని క్యాడర్ ఆశతో ఉంది. -
వనమహోత్సవంతో పచ్చదనం విస్తరించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వన మహోత్సవం కార్యక్రమంతో పచ్చదనం విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి (చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్) ఏలుసింగ్ మేరు అన్నారు. లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాత మంచిర్యాల అటవీ బీట్లో గల గాంధారీ ఖిల్లా జంగల్ సఫారీలో ఆదివారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పచ్చదనం విస్తరించడంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. రాష్ట్ర ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎస్.శాంతారాం, జిల్లా అటవీ శాఖాధికారి టి.శివ్ఆశిశ్ సింగ్ పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ చట్టం విలువలు తెలుసుకోవాలి
జైపూర్: మనిషి పుట్టుక నుంచి మరణం వరకు చట్టం వర్తిస్తుందని, చట్టం విలువలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని చెన్నూర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతపు రవి అన్నా రు. జైపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో పదోతరగతి, ఇంటర్ విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ కు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో పీపీ రాంబాబు, చెన్నూర్ కోర్టు న్యాయవాదులు మహేశ్, పున్నం, బండారి శ్రీనివాస్, రాజేశ్, వినోద్, స్థానిక ఏఎస్సై హబీబ్, కేజీబీవీ ప్రత్యేకాధికారి ఫణిబాల, కోర్టు సిబ్బంది శృతి, తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఏపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరుమల్రావు
మంచిర్యాలఅర్బన్: అఖిల భారతీయ అయ్య ప్ప ధర్మప్రచార సభ (ఏబీఏపీ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన బేతి తిరుమల్రావు ఎన్నికయ్యారు. ఆదివారం తమిళనాడులో తిరువాన్నమాళైలతో ఏబీఏపీ జాతీయ మహాసభ జరిగింది. ఏబీఏపీ గౌరవ అధ్యక్షుడు పీఎన్కే మీనన్ శభరిమల మేళ్ళాంతులు పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అయ్యప్పదాస్, ప్రధాన కార్యదర్శిగా తిరుమల్రావు రెండోసారి ఎన్నికయ్యారు. ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడు రాజుకిరణ్, ప్రధాన కార్యదర్శి సంతోష్ పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం ● ఆసక్తి చూపని లబ్ధిదారులు ● మంజూరులో సగం కూడా ప్రారంభించని వైనం ● త్వరగా పూర్తి చేయాలంటున్న అధికారులు
మంచిర్యాలటౌన్: ఇంటి స్థలం ఉండి ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఒకవైపు పెరిగిన ధరలు, మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో మంజూరైన ఇళ్లలో కనీసం సగం కూడా గ్రౌండింగ్ కాలేదు. కొందరు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసి మొదటి విడత ప్రభుత్వ సాయం పొందిన తరువాత, రూఫ్ లెవల్కు వెళ్లే పనులను పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ధరలు మరింత పెరిగితే ప్రభుత్వం అందించే సాయం సరిపోక, ఇళ్లను పూర్తిచేయడంలో మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. గ్రౌండింగ్కే పరిమితం జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు అధికారుల ఒత్తిడి మేరకు గ్రౌండింగ్ చేసి వదిలేస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు, ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలంలో 10,269 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,051 ఇళ్లు గ్రౌండింగ్, 847 ఇళ్లు బేస్మెంట్ లెవల్ పూర్తి చేసుకోగా 103 ఇళ్లు రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. మంజూరైన ఇళ్లలో కనీసం సగం కూడా గ్రౌండింగ్ కాకపోగా అయినవాటిలో బేస్మెంట్ స్థాయిలోనే ఆగిపోతున్నాయి. దీంతో లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా కలెక్టర్ కుమార్ దీపక్, హౌజింగ్ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించిన వారికి రూ.లక్ష చెల్లించగా, రూఫ్ లెవల్ పూర్తి చేస్తే రూ.1.25 లక్షలు, స్లాబ్ వేస్తే రూ.1.75 లక్షలు, పెయింటింగ్ పూర్తి చేసిన తరువాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ. 5 లక్షలను ప్రభుత్వం అందించనుందని చెబుతున్నా ఇంటినిర్మాణానికి అవి సరిపోవని ముందుకురావడంలేదని తెలుస్తోంది. నియోజకవర్గాల వారిగా బెల్లంపల్లిలో మాత్రమే కొంత మెరుగుకాగా చెన్నూరు పూర్తిగా వెనుకబడింది. మంచిర్యాల నియోజకవర్గానికి 3,280 ఇళ్లు మంజూరుకాగా గ్రౌండింగ్ 1661 కాగా, బేస్మెంట్ లెవల్లో 286, రూఫ్ లెవల్ వరకు 49 అయ్యాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో 3,164 ఇళ్లు మంజూరుకాగా గ్రౌండింగ్ అయినవి 1,726, బేస్మెంట్ లెవల్లో 362, రూఫ్ లెవల్ వరకు 35 అయ్యాయి. చెన్నూర్ నియోజకవర్గానికి 3,067 ఇళ్లను మంజూరు చేయగా గ్రౌండింగ్ అయినవి 1081 కాగా, బేస్మెంట్ లెవల్లో ఉన్నవి 162, రూఫ్ లెవల్ వరకు 19 అయ్యాయి. ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి 758 ఇళ్లను మంజూరు చేయగా 583 గ్రౌండింగ్ అయ్యాయి, 37 బేస్మెంట్ లెవల్ పూర్తికాగా 4 రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి.మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, చేపడుతున్న నిర్మాణాలుమండలం మంజూరు గ్రౌండింగ్ బేస్మెంట్ లెవల్ రూఫ్ లెవల్ దండేపల్లి 692 514 116 22 హాజీపూర్ 447 329 73 4 లక్సెట్టిపేట 701 434 96 23 లక్సెట్టిపేట (మున్సిపాలిటీ) 214 36 0 0 మంచిర్యాల కార్పొరేషన్ 1,226 348 1 0 బెల్లంపల్లి 397 328 65 18 బెల్లంపల్లి (మున్సిపాలిటీ) 472 18 0 0 భీమిని 295 193 87 14 కన్నెపల్లి 303 175 63 1 కాసిపేట 464 233 30 2 నెన్నెల 465 277 43 0 తాండూర్ 495 308 36 0 వేమనపల్లి 273 194 38 0 భీమారం 432 115 37 0 చెన్నూర్ 821 377 32 2 చెన్నూర్ (మున్సిపాలిటీ) 140 4 0 0 జైపూర్ 636 296 57 13 కోటపల్లి 619 152 11 0 మందమర్రి 419 137 25 0 జన్నారం 758 583 37 4 మొత్తం 10,269 5,051 847 103నిర్మాణాలు జరిగేలా చూస్తున్నాంఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారు గ్రౌండింగ్ చేసేలా చూస్తున్నాం. పనులు ప్రారంభించిన వారికి విడతల వారీగా ఆర్థికసాయం అందిస్తూ నిర్మాణం పూర్తిచేసేలా చూస్తున్నాం. ఇప్పటికే పలువురు ఇంటి నిర్మాణాలను ప్రారంభించి, వేగంగా స్లాబ్ వరకు పూర్తి చేసుకుంటున్నారు. వారికి ప్రభుత్వం సాయం వెంటనే అందించడంతో ఇతరులు సైతం ముందుకు వస్తున్నారు. – బన్సీలాల్, హౌజింగ్ పీడీ, మంచిర్యాల -
వైభవంగా ‘గాంధారి’ జాతర
బోనాలతో ఊరేగింపుగా వస్తున్న భక్తులుఅమ్మ దీవెనలు అందరిపై ఉండాలి: మంత్రి వివేక్అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గాంధారి మైసమ్మ బోనాల జాతరకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనం సమర్పించుకుని మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. బోనంతో యువతి -
గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది
● మంత్రి గడ్డం వివేక్చెన్నూర్రూరల్: గత ప్రభుత్వం మహిళలను ఆర్థి కంగా బలపరుస్తామని చెప్పి విస్మరించిందని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. చెన్నూర్ మండలం కిష్టంపేటలోని బీఎంఆర్ గార్డెన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. సుమారు 246 మహిళా సంఘాలకు రూ.25 కోట్ల వడ్డి లేని రుణాల చెక్కులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అందజేశారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాలకు మంజూరైన రేషన్కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చెన్నూర్లో బస్డిపో ఏర్పాటు చేయాలని రవాణాశాఖ మంత్రిని కోరామన్నారు. ఈ సందర్భంగా కిష్టంపేట గ్రామ మహిళలు తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో మోహన్, తదితరులు పాల్గొన్నారు. -
స్థల వివాదంలో ఒకరికి కత్తిపోట్లు
సోన్: స్థల వివాదంలో ఒకరిని కత్తితో పొడిచిన సంఘటన మండలంలోని న్యూబొప్పారంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన వేముల శ్రీనావాస్ తన ప్లాటును అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తికి విక్రయించాడు. తనను కాదని ఎలా అమ్ముతావని వరుసకు మేనమామ అయిన కనికరం చిన్నయ్య అడిగే క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో చిన్నయ్య శ్రీనివాస్పై కారంపొడి చల్లి కత్తితో పొడిచాడు. శ్రీనివాస్ కోపంతో చిన్నయ్య తలపై కర్రతో కొట్టడంతో గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించారు. ఇద్దర్ని వేరువేరుగా అంబులెన్స్లో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు. -
సీఆర్టీల నియామకం చేపట్టాలి
కాసిపేట: జిల్లాలో సీఆర్టీల నియమాకం చేపట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి సమస్య వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఆర్టీల నియామకం చేపడుతుండగా, జిల్లాలో పోస్టులు లేవని, దరఖాస్తులు చేసుకోవద్దని బోర్డు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో ఒక్క ఎస్జీటీ పోస్టు సైతం ఖాళీ లేదా అధికారులు సమాధానం చెప్పాలని, వెంటనే ఖాళీల వివరాలు ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడ జంగు, ఆదివాసీ నాయక్పోడ్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న, పెంద్రం హన్మంతు, పెద్ది భార్గవ్, మడావి అనంతరావు, ఆత్రం జంగు, సండ్ర భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
● ఏళ్లుగా కబ్జాలో ఉన్న రైతులకు బెదిరింపులు ● తాజాగా సాగు చేస్తున్న పంటలు ధ్వంసం ● సర్వేనంబరు 345లో అనేక అక్రమాలు ● హక్కులు కల్పించాలని దళితుల వేడుకోలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న దళిత రైతు పేరు మాలెం రమాదేవి. ఏళ్లుగా ఈ భూమిలో తమ తాత కాలం నుంచి కాస్తులో ఉంటున్నారు. పంటలు సాగు చేసుకుంటున్నారు. వీరి తండ్రి చనిపోగా.. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రెండ్రోజుల క్రితం పత్తి చేనును రాత్రివేళ వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్తో చదును చేసి ధ్వంసం చేశారు. గత కొంతకాలంగా తాము సాగులో ఉన్న భూమి కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితులు మంచిర్యాల పోలీసుస్టేషన్, తహసీల్దార్ను కలిసి ఫిర్యాదు ఇచ్చారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితుల భూములపై రియల్ ఎస్టేట్ గద్దలు వాలుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఉన్న సర్వేనంబరు 345లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సర్వే నంబరులో రికార్డులు మార్చేస్తున్నారు. ఇదే సర్వేనంబరులో జంగ్సిపాయిలకు చెందిన భూములు 60ఎకరాల చొప్పున మొత్తం 120 ఎకరాలు ఉంది. ఈ భూముల్లో రైతులు సాగులో ఉన్నారు. ఈ భూములను సిపాయిల వారసులుగా కొందరు రంగప్రవేశం చేసి రియల్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఉండడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడంతోపాటు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ భూములపై కొందరు కన్నేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. నిరుపేద దళితులు ఉన్న ఈ భూములపై ఏళ్లుగా సాగులో ఉన్నా హక్కులు లేకపోవడంతో అడ్డదారిలో భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డులు మార్చేస్తూ.. రాజీవ్నగర్ సమీపంలో ఉన్న 345 సర్వేనంబరులో జంగ్ సిపాయి భూములతోపాటు మరో వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లో మందమర్రి మండలం అమర్వాదికి చెందిన పలువురు రైతులు ఏళ్లుగా సాగులో ఉన్నా హక్కులు పొందలేకపోయారు. దీంతో ఇదే అదునుగా రికార్డులు మార్చుతూ తమకు అనుకూలంగా చేసుకుంటూ అనేమందికి తక్కువ ధర ఆశ చూపిస్తూ అమ్మేశారు. అయితే కబ్జాలో వేరే రైతులు, రికార్డుల్లో మాత్రం వేరేవాళ్లు ఉన్నారు. దీంతో కబ్జాలో ఉన్నవారిని బలవంతంగా ఆ భూముల నుంచి లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూముల రిజిస్ట్రేషన్లు కావడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వివాదాలు ఉన్నాయని పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన వారంతా ఇబ్బందుల్లో పడ్డారు. అర్జీలు ఇస్తున్నా హక్కులు రాలే.. ఏళ్లుగా ఇక్కడ సాగులో ఉన్నప్పటికీ భూ యాజమాన్య హక్కులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు నయానో, భయానకో రియల్ వ్యాపారులకు విలువైన భూములను అమ్మేసుకుంటున్నారు. అయితే కొందరు కాస్తులో ఉన్నవారు భూ ప్రక్షాళన, ధరణి సందర్భంలోనూ అర్జీలు ఇచ్చినప్పటికీ పట్టాలు రాలేదు. మరోవైపు కబ్జాలో ఉన్న వారికి భూమిపై హక్కులు రావని చెబుతూ రియల్వ్యాపారులే బెదిరిస్తూ ఆ భూముల్లో లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూములపై పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
సీతాకోక చిలుకలు, పక్షులపై అధ్యయనం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోని పాత మంచిర్యాల అటవీ బీట్, ఎంసీసీ క్వారీ అడవిలోని గాంధారీ ఖిల్లా జంగల్ సఫారీలో శనివారం సీతాకోక చిలుకలు, పక్షులపై అధ్యయనం చేశారు. మహారాష్ట్రకు చెందిన వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ రంజన్ విరనీ, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయనంలో 30 రకాల సీతాకోక చిలుకలు, వివిధ రకాల పక్షులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో లక్సెట్టిపేట రేంజ్ పరిధిలోని ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు, వన ప్రేమికులు పాల్గొన్నారు. -
నగర పాలన అస్తవ్యస్తం
● సెలవులో వెళ్లిన రెగ్యులర్ కమిషనర్ ● లక్సెట్టిపేట కమిషనర్కు అదనపు బాధ్యతలు ● చెక్పవర్, అధికారాలు లేవు! ● కొరవడిన పారిశుద్ధ్యం.. రెండు డెంగీ కేసులు నమోదుమంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరపాలక సంస్థ పాలన అస్తవ్యస్తంగా మారింది. రెగ్యులర్ కమిషనర్ శివాజి ఈ నెల ఒకటి నుంచి 15వరకు సెలవుపై వెళ్లారు. దీంతో ఈ నెల 2న కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్కు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే లక్సెట్టిపేట కమిషనర్ సంపత్కుమార్కు ఈ నెల 15వరకు ఇంచార్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 15వరకు ఇంచార్జి కమిషనర్ గడువు ముగిసింది. రెగ్యులర్ కమిషనర్ రాకపోవడంతో ఇప్పటికీ లక్సెట్టిపేట కమిషనర్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. చెక్పవర్తోపాటు ఇతరత్రా అధికారాలు లేకపోవడంతో అభివృద్ధితోపాటు పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టడం లేదు. నస్పూరు, మంచిర్యాల మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేసి మంచిర్యాల కార్పొరేషన్గా మార్చడంతో పరిధి విస్తృతంగా పెరిగింది. రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో ప్రజలకు మౌలిక వసతులు కరువయ్యాయి. సెలవులో వెళ్లిన కమిషనర్ శివాజి తిరిగి విధుల్లో చేరడమో, కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టడమో చేసే వరకు పాలన గాడినపడడం కష్టమే. వర్షాకాలం... రోగాల మయం ప్రతియేటా వర్షాకాలానికి ముందే పారిశుద్ధ్య పనులు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో చేపట్టాల్సి ఉంది. కానీ కార్పొరేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వర్షాలు కురుస్తుండడం, డ్రెయినేజీల్లో పూడిక పెరిగి మురుగునీరు రోడ్లపై పారుతుండడం, రోడ్లు డ్రెయినేజీ నీటితో నిండి ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతోంది. నగరంలోని హైటెక్సిటీ కాలనీలోని రోడ్లపై డ్రెయినేజీ నీరు నిండి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి డ్రెయినేజీ నీరు రోడ్లపై పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. హైటెక్సిటీలో డెంగీ కేసు నమోదు కాగా, వందలాది మంది జ్వరాల బారిన పడ్డారు. నస్పూరులోనూ అదే పరిస్థితి. ఒక డెంగీ కేసు నమోదు కాగా, ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. పారిశుద్ధ్యాన్ని పట్టించుకోకపోవడం, చెత్తాచెదారం, డ్రెయినేజీ నీరు రోడ్లపై పారుతుండడంతో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. వంద రోజుల కార్యాచరణ అమలేది? ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2నుంచి సెప్టెంబర్ 10వరకు వంద రోజులపాటు సమస్యలు లేని పట్టణాలుగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వంద రోజుల కార్యాచరణలో వార్డుల్లోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, డ్రెయినేజీలు, వర్షపు నీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. ఇప్పటికే 50రోజులు పూర్తి కాగా, మరో 50 రోజుల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం అడ్డంకిగా మారుతోంది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం చేయడంపై అధికారులు దృష్టి సారించకపోవడంతోనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారినా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, నగర శివారు ప్రాంతాల్లో మురుగు నీరు, చెత్తాచెదారం పేరుకు పోవడం గమనార్హం. -
‘మధ్యాహ్న’ వంటకు గ్యాస్
స్కూళ్లలో ఇలా..సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. వంట బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించారు. జిల్లాలో పాఠశాలకో ఏజెన్సీ చొప్పున 747 ఏజెన్సీల్లో 1290మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్నారు. నెలకు 66,953 కిలోల సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.14లక్షల వరకు, ఏడో తరగతి వరకు రూ.10లక్షల బడ్జెట్ మంజూరవుతోంది. తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులకు రూ.10.67 చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వంట పాత్రలకు రూ.63లక్షలు మంజూరు చేయగా.. అన్నం గిన్నెలు, స్టీలు బకెట్లు, గరిటెలు తదితర పాత్రలు కొనుగోలు చేశారు. వంటగది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ఒకే గదిలో స్టోర్రూం, వంటపొయ్యి(కట్టెల పొయ్యి) ఏర్పాటుతో పొగ బయటకు రాక ఊపిరిసలపని పరిస్థితి. మన ఊరు–మన బడి కింద చేపట్టిన 27 పనుల్లో 11 పూర్తి కాగా 16 పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మిగతా పాఠశాలల్లో రేకుల షెడ్ అనువుగా లేకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వంట గదుల నిర్మాణంతోపాటు నెలకు అవసరమైన సిలిండర్లు సరఫరా చేయాలని వంట నిర్వాహకులు కోరుతున్నారు. మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకులకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఏళ్ల క్రితం వంటపాత్రల స్థానంలో నాణ్యతతో కూడిన కొత్త పాత్రలు అందించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ల మంజూరుపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీని ఉపయోగించి మాత్రమే వంట చేయాలని సూచించింది. వర్షాకాలంలో కట్టెలు ఉపయోగించి భోజనం తయారు చేయడంలో వంట ఏజెన్సీలకు ఎన్నో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఆరుబయట కట్టెలతో వంట చేయడం వల్ల ఆహారం నాణ్యత, రుచి ప్రభావం కావడమే కాకుండా పొగ పీల్చడం, అపరిశుభ్రమైన పరిస్థితుల కారణంగా వంట చేసే వారు అనారోగ్యానికి గురి కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో వంట ఏజెన్సీల పేరిట ఎల్పీజీ కనెక్షన్ల జారీకి చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. గ్యాస్ కనెక్షన్ల మంజూరు ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని డీఈవో, డీఆర్డీవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని పాఠశాలలకు.. మధ్యాహ్న భోజనం ఆరంభంలో 747 పాఠశాలల్లో 71 బడులకు మాత్రమే గ్యాస్ పంపిణీ చేశారు. వీటిలో బెల్లంపల్లి మండలంలో 28, కాసిపేట 4, మందమర్రి 8, చెన్నూర్ 14, జన్నారం 8, తాండూర్ మండలంలో 9 పాఠశాలలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేశారు. మొదట్లో గ్యాస్ సరఫరా చేసినా ఆ తర్వాత అటకెక్కాయి. మిగతా పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్, పొయ్యిల పంపిణీ విస్మరించారు. దీంతో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగతో కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని వంట కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సిలిండర్ సరఫరా ఎలా.. గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా నెల నెలా సిలిండర్ సరఫరా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నెలకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయో తెలియదు. వంట ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేయాలంటే ఆర్థికభారం తప్పేలా లేదు. ఏజెన్సీలకు చెల్లించేది అంతంత మాత్రమే కావడంతో సిలిండర్ల కొనుగోలుకు విముఖ వ్యక్తమవుతోంది. ఉచితంగా సరఫరా చేయకుంటే మళ్లీ మొదటికొచ్చి కట్టెలపొయ్యే దిక్కయ్యేలా ఉంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు గ్యాస్ కనెక్షన్లు సర్కారు బడుల్లో ఆగస్టు 15లోపు పూర్తికి చర్యలు జిల్లా అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు -
యూరియాపై ఆందోళన వద్దు
వేమనపల్లి: యూరియా నిల్వలు లేవని రైతులు ఆందోళన చెందకూడదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రునాయక్ అన్నారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు అన్ని ఫర్టిలైజర్, పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాల్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. మండలంలోని నీల్వాయి, ముల్కలపేట, గొర్లపల్లి, సుంపుటం గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా అమ్మకాల తీరును పరిశీలించారు. రశీదులు, నిల్వల రిజిష్టర్ పరిశీలించారు. ప్రతీ రైతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిష్టర్లో తప్పక పేరు నమోదు చేయించుకోవాలని, అలాగైతేనే పీఎం కిసాన్కు అర్హులని తెలిపారు. ఏఓ వీరన్న, ఏఈఓలు రుక్సార్ సుల్తానా, ఎఫ్సిబా పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి
కాసిపేట: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని ఇంటర్మీడియెట్ విద్యాధికారి(డీఐఈవో) అంజయ్య సూచించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం సమయసారిణిలో ప్రతీ శనివారం కాలేజీ విద్యార్థుల ఆటలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. క్రీడలు ప్రారంభించి క్రీడాసామగ్రి అందజేశారు. ప్రతీరోజు వ్యాయామం, క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, పీడీ బాబురావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
● బొగ్గు ఉత్పత్తిని పెంచాలి ● సింగరేణి డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లుశ్రీరాంపూర్: ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణ కేంద్రం, నస్పూర్ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన గోదావరి ఫంక్షన్ హాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి పెంచాలని, ఓపెన్కాస్టు గనుల్లో ఓబీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. నిర్ధేశించిన ఓబిని తీస్తేనే బొగ్గు వెలికితీయవచ్చని, ఉత్పత్తితోపాటు రవాణా కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్ఓటు డైరెక్టర్ మెహతా, ఏరియా ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఏజీఎం(ఫైనాన్స్) బీభత్సా, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, వర్క్షాప్ డీజీఎం రవీందర్, సివిల్ డీజీఎం ఆనంద్కుమార్, గుర్తింపు సంఘం నాయకుడు ముస్కే సమ్మయ్య, ఎం.కొమురయ్య, కొట్టే కిషన్రావు, ఫిట్ సెక్రెటరీ సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల డీటీడీవో, ఏటీడీవోలు, ఏఎన్ఎంలను ఆదేశించారు. శనివారం కేబీ కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. మోవా లడ్డూ, విటమిన్ ‘సి’ పాలిక్ యాసిడ్ వంటి మాత్రలను వారంలో రెండుసార్లు మధ్యాహ్న భోజనం తర్వాత ఇవ్వాలని సూచించారు. స్నానానికి వేడి నీళ్లు ఉండేలా చూడాలన్నారు. ప్రతీరోజు విద్యార్థుల హిమోగ్లోబిన్ శాతం పరిశీలించాలని ఏఎన్ఎంలను ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్లు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ అంబాజీ, ఏడీఎంహెచ్వో కుడిమెత మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
కౌలురైతు బలవన్మరణం
కుంటాల: కుంటాలకు చెందిన కౌలు రైతు రాజారాం గజేందర్ (49) అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. శనివా రం తెల్లవారుజామున స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని పంట చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. ఏఎస్సై జీవన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గజేందర్ మూడేళ్లుగా 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాడు. అయితే, ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. దీంతో పెట్టుబడి, కౌలు చెల్లింపు కోసం అప్పులు చేశాడు. వచ్చిన దిగుబడి అప్పులు, వడ్డీలకు సరిపోవడం లేదు. ఇప్పటికీ రూ.3.60 లక్షల అప్పు ఉంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా లేదు. దీంతో మనస్తాపం చెందిన గజేందర్ అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గజేందర్ తండ్రి రాజారాం బక్కన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
సాగులో ఉన్న రైతులకు పట్టాలివ్వాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్చెన్నూర్: కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో 70ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకే పట్టాలివ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. బీజేపీ నాయకులు సర్వాయిపేట గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. శనివారం చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సేత్వార్ ద్వారా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి, అధికారులు సర్వాయిపేట భూములపై మోకా సర్వే నిర్వహించి న్యాయబద్ధంగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, కోటపల్లి మండల నాయకులు పెద్దింటి పున్నంచంద్, మంత్రి రామయ్య, కాశెట్టి నాగేశ్వర్రావు, కందుల వెంకటేశ్, జాడి తిరుపతి, కమ్మల శ్రీనివాస్, వెంకటనర్సయ్య పాల్గొన్నారు. -
‘21న బంద్ విజయవంతం చేయాలి’
