breaking news
Mancherial
-
సీతక్క ఎదుగుదల ఓర్వలేకనే విమర్శలు
ఆదిలాబాద్రూరల్: మంత్రి సీతక్క ఎదుగుదల ఓర్వలేకనే కొంతమంది అగ్రవర్ణ రాజకీయ పార్టీల నాయకులు ఆమైపె లేనిపోని విమర్శలు చేస్తున్నార ని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. శనివారం మావల మండలంలోని బట్టిసావర్గాం శివారులో గల కుమురం భీం గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి సీతక్కను ధూషిస్తున్నారన్నారు. సమావేశంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెందూర్ దాదిరావు, వెట్టి మనోజ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్రా పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్
● ముగ్గురిపై కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి ఆదిలాబాద్టౌన్: మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ బాలిక బంధువుల ఇంట్లో ఉంటూ పదోతరగతి చదువుతోంది. ఈ నెల 2న ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఘంటంజీ తాలుకా కిన్హి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నిర్మల బాపూణ్య ఆత్రం, బాపూణ్య రాజారాం ఆత్రం బాలిక ఇంటికి వచ్చారు. కిన్హిలో ఓ కార్యక్రమం ఉందని మాయమాటలు చెప్పి ఆదిలాబాద్కు తీసుకొచ్చారు. బస్సులో నాగ్పూర్కు తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి రైలులో రాజస్థాన్లోని కోటాకు తీసుకెళ్లి కరణ్ అలియాస్ భగవత్ మీనన్కు అప్పగించారు. అతని వద్ద నుంచి రూ.10వేలు తీసుకున్నారు. కరణ్ బాలికను తన ఇంట్లో అక్రమంగా నిర్బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు ఈ నెల 22న భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు ఆ బాలికను రైలులో ఆదిలాబాద్కు తీసుకురాగా 25న ఇంటికి చేరుకుంది. నిందితులు శనివారం రైలుమార్గంలో ఆదిలా బాద్ నుంచి పారిపోతుండగా రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్తో పాటు రూ.2వేల నగదును స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, భీంపూర్ ఎస్సై బి.పీర్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పుట్టినరోజే ఆగిన ఊపిరి
● 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి ఆదిలాబాద్టౌన్: నవమాసాలు మోసి.. కంటికి రెప్పలా కాపాడిన ఓ తల్లికి తీరని గర్భశోకం మిగి లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్ల లను రోడ్డు ప్రమాదం కబళించింది. పక్షం రోజుల క్రితం ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడిని, తల్లిని కోల్పోయిన సృజనిత శనివారం కుమార్తెను కూడా కోల్పోయింది. ఉన్న ఇద్దరు పిల్లలు దూరం కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. దైవదర్శనానికి వస్తుండగా ఈనెల 16న బిర్సాయిపేట మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. అందులో ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఈర్ల రా జు, అతని భార్య సృజనిత, అత్తమ్మ గంట విజయ, కు మారుడు సహర్ష్తో పాటు కుమార్తె అద్యశ్రీ (12) ప్ర యాణించారు. సహర్ష్, గంట విజయ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అద్యశ్రీ ని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 12 రోజుల పా టు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి శనివారం తన పుట్టిన రోజునాడే తనువు చాలించింది. పుట్టిన రోజునాడే చిన్నారి దూరం కావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే చిన్నారుల మరణంతో కాలనీలోనూ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివా రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
బాసరలో సీసీ కెమెరాలు ధ్వంసం
బాసర: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. పీఎంశ్రీ పథకం కింద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి రెండింటిని ఎత్తుకెళ్లారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు నరసయ్య పాఠశాలను తెరిచే సరికి సీసీ కెమెరాలు చిందరవందరంగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. గతంలో సైతం పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి దుశ్చర్యలకు పాల్పడ్డారని, అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డాగా మా రిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. హీరాసుక్క ఆశయ సాధనకు కృషి బజార్హత్నూర్: ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదివాసీల గోండి ధర్మ గురువు హీరాసుక్క ఆశయ సాధనకు కృషి చేస్తామని పర్ధాన్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నాగేశ్వర్ అన్నారు. శనివారం మండలంలోని యేసాపూర్లో హీరాసుక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉయికే సుదర్శన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సిడం కిషన్, ఐటీడీఏ పీవీటీజీ అధ్యక్షుడు మేస్రం మనోహర్, కౌడుజీ, మడావి నరహరి, నర్సయ్య, పాండురంగ్, కొడప నగేష్, నైతం రమేష్, ఉత్తం, శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం
● నిధులు దుర్వినియోగం చేస్తున్న పీవోను బదిలీ చేయాలి ● ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం అధ్యక్షుడు సోనేరావుఆదిలాబాద్అర్బన్: పీవీటీజీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ నిధులు సక్రమంగా వినియోగించకుండా దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ కొలాం, తోటి, చెంచు, కొండరెడ్ల నిధులు దుర్విని యోగం చేస్తున్న ఐటీడీఏ పీవోను బదిలీ చేయాలని కలెక్టర్ను కోరామన్నారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించకుండా వైద్యారోగ్యం, పౌష్టికాహారంపై గిరిజన పల్లెలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికీ మంచినీటికి దూరంగా ఉన్నాయన్నారు. గిరిజన గ్రామాలను మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఉమ్మడి జిల్లా కొలాం, ఆదివాసీ గిరిజన గ్రామాలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆరా తీసి సక్రమంగా ఖర్చుచేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్రావు, గౌరవ అధ్యక్షులు టేకం రాజు, మడావి కిషన్, నాయకులు టేకం లక్ష్మణ్, కుమ్ర రాజు, టేకం జంగు, టేకం గణేశ్, బాలు, మడావి జంగు, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
తాండూర్: ఇసుక ట్రా క్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన విఘ్నేష్ (21) శనివారం తెల్ల వారుజామున తమ సొంత ట్రాక్టర్లో ఇసుక నింపుకుని టేకులపల్లి నుంచి అచ్చలాపూర్వైపు వస్తుండగా అదుపుతప్పి ఒర్రెలో పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. ముధోల్: ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. మండలంలోని వడ్తాలా గ్రామానికి చెందిన పవన్కుమార్ (28) ఈనెల 18న పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులకు చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. లారీ బోల్తా సాత్నాల: భోరజ్ మండల కేంద్రంలోని 44వ అంతర్రాష్ట్ర రహదారిపై చెక్పోస్ట్ వద్ద శనివారం అదుపుతప్పి లారీ బోల్తా పడింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన మతిన్ లారీలో జైపూర్ నుంచి చైన్నెకి ఎల్ఈడీ బల్బులు రవాణా చేస్తుండగా భోరజ్ చెక్పోస్ట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో చెక్పోస్ట్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడిళ్లలో చోరీకి యత్నం ముధోల్: మండల కేంద్రంలోని పలు కాలనీల్లో శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి యత్నించినట్లు ఎస్సై బిట్లా పెర్సిర్ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు రాత్రిపూట తాళం వేసిన ఇళ్లలో చోరీకి యత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి నగదు, ఆభరణాలు చోరీ కాలేదన్నారు. బాధితులు సట్లొల్ల గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. చోరీకి యత్నించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
మరో సూపర్ బజార్కు మంగళం..!
● ఇప్పటికే నస్పూర్లో మూసివేత ● ఈ నెల 30తో రామకృష్ణాపూర్లో క్లోజ్ ● సింగరేణి నిర్ణయంతో కార్మికులపై భారం ● రాయితీ సరుకులకు కార్మిక కుటుంబాలు దూరం ● ఉనికి కోల్పోనున్న కార్మిక క్షేత్రం సింగరేణి సంస్థ కార్మికులకు మేలురకమైన సరుకులు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్ బజార్లకు మంగళం పాడుతోంది. ఇటీవలే నస్పూర్లోని సూపర్ బజార్ను మూసివేసిన సంస్థ యాజమాన్యం ఇప్పుడు రామకృష్ణాపూర్ సూపర్ బజార్పై కన్నేసింది. జనరల్ మేనేజర్ కార్యాలయం, వర్క్షాప్, టింబర్యార్డు, స్టోర్స్.. ఇలా అనేక కార్యాలయాలు, భూగర్భ గనులతో తులతూగిన రామకృష్ణాపూర్ పట్టణం.. సూపర్ బజార్ మూసివేతతో ఉనికినే కోల్పోయే దుస్థితికి చేరనుంది. ఎంతో శ్రమకోర్చి చెమటోడ్చిన బొగ్గు గని కార్మికులు ఇప్పుడు సింగరేణి సూపర్ బజార్లకు నోచుకోని పరిస్థితి నెలకొంది. బొగ్గు గనులతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా యాజమాన్యం గండి కొడుతోందన్నా విమర్శల నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సూపర్ బజార్ ఈ నెలాఖరుతో మూతపడనుంది. పైనుంచి వెలువడిన ఆదేశాల మేరకు మూసివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి సరుకులను మందమర్రి సూపర్బజార్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మికులకు ఇప్పటి వరకు సూపర్ బజార్లు నిత్యావసర సరుకులే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అందిస్తూ వచ్చాయి. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్దెర రూపంలో నిత్యావసర సరుకులు లభిస్తుండేవి. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఈఎమ్ఐ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉండేది. ఉద్యోగుల వేతనం నుంచి డబ్బులు కట్ చేసేవారు. అయితే కొన్ని రోజులుగా ఇక్కడి సూపర్బజార్లో నిత్యావసర సరుకులు నిలిపివేయడమే కాకుండా మొత్తానికే ఎత్తివేస్తున్నారని తెలిసి స్థానికులు అవాక్కవుతున్నారు. సంస్థ మనుగడ కోసం తమ చెమటను ధారబోసినా కనీసం సూపర్బజార్లకు కూడా నోచుకోక పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ బజార్ అంటే ఓ బ్రాండ్...సింగరేణి వ్యాప్తంగా సంస్థ సూపర్ బజార్లంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. రామకృష్ణాపూర్లో షాపు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సూపర్బజార్ ఏరియా అనే పేరుతో పిలిచేవారు. ఇక్కడి సూపర్ బజార్లో నిత్యావసర సరుకులే కాకుండా టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కార్మికులకు అందుబాటులో ఉండేవి. గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా వీటి ద్వారానే జరిగేది. ఇలాంటి సూపర్ బజార్ను ఉన్నట్టుండి ఒక్కసారిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆర్కేపీ సూపర్ బజార్ ఇప్పుడు మూసివేస్తున్నారని తెలిసి పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ బజార్ పర్యవేక్షణ జరిపే ఉద్యోగి ఈ నెలాఖరుతో రిటైర్ అవుతున్న నేపథ్యంలో అతని స్థానంలో మరొకరిని నియమించి సరుకులను అంటుబాటులో ఉంచి షాపును కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఇలా మూసివేయడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మొన్న నస్పూర్..నేడు ఆర్కేపీసింగరేణి వ్యాప్తంగా సూపర్ బజార్లకు స్వస్తి పలకాలని భావిస్తున్న యాజమాన్యం వీటి మూసివేతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికే శ్రీరాంపూర్ సూపర్ బజార్ మూసివేతకు గురికాగా కొద్ది రోజుల క్రితమే నస్పూర్ సూపర్ బజార్ను మూసివేశారు. ఉన్నతాధికారుల చర్యలు చూస్తుంటే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఎత్తివేయడమే సంస్థ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందని కార్మికుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఆర్కేపీ సూపర్బజార్ మూసివేతతో ఈ ప్రాంతమే ప్రాభవం కోల్పోతుందని చెప్పాలి. ఇప్పటివరకు వీటిపైన ఆధారపడి ఉన్న సింగరేణి కార్మికులు ఇక ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రైవేటుకు ధీటుగా డీమార్ట్ స్థాయిలో చక్కటి సూపర్ మార్కెట్వలే రామకృష్ణాపూర్ సూపర్ బజార్ను మార్చుకునే బిల్డింగ్, స్థలం అన్నీ ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా కాలగర్భంలో కలిపివేయడంతో కార్మికులు, స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాన కార్మిక సంఘాలు నోరు మెదపకుండా ఉండడంతో యూనియన్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మందమర్రిరూరల్: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శనివారం జీఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జీఎం దేవేందర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమ య్య, సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ కేకే ఓసీలో విధులు నిర్వహించే క్వార్టర్లేని కార్మికులకు 9 శాతం ఇంటి అద్దె చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు ప్లేడేలు వర్తింప జేయాలని, క్యాంటీన్లలో భోజన సౌకర్యం కల్పించాలని, ఎస్అండ్పీసీ సిబ్బందికి నాణ్యమైన యూనిఫాంతో పాటు రెయిన్కోట్స్ ఇవ్వాలని, కేకే–6 గని, శ్రావన్పల్లి గనులను త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
ప్రకృతి సోయగం... మిట్టే జలపాతం
దట్టమైన అడవిలో ప్రకృతి సోయగాల నడుమ మిట్టే (సప్తగుండాలు) జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో రామ గుండం, లక్ష్మణ గుండం, సీత గుండం, భీమ గుండం, సవతిగుండం, చిరుతల గుండం, బుగ్గ గుండం ఉన్నాయి. సప్త గుండాలను కలిపి మిట్టే జలపాతంగా పిలుస్తారు. పూర్వం రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వచ్చిన సమయంలో ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. – లింగాపూర్ -
● మహారాష్ట్ర నుంచి తరలించే యత్నం ● అంగీకరించిన తడోబా అధికారులు ● ఎన్టీసీఏ ఓకే చెబితేనే టైగర్ల రాక ● సంరక్షణ అధికారులకు సవాలే..!
మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి (ఫైల్)సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్కు కొత్త పులు లు రానున్నాయి. మహారాష్ట్ర పులులను ఇక్కడికి త రలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్ కోర్ ప్రాంతంలో నేటి కీ ఒక్క పులి కూడా శాశ్వతంగా నివాసం ఏర్పరుచుకోలేదు. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగ ర్ రిజర్వ్ నుంచి పదుల సంఖ్యలో పులులు వలస వస్తూ.. పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించినంత వరకు సంచరిస్తూ వెళ్లిపోతున్నాయి. తోడు, ఆవాసం, మానవ సంచారం కారణంగా పు లులు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు దాకా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ డి విజన్లో కొన్ని పులులు శాశ్వత నివాసమేర్పుచుకో గా, ఆదిలాబాద్, ఖానాపూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల డివిజన్ల వరకు వాటి సంచారం ఉంది. అయితే చాలా పులులు ఇక్కడ సంచరించి కొద్ది రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్ర మంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ డివిజన్లను టైగ ర్ కన్జర్వేషన్గా గుర్తిస్తూ అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి పులుల రక్షణకు వీలు కలగనుంది. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తడోబా పులులనే ఇక్కడికి తరలించేందుకు ప్రతిపాదనలు పంపగా, అక్కడి అధికారులు అంగీకరించడంతో కవ్వాల్కు కొత్తపులులు వచ్చే అవకాశాలు న్నాయి. ఆడ, మగ కలిపి ఐదు వరకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ సంస్థ) ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనుంది. చివరికి తరలింపునకే మొగ్గు మహారాష్ట్ర పులులు భవిష్యత్లో ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాకు వస్తాయనే దూరదృష్టితో అధికారులు 13ఏళ్ల క్రితం కవ్వాల్ కేంద్రంగా 2వేల చ.కి.మీటర్లకు పైగా అటవీ భూభాగాన్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే అప్పటినుంచి ఇ ప్పటివరకు కోర్ ఏరియాలోనే పులులు నివాసమేర్పరుచుకోలేదు. ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ అధికారులు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మానవ కార్యక్రమాలను తగ్గించేందుకు కోర్ పరిధిలో ఉండి, పులుల రాకపోకల మార్గంలో ఉన్న గ్రామాలను గుర్తించి తరలించడం ప్రారంభించారు. అయినా, పలు కారణాలతో పులులు రాలేదు. చివరకు మహా రాష్ట్రలోని తడోబాలో అధికసంఖ్యలో ఉంటూ ఇరు కు ఆవాసాలు, సంరక్షణ కష్టమవుతున్న నేపథ్యంలో కవ్వాల్కు పులులను ఇక్కడికి తీసుకువచ్చేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పులుల సంచారంతో తమకు ఇబ్బంది కలుగుతుందని స్థాని క గిరిజన రైతులు, అటవీ ప్రాంత సమీప గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. కవ్వాల్ అభయారణ్యం ముఖద్వారంసంరక్షణ సవాలే..!కవ్వాల్లో విశాల భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఇక్కడ గడ్డి క్షేత్రాల పెంపు, శాకాహార జీవుల పెరుగుదలతో పాటు కోర్ గ్రామాలైన కడెం మండలం రాంపూర్, మైసంపేటను తరలించారు. అయితే వలస పులులు సంచరిస్తున్న సమయంలో ఇదివరకు అనేక చోట్ల వేట ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్ కంచెలు, వేట కారణంగా అభయారణ్యంలో మృత్యువాత పడ్డాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్కడి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయాయి. తాజాగా అధికారులు ఇక్కడికి తరలించే పులుల సంరక్షణ స్థానిక అధికారులకు సవాల్గా మారనుంది. అటవీశాఖలో సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు పునరావాస గ్రామాల వా సులకు పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని పేర్కొంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందకు సిద్ధపడి నిరసనలు చేపట్టారు. కవ్వాల్ కోర్ ప్రాంతాల్లో ఇప్పటికే మానవ కార్యకలాపాలు, పంట చేన్లు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ జంతువు సంరక్షణకు ఇక్కడి అటవీ అధికారులు మరింత శ్రమించాల్సి ఉంది. -
కాసిపేటలో వందశాతం అక్షరాస్యత
కాసిపేట: మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘100 రోజుల్లో వందశాతం అక్షరాస్యత’ కార్యక్రమం విజయవంతమైంది. 3,462 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులు గా గుర్తింపు తెచ్చుకున్నారు. శనివారం జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్ ఆధ్వర్యంలో ధర్మరావుపేట, ముత్యంపల్లి రైతువేదికలతో పాటు గ్రామపంచాయతీలవారీగా పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, తహసీల్దార్ భోజన్న, ఆత్మ చై ర్మన్ రౌతు సత్తయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుప తి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఏవో ప్రభాకర్, ఎంపీవో షేక్ సబ్ధర్ అలీ, డీఆర్పీలు శాంకరి, జనార్దన్, అశోక్రావు, వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, నాయకులు రమేశ్, స్వామి, శ్రీనివాస్, నారాయణ, కార్యదర్శులు, అధికారులు, వలంటీర్లు పాల్గొన్నారు. -
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● సీపీ అంబర్ కిషోర్ ఝా ● కమిషనరేట్లో నేర సమీక్షమంచిర్యాలక్రైం: పోలీస్ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా హెచ్చరించారు. పోలీస్ కమిషనరే ట్ ఆవరణలో శనివారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నేరా లను సమీక్షించారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. కేసు పరిశోధనలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించా రు. కేసులు నమోదైన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, స్టేషన్ ఎస్హెచ్వోలు ప్రతీరో జు ఒక గంట పెండింగ్ కేసులపై సిబ్బందితో స మీక్షించాలని ఆదేశించారు. బాలికల మిస్సింగ్ కే సుల్లో రికార్డుల దర్యాప్తు వేగవంతం చేయాలని తెలిపారు. రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఇటీవల బెల్లంపల్లిలో ఏటీఎం చోరీకి యత్నించిన వారిని పట్టుకున్న నెన్నెల ఎస్సై ప్రసాద్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని అభినందిస్తూ క్యాష్ రివార్డు అందజేశారు. సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఎస్బీ ఏసీపీ మల్లారెడ్డి, ఏసీపీలు ఆర్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అటవీభూములు ఆక్రమిస్తే చర్యలు
దండేపల్లి: అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ హెచ్చరించారు. మండలంలోని లింగాపూర్ అ టవీ బీట్లోని 380 కంపార్ట్మెంట్లో ఐదారు రోజులుగా సమీప గ్రామాల గిరిజనులు, నిరుపేదలు అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తూ చెట్ల పొదలు తొలగిస్తున్నారు. ఫారెస్ట్, పోలీస్ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. శనివారం అదే ప్రాంతంలో గిరి జనులు, పేదలు, చెట్ల పొదలు తొలగించారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీవో, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి తహసీల్దార్ రో హిత్ దేశ్పాండే, ఎస్సై తహసినొద్దీన్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. గిరిజనులు, పేదలతో మాట్లాడారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం, వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు. అటవీ భూముల్లో చెట్లు, పొదలు తొలగిస్తే అటవీ హక్కుల చ ట్టంతో పాటు వన్యప్రాణుల చట్టాలను ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈక్రమంలో కొందరు గి రిజన మహిళలు ఎఫ్డీవో, తహసీల్దార్ కాళ్లపై పడి తమకు భూములు కేటాయించి పట్టాలివ్వాలని వేడుకున్నారు. ఆయన వెంట తాళ్లపేట అటవీ రేంజ్ సిబ్బంది ఉన్నారు. -
వైద్య కళాశాలలో సదుపాయాలు కల్పిస్తాం
● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ ఆయేషా మస్రత్ఖానంమంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో జా తీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నిబంధనల మేరకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆ రోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ ఆయేషా మస్రత్ ఖానం తెలిపారు. వైద్య కళాశాలల్లో సదుపాయా ల కల్పనకు ఏర్పాటైన మెడికల్ కాలేజీ మానిట రింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం సభ్యులు శని వారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. కాలేజీ రోడ్డులో మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో 450 పడకలతో నిర్మి స్తున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పనులు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కా లేజీలో ప్రిన్సిపాల్, వైద్య బృందంతో సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీతో పాటు అవసరమైన సిబ్బందిని ఔట్సోర్సింగ్ ప ద్ధతిలో తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ జైసింగ్, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ ఆదిలాబాద్ ఆర్.నర్సింహారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రేఖ, ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డెమో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ప్రభుత్వ అండ
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు దండేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శని వారం రైతు భరోసా సంబరాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నా రు. ఎడ్లబండి నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతులందరి ఖాతాల్లో రైతు భరో సా డబ్బులు పడ్డాయని, ఖరీఫ్ సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి లోటు రావొద్దు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి లోటు రావద్దని ఎమ్మె ల్యే ప్రేంసాగర్రావు పేర్కొన్నారు. దండేపల్లి కే జీబీవీ, లింగాపూర్ మోడల్స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బందితో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కేజీబీవీలో కోతుల బెడద ఉన్నట్లు విద్యార్థులు తెలుపగా పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం లింగా పూర్ మోడల్ స్కూల్లో చేపట్టిన పలు నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీవో ప్రసాద్, అ ధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రారంభానికి సిద్ధం చేయాలి లక్సెట్టపేట: ప్రభుత్వ ఆస్పత్రి భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు సూచించారు. మండల కేంద్రంలో చేపట్టి న ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. ఆస్పత్రి భవనం ప్రారంభ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని, మిగతా పనులు పూ ర్తి చేయాలని సూచించారు. నాయకులు ఎండీ ఆరీఫ్, పింగిళి రమేశ్, అశోక్, నాగభూషణం, శ్రీనివాస్, సురేశ్, స్వామి, తహసీల్దార్ దిలీప్కుమార్, వైద్యులు శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు. -
అతివలకు అండగా ‘సీ్త్రనిధి’
పాతమంచిర్యాల: మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు గ్రామీణాభివృద్ధి శాఖ సీ్త్రనిధి ద్వారా రు ణాలు మంజూరు చేస్తోంది. 11శాతం వడ్డీకే రుణా లు మంజూరు చేసి పొదుపును ప్రోత్సహిస్తోంది. 2025–26ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా సంఘాలు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పడానికి రూ.55కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గత సంవత్సరం రూ.47కోట్లు రుణా లు అందించాల్సి ఉండగా.. రూ.50కోట్లు అందజేసి 106శాతం లక్ష్యాన్ని సాధించడంతో జిల్లా రాష్ట్ర స్థా యిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేశారు. మెప్మా పరిధిలోని బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, నస్పూర్ మున్సిపాల్టీల్లో టీఎల్ఎఫ్లకు రూ.12,09,99,900 రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. సెర్ప్ పరిధిలోని గ్రామైక్య మహిళా సంఘాలకు రూ.42కోట్లు కేటాయిస్తున్నట్లు రుణ ప్రణాళికలో అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన యూనిట్లు జిల్లాలో 705వీవోలు, 16,883 గ్రామైక్య సంఘాల్లో 1,80,369మంది సభ్యులున్నారు. జిల్లాకు వివిధ విభాగాల్లో యూనిట్లు మంజూరయ్యాయి. పాడిపరిశ్రమ (డెయిరీ ఫాంలు) 70, గొర్రెల పెంపకం 70, పౌల్ట్రీఫాంలు 2, పెరటి కోళ్ల పెంపకం 120, క్యాంటీన్ 1, హౌసింగ్లోన్లు (ఇళ్ల మరమ్మతు) 120, పీ ఎంఎఫ్ఎంఈ (ఫుడ్ ప్రాసెసింగ్) 50, వీధి వ్యాపారులు 70, లోకల్ కేబుల్ ఆపరేటర్లు 70, రాజీవ్ యువ వికాసం 240, వ్యవసాయేతర యూనిట్లు 1,400, వీవో స్థాయి సోలార్ ప్రాజెక్టు 1, రూఫ్టాప్ సోలార్ యూనిట్లు 120, ఈ ఆటో 20, ఈబైక్లు 20 యూనిట్లు మంజూరు చేయనున్నారు. రుణాల పంపిణీ, చెల్లింపులపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికా రులు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు ఫోన్పే, పోస్టాఫీస్, బ్యాంక్ మిత్ర, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా చెల్లించేలా వివరిస్తున్నారు. రుణాలు తీసుకున్న సభ్యులకు యూనిట్ల ఆధారంగా బీమా చేయిస్తున్నామని, రుణాలు తీసుకున్న సభ్యులు మరణించిన పక్షంలో రుణం చెల్లించాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు. ఈ రుణాల్లో సువిధ పథకం ద్వారా రూ.5వేల నుంచి రూ.50వేలు, ప్రగతిపథకం ద్వారారూ.50వేల నుంచి రూ.లక్ష వరకు, అక్షయ పథకంలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల వర కు, సౌభాగ్యలో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వర కు, ఐశ్వర్య పథకంలో రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. 2025–26 రుణ ప్రణాళిక ఖరారు రుణ లక్ష్యం రూ.55 కోట్లు స్వయం ఉపాధి యూనిట్లకు ప్రాధాన్యంరుణాలు సద్వినియోగం చేసుకోవాలిమహిళా సంఘాల స భ్యులు సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలి. రుణాలు తీ సుకున్న సభ్యులు క్ర మం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తే తిరిగి మళ్లీ రుణం పొందే అవకాశం ఉంది. ఎక్కువ వడ్డీలకు మైక్రోఫైనాన్స్ల ద్వారా తీసుకుని ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి తక్కువ వడ్డీకే రుణా లు అందిస్తోంది. అర్హులంతా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. – వెంకటరమణ, సీ్త్రనిధి ప్రాంతీయ మేనేజర్ -
అంతరించిపోతున్నఅరుదైన జంతువు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అరుదైన జంతువు అలుగు (పంగోలిన్) ప్రమాదంలో పడింది. సంప్రదాయ వైద్యం, పలు ఉత్పత్తుల్లో వాడకం పేరుతో ఈ వన్యప్రాణిని వేటగాళ్లు హత మార్చుతుండడంతో అంతరించపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ములుగు, ఏటూరు నాగారం, అమ్రాబాద్ టైగర్ రిజర్వుతో సహా పలు అటవీ ప్రాంతాల్లో గుట్టుగా వేటాడుతూ.. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ట్రస్టు ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) సంస్థ, అటవీ అధికారులు తెలంగాణలో పలుచోట్ల రహస్యంగా మాటు వేసి నిందితులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అలుగులనే అత్యధికంగా వేటాడి అక్రమరవాణా చేస్తుండగా.. వీటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ చర్యల్లో భాగంగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) ఈ వన్యప్రాణిని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది.వైవిధ్యం గల జీవిశరీరంపై గట్టి పొలుసులు ఉండే అలుగు.. క్షీరదాల్లో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆకారంలో ముంగిస తరహాలో ఉంటుంది. ఎదురుగా ఏదైనా కనిపిస్తే వెంటనే బంతి ఆకారంలో ముడుచుకు పోతుంది. సిగ్గరిగా, మనుషులకు దూరంగా ఉంటుంది. ఎవరిపైనా ఎటువంటి దాడి చేయదు. కేవలం రాత్రి వేళ సంచరిస్తూ చెదలు, చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. వాసన, వినికిడి శక్తి అధికంగా ఉంటుంది.శాస్త్రీయంగా నిరూపణ లేకున్నాచైనాతో సహా పలు దేశాల్లో ఈ జీవి శరీర భాగాలను సంప్రదాయ వైద్యంలో అనేక చికిత్సలకు వాడుతున్నారు. దీంతో అక్రమంగా అడవుల నుంచి రవాణా చేస్తూ పొలుసులు, మాంసాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా చాలామంది నాటు వైద్యులు.. ఈ జీవి శరీర భాగాలను మందులు, చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అటవీ సమీప ప్రాంతాల వారికి డబ్బు ఆశ చూపిస్తూ.. అలుగును అక్రమ రవాణా చేస్తున్నారు. కొన్నిసార్లు మధ్యవర్తులతో ఇతర దేశాలకు రవాణా జరుగుతోంది. పలు చికిత్సల్లో వాడుతున్నప్పటికీ రోగ నివారణపై శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాల్లేవని అటవీ, వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానవ స్వార్థం కోసం అరుదైన అడవి జంతువులను వేటాడొద్దని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గి పోయిందని.. భవిష్యత్లో మరింత ముప్పును ఎదుర్కోబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.ఆగని అక్రమ రవాణాగత మార్చిలో అలుగును వేటాడుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజీలో ముగ్గురు పట్టుబడ్డారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో పలు చోట్ల అలుగు అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల, కాగజ్నగర్ ప్రాంతాల్లో అలుగును అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అటవీ అధికారులకు చిక్కాయి. -
