Mancherial
-
26 ఏళ్ల తర్వాత సీఎం రావడం సంతోషంగా ఉంది
1983లో ఎన్టీఆర్ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రావడం ఆనందంగా ఉంది. బోథ్లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని మారుతినగర్కు చెందిన కారుకూరి సత్తయ్య(63) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి సత్తయ్య సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సాయంత్రం స్థానిక ఓ లిక్కర్ మార్ట్లో మద్యం సేవించి అక్కడే కుప్పకూలిపోయాడు. సిబ్బంది డయల్ 100కు సమాచారం అందించారు. పోలీసులు ప్రైవేటు అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే సత్తయ్య మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య సత్యలీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధుసూధన్రావు తెలిపారు. -
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదర స్వామి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేయాలని భీంపూర్ మండలం తాంసి కె గ్రామస్తులు, రికార్డు అసిస్టెంటు ఉద్యోగం ఇప్పించాలని ఉట్నూర్కు చెందిన మెస్రం కార్తీక్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదిలాబాద్కు చెందిన కుడిమెత శ్రీనివాస్ కోరారు. వివిధ ప్రాంతాల నుంచి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
అక్షరాభ్యాసం.. భూమిపూజ..
నిర్మల్/భైంసా/బాసర: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓ మహాత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. దేశంలోనే ఏకైక సరస్వతీక్షేత్రంగా విరాజిల్లుతున్న నిర్మల్ జిల్లా బాసరను భవ్యమందిరంగా, విశాలమైన కోవెలగా తీర్చిదిద్దేందుకు ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.225 కోట్లు మంజూరు చేయడమే కాకుండా సోమవారం స్వయంగా వచ్చి ఈ పనులకు భూమిపూజ చేశారు. రూ.200 కోట్లతో ముధోల్లో నిర్మించనున్న యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకూ ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఆలయం వరకే ముఖ్య మంత్రి పర్యటన పరిమితమైంది. లంచ్టైమ్లో జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పర్యాటక, అభివృద్ధి పనులపై చర్చించారు. మనుమడితో అక్షరాభ్యాసం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉదయం 11.42 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బాసర చేరుకున్నారు. సీఎం భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి, అల్లుడు సత్యరెడ్డి, మనుమడు రియాన్ష్ మరో హెలికాప్టర్లో 11.46 గంటలకు చేరుకున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎక్సైజ్, ప్రొహిబిషన్, పర్యాటకశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలకు హెలీపాడ్ వద్ద కలెక్టర్ అభిలాషఅభినవ్, ఎస్పీ జానకీషర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ఆలయంలో ప్రదక్షిణ చేశారు. అమ్మవారి ఎదుట అక్షరాభ్యాస పీఠం వద్ద వద్ద రేవంత్రెడ్డి దంపతులు తమ మనుమడు రియాన్ష్తో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం గర్భాలయంలో సరస్వతీ, మహాలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పైనున్న మహాంకాళీ అమ్మవారి వద్దకు వెళ్లి దర్శించుకున్నారు. వేదఆశ్వీరచన మండపంలో సీఎం కుటుంబాన్ని అర్చకులు ఆశీర్వదించారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఇన్చార్జి ఈవో విజయరామారావు తదితరులు జ్ఞాపికలు, కండువాలతో సన్మానించారు. లంచ్టైంలో మాటామంతి.. బాసర పర్యటనలో స్థానిక ఓ ప్రైవేటు రిసార్ట్లో లంచ్టైమ్లోనే సీఎం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను కలెక్టర్ అభిలాష అభినవ్ అందించగా, ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి అవశ్యకతను బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్కియాలజీ, టూరిజం అధికారులతో మాట్లాడుతామన్నారు. కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్తోపాటు మహిళ సంఘాలసభ్యులు తయారు చేసిన వరికుచ్చులను సీఎంకు జ్ఞాపికలుగా అందజేశారు.ఘనంగా భూమిపూజ.. బాసర ఆలయంలోని తూర్పు ద్వారం పక్కన పునరాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్తోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డి, ఎంపీలు నగేశ్, వేంనరేందర్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు సుదర్శన్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, డీసీసీ చీఫ్, ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్, ఎమ్మెల్సీలు దండె విఠల్, చిన్నమైల్ అంజిరెడ్డి, నిర్మల్, భైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్యగణేశ్చక్రవర్తి, తూమోల్ల దత్తాద్రి, బాసర సర్పంచ్ వెంకటేశ్గౌడ్, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణరావుపటేల్, రేఖానాయక్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తదితరులతో కలిసి భూమిపూజను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడే ముధోల్లో నిర్మించే యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ట్రిపుల్ఐటీ, యూనివర్సిటీ ఊసే లేదు.. సీఎం బాసర పర్యటనలో అందరూ ఊహించిన ట్రిపుల్ఐటీ విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ ఏర్పాటుపై ఎక్కడా చర్చ రాకపోవడం గమనార్హం. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్న ఆర్జీయూకేటీపై మాట్లాడుతారని, జనవరి 16న నిర్మల్సభలో ప్రకటించిన జ్ఞానసరస్వతీ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఆలయ అభివృద్ధి మినహా ఈ రెండు ప్రముఖ అంశాలకు సీఎం పర్యటనలో ప్రాధాన్యత దక్కకపోవడం నిర్మల్ జిల్లావాసులను నిరాశపర్చింది. -