ఆదిలాబాద్రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీవో 49 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ కోరారు. శనివారం మావల మండలంలోని కుమురంభీం గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1/70, పెసా చట్టాలు ఆదివాసీల అస్తిత్వాన్ని, మనుగడను, హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో బంద్కు సహకరించాలని కోరారు. సమావేశంలో తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా, డివిజన్ అధ్యక్షురాలు సోయం లలితా, ఆదిలాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, మావల మండల అధ్యక్షుడు వెడ్మ ముకుంద్, ఉపాధ్యక్షుడు తొడసం ప్రకాష్, కుమ్ర వినోద్, తదితరులు పాల్గొన్నారు. పశువులను తరలిస్తున్న రెండు వాహనాలు పట్టివేతబెజ్జూర్: అక్రమంగా పశువులు తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు ఎస్సై సర్దార్ పాషా తెలిపారు. శనివారం ఉదయం బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఒక్కో వాహనంలో ఐదు చొప్పున పశువులు ఉన్నాయని, పెంచికల్పేట్ నుంచి చేడ్వాయి వెళ్తున్నట్లు చెప్పారు. పశువైద్యాధికారి, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరు మృతి
సారంగపూర్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు స్వర్ణ ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు జౌళి గ్రామానికి చెందిన పోటెండ్ల భీమేశ్ (34) శుక్రవారం సాయంత్రం స్వర్ణ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని బంధువులు శనివారం ఉదయం ప్రాజెక్టు పరిసరాల్లో గాలించగా మృతదేహం లభ్యమైంది. కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటమునిగి మృతిచెంది ఉంటాడని బావించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. మృతునికి గతంలో వివాహమైనా విడాకులు కావడంతో ఒంటరిగానే ఉంటున్నాడని బంధువులు తెలిపారు. చికిత్స పొందుతూ కార్మికుడు..మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని స్టోర్స్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి శ్రీనివాస్ (45)చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల మేరకు గత నెలలో విధి నిర్వహణలో ఉండగాఽ తేనెటీగలు కుట్టడంతో స్టోర్ అధికారి సూచన మేరకు ఒక్కడే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. సదరు అధికారి రమ్మని చెప్పడంతో ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే వచ్చినట్టు సమాచారం. డిశ్చార్జ్ చేయకుండానే ఎందుకు వెళ్లావని ఆస్పత్రి సిబ్బంది అడగడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈక్రమంలో పది రోజుల క్రితం అధిక రక్తపోటుకు గురికావడంతో కేకే డిస్పెన్సరీకి వెళ్లగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓప్రైవేట్ తరలించి చికిత్స చేయించినా నయం కాకపోవడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా విధి నిర్వహణలో ఉండగా తేనెటీగలు కుడితే బాధితునితో పాటు మరో సహాయకుడిని ఎందుకు పంపలేదని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నీళ్లనుకుని పురుగుల మందు తాగిన యువకుడు●● చికిత్స పొందుతూ మృతి సిరికొండ: ఈ నెల 15న పురుగుల మందుతాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పూజ తెలిపారు. మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ఆడ ప్రవీణ్కుమార్ (22) మంగళవారం రాత్రి పంటచేనుకు కాపలా వెళ్లాడు. దాహం వేయడంతో నిద్రమత్తులో నీళ్ల బాటిల్ అనుకుని పురుగుల మందు తాగాడు. వెంటనే ఇంటికి వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలపడంతో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మొరం టిప్పర్లు పట్టివేతదండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్ సమీపంలో అక్రమంగా మొరం తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్ అధికారులు శనివా రం పట్టుకున్నట్లు తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే తెలిపారు. పట్టుకున్న టిప్పర్లను దండేపల్లి పోలీస్టేషన్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందం ఏర్పాటు
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● పోగొట్టుకున్న 109 సెల్ఫోన్లు బాధితులకు అందజేత ఆదిలాబాద్టౌన్: బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.16 లక్షల విలువ గల 109 సెల్ఫోన్లను శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశం మందిరంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫోన్ పోయిన వెంటనే https://www.ceir.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 900 సెల్ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు తెలిపారు. మీసేవ కేంద్రాల్లో ఎలాంటి చలాన్లు కట్టకుండా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దొంగిలించిన ఫోన్లను కొనుగోలు చేస్తే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని దుకాణాల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, ప్రత్యేక బృందం సభ్యులు ఎస్సై పి.గోపీకృష్ణ, ఎస్.సంజీవ్, ఎంఎ.రియాజ్, మజీద్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: అప్పులబాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మజారుద్దీన్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎస్సార్పీ–1 గనిలో కోల్ఫిల్లర్గా విధులు నిర్వర్తిస్తున్న జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డుకు చెందిన బైరి రమేశ్ (36) తన స్నేహితుల వద్ద రూ.5 వడ్డీచొప్పున సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ప్రతీనెల వడ్డీ మాత్రమే కడుతున్నాడు. అసలు ఎలా చెల్లించాలో తెలియక మనస్తాపానికి గురై ఈనెల 17న గడ్డిమందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు, విరేచనాలు చేసుకుని కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య శ్వేత, కుమారుడు ఉన్నారు. శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు..ఇంద్రవెల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల మేరకు శంకర్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన ఆడ విశ్వేశ్వర్రా వ్ (48) నాలుగేళ్లుగా మా నసిక స్థితి కోల్పోయాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. శనివారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సీతాబాయి, కుమారులు యశ్వంత్రావ్, రాజేశ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలుఇంద్రవెల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయలైన ఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ఈశ్వర్నగర్ గ్రామానికి చెందిన అందుసింగ్ బైక్పై ఇంటికి వెళ్తుండగా ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు ఆగకుండా వెళ్లిపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అందించడంతో కారును అదుపులో తీసుకుని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తీవ్రగాయాలైన అందుసింగ్ను స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. ఈ విషయంపై ఏఎస్సై రమేశ్ను సంప్రదించగా ఘటనపై ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
గిరి గూడేలకు పండుగ శోభ
ఆకిపేన్.. ● ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల సౌరభం ● నాలుగు మాసాలు వివిధ పండుగలు ● అకాడితో ప్రారంభమై దీపావళితో ముగింపు ● కుల దేవతలకు ప్రత్యేక పూజలు ● ఆదివాసీ పల్లెల్లో కోలాహలం ‘శీత్ల’ పండుగ శీత్ల భవాని లంబాడీల దేవత. పశువుల ఆరోగ్యం, తండా సౌభాగ్యం కోసం శీత్ల భవానికి పూజలు చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని వారి నమ్మకం. ఆషాఢమాసంలో ఒక మంగళవారం గ్రామ సరిహద్దులోని పొలిమేరలో ఉన్న కూడలి వద్ద శీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. మహిళలు, యువతులు నెత్తిన బోనం ఎత్తుకుని వస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలిచ్చి వాటిపైనుంచి పశువులను దాటిస్తారు. పశు సంపద వృద్ధి చెందాలని, పాడిపంటలు బాగా పండాలని, ఎలాంటి దుష్టశక్తులు దరి చేరకుండా ఉండాలని శీత్ల మాతను పూజిస్తారు. విజ్జపేన్..! పెర్సాపేన్, రాజుల్దేవత వద్దకు విత్తనాలను తీసుకెళ్లి పూజలు చేస్తారు. పంటలకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని పెర్సాపేన్కు మొక్కుతారు. అంతకు ముందు గ్రామంలో ఉన్న విత్తనాలను ఒక వద్దకు చేర్చి కుల దేవతలకు అందరు కలిసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కటోడా వాటిని అందరికీ అందిస్తారు. ఆ తర్వాతే పొలం పనులు ప్రారంభిస్తారు.అడవిలో ఆకులు చిగురించి పచ్చగా మా రుతున్న క్రమంలో ఆదివాసీలు ఆకిపేన్ కు పూజలు చేస్తారు. ఈ కాలంలో అడవికి వెళ్లిన మూగజీవాలకు రక్షణగా ఉండాలని, ఎలాంటి హాని తలపెట్టవద్దని, పంటలు అధికదిగుబడి సాధించాలని పూజలు చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మణరేఖ లాంటి గీతను గీస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు అడవిలోకి పరుగెత్తాయి. కోడి, మేకలతో జాతకం చెబుతారు. ప్రతీ పండుగకు ప్రత్యేకత ఆదివాసీలు జరుపుకునే ప్రతీ పండుగకు ప్రత్యేకత ఉంది. అకాడి నుంచి ప్రారంభమైన పండుగలు నాలుగు మాసాలపాటు కొనసాగుతాయి. దీపావళికి గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఇప్పుడే కుల దేవతలకు మొక్కుకుంటారు. కార్యం నెరవేరాక దీక్ష చేపడతారు. పూజల తర్వాత ఏత్మాసార్ పేన్కు పూజలు చేస్తాం. వన భోజనం ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. – కుర్సెంగ దుందేరావు, ఆదివాసీ నాయకుడు, చౌపన్గూడ కెరమెరి(ఆసిఫాబాద్): మారుతున్న ఆధునిక కా లంలోనూ ఆదివాసీలు తమ ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. సమాజంలో ఎ న్నో మార్పులు వస్తున్నప్పటికీ ఆదివాసీలు నేటికీ పుడమితల్లిని పూజిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లోనూ.. తమకు మరెవరూ సాటిరారని నిరూపిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు. వారి ఇళ్లల్లో జరిగే వివాహాల్లో వైవిధ్యం ఉంటుంది. నూతనత్వం కనిపిస్తుంది. పండుగల్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే అకాడి పండుగతో ప్రారంభమయ్యే ఆదివాసీల పండుగలు, ఉత్సవాలు దీపావళితో ముగుస్తాయి. నాలుగు మాసాల పాటు ఆదివాసీ గూడేల్లో వివిధ రకాల పండుగలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు అకాడి పండుగలో జరిపే ఇతివృత్తంపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. అకాడి.. ఆషాఢమాసంలో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. పాడిపంటలకు రక్షణ కల్పించే అడవిదేవతగా భావించే రాజుల్పేన్ను పూజిస్తారు. నెలవంక కనిపించగానే జిల్లాలోని ప్రతీ గ్రామంలో దీనిని నిర్వహిస్తారు. అకాడి పండగను కొందరు పౌర్ణమి వరకు నిర్వహిస్తే మరికొందరు అమావాస్య వరకు నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారమని ఆదివాసీ పెద్దలు, కటోడాలు పేర్కొంటున్నారు. -
ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర కీలకం
● ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్బాసర: భారత ఇన్నోవేషన్ వ్యవస్థలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని ఓఎస్డీ, ఏవో ప్రొఫెసర్ మురళీదర్శన్ అన్నారు. శనివారం ఆర్జీయూకేటీలో విద్యార్థులకు స్టార్టప్, ఆంత్రప్రెన్యూర్షిప్ మార్గదర్శక విలువలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో ప్రధానంగా ప్రారంభ దశ స్టార్టప్లలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో స్టార్టప్లపై ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థిరత్వం, విస్తరణ ప్రాముఖ్యతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతి, నాగసాయి కుమార్, దిల్బహర్ అహ్మద్, చరణ్రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్దగల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు మూడో రోజు రసవత్తరంగా సాగాయి. శనివారం క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. అండర్ 19 బాలురు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, నిర్మల్ అర్బన్ ఎమ్మార్వో రాజు, మున్సిపల్ డీఈ హరిభూవన్, మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్ గౌడ్, నందకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహనకు సదస్సులు
భీమారం: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతనేని రవి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలపై తెలుసుకుంటే ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్ష ఉంటుందనే విషయం తెలుస్తుందన్నారు. న్యాయశాఖ ద్వారా ప్రజలతోపాటు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సై శ్వేత, ఎంపీవో సతీష్రెడ్డి, న్యాయవాదులు రాజ్కుమార్, రాజేష్ , పున్నం, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
నా ఎదుగుదలను ఓర్వలేకే దుష్ప్రచారం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కైలాస్నగర్: రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెన్గంగా గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైక్రోఫైనాన్స్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి నిందితుడు పరారైన ఘటనకు సంబంధించి తనపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. నిందితుడు తనకు స్నేహితుడేనని, కలిసి చదువుకున్నామన్నారు. అయితే నిందితుడి ఫౌండేషన్కు తన ఫౌండేషన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎమ్మెల్యే కావడం జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా, పత్రికలు, యూట్యూబ్ చానళ్లలో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన వారికి లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు. మోసపోయిన గిరిజన యువతకు న్యాయం చేసేలా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
● నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తాండూర్/బెల్లంపల్లిరూరల్: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం తాండూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, బెల్లంపల్లి మండలంలోని కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు, తరగతి గదులు, మూత్రశాలలు, వంటగదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, మంచినీరుతోపాటు ఏవైనా సమస్యలు ఉన్నాయని వి ద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించా లని, ఉత్తమ ఫలితాలు సాధించేలా మెరుగైన విద్యాబోధన చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం లోపించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాండూర్లో ఇంటర్మీడియట్ కళాశాల భవనంపై అదనపు గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాండూర్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ మల్లేశం, కేజీబీవీ ప్రత్యేక అధికారి కవిత, బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, ఎంఈవో జాడి పోచయ్య, గురుకుల పాఠశాల, కేజీబీవీ ప్రధానోపాధ్యాయులు సత్తయ్య, రజిత, ఏఈఈ వినయ్ పాల్గొన్నారు. వెంకట్రావుపేటలో బర్డ్వాక్ లక్సెట్టిపేట: లక్సెట్టిపేట అటవీ రేంజ్ వెంకట్రావుటపేట చెరువు వద్ద శుక్రవారం అటవీ అధికారులు బర్డ్వాక్ చేశారు. మహారాష్ట్రలోని యావత్మాల్ వైల్డ్లైఫ్ వార్డెన్ రంజాన్ ఇరాని పాల్గొన్నారు. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, ఎరోసియన్ కూట్, విజిటింగ్ డక్స్లు కనిపించినట్లు రేంజ్ అధికారి అత్తె శుభాష్ తెలిపారు. పక్షులను పర్యవేక్షించి వాటి వివరాలు సేకరిస్తే అవగాహన పెరుగుతుందని వైల్డ్లైఫ్ వార్డెన్ సిబ్బందికి సూచించారు. ఈ ప్రాంతంలో అనేక రకాల పక్షులున్నాయని, వాటిని గుర్తించి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సెక్షన్ అధికారు అల్తాఫ్ హుస్సెన్, బీట్ అధికారులు చంద్రశేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఏసీపీ తండ్రి మృతి
● ప్రమాద స్థలాన్ని సందర్శించి కంటతడి ● అతివేగం, అజాగ్రత్తతో గతంలోనూ ఘటనలుమంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల వద్ద రహదారిపై శుక్రవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తండ్రి గజ్జి ఐలయ్య(64)గా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. జైపూర్ మండలం రసూల్పల్లి గ్రామంలో సింగరేణి రిటైర్డు ఉద్యోగి గజ్జి ఐలయ్య నివాసం ఉంటున్నాడు. ఈయన కుమారుడు గజ్జి కృష్ణ పెద్దపల్లి ఏసీపీగా పని చేస్తున్నారు. ఐలయ్య శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనం మీద హాజీపూర్ వెళ్లి తిరిగి మంచిర్యాలకు వస్తున్నాడు. పాతమంచిర్యాల వద్దకు రాగానే వెనుకాల నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ అతివేగంగా ఐలయ్య ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కిందపడిన ఐలయ్య తలపై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ కృష్ణ, స్థానిక డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోదర్రావు పరిశీలించారు. తండ్రి మృతదేహాన్ని చూసి కృష్ణ బోరున విలపించారు. ఐలయ్యకు భార్య కొమురవ్వ, కూతురు సమ్మక్క, కుమారుడు కృష్ణ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కాగా, జిల్లా కేంద్రంలో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు మద్యంమత్తులో నడుపుతున్నారని, కొందరికి డ్రైవింగ్ లైసెన్స్లు కూడా లేవని పలువురు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మే 15న హాజీపూర్ మండలం ముల్కల్ల వద్ద గుడిపేటకు చెందిన పాల వ్యాపారి బయ్య మధూకర్(31) ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. -
అదనపు కలెక్టర్ ఆకస్మిక పర్యటన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించగా.. తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, సిబ్బంది స్వాగతం పలికారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదానికి సూచనలు అందించారు. వీలైనంత త్వరగా పరిశీలించి పై అధికారులకు నివేదించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు. గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ అండర్ టన్నెల్లోకి వెళ్లి పనితీరును పరిశీలించారు. నాయబ్ తహసీల్దార్ అతీశ్, సీనియర్ అసిస్టెంట్ రంజిత్, గిర్దావర్లు ప్రభు, మంగ పాల్గొన్నారు. -
బాసరలో మాస్టర్ ప్లాన్ అమలు
● త్వరలోనే పరిశీలన, ఆలయ అభివృద్ధి ● వైఎస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ● ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● బాసరలో ప్రత్యేక పూజలుబాసర: అనేక సంవత్సరాలుగా బాసర ఆలయానికి సంబంధించిన మాస్టర్ప్లాన్ పెండింగ్లో ఉందని, త్వరలోనే పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలు, బ్రాహ్మణోత్తముల ద్వారా మాస్టర్ప్లాన్ అమలు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించా రు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయాన్ని శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా సందర్శించి అ మ్మవారిని దర్శించుకున్నారు. మొదటిసారి ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ వైదిక బృందం సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు ప్రవీణ్పాఠక్ అమ్మవారి హారతి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మంత్రి శ్రీధర్బాబు విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. తన సోదరి, కుటుంబ సభ్యులతో సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాసరలో చ దువుల తల్లి ఉంది కాబట్టే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఆల య అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని తెలిపారు. ప్రత్యేకంగా మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి వివేక్ను బాసరకు పంపించిందని తెలిపారు. మంత్రి శ్రీధర్బాబును క లెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాశ్కుమార్ కలిశారు. ట్రిపుల్ ఐటీ వసతి గృహంలో కలెక్టర్ అభిలాష అభినవ్తో జిల్లా అభివృద్ధిపై మంత్రి చర్చించారు. పలు సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. శాంతిభద్రతల గురించి ఎస్పీ షర్మిలను ఆరా తీశారు. వీరి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ మండలాధ్యక్షుడు మమ్మాయి రమేశ్ తదితరులున్నారు. -
‘సీతాకోక’ల గుర్తింపుపై అవగాహన
చెన్నూర్రూరల్: చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో ని కిష్టంపేట సమీపాన అంబేడ్కర్ అర్బన్ పార్క్లో శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికారి శివ అశీ ష్సింగ్, శాస్త్రవేత్త డాక్టర్ రంజాన్ విరాణి సీతాకోక చిలుకల గుర్తింపుపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పార్క్ ఏరియాలో81 జాతుల సీ తాకోకలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో అ రుదైన మంకీ ఫజిల్ అనే సీతాకోక చిలుకను క వ్వాల్ అభయారణ్యం ఏరియాలో మొదటిసారి గా గుర్తించినట్లు పేర్కొన్నారు. చెన్నూర్ డివిజన్ అధికారి కే సర్వేశ్వర్, చెన్నూర్, కోటపల్లి, నీల్వా యి అటవీరేంజ్ అధికారులు ఎం.సదానందం, హఫీజొద్దీన్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్, సెక్షన్ అధికారులు అంజయ్య, సతీశ్, రాజేశ్, జావిద్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6వేలు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. హామీలు అమలుపర్చకుంటే ఆగస్టు 13న పింఛన్దారులతో చలో హైదరాబాద్ మహాగర్జన చేపడుతామని అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్, జిల్లా ఇంచార్జి పెద్దపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు అప్పారావు, మందమర్రి, లక్సెట్టిపేట మండలా అధ్యక్షులు రమేష్, దేవి ప్రకాష్ పాల్గొన్నారు. మహారాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్గా అర్జున్రెడ్డి మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని హైటెక్సిటీ కాలనీకి చెందిన అలుగువెల్లి తిరుపతిరెడ్డి, ప్రేమలత దంపతుల మనవడు అర్జున్రెడ్డి మహారాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను సాధించాడు. వీరు నాందేడ్లో స్థిరపడగా, బ్యాడ్మింటన్లో రాణిస్తూ ఇప్పటికే పలు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయిలో చాంపియన్గా నిలవడంపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అండర్–19 విభాగంలో అర్జున్రెడ్డి(16) వచ్చే సెప్టెంబర్లో జరిగే జోనల్స్లో పాల్గొంటారని కోచ్ భాస్కర్బాబు తెలిపారు. -
జిమ్లో డ్రగ్స్, స్టైరెడ్
ఆదిలాబాద్టౌన్: చట్టవిరుద్ధంగా డ్రగ్స్, స్టైరెడ్ విని యోగిస్తున్న ఆదిలాబాద్లోని ఓ జిమ్పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఆ జిమ్కు వచ్చేవారికి స్టె రైడ్, డ్రగ్స్ అందజేస్తున్నట్లు తెలియడంతో వన్టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఆర్డీ వో ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖల అ ధికారులతో కలిసి పట్టణంలోని వినాయక్ చౌక్లో గల లయన్ జిమ్ వద్దకు శుక్రవారం చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి 20 ఎంఎల్ ఏఎంపీ ఇంజక్షన్ బాటి ల్, 3 ఖాళీ ఇంజక్షన్లు, 36 స్టైరెడ్ ట్యాబ్లెట్లు, అలాగే సర్జరీకి వాడే మరో మూడు డ్రగ్స్ ఇంజక్షన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. అలాగే జిమ్ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిమ్ నిర్వాహకుడు షేక్ ఆదిల్ చట్టవ్యతిరేక డ్రగ్స్ తీసుకుంటున్న ట్లు పేర్కొన్నారు. అలాగే జిమ్కు వచ్చేవారికి కూడా ఇస్తూ అనారోగ్యం బారిన పడేలా వ్యవహరించిన అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ సంపతి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిమ్కు వస్తున్న వారికి అందజేత దాడి చేసి స్వాధీనపరుచుకున్న పోలీసులు -