గిరిజనుల పోడు పోరు
● అడవిలో చెట్ల పొదల తొలగింపు ● అడ్డుకున్న అటవీ, పోలీస్ అధికారులు దండేపల్లి: మండలంలో కొద్ది రోజులుగా చల్లబడ్డ పోడు పోరు మళ్లీ మొదలైంది. అటవీ భూముల ఆక్రమణకు గిరిజనులు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు రోజులుగా మండలంలోని లింగాపూర్ అటవీ బీట్ 380 కంపార్ట్మెంట్లో దమ్మన్నపేట, మామిడిగూడ, గిరిజనులతోపాటు లింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు నిరుపేదలు చెట్ల పొదలు తొలగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా వినిపించుకోవడం లేదు. దీంతో నాలుగు రోజులుగా పోరు సాగుతోంది. శుక్రవారం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్ అటవీ ప్రదేశానికి వెళ్లి చెట్లపొదలు తొలగిస్తున్న వారితో మాట్లాడారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చివెళ్లారు. పోలీసులు, అటవీ అధికారులు వెళ్లిన వెంటనే గిరిజనులు మళ్లీ పొదలు తొలగిస్తూ విత్తనాలు విత్తారు. -
చదువుతో జ్ఞానం, ధైర్యం
వేమనపల్లి: చదువు మనిషికి జ్ఞానం, ధైర్యాన్ని అందిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ జెడ్పీటీసీ ఆర్.సంతోష్కుమార్తో కలిసి నీల్వాయి జూనియర్ కాలేజీలో రూ.66 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేమనపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేకు పలు గ్రామాల రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్ఆలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్యమాదిగ, ట్రాన్స్కో ఎస్ఈ గంగారాం, ఎంపీడీఓ కుమారస్వామి, తహసీల్దార్ సంధ్యారాణి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్లు గాలి మధు, తోకల రాంచందర్, మాజీ ఎంపీపీలు వెంకటేషం, లింగాగౌడ్ పాల్గొన్నారు. -
దేశీదారు పట్టివేత
వాంకిడి: మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దేశీదారును శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు వాంకిడి బస్టాండ్లో ఏఎస్సై పోశెట్టి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. గడ్చిరోలి జిల్లా సిరోంచకు చెందిన మారగోని కృష్టమూర్తిగౌడ్ బస్సులో దేశీదారు తరలిస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి 250 (90ఎంఎల్) దేశీదారు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.12,500 ఉంటుందని పేర్కొన్నారు. -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
బెల్లంపల్లి: పెద్దపల్లి రైల్వే జంక్షన్ శివారులోని కూనారం ఆర్ఓబీ వద్ద క్లస్టర్ విరిగిపోయి గడ్డర్లు కుంగడంతో శుక్రవారం కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తుగా ఈ మార్గంలో రైళ్లను ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో నిలిపివేయడంతో గంటలకొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని రైళ్లను కాజీపేట నుంచి అటువైపే నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, రవీంద్రఖని, రేచినీరోడ్ రైల్వేస్టేషన్, ఆసిఫాబాద్ ఎక్స్రోడ్, కాగజ్నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్–బీదర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు పొత్కపల్లి రైల్వేస్టేషన్ వరకు నడపనున్నారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పాక్షికంగా కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్నగర్ మధ్యలో రద్దు చేశారు. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వైపు వెళ్లే సింగరేణి మెము ఎక్స్ప్రెస్ రైలు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య పాక్షికంగా రద్దు చేసి వరంగల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడపనున్నారు. కాజిపేట–సిర్పూర్ వైపు వెళ్లే మెము ఎక్స్ప్రెస్ రైలు పొత్కపల్లి వరకే నడస్తుంది. బోధన్–సిర్పూర్ టౌన్–బోధన్ పుష్పుల్ రైలు రద్దు చేశారు. కాజీపేట–బల్లార్షా ఎక్స్ప్రెస్ రైలు రద్దయింది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు కాజిపేట–సికింద్రాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. -
భూగర్భ జలాల పనుల పరిశీలన
చెన్నూర్రూరల్: మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన 46 వివిధ రకాల అభివృద్ధి పనులను శుక్రవారం కేంద్ర భూగర్భ నీటి బోర్డు శాస్త్రవేత్త రాంబాబు పరిశీలించారు. నీటికుంటల ప్రగతిని క్షేత్ర స్థాయిలో సమీక్షించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఫారెస్టు ట్రెంచ్, చిన్న నీటికుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ రీచార్జ్ స్ట్రక్చర్ను పరిశీలించారు. ఎంపీడీవో మోహన్, నోడల్ అధికారి సదానందం, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సత్యనారాయణ, చంద్రశేఖర్, డీఆర్పీ రాజ్కుమార్, ప్లాంటేషన్ అధికారి శ్రీని వాస్, కుమారస్వామి, మధు, టీఏలు మహేశ్వర్రెడ్డి, రవీందర్, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు. -
బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారం అహీర్కు నాయకులతో కలిసి బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ సబ్ప్లాన్ను రూ.2 లక్షల కోట్లతో ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు తులా మధుసూదన్, కర్రె లచ్చన్న, గజెల్లి వెంకటయ్య, భీంసేన్, గాజుల ప్రభాకర్, ఎస్.కిష్టయ్య, అంకం సతీష్ పాల్గొన్నారు. -
లక్ష్యాల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
శ్రీరాంపూర్/జైపూర్: నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. క్వారీలోకి వెళ్లి కోల్ బెంచీలు, ఆఫ్లోడింగ్ ప్రదేశాలు పరిశీలించారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని నూరు శాతం సాధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఓసీపీ పీఓ చిప్ప వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ పీఓ ఏవీ రెడ్డి, మేనేజర్లు నాగన్న, శంకర్, ఇంజనీర్ రామకృష్ణరావు, రక్షణాధికారి మహేశ్, ఫారెస్ట్ అధికారి మేఘన, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఫిట్ ఇంజనీర్ భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
లక్సెట్టిపేట/మంచిర్యాలరూరల్(హాజీపూర్): వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి హరీష్రాజ్ అన్నారు. శుక్రవారం లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధిలోని ఇటిక్యాలలో వార్డులను పరిశీలించారు. హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇటిక్యాలలో చాలామంది డెంగీ బారినపడ్డారని, డెంగీ రహితంగా ప్రకటించేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రో గ్రాం అధికారి ప్రసాద్, వైద్యులు సతీష్కుమార్, లింగారెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లహరి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, ఎన్సీడీ అధికారి డాక్టర్ శివప్రతాప్, డీఈఎంఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి కోసం మహిళ ఆత్మహత్యాయత్నం
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనుకదుర్గ కాలనీకి చెందిన పూరెల్లి లక్ష్మి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతిపత్రం అందించింది. తనకు ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిందని ఫైనల్ లిస్ట్లో తొలగించారని ఆరోపించింది. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ ఇండ్లల్లో గిన్నెలు కడుక్కుని జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నానని వివరించింది. ఇల్లు కేటాయించాలని కోరింది. దరఖాస్తు పరిశీలించిన అనంతరం అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరవుతుందని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు. వెంటనే మహిళ తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి ముందుగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుంది. ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. అక్కడున్న కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ఆ మహిళ ప్రయత్నాన్ని నిలువరించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సముదాయించి ఆమె ఇంటికి పంపారు. -
ఆక్రమణలు.. అపరిశుభ్రత
● వర్షాలు పడితే వరద నీరు పారడం కష్టమే ● డ్రెయినేజీల్లోనూ నిండిన పూడిక ● రోడ్లపై పారుతున్న మురుగునీరుమంచిర్యాలటౌన్: పేరుకే జిల్లా కేంద్రం.. ప్రతియేటా వర్షాకాలంలో నగరంలోని కొన్ని కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటోంది. నగరాన్ని ఆనుకుని రాళ్లవాగు, తోళ్లవాగులు ప్రవహిస్తుండగా.. ఈ నీరు నేరుగా వెళ్లి గోదావరినదిలో కలుస్తుంది. డ్రెయినేజీల ద్వారా వెళ్లే నీరు వాగుల్లోకి చేరి అక్కడి నుంచి గోదావరిలో కలుస్తుండడం, ప్రతియేటా వర్షాకాలంలో వరద నీరు వాగుల ద్వారా వెనక్కి వచ్చి పలు కాలనీలు నీటమునగడం జరుగుతోంది. సాధారణ వర్షాలకే వరద నీరు నిండి డ్రెయినేజీల నుంచి బయట రోడ్లపై చేరుతోంది. హైటెక్సిటీ కాలనీలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో కాలంతో సంబంధం లేకుండా మురుగునీరు రోడ్లపై పారుతోంది. వర్షాకాలంలో వరద నీరు తోడై నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. రామునిచెరువు మత్తడి కాలువ ద్వారా చెరువునీటితోపాటు స్థానికంగా డ్రెయినేజీ నీరు ఈ కాలువ ద్వారానే వెళ్లి రాళ్లవాగులో కలుస్తుంది. మత్తడి కాలువలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయడం వల్ల మురుగు నీరు పారేందుకు అడ్డుగా మారుతోంది. గతంలో స్లాబ్లను కార్పొరేషన్ అధికారులు తొలగించగా మళ్లీ వేస్తుండడంతో వరద నీరు పారడం కష్టమే. కాలువ ఉప్పొంగి పక్కనే ఉన్న ఇస్లాంపుర కాలనీకి వరద ముప్పు ఏటా పొంచి ఉంటుంది. పట్టణంలోని రాంనగర్, రెడ్డికాలనీ, ఎన్టీఆర్నగర్, పద్మశాలికాలనీ, ఆదిత్య ఎంక్లేవ్, బృందావనం కాలనీ, సూర్యనగర్ కాలనీలు చిన్నపాటి వర్షానికే వరద నీరు చేరి ముంపుగా మారుతున్నాయి. వర్షాకాలానికి ముందే డ్రెయినేజీల్లోని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉండగా ఇప్పటికీ చేపట్టలేదు. ఈ కారణంగా కూడా డ్రెయినేజీల్లోని మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. పడమర దిశగా ఈదురుగాలులు వీస్తాయి. పూడిక నిండి.. పిచ్చిమొక్కలు పెరిగి.. బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీలో మౌలిక సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 34 వార్డుల్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. శివారు వార్డులు తీవ్ర నిరాదరణకు గురవుతుండగా.. అన్ని వార్డుల్లో సమస్యలు తిష్ట వేసి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. వర్షాకాలంలో మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గంగారాంనగర్, కాల్టెక్స్ ఏరియా, షంషీర్నగర్, అంబేడ్కర్ నగర్, హన్మాన్బస్తీ, కన్నాల బస్తీ, మధునన్ననగర్, అశోక్నగర్, రైల్వేరడగంబాల బస్తీ, సుభాష్నగర్, గోల్బంగ్లాబస్తీ, శాంతిఖని, బెల్లంపల్లి బస్తీ తదితర ప్రాంతాల్లో మురికి నీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని వీధుల్లో మురికి కాలువల్లో పూడిక నిండి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. మరికొన్ని చోట్ల నేటికీ మురికి కాలువల నిర్మాణం చేపట్టలేదు. సగానికిపైగా జనావాసాలను ఆనుకుని మురికి నీరు గుంతల్లో స్థిరంగా నిలిచి ఉండడంతో దోమలు వృద్ధి చెందాయి. బూడిదగడ్డ బస్తీ నుంచి అశోక్నగర్ మీదుగా ప్రవహించే వాగు నుంచి వచ్చే వరద నీరు వెళ్లిపోవడానికి డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. చెదిరిన, గుంతలు పడిన రోడ్లపై రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా తయారయ్యాయి. హన్మాన్బస్తీ–రాంనగర్ బస్తీ మధ్య వాగుపై లోలెవల్ వంతెన ఏటా వర్షాకాలంలో వరద నీటిలో మునిగి రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీళ్లు మురికి కాలువ కట్టాలని ఎన్నో ఏళ్ల సంది వేడుకుంటున్నం. గెల్సినోళ్లు, అధికారులు మాటిచ్చి పట్టించుకుంట లేరు. గట్ల జేయబట్టి వరద నీరంతా కాలువ నిండా ప్రవహించి ఇండ్లల్లకత్తన్నయ్. నీళ్లు రాబట్టి పొయినేడు మా ఇంటి గోడ కూలిపోయింది. మళ్లా కట్టిచ్చినం. ఎవలకు ఎన్నిసార్లు జెప్పినా సరే అని అంటండ్లు కానీ చెవిన పెడ్తలేరు. ఈసారైనా మురికి కాలువ కట్టిచ్చి నీళ్లు ఇండ్లల్లకు రాకుండా చర్యలు తీసుకోవాలే. – లింగాల రాములు, అశోక్నగర్ -
కాళ్లు కడిగి వీడ్కోలు పలికారు
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో పారిశు ధ్య విభాగంలో పనిచేసిన కార్మికురాలు చంద్రబా యికి ఆస్పత్రి సిబ్బంది అరుదైన వీడ్కోలు పలికా రు. పట్టణానికి చెందిన చంద్రబాయి 15 ఏళ్లుగా ఆ స్పత్రిలో సేవలందిస్తోంది. 60 ఏళ్లు పూర్తి కావడం, అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ పొందింది. దీంతో శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు కార్యక్ర మం నిర్వహించారు. శాలువా, పూలమాలతో సత్కరించారు. సిబ్బంది ఆమె కాళ్లు కడిగి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. దీంతో వైద్యులు అనిల్, నర్సులు, తోటి సిబ్బంది వారిని అభినందించారు. -
రుణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వార్షిక రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్సాయి, నాబార్డ్ డీడీఎం వీరభద్రులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ ప్రభుదాస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రాధాకృష్ణన్తో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో రుణ లక్ష్యసాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలకు రూ.2,422 కోట్లు, దీర్ఘకాలిక రుణాలకు రూ.765 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.157 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.249 కోట్లు, మొత్తం వ్యవసాయ రంగానికి రూ.4,203 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు రూ.5,817 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,940 కోట్లు నిర్ధేశించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు రుణాలు సకాలంలో చెల్లించి తిరిగి పొందేలా అవగాహన కల్పించాలని తెలిపారు. -
ఎట్టకేలకు వేతనాలు
● డీఎస్సీ–2008 ఎస్జీటీల సాలరీ నిధుల విడుదల ● గత ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిక ● 61మంది ఉపాధ్యాయులకు లబ్ధి ● ఉమ్మడి జిల్లాకు రూ.2.5 కోట్లు విడుదలనిర్మల్ఖిల్లా: ఉద్యోగ నియామకం కోసం పరీక్ష రాసి ఎంపికై న తర్వాత 15 ఏళ్లుగా వేచి చూసిన వా రికి గత ఫిబ్రవరిలో నియామక ఉత్తర్వులు చేతికందాయి. ఫిబ్రవరి 16వ తేదీన కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా కొలువులో చేరిన వీరికి ఇప్పటివరకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఉమ్మ డి జిల్లాలోని ఎస్జీటీలకు రూ.2.5 కోట్ల నిధులు వి డుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విధుల్లో చేరిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 61 మంది కాంట్రాక్ట్ ఎస్జీటీలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ 2008 బాధితులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వెలువడిన అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో అప్పడు బీఈడీ పూర్తి చేసుకుని ఎస్జీటీలు గా ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని 100 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటినుంచి దశాబ్దకాలానికి పైగా కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు కాంట్రాక్ట్ విధానంలో ఎస్జీటీలుగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 15వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 61 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 16ఏళ్ల పాటు ఉద్యోగాలకు దూరమై కోర్టుల చుట్టూ తిరిగిన వీరికి నియామకాలు పొందిన త ర్వాత కూడా దాదాపు నాలుగు నెలలు పూర్తవుతు న్నా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025– 26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ కేటాయించగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మ ల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా విధులు ని ర్వహిస్తున్న 61 మందికి వేతనాలు అందనున్నాయి. ఒక్కో ఎస్జీటీకి నెలకు బేసిక్ పే రూ.31,040 కాగా, నాలుగునెలల వేతనాలు వారి అకౌంట్లలో జమచేయనున్నారు. సుధీర్ఘ నిరీక్షణ అనంతరంనిర్మల్ జిల్లాలో 14 మంది, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 28 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఏడుగురు, మంచిర్యాల జిల్లాలో 12 మంది కాంట్రాక్ట్ ఎస్జీటీలున్నారు. వీరి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లింపునకు ఉమ్మడి జిల్లాకు రూ.2కోట్ల 54లక్షల 93వేల 800 విడుదల చేయడంతో నిర్మల్ జిల్లాకు చెందిన కాంట్రాక్ట్ ఎస్జీటీలు గంగాధర్, రాజేశ్వర్, ప్రభ, చంద్రశేఖర్, వినోద్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లా ఎస్జీటీలు విడుదలైన నిధులు (రూ.లో) నిర్మల్ 14 58,51,000 ఆదిలాబాద్ 07 29,25,500 కుమురంభీం 28 1,17,02,100 మంచిర్యాల 12 50,15,200 మొత్తం 61 2,54,93,800 -
విపరీతంగా ఈగలు, దోమలు
చెన్నూర్: మున్సిపాల్టీ పరిధిలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో వర్షాకాలం సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి. ప్రధాన రోడ్లలో వ్యాపార సముదాయాలు, డ్రెయినేజీలపై స్లాబ్లు వేయడంతో మురికి కాలువలు శుభ్రం చేయడం కష్టమవుతోంది. ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో డ్రెయినేజీల నీరు రోడ్లపై పారుతోంది. పాతబస్టాండ్ నుంచి మార్కెట్కు వెళ్లే దారిలో డ్రెయినేజీల్లోని నీరు వర్షాకాలంలో మేరవాడలోని ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్టాండ్ నుంచి ఖబ్రస్తాన్ పక్కన ఉన్న డ్రెయినేజీలు శుభ్రం చేయించాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని బలిజవాడ, జెండవాడ, ఇందిరానగర్, బేతాళవాడ, ఆదర్శనగర్, లైన్గడ్డ ప్రాంతాల్లో మురికికాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. పలు కాలనీల్లో రోడ్లపై వేసిన చెత్త తొలగించకపోవడంతో కుళ్లిపోతోంది. చెత్తకుప్పలు, మురికికాలువలతో ఈగలు, దోమలు వృద్ధి చెందాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దోమలు, ఈగల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలువల్లో గడ్డి డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. కాలువలు శుభ్రం చేయకపోవడంతో గడ్డి మొలుస్తుంది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగాయి. కొన్ని డ్రెయినేజీలు సక్రమంగా లేక వర్షపు నీరు రోడ్లపై పారుతోంది. జ్వరాలు సోకక ముందే అధికారులు మురికి కాలువలు శుభ్రం చేయించాలి. –మానికరౌతు తిరుపతమ్మ, బలిజవాడకాలనీ కంపు కొడుతోంది.. ఇందిరానగర్ కాలనీలో డ్రెయినేజీలు లేక మురుగునీరు ఖాళీ స్థలాల్లో చేరి కంపు కొడుతోంది. డ్రెయినేజీలు నిర్మించి మురుగు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడే నీరు నిలిచి దుర్వాసన వస్తుంది. వర్షాకాలంలో మురికినీరుతోపాటు వర్షపు నీరు నిలిస్తే భరించలేకుండా ఉంటుంది. అధికారులు స్పందించి ఖాళీ స్థలంలో నిలిచిన నీరును డ్రెయినేజీలకు మళ్లించే ఏర్పాటు చేయాలి. –సీహెచ్.నవీన్, ఇందిరానగర్ కాలనీ -
భాషా పండితుల పదోన్నతులకు కృషి
మంచిర్యాలఅర్బన్: ఎన్నో కష్టాలను అధిగమించి భాషా పండితుల పదోన్నతులకు కృషి చేసినట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రీయ ఉపాధ్యాయ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండితుల అప్గ్రేడేషన్ ప్రక్రియ కోసం పడిన కష్టాలను వివరించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదీష్ను భాషా పండిత ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొండ శ్రీధర్స్వామి, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణచారి, గౌరవ అధ్యక్షుడిగా సంతోష్కుమార్శర్మ, కోశాధికారిగా శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షులుగా విశ్వప్రసాద్, నారాయణ, తిరుపతి, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీలత, సంయుక్త కార్యదర్శిగా రమేష్, సరేందర్, మహిళా కార్యదర్శులుగా యశోదలక్ష్మీ, నీల్కమల్, సాంస్కృతిక కార్యదర్శిగా శశికుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా మహేందర్రెడ్డి, శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్కు 295 మంది హాజరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో శుక్రవారం పాలిసెట్–25లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండోరోజు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. మొత్తం 295 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి సర్టిఫికెట్లను సంబంధిత అధికా రులు పరిశీలించి ధృవీకరించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, కౌన్సెలింగ్ ఇన్చార్జి టీ మధుకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణలక్సెట్టిపేట: మున్సిపల్ కమిషనర్గా సంపత్కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన మారుతీప్రసాద్ సీడీఎంఏకు బదిలీ కాగా, హైదరాబాద్లోని సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తున్న సంపత్కుమార్ బది లీపై ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అతడికి కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదంఇచ్చోడ: నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. నకి లీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిపై ఈనెల 16న కేసు నమోదు చేయగా, పరారీలో ఉన్న వ్యక్తిని శుక్రవారం పట్టుకుని రిమాండ్కు తరలించిన ట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. జిల్లాలో నకిలీ విత్తనా లను అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు ప్ర త్యేక టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనె ల 16న ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామంలో తనిఖీలు నిర్వహించగా నరవాటే ఈశ్వర్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద 20 బ్యాగ్ల పింక్ బాండ్ 5జీ నకిలీ విత్తనాలు ల భించగా, విచారణలో తాను ఆదిలాబాద్కు చెందిన పిప్పల్వార్ సునీల్ వద్ద తీసుకున్నట్లు చెప్పాడని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, పరారీలో ఉన్న పిప్పల్వార్ సునీల్ను ఆదిలాబాద్ జిల్లా సాంకేతిక నిపుణులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.గోపీకృష్ణ సూచన మేరకు ఇచ్చోడ ఎస్సై పురుషోత్తం హైదరాబాద్కు పోలీస్ బృందాన్ని పంపి అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తాంసి: మనస్తాపంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని జామిడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునేశ్వర్ అరుణ్ (32) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. గతేడాది అరుణ్ వివాహం నిశ్చయమై ఆ తర్వాత క్యాన్సిల్ అయింది. అలాగే తనకున్న రెండెకరాలపై జామిడి సహకార సంఘంలో రూ.2.30 లక్షల రుణం తీసుకోగా మాఫీ కాలేదు. దీంతో కొంతకాలంగా దిగులు చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున పంటచేనుకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అరుణ్ను అంబులెన్స్లో రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రిలో తాంసి ఎస్సై ప్రణయ్కుమార్ పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం ఆదిలాబాద్రూరల్: మండలంలోని లాండసాంగ్వి శివా రు ప్రాంతంలోగల వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన యువకుడు జొగ్ధాన్ శేఖర్ (19) మృతదేహం శుక్రవారం లభ్యమైనట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని డాల్డా కంపెనీ ప్రాంతానికి చెందిన శేఖర్, వికాస్, కృష్ణ గురువారం చేపల వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. చేపలు పట్టే సమయంలో శేఖర్ ప్రమాదవశాత్తు జారి వాగులో పడ్డాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. శేఖర్ కోసం గురువారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం గాలింపు కొనసాగించగా అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జీవో 49ని అమలు కానివ్వం
● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఆదివాసీ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశంఉట్నూర్రూరల్: జీవో 49ని అమలు కాకుండా చూస్తామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలోగల పీఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కేబీ ప్రాంగణంలోని కుమురంభీం విగ్రహంపై పూ లు చల్లి నివాళులర్పించారు. ముందుగా ఆదివాసీ పెద్దలు మాట్లాడుతూ.. పులుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పేరిట జీవో 49 అమలు అంటూ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. జీవోను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు, ఎమ్మెల్యేలు కో వ లక్ష్మి, హరీశ్బాబు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జీవో 49పై గెజిట్ నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదని, అమల్లోకి రాలేదని చె ప్పారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయవద్దని అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆది వాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలి పారు. అటవీ, పర్యావరణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి ఆదివాసీలకు మేలు చేసేలా సముచిత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉందని తెలిపారు. గెజిట్ వచ్చిందన్న ఎంపీ నగేశ్ జీవో 49పై గెజిట్ రాలేదని మంత్రి జూపల్లి అంటున్న సందర్భంలో ఎంపీ గోడం నగేశ్ కల్పించుకుని గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి సమావేశంలోనే అటవీశాఖ ఉన్నతాధికారిని ఫోన్లో సంప్రదించగా ఇంకా జారీ చేయలేదని సమాధానం రాగా సమావేశం సజావుగా సాగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. సీఎం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కలెక్టర్లు రాజర్షిషా, వెంకటేశ్ దోత్రే, ఎస్పీలు అఖిల్ మహాజన్, కాంతిలాల్ పాటిల్, డీఎఫ్వోలు నీరజ్కుమార్, ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, రాయిసెంటర్ సర్మేడి దుర్గు, ఏఎస్పీ కాజల్, సబ్కలెక్టర్ యువరాజ్, ఆయా శాఖల అధికారులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళి ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి ఉ మ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్మృతి వనంలో మొక్క నాటారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, రగల్ జెండా ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు తోడసం నాగోరావ్ తదితరులున్నారు. -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసరలో మహబూబ్నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా ఆధారిత విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం చేపట్టారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గో వర్ధన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ చాలా సమర్థవంతంగా, సజావుగా ముందుకు సాగుతోందని తె లిపారు. నాణ్యమైన విద్య, విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతీ సమస్యను పట్టుదలతో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమర్థవంతంగా యూనివర్సిటీని నిర్వహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎన్సీసీ కోటాలో వి ద్యార్థులు అందించిన క్యాంప్ సర్టిఫికెట్లు, రిపబ్లిక్ డే పరేడ్ సర్టిఫికెట్లు పూర్తిగా పరిశీలించినట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటా కోసం 31 క్రీడల జాబితాలో లభించే ఆటల ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన ప్రమాణ పత్రాలను తప్పనిసరి గా ధ్రువీకరించినట్లు తెలిపారు. క్రీడా సంఘాల గుర్తింపు, పోటీల స్థాయి, తేదీ, అర్హత ప్రమాణాల ను బట్టి జాగ్రత్తగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలనను కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కోకన్వీనర్లు డాక్టర్ దేవరాజు, డాక్టర్ విఠల్, డాక్టర్ భవ్సింగ్, డాక్టర్ రాకేశ్రెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఇన్చార్జి దస్తగిరి, స్పోర్ట్స్ ఇన్చార్జి పీడీ శ్యాంబాబు, సహాయకులు కిషన్, ఉదయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
● సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని కుమ్మరి స్వప్న (19) ఈ నెల 24న రాత్రి కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. కాగా స్వప్నను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవా రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి లచ్చన్న–సుక్కవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు స్వప్న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లచ్చన్న వ్యవసాయంతోపాటు ఆర్ఎంపీగా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, స్వప్న మరణాన్ని లచ్చన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వప్న చికిత్స పొందుతూ మృతి చెందిన అనంతరం లచ్చన్న హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి స్వప్న మృతదేహాన్ని అప్పగించారు. కాగా, స్వప్న మృతి మిస్టరీగానే మిగిలింది. హాస్టల్ భవనం వద్ద ఆందోళన స్వప్న మరణ వార్త తెలుసుకున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాసంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. స్వప్న మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వప్న కు టుంబానికి రూ.50లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విష యం తెలుసుకున్న సీఐ ప్రమోద్రావు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. స్వప్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. స్వగ్రామానికి మృతదేహం తరలింపు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు స్వప్న మృతదేహాన్ని ఆమె స్వగ్రామం మార్థిడికి హైదరాబాద్ నుంచి నేరుగా తరలించారు. కళాశాల భవనం వద్ద ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. -