గురుకులాలపై నిర్లక్ష్యం
చెన్నూర్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గతంలో చురుగ్గా పనిచేసిన పేరెంట్స్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రతీనెల రెండో శనివారం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేవారు. ఇలా చేయడం ద్వారా ఇటు విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండేది. విద్యార్థులు తప్పు చేస్తే ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ గతేడాది నుంచి చెన్నూర్ ప్రాంత గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో పది రోజుల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడు నెలల క్రితం బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రహరీ దూకి ఇద్దరు యువకులు లోపలికి వచ్చిన ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నూర్ పట్టణంలో గల గురుకుల పాఠశాలలో గతంలో పలు సంఘటనలు జరిగినా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడమేనా? గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడంతో రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది రాత్రి వేళ విధులు నిర్వహించినప్పటికి పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో ‘మాకేందుకులే’ అనే ధోరణి అవలంభిస్తున్నారని తెలిసింది. దీంతో కొంతమంది విద్యార్థులు ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకులాలకు అందుబాటులో ఉండి విద్యార్థులు గాడి తప్పకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా చేస్తే మార్పు రావచ్చు విద్యార్థుల మానసికస్థితిలో మార్పులు విద్యార్థుల మానసిక స్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మానసిక నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చెన్నూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి బాధాకరం. మరో విద్యార్థిని చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె సెఫ్గా ఉంది. చెన్నూర్ గురుకుల పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – రామకళ్యాణి, డీసీవో, మంచిర్యాల ఏడాదిగా సమావేశాల్లేవ్ గతంలో గురుకుల పాఠశాలలో ప్రతీనెల రెండో శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసేవారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం కమిటీపై అధికారుల నిర్లక్ష్యం పెరిగింది. పాఠశాలలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కమిటీలను పటిష్టం చేయాలి. సమావేశాలు ఏర్పాటు చేయాలి. – ఎన్.సారయ్య, పేరెంట్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి -
కాలుష్యం నియంత్రించాలని ఫిర్యాదు
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్ పరిసర ప్రాంతాలలో ఏర్పడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్లోని పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు సోమవారం పెగడపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ నిర్వహణతో గాలి, నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. యాష్ కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు తాగునీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర పరిశీలన జరిపి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇందులో దుస్స భాస్కర్, రాజా గౌడ్, రాజేందర్ రెడ్డి, ప్రభాకర్చారి తదితరులు ఉన్నారు. -
బోథ్ ఏరియా ఆస్పత్రి పరిశీలన
బోథ్: బోథ్ ఏరియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఫైనాన్స్ సెక్రెటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారం పరిశీలించారు. పిప్రిలో సీఎం సభ అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజనాల రవీంద్ర ప్రసాద్ విన్నపం మేరకు ఆస్పత్రిని పరిశీలించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతుల కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. దీనిపై డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా అన్ని వసతులతో ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మందుబాబుల వీరంగంమందమర్రిరూరల్: పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఎస్సై నరేష్ సంఘటన స్థలా నికి చేరుకుని నిందితులను పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రతీరోజు