ఇటీవల ఓ వ్యక్తి తన తండ్రి చనిపోతే పట్టా మార్పిడి విరాసత్ కోసం రూ.10వేలు రెవెన్యూ అధికారులకు సమర్పించుకున్నాడు. కార్యాలయంలోనే నేరుగా నగదు ఇవ్వబోతే..‘భలే ఉన్నారు మీరు.. ఆఫీసులో సీసీ కెమెరా ఉంది. ఇదంతా బయటనే..’ అంటూ డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అధిక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో కొందరు అధికారుల తీరు డబ్బులిస్తేనే పని చేస్తామన్నట్లుగా మారింది. మరికొందరు నిజాయతీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు సర్కారు జీతంతోపాటు అవినీతికి మరిగి జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో పోలీసు శాఖలో ఓ ఎస్సై, రెవెన్యూ మండల సర్వేయర్ పట్టుబడగా.. తాజాగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు లేబర్ ఆఫీసర్లు రూ.లక్షలు లంచం డిమాండ్ చేసి చివరకు రూ.వేలల్లో బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులకు చిక్కారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్న ఆయా శాఖల్లో ఈ తంతు అధికంగా ఉంటోంది. వసతిగృహాల్లో విద్యార్థులకు అందే భోజనం నుంచి రూ.కోట్ల అభివృద్ధి పనులు వరకూ లంచాల పర్వం సాగుతోంది. విద్యుత్ శాఖలోనూ పనుల కోసం వసూళ్లు జరుగుతున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో సహా పట్టణాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోంది. నేరుగా ‘సాక్షి’ కెమెరాకు చిక్కి.. గత నెలలో సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్లోనే ఉన్న కార్మిక శాఖ కార్యాలయ సిబ్బంది ఒకరు డబ్బులు వసూలు చేస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు. కార్యాలయం పక్కనే ఉన్న బాత్రూంలో కార్మిక కుటుంబానికి చెందిన ఓ యువకుడి నుంచి నగదు తీసుకుంటూ కనిపించారు. ఫొటోలు తీస్తుండగానే తాము డబ్బులు తీసుకోలేదని తాజాగా పట్టుబడిన అధికారే బుకాయించారు. నిరుపేద కార్మికుల కుటుంబాల నుంచీ డబ్బులకు తెగబడ్డారంటే ఆ శాఖలో కక్కుర్తి అర్థమవుతోంది. ● అప్పట్లో ఓ ఉన్నతాధికారి నేరుగా తన చాంబర్లో టేబుల్ డ్రా ఓపెన్ చేసి పెట్టేవారు. ఆ డ్రాలో రూ.వేల కొద్దీ డబ్బులు వేసి వచ్చేవాళ్లు. ఆయన చాంబర్లో సీసీ కెమెరా లేకపోవడం ఆయన అదృష్టం. ప్రస్తుతం జిల్లాలో ఆ అధికారి లేరు. ● పౌరసరఫరాల శాఖలో కొంతమంది అధికారులకు బియ్యం వ్యాపారుల నుంచి నెల నెలా మామూళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్లపై 6ఏ కేసు నమోదైతే విచారణ నుంచి మొదలు కేసు పూర్తయ్యే దాకా ఆ రేషన్ డీలరుకు పైస ఖర్చు కావాల్సిందే. దొడ్డు బియ్యం సమయంలో ఈ దందా అధికంగా ఉండేది. రైస్మిల్లు తనిఖీలు, సీఎంఆర్ అనుమతి, రికవరీ తదితర వాటిల్లోనూ వసూళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ● రవాణా శాఖలో లైసెన్స్ నుంచి రిజిస్ట్రేషన్, పర్మిట్లు, ఇతర ఏ సేవకై నా మధ్యవర్తులతో వెళ్తేనే పని అవుతోంది. నేరుగా వెళ్తే అధికారులు, సిబ్బంది అర్జీదారుడిపై చిరాకు పడుతూ పని చేసేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. దీంతో మధ్యవర్తులతో వాస్తవ ఫీజుల కంటే అధికంగా ఇస్తే సులువుగా పనవుతుందనే భావన ఉంది. ● జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్న మంచిర్యాల, లక్సెట్టిపేటలో దళారులు, మధ్యవర్తుల హవానే నడుస్తోంది. ఇటీవల ఒకరు తమ భూమి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ ఏసీబీని ఆశ్రయించారంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఆ రోజు ఉదయమంతా అప్రమత్తంగా ఉన్నారు. ● తహసీల్దార్ ఆఫీసుల్లోనూ అక్రమాలు ఆగడం లేదు. నెన్నెలలో ఓ తహసీల్దార్ పైసల ఆశకు బతికున్నా చనిపోయినట్లు సృష్టించి పట్టా మార్పిడి చేసి సస్పెండైన విషయం తెలిసిందే. ఇక గుంటల చొప్పున ఓపెన్ ప్లాట్లు వ్యవసాయ రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెబుతున్నా ఓ మండలంలో తహసీల్దార్ ఒక్కో రిజిస్ట్రేషన్కు రేట్ ఫిక్స్ చేసుకున్నారు. నేరుగా తనే రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అన్ని మండలాల నుంచి ఒకటో రెండో జరుగుతున్నా ఆ మండలం నుంచి మాత్రం పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకునే పై అధికారే లేరంటే ఆశ్చర్యం కలగమానదు. ● అభివృద్ధి, సంక్షేమ పనులు చేస్తున్న చాలామంది కాంట్రాక్టర్ల బిల్లుల్లో పర్సంటేజ్ ఇవ్వకపోతే అధికారులు మంజూరులో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎక్కడ అందాల్సినవి ఆ స్థాయిలో ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగాలతోపాటు బిల్లులు చెల్లించే ట్రెజరీలోనూ ఈ తంతు నడుస్తోంది.వసూళ్లకు ప్రత్యేక సిబ్బంది!బెల్లంపల్లి: బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారి(ఏఎల్ఓ) కార్యాలయం అవినీతిమయంగా మారింది. ఏ చిన్న పని జరగాలన్నా లంచం ముట్టజెప్పాల్సి వస్తోంది. ఏకంగా ఇక్కడ వసూళ్లకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం గమనార్హం. శుక్రవారం ఏసీబీకి చిక్కిన బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారి పాక సుకన్య డబ్బుల వసూలుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి మోకెనపల్లి రాజేశ్వరి అనే మహిళను అసిస్టెంట్గా నియమించుకుంది. ఆమెతోపాటు మరో ఇద్దరు ముగ్గురు అనధికారికంగా అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారా లంచాలు తీసుకుంటున్నట్లు ప్రచారంలో ఉంది. అడిగినంత డబ్బు ముట్టనిదే ఏ పనీ చేయరనే ఆరోపణలున్నాయి. లేబర్కార్డు రెన్యూవల్ కావాలన్నా.. అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. ఇందుకు కార్మికులు కార్మిక శాఖ నుంచి లేబర్కార్డు పొందాల్సి ఉంటుంది. ఆ కార్డు ప్రాతిపదికనే లబ్ధి చేకూరుతుంది. ఈ కార్డు రెన్యూవల్ చేసుకోవాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిందేననే ఆరోపణలున్నాయి. కార్మికుల కూతురు పెళ్లి, ప్రసవానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. ఇందులోనూ వాటా వసూలు చేస్తారని తెలుస్తోంది. ప్రమాదవశాత్తు, సహజ మరణాలకు అందే పరిహారంలోనూ లంచం ఇవ్వాల్సిందేనే చర్చ జరుగుతోంది. తాజాగా నరాల శంకర్ అనే కార్మికుడు చనిపోతే పరిహారం మంజూరు చేసే ఫైల్ అప్రూవల్కు రూ.40వేలు డిమాండ్ చేసి తన అసిస్టెంట్ ద్వారా రూ.30వేలు తీసుకుని సుకన్య ఏసీబీ అధికారులకు చిక్కారు.నేరుగా ఫిర్యాదు చేయండిఉమ్మడి జిల్లా ఏసీబీ కార్యాలయం నస్పూర్లోనే ఏర్పాటు కావడంతో ఎవరైనా అధికారి లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లంచావతారులు జైలు పాలయ్యారు. జిల్లాలో అవినీతికి పాల్పడే అధికారుల ఆట కట్టించాలంటే ఏసీబీ అధికారుల వాట్సాప్ నంబరు 9440446106, టోల్ఫ్రీ 1064కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఎవరి స్థాయిలో వారు వసూళ్ల పర్వం అవినీతికి మరిగిన కొందరు అధికారులు విధుల నిర్వహణకూ డబ్బులివ్వాల్సిందేనా..? ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న అవినీతిపరులుఏసీబీకి పట్టుబడిన లేబర్ ఆఫీసర్ కాటం రామ్మోహన్సాక్షిలో ప్రచురితమైన కథనాలు -
చాతాలో వృద్ధుడి దారుణ హత్య
● గొంతుకోసి హతమార్చిన దుండగులు ● డాగ్స్క్వాడ్తో గాలిస్తున్న పోలీసులు కుభీర్: మండలంలోని చాతా గ్రామంలో గురువారం రాత్రి తాళ్లపల్లి బలరాంగౌడ్ (70)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్యచేశారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్ర కారం. బలరాంగౌడ్ కొడుకు, కోడలు గురువారం మధ్యాహ్నం తన చిన్నకూతురు ఇంటికి వేములవా డకు వెళ్లారు. బలరాంగౌడ్ దినమంతా తెల్లకల్లు దు కాణం నడిపాడు. రాత్రి 10వరకు గురుబోధ భజన పాటలు పాడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వా త గ్రామ చివరలోని తనింట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్యచేసి వెళ్లారు. ఉద యం కొందరు తెల్లకల్లు కోసం బలరాంగౌడ్ ఇంటికి చేరుకున్నారు. అతడిని పిలువగా బయటికి రాకపోవడంతో తలుపు తీసి లోనికి వెళ్లి చూడగా రక్తం మడుగులో అతడి మృతదేహం కనిపించింది. వారు వెంటనే మృతుడి కుటుంబీకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏఎస్పీ అవినాష్, సీఐ నైలు, ఎస్సై కృష్ణారెడ్డి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. భక్తిభావం కలిగి అందరితో కలివిడిగా ఉండే గంగారాంగౌడ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లున్నారు. మృతుడి కొడుకు రమేశ్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రపంచ మహాసభల్లో జన్నారం మండలవాసి
జన్నారం: అమెరికాలోని ఫ్లోరిడా అరెంజ్ కౌంటి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రపంచ ల యన్స్క్లబ్ మహాసభల్లో మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన లయన్స్ జెడీసీ ఏను గు శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ 107వ వార్షికో త్సవం సందర్భంగా అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించిన మహాసభలకు ప్రపంచ నలు మూలల నుంచి 20 వేల మంది హాజరైనట్లు శ్రీ కాంత్రెడ్డి తెలిపారు. ఇందులో తెలంగాణ రా ష్ట్రం నుంచి తనకు అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తనకు అందులో ప్రసంగించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. -
ట్రిపుల్ఐటీలో ముగిసిన రెండోవిడత కౌన్సెలింగ్
బాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్నగర్ కేంద్రాల్లో రెండోవిడత కౌన్సెలింగ్ ముగిసింది. 218 సీట్ల గాను 178 మంది హాజరయ్యారు. పీహెచ్సీ, క్యాప్ కోటా విద్యార్థుల కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గ్లోబల్ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ పర్యవేక్షించారు. కన్వీనర్, కో కన్వీనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో యువ వేదికవీ హబ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సేల్ ఆర్జీయూకేటీ సమన్వయంతో బాసర ట్రిపుల్ఐటీలో శుక్రవా రం యువవేదిక నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ గో వర్ధన్ మాట్లాడుతూ.. యువవేదిక గ్రామీణ విద్యార్థులకు జాతీయస్థాయికి నడిపించే ఆవిష్కరణ వేదిక అని పేర్కొన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ ‘ఇది మెంటార్షిప్, స్టార్టప్ మద్దతుకు ఉత్తమ ప్రారంభం’ అని తెలిపారు. వీ హబ్ ప్రతినిధులు జాహిద్ అక్తర్షేక్, ఉహా సజ్జా, తజ్దార్ అలీ తజ్, రేఖా మేఘన, సౌమ్యశ్రీ విద్యార్థులకు ప్రేరణ కలిగించే సెషన్లు, డిజైన్ థింకింగ్ వర్క్షాప్లు నిర్వహించారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రాకేశ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 300కిపైగా విద్యార్థులు ఆవిష్కరణ, నాయకత్వం, వ్యవస్థాపకతలో ప్రాథమిక అవగాహన పొందారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
నిర్మల్టౌన్: జిల్లా కేంద్రం శివారులోని కొండాపూర్ వద్ద గల నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీలకు వేదికగా నిలిచింది. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17న ప్రారంభమైన పోటీలు 20వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. అండర్–19 బాలురు, బాలికలకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించారు. శుక్రవారం నుంచి ఈనెల 20వరకు మె యిన్ డ్రా పోటీలు కొనసాగనున్నాయి. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నుంచి 10మంది అంపై ర్లు, ఒక రిఫరీ, ఒక మ్యాచ్ కంట్రోలర్ హాజరయ్యా రు. జిల్లా క్రీడలశాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మంచి ర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిశోర్, కో కన్వీనర్ వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేశ్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. కాగా, రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నా యి. శుక్రవారం ప్రారంభమైన మెయిన్ డ్రా పోటీల కు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మ హేశ్వర్రెడ్డి, ఎంపీ గోడం నగేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్, సీనియర్ నాయకులు సత్యనారాయణగౌడ్, రావుల రాంనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరయ్యారు. -
కేకే–ఓసీలో విలువైన కేబుల్ చోరీ
మందమర్రిరూరల్: మందమర్రి ఏరి యాలోని కేకే–ఓసీ లో సుమారు రూ.60వేల విలు వైన 80 నుంచి 90 మీటర్ల ఫ్లెక్సెబుల్ వైర్ దొంగలు ఎత్తుకెళ్లారు. ఓసీలో పంపు వద్ద వినియోగించడానికి సిద్ధంగా ఉంచిన కేబుల్ను కట్ చేసి అక్కడే పైకవర్ తొలిచి తీసుకెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ నిర్లక్ష్యంతోనే చోరీ జరినట్లు తెలుస్తోంది. దొంగలు కేబుల్ను తొలిచి ఎత్తుకెళ్లే వరకూ సెక్యూరిటీకి కనిపించకపోవడం విడ్డూరం. ఈ విషయమై ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ నగునూరి రవిని సంప్రదించగా, కేబుల్ చోరీకి గురైంది నిజమేనని తెలిపారు. దీనిపై పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేసినట్లు పేర్కొన్నారు. మందమర్రిలో భారీ చోరీ మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధి బురుదగూడెంలోని సింగరేణి ఉద్యోగి దుర్గం రాజ్కుమార్ ఇంట్లో భారీ చోరీ జరి గింది. సీఐ శశిధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమా ర్ తన భార్య, తలిదండ్రులతో బుధవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఊరికెళ్లారు. శుక్రవారం ఉదయం బురుదగూడెంలోని ఇంటికి వ చ్చి చూడగా ముందు గేటు, ఇంట్లోని బీరువా తెరిచి ఉంది. బీరువాలో దాచి ఉంచిన ఆరు తు లాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించారు. వెంటనే పోలీ సులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఫింగర్ ప్రింట్ నిపుణులు, డాగ్ స్క్వా డ్, క్లూస్ టీంను రప్పించి సేకరించిన ఆధారాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల ఆచూకీ తెలుసుకునే ప్రక్రియ వేగవంతం చేసినట్లు సీఐ తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
నానోనే నయం
● ద్రవరూప యూరియాతో పైరుకు మేలు ● సాగు ఖర్చు తగ్గి.. పెరగనున్న దిగుబడి ● విరివిగా ప్రచారం చేస్తున్న అధికారులు ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వంనిర్మల్చైన్గేట్: ఖరీఫ్ సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. వివిధ పంటల్లో దశలవారీగా ఉపయోగించే యూరియా కొరత రైతులను వేధిస్తోంది. అవసరానికి సరిపడా కోటా రాకపోవడం, వచ్చినా కొన్నిచోట్ల డీలర్లు మాయాజాలం ప్రదర్శిస్తుండడం.. ఇంకొన్ని చోట్ల భవిష్యత్లో కొరత వస్తుందని రైతులు ముందుగా కొనుగోలుకు సిద్ధమవుతుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు గుళికల యూరియాకు బదులు నానో (ద్రవరూపం) యూరియా వాడాలని చెబుతూనే దీ నితో కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖర్చు తగ్గడమే కాకుండా ఫలితం బా గుంటుందని, రవాణా సులువవుతుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానో యూరియా వాడకానికి ముందుకువస్తున్నారు. అయితే, అధికారులు మరింత విస్తృత ప్రచారం చేస్తే అధికసంఖ్యలో రైతులు నానో యూరియా వైపే మొగ్గుచూపే అవకాశముంది. గుళికల యూరియా కంటే ధర తక్కువే.. నానో యూరియా ఒక్క బాటిల్ (500 మి.లీ).. 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని చెబుతున్నారు. 45కిలోల యూరియా బస్తా ధర రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.225కే లభిస్తుంది. నత్రజనిని అందించే ఈ ఎ రువు ద్వారా మొక్కల్లో పచ్చదనం, చురుకైన పెరుగుదల నమోదవుతుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు నత్రజనిని అందించేలా రైతులు గుళికల యూరియాను 2–3 సార్లు పైపాటుగా వేస్తున్నారు. ఇందులో నత్రజనిని 30–50 శాత మే పంట వినియోగించుకుంటోంది. మిగతాదంతా వృథా అవుతోంది. లేదా నేల, గాలి, నీటిని కలుషి తం చేస్తోంది. అదే నానో ఎరువు వాడకంతో ఇలాంటివేవీ జరగవు. బహుళ ప్రయోజనకారిగా.. నానో యూరియా కణాలు చిన్నవిగా ఉండడంతో పంటకు 80 శాతం కన్నా ఎక్కువగా చేరుతుంది. మొక్కలకు నత్రజని అవసరాన్ని సమర్ధవంతంగా తీరుస్తూ ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది. వేర్లలో కణజాలం వృద్ధికి ఉపయోగపడుతుంది. సంప్రదా య యూరియాతో పోలిస్తే 50 శాతం, అంతకంటే తక్కువే అవసరమవుతుండడంతో రైతులకు ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా గుళికల యూరియా బస్తాల రవాణా భారం తగ్గుతుంది. 500 మి.లీ నా నో యూరియా బాటిల్ సులభంగా ఎక్కడికై నా తీ సుకెళ్లవచ్చని అధికారులు అవగాహన కల్పిస్తున్నా రు. ఇది లీటర్ నీటికి 2–4 మి.లీ. కలిపి పంట చు రుకైన ఎదుగుదల దశలో ఆకులపై పిచికారీ చే యా లి. ఎకరాకు లీటర్ నానో యూరియా సరిపోనుండగా, పంట వేసిన 20–25 రోజుల్లో ఓసారి, 20–25 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ యూరియా ద్రవరూపంలో ఉండడంతో ఆకులపై పిచికారీ చేసినప్పుడు రంధ్రాల ద్వారా సు లభంగా లోనికి వెళ్తూ మొక్క అన్ని భాగాలకు చేరుకుంటుంది. అవసరం మేరకు మొక్కలు పీల్చుకున్నాక మిగతాది మొక్కల ఇతర భాగాల్లో నిల్వ చే యబడి అవసరమైనప్పుడు విడుదలవుతుంది. అవగాహన కల్పించాలి ఇన్నాళ్లుగా పంటలకు గుళికల రూపంలో ఉన్న యూరియా వాడుతున్నాం. ఒక్కోసారి యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నాం. గుళికల యూరియా కు బదులు ద్రవరూపంలో ఉన్న నానో యూరియా వాడాలని అధికారులు చెబుతున్నారు. కానీ.. అది పంటలకు ఎలా ఉపయోగపడుతుందో రైతులకు పంట చేన్ల వద్ద వివరిస్తే అర్థమవుతుంది. – సాయన్న, పెంచికల్పహాడ్, కుంటాల మండలం దిగుబడి పెరుగుతుంది గుళికల ఎరువు కంటే నానో ఎరువులు చాలా మేలైనవి. వరి నాటుకు ముందుగా ఒకసారే నానో డీఏపీని పొలంలో పిచికారీ చేయాలి. అలాగే నానో యూరియాను లీటర్ నీటికి 2మి.లీ. లేదా 4మి.లీ. చొప్పున కలిపి మొదట పంట పెరుగుదల దశలో, తర్వాత నెలలోపు పూత దశలో పిచికారీ చేయాలి. దీంతో సుమారు 8శాతం పంట దిగుబడి పెరుగుతుంది. – నాగరాజు, ఏవో, నిర్మల్ -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసారూరల్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ కష్టపడకుండా డబ్బు సంపాదించాల న్న ఆలోచనతో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం భైంసారూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సైలు శంకర్, సుప్రియ వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకా రం.. ఈనెల 15న హజ్గుల్ ఎక్స్ రోడ్డుకు కొద్ది దూ రంలో ఇద్దరు వ్యక్తులు కారులో సెల్ఫోన్లు చూస్తు కూర్చున్నారు. భైంసాలో నివాసముంటున్న మహా రాష్ట్ర వాసి దతురి వినోద్, ఆదిలాబాద్కు చెందిన సిందే దినేశ్ వీరి వద్దకు వెళ్లారు. వీరిద్దరు ఎలాంటి సంపాదనలేకుండా జులాయిగా తిరుగుతున్నారు. కారులో ఉన్న ఇద్దరిని చంపేస్తామని భయపెట్టి బీ రు బాటిల్తో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద ఉన్న రూ.10వేల నగదు, రెండు సెల్ఫోన్లు ఎత్తుకువెళ్లారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లి తక్కువ ధరకు గంజాయి కొని ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే అధిక డబ్బులు వస్తాయని నిర్ధారించుకున్నారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి గురువారం పార్డి(బీ) బైపాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. వీరి వద్ద 1,070 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భైంసా ఏఎస్పీ అవినాశ్కుమార్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నైలు, ఎస్సైలు శంకర్, సుప్రియ, సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. ఏఎస్సై మారుతి, పోలీసులు ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
భీమిని: గ్రామాల్లో సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డి ప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ ఆదేశించారు. గురువా రం మండల కేంద్రంలో భీమిని, కన్నెపల్లి మండలాల వైద్య సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికున్గున్యా వ్యాపించే అవకాశం ఉందని, ఈ వ్యాధులు రావడానికి దోమలే కారణమని, దోమలు విజృంభించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్కుమార్ సీఎచ్వోలు వెంకటేశ్వర్లు, జలపతి, సుపర్వైజర్ ఇందిరా, హెల్త్ అసిస్టెంట్ ఉమశంకర్, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీసీలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు నిండలే..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వానాకాలం మొదలై నెల దాటుతున్నా ఆశించిన మేర వానలు కురవడం లేదు. ఈ సీజన్లో సకాలంలో వర్షాలు పడకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులకు సరిపడా నీరు రావడం లేదు. ఇటీవలే రాష్ట్ర స్థాయి సాగునీటి శాఖ అధికారులు ఆయా ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టును ప్రకటించారు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులకు ఇంకా నీరు వచ్చాక మరోసారి సమీక్ష చేశాకే ఆయకట్టు ప్రతిపాదించేలా నిర్ణయం తీసుకున్నారు. గోదావరి బేసిన్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఈ నెల చివరి వరకు వేచి చూడనున్నారు. గత ఏడాది ఇదే సమయానికి చెరువులు, కుంటల్లో నీళ్లు మత్తడి దూకాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఉంది. ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో జిల్లాలో వరినారు సైతం కాస్త ఆలస్యంగా పోయడంతో వచ్చే నెలలోనూ నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అధికారులు సాగు నెల రోజుల రోజుల ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నప్పటికీ వర్షాభావ పరిస్థితులతో ఆరుతడి పంటలైన పత్తి వేసిన రైతులకే కాస్త ఊరట కలుగుతోంది. రోజుల తరబడి వర్షాలు కురవకపోయినా ఆరుతడి పంటలకూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.50శాతం లోటు వర్షపాతంజిల్లాలో ఈ నెల 17నాటికి సాధారణ వర్షపాతం 327మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 164.3మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతం కన్నా 50శాతం లోటు నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడం లేదు. సాగునీరు రాక వానాకాలంలోనూ ఆయకట్టుకు భరోసా దక్కడం లేదు. మరోవైపు ర్యాలీవాగు, నీల్వాయి ప్రాజెక్టులు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించడం లేదు. ర్యాలీవాగులో సగం వరకు పూడికతో నిండిపోయి ఉంది. నీల్వాయి ప్రాజెక్టు కాలువ పనులు సిద్ధం కాకపోవడంతో ఆయకట్టు తగ్గించాల్సి వస్తోంది. ఇక జిల్లాలో మొత్తం 634 చెరువులు ఉండగా వీటితో చాలా చెరువుల్లో పావుశాతం వరకు నిండాయి. మరోవైపు చెరువులు, కుంటలు నిండకపోవడంతో మత్స్యకారులు సైతం చేపపిల్లల విత్తనాలు విడుదలపైనా సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కాకుండా ప్రైవేటుగా కొనుగోలు చేసి పెంచుకుని ఉపాధి పొందే వందలాది మంది మత్స్యకారులు సైతం వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.జిల్లాలో చెరువులుచెరువులు, నిండిన శాతం589, 0–2537, 25–507, 50–701, 75–100 -
ఎరువులు పంపిణీ చేయాలని ధర్నా
కోటపల్లి: రైతులకు సరిపడా ఎరువుల బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కోటపల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేష్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఆధార్కార్డులు, చెప్పులు వరుసలో ఉంచి నాలుగైదు రోజులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. సకాలంలో ఎరువులు ఇవ్వలేని మంత్రి వివేక్ రాజీనామా చేయాలని అన్నారు. ఎస్సై రాజేందర్ ఆందోళనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సాంబగౌడ్, యూత్ అధ్యక్షుడు విద్యాసాగర్, మాజీ జెడ్పీటీసీ తిరుపతి, మాజీ ఎంపీపీ బాపు, మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ కౌన్సిలర్ రెవెల్లి మహేశ్, నాయకులు స్వామి, భారతి, చిరంజీవి, నాయబ్, సంపత్ పాల్గొన్నారు. -
మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● భీమారంలో వనమహోత్సవంభీమారం: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు పాటు పడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజలను కోరారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ తగ్గిన అడవుల స్థానంలో తిరిగి మొక్కలు నాటితే అవి భవిష్యత్లో దట్టమైన అడవులుగా మారుతాయని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల గదిని పరిశీలించి అందులో బెడ్స్పై ట్రంక్బాక్స్లు పెట్టారని, విద్యార్థులు ఎలా పడుకుంటారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. స్టాఫ్రూం, హెడ్మాస్టర్ రూం ఒకే దానిలో నిర్వహించి ఆ గది విద్యార్థులకు కేటాయించాలని ఆదేశించారు. గది మరమ్మతుకు వ్యయంపై అంచనాలు పంపించాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ విద్యాసాగర్ను ఆదేశించారు. డీఆర్డీవో కిషన్, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు ఆరోగ్యశ్రీలో అనాథ పిల్లలకు రక్షణ మంచిర్యాలఅగ్రికల్చర్: అనాథ పిల్లల రక్షణ, ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్ జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్, బాలల సంరక్షణ సమితి అధికారి ఆనంద్తో కలిసి అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. జిల్లాలోని ఆరు బాలల సంరక్షణ కేంద్రాల్లోని 85మంది అనాథ పిల్ల లకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ కర్త డాక్టర్ రాధిక పాల్గొన్నారు. ఒప్పంద పద్ధతిన పోస్టుల భర్తీ మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం పరిధిలోని ఆసుపత్రుల్లో పోస్టులను ఒప్పంద సేవల పద్ధతిన భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 9 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుల(జనరల్ మెడిసిన్ 2, గైనకాలజిస్ట్ 2, అనస్తీషియాలజీ 2, జనరల్ సర్జరీ 1, పిడియాట్రిక్స్ 2) పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు www.mancherial. telangana.gov.inవెబ్సైట్లో సందర్శించాలని తెలిపారు. టాస్క్ ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ మంచిర్యాలఅగ్రికల్చర్: టాస్క్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ ప్రాధాన్యత రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం టాస్క్ కేంద్రంలో ప్రపంచ యూత్ స్కిల్ డే పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. -
పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
నెన్నెల: వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు కార్యదర్శులకు సూచించారు. గురువారం గన్పూర్, గొల్లపల్లి, మైలారం గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. రికార్డులు, పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. గన్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీఓ శ్రీనివాస్, కార్యదర్శులు పద్మనాభం, సాయితేజ, వనిత పాల్గొన్నారు. విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 150మందికి లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, కార్యదర్శి సుధాకర్రెడ్డి, సభ్యులు సుధారాణి, వి.మధుసూదన్రెడ్డి, హన్మంతరావు, గోలి రాము, గుండా శ్రీనివాస్, బాలమోహన్, చందూరి మహేందర్, జ్యోత్స్న, హెచ్ఎం పద్మ పాల్గొన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో వెనుకంజ
● రాష్ట్ర, జాతీయ స్థాయి ర్యాంకుల్లో చెన్నూర్, మంచిర్యాల మెరుగు ● చివరి స్థానంలో క్యాతనపల్లిమంచిర్యాలటౌన్: స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీల్లో జిల్లాలోని ఏడు మున్సిపాల్టీలు వెనుకబడ్డాయి. రాష్ట్ర స్థాయిలో చెన్నూర్, జాతీయ స్థాయిలో మంచిర్యాల కాస్త మెరుగైన ర్యాంకులు సాధించాయి. రాష్ట్ర స్థాయిలో 64వ ర్యాంకుతో చెన్నూర్, జాతీయ స్థాయిలో 445వ ర్యాంకుతో మంచిర్యాల జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాయి. క్యాతనపల్లి రాష్ట్ర స్థాయిలో 136వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 1369వ ర్యాంకుతో జిల్లాలోనూ వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ఏటా ప్రకటిస్తుండగా.. జిల్లాలోని మున్సిపాల్టీలు అంతంత మాత్రంగానే సాధిస్తున్నాయి. స్వచ్ఛత విధానాల అమలులో వెనుకబడుతూనే ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు(ఘన వ్యర్థాల నిర్వహణ), చెత్త ప్రాసెసింగ్, అండర్ డ్రెయినేజీ సిస్టం లేకపోవడం, మురుగునీటి శుద్ధీకరణ, డంపింగ్యార్డులు సక్రమంగా లేకపోవడం, ఉన్నవాటిలో తడి, పొడి చెత్తను వేరుచేయకుండా కలిపేస్తుండడం వంటి కారణాలతో మెరుగైన ర్యాంకులు సాధించలేకపోతున్నాయి. ఏడు మున్సిపాల్టీలు బహిరంగ మలమూత్ర విసర్జన(ఓడీఎఫ్) సాధించగా.. మంచిర్యాల, చెన్నూర్ ఓడీఎఫ్+ పొందాయి. హడావుడి కార్యక్రమాలు.. ఏటా కేంద్ర బృందం మున్సిపాలిటీల్లో పర్యటించి మెరుగైన పారిశుద్ధ్యం అందిస్తున్నాయా లేదా అని పరిశీలిస్తారు. వీటితోపాటు ఓవరాల్గా 7500 మార్కులతో ఆయా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు, ఘన వ్యర్థాల నిర్వహణ, బహిరంగ మల మూత్ర విసర్జన, చెత్త రహిత నగరం, నగర జనాభాకు తగినట్లుగా మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించి మార్కులు వేస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సమయంలో మాత్రమే మున్సిపల్ అధికారులు హడావుడిగా పారిశుద్ధ్యం మెరుగునకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి అమలు చేసేలా చర్యలు తీసుకోలేకపోయారు. ఏడాదంతా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటేనే రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే మంచిర్యాల కొంత మెరుగైంది. గతేడాది రాష్ట్రస్థాయిలో 121వ ర్యాంకు సాధించగా, ఈ ఏడాది 72వ ర్యాంకు దక్కించుకుంది. -
క్రీడాపోటీలు సజావుగా నిర్వహించాలి
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు సజావుగా నిర్వహించాలని డీఈవో యాదయ్య సూచించారు. గురువారం జిల్లా సైన్స్ సెంటర్లో ఎస్జీఎఫ్ సమావేశం నిర్వహించారు. గతేడాది నిర్వహించిన జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోటీలు, క్రీడాకారుల వివరాలు ఎస్జీఎఫ్ సెక్రెటరీ ఫణిరాజా వివరించారు. ఈ సంవత్సరం క్రీడాపోటీల నిర్వహణ వేదికలపై చర్చించారు. డీఈవో యాదయ్య క్రీడాపోటీలపై సలహాలు, సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ మాకొద్దు..!