మానవ అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరి అరెస్ట్
● హరిదాస్ను కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపుసాక్షి, ఆసిఫాబాద్: మానవ అక్రమ రవాణాకు పా ల్పడి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను ఆసిఫాబాద్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ శుక్రవారం మధ్యాహ్నం సీఐ రవీందర్తో కలిసి విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లో.. ‘మానవ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయి. తన కూతురు ఏడాదిగా కనబడడం లేదని ఈ నెల 11న వాడిగొంది గ్రామవాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాం. మహిళకు చెందిన ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్కు కాల్ చేయగా.. ఆమె మ ధ్యప్రదేశ్లో ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఒక పోలీస్ బృందాన్ని మ ధ్యప్రదేశ్కు పంపి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చాం. ఆమె ఇచ్చిన వివరాల మేరకు.. చింతలమానేపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ 2022 నుంచి విధులకు గైర్హాజరవుతున్న కామెరి హరిదా స్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలోనే.. తననూ కానిస్టేబుల్ హరిదాస్ ముఠా మో సం చేసి విక్రయించిందని ఆసిఫాబాద్ పట్టణ స్టేష న్లో ఫిర్యాదు చేసింది. ఈ రెండు వేర్వేరు కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టగా మొత్తం 10 మందికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఎనిమిది మంది నిందితులను 10రోజుల కిందట అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం. పరారీలో ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన బషీర్ రమేశ్గౌడ్ (ఏ7), జగదీశ్ సోనీ (ఏ9)ని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాం.’ అని ఏఎస్పీ తెలిపారు. ‘తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి’ ‘పెళ్లికుమారుడికి వరకట్నం ఇస్తేనే ఆడపిల్లలకు పె ళ్లిళ్లు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో.. ఆడపిల్లకు ఎ దురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి మోసగించి ఇతర రాష్ట్రాలకు తరలి స్తు న్న వారిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అసలు వారు తమ పిల్లను ఎందుకు పెళ్లి చేసుకో వాలనుకుంటున్నారు? వారి వివరాలు ఏమిటి? వా రు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి స్థానికంగా సహకరిస్తున్న వారెవరు? అలాంటి వారి గత చరిత్రపై ఆరా తీయాలి. ఎలాంటి సందేహం తలెత్తినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం చేస్తాం.’ అని ఏఎస్పీ సూచించారు. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి తొలగింపు తిర్యాణి పోలీస్ట్స్టేషన్ పరిధిలో ఇదివరకు ఇలాంటి కేసులో ముద్దాయిగా ఉన్న కానిస్టేబుల్ కామెరి హరిదాస్.. మళ్లీ తన విధానం మార్చుకోకపోగా తాజాగా రెండు వేర్వేరు కేసుల్లో నిందితుడిగా తేలింది. దీంతో అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయగా.. గురువారం అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులపైనా కఠినచర్యలు ఉంటాయనడానికి కానిస్టేబుల్ హరిదాస్ ఉధంతమే ఒక నిదర్శనం. -
సడెన్గా ఆగిన లారీని ఢీకొన్న ఆటో
● తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ మృతి ● ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమంజైపూర్: కళ్లు మూసి తెరిచేలోపే మృత్యువు కబలించింది. వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగడంతో వెనుక వస్తున్న ఆటో అదుపు తప్పి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ టో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సాయిరాంనగర్కు చెందిన పౌడల రాజేశ్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా డు. శుక్రవారం ఉదయం మంచిర్యాల నుంచి గోదా వరిఖనికి రాళ్లపేటకు చెందిన సయ్యద్ అజీమ్, బెల్లంపల్లికి చెందిన ఆయిల్ల రమను ఆటోలో గో దావరిఖనికి తీసుకువెళ్తున్నాడు. ఇందారం అటవీ శాఖ చెస్పోస్టు దాటిన తర్వాత గోదావరి బ్రిడ్జి వద్ద మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేసి నిలిపివేయడంతో వెనుకే వస్తున్న ఆటో అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భా గం నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ రాజేశ్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఇద్దరు ప్యాసింజర్లు సయ్యద్ అజీమ్, అయిల్ల రమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమ తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను కరీంనగర్కు తరలించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై శ్రీధర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడు రాజేశ్కు ఇద్దరు భార్యలు లావణ్య, గా యత్రి ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడడం గమనార్హం. -
తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
మంచిర్యాల: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్కు 2021లో మామడ మండలం గాయిది పల్లకి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల ఫలితాలు విడుదల
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ ఫలితాల్లో 13,963 మందికి గానూ 7,059 మంది (50.56 శాతం), ఆరో సెమిస్టర్లో 37,999 మందికి గానూ 19,060 మంది (50.16శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తులు ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్లైన్లోనే సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. త్వరలో 2, 4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ.. డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్లో 50.56 శాతం.. ఆరో సెమిస్టర్లో 50.16 శాతం ఉత్తీర్ణత -
వేలాల గట్టు మల్లన్న గుట్టపై గిరిప్రదక్షణ
జైపూర్: మండలంలో ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టు మల్లన్నస్వామి సన్నిధిలో గురువారం 9వ గిరి ప్రదక్షణ కార్యక్రమం వైభవంగా చేపట్టారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ ఆత్మారాం మహారాజ్ కుమారులు శ్రేయాంష్ మహారాజ్ ఆధ్వర్యంలో గట్టు మల్లన్న స్వామి గుట్టపైన గిరిప్రదక్షణ చేపట్టారు. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గిరిప్రదక్షణలో పాల్గొని దొణలో స్వయంబువుగా వెలిసిన గట్టు మల్లన్న స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై భక్తుల సందడి నెలకొంది. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు. -
సిబ్బందిని లోపలే ఉంచి కార్యాలయ గదికి తాళం
● రెబ్బెన ఎంపీడీవో ఆఫీసు సిబ్బంది నిర్వాకం రెబ్బెన: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి పనినిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి లోపల ఉండగానే సదరు సిబ్బంది తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎంపీడీవో కార్యాలయంలో టీ ఫైబర్ నెట్వర్క్కు సంబంధించిన పనిచేసేందుకు వచ్చిన వ్యక్తి కార్యాలయం లోపల గదిలో పని చేసుకుంటున్నాడు. ఎంపీడీవో కార్యాలయం మూసే సమయం కావడంతో సిబ్బంది ఎంపీపీ, ఎంపీడీవో ఇతర సిబ్బంది విధులు నిర్వహించే గదులను పరిశీలించి కార్యాలయం ప్రధాన ద్వారం తలుపులు మూసి తాళం వేసి వెళ్లిపోయారు. కాసేపటికి తన పనిని ముగించుకుని కార్యాలయం నుండి బయటకు వచ్చేందుకు ప్రధాన ద్వారం వద్దకు వచ్చే సరికి ప్రధాన ద్వారం తలుపులు తెరుచుకోలేదు. దీంతో విషయాన్ని తన తోటి సిబ్బందికి సమాచారం అందించాడు. వారు ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి తెలపడంతో వెంటనే సిబ్బందిని పంపించి కార్యాలయం తలుపులు తెరవడంతో సదరు వ్యక్తి బయటకు వచ్చాడు. ఈ విషయపై కార్యాలయ సూపరింటెండెంట్ వాసుదేవ్ను వివరణ కోరగా టీ ఫైబర్ నెట్వర్క్ పని చేసేందుకు వచ్చే సిబ్బంది సమయ పాలన పాటించకుండా కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారని, గురువారం సాయంత్రం కార్యాలయం ముసే సమయంలో వచ్చి పనులు చేసుకుంటూ ఉండగా గమనించకుండా కార్యాలయ సిబ్బంది తాళం వేసినట్టు ఉన్నారన్నారు. వ్యక్తి లోపల ఉన్నట్టు వెంటనే విషయం తెలుసుకుని కార్యాలయం తలుపులు తెరిచామన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
● జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల రాస్తారోకో ● నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ నేరడిగొండ: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్కు 2021లో మామడ మండలం గాయిదిపల్లికి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. -
మానవ అక్రమ రవాణా కేసులో కానిస్టేబుల్ డిస్మిస్
● నిందితుడిపై మూడు కేసులు ● 2022 నుండి విధులకు గైర్హాజరు ● ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆసిఫాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ కామెర హరిదాస్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. 2019లో తిర్యాణిలో ఓ గిరిజన మహిళను మధ్యప్రదేశ్లో విక్రయించిన కేసులో హరిదాస్ నిందితుడు. అలాగే ఈ ఏడాది ఓ ఆదివాసీ గిరిజన మహిళను ఇద్దరు మధ్యవర్తుల సాయంతో మధ్యప్రదేశ్లో విక్రయించాడు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితుల్లో హరిదాస్ ఏ5గా ఉన్నాడు. అలాగే ఈ నెల 6న ఓ మహిళ మిస్సింగ్ కేసులో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా, మధ్యప్రదేశ్లో బాధితురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత మహిళ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం గుర్తించిన నలుగురు నిందితుల్లో హరిదాస్ ఏ1గా ఉన్నాడు. ఈ నెల 16న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 1989 పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్కు చెందిన హరిదాస్ 2019లో తిర్యాణి కేసు అనంతరం సస్పెండ్ అయ్యాడు. అనంతరం 2020లో చింతలమానెపల్లి పోలీస్స్టేషన్లో విధుల్లో చేరాడు. 2022 నుంచి 2025 జూన్ 15 వరకు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. తాజాగా మళ్లీ మానవ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడటంతో అతడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపారు. -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఫిజికల్ హ్యాండీక్యాప్, సాయుధ బలగాల కోటా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను గురువారం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ కోటాలో హెరింగ్ ఇంపెయిర్, మెంటల్ రిటార్డేషన్, మల్టీఫుల్ డిసార్డర్స్, ఆర్థోపెడిక్ డిసెబిలిటీస్, విజువల్ ఇంపెయిర్డ్ వంటి విభిన్న దివ్యాంగ విద్యార్థులు హాజరయ్యారు. వీరి ధ్రువీకరణను జిల్లా ప్రభుత్వ వైద్యుల బృందం నిర్వర్తించింది. సాయుధ బలగాల సిబ్బందికి చెందిన పిల్లల పత్రాల పరిశీలనను సంబంధిత సాయుధ శాఖల అధికారుల పర్యవేక్షణలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన విద్యార్థుల ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. జూలై 4న ప్రొవిజినల్లీ సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ జూలై 7న ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో కన్వీనర్లు డాక్టర్ దేవరాజు, డాక్టర్ విట్టల్, రాకేష్రెడ్డి, హరికృష్ణ మంతపురి, బద్రి నారాయణ, మోహన్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
రెండు లారీలు ఢీ..డ్రైవర్ మృతి
● మరో డ్రైవర్కు తీవ్రగాయాలులక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. దేవపూర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్ సంతూర్ సబ్బుల లోడ్తో హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ బయలుదేరిన లారీ ఇటిక్యాల సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు జరిపించారు. ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ కాసిపేట మండలం పలాంగూడకు చెందిన శ్రీనివాస్ (52) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ సచిన్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రైవే టు ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్ భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
● పర్యాటక ప్రదేశాలకూ సర్వీసులు ● మంచిర్యాల నుంచి టూర్ ప్యాకేజీలు ● 36 మంది ప్రయాణికులుంటే చాలు మంచిర్యాలఅర్బన్: ఆదాయాన్ని రాబట్టి లాభాల బాట పట్టేలా అన్ని మార్గాలనూ ఆర్టీసీ అన్వేషిస్తోంది. విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లాలనుకుంటే ఇళ్ల వద్దకు బస్సులు పంపుతోంది. తాజాగా టూర్ ప్యాకేజీలపై దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులను ఆకుట్టుకున్న ఆర్టీసీ పుణ్యక్షేత్రాల దర్శనం, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. తక్కువ చార్జీలతో భక్తులను ఆలయాలకు తీసుకెళ్లి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆరు గంటలకు మంచిర్యాల బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరి ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, గాంధారిఖిల్లా, శివ్వారం(మొసళ్ల చెరువు), త్రివేణి సంగమమైన కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలను దర్శించుకుని రాత్రి 8 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.530, పిల్లలకు రూ.290 చార్జీలు ప్రకటించారు. భోజన, ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. 36 మంది సిద్ధంగా ఉంటే.. 36 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే పుణ్యక్షేత్రాలకు ఏ రోజైనా బస్సులు నడపనుంది. మంచిర్యాల బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరి కొమురవెల్లి, చేర్యాల, ఆలేరు, కొలనుపాక, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి వెళ్లనుంది. సూపర్లగ్జరీ బస్సు ద్వారా కొమురవెల్లి ఆలయం తర్వాత వయా చేర్యాల, ఆలేరు మీదుగా కొలనుపాక చేరుకుని జైన దేవాలయం సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి యాదగిరిగుట్ట చేరుకుని నృసింహాస్వామి ఆలయ దర్శనం, అనంతరం స్వర్ణగిరి ఆలయ సందర్శన ఉంటుంది. ప్రయాణికుల కోసం ప్రత్యేకం మంచిర్యాల డిపో ప్రత్యేక టూర్ప్యాకేజీ ఏర్పాటు చేసింది. టికెట్ ధర పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.700గా నిర్ణయించాం. ఏరోజైనా బస్సులు నడుపుతాం. శనివారం ఒక బస్సు డిపో నుంచి వెళ్లేలా చూస్తాం. దర్శనం, అల్పాహారం, భోజనాలు, ఇతరత్రా ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. బుకింగ్ కోసం 9959226004 నంబరులో సంప్రదించాలి. – శ్రీనివాసులు, డీఎం, మంచిర్యాల -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
జైపూర్: మండలంలోని ఇందారం అ టవీశాఖ చెక్పోస్టు సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జాదవ్ సూర్యకుమార్ (30) మందమర్రిలో నివాసం ఉంటున్నాడు. మందమర్రికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి వెంకటేశ్తో కలిసి బుధవారం రామగుండం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వీవో షోరూం సమీపంలో అడ్డువచ్చిన అడవిజంతువును తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఘటనలో బైక్ నడుపుతున్న సూర్యకుమార్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న వెంకటేశ్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యకుమార్ భార్య రాజశ్రీ సింగరేణిలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై అభిబ్ తెలిపారు. ఇసుక వేలంబెల్లంపల్లి: అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు గురువారం వేలం నిర్వహించారు. రెండు రోజుల క్రితం గ్రామీణ ప్రాంతాల నుంచి దొంగతనంగా రెండు ట్రాక్టర్లలో బెల్లంపల్లికి ఇసుకు తీసుకువస్తుండగా ఎస్సై కె.మహేందర్ పట్టుకుని టూటౌన్కు తరలించారు. సదరు ట్రాక్టర్లలో ఉన్న ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించగా రూ.3,200కు సుస్మిత్ అనే యువకుడు దక్కించుకున్నాడు. ఈ వేలం పాటలో రెవెన్యూ అధికారి రమేశ్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన బల్దియా అకౌంట్ ఆఫీసర్
● మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత కై లాస్నగర్: ఓ కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేందు కోసం లంచం డిమాండ్ చేసిన ఆదిలాబాద్ మున్సిపల్ ఉద్యోగులు ఇద్దరిని ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ జిల్లాల సంతోష్ మున్సిపల్ పరిధిలో రూ.60లక్షల విలువైన సీసీ రోడ్లు, హైమాస్ట్ లైటింగ్ పనులు చేశారు. పనులకు సంబంధించి రూ.3.80లక్షల చెక్కు ఇచ్చేందుకు మున్సిపల్ అకౌంట్ సెక్షన్ ఆఫీసర్(ఏవో) బట్టల రాజ్కుమార్గౌడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ కొండ్ర రవికుమార్ రూ.20 వేలు డిమాండ్ చేశారు. రూ.15 వేలు ఇచ్చేలా వారితో కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.15 వేలు కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మున్సిపల్ కార్యాలయంలోని అకౌంట్ సెక్షన్లో మున్సిపల్ ఏవోకు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ సీఐ కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలేరును చితకబాదిన యజమాని..
● అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం.. సోన్: యజమాని చితకబాదాడని అవమానం తట్టుకోలేక పాలేరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతు వద్ద కుభీర్ మండలం మాలేగం గ్రామానికి చెందిన రాపని రమేశ్ నాలుగేళ్లుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా పనికిరాక పోవడంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి మరో ఇద్దరితో కలిసి మంగళవారం పాలేరును చితకబాదారు. దీంతో అవమానం తట్టుకోలేని పాలేరు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గోవర్ధన్రెడ్డి తెలిపారు. -
ఆటో డ్రైవర్పై కేసు
ఆదిలాబాద్టౌన్: మహిళను మోసగించిన ఆటోడ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు జైనథ్ మండలంలోని మాకోడ గ్రామానికి చెందిన రాచర్ల హీరక్క ఈనెల 24న ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ వద్దకు వచ్చింది. అక్కడి నుంచి సుభాష్నగర్లో ఉన్న తన మనుమని వద్దకు వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటోలో ఎక్కింది. డ్రైవర్ సుభాష్నగర్ వైపు వెళ్లకుండా ఆటోను తాంసి బస్టాండ్ వైపు మళ్లించాడు. దీంతో సదరు మహిళ కేకలు వేయగా ఆమె వద్ద ఉన్న సంచి, సెల్ఫోన్ ఎత్తుకెళ్లాడు. సంచిలో రూ.17,500 నగదు ఉన్నట్లు మహిళ వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అసత్య ప్రచారం చేసిన ఒకరిపై..నెన్నెల: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఒకరిపై కేసు నమోదుగుడిహత్నూర్: విలేకరినని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై మధుకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సీతాగోందికి చెందిన అరుగుల సంతోష్ తాటికల్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భూమేశ్ అనే వ్యక్తి ఫోన్చేసి తాను విలేకరినని, మీరు కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సంతోష్ సదరు వ్యక్తికి రూ.2వేలు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ విషయాన్ని బాధితుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేపట్టిన పోలీసులు సదరు విలేకరిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. స్పోర్ట్స్ అర్హత పరీక్షకు విద్యార్థుల ఎంపికవేమనపల్లి: మంచిర్యాల క్రీడా ప్రాతిపాదిక సంస్థ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాల ఎంపిక పోటీలలో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో శ్రీధర్రెడ్డి, పీఈటీ మల్లేశ్ తెలి పారు. ఎంపికై నవారిలో అంజన్న (కల్మలపే ట), ఎం.వర్షిణి (కొత్తపల్లి), శ్రీహిత (గెర్రెగూ డం), శ్రీజ (సుంపుటం), జి.హారిక (కేతన్పల్లి), ఏ. మేఘన (కొత్తపల్లి) ఉన్నారు. తాంసిలో క్లోరల్హైడ్రేట్ పట్టివేత తాంసి: మండల కేంద్రం శివారులో ఉన్న ఓ పశువుల పాకలో రెండు రోజుల క్రితం 20 కిలోలకు పైగా నిషేధిత క్లోరల్హైడ్రేట్ను ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్న ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి క్లోరల్హైడ్రేట్ను ఆదిలాబాద్కు తీసుకొచ్చి గ్రామాల వారీగా ఆయా దుకా ణా లకు చేరవేస్తున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న అబ్కారీ బృందం ఘటన స్థలా నికి చేరుకొని పెద్ద ఎత్తున నిషేధిత క్లోరల్హైడ్రేట్ పట్టుకున్నారు. అధికారులు ఈ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ విజేందర్ను సంప్రదించగా గ్రామ శివారులో ఖాళీగా ఉన్న స్థలంలో కేవలం ఐదు కిలోలు మాత్రమే పట్టుకున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. -
చిత్తశుద్ధితో పథకాలు అమలు చేస్తున్నాం
ఎన్ని అడ్డంకులొచ్చినా సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 18 నెలలుగా గత ప్రభుత్వం చేసిన అప్పు కింద ప్రతీనెల రూ.6,500 కోట్లు చెల్లిస్తున్నాం. అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశాం. రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నాం. రుణమాఫీకి నోచుకోని రైతులకు సింగిల్ విండో కౌంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. భూభారతి చట్టం ద్వారా వివిధ దశల్లో తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. చట్టాలు చేసేది మేమే అయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేయాలి. బాధితులు సమస్యలు లిఖితపూర్వకంగా సదరు నంబర్కు వాట్సాప్ చేస్తే పరిష్కరించేలా కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకుంటే తొలుత మౌఖికంగా, ఆ తర్వాత లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులను వివరణ కోరాలి. అప్పటికీ పరిష్కారం కాకుంటే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేస్తూ అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించాలి. – జూపల్లి కృష్ణారావు, ఇన్చార్జి మంత్రి -
డివిజన్ల విభజనపై ఉత్కంఠ
● వెలువడని కార్పొరేషన్ జాబితా ● ఆశావహుల ఎదురుచూపులుమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 21న జాబితా విడుదల కావాల్సి ఉండగా.. జాప్యం జరుగుతుండడంతో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూర్ మున్సిపాల్టీతోపాటు హాజీపూర్ మండలం వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నర్సింగాపూర్, చందనాపూర్, కొత్తపల్లి, పోచంపాడ్ గ్రామాలను విలీనం చేసి ఈ ఏడాది జనవరిలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు వార్డులు, గ్రామాలుగా ఉన్న వాటన్నింటినీ కలిపి భౌగోళికంగా, ఓటర్ల సంఖ్యను బట్టి మొత్తం 60డివిజన్లుగా మార్చి అధికారులు ముసాయిదా జాబితా విడుదల చేశారు. విభజన ప్రతిపాదనలపై నోటీసులు నోటీసులు ఇవ్వడంతోపాటు సాధారణ ప్రజలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లేఖలను ఈ నెల 4వరకు అందజేశారు. 5నుంచి 11వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను రాతపూర్వకంగా స్వీకరించారు. ఈ నెల 12నుంచి 16వరకు పరిష్కరించేలా విచారణ చేపట్టి, ఆమోదించిన అభ్యంతరాల ప్రకారం డివిజన్లను కొంత మార్చి కలెక్టర్ ఆమోదం కోసం ఈ నెల 18న పంపించారు. 19న పురపాలక శాఖకు, అక్కడి నుంచి 20న ప్రభుత్వానికి నివేదిక చేరింది. ప్రభుత్వ పరిశీలన అనంతరం తుది జాబితా 21న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పటికీ వెలువడకపోవడంతో ప్రజల్లో, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిలో ఉత్కంఠ నెలకొంది. అభ్యంతరాలు.. మార్పులు భౌగోళికంగా డివిజన్లు సక్రమంగా లేవని, వాటిని మళ్లీ సవరించాలని 38 అభ్యంతరాలు వచ్చాయి. నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పరిశీలించి అందులో 19 అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని మార్పులు చేశారు. మరో 13 అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆరు అభ్యంతరాలు పాక్షిక మార్పులు చేశారు. వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా ఒక కాలనీ రెండు నుంచి నాలుగు డివిజన్లలోకి రావడం, కొన్ని ఇళ్ల నంబర్లు తప్పిపోవడం, కొన్ని కాలనీలు డివిజన్లలో కనిపించకపోవడం వంటివి అధికారులు గుర్తించారు. డివిజన్ల సరిహద్దులు స్వల్పంగా మారనుండగా ఓటర్ల జాబితా, డివిజన్లోని కాలనీల సరిహద్దుల్లో మార్పులు చేశారు. సామాజిక మాధ్యమాల్లో జాబితా ప్రభుత్వం, అధికారుల నుంచి కార్పొరేషన్ డివిజన్ల జాబితా విడుదల కాకముందే సామాజిక మాధ్యమాల్లో ఇవే డివిజన్లు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 3న ప్రకటించిన జాబితా, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుగున్న జాబితాకు కొంత మార్పు ఉండడంతో నిజమే కావొచ్చని భావిస్తున్నారు. తమ డివిజన్ ఎక్కడ వస్తుందనే ఆసక్తితోపాటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారి ఏ ఏరియా నుంచి ఎక్కడి వరకు కలిసిందని ఆరా తీస్తున్నారు. జాబితా కొంత గందరగోళంగా ఉండడంతో ప్రభుత్వం తాత్సారం చేయకుండా జాబితా విడుదల చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
● డ్రగ్స్ నివారణకు అందరూ కృషి చేయాలి ● మంచిర్యాల ఏసీపీ ప్రకాష్మంచిర్యాలక్రైం: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పని చేయాలని మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాష్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సమన్వయంతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీ చౌరస్తా నుంచి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు ర్యాలీ సాగింది. బెల్లంపల్లి చౌరస్తాలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం ద్వారా యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు. మత్తుకు బానిసైన కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, మరికొందరు అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారని తెలిపారు. క్యాలెండర్, యాంటి డ్రగ్స్ వాల్పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రమోద్రావు, రూరల్ సీఐ అశోక్కుమార్, ఎకై ్సజ్ సీఐ గురువయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగ చక్రపాణి, సీడీపీవో రేష్మ, శ్రావణి, ఎఫ్ఆర్ఓ ఫర్జానా తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు పనులు ప్రారంభించాలి
చెన్నూర్రూరల్: వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో తాత్కాలిక మరమ్మతు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ అన్నారు. గురువారం మండంలోని గంగారం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మంత్రి వివేక్ ఆధ్వర్యంలో రోడ్డు పనులు ప్రారంభించారని, ఇంతవరకు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆలం బాపు, మంత్రి రామయ్య, నాయకులు కాశెట్టి నాగేశ్వర్రావు, కొటారి వెంకటేశ్, దుర్గం రాజబాపు, కుడుదుల రాజన్న పాల్గొన్నారు. -
షెట్టర్ల కేటాయింపుల్లో అక్రమాలు
బెల్లంపల్లి: సమీకృత కూరగాయల మార్కెట్ షెట్టర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. గురువారం బెల్లంపల్లి ము న్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వినోద్ అనుచరులు కొందరికి మార్కెట్తో సంబంధం లేకున్నా షెట్టర్లు కట్టబెట్టారని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్, కొందరు మాజీ ప్రజాప్రతినిధుల బంధువులకు మంజూరులో అక్రమాలు జరిగాయని పేర్కొన్నా రు. అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ శ్రేణులను మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మా జీ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్, పట్టణ యూత్ అధ్యక్షుడు అరుణ్, బీఆర్ఎస్, అనుబంధ సంఘాల శ్రేణులు చంద్రయ్య, అలీ, సాజిద్, వాజిద్, సు భాష్రావు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలన
బెల్లంపల్లి: పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీఎస్వో కే.మధుకర్ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కౌన్సెలింగ్ నిరాటంకంగా సాగింది. తొలుత విద్యార్థులను కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక గదిలోకి పంపించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్నారు. సర్టిఫికేట్లు పరిశీలించి ధ్రువీకరించారు. పాలిటెక్నిక్ కోర్సులు, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర అంశాలపై అవగాహన కలిపించారు. తొలిరోజు కౌన్సెలింగ్కు 360మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల వివిధ బ్రాంచ్ల హెడ్లు బి.వెంకటేశ్వర్లు, ఎస్.నాగరాజు, వర్క్షాప్ సూపరింటెండెంట్ డి.రాందాస్, కౌన్సెలింగ్ ఇంచార్జీ టి.మధుకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇందన్పల్లి ఎఫ్ఆర్వోగా శ్రీధరచారి
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ ఇందన్పల్లి అటవీ రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) కారం శ్రీని వాస్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం డిప్యూటీ రేంజ్ అధికారులకు రేంజ్ అధికారులుగా పదోన్నతి కల్పించింది. దీంతో సిర్పూర్(టి) డీఆర్వో శ్రీధరచారిని పదోన్నతితో ఇందన్పల్లి రేంజ్ అధికారిగా నియమిస్తూ పీసీసీఎఫ్ సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. ప్ర స్తుత ఇన్చార్జి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ తిరిగి జిల్లా టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్వోగా చేరే అవకాశాలున్నాయి. జిల్లా టాస్క్ఫోర్స్లో రేంజ్ అధికారిగా పని చేసిన ఆయనకు గత ఏడాది అక్టోబర్ 14న ఇందన్పల్లి రేంజ్ అధికారిగా ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. ఎనిమిది నెలల కాలంలో ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఇసుక, కలప అక్రమ రవాణాను అరికట్టారు. సిమెంటు ఇటుకల తయారీకి ఇసుక తరలించకుండా చర్యలు తీసుకున్నారు. -
స్థానిక సమరానికి సిద్ధం!