వైన్షాపుల వద్ద మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారని, పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెండు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, మూడు సబ్స్టేషన్లు, ఏటీసీ మంజూరు చేసి శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉంది. సీఎం అంటేనే రాష్ట్రానికి తండ్రిలాంటి వారు. గుర్తించి మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలి. బోథ్ను రెవెన్యూ డివిజన్గా చేయాలి. అలాగే రూ.345 కోట్లతో చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.40 కోట్లు ప్రకటించాలి. జందాపూర్–కరంజీ రోడ్డు పనులు పూర్తి చేయాలి. బోథ్లో డిగ్రీ కళాశాల, మినీస్టేడియం, సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరు చేయాలి. సిరిచెల్మ, భరంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. – అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్ -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో 20 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీవైఎస్వో హనుమంత రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27 నుంచి మే 1 వరకు హైదరాబాద్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి క్రీడా పాఠశాలల్లో ప్రవేశం ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థుల్లో పల్లెర్ల శేయష్, కొండ హరిహరన్, రాకం వేధాంత్, గాలిపెల్లి శివతేజ, రామంచ కృతిక్, దోమల గౌతమ్ రామ్, ఆరె శ్రీ సహస్, రాచర్ల అనురాగ్, మహమ్మద్ అర్హముద్దీన్, మేంగని అనిరుధ్, విద్యార్థినుల్లో బొమ్మెన అధ్విక, బొగురాల మాన్వి, కావేర తీఖ్షిత, రొడ్డ శాన్విక, చింతం సింధూజ, మలవత్ సాయి పల్లవి, సింగతి అక్షయ, కొడపర్తి లితాక్ష, బానోత్ హిమజ, ధరావత్ అక్షయ ఉన్నారు. సీఎం సభలో తప్పిపోయిన మహిళబజార్హత్నూర్: మండలంలోని పిప్రిలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగసభకు హాజరయైన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం బోరిగామకు చెందిన బత్తుల గంగూబాయి తప్పిపోయినట్లు ఎస్సై సంజయ్ కుమార్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8712659934, 9440619432 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
భీమారం/చెన్నూర్రూరల్: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. భీమారం మండల కేంద్రం, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ పాల్గొన్నారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, భీమారం మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకన్న, చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, బూత్ అద్యక్షుడు సింగారపు రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించాలి
ఆదిలాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన భుక్తాపూర్ కాలనీలో గల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు ఆడిగి సమాధానం రాబట్టారు. కంప్యూటర్ ల్యాబ్, వంట గదిని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. మెనూ అమలు తీరును అడగగా ఐటీడీఏ యాప్ ఏర్పాటు చేసి పకడ్బందీగా మెనూ అమలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. అనంతరం డార్మెట్రీ నిర్మాణ పనులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జుగా కింద మరో రూ.2 కోట్లు మంజురయ్యాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, సీఈ బాలు నాయక్, ఎస్ఈ ఫణికుమారి, ఈఈ తానాజీ, ఏటీడీవో నిహారిక, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట
నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్మెంట్తో పనిచేసే పార్టీ కాంగ్రెస్. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్కార్డులు, ఉచిత విద్యుత్ వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం. – బొమ్మ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ -
ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యతనివ్వాలి
నా జీవితంలో ఎంతోమంది సీఎంలను చూశాను. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది రేవంత్రెడ్డి ఒక్కరే. గోదావరి ఒడ్డున, గుట్టపై ఉన్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి రూ.75 కోట్లు కేటాయించాలి. ఆదివాసీలు కలిగిన ఉమ్మడి ఆదిలాబాద్కు ఎంత చేసినా తక్కువే. అభివృద్ధి పరంగా మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు ప్రాంతంలోని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి పునః ప్రారంభించాలి. – కొక్కిరాల ప్రేంసాగర్రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల -
ఆహార భద్రత అందరి బాధ్యత