● కు.ని శస్త్రచికిత్సకు పురుషుల వెనుకంజ ● అవగాహన కల్పిస్తున్నా ముందుకొస్తున్నది కొందరే.. ● జిల్లాలో కుటుంబ నియంత్రణపై అవగాహనమంచిర్యాలటౌన్: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడానికి పురుషులు వెనుకంజ వేస్తున్నారు. పురిటి నొప్పులు భరించి.. ఆపరేషన్ ద్వారా పిల్లలకు జన్మనిస్తున్న తల్లులపైనే మళ్లీ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల భారం మోపుతున్నారు. ప్రతియేటా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 11నుంచి 18వరకు జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్లు, ఇతర మార్గాలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ మహిళలు మాత్రమే ట్యూబెక్టమీ ఆపరేషన్ల(కు.ని)కు ముందుకు వస్తుండగా.. పురుషులు వ్యాసెక్టమీ ఆపరేషన్ల(కు.ని)కు ఆసక్తి చూపడం లేదు. కుటుంబ నియంత్రణ(వ్యాసెక్టమీ) ఆపరేషన్ చేయించుకునే పురుషులు ఐదు నిమిషాల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. పురుషులు వ్యాసెక్టమీ శస్త్రచికిత్స చేయించుకునేలా అవగాహన కల్పిస్తున్నా మహిళలతో పోలిస్తే ఆపరేషన్లు చేయించుకునే పురుషుల సంఖ్య గత నాలుగేళ్లలో 50కి కూడా చేరలేదు. కుటుంబ నియంత్రణలో భాగంగా ఈ ఏడాది ప్రభుత్వం ‘శరీరం మరియు మనస్సు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆపరేషన్ సులభమైనా.. కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో పురుషులకు చేసే వ్యాసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభం. కోత, కుట్టు లేని శస్త్రచికిత్స ఇది. ఐదు నిమిషాల్లోనే పూర్తయ్యే ఈ విధానంలో రక్తస్రావం ఉండదు. ఆపరేషన్ అయిన వెంటనే చిన్న చిన్న పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పురుషులకు గతంలో కు.ని శస్త్రచికిత్స చేయాలంటే తప్పనిసరిగా కోత పెట్టాల్సి వచ్చేది. ఆధునిక విధానమైన నో స్కాల్పల్ వ్యాసెక్టమీ(ఎన్ఎస్వీ) అందుబాటులోకి రావడంతో ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో ఆపరేషన్ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికెళ్లవచ్చు. మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్లో ఎన్నో దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శస్త్రచికిత్స సమయంలో కూడా కడుపు కోత పెట్టాల్సి రావడంతో రక్తస్రావం అయ్యే ప్రమాదముంది. కుట్లు మానడానికి సమయం పడుతుంది. అప్పటికే ఒకట్రెండు కాన్పులు శస్త్రచికిత్స ద్వారా జరిగిన మహిళలకు కు.ని ఆపరేషన్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వారం రోజులు అవగాహన కుటుంబ నియంత్రణకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఆపరేషన్లు, ఇవి కాకుండా తాత్కాలికంగా పిల్లలు జన్మించకుండా చేపట్టే ప్రక్రియను వివరిస్తున్నారు. వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేసేందుకు జిల్లాలో వైద్యులు అందుబాటులో లేకపోవడం కూడా ఆపరేషన్లు తక్కువ నమోదు కావడానికి కారణంగా తెలుస్తోంది. అవగాహన కల్పిస్తున్నాంప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పురుషులకు వ్యాసెక్టమీ శస్త్రచికిత్సలు చేసేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తాం. మహిళల కంటే పురుషులకు చేసే కు.ని ఆపరేషన్ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – డాక్టర్ హరీశ్రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిజిల్లాలో గత ఐదేళ్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలు సంవత్సరం మహిళలు పురుషులు2021–22 760 82 2022–23 2,423 37 2023–24 2,588 37 2024–25 2421 90 2025–26 577 0 -
న్యాయసేవలపై అవగాహన పెంచుకోవాలి
బెల్లంపల్లి: న్యాయ సేవలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె.ముఖేష్ అన్నారు. గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ చైతన్యం, ఉచిత న్యాయసేవల ప్రాముఖ్యత తదితర అంశాలు వివరించారు. అంతకుముందు కళాశాల ఆవరణలోని మూడు వసతిగృహాలు, వసతి గదులు పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు జడ్జిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
నిర్మల్టౌన్: నిర్మల్ పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద ఉన్న నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల నుంచి 180మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించగా.. శుక్రవారం నుంచి ఈ నెల 20వరకు ప్రధాన పోటీలు కొనసాగుతాయి. అండర్–19 బాలురు, బాలికలు, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్, వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్గౌడ్, మహేష్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. శుక్రవారం మెయిన్ డ్రా పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్ట్
జైనథ్ : అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరె స్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బేల మండలానికి చెందిన సుమిత్, అతని మిత్రుడైన సలీం షకిల్తో కలసి మహారాష్ట్రకు చెందిన కృష్ణతో గ్యాంగ్గా ఏర్పడ్డారన్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, బేల, మహారాష్ట్ర కోర్పణ మండలాల్లో బైక్లను అపహరించి ఇతరులకు విక్రయిస్తుండేవారన్నారు. వారి వద్దనుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్కు తరలించామన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోటపల్లి: మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. కోటపల్లి మండలంలోని రాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ సంజయ్ను అదుపులోకి తీసుకుని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించమన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రెండోలీగ్లో ఓడిన ఉమ్మడి జిల్లా జట్టుమంచిర్యాలటౌన్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీఎ స్సార్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో రెండో లీగ్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు సాయి సత్య టీంతో 90 ఓవర్ల చాంపియన్షిప్లో ఓడిపోయింది. ఆదిలాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 30.3 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన సాయిసత్య టీం 24.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టులోని సాయికుమార్ 7 వికెట్లు సాధించడం గమనార్హం. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో, ఇరుజట్లు పరుగులను చేసేందుకు ఇబ్బంది పడ్డాయని కోచ్ ప్రదీప్ తెలిపారు. దివ్యాంగులకు రాయితీపై రైలు ప్రయాణంమంచిర్యాలఅర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వేశాఖ రాయితీపై ప్ర యాణ సౌకర్యం కల్పిస్తోందని సికింద్రాబాద్ డివిజన్ (ఎస్సీఆర్) అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ ఐఎస్ఆర్ మూర్తి అన్నారు. గురువా రం మంచిర్యాల రైల్వేస్టేషన్లో అవగాహన కల్పించారు. మంచిర్యాల కమర్షియల్ ఇన్స్పెక్టర్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి బాలుడు మృతి
దిలావర్పూర్: ప్రమాదవశా త్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెంది న కొప్పుల అశ్విత్ (15) బుధవారం సాయంత్రం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని కుడి చెరువులో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాల కోసం వెళ్లి చెరువులో జారిపడి మృతి చెందినట్లు అశ్విత్ తల్లి కొప్పుల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరు..భైంసాటౌన్: పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మండలంలోని వానల్పాడ్కు చెందిన సిద్దివార్ రమణ (45) పట్టణంలోని కోర్వగల్లిలో నివాసముంటున్నాడు. కుమారుడు రాజుతో కలిసి ఉదయం స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిర్మల్లో కిడ్నాప్ కలకలంనిర్మల్టౌన్: నిర్మల్లో బాలుడి కిడ్నాప్కు యత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ మండలం అనంతపేట్కు చెందిన ఐదేళ్ల బాలుడికి తండ్రి కిరాణా కొట్టువద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. అదే గ్రామానికి వెంట్రుకలు కొనుగోలు చేయడానికి ఆటోలో వచ్చిన ఆరుగురు మహిళలు బాలున్ని ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. బాలుడు ఇంటికి రాకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు అనుమానంతో బంగల్ పేట్ మహాలక్ష్మి వద్ద ఉన్న తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్పటికే ఆ మహిళలు మహాలక్ష్మి కాలనీకి కొద్ది దూరంలో బాలుడిని దించి వెళ్తుండగా పట్టుకుని నిలదీశారు. తమకేం తెలియదని బుకాయించడంతో వారిపై దాడి చేశారు. అనంతరం మహిళలను పోలీసులకు అప్పగించారు. పిచ్చికుక్క స్వైరవిహారంవేమనపల్లి: మండలంలోని జక్కెపల్లిలో గురువారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఏడుగురిపై దాడి చేసి గాయపర్చింది. అల్లాడి అనసూర్య ఎడమచేయి మణికట్టు వద్ద, ఆలం సాంబయ్య కాళ్లకు, చెన్నూరి బక్కు తల వద్ద, శనిగారపు పోశం కాళ్లకు, తలండి శ్రీనివాస్ చేతులను కొరికింది. చెన్నూరి శేఖర్పై పడి కొరికేందుకు ప్రయత్నించగా కర్రతో కొట్టి చంపాడు. జిల్లెడలో కూడా మరో నలుగురిపై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆటో సాయంతో వేమనపల్లి పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కుక్క దాడిలో ఇరువురికి గాయాలుకాగజ్నగర్టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాపువాడకు చెందిన కర్ల కళావతిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరి మేయడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే స్టేషన్కు వెళ్లే మరో ప్రయాణికునిపై కూడా కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్లో కుక్కల బెడద ఉందని ‘సాక్షి’ బుధవారమే కథనాన్ని ప్రచురించింది. అయినా అధికా రులు స్పందించక పోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కుక్కల బెడదను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
సింగరేణిలో ఆర్టీఐకి అడ్డంకులు
● సమాచార అధికారుల నియామకంలో జాప్యం ● నిలిచిన దరఖాస్తుల స్వీకరణ శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్టీఐ దరఖాస్తులకు అడ్డంకి ఏర్పడింది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో అధికారులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్–2005) దరఖాస్తులు స్వీకరించడం లేదు. మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమాచారం కోరే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా పరిధిలో ఈ చట్టం కింద దరఖాస్తులు స్వీకరించాల్సిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అఫీసర్ (ఏపీఐవో) లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పీఐవో గా బాధ్యతలు స్వీకరించిన ఓ డీజీఎం అధికారి ఏ ప్రిల్ 15న అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆతర్వాత ఏపీఐవోగా బాధ్యతలు నిర్వహించిన అధికా రి కూడా గత నెల ఇక్కడి నుంచి ఇతర ఏరియాకు బదిలీ అయ్యాడు. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో ఈ రెండు సీట్లు ఖాళీగానే ఉంటున్నా యి. పీఐవో బాధ్యతలు నిర్వహించే అధికారి మృతి చెందిన తరువాత మరో పూర్తిస్థాయి అధికారిని నియమించే వరకు ఏపీఐవోకు ఇన్చార్జి పీఐవో బాధ్యతలు అప్పగించడానికి అనుమతి కోరుతూ ఏరియా అధికారులు కార్పొరేట్ అధికారులకు లేఖ రాశారు. వారు ఆలస్యంగా స్పందించడంతో ఆలోపే సదరు ఏపీఐవో అధికారి కూడా ఇక్కడి నుంచి వేరే ఏరియాకు బదిలీ అయ్యారు. దీంతో ఈ రెండు బాధ్యతలను చూసేవారు కరువయ్యారు. వెనుదిరిగి పోతున్న దరఖాస్తుదారులు సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకో వడానికి జీఎం కార్యాలయానికి వచ్చిన కార్మికులు, సమాచార చట్టం కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు అక్కడ అధికారులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఆ స్థానాల్లో అధికారులు వచ్చేంత వరకు తమకు ఈ దరఖాస్తులు స్వీకరించే అధికారం లేదని ఇతర అధి కారులు వారికి చెప్పి తిప్పి పంపిస్తున్నారు. దీనికి తోడు ఇది వరకే పీఐవోకు దరఖాస్తు చేసుకున్నాక సరైన సమాచారం, స్పందన లేకపోవడంతో అప్పిలేట్ అఽధికారిగా ఉన్న ఏరియా జీఎంకు దరఖాస్తులు చేసుకున్న వారూ ఉన్నారు. ఆ దరఖాస్తులపై కూడా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీఐవో వద్ద సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పీఐవో లేకపోవడంతో అప్పిలేట్ దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోకుండా మరుగునపడ్డాయి. కార్పొరే ట్ అధికారుల జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. చట్టబద్ధత గల ఇలాంటి పోస్టుల భర్తీలో జాప్యం చేయడం సరికాదని, ఇలా చట్టాలను నీరుగార్చుతున్నారని దరఖాస్తు దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్కు లేఖ రాశాం.. పీఐవో, ఏపీఐవో పోస్టులు భర్తీ చేయడం కోసం కార్పొరేట్ అధికారులకు లేఖ రాశాం. కార్పొరేట్ అధికారుల ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరుగుతాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. – ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ -
108లో సుఖప్రసవం
కోటపల్లి: మండలంలోని పంగిడిసోమారం గ్రామానికి చెందిన గర్భిణి రెడ్డి లవలోకకు గురువారం పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అర్జన్న 108కి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అంబులెన్సులో కోటపల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికం కావడంతో పంగిడిసోమారం అటవీప్రాంతంలోనే సుఖప్రసవం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇరువురిని కోటపల్లి పీహెచ్సీకి తరలించారు. కార్యక్రమంలో ఈఎంటీ షబనాజ్, ఫైలట్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థికి ల్యాప్టాప్ అందజేత
ఉట్నూర్రూరల్: కెరమెరి మండలంలోని నిషాని గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఆత్రం వంశీకృష్ణ పైచదువుల నిమిత్తం గురువారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన కార్యాలయంలో ల్యాప్టాప్ అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్లో అపజయాలు ఉండవని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్మానం కళామందిర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల సేవారత్న పురస్కారం అందుకున్న కాథ్లే మారుతిని గురువా రం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సన్మానించారు. ఆ దిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన మారుతి ఎంతోమంది గిరిజన విద్యార్థులకు వి లువిద్యలో శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఫౌండేషన్ తరపున అతనికి రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏసీఎంవో జగన్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి పాల్గొన్నారు. -
యురియా కోసం రైతుల ఆందోళన
భీమిని: పాస్బుక్కు ఒక బస్తా యూరియా ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పడంతో కన్నెపల్లిలో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. ఏడీఏ సురేఖ అక్కడికి చేరుకుని రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా కొరత ఉందని తెలిపారు. ఫర్టిలైజర్ దుకాణాలు, డీసీఎంఎస్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వారి ఖాతాదారులకు ఇస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో ఆమె హకా, డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడి రైతులకు యూరియా ఇవ్వాలని సూచించారు. టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయాలని ఏఈవోకు సూచించారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్నెపల్లిలోని ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. వీగాం, కన్నెపల్లి, ముత్తాపూర్ గ్రామాల్లో దుకాణాలు తనిఖీ చేశారు. ఎమ్మార్పీకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. కన్నెపల్లి, భీమిని, నెన్నెల ఏవోలు సాయిప్రశాంత్, యమునదుర్గా, సృజన పాల్గొన్నారు. -
‘ఉమ్మడి జిల్లా బంద్కు సహకరించాలి’
ఆదిలాబాద్: జీవో 49 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 21న చేపట్టనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు సహకరించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాదులు, గ్రామ పటేళ్లు, రాయి సెంటర్ సార్మేడీలు, ఆదివాసీ కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రజా సంఘాలు బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ బొజ్జు, ముకుందరావు, పీ. నాగోరావు, గెడం ఆనందరావు, దుర్వ జుగాథిరా వు, ఆత్రం మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: షట్టర్ లిఫ్టింగ్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజుసింగ్ మోహన్సింగ్, సేవక్ సింగ్ రఘుబీర్సింగ్, సుర్దిప్ సింగ్ ముగ్గురు బంధువులు. నిర్మల్ జిల్లాలో కూలి పనులు చేసేవారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న రాత్రి బైక్పై లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ చేరుకుని పెట్రోల్ బంక్ సమీపంలోని ఇంటి ముందున్న బైక్ను దొంగలించారు. అనంతరం ఓ గోల్డ్షాప్లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. అదే రాత్రి ఉమ్రికి వెళ్తూ మార్గమధ్యలో కుంటాల మండలం కల్లూరు బస్టాండు సమీపంలో రెండు దుకాణాల తాళాలు పగులగొట్టి రూ.2,500ల నగదు అపహరించారు. గురువారం నిర్మల్లో బంగారం విక్రయించడానికి వచ్చారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, రూ.2,500 నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు వెండి ఆభరణాలను ‘నిర్మల్ పోలీస్’ అని అందంగా అలంకరించి, తప్పించుకోలేరని ఒక మెసేజ్ ఇచ్చారు. కేసును ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, అశోక్, పీసీఆర్ ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఇచ్చోడలో దొంగల బీభత్సం
● ఒకేరోజు మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండి, నగదు అపహరణఇచ్చోడ: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన జాదవ్ దేవిదాస్ మూడు రోజుల కిత్రం ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి సొనాల మండలంలోని ఘన్పూర్కు వెళ్లారు. తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లో చొరబడి తులం బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. విద్యానగర్ కాలనీలోని రమేశ్ ఇంట్లో చొరబడి 4 గ్రాముల బంగారంతో పాటు నగదు అపహరించారు. అదేకాలనీలో ఉన్న చిక్రం జంగు ఇంట్లో తులం బంగారం, ఐదు తులాల వెండి దొంగిలించారు. సంతోషిమాత ఆలయం వద్ద పార్క్ చేసిన పల్సర్ 220 బైక్ను తీసుకెళ్లి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వదిలేసి పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ బృందాలను రప్పించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
అదనపు కలెక్టర్ చంద్రయ్య బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా పి.చంద్రయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. చంద్రయ్యను జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎన్జీవోస్ సభ్యుల సన్మానం మంచిర్యాలటౌన్: జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్యను గురువారం టీఎన్జీవోస్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్కుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, అజయ్, సూపరింటెండెంట్ వసంతకుమార్, గంగారం, కార్తీక్, అజయ్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
● జ్వరంతో బాలిక మృతి ● ముత్తంపేటలో విషాదం
ఏడేళ్లకే నూరేళ్లు..●కౌటాల: ఆ బాలికకు ఏడేళ్లకే నూరేళ్లు నిండాయి. విషజ్వరం ఆ చిన్నారిని బలి తీసుకుంది. అల్లరు ముద్దుగా చూసుకుంటున్న ఒక్కగానొక్క కుమార్తె మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కుమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందిన రైపూర్ నాగేశ్వర్, జయ దంపతులకు కుమార్తె మన్విత (7), కుమారుడు ఉన్నాడు. నాగేశ్వర్ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మన్విత స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన బాలికకు జ్వరం రావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. రాత్రి తల్లి స్థానిక ఆశ వర్కర్ వద్ద పారాసిటమల్ మాత్రలు అడిగి వేశారు. జ్వరం తగ్గకపోవడంతో బుధవారం కౌటాల పీహెచ్సీకి తీసుకెళ్లగా సిబ్బంది మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. బుధవారం సాయంత్రం ఇంటి వద్ద బట్టల్లోనే మూత్రం పోసుకుని కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. -
ఒక్క విద్యార్థి.. ముగ్గురి పర్యవేక్షణ
ఖానాపూర్: ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలతో విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపేందుకు తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మండలంలోని అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధి రాజులమడుగులోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు గైర్హాజరు అవుతుండడంతో ఒకే విద్యార్థి పాఠశాలకు వస్తున్నాడు. బుధవారం నిర్మల్ ఏసీఎంవో శివాజీ ఎస్సీఆర్టీ జంగు పటేల్తో కలిసి పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒకే విద్యార్థి భీష్ము అందుబాటులో ఉన్నాడు. ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు అధికారులు కలిసి ఒక్క విద్యార్థిని పర్యవేక్షించాల్సి వచ్చింది. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎనోలి గ్రామానికి చెందిన సోయం మారు (35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిస కావడంతో నిత్యం భార్యతో గొడవపడేవాడు. మంగళవారం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమారుడు గణేశ్ను కొట్టాడు. దీంతో భార్య నీలాబాయి నిలదీయడంతో రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బుధవారం గ్రామ శివారులోని ఓ చేనులో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డును కబ్జా చేసిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన రంగినేని శ్రీనివాస్ శాంతినగర్లోని మున్సిపల్ రోడ్డుకు తన బావ అమూల్ పేరిట డోర్ నంబర్ తీసుకొని ఇంటి పన్నులు చెల్లించాడు. ఆ తర్వాత అమూల్ తన భార్య శ్వేత పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో మున్సిపల్ వారు ఆ స్థలాన్ని రంగినేని శ్వేత పేరిట మ్యూటేషన్ చేశారు. ఆదిలాబాద్అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులరైజేషన్ కోసం రూ.22,900 చలాన్ చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకోగా అధికారులు అనుమతించారు. ఈ స్థలా న్ని విక్రయించేందుకు సైతం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోడ్డు పక్కన ఉన్న జిన్నింగ్ ఫ్యాక్టరీ గేటును కబ్జా చేసి స్థలాన్ని ఆక్రమించడంతో కౌటివార్ సుశీల్ వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యా దు చేయడంతో కేసు నమోదైంది. పత్రాలను పరి శీలించగా నకిలీవని తేలింది. దీంతో రంగినేని శ్రీని వాస్తో పాటు అతని తండ్రి సూర్యప్రకాశ్రావు, చెల్లెలు శ్వేత, బావ అమూల్పై కేసు నమోదు చేయగా శ్రీనివాస్, అమూల్ను రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్టౌన్, రూరల్ సీఐలు సునీల్ కుమార్, ఫణిందర్ పాల్గొన్నారు. ఐదుగురి రిమాండ్.. గుడిహత్నూర్కు చెందిన జాదవ్ రమేశ్ కేఆర్కే కాలనీలోని సర్వే నం.68లో ప్లాట్ కొనుగోలు చేయగా అట్టి స్థలాన్ని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 8 మంది ఆక్రమించేందుకు యత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్లాట్ను తక్కువ ధరకు విక్రయించాలని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో మహ్మద్ ముజాహిద్ అలియాస్ పత్తి ముజ్జు, ఇస్మాయిల్ అలియాస్ తౌఫిక్, షేక్ ఆబిద్, షేక్ ఆదిల్, సర్ల బుచ్చన్నను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, ఆదినాథ్, అతీఖ్, సయ్యద్ అహ్మద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ఆందోళన
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని బీట్బజార్కు చెందిన విశ్వనాథం అనే వ్యాపారి ఇంటి ఎదుట బుధవారం లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన శ్రీధర్ లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతుల వద్ద ధాన్యం కొనుగోలు, ఇతర లావాదేవీలు కొనసాగిస్తుండేవాడు. ఈక్రమంలో పలువురి వద్ద అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం ఐపీ పేరుతో నోటీసులు పంపుతున్నాడనే సమాచారంతో అప్పు ఇచ్చిన రైతులు ఈ నెల 8 న శ్రీధర్ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. వ్యా పారి విశ్వనాథం కూడా శ్రీధర్కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. దీంతో దండేపల్లిలో ఉన్న భూమి అప్పుకింద రాయించుకున్నాడని, అట్టి భూమిని బాధితులందరికీ పంచాలని బుధవారం రైతులు విశ్వనాథం ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గోపతి సురేష్ రైతులతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. -
వింత వ్యాధితో 17 మేకలు మృతి
భైంసారూరల్ : మండలంలోని ఇలేగాంలో కదం దత్తురాంకు చెందిన 17 మేకలు వింత వ్యాధి సోకి మృతి చెందినట్లు బాధితుడు తెలి పారు. మంగళవారం ఉదయం మేకలను మేతకోసం గ్రామ శివారులోని అడవికి తీసుకెళ్లాడు. మేత మేస్తుండగానే ఒక్కొక్కటిగా సాయంత్రం వరకు అడవిలోనే ఏడు మేకలు మృతి చెందాయి. దీంతో ఏంచేయాలో తెలియక మిగిలిన మేకలను తోలుకుని ఇంటికి వచ్చి పాకలో తోలాడు. బుధవారం ఉదయం చూసేసరికి మరో 10 మేకలు చనిపోయి ఉన్నాయి. పశువైద్యాధికారి విఠల్కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా పరిశీలించి సీసీపీపీ(కంటైజెస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా)తో మృతి చెందినట్లు తెలిపారు. సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
సింగరేణి ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్
● టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీశ్రీరాంపూర్: సింగరేణిలో టీబీజీకేఎస్ను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నుంచి సింగరేణికి ఇన్చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో యూనియన్కు పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఏ ప్రభుత్వం చేయని మేలును బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందన్నారు. సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మోసం చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కార్మిక క్షేత్రాల్లో పోరాడాలని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, కాంగ్రెస్ ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని అన్నారు. పోరాటాలు చేయడంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో సింగరేణిలో పర్యటించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాదాసు రామ్మూర్తి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు పారుపల్లి రవి, అధికార ప్రతినిధి వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్సర్క్యూట్తో మంటలు
బెల్లంపల్లి: పట్టణంలోని బజారు ఏరియాలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. నో నేమ్ రెడీమేడ్ షాపు ఎదు ట ఉన్న విద్యుత్ తీగలపై ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాంటా చౌరస్తా వద్ద నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు పరుగులు పెట్టారు. విద్యుత్ శాఖ సి బ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండు తీగలు పరస్పరం తాకడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటన బజారు ఏరియాలో చర్చనీయాంశమైంది. -
తెలంగాణ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
● వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● రెండో స్నాతకోత్సవంలో పట్టాల ప్రదానం ● 113 మందికి గోల్డ్మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేతతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కా న్వొకేషన్) బుధవారం డిచ్పల్లి క్యాంపస్లో అట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభా గాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ(డాక్టరేట్) పట్టాలను అందజేశారు. -
వైద్య కళాశాలకు అనాథ మృతదేహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని కాలేజ్రోడ్లో నిర్వహిస్తున్న అనాథ వృద్ధుల, మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి మందమర్రిలో నిస్సహాయ స్థితిలో రహదారి పక్కన ఉన్న వృద్ధురాలు(90)కు గత నెల 28 న మందమర్రి ఎస్సై రాజశేఖర్ సూచన మేరకు మేరకు ఆశ్రమంలో చోటు కల్పించారు. సదరు వృద్ధురాలు మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఎస్సై సూచన మేరకు మృతదేహాన్ని బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. అయినప్పటికీ మృతురాలికి సంబంధించి బంధువులెవరైనా ఉంటే 9701973636 నంబర్ను సంప్రదిస్తే మృతదేహం అప్పగిస్తామన్నారు. లేనిపక్షంలో వైద్యకళాశాల వినియోగిస్తుందని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు ములుకాల కుమార్ తెలిపారు. -
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని..