జిల్లాలో గ్రామీణ ఓటర్లుమహిళలు 1,90,828 పురుషులు 1,85,956 ఇతరులు 19 మొత్తం 3,76,803సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలరూరల్ (హాజీపూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి నాయకులు సిద్ధం అవుతున్నారు. వచ్చే సెప్టెంబర్లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు నాయకులు సంస్థాగతంగా సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పేపర్ల వరకు అంతా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో 90రోజులు గడువు ఉండడంతో నాయకులు క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల్లో వేగిరం అధికార కాంగ్రెస్ పార్టీ సానుకూలతను పెంచేందుకు ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచారు. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హుల ఎంపిక సాగుతుండగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులతో ముగ్గు పోయిస్తూ నిర్మాణాలు వేగిరం చేస్తున్నారు. మరోవైపు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందజేశారు. భూభారతి అమలు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలతను పెంచుతూ వచ్చే పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేగాక శ్రేణులను సన్నద్ధం చేసుకుంటూ పార్టీలో రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు భర్తీ చేస్తున్నారు. పోరాడేందుకు ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను చూపిస్తూ స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేలా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు రాని బాధితులు, రాజీవ్ యువ వికాసం నిబంధనలు, భూ భారతిలో సమస్య పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు వంటివి జాప్యంపై ఇప్పటికే వినతులు, నిరసనలు చేపడుతున్నారు. తమ పార్టీల ప్రతినిధులతో కలిసి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆయా పథకాల అమలు తీరుపై ఎండగడుతున్నా రు. ప్రజావ్యతిరేకతను తీసుకొచ్చి వచ్చే పంచా యతీ, పరిషత్ ఎన్నికల్లో లబ్ధిపొందేలా ప్రణాళికలు వేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటానికి సిద్ధమవుతున్నారు. కర్చీఫ్ వేసుకుంటున్న నాయకులు రిజర్వేషన్ తేలకముందే ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు నాయకులు కర్చీఫ్లు వేసుకుంటున్నా రు. తాము బరిలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నా రు. జనరల్, మహిళా, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో ఆ యా నాయకులు రిజర్వేషన్లు ఉన్నవారు తమకు అనుకూలంగా ఉన్న చోట్ల బరిలో ఉంటారని ప్రజ ల్లో చెప్పుకుంటున్నారు. అయితే రిజర్వేషన్లు తేలా క, ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? లేక పరిషత్ ఎన్నికలా? అనే స్పష్టత కోసం చూస్తున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో పోటీలో ఉండబోయే నాయకులు స్థానిక ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇంకా కొందరు ఏ పార్టీ నుంచి ఉండకుండా తటస్థంగా ఉంటూ సమయాన్ని బట్టి పార్టీ మద్దతు కోరే యోచనలో ఉన్నారు. జిల్లాలో.. గత ఏడాది ఫిబ్రవరి 2నాటితో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. 17నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలపై చర్చ మొదలైంది. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో 2,680 వార్డులు ఉన్నాయి. 16మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనుండగా.. జిల్లాలో 3,777 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. 2019జనవరిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులతోపాటు మహారాష్ట్రకు చెందిన బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల మరమ్మతు పూర్తి చేసి పోలింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పంచాయతీల వారీగా పంపిస్తారు. బ్యాలెట్ పేపర్లు సైతం సిద్ధంగా ఉంచారు. పోటీ చేసే స్థానాలపై ప్రణాళికలు ముందుగానే కర్చీఫ్లు వేస్తున్న నాయకులు రిజర్వేషన్లు తేలితే పల్లెల్లో ఎన్నికల వేడి -
అధికారుల తీరు సరికాదు
జిల్లాలో పోడు, రెవెన్యూ భూముల సమస్య ప్రత్యేక సర్వే నిర్వహిస్తేనే పరిష్కారమవుతుంది. కడెం, దస్తురాబాద్ మండలాల్లో అటవీ అధికారులతో తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయి. పీపీ ల్యాండ్స్ సాగు చేస్తున్న గిరిజనేతరులకు గతంలో పహాణీల ద్వారా రుణాలందేవి. 30–40 ఏళ్లుగా సాగు చేస్తున్న గిరజనేతరులకు ప్రత్యామ్నాయం చూపాలి. అటవీ అధికారులు అభివృద్ధి పనులు అడ్డుకుంటుండగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయలి. – వెడ్మ బొజ్జుపటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే -
కమిట్మెంట్తో పనిచేయాలి
ఆదివాసీలతో పాటు భౌగోళికంగా విస్తీర్ణం కలిగిన జిల్లాలో సమస్యలు అధికంగానే ఉంటాయి. వాటి పరిష్కారానికి చొరవ చూపాలి. ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్తో పనిచేయాలి. గృహజ్యోతి సమస్యల పరిష్కారం కోసం సింగిల్ విండో కౌంటర్ను ఏర్పాటు చేస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూ.200 కోట్లతో 100 ఇంటిగ్రేటేడ్ పాఠశాలలను నిర్మిస్తున్నాం. పేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. గ్యాస్ సబ్సిడీ సక్రమంగా అందేలా చూడాలి. సమస్యలు తెలిపితే సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి -
మానవత్వం మరిచి సబ్బులు ఎత్తుకెళ్లారు!
లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాల గ్రామ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. దేవాపూర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్తున్న సిమెంటు ట్యాంకర్ లారీ, హైదరాబాద్ నుంచి సంతూర్ సబ్బుల లోడ్తో ఛత్తీస్గఢ్ వెళ్తున్న లారీఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాసిపేట మండలం పలాంగూడ గ్రామానికి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్ శ్రీనివాస్ (52) క్యాబిన్లో ఇరుక్కుని మృతిచెందాడు.పోలీసులు రెండు గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. మరో లారీ డ్రైవర్ సచిన్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సంతూర్ సబ్బుల లారీ యాక్సిడెంట్కు గురైన విషయం తెలియడంతో సమీపంలోని ప్రజలు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని లారీపైకి ఎక్కి ఇష్టారాజ్యంగా సబ్బులు ఎత్తుకెళ్లారు. సబ్బులను సంచుల్లో నింపుకొని కొందరు వెళ్లగా, మరికొందరు పెట్టెలను ఎత్తుకుని వెళ్లారు. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్లు ఒకవైపు నెత్తురోడుతూ ఉండగా వారిని రక్షించకుండా స్థానికులు సబ్బులకోసం ఎగబడ్డారు. గురువారం ఉదయం కూడా పలువురు సబ్బులను తీసుకెళ్లడం కనిపించింది. -
రెండోరోజూ బాధితుల ఆందోళన
పెంచికల్పేట్: అగర్గూడ గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎల్కపల్లిలోని రాచకొండ కృష్ణ ఇంటి ఎదుట గ్రామస్తులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండో రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్ రావు, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ మృతుని కుటుంబానికి తనవంతుగా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తానని హామి ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు చేసిన మానసిక వేధింపులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ జెడ్పీటీసీ పాల్వాయి సుధాకర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్స్టేషన్లో ఽఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అద్యక్షుడు కోట సతీశ్, ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జైరాం కోరారు. మృతికి సంతాపంగా మండల కేంద్రంలోని వ్యాపార సముదాయాలు బంద్ పాటించారు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో కాగజ్నగర్ రూరల్, కౌటాల సీఐ శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడి అరెస్టు.. అగర్గూడ గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆత్మహత్యకు కారణమైన ఎల్కపల్లి గ్రామానికి చెందిన రాచకొండ కృష్ణను హైదరాబాద్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పెంచికల్పేట్ ఎస్సై కొమురయ్య తెలిపారు. విషాదంలో అగర్గూడ.. గ్రామంలో అందిరితో కలిసి మెలిసి ఉండే రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి శ్రీనివాస్ మూడేళ్ల క్రితం చనిపోయాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడంతో తల్లి లక్ష్మీ రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
కార్మికులపై వేధింపులు మానుకోవాలి
● హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ శ్రీరాంపూర్: తమమాట వినలేదన్న కారణంతో అధికారులు కార్మికులను వేధించడం మానుకోవాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ లోని ఎస్సార్పీ 3, 3ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. అధికారుల తప్పిదాలను ప్రశ్నిస్తే షిఫ్టులు మార్చి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. పని స్థలాల వద్ద కార్మికులకు తాగునీటి సదుపాయం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో కోల్ ఫిల్లింగ్ పనులు చేయిస్తూ వేతనం మాత్రం ఒకటో కేటగిరీ వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. జన్మభూమి పేరుతో కార్మికులపై అదనపు పని భారం మోపుతున్నారన్నారు. సమయానికి మ్యాన్రైడింగ్ నడుపకపోవడంతో కార్మికులు కాలినడకతోనే గనిలోకి దిగాల్సి వస్తుందన్నారు. కొంతమంది అధికారులు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు శశిధర్, గంగపెల్లి కమలాకర్, నర్సింగరావు, తదితరులు యూనియన్లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అనిల్రెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు జక్కుల నారాయణ, తిప్పారపు సారయ్య, గొల్ల సత్యనారాయణ, బ్రాంచ్ కార్యదర్శి పొనగంటి అశోక్, నాయకులు దుర్గం లక్ష్మణ్, రేగుంట సందీప్, తుల అనిల్ కుమార్, చెవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి’
గుడిహత్నూర్: పీహెచ్సీలో ఎలాంటి సమస్యలున్నా త మదృష్టికి తీసుకు రావాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. ఇటీవల స్థానిక పీహెచ్సీలో పసికందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డ ఘటన నేపథ్యంలో బుధవారం పీహెచ్సీని సందర్శించారు. వైద్యాధికారి శ్యాంసుందర్ ను అడిగి ఆస్పత్రిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో లక్షల విలువైన వైద్యోపకరణాలు చిన్నచిన్న సమస్యలతో మూలనపడి ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేస్తే రోగులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందిస్తామని, తాగినీటి సమస్య ఉందని చెప్పడంతో పీవో సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమంచిర్యాలటౌన్: మాదక ద్రవ్యాల నిర్మూలనకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద జిల్లాలో డి–అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు అర్హత, అనుభవం కలి గిన స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–అనుదన్ (http://grants-msje.gov.in/ngo-login) పోర్టల్లో ఈ నెల 30లోగా వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తును జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. తాటిచెట్టు పైనుంచి పడి గాయాలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): తాటిచెట్టు పైనుంచి కిందపడి గీతకార్మికుడికి గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీలోని గొల్లపల్లికి చెందిన కోట బుచ్చాగౌడ్ బుధవారం తాటిచెట్టు ఎక్కి కిందకు దిగుతుండగా అదుపుతప్పి కిందపడి పోయాడు. తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
● పొక్లెయిన్ను ఢీకొన్న కారు ● ఇద్దరు యువకులు దుర్మరణంగుడిహత్నూర్: అతి వేగం రెండు ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాల్లో విషాధం నింపింది. అతివేగంగా వచ్చిన కారు పొక్లెయిన్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు జైనూర్ మండల కేంద్రానికి చెందిన ఆర్యన్ ముండే (19), ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన గాయక్వాడ్ అనిల్ (21) ఇద్దరు స్నేహితులు. మంగళవారం రాత్రి కారులో వెళ్తుండగా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వైజాపూర్ యూటర్న్ వద్ద పొక్లెయిన్ను అతివేగంగా ఢీకొట్టారు. గాయక్వాడ్ అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కొనఊపిరితో ఉన్న ఆర్యన్ముండేను ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఎవరికీ తెలియకుండా పయనం.. ఆర్యన్ ముండే, గాయక్వాడ్ అనిల్ మంచి మిత్రులు. ఆర్యన్ ముండే స్వస్థలం మహారాష్ట్రలోని బోధిడి. తన అమ్మమ్మ ఊరైన జైనూర్లో ఉంటూ తాత వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎవరికీ తెలియకుండా ఇంటి బయట ఉన్న కారు తీసుకుని ఉట్నూర్ ఎక్స్రోడ్డుకు వచ్చి తన మిత్రుడు గాయక్వాడ్ అనిల్కు ఫోన్ చేశాడు. దీంతో అనిల్ తన ఇంటి నుంచి స్కూటీపై ఏందా ఎక్స్రోడ్డు వద్దకు వచ్చాడు. స్కూటీని వదిలి ఆర్యన్తో కారులో ఆదిలాబాద్ వైపు బయలు దేరారు. మృతదేహాలకు బుధవారం రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వై.మధుకృష్ణ తెలిపారు. -
ఓపెన్ స్కూల్ ఓ వరం..
● చదువు మానేసిన వారికి మంచి అవకాశం ● పదోతరగతి, ఇంటర్లో ప్రవేశాలు ప్రారంభం ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84 కేంద్రాలు లక్ష్మణచాంద(నిర్మల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల వల్ల పాఠశాల స్థాయిలోనే పలువురు విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. మరి కొందరు పదోతరగతి పూర్తయిన తరువాత ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇంటర్ చదువు కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులు మళ్లీ చదువు కొనసాగించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్ ఓ సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ పదోతరగతి, ఓపెన్ ఇంటర్ అధ్యయన కేంద్రాలు 84 ఉన్నాయి. వాటిలో 7,078 మందికి ప్రవేశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఓపెన్ తరగతుల్లో ప్రవేశాల కోసం ఎలాంటి విద్యార్హత లేదు. కనీస వయస్సు 15 ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో ప్రవేశాల కోసం తప్పనిసరిగా పదో తరగతి పాపై ఉండాలి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 12 నుంచి జూలై 11 వరకు ప్రవేశం పొందవచ్చు. టీజీ ఆన్లైన్లో మీసేవ కేంద్రంలో ఫీజు చెల్లించి సమీపంలోని ఓపెన్ స్కూల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్ తీసుకోవాలి. ఓపెన్ స్కూల్లో ఈ నెల 25 బుధవారం వరకు మొత్తం 71 దరఖాస్తులు వచ్చినట్లు ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. ఇందులో ఓపెన్ పదో తరగతికి ఉమ్మడి జిల్లాలో 47 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 34 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారని పేర్కొన్నారు. ఓపెన్లో ఇంటర్లో సైన్స్ విభాగంలో 20 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించారని, ఆర్ట్స్ విభాగంలో ఇప్పటి వరకు 41 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 31 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారని తెలిపారు. సెలవుల్లో తరగతులు... ఓపెన్ పదో తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవులు ఉన్న రోజుల్లో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు అధ్యయన కేంద్రాల్లోనే అందజేస్తారు.ఉమ్మడి జిల్లా సమాచారం జిల్లా అధ్యయన చేర్పించాల్సిన కేంద్రాలు లక్ష్యం నిర్మల్ 25 2,506 ఆదిలాబాద్ 22 1,696 మంచిర్యాల 17 1,974 కుమురంభీం 20 902 మొత్తం 84 7,078 -
బోనాల పండుగకు వేళాయె
● నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం ● ఊరుకట్టడితో ప్రత్యేక పూజలు ● డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు ● వనభోజనాలు, గోరింటాకు సంబురాలు మంచిర్యాలఅర్బన్: జిల్లాలో బోనాల సందడి షురూ కానుంది. ఈనెల 26 నుంచి నెలరోజుల పాటు డప్పు చప్పుళ్లు పోతరాజుల విన్యాసాలు శివసత్తుల సిగాలు, కళాకారుల ఆటపాటలు, డీజే హోరుతో వాడవాడలు మార్మోగనున్నాయి. బోనాల జాతర సంస్కృతి సంప్రదాయలను కొనసాగించడమే కాదు... ఆర్థిక కోణంలోనూ అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఊరు కట్టడి ఆనవాయితీ. మహిళలు మెహందీ (గోరింటాకు)తో మురిసిపోతుంటారు. గురువారం ప్రారంభమయ్యే ఆషాఢమాసంపై ప్రత్యేక కథనం.. ఊరుకట్టడి ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పంటలు, పిల్లాపాపలు, పశుసంపద సల్లంగా ఉండాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఊరు కట్టడి చేస్తారు. పూజలు పూర్తయ్యేంత వరకు గ్రామస్తులెవరూ బయటకు వెళ్లరు. బయటి వ్యక్తులను గ్రామంలోకి రానీయరు. గ్రామ దేవతలైన పోచమ్మ, భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను బలిఇస్తారు. పోతరాజు గావుపట్టి ఊరు చుట్టూ తిరుగుతూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి.. ఆషాఢమాసంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మతల్లికి బోనాలు సమర్పిస్తారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ముదిరాజ్ల ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముదిరాజ్ కులస్తులంతా కలిసి బోనాలతో బయలుదేరి అమ్మవారిని దర్శించుకుంటారు. హమాలీవాడ పోచమ్మ చెరువు సమీపంలోని మండేలయ్యకు రజకులు, గౌడ కులస్థులు ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. తాటి, ఈత వనంలో తమకు మంచి జరగాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పిస్తారు. మహిళలకు గోరింటాకు పండుగ.. ఆషాఢమాసం వచ్చిందంటే మహిళలు, యువతులు, పిల్లల చేతులు గోరింటాకుతో కళకళలాడుతుంటాయి. రుతువు మారినవేళ గోరింటాకు పెట్టుకుంటే కాళ్లు, చేతులు గోళ్లు శుభ్రపడుతాయని రోగని రోధకంగా అంటూ వ్యాధులను దూరం చేస్తుందని నమ్మకం. ఒకప్పుడు గోరింటాకు ముద్దలుగా చేసి ఇంటిల్లిపాది చేతులు, కాళ్లకు పెట్టుకునే వారు. పట్టణ ప్రాంతాల్లో మెహందీగా వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దటానికి కొంతమందికి ఉపాధి మార్గంగా మారింది. విద్యాసంస్థల్లో గోరింటాకు విశిష్టతను తె లిపేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. బాలికలు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహిస్తారు. పండుగతో ఉపాధి.. బోనాల పండుగ ఉపాధికి ఊతమివ్వనుంది. ప్రత్యేకంగా పోతరాజుల విన్యాసాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఇతర ప్రాంతాలకు చెందిన కళాకారులు మంచిర్యాల ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. బోనం సమర్పించేందుకు కుండలు ఎంతో అవసరం. నైవేద్యం సమర్పించే కుండతో పాటు దానిపై ఉండే చిన్న చిన్న బుడ్డిదీపం పెట్టే ముంత కలిపి ఒక సెట్లాగా ఉంటుంది. ఈ సమయంలో కుమ్మరులు బిజీగా ఉంటారు. డప్పులు వాయించేవారి నుంచి డీజేల వరకు ఉపాధి పొందనున్నారు. బోనం అలంకరణకు అవసరమైన పూల వ్యాపారం ఊపందుకుంటుంది. హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పూలను సిద్ధం చేస్తారు. మేకలు, కోళ్లకు భలే డిమాండ్ ఉంటుంది. పండుగ ఇలా ఎందరికో ఉపాధి తెచ్చి పెడుతుంది. -
ప్రమాదవశాత్తా.. ఆత్మహత్యాయత్నమా?●
● కళాశాల భవనం పైనుంచి కిందపడి విద్యార్థినికి గాయాలు మంచిర్యాలక్రైం: కళాశాల భవనం పైనుంచి కిందపడడంతో విద్యార్థినికి గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుమురంభీం జిల్లా బెజ్జూర్ మండలం మార్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి లచ్చన్న, సుక్కవ్వ దంపతుల రెండో కుమార్తె స్వప్న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం రాత్రి కళాశాల భవనంపై నుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాగా స్వప్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా? లేక ప్రమాదవశాత్తు కిందపడిందా? అనేది తేలాల్సి ఉంది. కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆందుబాటులోకి రాలేదు. సీఐ ప్రమోద్రావుని వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. తోటి విద్యార్థులను విచారించగా ఆరేసిన డ్రెస్లు తెచ్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిందన్నారు. గ్వాలియర్–ఎస్ఎంవీటీ రైలు ప్రారంభంబెల్లంపల్లి: గ్వాలియర్–ఎస్ఎంవీటీ (సర్ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్) వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. గురువారం గ్వాలియర్లో అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈనెల 29 నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్గా ఈ రైలు ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి ప్రారంభం కానుండగా గద్వాల, మహబూబ్నగర్, కాచిగూడ, కాజీపేట, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. దిగువ మార్గంలో బెంగళూరు వైపు వెళ్లేటప్పుడు 11086 నంబర్తో వెళ్తుంది. బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ప్రతీ శనివారం ఉదయం 11:08 గంటలకు వచ్చి 11:10 నిమిషాలకు బయలుదేరుతుంది. ఎగువ మార్గంలో ప్రతీ సోమవారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు ఉదయం 8:43 నిమిషాలకు వచ్చి 8:45 నిమిషాలకు బయలుదేరుతుంది. కాగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి జంక్షన్లో నిలుపుదల లేదు. సుబేదార్ గంజ్...చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ సుబేదార్ గంజ్–చర్లపల్లి (రైలు నెం.04121/04122) మధ్య మరో వీక్లీ ప్రత్యేక రైలు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు జులై 31 వరకు నడిపించనున్నారు. ఈ ప్రత్యేక రైలుకు సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట జంక్షన్లో నిలుపుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
జూలై 9న దేశ వ్యాప్త సమ్మె
శ్రీరాంపూర్: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య తెలిపారు. బుధవారం ఆయన ఆర్కే 7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, వీటివల్ల కార్మికవర్గం తమ హక్కులు కోల్పోనుందని తెలిపారు. ఈ నెల 27న సింగరేణి యాజమాన్యంతో డైరెక్టర్(పా) స్థాయిలో స్ట్రక్చరల్ సమావేశం జరుగుతుందని, కార్మికుల సా ధారణ మరణానికి కుటుంబాలకు రూ.10 లక్ష ల బీమా సదుపాయం కల్పించాలని కోరుతామని అన్నారు. ఈ సమావేశంలో యూని యన్ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు, నాయకులు ప్రసాద్రెడ్డి, అద్దు శ్రీని వాస్, గండి సతీశ్, శేఖర్, ఫిట్ సెక్రెటరీ మారుపల్లి సారయ్య, నాయకులు అఫ్రోజ్ఖాన్, ఆకుల లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
● ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం ● కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి ● కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలుజైపూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసమే కట్టారని, వేలాది కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి విమర్శించారు. బుధవారం ఆయన జైపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో జైపూర్, ఇందారం, టేకుమట్ల, రామారావుపేట, ముదిగుంట, మిట్టపల్లి, కాన్కూర్ గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూర్ నియోజకవర్గానికి నీటిబొట్టు కూడా రాలేదని, ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించి వందల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలే నిలదీస్తారని అన్నారు. మూడేళ్లుగా ప్రాజెక్టులోకి నీళ్లు రావడం లేదని, ప్రాజెక్టు బ్యాక్వాటర్ కారణంగా 40వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని, ప్రాజెక్టు మూలంగా రైతులకు నష్టమే మిగిలిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో మూడు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా నడిచిందని, ప్రజల సొమ్ము దోపిడీ చేశారని విమర్శించారు. ప్రజలు స్వంత అవసరాలకు ప్రభుత్వ ఇసుక రీచ్ల ద్వారా సులభతరంగా పొందవచ్చని అన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. పేదల ప్రభుత్వం చెన్నూర్/చెన్నూర్రూరల్/భీమారం: పేదల పక్షాన నిలబడేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. స్థానిక రాజీవ్ రోడ్డులో రూ.10లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెన్నూర్ మండలం సుబ్బరాంపల్లి, కిష్టంపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎవరు ఇళ్లు ముందుగా నిర్మించుకుంటే వారి ఇంటి గృహ ప్రవేశానికి హాజరై భోజనం చేసి వెళ్తానని అన్నారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని కోరారు. భీమారంలో కేజీబీవీలో రూ.66లక్షలతో అదనపు డార్మెటరీ గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
సమన్వయం.. సవాలే!