మంచిర్యాలటౌన్: సురక్షితమైన ఆహారం ఆరోగ్యానికి ఆధారమని, ఆహార భద్రత అందరి బాధ్యత అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్య కార్యక్రమాల అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగాలు రాకుండా ఉంటుందని, తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుడ్ సేఫ్టి అధికారి మహేష్ వసురం, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత, ఆర్ఎంవో డాక్టర్ శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సీహెచ్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘ఎన్నికల పొత్తు ధర్మాన్ని పాటించాలి’
పాతమంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకున్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులు, గెలుపోటములపై పార్టీ నాయకులతో విశ్లేషణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించడంతో సీపీఐకి నష్టం జరిగిందని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో పొత్తు విషయమై చర్చలు జరిగినా స్థానిక నాయకత్వం పార్టీని అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం వల్ల అక్కడ బీఆర్ఎస్ గెలుపు అనివార్యమైందని తెలిపారు. బెల్లంపల్లిలో నామినేషన్ల వరకు పార్టీని మభ్యపెట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఓట్లు అవసరమైనప్పుడు పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత కమ్యూనిస్టులను విస్మరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ పొత్తును ప్రజలు హర్షించారని, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అన్నారు. కోల్బెల్ట్ ఏరియాలో సీపీఐకి బలమైన క్యాడర్ ఉందని, భవిష్యత్లోనైనా కాంగ్రెస్ పార్టీ మైత్రి సంబంధాలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, రాష్ట్ర సమితి సభ్యులు లింగయ్య, జిల్లా సమితి సభ్యులు పౌలు, దేవి పోచన్న, దుర్గారాజ్, కుంచాల శంకరయ్య పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కోటపల్లి/వేమనపల్లి: గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం ఆయన కోటపల్లి మండలం మల్లంపేట, వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం పరిశీలించారు. ప్రజాపాలన 99రోజుల ప్రణాళిక పనులు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడారు. మల్లంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలతో మాట్లాడారు. నీల్వాయిలో కేజీబీవీకి వెళ్లి భోజన వసతి, అదనపు గదుల నిర్మాణ పనుల వివరాలు తెలుసుకున్నారు. వేమనపల్లికి తొలిసారిగా వచ్చిన అదనపు కలెక్టర్ను డీఎల్పీవో సతీష్, సర్పంచ్ సమ్మయ్య శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో డీఎల్పీఓ సతీష్, వేమనపల్లి ఎంపీడీఓ కుమారస్వామి, ఎంపీఓ వెంకటేష్, ఎస్ఓ మయూరి, పంచాయతీ రాజ్ ఏఈ ప్రదీప్, హౌసింగ్ ఏఈ కార్తీక్, సర్పంచ్లు చెన్నూరి సమ్మయ్య, సర్పంచ్లు అలూరి సంపత్, తాళ్ల వెంకటమ్మ పాల్గొన్నారు. -
హెచ్ఎం, వార్డెన్కు మెమో
కాసిపేట: మండలంలోని మల్కేపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, వార్డెన్ దిన్దర్షాకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీవో) రమాదేవి మెమో జారీ చేశారు. మండలంలోని మల్కేపల్లి, దేవాపూర్, రేగులగూడ ఆశ్రమ పాఠశాలలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులపై అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూలో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్లు వడ్డించాల్సి ఉండగా వడ్డించలేదన్నారు. రేగులగూడ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, నెన్నెల మండలం కుశ్నపల్లిలో విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడంతో కుశ్నపల్లి హెచ్ఎం లచ్చన్న, ఏఎన్ఎంకు మెమో జారీ చేసినట్లు తెలిపారు. హెచ్ఎంలు గోపాల్, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్పులున్నా అభివృద్ధిని ఆపలేదు
ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పు చేశారు. ఇన్ని అప్పులున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని ఏ రోజూ ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే విమానాయశ్రయ పనులను ప్రారంభిస్తాం. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేయడంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడం సంతోషంగా ఉంది. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి -
విధులు నిర్వర్తిస్తూనే మృత్యు ఒడిలోకి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న కొత్తకొండ తిరుపతి(53) ఆదివారం ఉదయం విధులు నిర్వహిస్తూనే ఆకస్మికంగా మృతి చెందాడు. స్థానికులు, హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం మేరకు.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాళ్లపల్లికి చెందిన కొత్తకొండ తిరుపతి హా జీపూర్ ఎంపీపీ కార్యాలయంలో గత రెండేళ్లుగా నైట్ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఆది వారం విధి నిర్వహణలో ఉన్న తిరుపతి కార్యాలయ ఆవరణలో కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సత్తమ్మ, కుమారుడు సాయికుమార్, కుమార్తె శైలజ ఉన్నారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లక్ష్యానికి దూరంగా..!