నేరడిగొండ: కుంటాల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న ఓ విద్యార్థిని హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామడ మండలంలోని వాస్తాపూర్కు చెందిన ఆత్రం త్రివేణి (15) ఈనెల 11న శుక్రవారం వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు విద్యార్థిని నెలక్రితం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గాలిదుమారం వీచింది. దీంతో టెంటు కర్ర ఆమె తలపై పడడంతో గాయాలుకాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అనంతరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. -
వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి
కెరమెరి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు మండలంలోని టెమ్లగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం నడుములోతులో నీళ్లు ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది వాగుదాటి అ వుతల ఉన్న సొమ్లగూడ, తుమ్మగూడ, టెమ్లగూడ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 43 మందికి వైద్య పరీక్షలు ని ర్వహించి మాత్రలు అందించారు. రక్తపూతలు సేకరించారు. వర్షాకాలంలో సంక్రమించే వ్యా ధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మె స్రం సోము, హెచ్ఏలు శంకర్, వసంత్, ఏఎన్ఎంలు సంఘమిత్ర, సుమలత పాల్గొన్నారు. బెదిరింపులకు పాల్పడిన ఒకరి రిమాండ్ఆదిలాబాద్టౌన్: డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన విద్యానగర్కు చెందిన మణిశేఖర్పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కు మార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ వసీమ్ 2024 డిసెంబర్లో రాంలీలా మైదానంలో ఎగ్జిబిషన్ మేనేజర్గా వ్యవహరించాడు. మణిశేఖర్ వసీమ్ను బెదిరించి రూ.2లక్షలు ఇవ్వాలని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ఎగ్జిబిషన్ బంద్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూ.20వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు తర్వాత ఇవ్వాలని, లేదంటే చంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మణిశేఖర్ను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికజన్నారం: మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకుల అనన్య బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనో బీఫోర్ ఇట్స్ టూ లేట్ అనే కామిక్ వ్యాస రచన, కామిక్ డ్రాయింగ్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థినిని, గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, మణెమ్మను డీఈవో ఎస్.యాదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● చింతలమానెపల్లి, కౌటాల మండలాల్లో చోరీలు ● చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుని పరారీ ● ద్విచక్ర వాహనం, ఫోన్ స్వాధీనం చింతలమానెపల్లి/కౌటాల: చింతలమానెపల్లి, కౌ టాల మండలాల్లో మంగళవారం రాత్రి దొంగలు బీ భత్సం సృష్టించారు. చోరీకి పాల్పడి పారిపోతుండగా ఓ ఉపాధ్యాయుడు సాహసించి పట్టుకునే ప్రయత్నం చేయగా చేజారాడు. ఎస్సైకి ఎదురుపడగా.. అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేయగా చిక్కినట్టే చిక్కి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామం అడెపల్లి చౌరస్తాలోని శ్రీసాయి ఫర్టిలైజర్ దుకాణంలో మంగళవారం రా త్రి 10.30గంటలకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం వెనుక వైపు తలుపు పగులగొట్టి రూ.70వేలు ఎత్తుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలు, డీవీఆర్ ధ్వంసం చేశారు. ఉదయం గమనించిన యజమాని మహేష్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌటాలలో చేతికి చిక్కి.. కౌటాల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల తిరుపతి ఇంటికి తాళం వేసి కరీంనగర్కు వెళ్లారు. రాత్రి 11గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో ఇద్దరు దొంగలు ఉండడాన్ని గమనించి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓ దొంగను పట్టుకోగా ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అతడి బట్టలు సైతం చిరిగిపోయాయి. సెల్ఫోన్ అక్కడే పడిపోయింది. అయినా గోడ దూకిన దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. పెట్రోలింగ్ పోలీసులకు ఎదురుపడి.. ఇదే సమయంలో కౌటాలలో ఎస్సై గుంపుల విజయ్ వాహనాల తనిఖీ, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 12గంటల ప్రాంతంలో మోటార్సైకిల్ వేగంగా రావడాన్ని గమనించి అనుమానంతో అనుసరించారు. దీంతో దొంగలు మోటార్సైకిల్ను ధనురేటి గ్రామ సమీపంలో వదిలేసి పారిపోయారు. మోటార్సైకిల్ నంబరు ఆధారంగా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. మోటార్సైకిల్తోపాటు మొబైల్ఫోన్ను కౌటాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రెండు మండలాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠా దొంగలని తెలుస్తోంది. డబ్బాలో చోరీకి పాల్పడడానికి సమీపంలోని మెకానిక్ దుకాణం నుంచి గునపాన్ని దొంగిలించి అదే గునపంతో డబ్బా, కౌటాలలో తలుపులను పగులగొట్టినట్లు సీసీ కెమెరాల్లో వీడియోలను బట్టి తెలుస్తోంది. వేర్వేరుగా నమోదైన కేసుల్లో విచారణను వేగవంతం చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని కౌటాల ఎస్సై గుంపుల విజయ్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. -
బైండోవర్కు ససేమిరా
● నచ్చజెప్పిన అధికారులు ● ఒప్పుకోని గిరిజనులు దండేపల్లి: మండలంలోని మాకులపేట గ్రామ పంచాయతీ పరిధి రామునిగూడెంకు చెందిన కొంతమంది ఆదివాసీ గిరిజన మహిళలు లింగాపూర్ అటవీ బీట్పరిధిలోని 380 కంపార్ట్మెంట్ అటవీ భూముల్లో గత కొద్ది రోజులుగా చెట్ల పొదలు తొలగించి విత్తనాలు విత్తుతున్నారు. కొందరిపై అటవీశాఖ అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. బుధవారం విత్తనాలు విత్తుతుండగా 21మంది గిరిజన మహిళలను బైండోవర్ కోసం అదుపులోకి తీసుకుని దండేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. బైండోవర్కు ఒప్పుకోబోమని గిరిజన మహిళలు భీష్మించుకు కూర్చున్నారు. ఇప్పటికే కేసులు నమోదు చేశారని, ఇంకా బైండోవర్ ఎందుకని అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎస్సై తహాసీనొద్దీ న్, అటవీశాఖ అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు గిరిజన మహిళలతో మాట్లాడారు. బైండోవర్కు ఒప్పుకోవాలని నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు తహసీల్దార్ కార్యాలయం వద్దనే నిరీక్షించి చీకటిపడ్డాక ఇళ్లకు వెళ్లిపోయారు. -
కేంద్రీయ విద్యాలయం దూరం.. భారం
● బస్సులు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ ● పరిమితికి మించి ప్రయాణం ● గంటల తరబడి నిల్చుండాల్సిందే..!మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల నుంచి గుడిపేట సొంత భవనంలోకి మార్చిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు దూరభారంగా మారింది. అందులో చదివే పిల్లలందరూ సీసీసీ, శ్రీరాంపూర్, క్యాతన్పల్లి, మంచిర్యాలకు చెందిన వారే కావడంతో రవాణా ఇబ్బంది ఎదురవుతోంది. ఆర్టీసీ ఉదయం క్యాతన్పల్లి, శ్రీరాంపూర్ నుంచి రెండు బస్సులు నడిపిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, బస్సుల సంఖ్య తక్కువ కావడంతో రద్దీ ఏర్పడుతోంది. ఒక్కో బస్సులో 130నుంచి 140మంది విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేయాల్సి వస్తోంది. శ్రీరాంపూర్ నుంచి సీసీసీ, షిర్కే, ఐబీ మీదుగా వచ్చేసరికి పాఠశాల సమయం దాటిపోతోంది. తల్లిదండ్రులు ఎక్కడపడితే అక్కడ ఆపాలంటూ హుకుం జారీ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్లు పెదవి విరుస్తున్నారు. పాఠశాల సమయానికి బస్సు రాకుంటే విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతోంది. బస్సుల కొరత మంచిర్యాలలో ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడుతోంది. డిపోలో 145బస్సులు ఉండగా ఇందులో 44 హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటాయి. 60 అద్దెబస్సులు కాగా మిగతా 23 ఆయా రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఏ ఒక్క రూట్ను రద్దు చేసినా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పాఠశాల సమయంలో ఆయా రూట్లలో బస్సులు నడపడం తప్పనిసరిగా మారింది. కేంద్రీయ విద్యాలయానికి రెండు బస్సులు సర్దుబాటు చేయగా.. కిక్కిరిసిన పిల్లలతో నడపడం వల్ల ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా చేస్తే మేలు.. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా రూట్లలో నాలుగు బస్సులు కూడా సరిపోయేలా లేవు. చిన్నపిల్లలు కావడంతో 55 నుంచి 60 మందికి మించి వెళ్లడం ప్రమాదకరం. ఇంకోవైపు పుస్తకాల బ్యాగులు, టిఫిన్ బాక్సులతో గంటల తరబడి నిల్చోవడమూ కష్టతరమే. సింగరేణి, దేవాపూర్ వంటి ఇతర సంస్థల్లో ప్రయాణికులు, పాఠశాలల విద్యార్థులను చేరే వేసేందుకు ప్రత్యేకంగా ఒప్పంద ప్రాతిపదికన బస్సులను నడిపిస్తున్నాయి. ఆయా అధికారులకు కాంట్రాక్టు పద్ధతిన వాహనాలు సమకూర్చుంటున్న విధంగా కేంద్రీయ విద్యాలయానికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచి బస్సులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు భద్రతతోపాటు ఉపయోగకరంగా మారుతుంది. విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
కాసిపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బెల్లంపల్లి న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి ముకేష్ అన్నారు. బుధవారం మండలంలోని దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జడ్జి తనిఖీ చేశారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందా, పాఠాలు సక్రమంగా బోధిస్తున్నారా? పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అంతా పరిశీలించి సక్రమంగా చదువుకుని ప్రయోజకులు కావాలని సూచించారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ, ప్రధానకార్యదర్శి రవికుమార్, ఉపాధ్యక్షుడు అనిల్, స్పోర్ట్స్ చైర్మన్ మాసు సుధాకర్, సభ్యులు సింగతి రాజేష్, దాసారపు రాజ్కుమార్, జుబేర్, శ్రావణ్, సంగీత, న్యాయవాదులు పాల్గొన్నారు. పనులు పర్యవేక్షించిన ఎస్ఈ మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్లోని 11 కేవీ బ్రేకర్ చార్జ్ పనులను జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) జాడె ఉత్తమ్ బుధవారం పర్యవేక్షించారు. ఈ బ్రేకర్ చార్జ్ వల్ల మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నర్సింగాపూర్, హాజీపూర్ మండలం ధర్మారం గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉంటుందని తెలిపారు. ప్రజలు విద్యుత్ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని చెప్పారు. విద్యుత్ డీఈ ఎం.డీ.కై సర్, ఏడీఈ వెంకటేశ్వర్లు, ఏఈ మహేందర్రెడ్డి, సబ్ ఇంజినీర్ శిరీష, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఏవో ఛత్రునాయక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ)గా భూక్య ఛత్రునాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏడీఏలు, ఏవోలు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ నెల 11న జిల్లా వ్యవసాయ అధికారి కల్పన వరంగల్ జిల్లాకు బదిలీ కాగా.. అక్కడి నుంచి డిప్యూటేషన్పై హైదరాబాద్ కమిషనరేట్కు వెళ్లారు. కరీంనగర్ ఎఫ్టీసీ కార్యాలయం డీడీ ఛత్రునాయక్ జిల్లా వ్యవసాయ అధికారిగా నియామకం అయ్యారు. బుధవారం కల్పన నుంచి ఛత్రునాయక్ బాధ్యతలు స్వీకరించారు. భీమిని ఏడీఏ సురేఖ, వ్యవసాయ కార్యాలయం ఏడీఏ గోపి, ఏవోలు శ్రీనివాస్, తరుణ్, ఫర్హాన, ఏఈవోలు పాల్గొన్నారు. -
‘ప్రాదేశిక’ ఎన్నికలకు అడుగులు
● జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు ● 16 జెడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలు ● బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ) స్థానాల సంఖ్య ఖరారైంది. గత ఎన్నికల్లో 132 స్థానాలు ఉండగా ప్రస్తుతం 129 ఎంపీటీసీ స్థానాలుగా లెక్క తేలింది. 2024 జూన్ 2తో పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాది కావడంతో అభివృద్ధి, పరిపాలన పరంగా నిధుల కేటాయింపులు జరగాలంటే ప్రాదేశిక ఎన్నికలు తప్పనిసరిగా మారాయి. జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలు ఖరారు కాగా పంచాయతీల్లో ఓటరు జాబితా అనుసరించి ఎన్నికలు నిర్వహించనున్నారు. మహిళా ఓటర్లు 1,94,688 మంది, పురుష ఓటర్లు 1,94,039 మంది, ఇతర ఓటర్లు 19 మందితో మొత్తం 3,84,746 మంది ఓటర్లు ఉన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పంచాయతీ రాజ్ చట్టంలో చట్టబద్ధతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్కు ఆమోదం లభిస్తే మరో వారం రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రాదేశిక ఎన్నికలకు అడుగులు పడుతుండగా ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఉన్న అధికారులు ఎన్నికల కమిషన్ నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరితే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయనడంలో సందేహం లేదు. -
గృహహింస చట్టాలపై అవగాహన ఉండాలి
లక్సెట్టిపేట: మహిళలు గృహహింస చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కే.సాయికిరణ్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల అంగన్వాడీ మహిళా సిబ్బందికి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై అరాచకాలు పెరుగుతున్నాయని, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇబ్బందులు పడితే అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్తన్న, కార్యదర్శి ప్రదీప్, ఏజీపీ సత్యం, న్యాయవాదులు సురేందర్, శ్రీధర్, పద్మ, సత్యనారాయణ, ఎంపీడీవో సరోజ, సీడీపీవో రేష్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి
మంచిర్యాలఅగ్రికల్చర్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈవో గణపతిలతో కలిసి అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల భవనాల్లో మరమ్మతులకు నివేదిక రూపొందించాలని, సంక్షేమ వసతిగృహాలను సందర్శించి ఒక రోజు అక్కడ నిద్రించాలని, మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించేలా, బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి కోటపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కోటపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, వంటశాల, భోజనశాల, వసతిగృహం, పడకలు, మూత్రశాలలు పరిశీలించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మోనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. పాఠశాలలో కిటికీలు, మూత్రశాలలు, ఫ్యాన్లు ఇతరత్రా మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
కల్లు బట్టీపై టాస్క్ఫోర్సు దాడులు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న తెల్లకల్లు బట్టీపై ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కల్లు నమూనాలు సేకరించారు. బాటిళ్లకు సీల్ వేసి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ సమ్మయ్య మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సేకరించిన కల్లు నమూనాలను నిజామాబాద్లోని కెమికల్ ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్సైజ్ టాస్క్ఫోర్సు సిబ్బంది సాగర్, రమేష్, కవిత పాల్గొన్నారు. -
వానాకాలం ఆయకట్టు ఖరారు
● యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సాగునీటి శాఖ ● ఉమ్మడి జిల్లాలో ఇంకా పూర్తిగా నిండని ప్రాజెక్టులు ● వానలు లేకపోతే ఆయకట్టు ప్రశ్నార్థకమేసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు కింద వానాకాలంలో సాగయ్యే వివరాలను సాగునీటి శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈసారి పలు చోట్ల వర్షాలు తక్కువగా కురవడంతో ప్రాజెక్టుల్లోకి ఇంకా సరిపడా నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చాకే సాగునీటి శాఖ అధికారులు ఆయకట్టు ప్రతిపాదించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సదర్మాట్, నిర్మల్ పరిధిలోని గడ్డెన్నవాగు, ఎస్సారెస్పీ (సరస్వతి కాలువ), మంచిర్యాల జిల్లా గొల్లవాగు, ర్యాలీ వాగు, నీల్వాయి ప్రాజెక్టులకు, ఆసిఫాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులను మరోసారి సమీక్షించి ఆయకట్టును ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క కుమురంభీం ప్రాజెక్టు నిల్వ ఆశాజనంగా ఉంది. మరోవైపు వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టుల కింద రైతాంగానికి ఊరట కలగనుంది. -
● జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్త కార్యవర్గం ● తుది దశకు నూతన కమిటీ నియామకం ● ‘స్థానిక’ ఎన్నికల ముందే ప్రకటన ఉండే అవకాశం
బలోపేతం దిశగా..కొత్త నియామకం అయ్యాక డీసీసీలను మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధి నాయకత్వం అడుగులు వేస్తోంది. డీసీసీ ఇక నుంచి పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా మారనుంది. ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య సమన్వయం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలోనూ క్రియాశీలకంగా మారనుంది. అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, సభ్యత్వాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో పార్టీని పటిష్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అన్నింటిని లెక్కలోకి తీసుకుని నూతన డీసీసీ ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) కసరత్తు తుది దశకు చేరుకుంది. వారం రోజుల్లోనే కొత్తగా జిల్లా కార్యవర్గం కొలువు దీరనుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కొత్తగా నియామకం కోసం పరిశీలనలు, వడపోతలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో డీసీసీలో ఎవరికి చోటు ఎలా ఉండబోతున్నదనే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐదేళ్ల కాలానికి జిల్లా అధ్యక్ష పదవి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా కొక్కిరాల సురేఖ ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనే జిల్లా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. జిల్లా అధికార పార్టీలో ‘గడ్డం’ ఫ్యామి లీకి మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ మధ్య వైరం కొనసాగుతోంది. మంచిర్యాల నియోజకవర్గం ఒక వైపు, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు వినోద్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ మరోవైపు అన్నట్లుగా కేడర్ వీడిపోయి ఉంది. దీంతో ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ బాధ్యులు అనిల్యాదవ్ ఇటీవల జిల్లాలో పర్యటించి వెళ్లారు. పార్టీ పరిశీలకులు ఇక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. జిల్లా నుంచి మంత్రి వివేక్ ఉండడంతో ఈసారి డీసీసీ ఎంపిక ఎలా ఉండబోతుందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. సామాజిక తూకం, నిబంధనలు.. జిల్లా కమిటీల ఎంపికపై రాష్ట్ర నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలనలు చేస్తోంది. ఈ క్రమంలో సామాజిక తూకం పాటించనున్నారు. ఆయా జిల్లాల్లో రొటేషన్ చూస్తే జిల్లాకు ఏ వర్గానికి అధ్యక్ష పీఠం దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతమున్న డీసీసీ అధ్యక్షురాలును మారిస్తే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు వెళ్లాయి. డీసీసీ అధ్యక్ష పదవికి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి నాతరి స్వామి, కర్కూరి రామ్చందర్, తొంగల మల్లేశ్, చెన్నూర్ నియోజకవర్గం నుంచి రఘునాథ్రెడ్డి దరఖాస్తులు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి, ఇతర పదవుల్లోనూ తమకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ తమకు జిల్లా పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఇక గ్రామ, మండల, జిల్లా స్థాయి ఎన్నికల్లో టికెట్ ఆశించే నాయకులు పార్టీ పదవులకు దూరంగా ఉంటున్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తానూరు: మండలంలోని బోంద్రట్లో ఈ నెల 13న పట్టపగలు గ్రామానికి చెందిన జగ్మే సవిత్రిబాయి, నారాయణ్ దంపతుల ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం పోలీస్స్టేషన్లో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సోన్కాంబ్లె రాహుల్ ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి రూ.70 నగదు, పదమూడున్నర గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి దొంగిలించాడు. బోంద్రట్ ఎక్స్రోడ్డు సమీపంలోని హైవే పక్కన పొదలో గుంతతవ్వి అందులో దాచి పెట్టాడు. ఎస్సై షేక్ జుబేర్ నిందితుడిని వేలిముద్రల ఆధారంగా పట్టుకున్నాడు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ముధోల్ సీఐ మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
బీడీ కార్మికుల పిల్లలకు ‘ఉపకార’ం
● దరఖాస్తులు కోరుతున్న కేంద్రం ● గరిష్టంగా రూ.25 వేలు అందజేత ● ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులకు ప్రయోజనంనిర్మల్చైన్గేట్: బీడీ కార్మికుల పిల్లలు చదువులో రాణించేలా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేయూతనిస్తోంది. ఒకటో తరగతి నుంచి ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.25 వేలు అందజేస్తూ వారి ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులు 75,200 మంది ఉన్నారు. ఆయా కుటుంబాలకు చెందిన విద్యార్థులు సుమారు లక్షా 20 వేల మంది వివిధ స్థాయిల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారంతా పథకం కింద దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందనున్నారు. దరఖాస్తు గడువు.. అర్హులైన విద్యార్థులు http:// scholarship. gov. in వెబ్సైట్లో సంబంధిత వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతపరచాలి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, తదితర వృత్తి విద్యా కోర్సులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలు, సందేహాల నివృత్తికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ చౌరస్తాలో గల బీడీ కార్మికుల ఆస్పత్రిలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. అవగాహన లేమి.. బీడీ కార్మికుల పిల్లలకు జాతీయస్థాయిలో ఉపకార వేతన స్కీం ఎప్పటి నుంచో అమలులో ఉంది. అ యినా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, కొన్ని సందర్భాల్లో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, దరఖాస్తు అప్లోడ్ కాకపోవడం వంటి సమస్యల వల్ల చాలామంది ఉపకార వేతనం పొందలేకపోతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్లోడ్ కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా బీడీ కార్మికుల పిల్లల కోసం కేంద్రం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. దీనిపై ప్రచారం కల్పించాలని, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీడీలు చుడుతున్న మహిళా కార్మికులుఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా బీడీ కార్మికులు నిర్మల్ 70,000 ఆదిలాబాద్ 3,000 కుమురంభీం 1,500 మంచిర్యాల 700 మొత్తం 75,200అర్హతలు పదోతరగతి, ఇంటర్లో నేరుగా ఉత్తీర్ణులై ఉండాలి. సప్లిమెంటరీ విద్యార్థులు అనర్హులు. దూరవిద్య అభ్యసించిన వారు అనర్హులు. తండ్రి లేదా తల్లికి పీఎఫ్ గుర్తింపు కార్డు తప్పనిసరి. కుటుంబ ఆదాయం నెలకు రూ.10వేల లోపు ఉండాలి. జత చేయాల్సిన పత్రాలు 2025లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం. విద్యార్థి పేరిట బ్యాంక్ ఖాతా గత సంవత్సరం చదివిన తరగతి, కోర్సుకు సంబంధించిన మార్కుల మెమో సద్వినియోగపర్చుకోవాలి బీడీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏటా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలి. – డాక్టర్ మహేష్, బీడీ కార్మిక ఆస్పత్రి వైద్యాధికారి, నిర్మల్ ఉపకార వేతనం (రూ.ల్లో) తరగతి స్కాలర్షిప్ 1 నుంచి 4 1,000 5 నుంచి 8 1,500 9 నుంచి 10 2,000 ఇంటర్ 3,000 డిగ్రీ, పాలిటెక్నిక్, ఇతర వృత్తి విద్యాకోర్సులు 6,000 ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ 25,000 -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఓవైసీనగర్కు చెందిన షేక్ అహ్మద్, బంగాలగల్లీకి చెందిన సుల్తాన్ ఖాన్ స్థానిక గాంధీగంజ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై నవనీత్రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2.5 కిలోల ఎండు గంజాయి లభించినట్లు వెల్లడించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిద్దరిపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైందన్నారు. సమావేశంలో సీఐ జి గోపీనాథ్, ఎస్సై నవనీత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ అవినాష్కుమార్ -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఇచ్చోడ: మండల కేంద్రానికి చెందిన జాదవ్ దేవి దాస్ (42) సోమవారం మధ్యాహ్నం అదృశ్యం కాగా మంగళవారం మృతదేహం లభ్యమైనట్లు సీఐ బండారి రాజు తెలిపారు. కిరాణ దుకాణానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి ఇంటికి రాకపోయేసరికి అతని భార్య వనిత ఇచ్చోడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగళవారం టీటీడబ్ల్యూఆర్జేసీ ప్రహరీ పక్కన మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. పురుగుల మందు తాగినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. -
గల్ఫ్లో ఆగిన మరో గుండె●
● పొన్కల్ వాసి మృతి మామడ: కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళ్లిన వ్యక్తి అక్కడ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మండలంలో ని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (46) ఆరునెలల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం లభించిందని కుటుంబ స భ్యులకు కొన్నిరోజుల క్రితం ఫోన్చేసి చెప్పడంతో సంతోషపడ్డారు. సోమవారం అబుదాబిలో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు తీరుతా యని అనుకుంటున్న సమయంలోనే మృత్యు వు గుండెపోటు రూపంలో కబలించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అబుదాబిలోని హెల్పింగ్ హాండ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
● 8 మందికి గాయాలు
బొలెరోను ఢీకొట్టిన కారు●రెబ్బెన: మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై బొలెరోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఇరు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. సిర్పూర్ (టి) రైల్వేస్టేషన్లో పనిచేస్తున్న సాగర్ సోమవారం విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భార్య అరుణ, కుమారులు విశ్వక్రాజ్, విహాన్ రాజ్లతో కలిసి బొలెరో వాహనంలో బయలుదేరాడు. రెబ్బెన మండల పరిధిలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ సమీపంలో రెడిమిక్స్ ప్లాంట్ వద్దకు చేరుకోగా రెబ్బెన వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్కారు అతివేగంగా వచ్చి బొలెరోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులు, డ్రైవర్ సంతోష్కు, షిప్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సాగర్తో పాటు అతని కుటుంబ సభ్యులను రెబ్బెన పీహెచ్సీ తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాలకు తరలించారు. సాగర్ సోదరుడు రజినికాంత్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ వినాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పస్తులుంటున్నా పట్టించుకుంటలేరు..