● ‘హస్తం’లో గ్రూపు విభేదాలు ● నామినేటెడ్, పార్టీ కమిటీల ఏర్పాటులో జాప్యం ● ముంచుకొస్తున్న ‘స్థానిక’ సమరం ● నేడు ఆదిలాబాద్కు జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’ రాక ● రెండ్రోజులపాటు ఇక్కడే మకాం ● ఆయన వెంట మంత్రి వివేక్ సైతం..సాక్షి,ఆదిలాబాద్: ‘పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశపర్చొద్దు.. సమన్వయంతో ముందుకు సాగా లి.. ప్రభుత్వ పదవులను శ్రేణులకు ఇప్పించడంలో జాప్యం అయితే ప్రయోజనమేంటి.. ఆలయ, మార్కెట్ కమిటీలు వంటి పదవులు నేరుగా నేను ఇవ్వలేను.. ఇన్చార్జి మంత్రులు, షార్ట్లిస్ట్ చేసి పంపితే ఫైనల్ మాత్రమే చేయగలుగుతాను.. నామినేటెడ్తో పాటు పార్టీ కమిటీలు ఇవ్వడంలో ఇక ఆలస్యం వద్దు.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలి.. అది జరిగితే త్వరగా ఫైనల్ చేయవచ్చు..’ ఇది సీఎం రేవంత్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన టీపీసీసీ పీఏసీ భేటిలో అన్న మాటలు. ప్రస్తుతం ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ఇన్చార్జి మంత్రులకు ప్రస్తుతం పార్టీ పరంగా వీటన్నింటిని సరిదిద్ది, గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎకై ్స జ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. నేడు, రేపు ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. అలాగే ఇన్చార్జి మంత్రికి తొలుత పార్టీ సంస్థాగత నిర్మాణం, నామినేట్ పదవుల పందెరం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం ముందున్న బాధ్యత. సీఎం ఈ విషయంలో ఇన్చార్జి మంత్రులు దృష్టి సారించాలని ఆదేశించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన తక్షణం దృష్టి సారించాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో గ్రూపు విభేదాలతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో మంత్రి వీటన్నింటిని ఎలా గాడిలో పెడతారనేది ఆసక్తికరం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కార్యకర్తల్లో తాము అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం కనిపించడం లేదు. అధికారుల వద్ద తమ పనులు కాాకపోవడం కూడా ఈ నిరాశకు కారణం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉత్సాహం తీసుకురావడం ప్రస్తుతం ఇన్చార్జి మంత్రికి కీలకం కానుంది. సమన్వయం సాధించేనా.. ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది. గతంలో ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్క వీరందరినీ సమన్వయ పర్చడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా ఆమె అసలు పట్టించుకోలేదని నేరుగా జిల్లా నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముందు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఆ సమయంలోనే తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించలేనని, తప్పుకుంటానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అప్పట్లోనే ఆమె పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత పరిణామ క్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి జూపల్లిని ఆదిలాబాద్కు, సీతక్కను నిజామాబాద్కు మార్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రి జూపల్లి తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో సమన్వయం ఎలా సాధించాలనే విషయంలో ఆయన ఎలా ముందుకెళ్తారనేది ప్రస్తుతం కీలకం. ఇక చెన్నూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంత్రి హోదాలో ఆయన కూడా గురువారం నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి రానున్నారు. ఇదీ పరిస్థితి..ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో జిల్లాలో పార్టీకి దిక్సూచి లేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్లో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేతలు కంది శ్రీనివాస్రెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్నాయక్ ఆయా నియోజకవర్గాల్లో ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఖానాపూర్లో ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జు ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏకైక కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇక నిర్మల్ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా శ్రీహరిరావు వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, శ్రీహరిరావు మధ్య పార్టీ పరంగా సరైన సంబంధాలు లేవు. ముధోల్ నియోజకవర్గంలో సీనియర్ నేతలు బోస్లే నారాయణరావు పటేల్, విఠల్రెడ్డి మధ్య సఖ్యత కరువైంది. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ మధ్య కూడా ఇదే పరిస్థితి. కుమురంభీం జిల్లాలోనూ పార్టీ నేతల మధ్య విభేదాలున్నాయి. సిర్పూర్ కాగజ్నగర్లో ఇటీవల మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్కు తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ విఠల్తో విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్, దండే విఠల్కు మధ్య కూడా సఖ్యత లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్నాయక్ మధ్య విభేదాలున్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇటీవల మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యలు దుమారం లేపాయి. ప్రధానంగా ‘నా నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రినని’ ఆయన పేర్కొనడం పార్టీలో విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తారనేది చూడాల్సిందే. ఇలా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితులను ఇన్చార్జి మంత్రి ఎలా సరిదిద్దుతారనే విషయంలో పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్దే’
మంచిర్యాలటౌన్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని, 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీ 50 ఏళ్లు పూర్తి చేసుకుందని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో ఎమర్జెన్సీ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యల ఏమాజి, మున్నారాజా సిసోడియా, దుర్గం అశోక్, బియ్యాల సతీశ్రావు, ఆకుల అశోక్వర్ధన్, ఎనగందుల కృష్ణమూర్తి, మోటపలుకుల తిరుపతి, పానుగంటి మధు, మోటపలుకుల గురువయ్య, గాజుల ముఖేశ్గౌడ్, మల్యాల శ్రీనివాస్, గుండా ప్రభాకర్, గాదె శ్రీనివాస్, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా.. ప్రశ్నించే వారిపై దాడులు చేసి కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య అన్నారు. ఇటీవల మంచిర్యాలలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుకుమార్పై జరిగిన దాడిపై బుధవారం రామగుండం సీపీ అంబర్ కిషోర్ఝాకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై దాడులు, కేసులు నమోదు చేస్తున్నారని, మంచిర్యాలలో 20 మందిపై తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. కిందిస్థాయి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశామని, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గ్యాంగ్ అరాచకాలు మితిమీరుతున్నాయని, దాడులు మళ్లీ జరిగితే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. -
● చదువుకునే వయస్సులో బలవన్మరణాలు ● స్కూల్, కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలు ● ఆందోళన కలిగిస్తున్న తొందరపాటు నిర్ణయాలు
మానసికంగా దృఢంగా ఉండాలిగతంలో బోధకులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. చాలా చోట్ల ఇప్పుడా పరిస్థితి లేదు. ఆత్మహత్య చేసుకుంటున్న వారు అధికంగా వ్యక్తిగత, ప్రేమ విఫలం, ఫెయిలవడం, తల్లిదండ్రులు మందలించారనే ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను తట్టుకునే విద్యార్థులు బాల్యం నుంచే కష్ట, సుఖాలు ఎదుర్కొనే స్థితిలో మానసికంగా దృఢంగా ఉండాలి. – పల్లె భూమేశ్, చైర్మన్, శ్రీహర్ష విద్యాసంస్థలుక్షణికావేశంతో బలవన్మరణాలుతొందరపాటులో అనాలోచిత నిర్ణయాలతో బలవన్మరణాలు జరుగుతున్నాయి. జీవితంలో అన్నింటిని సమంగా చూసే స్థితిలో చాలామంది లేరు. విద్యార్థులు తమ జీవితంలో వ్యక్తిగతంగా, విద్యాపరంగా, కుటుంబంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతకాలి. ఎంతో భవిష్యత్ ఉన్న జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవద్దు. – అంబాల సమ్మయ్య, సైకాలజిస్టుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయస్సులో ఉసురు తీసుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉజ్వలమైన భవిష్యత్ను క్షణికావేశంలో కోల్పోతున్నారు. మరోవైపు చిన్న వయస్సులోనే ఈ మరణాలు సమాజంపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. క్షణికావేశం.. తొందరపాటు కుటుంబ పెద్దలు, నిరుద్యోగులు, రైతులు అనేక కష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొని కొంత జీవితం అనుభవించాక దిక్కుతోచని పరిస్థితుల్లో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేవారు. ఇటీవల స్కూల్, కాలేజీ విద్యార్థులు సైతం చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. టీనేజీలోనే ఆకర్షణలకు లోనవుతున్నారు. అబ్బాయి, అమ్మాయిల మధ్య మనస్పర్థలు వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక కొందరు చదువు ఇష్టం లేక ఒత్తిడికి గురవుతున్నారు. పది, ఇంటర్, బీటెక్ వంటి పరీక్షల్లో ర్యాంకు రాలేదని, ఫెయిల్ అయ్యామని, చదువులో రాణించలేకపోతున్నామని తదిత ర కారణాలతోనూ ఎంతో భవిష్యత్ ఉన్న వారంతా అర్ధంతరంగా కన్నవారికి దూరమవుతున్నారు. లోపమెక్కడ? పిల్లల పట్ల బాధ్యత వహించాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులేనని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. బాల్యం నుంచే పిల్లల నడవడి, తీరు, అలవాట్లు, ఆలోచనలు అంచనా వేస్తూ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో అండగా నిలవాలని పేర్కొంటున్నారు. ఒత్తిడి చదువులు, వారి భావాలకు విరుద్ధంగా వ్యవహరించడం, అతి క్రమశిక్షణ, అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ప్రమాదమని సూచిస్తున్నారు. పోషకులుగా తమ పిల్లల ఆలనాపాలనా చూస్తూ, వారి మానసిక స్థితి, ఆలోచనలకు విలువ ఇస్తూ బంధాలను బలోపేతం చేసుకోవాలని చెబుతున్నారు. సమస్యను పంచుకుని బాధలు తీర్చే సంరక్షకులుగా ఉంటే పిల్లలు మానసికంగా ఇబ్బంది పడరని అంటున్నారు. చదువుతోపాటు ఇష్టమైన రంగాల్లో రాణించేలా, గెలుపోటములు సమానంగా స్వీకరించేలా తీర్చిదిద్దాలని, నాయకత్వ లక్షణాలు అలవర్చాలని, క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా మనోధైర్యం నింపాలని, జీవితంలో నిలిచి గెలవాలని సూచిస్తున్నారు. లేత వయస్సు మరణాలు..● నస్పూర్ పరిధి షిర్కే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని సెకండియర్ ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించింది. ● దండేపల్లికి చెందిన విద్యార్థి ఇంటర్ పూర్తి చేయగా.. బీటెక్ చదవడం ఇష్టం లేదంటూ.. పై చదువులకు వెళ్లనంటూ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ● లోకేశ్వరం మండలం బిబోలికి చెందిన ఓ విద్యార్థి ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియెట్కు బదులు వేరే కోర్సు చేస్తానని చెప్పగా.. తండ్రి మందలించడంతో తట్టుకోలేక క్రిమి సంహారక మందు తాగి చనిపోయాడు. ● లక్సెట్టిపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. స్కూల్కు వెళ్లేందుకు సిద్ధమైన అంతలోనే ఉరేసుకుంది. ● తాజాగా మంచిర్యాలలోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్లతో కలిసి పోలీసు, రవాణా, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ, ఆర్టీసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మిషన భగీరథ అధికారులు పైప్లైన్ మరమ్మతుల సమయంలో ముందస్తు సమచారం అందించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో కూరగాయల మార్కెట్ కోసం స్థలాన్ని గుర్తించాలని, రహదారులు, కూడళ్లు వద్ద కూరగాయల విక్రయాన్ని నివారించి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని తెలిపారు. మంచిర్యాల పట్టణం, నస్పూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ బోర్డు పిలుపు ఎప్పుడో..?
● 3 నెలలుగా నిర్వహించని సమావేశం ● సింగరేణి వ్యాప్తంగా 700 మంది నిరీక్షణ ● ఆందోళనలో హయ్యర్ సెంటర్ రిఫరల్ కేసు బాధితులుశ్రీరాంపూర్:సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు సమావేశం నిలిచిపోయింది. మూడు నెలలుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో జబ్బుపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకోసారి మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2025, మార్చి 21న నిర్వహించిన మెడికల్ బోర్డు మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. దీంతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులు నిరీక్షిసున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు ఇక తాము డ్యూటీలు చేయలేమని భావిస్తే మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగ విరమణ తేదీకి కనీసం రెండేళ్ల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడిన వారంతా కూడా బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. దీంతో పాటు గనులు, బయట ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా ఏరియా వైద్యాధికారులు కార్పొరేట్ మెడికల్ బోర్డుకు రెఫర్ చేస్తారు. హయ్యర్ సెంటర్ రిఫరల్ కేసులు.. హయ్యర్ సెంటర్ రిఫరల్ బాధిత కార్మికులను హై దరాబాద్లోని నిమ్స్, ఇతర ప్రముఖ ఆస్పత్రులకు కంపెనీ రెఫర్ చేస్తుంది. ఇలా రిఫరల్ అయిన కార్మి కులు అక్కడ చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టును కంపెనీకి సమర్పిస్తారు. వారిని మెడికల్ బోర్డుకు పిలిచి వైద్యపరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన మెడికల్ బో ర్డుకు ముందు మూడు నెలల నుంచి ఇలాంటి కేసులను బోర్డుకు పిలువలేదు. ఇలా ఆరు నెలలుగా హయ్యర్ సెంటర్ రిఫరల్ కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తాము వేతనాలు కోల్పోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. 700 మంది నిరీక్షణ.. సింగరేణి వ్యాప్తంగా సుమారు 700 మంది కార్మికులు మెడికల్ బోర్డు పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. మెడికల్ బోర్డుకు వెళ్లిన కేసులను అక్కడి వైద్యబృందం, అధికారులు పరీక్షిస్తారు. వారికి ఉన్న జబ్బుల తీవ్రతను బట్టి అండర్ గ్రౌండ్లో పనిచేయలేని వారిని అన్ఫిట్ చేసి సర్ఫేస్లో డ్యూటీ ఇస్తారు. పూర్తిగా పని చేయలేరని భావించిన వారిని ఇన్వాలిడేషన్ చేస్తారు. దీని కింద కార్మికుని డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగం వస్తుంది. సమావేశం నిర్వహించాలి సింగరేణి యాజమాన్యం ఇకనైనా ఆలస్యం చేయకుండా వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలి. నెలకోసారి నిర్వహించాల్సిన బోర్డును ఇప్పటికీ మూడు నెలలుగా నిర్వహించకపోవడంతో వ్యాధుల భారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. – కే.వీరభద్రయ్య, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
దస్తురాబాద్: మండలంలోని గోడిసీర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన గోసుకుల రాజేశ్ తన గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్కు నిర్వహణ అనుమతుల కోసం శివకృష్ణను సంప్రదించాడు. రూ.15 వేలు డిమాండ్ చేయగా.. చర్చల అనంతరం రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో అనుమతి పత్రాలను శివకృష్ణ రాజేశ్కు ఇచ్చాడు. అనంతరం గ్రామ సమీపంలోని ఓనర్సరీలో రూ.12 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికా రులు రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదుతోపాటు శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆదిలాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ మధు తెలిపారు. -
బ్యాంకులో తుపాకీ మిస్ఫైర్
● తప్పిన పెను ప్రమాదం ● ఆదిలాబాద్లో ఘటనఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో తుపాకీ మిస్ఫైర్ అయ్యింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పెను ప్రమాదం తప్పడంతో బ్యాంకుకు వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు బ్యాంకు నుంచి డబ్బులు బయటకు తీసుకెళ్లే సమయంలో గార్డ్ రాములు తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేశాడు. పొరపాటున స్ట్రింగర్పై వేలు పడడంతో ఒక్కసారిగా తూటా బ్యాంక్ పైకప్పుకు తగిలింది. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో కొందరు ఖాతాదారులు మాత్రమే బ్యాంకులో ఉన్నారు. వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. బుల్లెట్ -
బ్రాండెడ్ పేరిట రాయితీ బియ్యం విక్రయం
● ముగ్గురు వ్యాపారులపై కేసు ● పరారీలో ఒకరు ఆదిలాబాద్టౌన్: బ్రాండెడ్ రైస్ పేరుతో ప్రభుత్వ రాయితీ బియ్యం విక్రయిస్తున్న ఘరానా ముఠాను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీకి అందిన సమాచారం మేరకు జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో దుకాణాలను తనిఖీ చేయగా ఇద్దరు వ్యాపారుల వద్ద 80 క్వింటాళ్ల రాయితీ బియ్యం బ్రాండెడ్ బ్యాగుల్లో వేసి ప్రజలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. శివాజీ చౌక్లోని రజిత కిరాణంకు చెందిన గాగుల్వార్ రాజేశ్వర్, ఆంధ్ర కిరాణంకు చెందిన షేక్ అయ్యుబ్లను అరెస్టు చేశారు. చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ అస్లమ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మార్కెట్లో మంచి బ్రాండ్గా ఉన్న జై శ్రీరామ్, గోల్డెన్, సైకిల్బ్రాండ్, సూర్యతేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ప్లాటినం, శ్రీదత్త అనే పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో పీడీఎస్ రైస్ నింపి మిషన్తో సీల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటీఎంలో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో సంచలనం సృష్టించిన ఏటీఎంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రవికుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన జేసీబీ ఆపరేటర్లు మహ్మద్ ముస్తాఫా, షాహీద్, వారి సహచరులైన ఆలీంఖాన్, సాజిద్, అప్తాబ్తో కలిసి ఏటీఎంలోకి వెళ్లి మిషన్ క్యాషెట్ను గ్యాస్కట్టర్తో కట్ చేశారు. అంతలోనే పోలీస్ సైరన్ వినిపించడంతో క్యాషెట్ను (రూ.30వేల)ను పట్టుకెళ్లారు. ఏటీఎం నిర్వహాకులు సీఎంఎస్ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్ శివకుమార్ ఫిర్యాదుతో బెల్లంపల్లి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం బెల్లంపల్లి కెమికల్ ప్రాంతంలో మహ్మాద్ ముస్తాఫా, షాహిద్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు బైక్లు, గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్తో పాటు ఏటీఎంలోని క్యాషెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆలీంఖాన్, సాజిద్, అప్తాబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు మహారాష్ట్రలోని అహేరిలో పల్సర్ బైక్, మంచిర్యాలలో షైన్ బైక్ను దొంగలించారు. కాగజ్నగర్లో గ్యాస్ కట్టర్, కౌటాలలో గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేశారు. కేసును ఛేదించిన బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, టూటౌన్ ఎస్సై కే.మహేందర్, నెన్నెల ఎస్సై ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ సాయికృష్ణ, హోంగార్డు సంపత్ను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. -
టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా వెడ్మ బొజ్జు
ఉట్నూర్రూరల్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను నియామకమయ్యారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామకం పత్రం అందుకున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా సుగుణ టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ నియామకమయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
వేధింపులతో యువకుడు ఆత్మహత్య
● వ్యాపారి ఇంటి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళనపెంచికల్పేట్: వ్యాపారి వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అగర్గూడలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) కొంతకాలంగా ఎల్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కృష్ణ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తన సోదరి డెలివరీకి ఉండగా నాలుగురోజుల పాటు దుకాణానికి వెళ్లలేదు. సోమవారం విధులకు హాజరుకావడంతో కోపోద్రికుడైన వ్యాపారి తీవ్ర పదజాలంతో ధూషించడంతో పాటు డబ్బులు దొంగిలించాడని హేళనగా మాట్లాడాడు. బాకీ ఉన్న రూ.10వేలు ఇవ్వాలనగా ఫోన్పే ద్వారా చెల్లించాడు. అంతేకాకుండా కేసు పెడతానని ఫోన్లో కుటుంబ సభ్యులను బెదిరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అగర్గూడ సమీపంలోని పంట చేనులో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా కాగజ్నగర్, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. ఘటనకు కారకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యాపారి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్రావు, ఎస్సై కొమురయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కొమ్మలు కాదు.. చెట్లే నరికేశారు..!
● విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని.. ● ఫిర్యాదుపై పట్టించుకోని అధికారులు ● ప్రజావాణిలో మూడుసార్లు ఫిర్యాదు మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు విద్యుత్ శాఖ సిబ్బంది కొట్టేస్తుంటారు. జిల్లాలోని నెన్నెల మండల విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా 80 చింతచెట్లు కొట్టేయించారు. దిగుబడి వచ్చే చెట్లను కొట్టేయడంపై బాధితుడు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నెన్నెల మండలం వెల్లంపల్లికి చెందిన ముడపల్లి మహేష్కు భీమారం మండలం కాజిపల్లి శివారు సర్వేనంబరు 94/1లో 4.12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చుట్టూ 2015లో 90 చింతచెట్టు మొక్కలు నాటి పెంచుతున్నాడు. రెండేళ్లుగా చింతపండు దిగుబడి వస్తోంది. గత ఏడాది రూ.70వేలు ఆదాయం వచ్చింది. భవిష్యత్లో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తే విద్యుత్శాఖ అధికారులు అడియాసలు చేశారు. నెన్నెల మండల విద్యుత్ శాఖ అధికారులు 2025 మే 5న వెంకటపూర్, కొత్తూర్కు కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటుకు అడ్డుగా ఉన్నాయని 80 చెట్లు నరికేశారు. కొమ్మలు అడ్డుగా ఉంటే నరికేస్తారు. కానీ ఇక్కడ చెట్లే నరికేయడం గమనార్హం. అనుమతి లేకుండా చెట్లు నరికేశారని విద్యుత్శాఖ, తహసీల్దార్, అటవీశాఖ, పోలీసుస్టేషన్, ఉద్యానవన అధికారులకు, కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో మూడు సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు మహేష్ వాపోతున్నాడు. అటవీశాఖ అధికారులు పరిశీలించి చెట్ల విలువను టింబర్ రేట్ ప్రకారం రూ.17వేలుగా నిర్ణయించారని, అక్రమంగా నరికినందుకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారని తెలిపాడు. విద్యుత్ శాఖ అధికారులు తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నాడు. నరికిన చెట్లు పొలంలోనే ఉండడంతో వరిసాగు చేసుకోవడం కష్టంగా మారిందని తెలిపాడు. ఏడాదికి రూ.లక్షలు ఆదాయం, వందేళ్ల దిగుబడి వచ్చే చెట్లను అన్యాయంగా నరికేశారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పేలా లేదని పేర్కొన్నాడు. కొమ్మలు నరికేశారు.. విద్యుత్ లైన్కు అడ్డుగా వస్తున్నాయి.. కొమ్మలు నరుకాలని ఏఈ సంబంధిత కాంట్రాక్టర్కు సూచించడంతో కొమ్మలు మాత్రమే నరికేశారు. చెట్లు నరకాలని చెప్పలేదు. చెట్లు ఎవరు నరికి వేశారో తెలియదు. బాధితుడు నా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది. – గంగాధర్, జిల్లా విద్యుత్ శాఖ అధికారి -
కాంగ్రెస్ పాలనలోనే రైతు సంక్షేమం
బెల్లంపల్లిరూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గ డ్డం వినోద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కన్నాల రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల కార్యక్రమానికి వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులతో క లిసి సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషే కం చేశారు. రైతులను ఉద్దేశించిన సీఎం ప్రసంగించగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు ను రాజుగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కా ర్యాచరణ చేపడుతోందని తెలిపారు. రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగులో రాణించాలని సూచించారు. ఆర్డీవో హరికృష్ణ, ఏవో ప్రేమ్కుమార్, నాయకులు రాంచందర్, ప్రతాప్, సత్యనారా యణ, రవి, శ్రీనివాస్, స్వామి ఉన్నారు. -
గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
● సీపీ అంబర్కిషోర్ ఝా ● గురుకుల విద్యార్థులకు అవగాహనజైపూర్: గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మత్తుపదా ర్థాల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా జైపూర్ గురుకులంలో విద్యార్థులకు మంగళవారం అవగా హన కార్యక్రమం నిర్వహించారు. సీపీ ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మత్తు ప దార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వి ద్యార్థుల దృష్టి భవిష్యత్, జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని తెలిపారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇ తర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావద్దని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్ధాల గురించి వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా నిరంతరం విద్యాసంస్థలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. చెడు స్నేహితులతోనే చెడు అలవాట్లకు గురవుతారని, తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు, వసతి గృహం ప్రి న్సిపాల్ విద్యార్థుల ప్రవర్తన గమనిస్తూ ఉండాలని, ఎక్కడైనా గంజాయి సేవించినా, విక్రయించినా స మాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. గురుకులం, కేజీబీవీలో అధిక మార్కులు సాధించి న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీలు వెంకటేశ్వర్, మ ల్లారెడ్డి, శ్రీనివాస్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, రాజ్కుమార్, ఎస్సైలు శ్రీధర్, శ్వేత, సంతోష్, గు రుకులాల ప్రిన్సిపాల్లు నాగేశ్వర్రావు, రమేశ్బా బు, కేజీబీవీ ఎస్వో ఫణిబాల పాల్గొన్నారు. -
పక్కాగా పోషకాహారం
● అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నిషన్ ● జూలై 1నుంచి అమలుకు చర్యలు ● అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..మంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారుల ముఖచిత్రాలు ఆన్లైన్లో అప్ లోడ్ చేశారు. జూలై 1నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియ అమలు చేసే విధానంపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. పంపిణీలో పారదర్శకత కోసమే.. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారుల ఇంటికే వెళ్లి బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తున్నారు. చిన్నారుల తల్లుల ము ఖచిత్రాలను యాప్లో నమోదు చేసుకుని సరుకులు అందిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహా రానికి కూడా వచ్చే నెల నుంచి ముఖ గుర్తింపును తప్పనిసరి చేయనున్నారు. ఈ విధానం ద్వారా పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలను నిరోధించవచ్చని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో దీనిని అమలు చేసేందుకు ఏ ర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 969 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో మూడేళ్లలోపు చి న్నారులు 21,394 మంది, మూడు నుంచి ఆరేళ్లలో పు చిన్నారులు 10,539 మంది, గర్భిణులు 3,528 మంది, బాలింతలు 3,381 మంది ఉన్నారు. అమలుకు సిద్ధంగా ఉన్నాంఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సరుకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే పోషణ్ ట్రాక్ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేశాం. ఈ విధానాన్ని అమలు చేస్తే నేరుగా లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ చేసే అవకాశముంటుంది. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి జిల్లాలోని అంగన్వాడీల సమాచారం అంగన్వాడీ కేంద్రాలు 969 గర్భిణులు 3,528 బాలింతలు 3,381 మూడేళ్లలోపు చిన్నారులు 21,394 3–6 ఏళ్లలోపు చిన్నారులు 10,539 -
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుమంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉచిత ఇసుక సరఫరా, భూభారతి రెవె న్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం, విత్తనా లు, ఎరువుల నిర్వహణ, వనమహోత్సం లక్ష్యసాధన, ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన, సీజన్ వ్యాధుల నివారణ చర్యలు, టీబీ ముక్త్ భార త్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందులో అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికే మంజూరు పత్రాలు అందించినట్లు చెప్పారు. భారీ వర్షాలు ప్రారంభం కాకముందే లబ్ధిదారులు ఇండ్ల గ్రౌండ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాగుకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన మేరకు జిల్లాల వారీగా కేటాయించనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డెంగీ, మలేరియా, చికున్ గున్యా లాంటి విషజ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల ఆవరణల్లో విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి కిషన్, వ్యవసాయాధికారి కల్పన, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివాజీ పాల్గొన్నారు. -
స్టాప్–డయేరియా పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో స్టాప్–డయేరియా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్ట ర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్ట ర్ చాంబర్లో వైద్యారోగ్య శాఖ అధికారి హరీశ్రా జ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్తో కలిసి స్టాప్–డయేరియా ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జూలై 31 వరకు నిర్వహించనున్న స్టాప్–డయేరియా కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అతిసార నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆహారం తీసుకునే స మయంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు తల్లిపాలు తాగకపోవడం, వాంతులు అధికంగా కా వడం, తరచూ మల విసర్జన, అనారోగ్యానికి గురి కావడం, అపరస్మాక స్థితికి చేరడం, జ్వరం ఉండ డం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలుంటే వెంటనే స మీప ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల కు తీసుకువెళ్లి సరైన సమయంలో వైద్యసేవలు పొందాలని పేర్కొన్నారు. స్టాప్–డయేరియా కార్యక్రమంలో భాగంగా ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు ఏర్పాటు చేయాలని, ఐదేళ్లలోపు పిల్లల్లో అతిసార ను నిర్మూలించేందుకు విస్తృత స్థాయిలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారులు కృపాబాయి, ప్రసాద్, సుధాకర్నాయక్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయం భీమారం: రైతుల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. భీమారం రైతువేదికలో సీఎం రేవంత్రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమర్థవంతంగా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలి పారు. రైతునేస్తం ద్వారా రైతులకు సాగులో మెళకువలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, ఏవో సుధాకర్, ఏఈవో అరుణ్కుమార్, రైతులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనుల పరిశీలన మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి
కాసిపేట: సమాజంలో ప్రతి ఒక్కరికీ చదువు ముఖ్యమని, విద్యతో పూర్తి విజ్ఞానాన్ని సంపాదించుకుని జీవితంలో ఉన్నత స్థానంలో నిలు వవచ్చని జిల్లా వయోజనవిద్య అధికారి, మండల ప్రత్యేకాధికారి పురుషోత్తం నాయక్ పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో వయోజనవిద్యపై పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లతో సమావేశమై మాట్లాడా రు. కాసిపేటను వందశాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జిల్లా వ యోజనవిద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాత్రి తరగతుల ద్వారా నిరక్షరాస్యులైన వ యోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్న ట్లు పేర్కొన్నారు. ఈనెల 28న ఇప్పటివరకు చ దువు నేర్చుకున్న వయోజనులకు ముత్యంపల్లి, ధర్మరావుపేట రైతువేదికల్లో పరీక్షలు, మూ ల్యాంకనం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, మండల స్థాయి అధికారులంతా కా ర్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. తహసీల్దార్ భోజన్న, ఎంపీవో షేక్ సబ్ధ ర్ అలీ, రిసోర్స్ పర్సన్లు బండ శాంకరి, కొండు జనార్దన్, సీనియర్ సహాయకుడు లక్ష్మీనారా యణ, ఏపీఎం వెంకటేశం పాల్గొన్నారు. -
కమిషనర్లకు కలిసిరాని చెన్నూర్
● మున్సిపాలిటీగా ఏర్పడి ఏడేళ్లు ● ఇప్పటికీ ఎనిమిది మంది బదిలీ ● కుంటుపడుతున్న పట్టణాభివృద్ధిచెన్నూర్: కమిషనర్లకు చెన్నూర్ మున్సిపాలిటీ కలిసి రావడం లేదా? అంటే.. అవుననే చెప్పొచ్చు. చెన్నూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన ఏడేళ్లలో ఎనిమి ది మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చిన కమిషనర్లు ఏడాది కంటే ఎక్కువ కాలం పని చేయకుండానే అర్ధంతరంగా బదిలీ అవుతుండడం గమనార్హం. తరచూ వీరి బదిలీల కారణంగా పాలన గాడి తప్పి, అభివృద్ధి కుంటుపడుతోంది. అసలేం జరుగుతోంది? చెన్నూర్ మున్సిపాలిటీ 2 ఆగష్టు 2018న ఏర్పడింది. మరో రెండు నెలలైతే ఏడేళ్లు పూర్తవుతుంది. ఏడేళ్లు పూర్తి కాకుండానే ఎనిమిది మంది కమిషనర్లు మారారు. మున్సిపాలిటీతోనే పట్టణాభివృద్ధి ముడిపడి ఉంది. ఏడాదికి ఒక్కరు చొప్పున కమిషనర్లు మారుతుండడంతో అభివృద్ధి ముందుకు సాగ డం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహించిన కమిషనర్ మురళీకృష్ణ గతేడాది అక్టోబర్ 27న చెన్నూర్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 4న మున్సిపాలిటీ పరిధిలోగల పబ్లిక్ మోటర్లకు తాళాలు వేయడంతో పట్టణ ప్రజలతో పాటు అప్పటి పాలకవర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. నవంబర్ 27న పాలకవర్గానికి సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషనర్పై అప్పటి పాలకవర్గ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత జనవరిలో మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పని చేస్తూ పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మున్సిపల్ కమిషనర్ అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బదిలీ కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. బదిలీ సహజమా?.. పనిష్మెంటా? అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న కమిషనర్ వచ్చి ఎనిమిది నెలలు కాకుండానే బదిలీ కావడాన్ని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది సహజ బదిలీనా.. పనిష్మెంట్ బదిలీనా? అని గుసగుసలాడుతున్నారు. రాను న్న మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేసే అధికారి ఉండాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలే బదిలీ చేయించారేమో? అనే చర్చసాగుతోంది. త్వరలోనే కొత్త కమిషనర్ త్వరలోనే చెన్నూర్ మున్సిపల్ కమిషనర్గా అంజయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన చెన్నూర్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. -
● వైకల్య సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూపు ● పింఛన్ల్లు కోల్పోతున్న లబ్ధిదారులు
సాక్షిప్రతినిధి, మంచిర్యాల: దివ్యాంగులకు ‘సదరం’ గుర్తింపు పత్రం జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తప్పనిసరైన దివ్యాంగ సర్టిఫికెట్ల కోసం జిల్లాలో వందలాది మంది వేచి చూస్తున్నారు. గతంలో మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని సదరం క్యాంపులకు హాజరయ్యేవారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూడీఐడీ (విశిష్ట దివ్యాంగ గుర్తింపు) కార్డులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యూడీఐడీ పొందేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారు తమ ఫోన్ నంబర్లకు సమాచారం వస్తేనే జిల్లా ఆస్పత్రికి పరీక్షల కోసం రావాల్సి ఉంటుంది. అయితే పరిమిత సంఖ్యలో స్లాట్స్ ఉండడంతో రెన్యూవల్ కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నారు. ప్రతీ సోమవారం అనే క మంది దివ్యాంగులు తమకు పింఛన్ అందడం లేదని, ఇతర సంక్షేమ పథకాలు వర్తించడంలేదని ప్రజావాణిలో కలెక్టర్కు అర్జీలు ఇస్తున్నారు. తప్పని నిరీక్షణ మానసిక వైకల్యంతో పాటు శారీర లోపాలతో జిల్లాలో ఎంతోమంది బాధపడుతున్నారు. వీరిలో కళ్లు, కీళ్లు, ఎముకలు, మూగ, వినికిడితో బాధపడుతున్నవారికి స్థాయిని బట్టి నిపుణులైన వైద్యులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. అయితే జిల్లాలో వే లాదిమంది దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల కోసం ఎ దురుచూస్తున్నారు. ఇప్పటికే అనేకమంది యూడీఐ డీ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. కానీ.. స్లాట్ దొరకక నిరీక్షిస్తున్నారు. దీంతో వైద్యనిపుణులు పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. మరోవైపు త క్కువ వైకల్య శాతం ఉండి కూడా, కొందరు స్లాట్ బుకింగ్ చేయడంతో పరీక్షల అనంతరం అనర్హతగా గుర్తిస్తున్నారు. దీంతో అర్హులైన చిన్నారుల నుంచి పెద్దవయస్సు వారితో పాటు నిరుపేదలు పింఛన్ పైనే ఆధారపడి జీవించే అనేకమందికి ఇబ్బందిగా మారింది. జిల్లా ‘సెర్ప్’ అఽధికారులు మాత్రం రిజి స్ట్రేషన్లు చేసుకున్నాక అందరికీ అవకాశం వస్తుంద ని.. వారికి నేరుగా సమాచారం అందుతుందని అప్పటిదాకా వేచి చూడాలని సూచిస్తున్నారు.జిల్లాలో పెండింగ్ దివ్యాంగ అప్లికేషన్లుమూడు నెలలుగా.. 7343నుంచి 6నెలలుగా.. 340ఆరునెలల పైబడి.. 93మొత్తం 1,167దివ్యాంగ సర్టిఫికెట్లు పొందినవారు 17,771 -
అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి
లక్సెట్టపేట: లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధిలోని గో దావరి రోడ్కు చెందిన బ త్తుల జ్యోత్స్న(15) సోమవారం అనుమానాస్పద స్థి తిలో మృతిచెందింది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల వెంకటి, అరుణ దంపతుల కూతురు జ్యోత్స్న స్థానికప్రభుత్వ బాలికల ఉ న్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 21న అరుణ తన తల్లిగారిల్లు నల్గొండ జిల్లా చి త్తలూరుకు వెళ్లింది. ఉదయం పాఠశాలకు వెళ్లడాని కి సిద్ధమైన జ్యోత్స్న ఇంటి గదిలోని రేకుల షెడ్డులో పైపులకు ఉరేసుకుని కనిపించింది. కుటుంబీకులు గమనించి స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు. వెంకటి మొదటి భార్య కుమారులపై అనుమానంగా ఉందని తల్లి అరుణ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
భూసారమెంతో తేలనుంది..!