శ్రీరాంపూర్ ఏరియా ముఖ ద్వారంశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియా గనులు వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. బుధవారంతో ఆర్థిక సంవత్సరం ముగియగా కంపెనీ గణంకాల ప్రకారం ఈసారి ఉత్పత్తి తక్కువ జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ గ నులు నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఓసీపీల్లో ఓబీ కాంట్రాక్ట్ సమస్యలు, కాలం చెల్లిన భూగర్భ గనుల్లో కొత్త సీమ్లు లేకపోవడం వెరసి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేనట్లు అధి కారులు పేర్కొంటున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియా లక్ష్యం 65,16,000 టన్నులకు గానూ 57,86,282 టన్నులు సాధించి 88.8 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. 2025–26 ఆర్థిక సంవత్సరం 65,16,000 టన్నులకు గానూ 44,06,291 టన్నులు సాధించి 68 శాతం లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ఇంత తక్కువలో నమోదు కావడంతో పదేళ్లలో ఇదే తొలిసారి. లక్ష్యానికి ఈ సారి ఇంకా 32 శాతం లోటు ఉంది. ఓబీ కాంట్రాక్టర్లే నిండా ముంచారు...శ్రీరాంపూర్లో మూతపడిన ఆర్కే 6 మినహా 6 భూ గర్భ గనులు, రెండు ఓసీపీలు నడుస్తున్నాయి. ఎ స్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీల్లో గడిచిన సంవత్సరం ఓబీ వెలికితీతలో తీవ్ర జాప్యం జరిగింది. కాంట్రాక్టర్లు ఓబీ మట్టి తీయకపోవడంతో దీని ప్ర భావం బొగ్గు ఉత్పత్తిపై పడింది. ఈ రెండు ఓసీపీల్లో కాంట్రాక్టర్లు పనులు చేయమని చేతులెత్తడంతో ఓబీ నిలిచిపోయి దాని ప్రభావం ఉత్పత్తిపై పడింది. ఏరియాలోని రెండు ఓసీపీల్లో ఓబీ తీయాల్సిన లక్ష్యంలో కేవలం 38 శాతమే నమోదైంది. దీంతో బొగ్గు తీయలేకపోయారు. అనంతరం కొత్త టెండ ర్లు పిలిచి వాటికి పనులు అప్పగించి మొదలు పెట్ట డం జాప్యం మూలంగా మరింత నష్టం జరిగింది. భూగర్భ గనుల్లో నామమాత్రమే..భూగర్భ గనుల్లో నిర్ధేశించిన లక్ష్యంలో 90 శాతమే సాధించారు. ఆరు గనుల్లో కేవలం ఆర్కే న్యూటెక్ గని, ఎస్సార్పీ 1 గనులు మాత్రమే నూరుశాతం ఉత్పత్తిని సాధించాయి. మిగిలిన అన్ని గనుల్లో నూరు శాతం లోపే ఉత్పత్తి జరిగింది. ఆర్కే 5 గని 96 శాతం, ఆర్కే 7 గని 95 శాతం, ఆర్కే న్యూటెక్ గని 113 శాతం, ఎస్సార్పీ 1 గని 103 శాతం, ఎస్సార్పీ 3, 3 ఏ గని 74 శాతం, ఐకే 1ఏ గని 81 శాతం, ఎస్సార్పీ ఓసీపీ 59 శాతం, ఐకే ఓసీపీ 66 శాతం ఉత్పత్తిని నమోదు చేసుకున్నాయి. ఎస్సార్పీ 1, ఆర్కే న్యూటెక్ గనుల్లో పని స్థలాలు లేవు. ఇటీవలే అధికారులు వాటి జీవితకాలం పెంచడానికి కొత్త సీమ్లను ప్రారంభించడంతోనే ఉత్పత్తి జరిగింది. -
మత్తు వదిలేలా..