● మోదీ గారు ఇండియాకు రప్పించండి ● కువైట్లో మండల వాసి నరకయాతన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ జన్నారం: ‘ప్రధాని మోదీ సార్ మూడు రోజుల నుంచి తిండి లేదు. పోలీసుస్టేషన్కు వచ్చిన సార్.. పోలీసులు పట్టించుకుంట లేరు. రెండేళ్ల క్రితం కువైట్ పోయిన.. రెండు నెలల నుంచి జీతాలు ఇస్తలేరు.. తిండి లేదు, ఇంటికి పంపడం లేదు.. ఎండలు చాలా కొడుతున్నాయి.. సార్ నన్ను కాపాడండి..’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య ప్రధానిని వేడుకుంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతయ్య ఉపాధి కోసం రెండేళ్ల క్రితం కువైట్ దేశం వెళ్లి కూలీ గా పని చేస్తున్నాడు. రెండు నెలలుగా యజమాని జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. జీతం రాకపోవడంతో తిండికి గోసైతందని, ఇండియాకు పంపివ్వమంటే పాస్పోర్టు ఇవ్వడం లేదని తెలిపాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పడానికి వెళ్తే మూడు రోజులుగా తిప్పించుకుంటున్నారని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అబుసుల్తాన్ అనే వ్యక్తి పాస్పోర్టు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని, తన నంబరును బ్లాక్లిస్టులో పెట్టాడని, రెండు నెలలుగా వేరేచోట పని చేయగా.. వారూ వెళ్లగొట్టారని పేర్కొన్నాడు. ప్రధాని మోదీ, తెలంగాణ ప్రభుత్వం ఇండియాకు రప్పించాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. శాంతయ్యను రప్పించండి: కుటుంబీకులు శాంతయ్యను ఇండియాకు రప్పించాలని ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు గొర్రె శంకరయ్య, లక్ష్మీ, భార్య ప్రమీల, కుమారుడు సాయితేజ, కూతురు వైష్ణవి వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్నామని, తమ కొడుకు ఏడుస్తూ వేడుకుంటుంటే తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం!
మంచిర్యాలక్రైం: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాంనగర్కు చెందిన సెటిపెల్లి శ్రీనివాస్ వద్ద కలీమ్ ఐదు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. చెల్లించడంలో జాప్యం జరగడంతో కాలేజ్రోడ్ ఆటో డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ షఫీ ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా సోషనల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించడంతో మనస్తాపానికి గురైన కలీమ్ ఆటోస్టాండ్ వద్ద ఆలౌట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఫిర్యాదు రాలేదన్నారు. ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యతలమడుగు: ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాధిక తెలిపిన వివరాల మేరకు సుంకిడి గ్రామానికి చెందిన గంగాధర నందిని (19) ఆదిలాబాద్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడేళ్లుగా మానసిక స్థితి సరిగాలేదు. మంగళవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. అతిగా మద్యం సేవించి ఒకరు..బేల: మండల కేంద్రంలోని కుమురం భీం కాలనీకి చెందిన కుడిమెత రాంచందర్ (30) ఉరేసుకుని ఆ త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల మేరకు రాంచందర్ కుటుంబంలో కొన్నిరోజులు గా కలహాలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంట్లో భార్య లక్ష్మితో గొడవపడ్డాడు. చనిపోతానని తాడు తీసుకుని బయట కు వెళ్లాడు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ చెట్టు కొ మ్మకు ఉరేసుకుని కనిపించాడు. మృతుని భార్య ల క్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మధుకృష్ణ తెలిపారు. మనస్తాపంతో మరొకరు..తానూరు: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల మేరకు బామ్ని గ్రామానికి చెందిన కోతిమీర గౌతం (35) కొంతకాలంగా మద్యానికి బానిసై ఏపని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యలు పుష్పలత, అర్చన, కుమార్తె ఉన్నారు. కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక..సిర్పూర్(టి): మండలంలోని లింబుగూడలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన సుర్పం శేఖర్ (17) సిర్పూర్లోని ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి పూర్తి చేశాడు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఈ నెల 11న ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లాలని చెప్పగా పోనని ఇంటివద్దే ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి సుర్పం యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్కే 5 గనిలో దొంగల బీభత్సం
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో సోమవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఐదుగురు వ్యక్తులు గని ఆవరణలోని గోడదూకి స్క్రాప్, కాపర్ కేబుల్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. గమనించిన సెక్యూరిటీ గార్డు పూర్ణ వెంకటేశ్ విజిల్ వేసి ఇతర సిబ్బందిని అలర్ట్ చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది అలికిరి విని దొంగలు చీకట్లో దాక్కుకున్నారు. వెంకటేశ్ వారి వద్దకు వెళ్లడంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. మిగతా సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాళ్లతో దాడి చేశారు. దీంతో మధుకర్, కుమార్కు గాయాలయ్యాయి. ఇంతలో ఏసీటీఎస్ టీం సభ్యులు రావడంతో అందరూ కలిసి చాకచక్యంగా ముగ్గుర్ని పట్టుకోగా ఇద్దరు పరారయ్యారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఏరియా సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డికి సమాచారం అందించగా ఆయన శ్రీరాంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు తక్షణమే స్పందించి కొద్ది గంటల్లోనే మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన నరేంద్ర, పవన్కుమార్, శివ, మునియప్ప, భూమయ్యపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి అభినందించారు. -
‘కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి’
ఇంద్రవెల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టినట్లు ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. జూన్ 23న చేపట్టిన చైతన్యయాత్ర మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిష్కర మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్కు ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తు చేశారు. అంబేద్కర్ లేకుంటే ఆర్బీఐనే లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే మనోహర్, వాగ్మరే కామ్రాజ్, కాంబ్లే ఉత్తం, బాలాజీ, మస్కే రాజువర్ధన్, పరత్వాగ్ సందీప్, సూర్యవంశీ ఉత్తం, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు కాపాడి.. కుటుంబ సభ్యులకు అప్పగించి
లోకేశ్వరం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని బ్లూకోల్ట్ సిబ్బంది కాపాడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన పుసవర్ల శ్రీనివాస్ మంగళవారం పంచగుడి వంతెన వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100కు డయల్ చేసి సమాచారం అందించాడు. వెంటనే బ్లూ కోల్ట్ సిబ్బంది సబ్ధర్ హుస్సేన్, ధన్రాజ్ అక్కడికి చేరుకుని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈక్రమంలో మద్యానికి బానిసై ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గంజాయి కేసు నమోదునెన్నెల: గంజాయి సేవిస్తున్న యువకుడిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. జెండావెంకటాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో గంజాయి సేవిస్తున్నాడని తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఎస్కూరి శశికుమార్ను దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి వద్ద నుంచి 130 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభించాయన్నారు. స్టేషన్కు తరలించి విచారించగా భీమారం మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి రాకేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలుభీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి గ్రామానికి చెందిన గంగాధర్ జేబులో ఉన్న సెల్ఫోన్ మంగళవారం అకస్మాత్తుగా పేలడంతో స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గంగాధర్ మహారాష్ట్రలోని బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో భోరజ్ హైవే వద్ద సెల్ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో స్వల్ప గాయాల పాలైన ఆయనను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
నవోదయలో ఆటలపోటీలు
● ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి క్రీడలు ● రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రాక కాగజ్నగర్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు చదువుతో ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం పీఈటీలు విద్యార్థులకు క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో నేషనల్ స్థాయి క్రీడల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల క్లస్టర్స్థాయి పోటీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ నవోదయ విద్యాలయంలో జరగనున్నాయి. జరుగనున్న ఈవెంట్స్ అండర్ 14, 17, 19 విభాగంలో హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఒక్కో క్రీడలో 6 టీంలుగా 18 జట్లు క్రీడల్లో పాల్గొనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 29, 31 తేదీల్లో కేరళలో జరిగే రీజినల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రపదేశ్, కేరళ జట్లు పాల్గొననున్నాయి. చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పీఈటీలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల కిత్రం కరుణాకర్, హరీష్నాయక్, నిశ్విత్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. – రేపాల కృష్ణ, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయం, కాగజ్నగర్ -
అజ్ఞాతం వీడుతున్నారు..!
● జనంలోకి మావోయిస్టులు ● ఉమ్మడి జిల్లా నేతల లొంగుబాటు ● ఆపరేషన్ కగార్తో పంథా మారిన వైనంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించడమో.. లొంగిపోవడమో జరుగుతోంది. ఇప్పటికీ కొందరు దశాబ్దాలుగా కుటుంబ సభ్యులు, సొంతూరును విడిచి అడవుల్లోనే గడుపుతున్నారు. రోజు రోజుకు పోలీసు బలగాలు అడవులు, మావోయిస్టు కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఉద్యమానికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు కోరుతున్నారు. తాజాగా మావోయిస్టు దంపతులు అజ్ఞాతం వీడగా.. ఊరిలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఉనికిని కోల్పోతున్న పార్టీనిత్యం పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఘర్షణ నుంచి నేడు పార్టీ ఉనికే లేకుండాపోయే రోజులొచ్చాయి. గడచిన ఏడాదిలోనే పార్టీ వేగంగా క్షీణిస్తోంది. కేంద్ర కమిటీలో పని చేసిన కటకం సుదర్శన్ ఉరఫ్ ఆనంద్(69) మొదలు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, గడ్చిరోలీ జిల్లా ఇన్చార్జి కాసర్ల రవి ఉరఫ్ అశోక్, కంతి లింగవ్వతోపాటు అనేక మంది సీనియర్లను పార్టీ కోల్పోయింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు చనిపోయారు. గత నెల 6న రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేబీఎం కమిటీ ఇన్చార్జీ మైలరాపు అడెల్లు ఉరఫ్ భాస్కర్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయనపై రూ.45లక్షల రివార్డు ఉంది. దళంలోనే ఒక్కటై..తాజాగా లొంగిపోయిన మావోయిస్టులు లచ్చన్న, అంకుబాయి అప్పట్లో క్రియాశీలకంగా ఉన్న సిర్పూర్ దళంలోనే పని చేస్తూ ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లికి చెందిన లచ్చన్న 1983లో పీపుల్స్వార్ గ్రూప్ చెన్నూరు దళంలో చేరారు. 2002లో డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2007లో నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ సాంకేతిక విభాగం ఇన్చార్జీగా పని చేశారు. 2023నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. ఈయనపై పలు పోలీసుస్టేషన్లలో 35కేసులు ఉన్నాయి. అన్న వచ్చిన 37ఏళ్లకుకుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చౌదరి అంకుబాయి 1988లో తన అన్న చిన్నన్నను కలిసేందుకు వచ్చి పార్టీలోకి వెళ్లింది. పీపుల్స్వార్ సిర్పూర్ దళ సభ్యురాలిగా చేరి, ఆ సమయంలోనే ఆత్రం లచ్చన్నను పెళ్లి చేసుకుంది. 1995లో లచ్చన్నతో పట్టణ ప్రాంతానికి బదిలీ కాగా, 2002లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సాంకేతిక విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్ బస్తర్ డివిజనల్ కమిటీ టెక్నికల్ విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఈమైపె 14కేసులు ఉన్నాయి. అయితే అన్న కోసం అడవికి వెళ్లిన అంకుబాయి చిన్నన్న కొన్నేళ్ల క్రితమే లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నారు. చెల్లె మాత్రం గత 37ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయింది. మిగిలిందెందరు?గతంలో అనేకమంది ఉమ్మడి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాల్లో పలు హోదాల్లో పని చేసేవారు. ప్రస్తుతం వారి సంఖ్య పదిలోపే చేరింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు కీలక హోదాల్లో ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లికి చెందిన ఇర్రి మోహన్రెడ్డి, సెంట్రల్ పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో సాంకేతిక విభాగంలో ఉన్నారు. మరో ముఖ్య నేత మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ ఉరఫ్ దాదా సింగరేణి కోల్బెల్ట్ కమిటీ చూస్తున్నారు. ఈయనను కేంద్ర కమిటీలోకి తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే ఈయన సహచరులుగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు ఎన్కౌంటర్లో మరణించారు. సలాకుల సరోజ, జాడి వెంకటి, పుష్పలత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. -
‘ఎల్లంపల్లి’కి స్వల్పంగా వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏప్రిల్ 15వరకు ఎనిమిది టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం మూడు నెలలుగా అంతే ఉండగా.. తొమ్మిది టీఎంసీల చేరువకు వచ్చింది. ఇటీవల వర్షాలు కురిసినా నీటిమట్టం పెరగలేదు. ఎగువ ప్రాంతాల నుంచి 452క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. మంగళవారం 20.175 టీఎంసీలకు గాను 8.899 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది. -
మారు పేర్ల సమస్య పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ప్రసాద్, నాయకులు సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రును కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెంలో ఆయన ను కలిసి వినతిపత్రం అందజేశారు. మెడికల్ బోర్డును సత్వరమే నిర్వహించాలని, హయ్య ర్ సెంటర్ రెఫరల్ కేసులు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉద్యోగం నుంచి తొలగించిన మైనింగ్ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించాలని, ఒడిశాలోని నైనీబ్లాక్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక రిక్రూట్మెంటు చేపట్టాలని తెలిపారు. కంపెనీలో మందుల కొరత తీర్చాలని, బదిలీ కోసం కంపెనీ ఇటీవల విడుదల చేసిన నూతన పాలసీ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, జెటి్ట్ శంకర్రావు, ప్రధాన కార్యదర్శి వికాస్ కుమార్యాదవ్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలటౌన్: జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో బస్తీ దవాఖానాను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీటకజనిత వ్యాధులు, మలేరియా, డెంగీ, చికెన్గున్యా, డయేరియా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 52,749 మంది మహిళలకు పరీక్షలు చేశామని, ఇతర మహిళలు కూడా వైద్య పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించేలా స్థానికులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రమ్య, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
కరుణించని వరుణుడు!
మంచిర్యాలఅగ్రికల్చర్: వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితి వెంటాడుతోంది. వర్షాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతం నెలకొనడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. భారీ వర్షాల్లేక జలాశయాలు, చెరువులు, కుంట లు, వాగులు బోసిపోసి కనిపిస్తున్నాయి. జిల్లాలో జూన్ నెల నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 304.3మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా.. 163.2మీల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జిల్లా సగటున 46శాతం లోటు నెలకొంది. నస్పూర్, జైపూర్, చెన్నూర్ మండలాల్లో అత్యధిక లోటు, మిగతా 15 మండలాల్లో 20 నుంచి 55 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో 2,32,220 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 1,47,553 ఎకరాల్లో సాగు కాగా.. విత్తుకునే గడువు ముగిసింది. వరి 74,348 ఎకరాల్లో నారు పోశారు. దీర్ఘకాలిక వరి(140 నుంచి 150 రోజులు) నాట్లు వేసుకునే గడువు ముగిసింది. ఈ నెలలో భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండితే ఆగస్టు వరకు స్వ ల్పకాలిక వరి(110 నుంచి 120రోజులు) సాగుకు వచ్చే నెల వరకు అవకాశం ఉంది. నెలాఖరు వరకు వరి నారు పోసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సరైన వర్షాలు కురిసి ఉంటే ఇప్పటికే 75శాతం వరి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా నారే పోసుకోలేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నారు పోసుకున్నా వర్షాల్లేక నాట్లు వేసుకోలేదు. చెరువులు.. కుంటలు వెలవెలజిల్లాలో నోటిఫైడ్ చెరువులన్నీ వట్టిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 38డిగ్రీలు నమోదవుతున్నాయి. జూన్లో కురిసిన వర్షాలకు కొన్ని చెరువులు, కుంటల్లోకి చేరిన నీరు సైతం ఇంకిపోతోంది. జిల్లాలోని గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. నీల్వాయి ప్రాజెక్టులోకి అంతంత మాత్రమే చేరింది. 624 చెరువులు, కుంటల్లోకి 20శాతం కూడా నీరు చేరలేదు. నీటి సౌకర్యం ఉన్న రైతులు నారుపోసుకుని బోరుమోటారు ద్వారా నీటితడులు అందిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ప్రాణహిత, గోదావరి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఎండలు కొడుతున్నాయి.. వానాకాలం వచ్చి నెలన్నర రోజులు గడిచినా వర్షాలు లేక చెరువులు నిండలే.. వాగులు పారలే. ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి. వరిపొలాలు బీడు భూములుగా మిగిలినయి. ఇంకో పదిహేను రోజులు ఇట్లనే ఉంటే వరిపంట సాగు ఉండదు. – పున్నం, రైతు, గ్రామం: సుబ్బరాంపల్లి, మం: చెన్నూర్ జిల్లాలో 46శాతం వర్షపాతం లోటు పత్తి, దీర్ఘకాలిక వరి రకాలకు ముగిసిన సాగు సమయం -
జంక్షన్ల కూల్చివేత
● రోడ్డు వెడల్పులో భాగంగా తొలగింపులు ● మూణ్నాళ్ల ముచ్చటగా మారాయనే చర్చ మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రం మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని జంక్షన్లను మంగళవారం కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీ టాకీస్, ఐబీ, బెల్లంపల్లి చౌరస్తాల్లో రూ.4కోట్లతో నాలుగు జంక్షన్లు నిర్మించారు. ఏప్రిల్లో ఐబీ చౌరస్తా జంక్షన్ ఎత్తు, వ్యాసార్థం తగ్గించి అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రోడ్లు చిన్నగా ఉండి జంక్షన్లు పెద్దగా ఉన్నాయని వాటి నిర్మాణ సమయంలో ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాసగార్డెన్ వరకు ఆరు వరుసలుగా రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు చేస్తుండగా.. ఆయా జంక్షన్లు అడ్డుగా ఉన్నాయని లక్ష్మీటాకీస్ చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్ చౌరస్తాల్లోని రెండు జంక్షన్లను మంగళవారం పూర్తిగా కూల్చేశారు. కూల్చివేతను ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రూ.కోట్లు ఖర్చు చేసి ఎందుకు నిర్మించారు, ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రొక్లెయినర్కు అడ్డుగా వెళ్లాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని.. మద్యంమత్తులో ఉండడంతో వదిలిపెట్టారు. కాగా, ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా మారిందని, జంక్షన్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయనే చర్చ జరుగుతోంది. -
‘ఉపాధి’ వేతనాలేవి..!