● కొనసాగుతున్న మట్టినమూనాల సేకరణ ● జిల్లాలో 1875మంది రైతుల ఎంపికచెన్నూర్రూరల్: నేల స్వభావాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెలలో వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి మట్టి నమూనాలు సేకరిస్తోంది. నాచురల్ ఫార్మింగ్, సాయిల్ హెల్త్ ఫెర్టిలిటి పథకం పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద సాగు భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను రైతులకు అందజేయనున్నారు. నాచురల్ ఫార్మింగ్ కింద జిల్లాలోని 15 మండలాల్లో ఒక్కో మండలానికి 125మంది రైతుల చొప్పున జిల్లా వ్యాప్తంగా 1875మందిని ఎంపిక చేశారు. ఆయా రైతుల సాగుభూముల్లోని మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. ఇప్పటివరకు 1600 మట్టినమూనాలు సేకరించి పంపించారు. సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటి పథకం కింద ఒక్క చెన్నూర్ మండలంలో మాత్రమే 2125మంది రైతుల పంట పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల నిమిత్తం పంపిస్తారు. ఇప్పటివరకు 800 రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి పంపించారు. పరీక్షించిన తర్వాత ఫలితాలను ఈ నెల చివరి వరకు అందజేస్తారు. సేకరించే విధానం ఏఈవోలు రైతుల పొలాల్లోకి వెళ్లి జియో ట్యాగింగ్ చేసి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. నాలుగు మూలల్లో, పొలం మధ్యలో వీ ఆకారంతో ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు తవ్వి మట్టిని తీయాలి. సేకరించిన మట్టిలో చెత్తాచెదారం లేకుండా, గడ్డలు లేకుండా పొడిగా చేయాలి. మట్టిని చతురస్రాకారంలో పరిచి మూలలకు ఎదురుగా ఉన్న మట్టిని తీసుకుని అరకిలో వరకు సేకరించాలి. ఆ మట్టిని ప్లాస్టిక్ కవర్లో వేసి రైతు వివరాలతో భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. పరీక్షల అనంతరం భూమిలో ఎలాంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, భూసారం ఎలా ఉందో గుర్తించి ఎలాంటి సూక్ష్మ పోషకాలు అందించాలి, ఏ పంట సాగు చేయాలి, ఎంత మోతాదులో ఎరువులు వేయాలో రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తారు. భూసార పరీక్షలతో మేలుఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో ఏఈవోలు మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. భూసార పరీక్షలతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. నేలకు అనుగుణంగా ఏ పంట వేసుకోవాలో, అధిక దిగుబ డులు ఎలా పొందాలో తెలిసిపోతుంది. రైతులు తప్పనిసరిగా మట్టి నమూనాల సేకరణకు సహకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలి. – బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్ -
ప్రతీ ఒక్కరికి విద్యార్థి దశ కీలకం
మందమర్రిరూరల్: ప్రతీ ఒక్కరికి విద్యార్థి దశ కీలకమని, లక్ష్యాన్ని ఎంచుకుని జీవితంలో స్థిరపడాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. యాంటీ డ్ర గ్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా మత్తు పదా ర్థాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా సోమవా రం మండల కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బెల్లంపల్లి ఏసీ పీ రవికుమార్తో కలిసి హాజరయ్యారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎస్సై రాజశేఖర్, పాఠశాలల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడలతో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం
మంచిర్యాలటౌన్: క్రీడలతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఉ ల్లాసంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. సోమవారం ఒలింపిక్ డే రన్– 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీరోజు కొంత సమయం వ్యాయామం, క్రీడలకు కేటా యించాలని అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హన్మంతరెడ్డి, ఏసీపీ ప్రకాశ్, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గాప్రసాద్, పట్టణ సీఐ ప్రమోద్రావు, క్రీడాసంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ● కేజీబీవీ ఎస్వో, సిబ్బందిపై ఆగ్రహందండేపల్లి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులను సిబ్బంది ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు హెచ్చరించారు. దండేపల్లి కేజీబీవీలో ఎస్వో, కొందరు సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విద్యార్థుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆయన డీఈవో యాదయ్యతో కలిసి సందర్శించారు. విద్యార్థులు, సిబ్బందితో వేర్వేరుగా సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడారు. విద్యార్థులు తమ గోడు వెల్లబోసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాణ్యతగా ఉండడం లేదని, చికెన్, గుడ్డు తక్కువ చేసి పెడుతున్నారని, మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేయిస్తున్నారని, గదులు, పరిసరాలు ఊడ్చిపిస్తున్నారని తెలిపారు. దీంతో ఎస్వో, సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందజేసి చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపారు. జిల్లా సెక్టోరియల్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంపీడీవో ప్రసాద్, ఎంఈవో చిన్నయ్య, సీఆర్పీ నర్సయ్య పాల్గొన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాల మేరకు డీఈవో, జిల్లా సెక్టోరియల్ అధికారి ఈ నెల 18న విచారణ జరిపా రు. అధికారుల విచారణలో బాధలు చెప్పుకోలేని విద్యార్థులు.. నేరుగా ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన సిబ్బందిపై వేటుపడే అవకాశముంది. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి లక్సెట్టిపేట: ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. జూలై 3న ఆసుపత్రి భవనం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని, అప్పటివరకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ.ఆరీఫ్, పింగిళి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణతో కలిసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అన్నారు. భూ సమస్యలు, పింఛన్, భూ పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. రైతు భరోసా రాలేదని, తమకన్న ఎక్కువ భూమి ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయని బెల్లంపల్లికి చెందిన ముర్కురి సత్తమ్మ, చెన్నూర్ మండలం కన్నెపల్లికి చెందిన అంగం రాజం దరఖాస్తు చేసుకున్నారు. ● కల్యాణిఖని ఓపెన్ కాస్టు ఏర్పాటుతో కోళ్లఫాం, బావి నష్టపోయిన తనకు పరిహారం అందించాలని కాసిపేట మండలం దుబ్బగూడెంకు చెందిన ముడిమడుగల లింగయ్య కోరారు. ● రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు పింఛన్ ఇప్పించాలని బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లికి చెందిన బోర్లకుంట శ్రీనివాస్ విన్నవించాడు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ -
● జిల్లా కేంద్రానికి వరద బెంగ ● గోదావరితో, రాళ్లవాగుకు బ్యాక్వాటర్ ● నగరంగా మారినా మారని పరిస్థితులు
జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా వానాకాలంలో జిల్లా కేంద్రం మంచిర్యాలకు వరద ముప్పు పొంచి ఉంటోంది. వర్షాలు అధికంగా కురిసిన ప్రతీసారి నగర పరిధిలో ఉన్న గోదావరి, రాళ్లవాగు తీర ప్రాంతాలు ముంపును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వా నాకాలంలో ఇంకా వర్షాలు మొదలు కానప్పటికీ సీ జన్ మొదలై భారీ వర్షాలు కురిస్తే ఇబ్బంది తప్పేలా లేదు. గోదావరి నదికి సమీపంలో ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రంతోపాటు సమీప కాలనీలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. మూడేళ్ల క్రితం వ చ్చిన వరదలతో అనేక మంది ఇళ్లలోకి నీళ్లు వచ్చా యి. ఆ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులు గేట్లు ఎ త్తడం, గోదావరి ఎగువన, శ్రీరాంసాగర్, కడెం ప్రా జెక్టుల వరదలతో తీవ్రత పెరిగింది. సుందిళ్ల, అ న్నారం బరాజ్ల్లో నీటి నిల్వలతో నదిలో నిల్వ పెరి గి, రాళ్లవాగుకు బ్యాక్ వాటర్ ముప్పు పెరిగింది. అయితే మళ్లీ ఆ పరిస్థితి రాలేదు. వర్షాలు అధికంగా కురిస్తే మళ్లీ ముప్పు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. చినుకుపడితే ఇబ్బందే.. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో కొద్దిపాటి వర్షానికే ఇబ్బంది ఎదురవుతోంది. ఈ వేసవిలో అకాల వానలు కురిశాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నా యి. డ్రెయినేజీలు నిండిపోవడంతోపాటు కుంచించుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రంలో మార్కెట్ ఏరియాలు, ప్రధాన రో డ్ల గుండా, వ్యాపార వాణిజ్య సముదాయాల భవన యజమానులు తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. రాముని చెరువు కట్ట తూము నుంచి వదిలే వరద కాలువ ఆక్రమణలతో కుంచించుకుపోతోంది. పూడిక తీయలేదు. చెరువు నుంచి వెళ్లే కాలువ, బైపాస్ రోడ్డు రాళ్లవాగులో కలిసే వరకు చాలా చోట్ల చిన్నగా మారింది. ఇక తిలక్ చెరువు నుంచి వచ్చే కాలువ సైతం వరకు ఇళ్లస్థలాలు వెలిశాయి. పోచమ్మ చెరువు కింది భాగం, తోళ్లవాగుకు ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. దీంతో వరదలు వస్తే ఆయా కాలనీల్లో నీరు నిలిచిపోతోంది. దీంతో ము రుగు నీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. మరో వైపు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓ చోట ఎత్తు, ఓ చోట వంపుగా నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా నాలా లు, రోడ్డు అడ్డంగా తవ్వివేస్తున్న పైపులైన్ల కోసం వేస్తున్న స్లాబ్లు గతంలో కంటే ఎత్తుగా ఉండి, పాత సీసీ రోడ్లు కిందికి ఉంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతున్నాయి. రిటైనింగ్ వాల్ ఆలస్యమే..రాళ్లవాగులోకి సుమారు 50వేల నుంచి 60వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో కలుస్తున్నట్లు అంచనా. ఈ వరదకు తోడు గోదావరి బ్యాక్ వాటర్తో కలసి లోతట్టు ప్రాంతాలకు ముంపు ఏర్పడుతోంది. ముంపు నుంచి తప్పించేందుకు వాగుకు ఇరువైపులా 7.3 కిలోమీటర్ల మేర కాలనీలకు రక్షణ గోడ నిర్మిస్తున్నది తెలిసిందే. ఇటీవల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. రూ.255కోట్లతో గోదావరిలో వాగు కలిసే చోటు నుంచి కార్మెల్ స్కూల్ పై వరకు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభం కాగా, వేసవిలోనే అకాల వర్షాల కారణంగా సాగలేదు. తాజాగా వానలు మొదలైతే వాగులో నీటి ఉధృతితో పనులకు ఆటంకం కలుగుతుంది. దీంతో ఈ వానాకాలంలో గోడ అందుబాటులోకి వచ్చేలా లేదు. మళ్లీ వరదలు తగ్గుముఖం పడితే వాగుకు ఇరువైపులా గోడ నిర్మాణానికి వీలు కలుగుతుంది. అయితే ఈసారి అధిక వర్షాలు కురిస్తే ఇబ్బంది పడాల్సి వచ్చే అవకాశం ఉంది. -
బస్సుల్లో పోలీసుల తనిఖీలు
మంచిర్యాలక్రైం/మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలో గంజాయి, నిషేధిత పత్తి విత్తనాల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలో సీఐ ప్రమోద్రావు తనిఖీల్లో పాల్గొన్నారు. ఉట్నూర్ వైపు నుంచి మంచిర్యాల వైపు ఓ బస్సులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు హాజీపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్సై స్వరూప్రాజ్ తనిఖీలు చేపట్టారు. కాగా, గంజాయి తరలిస్తున్న వ్యక్తి లక్సెట్టిపేటలో బస్సు మారి వెళ్తూ ధర్మారం పోలీసులకు తనిఖీల్లో సుమారు 2కిలోల గంజాయితో పట్టుబడినట్లు సమాచారం. -
‘శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం’
మంచిర్యాలటౌన్: జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ను పురస్కరించుకుని ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటేశ్వర్గౌడ్ మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగా లు ఉండవద్దనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు చేయాలని పోరాటం చేశారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం జన సంఘ్ను స్థాపించి ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, పట్టి వెంకటకృష్ణ, బియ్యాల సతీశ్రావు, ఆకుల అశోక్వర్థన్, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేశ్గౌడ్, తుల ఆంజనేయులు, జోగుల శ్రీ దేవి, కర్రె లచ్చన్న, అమిరిశెట్టి రాజ్కుమార్, ప ల్లి రాకేశ్, వైద్య శ్రీధర్, నాగుల రాజన్న, మెరిడికొండ శ్రీనివాస్, రెడ్డిమల్ల అశోక్, రాకేశ్ రెన్వా, తరుణ్సింగ్, చిరంజీవి పాల్గొన్నారు. -
మౌలిక వసతులతో గిరిజన గ్రామాల అభివృద్ధి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక చొరవ చూపితే గిరిజన గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్దన్ అన్నారు. సోమవారం హాజీ పూర్ మండలం నాగారంలోని కొలాంగూడ గిరిజన తండాలో ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి జన జాతీయ అభియాన్, గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాలపై గిరిజ నులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుపేదలకు పక్కాగృహాలు, మంచినీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, ఆరో గ్యం, టెలి కమ్యూనికేషన్ వంటి ఏర్పాట్ల చేయడంతోపాటు బ్యాంకు ఖాతాలు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండేలా చూస్తామని తెలిపారు. గిరిజనుల నుంచి రేషన్కార్డు, ఆరోగ్య కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యుత్ బిల్లులు, భూ సమస్యల అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేకాధికారి, ఏఈ గిరిజ, జిల్లా గిరిజన క్రీడల అధికారి బండ జీవరత్నం, మెడికల్ అధికారి ఆదిత్యభాను, పంచా యతీ కార్యదర్శి రాజామల్లయ్య, గఢ్పూర్ పీహెచ్సీ అధికారి సుధాకర్, ఎస్సీఆర్పీ రఘునాథం, చందు, తదితరులు పాల్గొన్నారు. -
‘రాజకీయాలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి’
పాతమంచిర్యాల: రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నా రు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సీపీఐ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16మంది సభ్యులతో జిల్లా సమితి, 51మంది సభ్యులతో కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపా రు. సీపీఐ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మ ణ్ రెండోసారి ఎన్నికయ్యాడని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకుల ఆమోదంతో పలు తీర్మానాలు చేసినట్లు తెలి పారు. సింగరేణి ప్రాంతంలో 76జీవో ప్రకారం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ప్రాణహిత–చేవేళ్లను తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కా ర్యవర్గ సభ్యులు ఖలీందర్ ఆలీఖాన్, మేకల దాసు, బొల్లం పూర్ణిమా, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, భీమానాథుని సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య, దాగం మల్లేష్, రేగుంట చంద్రకళ, ముస్కే సమ్మయ్య పాల్గొన్నారు. -
బొలెరో ఢీకొని ఒకరు మృతి
బెల్లంపల్లి: పట్టణంలోని గాంధీనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపారు. తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల వెంకటేష్ (32) ఆదివారం రాత్రి నడుచుకుంటూ జాతీయ రహదారిని దాటుతుండగా బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఆటో ఢీకొని మహిళ.. జన్నారం: బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరిన మహిళను ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఎస్సై గొల్లపెల్లి అనూష తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లింగపూర్కు చెందిన ఉప్పల్వార్ వనిత (హేమలత) (35) మూడు రోజుల క్రితం తన తల్లి కస్తూలపూరి గంగాలక్ష్మీ ఇంటికి వచ్చింది. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కలమడుగులోని బంధువుల ఇంటికి వెళ్లింది. కలమడుగు నుంచి రేండ్లగూడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో అతివేగంగా ఢీకొట్టింది. వనితకు తీవ్రగాయాలుకాగా తల్లి గంగాలక్ష్మీకి కాలు, విరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్లో కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ వనిత రాత్రి మృతి చెందింది. మృతురాలి సోదరుడు నరేశ్ ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన ఆటోడ్రైవర్ హన్మండ్ల సత్తన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మొబైల్ షాపులో చోరీసాత్నాల: బోరజ్ మండలం కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు శ్యామ్ ఆన్లైన్ మొబైల్ షాపు షటర్ పగులగొట్టి రూ.30వేలు అపహరించినట్లు ఎస్సై గౌతమ్ తెలి పారు. సోమవారం ఉదయం శ్యామ్ తన దు కాణానికి వెళ్లగా షట్టర్ పగులగొట్టి ఉండడంతో పో లీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి గాయాలుకాసిపేట: కాసిపేట పోలీస్స్టేషన్ పరిధి లోని జాతీయ రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో ఎరుకల వెంకటేశ్వర్లు అనే సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోమగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు స్కూటీపై బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కుడికాలు తెగిపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ను వివరణ కోరగా కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందలేదన్నారు. పాఠశాల బస్సు డ్రైవర్కు జైలుతాండూర్: సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో సోమవారం రాంనగర్, ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో అచ్చలాపూర్ నుంచి రేపల్లెవాడ వైపు వెళ్తున్న సెయింట్ థెరిస్సా పాఠశాల బస్సును ఆపి డ్రైవర్ తోట సత్యనారాయణకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో డ్రైవర్పై కేసు నమోదు చేసి బెల్లంపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
● బైక్పై వచ్చిన ఏడుగురు అంతర్రాష్ట్ర దొంగలు ● గ్యాస్కట్టర్తో ఏటీఎం బాక్స్ను కట్ చేసిన దుండగులు ● ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బెల్లంపల్లి: పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం తెల్లవారుజామున అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ తెలిపిన వివరాల మేరకు కాల్టెక్స్ ఏరియాలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో బజాజ్ షోరూం పక్కన ఉన్న ఏటీఎం వద్దకు తెల్లవారు జామున సుమారు 3:15 గంటల ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు బైక్లపై వచ్చారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్తో ఏటీఎం బాక్స్ దిగువన కొంతమేర కట్ చేశారు. అదే సమయంలో రైల్వేస్టేషన్ ప్రాంతంలో పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూకోర్ట్ పోలీసులు టూటౌన్ వైపు వస్తుండగా ఏటీఎం షట్టర్ మూసి ఉండటంతో అనుమానం వచ్చి ఆగారు. ఏటీఎం పక్కన రెండు బైక్లు పార్కింగ్ చేసి ఉండడం గమనించి వాటి సైలెన్సర్లను చేతితో టచ్ చేయడంతో వేడి సెగ తగిలింది. వెంటనే టూటౌన్ ఎస్సై మహేందర్కు సమాచారం అందించారు. అప్పటికే శాంతిఖని బస్తీవైపు పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై స్టేషన్కు వెళ్లి హెడ్ కానిస్టేబుల్ను వెంట తీసుకుని వెళ్లమని ఆదేశించారు. ఆ ప్రకారంగానే ఏటీఎం వద్దకు వెళ్లడంతో పోలీసులను గమనించిన దొంగ పక్కనున్న గోడదూకి పారిపోయేందుకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులపై వెంట తెచ్చుకున్న కారం పొడిని చల్లాడు. అయినా పో లీసులు దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు. మి గిలిన దొంగలు అప్పటికే పలాయనం చిత్తగించా రు. కాగా కరీంనగర్ నుంచి ఏటీఎం సిబ్బంది వచ్చి పరిశీలించారు. ఖాళీ బాక్స్ మాత్రమే అపహరణకు గురైనట్లు గుర్తించారు. నగదు చోరీ కాలేదన్నారు.హర్యానా ముఠా పనేనా? ఏటీఎంలో చోరీకి యత్నించింది హర్యానాకు చెందిన దొంగల ముఠా సభ్యులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న దొంగ తనది హర్యానా అని చెప్పడంతో నిందితులంతా ఆప్రాంతానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలంలో గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, వన్టౌన్ ఎస్హెచ్వో ఎన్.దేవయ్య, పలువురు ఎస్సైలు ఘటనాస్థలిని సందర్శించారు. -
మలేషియా జైలు నుంచి స్వగ్రామానికి..
● కేటీఆర్, జాన్సన్నాయక్ చొరవతో ఇంటికి చేరిన ముగ్గురు బాధితులు కడెం: ఉన్న ఊళ్లో ఉపాధి లేక.. కుటుంబ పోషణకోసం పొట్టచేత పట్టుకుని కుటుంబ సభ్యులను వదిలి ఉపాధికోసం దేశం కాని దేశం వెళ్లి నరకయాతన అనుభవించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండల వాసులు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గుండారపు శ్రీనివాస్ 2023 జనవరిలో, అదే గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్ మార్చిలో, మున్యాల్కు చెందిన యమునూరి రవీందర్ జూన్లో ఉపాధి నిమిత్తం మలేషియా దేశానికి వెళ్లి 17 నెలల క్రితం జైలు పాలయ్యారు. జైల్లో నరకయాతన.. మలేషియాలో ఉపాధి కల్పిస్తానని ఓ ఏజెంట్ ఈ ముగ్గురికి ఆశ చూపాడు. రూ.60 వేలు కడితే అక్కడ రూ.30 వేల జీతం వస్తుందని చెప్పడంతో విజిట్ వీసాపై మలేషియా వెళ్లారు. అక్కడ అల్యూమినియం కంపనీలో లేబర్ పనులు చూపించాడు. కొద్ది నెలలు బాగానే ఉన్నా ఆతర్వాత పనుల్లేక పస్తులున్నారు. ఉపాధికోసం తిరుగుతున్న క్రమంలో అక్కడి పోలీసులకు చిక్కడంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విజిట్ వీసాపై వెళ్లినవారు అక్కడి నిబంధనల ప్రకారం పర్మినెంట్ చేసుకోవాలంటే రూ.2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. చేసేదేంలేక రూ.2 లక్షలు కట్టి పర్మినెంట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం నిబంధనలు సవరించడంతో 2023 తర్వాత వచ్చిన వారికి పర్మినెంట్ అయ్యే అవకాశం చేజారింది. దీంతో ముగ్గురు 7 నెలల 17 రోజుల పాటు జైల్లో మగ్గారు. కేటీఆర్, జాన్సన్నాయక్ చొరవతో.. తమవారు జైలులో బంధీలుగా ఉన్నారని, ఎలాగైనా వారిని ఇంటికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ను వేడుకున్నారు. స్పందించిన ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సలహా మేరకు మూడుసార్లు మలేషియా వెళ్లి అక్కడి జైలు అధికారులతో మాట్లాడారు. ఇద్దరు న్యాయవాదులను ఏర్పాటు చేసి సదరు వ్యక్తులను జైలునుంచి విడిపించారు. బయటకు వచ్చిన వారికి తమ సొంత ఖర్చులతో విమాన టికెట్ ఇప్పించడంతో ఈనెల 10న స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి తిరిగి వస్తామని కలలో కూడ అనుకోని వారు కేటీఆర్, జాన్సన్నాయక్ చొరవతో ఇంటికి చేరుకున్నారు. తమ వారిని ఇంటికి చేర్చిన జాన్సన్నాయక్ను సోమవారం బాధిత కుటుంబ సభ్యులు ఖానాపూర్లోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఽకృతజ్ఞతలు తెలిపారు. ఇంటికి వస్తామనుకోలే జైలు నుంచి మమ్మల్ని విడిపించి ఇంటికి రప్పించిన కే టీఆర్, జాన్సన్నాయక్కు జీవితాంతం రుణపడి ఉంటాం. జైల్లో ఉన్న మేము ఇంటికి వస్తామని కలలో కూడా అనుకోలేదు. జాన్సన్ అన్న మూడుసా ర్లు వచ్చారు. విడిపిస్తానని భరోసానిచ్చారు. – రాచకొండ నరేశ్, లింగాపూర్ నరకయాతన అనుభవించాం విజిట్ వీసా మీద మలేషియాకు వెళ్లిన మమ్మల్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఏడు నెలల 17 రోజులపాటు జైలులో నరకయాతన అనుభవించాం. జైలులో కడుపునిండా తిండి పెట్టకపోవడంతో అనారోగ్యానికి గురయ్యాం. – యమునూరి రవీందర్, మున్యాల్ -
చిరుత కాదు బెబ్బులి..
● రఘునాథ్పూర్ అడవుల్లో సంచారం ● ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి ● సమీప గ్రామాల్లో హైఅలర్ట్ బోథ్: బోథ్ అడవుల్లో బెబ్బులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారం రోజులుగా బోథ్ మండలంలోని కంటెగాం, నిగిని, మర్లపెల్లి, నారాయణపూర్, రఘునాఽథ్పూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. వారం క్రితమే కంటెగాం చెరువు సమీపంలో ఓ ఆవును, ఈ నెల 19న రఘునాథ్పూర్ అటవీ ప్రాంతంలో ఓ లేగదూడను హతమార్చింది. అయితే తొలుత చిరుతగా భావించిన అధికారులు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ట్రాప్ కెమెరాలో పెద్దపులి కనిపించడంతో అప్రమత్తమయ్యారు. అడెల్లి దారిలో అలర్ట్ పులి సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధన్నూర్, రఘునాథ్పూర్ మీదుగా అడెల్లి, సారంగాపూర్ వెళ్లేవారు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రఘునాథ్పూర్ వద్ద గల గుట్ట వెనక నుంచి నారాయణపూర్, అడెల్లి, మర్లపెల్లి, నిగిని, కంటెగాం అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు సోమవారం రఘునాథ్పూర్, నారాయణపూర్ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులను అలర్ట్ చేశారు. గ్రామస్తులెవరూ అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. చిన్నారులు, వృద్ధులు అటవీ ప్రాంతంలోని చేలలోకి వెళ్లవద్దన్నారు. కాగా బోథ్ అడవుల్లో పులి సంచారం ఏడాదిలో ఇది రెండవసారి. గతేడాది అక్టోబర్లో సంచరించిన పులి మళ్లీ జూన్లో బోథ్ మండలానికి వచ్చింది. తిప్పేశ్వర్ నుంచి రాక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి పెద్దపులులు తరచూ వచ్చి వెళ్తున్నాయి. తాజాగా తిప్పేశ్వర్ నుంచే బోథ్ అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో చింతల్బోరి, వజ్జర్, గొల్లాపూర్, చింతగూడ, నేరుడుపల్లె నుంచి నిగిని మీదుగా సారంగాపూర్, అడెల్లి ప్రాంతాల్లో పులి సంచరించి కవ్వాల్ అటవీ ప్రాంతానికి వెళ్లింది. ప్రస్తుతం కూడా అడెల్లి నుంచి కవ్వాల్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తిర్యాణి మండలం ఎర్రబండకు చెందిన గ్రామస్తులు పాఠశాల మంజూరు చేయాలని, గాదిగూడ మండలం చిత్తగూడ గ్రామస్తులు అంగన్వాడీ టీచర్ను నియమించాలని, తదితర సమస్యలపై 215 దరఖాస్తులు సమర్పించారు. ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, డీడీ అంబాజీరావు, పీహెచ్వో సందీప్, ఏడీఎంఅండ్హెచ్వో మనోహర్, ఏవో దామోదర స్వామి, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు. -
మంత్రి జూపల్లిని కలిసిన నేతలు
కైలాస్నగర్/తలమడుగు: ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఉమ్మడి జిల్లాకు చెందని కాంగ్రెస్ నేతలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ మాజీ ఎమ్మెల్యే బాపురావు, విజయ డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్, శ్యామ్ నాయక్ హైదరాబాద్లోని బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కలిశారు. 26, 27 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనబాసర: ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్నగర్ కేంద్రాలలో స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్, పీహెచ్సీ కోటాల కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. 26న క్యాప్, పీహెచ్సీ, 27న స్పోర్ట్స్, ఎన్సీసీ, విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు బాసర క్యాంపస్ ఆవరణలో హాజరు కావాలని ఆయన సూచించారు. పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల తుది ఎంపిక జాబితా విడుదల చేయబడుతుందని వెల్లడించారు. జనరల్ కోటా అభ్యర్థుల తుది ఎంపిక జాబితా జూలై 4న విడుదల చేసి 7న మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కోకన్వీనర్ డాక్టర్ దేవరాజు, బండి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతదండేపల్లి: మండలంలోని నంబాల సమీపంలో ట్రాలీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. గ్రామానికి చెందిన మధుకర్పై కేసు నమోదు చేశామన్నారు. పట్టుకున్న సుమారు 7 క్వింటాళ్ల 70 కిలోల బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఐ మురళీకృష్ణకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు
ఆదిలాబాద్టౌన్: తప్పిపోయిన బాలుడిని బాలల సంరక్షణ అధికారులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఎనిమిదేళ్ల బాలుడు ఈనెల 13న ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఏడుస్తూ కనిపించడంతో రైల్వే సిబ్బంది బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. బాలుడు ఆకోల అని చెప్పడంతో మహారాష్ట్ర ప్రాంతంలో గాలించారు. సోషల్ మీడియా, దినపత్రికల్లో బాలుడు అదృశ్యమైనట్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన దంపతులు రవి, తమ కుమారుడని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సోమవారం బాలుడిని ఐసీపీఎస్ అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు దశరథ్, డేవిడ్, బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, వినోద్, పద్మ, అశ్విని పాల్గొన్నారు. -
పాత పింఛన్ కొనసాగించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పింఛన్ పద్ధతిని అమలు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్జీఆర్ఈఏ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కొత్త విధానంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణ, శంకర్, విక్రమ్, వైకుంఠం, సత్యనారాయణ, పాపరావు, రాంరెడ్డి, లింగం, రాజనర్స, దుర్గప్రసాద్, తిరుపతి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు హక్కుపత్రాలు ఇవ్వాలి
ఉట్నూర్రూరల్: ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతాత్ రాందాస్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీవో ఖుష్బూ గుప్తాకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ధర్ము, ఎల్లయ్య, నర్సయ్య, చంద్రయ్య, శంకర్, సంధ్య, నంబాజీ, తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని టేకంగర్ జిల్లాకు చెందిన సౌరభ్ రాయక్వార్, రితిక్సేన్ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. వర్క్ఫ్రం హో ం అంటూ రోజుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు సంపాదించవచ్చని అమాయకులను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిపారు. హాయ్ నాపేరు టీనా.. అంటూ వాట్సాప్లో పరిచయం.. టెలీగ్రామ్లో టాస్క్లు పంపుతూ అధిక డబ్బు ఆశ చూపుతూ ఆదిలాబాద్రూరల్ మండలంలోని జందాపూర్కు చెందిన చెన్న శివకుమార్ నుంచి రూ.5 లక్షల 3వేల వరకు వసూలు చేశారన్నారు. ఈనెల 14న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదరు నిందితులు 25 వాట్సాప్ గ్రూప్లను నడుపుతున్నారని, ఇందులో 250 మంది సభ్యులు ఉన్నారన్నారు. నెలకు రూ.30 లక్షల వరకు ట్రాన్సెక్షన్ చేశారన్నారు. దాదాపు 900 మందిని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. వీరికి సంబంధించిన సైబర్ మోసగాళ్లు విదేశాల్లో ఉంటూ ఏజెంట్ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలియని వెబ్సైట్లు, లింక్లను ఓపెన్ చేయవద్దని ఎస్పీ సూచించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిధర్, ఎస్సై విష్ణువర్ధన్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
విద్యుత్ షాక్తో ఎద్దులు మృతి
కాగజ్నగర్రూరల్: మండలంలోని జంబుగ గ్రామంలో ఆదివారం విద్యుత్షాక్తో ఎద్దు మృతి చెందింది. గజ్జిగూడకు చెందిన గాజుల మొండయ్యకు చెందిన ఎద్దు మేతకోసం వెళ్లి ట్రాన్స్ఫార్మర్కు తగలి అక్కడికక్కడే మృత్యువాతపడింది. దీని విలువ రూ.60 వేలు ఉంటుందని, అధికారులు తనకు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈజ్గాం ఏఎస్సై హీరామన్, పశువైద్యాధికారులు ఈ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు ఆరోపించాడు. అందుకే అధికారుల రాలేదని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని బాధితుడు తెలిపాడు. భీమిని: మండలంలోని వెంకటపూర్ పంచాయతీ పరిధిలో ఆదివారం విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. గ్రామ శివారులో మేతకు వెళ్లిన ఎద్దు ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ వైర్కు తగిలి మృతి చెందినట్లు బాధిత రైతు కోట నగేశ్ తెలిపాడు. దీని విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని వేడుకున్నాడు. -
వసతులు కల్పించాలంటూ ఫిర్యాదు
నస్పూర్: పట్టణ పరిధిలోని సీసీసీ కార్నర్ వద్ద గల తిరుమల డెవలపర్స్ అపార్ట్మెంట్లో మౌలిక వసతులు కల్పించడం లేదంటూ యజమానులపై అపార్ట్మెంట్ వాసులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమానులు అనుమల్ల వెంకట్రెడ్డి, పెరుక ప్రతాప్, గుజ్జల ప్రశాంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్స్టేషన్ ఎదుట అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ 2013లో నస్పూర్ శివారు సర్వేనంబర్ 94లో తిరుమల డెవలపర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపార్ట్మెంట్లో మొత్తం 48 ప్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా లిఫ్ట్లు, కౌంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు, మెట్ల పక్కన రెయిలింగ్ ఏర్పాటు చేయలేదని, ఎర్తింగ్ లేదని, ఫ్లోరింగ్ అసంపూర్తిగా ఉందన్నారు. అపార్ట్మెంట్ వాసులు లక్ష్మారెడ్డి, రాంచందర్, సత్తయ్య, లక్ష్మి, భవాని, పద్మ పాల్గొన్నారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
చెన్నూర్రూరల్: వృద్ధురాలి మెడలో గొలు సును ఇద్దరు చోరీకి పాల్పడ్డారు. మండలంలోని సుబ్బరాంపల్లి సమీపంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబ్బరాంపల్లి గ్రామానికి చెందిన రాతిపల్లి భూదమ్మ శనివారం పని నిమిత్తం అంగ్రాజ్పల్లి గ్రామానికి వెళ్లింది. అక్కడకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి మీతో పని ఉందని మీ ఊరికే వెళ్తున్నామని చెప్పి నమ్మించారు. బైక్పై తీసుకుని సుబ్బరాంపల్లి సమీపంలో దించి ఆమె మెడలో మూడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. భూదమ్మ గట్టిగా అరవడంతో ఇద్దరు బైక్పై పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యులు చెన్నూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మాస్క్ ధరించి.. బంగారం అపహరించి
● భైంసాలోని ఓ ఇంట్లో 31 తులాలు చోరీ భైంసాటౌన్: పట్టణంలోని రాహుల్నగర్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు, పట్టణ సీఐ జి.గోపినాథ్ కథనం ప్రకారం.. రాహుల్నగర్లోని నివాసముంటున్న మచ్చ గజ్జారాం, పంచపూల దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నర్సాపూర్(జి)లోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆదివారం ఇంటి గేటు, తలుపులు తెరిచి ఉండడం గమనించిన స్థానికులు వారి కుమారుడికి సమాచారమిచ్చారు. ఆయన వెంటనే నర్సాపూర్(జి)లో ఉన్న తల్లిదండ్రులకు తెలిపి, భార్యతో కలిసి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. లోనికి వెళ్లి వెళ్లి చూడగా బీరువా, వస్తువులు చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ జి. గోపీనాథ్, ఎస్సై గౌసుద్దీన్ చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనలో 31 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు, ఒక ప్రొఫెషనల్ కెమెరా అపహరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఇంట్లో సీసీ పుటేజీ పరిశీలించగా మాస్క్ ధరించిన ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 ఎంపిక పోటీల్లో 15 మంది క్రీడాకారులను జిల్లా జట్టుకు ఆదివారం ఎంపిక చేసినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. ఎంపికై న వారిలో మందమర్రికి చెందిన సింహాద్రి, లక్ష్మణ్, రాంయాదవ్, మంచిర్యాల నుంచి ఐ. సందీప్, అశ్రిత్, అక్షయ్, ఆదిలాబాద్ నుంచి దర్శ్ అగర్వాల్, ఇస్రాయేల్, మొహమ్మద్ ఆనస్, రాజబాబు, రాహుల్, అద్నాన్, ముల్కల్లకు చెందిన చరణ్, ఉట్నూర్కు చెందిన ముసాదిక్, ఆసిఫాబాద్కు చెందిన కార్తికేయ ఉన్నారు. స్టాండ్బైలో మంచిర్యాలకు చెందిన జె. సంతోశ్, సాయిరామ్, ఆదిలాబాద్కు చెందిన ఎస్డి అనస్, సైఫ్ బిన్ సోహైల్, లక్కీ జాదవ్లను ఎంపిక చేశారు. జిల్లా జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో త్వరలో నిర్వహించే టోర్నమెంటులో ఆడుతుందని తెలిపారు. -
పంగిడి అడవుల్లో అలుగు వేట
ఖానాపూర్: నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి అటవీ రేంజ్ పరిధిలోని ఖానాపూర్ మండలం బావాపూర్(ఆర్) పంచాయతీ పరిధి పంగిడి గూడెం అడవుల్లో అడవి అలుగును కొందరు వేటాడినట్లు ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్ఆర్వో కిరణ్ తెలిపారు. ఖానాపూర్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న ఖానాపూర్ మండలం జగన్నాథ్రావు చౌరస్తాలో కారులో వెళ్తున్న ముగ్గురితోపాటు అలుగు అవశేషాలు పట్టుకుని విచారించారు. అలుగును అడవి సారంగాపూర్కు తరలించి అక్కడి నుంచి క్రయవిక్రయాలు చేసే ముఠా సభ్యులకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని విచారించగా మరో ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించి, మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో పట్టుకున్న వారిలో నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్. నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని ఎఫ్డీవో, ఎఫ్ఆర్వో పేర్కొన్నారు. అక్రమ మార్గంలో సంపాదించేందుకే.. అక్రమ మార్గంలో సంపాదించేందుకే అడవి అలుగుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉందని కొందరు అపోహలు సృష్టించారు. దీన్ని కొనుగోలు చేస్తే సంపద రావడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని, రూ.5 లక్షలు ఆ పైచిలుకు ధరకు విక్రయించేందుకు ఈ దందాకు తెరలేపారు. అడవిలో పట్టుకున్న అలుగు నుంచి కరెంట్ ఉత్పత్తి అయ్యేలా చూపేందుకు ఫేక్ టెస్టర్ను తయారుచేసి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. 10 మందిపై కేసు, అరెస్టు.. ఈ కేసులో ముందుగా నిజామాబాద్కు చెందిన ఫయాజ్, గంగాప్రసాద్తోపాటు జగిత్యాల జిల్లాకు చెందిన అహ్మద్ఖాన్ను పట్టుకుని విచారించారు. ఖానాపూర్ మండలానికి చెందిన గణేశ్, బారిక్రావు, నాగేశ్, విజయ్, నాగారావు, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్లకు చెందిన శ్రీరాం, జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్కు చెందిన రియాజ్ అహ్మద్ను గుర్తించి కేసు నమోదు చేశారు. వారి నుంచి 9 సెల్ఫోన్లతోపాటు ఒక కారు, బైక్, ఒక వెయింగ్ మిషన్, ఒక టెస్టర్, అలుగు పొలుసులు, ఒక అలుగును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ చేయనున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుందన్నారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ అధికారి మహేశ్, ఎఫ్ఎస్వో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 10 మందిపై కేసు నమోదు, అరెస్టు వెల్లడించిన ఎఫ్డీవో భవానీ శంకర్ -
ఆత్మీయ సమ్మేళనం
తాంసి మండలం కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2000–01 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత వీరి ఆత్మీయ సమ్మేళనానికి పాఠశాల వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పాఠశాల హెచ్ఎం ఆనంద్, పూర్వ ఉపాధ్యాయులు ఆదినాథ్, శ్రీనివాస్, మనోహర్, విజయతోపాటు రఫీ, అనిల్, సరిత, స్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు. – తాంసి -
అడవిలో యాంటీపోచింగ్ షెడ్లు
జన్నారం: రాత్రి,పగలు అడవిలో తిరుగుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసం తమవంతుగా కృషి చేస్తున్న యాంటీపోచింగ్ సిబ్బందికి అటవీశాఖ నివాస సౌకర్యం కల్పించింది. అడవిలో అందమైన షెడ్ల నిర్మాణం చేపట్టింది. వాన, వేసవి, చలికాలాల్లో నీడ సౌకర్యం కోసం, సిబ్బంది బస చేసేందుకు వీలుగా టైగర్జోన్లోని జన్నారం డివిజన్లో మొదటిసారిగా ఇందన్పల్లి రేంజ్లో షెడ్ల నిర్మాణం చేపట్టింది. రేంజ్లో మూడుచోట్ల జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్లో మొదటిసారిగా మూడు చోట్ల యాంటీపోచింగ్ షెడ్లు నిర్మాణం చేపట్టారు. ప్రతి ఏటా వచ్చే నిధులతో ఈసారి సిబ్బంది కోసం షెడ్ల పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఒక్కో యాంటీపోచింగ్ టీంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలోనే తిరుగుతూ వన్యప్రాణులు, అడవుల రక్షణ కోసం పని చేస్తుంటారు. సాయంత్రం, ఉదయం వంట, సామగ్రిని షెడ్లలో ఉంచుకుని తిరిగి రాత్రి ఇక్కడే బస చేస్తారు. సిబ్బంది రాత్రి ఉండేందుకు జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్సింగ్ ఆదేశాల మేరకు రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ ఈ నిర్మాణాలు చేపట్టారు. వీటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో షెడ్లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. సిబ్బంది విధులు స్మగ్లింగ్ నిరోధానికి అటవీ అధికారులతోపాటు బేస్క్యాంపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరి కోసం ఇప్పటికే డివిజన్లో బేస్క్యాంపులు నిర్మించారు. వారు రాత్రి, పగలు అడవిలో ఉంటూ స్మగ్లింగ్ నిరోధానికి, అడవుల ఏదైన సమస్య ఉంటే అధికారులకు సమాచారం ఇస్తారు. వన్యప్రాణుల సంరక్షణకు, ఏదైన వన్యప్రాణి గాయపడ్డ అక్కడికి చేరుకుని వాటిని కాపాడటం కోసం యాంటీపోచింగ్ సిబ్బందిని నియమించారు. వన్యప్రాణులకు నీటి సౌకర్యం, ఆహారం కల్పించడానికి అటవీ అధికారుల ఆదేశాల మేరకు పని చేస్తుంటారు. వర్షాకాలంలో గడ్డి పెంపకం, వేసవిలో నీటి సౌకర్యం కోసం పనిచేస్తుంటారు. వీటితోపాటు స్మగ్లింగ్, వేట నిరోధం కోసం అటవీశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం పని చేస్తుంటారు. ఇందన్పల్లి రేంజ్లో నిర్మాణం సిబ్బందికి సౌకర్యాలుఉన్నతాధికారుల ఆదేశాలతో.. యాంటీపోచింగ్ సిబ్బందికి అడవిలో సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో రేంజ్ పరిధిలో మూడు షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభిస్తాం. – కారం శ్రీనివాస్, రేంజ్ అధికారి -
బ్లేడ్ ట్రాక్టర్ తగిలి మహిళా రైతు మృతి
పెంబి: చేనులో చదును చేస్తున్న బ్లేడ్ ట్రాక్టర్ వెనుకకు వచ్చే క్రమంలో నాగలికి తగలి మహిళా రైతు అక్కడిక్కడే మృతి చెందింది. మండలంలోని నాగాపూర్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై హన్మండ్లు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన పోతురాజు లక్ష్మి(40) తన చేనులో ఆదివారం బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేయిస్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో వెనుకకు వచ్చే క్రమంలో నాగలి ఆమె తలకి తగలి మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి అనుప ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కూతురు ఉంది. భర్త, కుమారుడు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మంచిర్యాల–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మృతుడు మంచిర్యాలలోని ఎన్టీఆర్నగర్కు చెందిన వానరాసి మల్లేశ్ (37)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో భద్రపర్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకరిపై దాడి తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన ఇప్తెకర్ సిద్ధిరాంపై అదే గ్రామానికి చెందిన కొందరు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ట్రైయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గతవారం క్రితం అదే గ్రామానికి చెందిన ప్రదీప్, సిద్ధిరాంలు ఫోన్ విషయమై మద్యం మత్తులో గొడవపడ్డారు. మాటమాట పెరిగి సిద్ధిరాం ప్రదీప్ని కర్రతో కొట్టి అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ప్రదీప్ తన సోదరులకు తెలిపాడు. ప్రదీప్ సోదరులు సిద్ధిరాం రాక కోసం ఎదురుచూశారు. అతను శనివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. ప్రదీప్ సోదరులు, కుటుంబ సభ్యులు అతన్ని హత్య చేయాలనే పథకం పన్ని కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సిద్ధిరాంను కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. విషయం తెలుసుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆదివారం జౌలా(కే) గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. సిద్ధిరాం ఫిర్యాదు మేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచరణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ట్రైయినీ ఎస్సైకి సూచించారు. పశువులు పట్టివేతకౌటాల: మండలంలోని హెట్టి గ్రామం నుంచి అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న పశువులను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. శనివారం రాత్రి హెట్టి నుంచి మూడు బొలెరో వాహనాల్లో 18 ఆవులు, 10 దూడలు, 4 ఎద్దులను అక్రమంగా త రలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. మూడు బొలెరో వాహనాలు, రెండు కార్లను సీజ్ చేసి పట్టుకున్న 32 పశువులను కౌటాల బంజారు దొడ్డిలో ఉంచినట్లు తెలిపారు. పశువులను అక్రమంగా తరలిస్తున్న షేక్ శుజాఉద్దీన్, అయుబ్ఖాన్, హలీద్ పాషా, జమీర్, మొబీన్, రఫీ, ఫాషీ, అహ్మద్, అబ్దుల్లా, జహీర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదుపుతప్పిన కారునిర్మల్చైన్గేట్: జిల్లాకేంద్రంలోని గుల్జార్ మార్కెట్లో ఆదివారం కారు అదుపుతప్పిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ కారు పోలీస్స్టేషన్ వైపు నుంచి మార్కెట్ వైపు వస్తూ మసీదు ఎదుట ఉన్న రెండు బజ్జీల బండ్లు, ఒక బైక్ను ఢీకొంది. ఘటనలో కారుడ్రైవర్ శ్రీధర్తోపాటు గౌస్ఖాన్కు గాయాలయ్యాయి. షేక్ అహ్మద్పై వేడి నూనె పడి గాయపడ్డారు. అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి
శ్రీరాంపూర్: రాష్ట్రంలో కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసాని వీరేశ్ తెలి పారు. కబడ్డీ క్రీడాకారులకు మినీ అకాడమీ స్థలాన్ని పరిశీలించడానికి ఆదివారం మంచి ర్యాలకు వచ్చారు. నస్పూర్ కలెక్టరేట్ కమాన్ వద్ద జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికా రు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు అనేకమంది ఉన్నారన్నారు. జాతీయ స్థాయి ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు ఎస్.రాంచందర్, అథ్లెటిక్స్ అసో యేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబమూర్తి, క్రీడాకారులు కార్తీక్, శ్రీధర్, లింగయ్య, ఉపేందర్, రాజేందర్, మంజుల పాల్గొన్నారు. -
డయేరియాపై సమరం
● జూలై 31 వరకు కార్యక్రమాలు ● ఐదేళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు పంపిణీ ● అతిసారను అడ్డుకోవడమే లక్ష్యంలక్షణాలు..డయేరియా సోకినప్పుడు విరేచనాలతోపాటు జ్వరం, వాంతులు, దాహం ఎక్కువ కావడం, నీరసం, గుండెదడ, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో డీహైడ్రేషన్ ఎక్కువైతే నాడీ వేగం తగ్గి, కోలుకోవడం కష్టంగా మారుతుంది. వెంటనే వైద్యుల వద్దకు వెళ్తే శరీరం కోల్పోయిన లవణాలు రీప్లేస్ చేసేందుకు గ్లూకోజ్, ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు ఇవ్వడంతో పాటు, విరేచనాలతోపాటు వాంతులు ఉంటే సైలెన్ ఎక్కిస్తారు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడితే వాంతులు, విరేచనాలు తగ్గి వ్యాధి నుంచి బయటపడతారు. వ్యాధిగ్రస్తులు తేలి కగా జీర్ణమయ్యే వాటిని తినడం, పాల పదార్థాలను తగ్గించి, పండ్ల రసాలు, సూప్లు ఎక్కువగా తీసుకోవడం, పుల్లటి పండ్లు తినకుండా ఉంటే మంచిది.మంచిర్యాలటౌన్: డయేరియా నిర్మూలనకు వైద్య ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ఐదేళ్లలోపు చిన్నారులు వందమంది మృతి చెందితే.. అందులో 4.8 శాతం మంది డయేరియాతో ప్రాణాలు కోల్పోతు న్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టాప్ డయేరియా క్యాంపెయిన్(అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం)ను చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి జూలై 31 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డయేరియా రావడానికి ప్రధాన కారణం కలుషితమైన తాగునీటిని తీసుకోవడ మే. వర్షాల సమయంలో పైపులైన్లు పగలడం, ట్యాంకుల్లో కలుషిత నీరు చేరడం, తాగేనీటితో పాటు తినే ఆహారం కలుషితమైనా, వ్యక్తిగత పరిశుభ్రత లేకున్నా సోకుతుంది. పసిపిల్లల నుంచి పెద్దలకు అందరికీ వచ్చే సాధారణ వ్యాధి. నీళ్ల విరేచనా లు అయితే నార్మల్ డయేరియాగా, రక్తం, బంకతో వచ్చే విరేచనాలను డిసెంట్రీగా పిలుస్తారు. పిల్లల్లో వచ్చే ఈ వ్యాధికి రోటా వైరస్ కారణమైతే.. నోరో వైరస్లతో పెద్దలకు సోకుతుంది. రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టిరీయా, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, ఫుడ్ పాయిజనింగ్ కూడా డయేరి యాకు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుల శరీరంలో నీటిశాతం, లవణాలు తగ్గి పోయి నీరసంగా తయారవుతారు. సరిపడా లవణాలు అందించకుంటే డీహైడ్రేషన్ ఎక్కువై పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఒంట్లోని పోషకాలు, లవణాలన్నీ విరేచనాలతో బయటకు వెళ్లి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే లక్షణాలను వెంటనే గుర్తించి ఓఆర్ఎస్ నీటిలో కలుపుకుని తాగడం, జింక్ ట్యాబెట్లు వేసుకోవడం ద్వారా తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్న కేంద్రాలుఅంగన్వాడీ కేంద్రాలు 969ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 17అర్బన్ హెల్త్ సెంటర్లు 5సబ్సెంటర్లు 149కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 1 -
అలరించిన కవి సమ్మేళనం
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్లో ఆదివారం సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. విశ్రాంత అభియంత సాధు నందమయ్య మాట్లాడుతూ తెలుగు కవి, హాస్యకవి, వికటకవిగా పేరొందిన తెనాలి రామకృష్ణ ఎన్నో అద్భుత కావ్యాలు రచించారన్నారు. భువన విజయంలో ఓ కవి ఇచ్చిన సమస్యకు ఎంతో చక్కని పూర్ణ చమత్కార పద్యాలు ఉదహరించారని తెలిపారు. ఉద్దటారాధ్య చరిత్ర, పాండురంగం మహాత్యం, ఘటికాచల మహాత్యం గురించి వివరించారు. కవులు పెద్ది భరత్, మల్యాల మురళీకృష్ణ, మైసమ్య కవితాగా నం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వామన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీకి 20,258 దరఖాస్తులు
● జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల ● 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలనభైంసా: 2025–26 విద్యాసంవత్సరానికి బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,258 దరఖాస్తులు వచ్చాయి. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారి నుంచి ఈ నెల 21వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. 1,500 సీట్లుండగా ఒక్కో సీటుకు 14 మందికిపైగా పోటీపడుతున్నారు. క్రమంగా తగ్గుతున్న పోటీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి క్రమంగా విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య తగ్గుతోంది. 2020–21 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం 32వేల మంది, 2021–22లో 20,178, 2022–23లో 31,432, 2023–24లో 32,635, 2024–25లో 15వేలు, 2025–26 విద్యాసంవత్సరంలో 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి జూలై 4న సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 7నుంచి సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా విధానం ఇలా.. ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో భాగంగా తొలి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ బోధిస్తారు. ఇందులో మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు వివిధ బ్రాంచ్లలో సీట్లు కేటాయిస్తారు. బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్టాన్రిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు బోధిస్తారు. క్యాంపస్లో వసతులు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్ టాప్లు, యూనిఫాంలు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీలోనే ఉంటుంది. ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు తరగతులు నిర్వహిస్తారు. క్యాంపస్లోనే ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. -
దేశానికి కమ్యూనిస్టులు అవసరం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబశివరావు ● ముగిసిన సీపీఐ జిల్లా నాలుగో మహాసభపాతమంచిర్యాల: దేశానికి, సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన సీపీఐ జిల్లా నాలుగో మహాసభ ముగింపు సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశంలో అసంఘటిత రంగాల్లో కోటిమంది ఉన్నారని, వారి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు. సామ్రాజ్యవాద దేశాల కనుసన్నల్లోనే మన దేశంలో పరిపాలన సాగుతుందని విమర్శించారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. దేశంలో నిరుద్యోగం, అవినీతి, అసమానతలు, పేదరికం లేకుండా చేస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసీలను అమానుషంగా చిత్రహింసలకు గురిచేసి చంపుతున్నారని ఆరోపించారు. ఆంతకుముందు సమావేశ ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద ఇటీవల అమరులైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నంబాల కేశవరావు, గాదర్ల రవి, భాస్కర్తోపాటు పార్టీ సభ్యులకు నివాళులర్పించారు. విమాన ప్రమాదంతోపాటు పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కోసం మౌనం పాటించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, ఖలిందర్ అలీఖాన్, పౌలు, లింగం రవి, మిరియాల రాజేశ్వర్రావు, బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రకళ, బొల్లం తిలక్, వనం సత్యనారాయణ, ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక సీపీఐ జిల్లా నాలుగో మహాసభల సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా 16 మంది, కౌన్సిల్ సభ్యులుగా 51 మందిని ఎన్నుకున్నారు. కాగా, రామడుగు లక్ష్మణ్ ఇప్పటికే జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. -
పీజీ పట్టా పొందిన డీఎంహెచ్వో
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికా రిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ హరీశ్రాజ్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(విజయవాడ)లో మైక్రో బయాలజీ(ఎండీ) చేసి పీజీ పట్టా పొందారు. 61 ఏళ్ల వయస్సులో డీఎంహెచ్వోగా పనిచేస్తూనే ఈ ఏడాది మేలో పీజీ పరీక్షలు రాయగా, ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. 1985లో కాకతీయ యూనివర్శిటీలో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లా మెడికల్ ఆఫీసర్గా మొదటిసారి విధుల్లో చేరారు. అనంతరం ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో డిప్యూటీ సివిల్ సర్జన్, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. 2017లో సివిల్ సర్జన్గా పదోన్నతి పొంది వరంగల్ డీఎంహెచ్వోగా చేరారు. మహబూబాబాద్లో పనిచేశారు. ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందుతుండగా, అంతకుముందే పీజీ పట్టా పొందడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
ఈజీఎస్ పనులు పరిశీలన
బెల్లంపల్లిరూరల్: మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆది వారం కేంద్ర జలశక్తి అభియాన్ టీం అధికారులు పరిశీలించారు. ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి, కన్నాల, అంకుశం, బుధాకుర్థు, బుధాకలాన్, గురిజాల, మాలగురిజాల, బట్వాన్పల్లి, దుగ్నెపల్లి, పెర్కపల్లి గ్రామాల్లో ఇంకుడు గుంతలు, చెరువుల్లో నిర్మించిన ఫారమ్ పాండ్స్, ఫిష్ పాండ్స్ను టీం అధికారి కె.రాంబాబు తనిఖీ చేశారు. జలశక్తి అభియాన్ పనులు ఏవిధంగా ఉన్నాయి, వాటితో ఎంతమేరకు నీటిని పొదుపు చేయగలుగుతున్నారు.. అనే అంశాలపై ఆరా తీశారు. నీటిని పొదుపుపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం రాంబాబును మండల అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్, డీఆర్డీవో కార్యాలయ అధికారి సదానందం, ఏపీవో ఏస్తర్ డేవిడ్, ఈసీలు సత్యనారాయణ, అనిత్ తదితరులు పాల్గొన్నారు. -
● మిల్లర్ల ఖాయిలపై కఠినతరం ● రంగంలోకి ఈడీ దిగే అవకాశం ● ఇప్పటికే ఆర్ఆర్, క్రిమినల్ కేసులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) బకాయిలపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సీఎంఆర్ బకాయిల రికవరీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా సీజన్లలో ధాన్యం తీసుకుని సకాలంలో పౌరసరఫరాల శాఖకు బియ్యం ఇవ్వని మిల్లర్లను డీఫాల్టర్లుగా ప్రకటించారు. అంతేకాకుండా గత వానాకాలం నుంచే జిల్లాలో అనేక మంది మిల్లర్లు సీఎంఆర్కు దూరమయ్యారు. బియ్యం ఇవ్వకుండా పలుమార్లు నోటీసులు, అధికారులకు స్పందించని వారిపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్టు కింద కేసులు నమోదయ్యాయి. కొంతమందిపై ఆర్ఆర్యాక్టుతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో 20 మందికి పైగా కేసులు నమోదు చేశారు. మొదట కేసులు నమోదు చేసే సమయంలోనే రూ.133 కోట్ల బకాయిలు ఉన్నట్లు తేల్చారు. ధాన్యం విలువకు వడ్డీతో సహా లెక్కగట్టి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్యాక్టు అమలు చేసేందుకు మిల్లర్ల చర, స్థిర ఆస్తుల వివరాలు సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఈ యాసంగి సీజన్ ఆరంభంలోనే మళ్లీ మిల్లు ట్యాగింగ్ పొందేందుకు చెల్లిస్తున్నారు. ఇక 2022–23 యాక్షన్ ధాన్యానికి సంబంఽధించిన బకాయిలపైనా రికవరీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మిల్లర్లు గతేడాది రెండు సీజన్ల సీఎంఆర్ కింద బియ్యం అప్పగిస్తున్నారు. పొరుగు జిల్లాలకే అధికం స్థానికంగానే ధాన్యం ఇచ్చేందుకు మిల్లులకు అవకాశం ఉన్నా బకాయిల కారణంగా గత రెండు సీజన్లలోనూ ట్యాగింగ్కు దూరమయ్యాయి. ఈ యాసంగిలో జిల్లాలోని 22 మిల్లులకే అవకాశం ఇచ్చారు. ఇక పొరుగు జిల్లాలైన కరీంనగర్లోని 68 మిల్లులకు, పెద్దపల్లిలోని 110 మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు. మొత్తంగా ఈ సీజన్లో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లులకు అప్పగించారు. అయితే ఈ ధాన్యం ఇచ్చేందుకు కూడా గత వానాకాలం నుంచి బ్యాంకు గ్యారెంటీలు తప్పనిసరి చేశారు. ధాన్యం విలువలో కనీసం పదిశాతం బ్యాంకు గ్యారెంటీ తీసుకున్నారు. గత సీజన్లో ఇంకా బకాయి ఉంటే 20 శాతం వరకు ఇవ్వాల్సిరావడంతో బకాయిలు ఉన్న స్థానిక మిల్లులకు ధాన్యం ఇవ్వడం నిలిచిపోయింది.రంగంలోకి ఈడీ?సీఎంఆర్కు సంబంధించిన ధాన్యం బకాయిలు రూ.కోట్లలో ఉన్న మిల్లులపై ఇప్పటికే పలు రకాలుగా చట్టప్రకారం ముందుకు వెళ్తుండగా ఇక ఈడీ (డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్) సైతం రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించి జరిపిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రూ.వందల కోట్లలో ఉన్న బకాయిలపై కఠినంగా వ్యవహరించాలని పౌరసరఫరాల శాఖ యోచిస్తున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పేలా లేవు. దీంతో ఆర్థిక లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ మొదలుపెడితే తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ధాన్యం అమ్మడం నుంచి ఆ మొత్తంతో ఇతర ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు జరిపిన నగదు మళ్లింపు, ఇతర క్రయ విక్రయాలన్నింటిని విచారణ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈడీ దర్యాప్తు మొదలైతే జిల్లాలోనూ పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న మిల్లర్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.జిల్లాలో సీఎంఆర్ వివరాలు (టన్నుల్లో) సంవత్సరం సీజన్ లక్ష్యం పెండింగ్ 2023–24 రబీ 57,832 9,199.870 2024–25 ఖరీఫ్ 53,689 21,424.680 2024–25 రబీ 59,958 55,047.190 -
బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలి
పాతమంచిర్యాల: బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలని ఓబీసీ పోరుబాట పుస్తక రచయిత, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్లో ఆదివారం పుస్తకం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బీసీలు సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని చైతన్యం చేయడానికి పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయాలో, తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో పుస్తకంలో వివరించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేత ప్రసన్న హరికృష్ణ, టీబీజీకేస్ నాయకులు కెంగెర్ల మల్లయ్య, నాయకులు సంధ్యారాణి, నరెడ్ల శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, భావన రుషి, గాజుల ముఖేశ్గౌడ్ పాల్గొన్నారు. -
కాచి చల్లార్చిన నీటిని తాగించాలి
పిల్లలకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. అపరిశుభ్రమైన పరిసరాల్లోకి వెళ్తే వారి చేతులను సబ్బుతో కడగాలి. తల్లి కూడా పరిశుభ్రతను పాటిస్తూ పాలిచ్చే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతిగోళ్లు పెంచుకోకపోవడం, తినే ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలు పెట్టడం, పిల్లలకు అప్పుడే వండిన ఆహార పదార్థాలు ఇవ్వడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వకపోవడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తినిపించాలి. బయటి ఆహారంతో డయేరియాతోపాటు, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ అనిత, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీలో 60 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు భూమి పూజ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలైన నాగారం, ర్యాలీ, చిన్నగోపాల్పూర్తోపాటు గఢ్పూర్ గ్రామాల పరిధిలోని అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా చూస్తామని అన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అంతకు ముందు గిరిజనులు మంగళహారతులు, సంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో గూడూరు శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూల్కు డ్రా పద్ధతిలో ఎంపిక
మంచిర్యాలఅగ్రికల్చర్: బెస్ట్ అవైలబుల్ స్కూల్కు విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికా రి రాజేశ్వరి అన్నారు. శనివారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ఎస్సీ విద్యార్థులను బెస్ట్ అవైలేబుల్ స్కీం ద్వారా 1వ తరగతిలో 91 మందిని, 5వ తరగతిలో 92 మందిని ఎంపిక చేసి ప్రైవేట్ పాఠశాలల్లో వసతితో కూడిన ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో చేరాలని సూచించారు. -
ప్రాణహితలో పడవ కష్టాలు షురూ..