● మూడు నెలలుగా పెండింగ్ ● ఇబ్బందుల్లో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు పాతమంచిర్యాల: ‘అసలే తక్కువ వేతనానికి పని చేస్తున్నాం. నెల జీతం కూడా నెలనెల రాకపోతే మా కుటుంబాలను ఎలా పోషించుకునేది. పిల్లల ఫీజులు, కిరాణా సామగ్రికి అప్పులు చేయాల్సి వస్తోంది..’ అంటూ జిల్లాలోని ఉపాధి హామీ పథకం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు విడుదల కాలేదు. జిల్లాలోని పీవోలు 41మంది, ఏపీవోలు 13మంది, ఈసీలు 12మంది, టెక్నిక ల్ అసిస్టెంట్లు 81మంది, హెచ్ఆర్, ప్లాంటేషన్ మేనేజర్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ డిసేబుల్ కోఆర్డినేటర్ ఒక్కొక్కరు, క్లస్టర్ లెవల్ లైవ్లీహుడ్ రిసోర్స్ సెంటర్పర్సన్లు ఇద్దరు, అటెండర్లు 10మంది, ఫీల్డ్ అసిస్టెట్లు 155మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 41మందికి మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన స్పర్శ్ సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల వేతనాలు విడుదల కావడం లేదని అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్లోని లోపాలు సరి చేయడానికి నెలల సమయం తీసుకోవడం సరికాదని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగుల జీతాల బడ్జెట్ కోసం ప్రభుత్వానికి ప్రతీ నెల ప్రతిపాదనలు పంపిస్తున్నామని, నిధులు విడుదల కాగానే చెల్లిస్తామని డీఆర్డీవో ఎస్.కిషన్ తెలిపారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ● కడెం ఎడమ కాలువకు నీటి విడుదల కడెం: రైతులకు రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు ప్రాజెక్టు ఈఈ విఠల్, ఏఎంసీ చైర్మన్ భూషణ్తో కలిసి మంగళవారం సాగునీరు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్ పంటలు వేసుకోవాలని సూచించారు. కడెం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రూ.9.46 కోట్లతో వరద గేట్లు మరమ్మతుల చేయించామని తెలిపారు. ఇటీవలే రూ.33.5 లక్షలతో ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టామన్నారు. త్వరలో ప్రాజెక్టులో పూడికను తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు రోడ్డుకు మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని పెద్దూర్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం కాలనీలో సెప్టిక్ ట్యాంక్ పనులు ప్రారంభించారు. నచ్చన్ఎల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోలార్ ఫెన్సింగ్ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా నాయకుడు సతీశ్రెడ్డి, నచ్చన్ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ గంగన్న, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల, జన్నారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదల కోసమే రేషన్ కార్డులు
లక్సెట్టిపేట: పేదల కోసమే ప్రభుత్వం రేషన్కార్డులు పంపిణీ చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఎంతమంది రేషన్కార్డులకు దరఖాస్తు చేసుకున్నా విచారణ చేపట్టి అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. మండలంలో 1538 రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్కుమార్, పార్టీ పట్టణాధ్యక్షుడు ఎండీ.ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్, నాయకులు శ్రీనివాస్, చింత అశోక్, నాగభూషణం, పూర్ణచందర్రావు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి నస్పూర్: వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పట్టణ పరిధిలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. తరగతులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. సౌకర్యాలు, విద్యాబోధనపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, అదనపు గదులు ఇతర సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. మహిళల సంక్షేమం కోసం చర్యలుమంచిర్యాలటౌన్: మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాలలో ఇందిరా మహిళా భవన్ నిర్మాణ పనులను సందర్శించి, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లు ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, డెయిరీఫామ్, పెట్రోల్బంక్ ఇతర వ్యా పార అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ● కలెక్టర్ కుమార్ దీపక్ -
‘టీసీఏకు అధికారాలు కట్టబెట్టాలి’
బెల్లంపల్లి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అవినీతిలో కూరుకుపోయిన దృష్ట్యా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు అధికారాలు కట్టబెట్టాలని టీసీఏ జిల్లా ఇన్చార్జి పైడిమల్ల నర్సింగ్ అన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీసీఐ ఏటా హెచ్సీఏకు అందజేస్తున్న రూ.100 కోట్లు తెలంగాణలోని ఏ జిల్లాలోనూ ఖర్చు చేయలేదని తెలిపారు. నిధులతో ఏ క్రీడాసామగ్రి కొనుగోలు చేశారు, ఏ జిల్లాలో ఎంతమందికి శిక్షణ ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా టీసీఏ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, కోచ్లు శేఖర్, గౌతమ్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
తిర్యాణి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన అక్కిపల్లి మల్లేశ్ (45) మానసిక స్థితి బాగోలేక మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం శంకర్ అనే వ్యక్తికి చెందిన చేనులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంటరితనం భరించలేక యువకుడు..లోకేశ్వరం: ఒంటరితనం భరించలేక గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన మాడబోయి శ్రీనివాస్(27) తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో సోదరి కవితతో కలిసి పెద్దమ్మ పోసాని వద్ద ఉంటున్నారు. మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని రూ.2.50 లక్షలు ఖర్చుచేసి ఇంటికి మరమ్మతులు చేయించాడు. సంబంధాలు కుదరకపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఆదివారం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా సోమవారం పంచగుడి వంతెన వద్ద శవమై కనిపించాడు. మృతుని పెద్దమ్మ పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరు..భైంసారూరల్: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పేండ్పెల్లి గ్రామానికి చెందిన తో కల గంగాధర్ (29) కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానియ్యాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహా న్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎ స్సై తెలిపారు. మృతుని భార్య, కుమార్తె ఉన్నారు. ఉద్యోగం రాలేదని ఒకరు..కాగజ్నగర్టౌన్: పట్టణంలోని న్యూకాలనీకి చెందిన పెరుగ నిఖిల్ సాత్విక్ (30) బీటెక్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధంసోన్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని సంఘంపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఆర్ఐ అల్మున్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గొర్రె శ్రీకాంత్ పెంకుటింట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. స్పందించిన స్థానికులు ఫైరింజన్కు సమాచారం అందించడంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంట్లోని బీరువా, బట్టలు, రూ.లక్ష నగదు, బంగారం, సామగ్రి దగ్ధమైనట్లు తెలిపారు. సుమారు రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు శ్రీకాంత్ కోరుతున్నాడు. -
జనావాసాల్లోకి చుక్కల దుప్పి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ పంచాయతీలోని కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో గల గాంధారీ ఖిల్లా సఫారీలో తిరుగాడుతున్న చుక్కల దుప్పి సోమవారం దారితప్పి బెటాలియన్ పరిసరాల్లోని నివాస గృహాల్లోకి వచ్చింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ ప్రాంతంలోకి పంపించారు. యువకుడిపై కత్తితో దాడి●● ముగ్గురిపై హత్యాయత్నం కేసు రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొమ్మ సంతోష్పై అదే గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ ఆదివారం రాత్రి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరికి ట్రాక్టర్ల విషయంలో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. పాత కక్షలను మనసులో పెట్టుకున్న వెంకటేష్ సంతోష్ను ఇంటికి పిలిపించి తండ్రి రాయపోశం, తల్లి శారదతో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్, అతని తల్లిదండ్రులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కుమారుడిని కిడ్నాప్ చేసిన తండ్రిపై కేసుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని గాంధీనగర్కు చెందిన మహ్మద్ ఆసిమ్–సుమేర దంపతులు గొడవలతో కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఆసిమ్ రెండో భార్యతో ఉంటున్నాడు. సోమవారం సుమేర వద్దకు వచ్చి తాను ఇకనుంచి నీతోనే ఉంటానని చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంటి బయట ఆడుకుంటున్న ఆయన మూడేళ్ల కుమారుడు ఎండీ ఉమర్ను కిడ్నాప్ చేసినట్లు సుమేర చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు వివరించారు. దస్తురాబాద్లో చోరీదస్తురాబాద్: మండల కేంద్రానికి చెందిన బోమ్మడి సంగీత ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. ఆమె భర్త పోషమల్లు విదేశాలకు వెళ్లటంతో రాత్రి సమయంలో తల్లి బింగి రాజవ్వ ఇంట్లో పడుకుంటోంది. ఇదే అదునుగా భావించిన దొంగ ఆదివారం రాత్రి ఇంట్లో దూరి గ్యాస్ సిలిండర్లు, ల్యాప్టాప్, ఇంటి సామగ్రి దొంగిలించాడు. బాధితురాలు ఉదయం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగులకొట్టి ఉండడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన మోతే రాజేందర్ను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో సామగ్రి రికవరీ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లు షఫీఉద్దీన్, సమంత్రెడ్డిలను ఎస్సై సాయికుమార్ అభినందించారు. -
వాగు దాటి వైద్యం అందించి..
కెరమెరి: కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యసిబ్బంది సోమవారం మండలంలోని లక్మాపూర్ వాగు దాటి గ్రామానికి వెళ్లి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు. అనుమానితుల వద్ద నుంచి రక్తపూతలు సేకరించారు. వానాకాలం వచ్చిందంటే అటు ప్రజలకు, ఇటు అధికారులకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. కార్యక్రమంలో సూపర్వైజర్ మెస్రం సోము, హెచ్ఏలు వసంత్, శంకర్, ఏఎన్ఎం సుమలత, ఆశా వర్కర్ తారా, తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్ రాథోడ్ జలేందర్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని చిత్తాబట్టలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండడంతో నీటి ప్రవాహంలో వాగును దాటి గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ గంగమ్మ, ఏఎన్ఎంలు సంతోషిని, దేవిక, సునీత, తదితరులు పాల్గొన్నారు -
కారు డివైడర్ను ఢీకొని సింగరేణి కార్మికుడు..
శ్రీరాంపూర్: సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీసీ ఆర్కే 5 కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తగరం సంతోష్ (37) అనే సింగరేణి కార్మికుడు మృతి చెందగా మరో కార్మికుడు మహేశ్వర్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్కే 5 గనికి చెందిన జనరల్ అసిస్టెంట్ తగరం సంతోశ్, సపోర్టుమెన్గా పని చేస్తున్న మహేశ్వర్రెడ్డి కారులో పనిమీద బయటకు వెళ్లి నాగార్జున కాలనీలో ఉన్న ఇంటికి వస్తుండగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద డివైడర్ను ఢీకొన్నారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందాడు. మృతునికి భార్య రవీణా, పిల్లలు హన్సిత్, త్రిశూల్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉపేందర్రావు తెలిపారు. ఐఎన్టీయూసీ నేతల పరామర్శ ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, ఇతర నాయకులు ఏరి యా ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్వర్రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గరిగే స్వామి, పిన్నింటి మల్లారెడ్డి, మహేందర్రెడ్డి, చందుమోహన్, నంబయ్య, జగదీశ్, పాల్గొన్నారు. -
స్తంభం పైనుంచి జారి పడి ఒకరు మృతి
బేల: మండలంలోని సిర్సన్న గ్రామంలో సోమవారం సాయంత్రం విద్యుత్ స్తంభంపై వీధి దీపాలు పెడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి గోదురి లస్మన్న (42) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రైవేటు లైన్మెన్ గోదురు లస్మన్న గ్రామంలోని ఓ కూడలిలో విద్యుత్ స్తంభంపై ఎక్కి వీధి దీపాలు పెడుతుండగా ప్రమాదవశాత్తు జారి సీసీ రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై మధుకృష్ణ, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఫెయిల్యూర్ సక్సెస్కు అడ్డు కాదు
బాసర: ఫెయిల్యూర్ అనేది సక్సెస్కు అడ్డుకాదని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. సోమవారం ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్తో కలిసి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ కంఫర్ట్ జోన్ , ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్, గ్రోత్ జోన్ అనే జీవన దశలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ ఒక శ్రీలెర్నింగ్ జోన్శ్రీ అని విద్యార్థుల అభ్యాసానికి, అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. అపజయాలను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. విజయం సాధించాలంటే నిరంతర కృషి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. సగటు విద్యార్థులు కూడా అసాధారణ విజయాలు సాధించగలరన్నారు. ముఖ్యంగా ధైర్యం, ధృఢ సంకల్పంతో ఎదగాలన్నారు. నిజమైన విజయం బయట నుంచి రాదని, అది మన లోపల నుంచే మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విద్యార్థులతో ముఖాముఖి -
యువకుడి అదృశ్యం
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన మూగ నగేష్ సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత బంధువులకు ఫోన్ చేసి తాను ఇంటికి రానని చెప్పాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అతని బంధువు కమలశోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. తానూరులో వివాహిత..తానూరు: మండల కేంద్రానికి చెందిన కటకం సోనీ (24)అదృశ్యమైనట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు.. తానూరుకు చెందిన సోనీకి ఆరేళ్ల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన పవన్తో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవల కారణంగా సోనీ తన తల్లిగారి ఊరైన తానూరులో ఉంటుంది. ఈనెల 11న పవన్ తానూరుకు వచ్చి పెద్ద కుమారుడిని తీసుకుని నాందేడ్ వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రి సోనీ చిన్న కుమారుడుని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాధితురాలి తండ్రి గంగాధర్ సోమవారం తానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరిపై కేసుఆదిలాబాద్టౌన్: నిజామాబాద్ జిల్లా జనకంపేటకు చెందిన ఎడ్ల వ్యాపారి మహ్మద్ సలీమ్ ఖురేషిని బెదిరించి రూ.20వేలు డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఘడియార్ మొహల్లాకు చెందిన సంటెన్న, ఖుర్షీద్నగర్కు చెందిన మజర్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు టూటౌన్లో ఫిర్యాదు చేయగా సంటెన్నను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మజర్ పరారీలో ఉన్నట్లు వివరించారు. దాడి కేసులో ఒకరికి జైలుఆదిలాబాద్టౌన్: కులం పేరుతో దూషించి గొడ్డలితో దాడి చేసిన వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక జడ్జి కుమార్ వివేక్ తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి పండరి తెలిపారు. 2022 జనవరి 31న జైనథ్ మండలంలోని గూడ గ్రామానికి చెందిన బాధితుడు మడావి రాజు తన భార్యతో కలిసి పిట్టగూడకు వెళ్లివస్తుండగా బండారి దేవన్న దారికి అడ్డుగా వచ్చి మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తనవద్ద లేవని చెప్పడంతో గొడవపడి గొడ్డలితో దాడి చేశాడు. గాయాలు కావడంతో బాధితుడు జైనథ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై బిట్లపెర్సెస్ కేసు నమోదు చేశారు. పీపీ రమణారెడ్డి 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చినట్లు వివరించారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు రెబ్బెన: వన్యప్రాణులను వేటాడినా హాని కలిగించినా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జి రెబ్బెన ఫారెస్టు రేంజ్ అధికారి భానేష్ అన్నారు. ఈనెల 9న అడవి పందిని హతమార్చిన కేసులో నిందుతులను సోమవారం రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని గోలేటికి చెందిన కుమురం భీంరావు, కన్నెపల్లి వెంకటేష్ అడవిపందిని వేటాడి హతమార్చినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి అడవి పంది మాంసం స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ ఎఫ్ఆర్వో చంద్రమోహన్, గోలేటి ఎఫ్బీవో వెంకటేష్ పాల్గొన్నారు. గంజాయి కేసులో రెండేళ్ల జైలుఆసిఫాబాద్అర్బన్: గంజాయి సాగు చేసిన కేసులో లింగాపూర్ మండలంలోని రావునూరుకు చెందిన కోట్నాక సోముకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవి. రమేశ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీ జగన్మోహన్రావ్, ప్రస్తుత ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ సీఐ రమేశ్, లింగాపూర్ ఎస్సై గంగన్న, ఆసిఫాబాద్ డివిజన్ కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఉద్యాన సాగుకు చేయూత
● పండ్లు, పూలతోటల పునరుద్ధరణకు చర్యలు ● సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేత ● లాభదాయకమైన పంటల సాగుకు ముందుకు రావాలని సూచనబెల్లంపల్లి: ఉద్యానవన పంటల సాగుకు ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం రా యితీలు ప్రకటించింది. ఫలసాయాన్నిచ్చే మొక్క ల పెంపకానికి, కూరగా యలు, పూలమొక్కల సాగుకు, తోటల పునరుద్ధరణకు బిందు, తుంపరసేద్యం పరికరాలు అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, సామాజిక వర్గాలకు చెందిన రైతులకు ప్రత్యేక రాయితీలను అమలు చేస్తోంది. ఔత్సాహిక రైతులు రాయితీ సదుపాయం సద్వినియోగం చేసుకుని లాభదాయకమైన పంటలను పండించడానికి ముందుకు రావాలని బెల్లంపల్లి ఉద్యానవన శాఖ అధికారి అర్చన కోరారు. ఉద్యాన శాఖ పథకాలు, ప్రభుత్వం కల్పించిన రాయితీ వివరాలను వెల్లడించారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ఈ పథకం కింద కొత్తగా తోటల పెంపకానికి ఔత్సాహిక రైతులకు ప్రభుత్వం తగిన చేయూతను అందిస్తోంది. మామిడి, నిమ్మ, జామతోటల పెంపకానికి ఎకరాకు రూ.19,200, బొప్పాయి సాగుకు రూ.7,200, డ్రాగన్ సాగుకు రూ.64,800, అరటి తోటకు రూ.16,800, పూలతోటకు రూ.8 వేలు, వయస్సు పైబడిన (20 నుంచి 30 సంవత్సరాలు) మామిడితోటల పునరుద్ధరణకు ఎకరాకు రూ.9,600, మల్చింగ్ కవర్ ఏర్పాటు చేసుకోవడానికి ఎకరాకు రూ.8వేల చొప్పున అందిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఈ పథకం రైతాంగానికి తగిన తోడ్పాటును అందిస్తుంది. పథకం ద్వారా అర ఎకరం విస్తీర్ణంలో శాశ్వత పందిరి నిర్మాణానికి రూ.50 వేలు ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత రోజుల్లో శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకుని కూరగాయలను సాగు చేయడం వల్ల పంట దిగుబడి పెరగడంతో పాటు అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిందు, తుంపర సేద్యం పథకం ఉద్యానవన పంటల సాగులో బిందు, తుంపర సేద్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. నీటిని పొదుపుగా వాడుకుని, మొక్కకు సరిపడా నీటిని, మోతాదుకు సరిపడా ఎరువులను బిందు, తుంపర సేద్యం ద్వారా అందించడం తేలికవుతుంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో పరికరాలు అందించనున్నారు. బీసీ రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు ఐదెకరాల వరకు 90 శాతం రాయితీని, తుంపర సేద్యం పరికరాలకు 75 శాతం రాయితీని ప్రభుత్వం వర్తింప జేసింది. జాతీయ వెదురు పథకం వెదురు సాగు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక రాయితీని కల్పించింది. జాతీయ వెదురు పథకం కింద రూ.24 వేలు అందించి 50 శాతం రాయితీని కల్పించింది. సాగుకు యోగ్యంకాని భూముల్లో వెదురు సాగు చేయడం వల్ల కొన్నాళ్లకు వెదురు చేతికంది లాభదాయకంగా ఉంటుంది. రైతులు అందించాల్సిన పత్రాలు ఆయా పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి రాయితీ పొందడానికి రైతులు తగిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైతుకు సంబంధించిన భూమి పట్టేదారు పాసు పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ పత్రాలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటో అందజేయాలి. గరిష్టంగా ఐదెకరాల భూమి కలిగిన రైతులు ప్రభుత్వ రాయితీ పొందడానికి అర్హులు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు లేదు. సంబంధిత ప్రాంతాల ఉద్యానవన శాఖ అధికారులకు పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. -
ఉరేసుకుని ట్రాన్స్జెండర్ ఆత్మహత్య!
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇంద్రవెల్లి: మండలంలోని సమాక గ్రామ పంచాయతీ పరిధిలోని రాముగూడ అటవీప్రాంతంలో ట్రాన్స్జెండర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు రాముగూడలో కొలాం గిరిజన తెగకు చెందిన టెకం బాపురావ్, చిన్నిబాయి దంపతులకు లక్ష్మీబాయి, రాజు, జంగు, టెకం ఆయు(30) అలియాస్ అరుణ సంతానం. ఐదేళ్లక్రితం తల్లిదండ్రులు మృతి చెందగా ఆయు(అరుణ) ట్రాన్స్జెండర్గా వేషం మార్చి గుడిహత్నూర్ మండలంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ నెల 8న ఇచ్చోడకు చెందిన స్నేహితుడు జాదవ్ అర్జున్తో కలిసి రాముగూడకు వచ్చాడు. పంటచేను వద్దకు వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అనంతరం ఆయు కనిపించకుండా పోయాడు. 9న సాయంత్రం జాదవ్ అర్జున్ రాముగూడకు వచ్చి ఆయు చేనులో ఉరేసుకున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే 10న మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న తోటి ట్రాన్స్జెండర్లు జాదవ్ అర్జున్పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ సోమవారం తహసీల్దార్ ప్రవీణ్కుమార్తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిర్వహించారు. గ్రామ పటేల్ టేకం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
యురియా కోసం రైతుల ఆందోళన
భీమిని: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్య వసాయ సహకార కేంద్రం(పీఏసీఎస్) ఎదు ట సోమవారం యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. భీమిని, కన్నెపల్లి మండలాల రైతులకు ఒకటే పీఏసీఎస్ భీమిని లో ఉండడంతో రైతులు బారులు తీరారు. 444 యురియా బస్తాలు మాత్రమే రావడంతో పీఏసీఎస్ సీఈవో రాజేశ్వర్రావుతో వాగ్వాదానికి దిగారు. ఏడీఏ సురేఖ భీమినికి చేరుకుని రైతులకు టోకెన్లు అందజేసి యూరియా పంపిణీ చేశారు. ఫర్టిలైజర్ దుకాణంలో యూ రియా అధిక ధరకు విక్రయిస్తున్నారని ఏడీఏ దృష్టికి తీసుకెళ్లగా.. అధిక ధరకు విక్రయించి న వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
సర్కారు బడికే టీచర్ల పిల్లలు
● ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులుమంచిర్యాలఅర్బన్: ఇంటర్నేషనల్ సిలబస్, ఐఐటీ, నీట్ కోచింగ్ అంటూ సాగే ప్రచారానికి మారుమూల పల్లెల్లోనూ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల హవా కొనసాగుతున్న రోజులివీ. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు ఉపాధ్యాయులు తమపిల్లలను సర్కారు బడుల్లోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్, కేంద్రియ విద్యాలయం, మోడల్ స్కూల్, కేజీబీవీ, కోరుకొండ సైకిన్స్కూల్, బధిరుల ఉత్తమ పాఠశాల, జవహార్ నవోదయ పాఠశాలల్లో 21మంది పిల్లలను చేర్పించి చదివిస్తున్నారు. మరో ఐదుగురు జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో చేర్పించారు. తాము పని చేసే స్కూల్లోనే చదివిస్తున్న వారు కొందరైతే.. సమీపంలోని బడిలో చదివిస్తున్న వారు మరికొందరున్నారు. ప్రైవేటు కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్నంటూ ఆచరణలో చూపిస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.బోధిస్తున్న చోటే..వేమనపల్లి మండలం ముల్కలపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు(ఎస్జీటీ) ఎం.రాజయ్య పని చేస్తున్నారు. ఈ బడిలో 58మంది పిల్లలు ఉన్నారు. రాజయ్య కూతురు తేజస్విని ఐదో తరగతి, కుమారుడు శశికిరణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ‘నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉద్యోగం సాధించాను. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమం. ప్రైవేటులో అకాడమీ బేసిక్ కాకుండా బట్టీ విధానం ఉంటుందనే విషయాన్ని గ్రహించి ప్రభుత్వ పాఠశాలలోనే ప్రవేశాలు కల్పించాం. కళ్లముందర ఉండడంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతుంది. ఇద్దరు పిల్లలను చేర్పించాను...’ అని రాజయ్య వివరించారు -
యువతకు ఉపాధి అవకాశాలు
మంచిర్యాలఅగ్రిల్చర్: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, అధికారులతో కలిసి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీఈఈటీ యాప్ ద్వారా అభ్యర్థులు తమ విద్యార్హత, అనుభవం ఆధారంగా తగిన ఉద్యోగాల కోసం శోధించవచ్చని, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు, ఉద్యోగ మేళాలు, రెజ్యూమ్ తయారీ, కెరీర్ మార్గదర్శకత వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీభీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సంతోష్రావు 72సైకిళ్లు కొనిచ్చారు. సోమవారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జజ్జరవెల్లి, చెర్లపల్లి, టేకులపల్లి గ్రామాల నుంచి 72 మంది బాలబాలికలు వస్తున్నరాని ఉపాధ్యాయులు తెలపడంతో సంతోష్రావు సైకిళ్లు అందజేశారని పేర్కొన్నారు. ఎంఈవో రాము, సెక్టోరియల్ అధికారులు సత్యనారయణ, చౌదరి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగారావు, సుగణకార్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలరూరల్(హజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురైన హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోని నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని బీజేపీ నిరసన చేపట్టింది. సోమవారం హాజీ పూర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వాసిత బాధితులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండేకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు గాజు ల ముఖేశ్గౌడ్, వెంకటేశ్వర్రావు, స్వామిరెడ్డి, కృష్ణమూర్తి, రాజ్కుమార్, హేమంత్రెడ్డి, రవి గౌడ్, హరిగోపాల్, వెంకటకృష్ణ పాల్గొన్నారు. మోదీ పాలనలో పేదలకు సంక్షేమ ఫలాలుమంచిర్యాలటౌన్: ప్రధాని మోదీ పేదలకు సంక్షేమ ఫలాలు అందించారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కట్ట పోచమ్మ ఆలయం, శివాజీ గ్రౌండ్లో మార్కింగ్ వాకింగ్ చేస్తున్న వారికి సోమవారం మోదీ పాలనను వివరించి, పోస్టర్లు విడుదల చేశారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
ఇద్దరు పిల్లలూ..