● నదిలో పెరుగుతున్న నీటిమట్టం ● రద్దయిన కాలినడక ప్రయాణం ● సరిహద్దు గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు ● వంతెన నిర్మించాలని వేడుకోలువేమనపల్లి: ప్రాణహిత నదిలో కొద్దిపాటి నీటిమ ట్టం పెరగడంతో కాలినడక (సొచ్చిరేవుల) ప్రయా ణం రద్దయి ఇరురాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజ లకు నాటుపడవ కష్టాలు మొదలయ్యాయి. మహా రాష్ట్ర–తెలంగాణ సరిహద్దుగా కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి నుంచి బెజ్జూర్, దహెగాం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల గుండా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. ఎగువన కౌటాల మండలం గూడెం వద్ద, దిగువన కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద మాత్రమే నదిపై అంతర్రాష్ట్ర వంతెనలు ఉన్నాయి. వేమనపల్లి మండలం కళ్లంపల్లి, వేమనపల్లి పుష్కరఘాట్, రేగుంటఘాట్, వెంచపల్లి, రాచర్ల, ప్రాణహిత ఘా ట్ల గుండా వర్షాకాలంలో పడవ ప్రయాణం కొనసాగుతుంది. మార్చి నుంచి జూన్ వరకు నాలుగు మా సాలపాటు నదిలో వరద తగ్గడంతో సొచ్చిరేవుల గుండా ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ఆ సమయ ంలో ఎడ్లబండ్లు బైక్లు, ట్రాక్టర్ల సాయంతో ఇరు రాష్ట్రాలకు రాకపోకలు ఉంటాయి. మిగతా 8 నెలలు ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తారు. బోట్ రైడ ర్లు వరద తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి రూ.50 నుంచి రూ.150 వరకు చార్జీలు వసూలు చేసి నది దాటిస్తారు. సరిహద్దు గ్రామాల ప్రజలు పడవ కష్టాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వంతెన నిర్మించాలని కోరుతున్నారు. -
● కమ్యూనిస్టు పార్టీలను బలహీన పర్చేందుకు కుట్ర ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ● మంచిర్యాలలో పార్టీ జిల్లా నాలుగో మహాసభ
పాతమంచిర్యాల: పదవుల కోసం వెంపర్లాడే తత్వం ఎర్రజెండా పార్టీకి లేదని, నిస్వార్థంగా ప్రజల సమస్యలపై పోరాడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐ పేదలు, కార్మికులు, కర్షకుల పక్షాన పోరాటాలు, ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కామ్రెడ్ గుండా మల్లేష్ ప్రాంగణంలో సీపీఐ జిల్లా నాలుగో మహాసభ శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు. సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలను బలహీన పర్చడానికి బూర్జువ పార్టీలు, కార్పొరేట్లు కుట్ర పన్నుతున్నాయని, కమ్యూనిస్టు భావజాలం చిరస్థాయిగా నిలిచే ఉంటుందని తెలిపారు. దేశభక్తులమని బీజేపీ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. సీపీఐ వందేళ్ల విజయోత్సవ మహాసభ ఖమ్మంలో ఐదు లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ తాము బలహీన పడిపోలేదని నాయకులు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో మోదీ ప్రభుత్వం హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తా నుంచి జెడ్పీ హైస్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జన నాట్యమండలి బృందం కళాకారులు ఆటపాటలతో ఆలరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ, సీపీ ఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి, మహాసభ ఆహ్వన సంఘం అధ్యక్షుడు ఖలిందర్ అలీఖాన్, నాయకులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, సుదర్శన్, లింగం రవి, లింగయ్య, చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్, వీరభద్రయ్య బొల్లం పూర్ణిమ, రేగుంట చంద్రకళ పాల్గొన్నారు. -
చినుకు రాలక.. మొలకెత్తలే..!
మంచిర్యాలఅగ్రికల్చర్: రుతుపవనాలు జిల్లాను తాకి రెండు వారాలు అవుతోంది. భారీ వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెలలో ముందస్తు వర్షాలు ఊరించడంతో 70 శాతం మంది పత్తి విత్తనాలు వేశారు. పొడి దుక్కిలో విత్తనాలు వేయడంతో భారీ వర్షాలు లేక కొన్నిచోట్ల మొలకెత్తలేదు. మొలిచిన మొక్కలుసైతం మండుతున్న ఎండలకు మాడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోమారు విత్తనాలు వేయక తప్పేలాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు బోర్లు, వందల మీటర్ల మేర నీటి పైపులు, స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తూ మొక్కలను కాపాడుకుంటున్నారు. మరికొంత మంది వర్షాలకోసం ఎదురుచూస్తూ విత్తనం వేయడం లేదు. వర్షాలు కురియాలని ఊరూరా గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. నిరాశలో రైతులు జిల్లా సాధారణ వర్షపాతం 111.7 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 34.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 69 శాతంలోటు నెలకొంది. జిల్లాలోని మూడు మండలాల్లో లోటు వర్షపాతం నెలకొనగా 15 మండలాల్లో 60 నుంచి 90 శాతం అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. మృగశిర కార్తె వెళ్లి ఆరుద్ర కార్తె ఆరంభమైంది. ఈ పాటికి జోరువర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి పొర్లుతుండాలి. చెరువులు కుంటలు, ప్రాజెక్టులలో కొత్తనీరు చేరి జలమట్టం క్రమేపి పెరుగుతుండాలి. పత్తి విత్తనాలు వేసుకోవడంతో పాటు వరినారు పోసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా ఎండలు మండుతున్నాయి. 38 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం మబ్బులు కమ్ముకుంటున్నా అక్కడక్కడ చిరుజల్లులకే పరిమితం అవుతోంది. ఈ ఏడాది వానాకాలం జిల్లాలో 3.33 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 86 వేల ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు విత్తుకున్నారు. ప్రస్తుతం 30 శాతం మాత్రమే పంటల విస్తీర్ణం ఉంది. ఆశించిన వర్షాలు కురిస్తే ఈ సమయానికి 1.50 లక్షల ఎకరాల వరకు పంటలు వేసుకునేవారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయని, సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. కానీ వర్షాల ఆలస్యంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో 69 శాతం లోటు వర్షం జూన్ 1 నుంచి 30 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 195.2 మిల్లిమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 34.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇది కూడా కొన్ని మండలాలకే పరిమితమైంది. 69 శాతం లోటుగా నెలకొంది. మృగశిర ఆరంభానికి ముందే ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసాయి. దీంతో కొంతమంది రైతులు పంటలు విత్తుకున్నారు. అనంతరం చినుకు లేక విత్తనం మొలక రాక నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల మొక్కలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. దీంతో ఖరీఫ్ సాగులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాలు వచ్చినా జాడలేని వాన రెండు వారాలుగా రైతుల ఎదురుచూపు 69 శాతం లోటు వర్షపాతం 70 శాతం పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు గ్రామ దేవతలకు పూజలు, కప్పతల్లి ఆటలు -
‘హైటెన్షన్ విద్యుత్ లైన్ తొలగించాలి’
నెన్నెల: మండలంలోని కొత్తూర్లో తమ ఇళ్లపై నుంచి వెళ్తున్న 11కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ తొలగించాలని లంబాడివాడ, పొడిషంవాడ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఐదురోజుల క్రితం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి ఇళ్లపై పడడంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టేందుకు వెళ్లిన సిబ్బందిని శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఏడీఈ రవికుమార్, డీఈ రాజన్న, ఏఈ ఎస్.రాజన్న, ఎస్సై ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్ నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
అడవి అలుగు స్వాధీనం
ఖానాపూర్: వేటగాళ్ల ఉచ్చుకు చిక్కిన అడవి అలుగును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 19న అడవి అలుగును వేటాడి క్రయ, విక్రయాలు చేస్తున్న ముఠా సంచరిస్తున్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే విచారణ చేపట్టి 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలో వేటాడి పట్టుకున్న అలుగును అటవీశాఖ కార్యాలయం వెనుకభాగంలో వదిలివెళ్లినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. శుక్రవారం అధికారులు.. అలుగును వదిలివెళ్లిన ప్రాంతంలోని నివాసాల్లో గాలించినా దొరలేదు. కాగా, ఇదివరకు అలుగును దాచినవారు తమపై కేసులు నమోదవుతాయనే భయంతో శనివారం ఉదయం ఫారెస్ట్ కార్యాలయం వెనుక భాగంలో వదిలివెళ్లారు. దీంతో అధికారులు అలుగును స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు పూర్తి వివరాలను ఆదివారం వెల్లడించనున్నట్లు ఎఫ్ఆర్వో కిరణ్ తెలిపారు. రెడ్ జట్టుపై యెల్లో జట్టు విజయం మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడిపేట్ బెటాలియన్లో శనివారం జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలను కమాండెంట్ వెంకటరాములు ప్రారంభించారు. యెల్లో, రెడ్ జట్లు 50 ఓవర్ల మ్యాచ్లో పాల్గొనగా, మొదట యెల్లో జట్టు బ్యాటింగ్ చేసి 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 75 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో బ్యాటింగ్కు వచ్చిన దర్శ్ అగర్వాల్ 80, ఎండీ అద్నాన్ 33 రన్స్ చేయడంతో 44.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్కు దిగిన రెడ్ జట్లు 50 ఓవర్లలో 179 పరుగులు చేసి ఓటమి పాలైంది. యెల్లో జట్టు బౌలర్లలో జి.చరణ్, డి.లక్ష్మణ్ మూడు వికెట్ల చొప్పున, రెడ్ జట్టు బౌలర్ జాదవ్ రాజ్, ఎండీ అనస్లు 4 వికెట్ల చొప్పున తీశారు. ఆటోబోల్తాకడెం: మండలంలోని అంబారిపేట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలు.. మండలంలోని పెద్దూర్కు చెందిన వర్దెల్లి రాజేందర్(రాయమల్లు), వర్దెల్లి మల్లేశ్, గుండారపు కృష్ణ ఆటోలో దస్తురాబాద్ నుంచి కడెం వైపు వస్తున్నారు. అంబారిపేట్ సమీపంలోని బ్రిడ్జి మూలమలుపు వద్ద ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని 108లో ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రాజేందర్ పరిస్థితి విషమించి మృతిచెందాడు. మల్లేశ్, కృష్ణను మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. -
ఢిల్లీలో శిక్షణకు నిర్మల్ ఉపాధ్యాయుడు
నిర్మల్ఖిల్లా/లోకేశ్వరం: జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలకనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మక సామర్థ్యాలను పెంపొందించేందుకు దోహదపడే ‘‘కళలు(తోలుబొమ్మలాట)–వాటి పాత్ర’’ అనే అంశంపై ఢిల్లీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. లోకేశ్వరం మండలం సేవాలాల్ తాండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్మల ప్రవీణ్కుమార్ శిక్షణకు హాజరుకానున్నారు. ఇదివరకే జిల్లా నుంచి ఉత్తమ బోధనా విధానాల అమలులో రాష్ట్రస్థాయికి ఎంపికై తన బెస్ట్ ప్రాక్టీసెస్ను గత ఏప్రిల్లో హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఎంఈవోల ఎదుట ప్రదర్శన ఇచ్చారు. జూలై 3 నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఎంపికచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రవీణ్కుమార్ ఒక్కరే ఎంపికయ్యారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ ఉత్తర్వులు వెలువరించారు. విద్యార్థులకు అర్థమయ్యే సృజనాత్మక అభ్యసన ప్రక్రియలో భాగంగా తోలుబొమ్మలాట, సాహిత్యం, నాటకం వంటి కళారూపాలను మిళితం చేసి విద్యార్థుల్లో కృత్యాధార సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ ఇవ్వనున్నారు. -
తీరని మందుల కొరత
శ్రీరాంపూర్: సింగరేణిలో మందుల కొరత తీరడం లేదు. రూ.కోట్ల లాభాలు గడిస్తున్న కంపెనీలో మందుల కొరత వెక్కిరిస్తోంది. కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్లో మరింత అధ్వానంగా ఉంది. రెండు నెలలుగా బీపీకి సరిపడా గోళీలు ఇవ్వకపోవడంతో జబ్బుల బారిన పడ్డవారు అవస్థలు పడుతున్నారు. మందుల కొనుగోలులో కార్పొరేట్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య ఏర్పడిందని కార్మిక సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీరాపూర్ ఏరియా పరిధిలో ప్రతీనెల 11 వేల మంది బీపీ మాత్రలు తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కార్మికులతోపాటు రిటైర్డు కార్మికులు, కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారు. మే నెలలో బీపీ, షుగర్ మందుల కొరత ఉండేది. షుగర్ మందుల కొరత తీరినా ప్రస్తుతం బీసీ గోళీల సమస్య అలాగే ఉంది. బీపీ ఉన్న వారిని ప్రతీనెల కంపెనీ దవాఖానాలో వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకున్న తర్వాత వారికి నెలకు సరిపడా మందులు ఇస్తారు. ప్రస్తుతం మందుల కొరత వల్ల కేవలం పది రోజులకు మాత్రమే ముందు ఇచ్చి పంపి తిరిగి రమన్నంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే 8 కాలనీ, నస్పూర్ కాలనీల్లో డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటి ద్వారా మందులు తీసుకుంటున్న కార్మికులు రెండునెలల నుంచి సరిపడా ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ కార్మికులు వారి స్వస్థలాల నుంచి మందుల కోసం ప్రతీ పది రోజులకోసారి రావడం ఇబ్బందిగా మారింది. బీపీ గోళీల కోసం అవస్థలు ఇబ్బంది పడుతున్న కార్మికులుఇబ్బంది పడుతున్నాం నాకు బీపీ, గుండె జబ్బు ఉంది. రెండు నెలల నుంచి మందులు సరిపడా ఇవ్వడం లేదు. ప్రతీనెల మూడు సార్లు మందుల కోసం ముల్కల్ల నుంచి ఇక్కడి ఆసుపత్రికి రావాల్సి వస్తుంది. ఇన్నిసార్లు రావడంతో ఇబ్బంది పడుతున్నాం. – డి.లింగయ్య, రిటైర్డ్ కార్మికుడు త్వరలో నెలకు సరిపడా ఇస్తాం కొన్నిరోజుల్లోనే సమస్య పరిష్కారమవుతుంది. ప్రస్తుతం బీపీ మందులు మాత్రమే కొరత ఉంది. మందులు లేవని ఎవరిని తిప్పి పంపడం లేదు. నెలకు ఇచ్చే మందులు పది రోజులకు ఇచ్చి పంపిస్తున్నాం. త్వరలోనే నెల మందులు ఇస్తాం. – పి.రమేశ్బాబు, డీవైసీఎంఓ -
కళాశాల విక్రయించి ఉడాయించిన యాజమాన్యం
● రూ.కోట్లు టోకరా..!? ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం సుమారు రూ.2కోట్లు టోకరా వేసి ఉడాయించడం చర్చనీయాంశంగా మారింది. అప్పులు ఇచ్చిన బాధితులు సుమారు 70మంది ఉండగా వీరిలో కొందరు న్యాయం కోసం శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాలలోని ప్రైవేటు కళాశాల యాజమాన్యం రిక్కల మహేందర్రెడ్డి కళాశాల, భవనం విక్రయించి వెళ్లిపోయాడని ఆరోపిస్తున్నారు. కళాశాల విద్యార్థుల సర్టిఫికేట్లు కళాశాలకు సంబంధం లేని అతడి స్నేహితుడు లక్సెట్టిపేటకు చెందిన ఓ ప్రైవేటు కళాశాల యజమానికి అప్పగించాడని పేర్కొంటున్నారు. సర్టిఫికేట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.6వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పై చదువులకు వెళ్లేందుకు టీసీ, సర్టిఫికేట్లు అవసరం ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక సీఐని సంప్రదించగా.. విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
‘పీఎం జన్మన్’తో పీవీటీజీల జీవితాలు మెరుగు
దండేపల్లి: పీవీటీజీల జీవితాలను మెరుగు పరి చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ మి షన్ను ప్రారంభించిందని డీటీడబ్ల్యూవో జనార్దన్ తెలిపారు. మండలంలోని లింగాపూర్ రైతువేదికలో శనివారం తోటీ కాలనీ గిరిజనులకు పీఎం జన్మన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ మిషన్ ద్వారా పీవీటీజీలకు పక్కా గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు, వసతి గృహా లు, వయోజన విద్య, పోషకాహారం వంటివి అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి●
● కలెక్టర్ కుమార్దీపక్మంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు విలువలతో కూ డిన నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్కుమార్ దీపక్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ బా లుర, బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించా రు. తరగతి గదులు, వంటశాలలు, ఆర్వో ప్లాంట్, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు, నా ణ్యత కలిగిన నిత్యావసరాలు వినియోగించాలన్నా రు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించా లని ఆదేశించారు. బడిబయట పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చే ర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, పద్మజా పాల్గొన్నారు. -
మహారాష్ట్ర నుంచి తరలిస్తున్న గంజాయి పట్టివేత
బెల్లంపల్లి: మహారాష్ట్రలో కొనుగోలు చేసి అక్రమంగా బెల్లంపల్లికి తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుని, ఆటోడ్రైవర్ను అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్సీఐ అఫ్జలుద్దిన్ కథనం ప్రకారం..బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన ఆటోడ్రైవర్ ఎస్.కే ముజ్జు మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆర్టీసీ బస్సులో వస్తున్నట్లు తెలుసుకుని కాల్టెక్స్ రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి మీద మాటువేశారు. ముజ్జు బస్సు దిగగానే టూటౌన్ ఎస్సై మహేందర్, పోలీసులు శనివారం తనిఖీ చేశారు. బ్యాగ్లో కిలో 78 గ్రాముల గంజాయి లభించింది. దీని విలువ రూ.26,950 ఉంటుందని అంచనా వేశారు. సదరు గంజాయిని స్వాధీనం చేసుకుని పంచనామా చేశారు. నిందితుడిపై టూటౌన్లో కేసు నమోదు చేసి కోర్టుకు పంపించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఒకరికి రిమాండ్
ఆదిలాబాద్రూరల్: ఇంటి స్థలాల ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఒకరికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ హుస్సేన్ తెలి పారు. మావల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన వకుళభర ణం ఆదినాథ్ ఆయన భార్య రజినిలు 2010లో మా వల స్టేషన్ పరిధిలోని శోభకు ఖానాపూర్ శివారులో ఫారెస్ట్ భూమిని తన పేరిట ఉందని నమ్మించి నా లుగు ప్లాట్లు విక్రయించారు. ఆ ప్లాట్లకు గాను రూ.3.30 లక్షలు తీసుకున్నారు. బాధితురాలికి విక్రయించిన ప్లాట్లను 2022లో ఫారెస్ట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయం బాధితురాలికి తెలిసింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇ వ్వాలని ఆదినాథ్, రజినిని కోరగా, కోర్టులో చూసుకోవాలని, మీకు నచ్చిన వారికి చెప్పుకోమని బెది రించారు. ఈనెల19న బాధితురాలు మావల పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆదినా థ్ను అరెస్టు చేయగా, భార్య రజిని పరారీలో ఉన్నా రు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సైలు ముజాహిద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్పై పడిన విద్యుత్ స్తంభం
● దస్నాపూర్ కాలనీలో ఘటన ● తండ్రికి స్వల్పగాయాలు..క్షేమంగా బయటపడిన కుమారుడు ఆదిలాబాద్రూరల్: విద్యుత్ స్తంభం బైక్పై పడిన ఘటనలో తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. మావల మండలం దస్నాపూర్ కాలనీలో శనివారం ఈ ఘ టన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ దెబ్బ తింది. విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి కథనం ప్రకారం.. దస్నాపూర్లోని తిరుమల పెట్రోల్ పంపు నుంచి దస్నాపూర్ కాలనీ మీదుగా కై లాస్నగర్ వరకు 33 కేవీ లింక్లైన్ విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి. దస్నాపూర్లో కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. ఆ సమయంలో విద్యుత్ శాఖ టౌన్ త్రీలో అసిస్టెంట్ లైన్మెన్గా పని చేస్తున్న అజ్మత్ తన కుమారుడిని పాఠశాల నుంచి బైక్పై తీసుకువస్తున్నాడు. పెట్రోల్ అయిపోవడంతో బైక్పై కుమారుడిని కూర్చొబెట్టుకుని ఓ గల్లీ గుంచి తోసుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలో కాంట్రాక్టర్, సిబ్బంది చెట్టుకొమ్మను తొలగిస్తున్నారు. స్తంభానికి కట్టి ఉన్న జియో కేబుల్పై చెట్టుకొమ్మ పడింది. దీంతో స్తంభం విరిగిపోయి బైక్పై పడింది. అజ్మత్కు స్వల్ప గాయాలయ్యాయి. కుమారుడికి క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.