జన్నారం మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చౌహాన్ కాంత, కిష్టాపూర్ జెడ్పీ పాఠశాలలో ప్రకాశ్ బానోత్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్యాభర్తలైన వీరిద్దరు ఇద్దరు పిల్లలను స ర్కారు బడిలోనే చేర్పించారు. దండేపల్లిలో పని చేస్తున్నప్పుడు ప్రకాశ్ బానోతు కూతురు శ్రీనిధిని దండేపల్లి జెడ్పీ పాఠశాలలో చదివించగా 2023లో ఎస్సెస్సీలో టాపర్గా నిలిచింది. పరిస్థితులు అనుకూలించక కుమారుడు సాత్విక్నాయక్ను ప్రైవేటు స్కూల్లో చదివించారు. కిష్టాపూర్కు బదిలీపై రాగానే కుమారుడిని ఎనిమిదో తరగతిలో చేర్పించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ‘నేను పాఠాలు బోధిస్తున్న పాఠశాలలోనే చక్కటి బోధన ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరు పిల్లలను చదివించడం ఎంతో అనుభూతి ఉంటుంది..’ అని ప్రకాశ్ తెలిపారు. -
నాటిక ప్రతీ మొక్కను సంరక్షించాలి
భీమిని: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అన్నారు. కన్నెపల్లి మండలం చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల, భీమిని మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం వన మహోత్సవంలో భాగంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. భీమిని మండలం జగ్గయ్యపేటలో ఎండోమెంటు కింద నిర్మించిన శివకేశవ ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల ప్రజల రవాణా సౌకర్యార్థం మంచిర్యాల నుంచి భీమిని మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింగారావు, డీఆర్డీఏ పీడీ కిషన్, ఎంపీడీవో గంగామోహన్, ఎంఈవోలు కృష్ణమూర్తి, రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదం లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నాయకులు సంగర్స్ రవీందర్రావు, శ్రీహరిరావు, ఎల్పుల రోహిత్, తదితరులు పాల్గొన్నారు. -
విస్తరిస్తున్న డెంగీ
మంచిర్యాలటౌన్: జిల్లాలో డెంగీ కేసులు విస్తరిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిలో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రికార్డుల్లో 12 డెంగీ కేసులు, రెండు మలేరియా కేసులు నమోదయ్యాయి. లక్సెట్టిపేట మండలంలో 2, మందమర్రిలో 3, బెల్లంపల్లిలో 3, మంచిర్యాల పట్టణంలోని హైటెక్సిటీ కాలనీలో 1, తాండూరులో 1, మరో ఇద్దరికి డెంగీ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలకు వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ చేయిస్తున్నారు. ఇప్పటికే జ్వరాల బారిన పడిన వారి రక్త నమూనాలు సేకరించి టీహబ్కు పంపిస్తున్నారు. ప్రబలుతున్న వైరల్ ఫీవర్లుచెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీతోపాటు చెన్నూర్, కోటపల్లి మండలాల్లో వైరల్ ఫీవర్లు ప్రబలుతున్నాయి. జ్వరాలు, జలుబు, దగ్గుతో చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బావులు, బోర్లలో కొత్త నీరు చేరింది. నీటి వనరులు, బావులు, ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయకపోవడంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై గుంతల్లో నీరు నిలిచి బురదగా మారుతున్నాయి. కాలనీలు, గుంతలు, డ్రెయినేజీ నీటిలో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, ఇళ్ల ఆవరణలో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెన్నూర్ సీహెచ్సీ సూపరింటెండెంట్ డి.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 12 కేసులు నమోదు అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ -
కడెం ఆయకట్టుకు సాగునీరు
● నేడు విడుదల చేయనున్న ఎమ్మెల్యే బొజ్జు ● ఖరీఫ్ పంటలకు భరోసా.. ● సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కడెం: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కింద సాగుచేసిన ఖరీఫ్ పంటలకు సాగునీరు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. జలాశయంలో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో మంగళవారం ఉదయం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జూలై 14న ప్రా జెక్టు నీటిమట్టం 683.625 అడుగులు ఉండగా, ఈ ఏడాది 694.600 అడుగులకు చేరడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తాజాగా అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం నీటిని విడుదల చేస్తారని ప్రాజెక్టు ఈఈ విఠల్ తెలిపారు. కాలువ మరమ్మతు పూర్తి..కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు రూ.33.5 లక్షలతో కడెం, దస్తురాబాద్ మండలాల పరిధిలో 16 కిలోమీటర్ల మేర ఇటీవల మరమ్మతు పనులు చేపట్టారు. పిచ్చిమొక్కలు, చెత్త, పూడికను తొలగించి, దెబ్బతిన్న కాలువలను బాగు చేశారు. ఈ మరమ్మతులతో కాలువ శుభ్రమై, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందనుంది. రైతుల్లో ఉత్సాహం.. కడెం ప్రాజెక్టు కాలువల ద్వారా వానాకాలం సీజన్లో కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల పరిధిలోని 68,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గతేడాదికన్నా ముందుగానే నీటిని విడుదల చేస్తుండడంతో సాగు జోరందుకోనుంది. చివరి ఆయకట్టు వరకు వానాకాల పంటల సాగుకు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందిస్తాం. ప్రాజెక్టులో ఆశాజనకంగా నీటిమట్టం ఉండడంతో సాగునీటిని వదలాలని నిర్ణయించాం. ఇంకా రెండు నెలలు వర్షాలు కురుస్తాయి. మంచి వర్షాలు కురిస్తే యాసంగి పంటలకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది. – విఠల్, ప్రాజెక్టు ఈఈ -
ఒత్తిడి ఉండదు..
సుద్దాల జిల్లా పరి షత్ ఉన్నత పాఠశా ల బయోలజీ ఉపాధ్యాయుడు కే.రవీందర్ తన కుమారు డు రఘురామ్ను ప్రభుత్వ బడిలోనే చదివి స్తున్నారు. మొదట్లో పార్పల్లి హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తుండగా.. సమీపంలోని ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. ఐదో తరగతి పూర్తి కావడం, రవీందర్కు సుద్దాల పాఠశాలకు బదిలీ కా వడంతో ఆరో త రగతి నుంచి అదే స్కూల్లో చేర్పించి చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా డు. ‘పిల్లలపై ఒత్తిడి లేకపోవడం, పిల్లలకు అవసరమేదో బోధించేందుకు నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉండడం, విశాలమైన గదులు, అన్ని సబ్జెక్టులకు టీచర్లు, డిజిట ల్ టీచింగ్ బోర్డు, ఏఐ బోధన ఇలా కార్పొరేటుకు దీటుగా విద్యనందిస్తోందని సర్కారు బడిలోనే చేర్పించాను..’ అని రవీందర్ తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి 10వ వార్డు పరిధిలో 20ఏళ్ల క్రితం అంగన్వాడీ కేంద్రం ఉండేది. అప్పటి నాయకుల ఒత్తిడితో కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధి నాయక్గూడెం తరలించారు. మా పరిధిలోని పిల్లలు, గర్భిణులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయగా సర్వే చేశారు. ఇంతవరకు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి. – కొక్కే చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్, బెల్లంపల్లి -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీశాఖ అధికారి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, భూ పరిహారం, పోడు భూములు, తదితర సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. తన తల్లి గొర్రె లస్మమ్మ పేరిట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 వానాకాలం సీజన్ రూ.74,933 తీసుకున్నామని, 2023 మార్చి 24న తన తల్లి చనిపోయిందని, ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదని, రుణమాఫీ అయ్యేలా చూడాలని హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన గొర్రె దయాకర్ కోరారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం ఆర్థిక లావాదేవీలు దేవాదా య శాఖ పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బొక్కలగుట్ట గ్రామానికి చెందిన బలికొండ కిషన్ కోరారు. ఆదాయం దుర్వినియోగం కాకుండా చూడాలని విన్నవించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది లోన్లు ఇస్తలేరు కన్నెపెల్లి మండలం దాంపూర్ పోడు రైతులం. ఆర్వోఆర్ పట్టాభూమి పాస్పుస్తకాలు అందించారు. 2024లో బ్యాంకులో పంటలోను ఇచ్చారు. వడ్డీతో కలిపి చెల్లించాం. ఈ ఏడాది బ్యాంకు అధికారులు పంటలోన్లు ఇస్తలేరు. – దాంపూర్, కన్నెపెల్లి మహిళా రైతులు -
పిల్లల స్థాయికి తగినట్లుగా చదువు
నెన్నెల మండలం కొత్తూరు ఎంపీయూపీఎస్లో జీవనకుమారి స్కూల్ అసిస్టెంట్(సోషల్) టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కుమారుడు జెస్సిల్ ప్రిన్స్ను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. తాను విధులు నిర్వర్తించే పాఠశాల దూరం కావడంతో దగ్గరలో ఉన్న నస్పూర్ మండలం తీగలపహాడ్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల స్థాయి కంటే ఎక్కువగా.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల స్థాయికి తగినట్లుగా చదువులు ఉంటాయని ఆమె గుర్తు చేశారు. నిపుణులైన గురువులు ఉంటారని, తన కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని పేర్కొన్నారు. -
అభివృద్ధిలో అగ్రగామి..
● నాకు మధిర ఎంతో.. మంచిర్యాల అంతే ● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ● పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలు ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ● జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం ● నలుగురు మంత్రుల రాకతో పండుగ వాతావరణందండేపల్లి/ జన్నారం/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో రా ష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచి ర్యాల జిల్లా పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు పు ష్కల అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నా రు. లక్సెట్టిపేటలో నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ల ప్రేమ్సాగర్రావుతో కలిసి ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శ క్తి సౌర విద్యుత్ ప్రాజెక్టు, హాజీపూర్ మండలం వేంపల్లిలో 212 ఎకరాల్లో నిర్మించే దత్తసాయి ఇండస్ట్రీయల్, ఐటీ, ఆటోనగర్ పార్కుల పనులకు శంకుస్థాపన చేశారు. నలుగురు మంత్రుల రాకతో జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజల మద్దతుతో ముందుకు..మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడు తూ, నియోజకవర్గ ప్రజల మద్దతు, నమ్మకంతోనే ముందుకు సాగుతున్నానని, వారి శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేస్తానని అన్నారు. ఇంద్రవెల్లి, నస్పూర్లో జరిగిన బహిరంగ సభలకు లక్షలాది మంది హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దండెపల్లి మండలంలో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, రెండు విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే.శశాంక్, అటవీ శాఖ కన్జర్వేటర్, ఫీల్డ్ డైరెక్టర్ శాంతా రాం, జిల్లా అటవీ శాఖా అధికారి శివ్ ఆశిశ్సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, కలెక్టర్ కుమార్ దీపక్, ఎఫ్డీవో సర్వేశ్వర్, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి అత్తె సుభాష్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, డీఎంహెచ్వో హరీశ్రాజ్, సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ కోటేశ్వర్ డీసీపీ భాస్కర్, ఏసీసీ ప్రకా శ్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్, ప్రేమ్చంద్, శ్రీనివాస్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మధిరతో సమానం..మంచిర్యాల జిల్లాను తన సొంత నియోజకవర్గం మధిరతో సమానంగా భావిస్తూ రాష్ట్రంలో రోల్మాడల్గా నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెబ్బెనపల్లిలో ఇందిర మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాలలో 650 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, లక్సెట్టిపేటలో 50 పడకల ఆస్పత్రి, కళాశాల భవన నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఎమ్మెల్యేప్రేమ్సాగర్రావు కోనట్లుగా దండెపల్లి మండలంలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 220, 400 మెగావాట్ల సబ్స్టేషన్లు దశలవారీగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం..లక్సెట్టిపేట: పట్టణంలో సామాజిక ఆస్పత్రి, ప్రభుత్వ కళాశాల భవనాల ప్రారంభోత్స వం తర్వాత మంత్రులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో సహపంక్తి భోజ నం చేశారు. పాఠశాలలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులలోని బెంచీలపై కూర్చుని చిన్నానాటి జ్ఞాపకాల ను గుర్తు చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి విద్యార్థి వద్ద పుస్తకాన్ని తీసుకుని చదివారు. కళాశాల గదులన్ని తిరిగి చూశారు. విద్యార్థి సంఘం నాయకులు స్కాలర్షిప్ల విడుదల కోసం వినతిపత్రం అందజేశారు. -
అందుగులపేటలో సోలార్ ప్లాంట్
జన్నారం/ దండేపల్లి: దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళాశక్తి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ దండేపల్లి మండలం అందుగులపేట(వెల్గనూర్) గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రోజుకు సుమారు 4,500 నుంచి 5 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. ఏడాదికి రూ.51 లక్షల ఆదాయం వస్తుందని వెల్లడించారు. నర్సింగాపూర్ గ్రామంలో రూ.1.63 కోట్ల సీఎస్సార్ నిధులతో 900 మీటర్ల సీసీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. రూ.80 లక్షల ఉపాధి హామీ నిధులతో నాలుగు గ్రామపంచాయతీ భవనాలు, రూ.48 లక్షలతో నాలుగు అంగన్వాడీ భవనాల నిర్మిస్తామని పేర్కొన్నారు. రూ.80 కోట్ల చెక్కులు పంపిణీ..జిల్లాలోని 863 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.80 కోట్ల విలువైన చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. 8 మందికి ప్రమాద బీమా కింద మంజూరైన రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందించారు. రుణ బీమాకు సంబంధించి రూ.73.37 లక్షలను 83 మంది సభ్యులకు అందజేశారు. వడ్డీ లేని రుణాలు 8,750 మందికి రూ.17,78 కోట్లు అందించారు. -
ప్రజలను ఇబ్బందిపెడితే.. నన్ను పెట్టినట్లే!
● అటవీ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆగ్రహంబెల్లంపల్లి: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అటవీ శాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. ‘‘ప్రజలను ఇబ్బంది పెడితే, నన్ను ఇబ్బంది పె ట్టినట్లే,’’ అని హెచ్చరించారు. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన వనమహోత్సవంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు విన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక తెచ్చుకోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. రైతుల ఆందోళన..అంతకుముందు, ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయం వద్ద బెల్లంపల్లి, నెన్నెల మండలాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారులు తమ పత్తి పంటలను ధ్వంసం చేసి, వ్యవసాయం చేయకుండా వేధిస్తున్నారని తెలిపా రు. కొందరు రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటనలకు అటవీ అధి కారులే కారణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశా రు. వనమహోత్సవానికి హాజరైన బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్, డెప్యూటీ రేంజ్ అధికా రి గౌరి శంకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సక్రమంగా విధులు నిర్వహిస్తే స్వాగతం, లేకపోతే న మస్కారం చేసి పంపిస్తా,’’ అని హెచ్చరించారు. ప్ర జల ఇబ్బందులను డీఎఫ్ఓ, మంత్రికి తెలియజేస్తానని, ప్రజలను వేధించడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమేనని అన్నారు. సహకరించకుంటే చర్యలు..తన నియోజకవర్గంలో పోడు రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని అటవీ అధికారులకు స్పష్టం చేశారు. ‘‘చెన్నూర్లో నా సోదరుడు (ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్)కి ఒక రూల్, నాకు మరొక రూల్ ఎలా సమంజసం?’’ అని ప్రశ్నించారు. అటవీ అధికారులు సహకరించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ప్రజా సమస్యలను ప్రధానమంత్రికి కూడా చెప్పే దమ్ము నాకుంది,’’ అని స్పష్టం చేశారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి హామీపోడు భూముల సమస్యలను తన దృష్టికి తీసుకొ స్తే, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అటవీ అధికారులు నేరుగా రైతుల పంటలను ధ్వంసం చేయడం మానుకోవాలని ఆదేశించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. -
కొత్త బొగ్గు గనులు రావాలి
● లేదంటే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం ● కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిరామకృష్ణాపూర్: సింగరేణి కొత్త గనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడ్డారు. రామకృష్ణాపూర్లోని ఆర్కే1 సుభాష్నగర్ కాలనీని ఆదివారం సందర్శించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై సీపీఐ నాయకులు మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వివేక్ మాట్లాడుతూ కొత్త గనుల ఏర్పాటు విషయమై తాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడానని తెలిపారు. కేబినేట్ సమావేశంలోనూ కొత్త గనుల ఏర్పాటుపై చర్చించామన్నారు. మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికల జరిపించాలని ఇప్పటికే న్యాయస్థానంలో అఫిడవిట్ వేసినట్లు చెప్పారు. కోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సుభాష్నగర్లో ఓపెన్జిమ్, డ్రైనేజీలు, రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి...క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయాన్ని మంత్రి వివేక్ ఆదివారం సందర్శించారు. ఈ నెల 20న బోనాల జాతర నిర్వహించనుండగా స్థానికులతో కలిసి జాతర పోస్టర్ ఆవిష్కరించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మైసమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని పలువురు మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం నాయక్పోడ్ సంఘం నాయకులతో కలిసి మంత్రి గాంధారి ఖిల్లాను సందర్శించారు. కాలభైరవుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాయలింగు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, సీపీఐ నాయకులు రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన పెన్కాక్ సిలాట్ శిక్షణ
నస్పూర్: స్థానిక సాధన స్పోర్ట్స్, డిఫెన్స్ అకా డమీలో నిర్వహించిన పెన్కాక్ సిలాట్ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. కార్యక్రమాని కి అంతర్జాతీయ క్రీడాకారుడు, తెలంగాణ రాష్ట్ర పెన్కాక్ సిలాట్ కార్యదర్శి సతీశ్గౌడ్ హా జరై జిల్లా క్రీడాకారులకు మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ క్రీడకు సంబంధించిన సర్టిఫికెట్స్కు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ప్రత్యేక రిజ ర్వేషన్ ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఈ క్రీడకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కోసం కృషి చేయాలన్నారు. ఈ శిక్షణలో సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా పెన్కాక్ సిలాట్ చైర్మన్ రంగ రమేశ్, అధ్యక్షుడు పోచంపల్లి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి కొండబర్థి సందీప్, కోశాధికారి మోయిస్ఖాన్, ఉపాధ్యక్షుడు రంగు శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ ఆకుతోట నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
● ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుమంచిర్యాలక్రైం: మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ ప్రధాన చౌరస్తాలో రూ.78 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయల్లోకి వచ్చానన్నారు. తాను ఆందరిలా మాటలు చెప్పి తప్పించుకునే రకం కాదని, ఇచ్చినమాటకు కట్టుబడి పనిచేస్తానన్నారు. రోడ్డు విస్తరణపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, రానున్న రోజుల్లో దీని ఫలితాలు ప్రజలు అనుభవిస్తారని పేర్కొన్నారు. 15 రోజులో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్31 వరకు రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని తెలిపారు. -
మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం
దండేపల్లి/జన్నారం/మంచిర్యాల రూరల్ (హాజీపూర్)/ లక్సెట్టిపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబ డి ఉందని, రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గంలో మహిళల కోసం మైక్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి, వారు వ్యాపారాలు చేసుకునేలా కార్యక్రమాలు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వులతో కలసి భట్టి విక్రమార్క పర్యటించారు. లక్సెట్టిపేట లో నూతనంగా నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ప్రారంభించారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన మహిళలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు అవహేళన చేశారు. కానీ మొదటి సంవత్సరంలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కేటాయించి, ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేస్తున్నాం. మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పించి, బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తున్నాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాల కోసం మహిళా సంఘాలకు స్థలాలు కేటాయించాం’అని భట్టి చెప్పారు.సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చుఇందిరమ్మ ఇళ్ల పథకంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రూ.22,500 కోట్లతో మొదలుపెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రవేశపెట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం కింద ఉచిత సోలార్ పంప్సెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, అవకాడో, వెదురు మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామ న్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రివర్గం దృష్టి సారించిందని తెలిపారు.మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుమంచిర్యాలలో 212 ఎకరాల్లో దత్తసాయి ఇండస్ట్రియల్, ఐటీ, ఆటోనగర్ పార్కు ఏర్పాటుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 300 ఎకరాల్లో ఈ పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రూ.30 కోట్లు కేటాయించామని, ఈ ప్రాజె క్టు ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. -
నీట్లో విద్యార్థి ప్రతిభ
లక్సెట్టిపేట: నీట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని బలరావుపేట గ్రామానికి చెందిన కందుల కుషీంద్రవర్మ ప్రతిభ కనబర్చి రాష్టస్థాయి 59 ర్యాంకు సాధించాడు. పదో తరగతి వరకు పట్టణంలోని గుడ్ షెప్పర్డ్ పాఠశాల, చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి మంచి మార్కులు సాధించాడు. ఈయన తండ్రి ప్రవీణ్కుమార్ ప్రైవేటు టీచర్, తల్లి సుమలత గృహిణి. కుమారుడు నీట్లో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు. గుడుంబా పట్టివేతజైపూర్: బైక్పై గుడుంబా తరలిస్తుండగా ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. భీమారం మండల కేంద్రంలో ఆరెపల్లి క్రాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తూర్ మండలం లంబాడితండాకు చెందిన ధరావత్ శంకర్ బైక్పై 30లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించగా జోడువాగు వద్ద శంకర్ను అదుపులో తీసుకుని బైక్, గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బాసరలో ముగిసిన గురుపౌర్ణమి వేడుకలుబాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు గురువారంతో ముగిశాయి. వ్యాసమహర్షి, సరస్వతి, వ హాంకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఉన్నారు. -
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఎస్సై ఇ.సాయన్న, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలో దనోరా(బి) పంచాయతీ పరిధి ఇన్కార్గూడకు చెందిన ఎల్నారే అనిల్, ఉమ దంపతులకు ఏకై క కుమారుడు శుభం(23). డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 7న మద్యం తాగి ఇంటికొచ్చిన కుమారుడిని రోజు మద్యం ఎందుకు తాగుతున్నానవని తల్లి ఉమ మందలించింది. క్షణికావేశంతో వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి చెప్పాడు. గ్రామస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ వాహనంలో ఆదిలాబాద్లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒకరు.. సోన్: అప్పుల బాధ, భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని న్యూవెల్మల్ గ్రామానికి చెందిన పట్టం పోశెట్టి(34) గతంలో దుబాయ్ వెళ్లి అప్పుల పాలయ్యాడు. భార్య పోసవ్వ అలియాస్ అరుణకు కుమారుడు ఉన్నాడు. ఆమె ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అటు అప్పుల బాధ, ఇటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన పోశెట్టి గురువారం ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. మృతుడి అక్క ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. -
ఎలక్ట్రానిక్స్ గోదాంలో చోరీ
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని మోహన్ ఎలక్ట్రానిక్స్ గోదాంలో జరిగిన దొంగతనాన్ని నిర్మల్ పోలీసులు ఛేదించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రూరల్ సీఐ కృష్ణ వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా గోదాంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించకుండా పోవడాన్ని యజమాని వెంకటరమణ గుర్తించారు. దీంతో ఆడిట్ నిర్వహించారు. అనుమానాస్పదంగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నవత్ శ్రీకాంత్, జిందాడే సచిన్, సాబ్లే జగదీశ్వర్, కూసులే నవీన్ను విచారించగా వారు దొంగతనానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన వస్తువులను తరలించేందుకు ఆటో డ్రైవర్ సయ్యద్ ఇమ్రాన్ సహాయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఫ్రిడ్జ్, గీజర్, సామ్సంగ్ టీవీ, ఆరు కూలర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇందులో ఎస్సై సంజీవ్ ఉన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్పల్లికు చెందిన శ్రీనివాస్తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పర్చారు. శ్రీనివాస్కు కోర్టు ఈ నెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. లోన్లు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి రిమాండ్ఆదిలాబాద్టౌన్: లోన్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్లో గురువారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తాపూర్ రూరల్ డెవలప్మెంట్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీకి చెందిన రమేశ్ రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని ప్రజల వద్ద రూ.25 వేలు తీసుకుని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ అన్నీతానై కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. కుటుంబం కోసం వ్యాపారం ప్రారంభించి, తమ్ముడు అశోక్ను ఉన్నతంగా చదివించాడు. అన్న కష్టానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాత్నాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఇటీవల గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 250వ ర్యాంక్, గ్రూప్–3లో 417 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం తల్లితోపాటు వివాహమైనప్పటికి సోదరులు ఇద్దరు ఉమ్మడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, తల్లి మొత్తం తొమ్మిది మంది ఒకే చోట ఉంటున్నారు. -
హోరాహోరీగా బాలికల ఫుట్బాల్ పోటీలు
● సెమీస్కు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జట్లు రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రస్థాయి బాలికల జూనియర్స్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఉదయం లీగ్ కమ్ నాకౌట్ పోటీలు నిర్వహించారు. మధ్యాహ సమయంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్సాహంగా సాగాయి. మహబూబ్నగర్–నల్గొండ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు దీటుగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. దీంతో పెనాల్టీ షూటౌట్లు నిర్వహించారు. ఇందులో నల్గొండ జట్టు 2–1 తేడాతో మహబూబ్నగర్పై గెలిచి సెమీస్కు చేరింది. మరో క్వార్టర్ ఫైనల్లో వనపర్తి–ఖమ్మం జట్లు తలపడగా 0–1 తేడాతో ఖమ్మం గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో నిజామాబాద్–గద్వాల్ జట్లు తలపడగా 7–1 గోల్స్తో నిజామాబాద్ గెలుపొందింది. ఇక ఆతిథ్య ఆదిలాబాద్ జట్టుకు క్వార్టర్ ఫైనల్స్లో నిరాశే ఎదురైంది. రంగారెడ్డి–ఆదిలాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 4–0 గోల్స్తో రంగారెడ్డి గెలిచి సెమీస్కు చేరింది. శుక్రవారం ఉదయం మొదటి సెమీఫైనల్ మ్యాచ్ నల్గొండ–నిజామాబాద్ల మధ్య, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఖమ్మం–రంగారెడ్డి జట్ల మధ్య జరుగనుంది.