మంచిర్యాలక్రైం: మాదక ద్రవ్యాలకు బానిసైన యువత భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు తెలంగాణలో యాంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (టీ న్యాబ్) సిబ్బంది తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. గంజాయి, నాటుసారా, గుడుంబా, మద్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్స్టేషన్లకు డ్రంకెన్ డ్రైవ్ తరహాలో బ్రీత్ ఎనలైజర్ మాదిరి డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్ కిట్లను అందజేశారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నారు. మత్తుకు బానిసైన వారికోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2024లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు డీ అడిక్షన్ సెంటర్లో గతేడాది 1000 మంది మత్తు బానిసత్వం నుంచి విముక్తి పొందారు. సగటున నెలకు 80 నుంచి 90 మంది వరకు చికిత్సకోసం వస్తుండగా వారిలో చాలా వరకు 15 నుండి 40 సంవత్సరాల వయస్సువారే అధికంగా ఉంటున్నారు. పైగా 90 మందిలో 20 శాతం విద్యార్థులే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల చెన్నూర్కు చెందిన బాలుడు (17) గంజాయికి బానిసైనట్లు గుర్తించిన సీఐ బన్సీలాల్ డీ అడిక్షన్ సెంటర్కు తరలించిన ఘటన ఆందోళన కలిగించింది. యువతను సన్మార్గంలో పెట్టేందుకు డీసీపీ ఎగ్గడి భాస్కర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మత్తుకు బానిసైన యువకుల జీవితాలను పాట రూపంలో రచించిన వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నార్కోటిక్ డాగ్తో తనిఖీలు యువతే లక్ష్యంగా గంజాయి స్మగ్లర్లు తమ వ్యాపారం విస్తరిస్తున్నారు. గంజాయి రవాణా, విక్రయాలు అడ్డుకునేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్తో తనిఖీలు చేపడుతున్నారు. ఇది సుమారు కిలో మీటర్ దూరం నుంచే గంజాయి వాసనను పసిగడుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు గంజాయి విక్రయించిన, సేవించిన 300ల మందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయితే వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్కు తరలించి ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సైక్రియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ మార్పు రాని వారిని హైదరాబాద్కు పంపించి చికిత్స అందించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. యువతరాన్ని కాపాడేందుకే... గంజాయి సేవించే వారిలో అధిక శాతం 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యువతరాన్ని కాపాడేందుకే గంజాయి, ఇతర డ్రగ్స్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో గంజాయి కేవలం పట్టణాలకే పరిమితం అయ్యేది. ప్రస్తుతం గ్రామాలకు సైతం పాకింది. యువతను మత్తునుంచి కాపాడేందుకు పోలీస్ శాఖ ప్రతీ జిల్లాలో నార్కోటిక్ టీమ్ను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతీ విద్యాసంస్థలో ప్రహరీ క్లబ్ ఏర్పాటు చేశారు. క్లబ్ సభ్యులు డ్రగ్స్ బారిన పడిని వారిని గుర్తించి డీ అడిక్షన్ సెంటర్కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ బారిన పడిన వారిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్లైన్ నంబర్లు 1908, 14416 అందుబాటులో ఉంచాయి.డ్రగ్స్కు బానిసైన వారి లక్షణాలు..డ్రగ్స్కు బానిసైన వారి జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. తొందరగా చికాకు పడతారు. చెప్పింది తొందరగా మర్చిపోతారు. మత్తులో విచక్షణ కోల్పోయి ఎంతకై నా తెగిస్తారు. మెడ, మోచేతులపై టాటు, నొసలు, చెవి, చేతులపై గాట్లు కలిగి ఉంటారు. వీరి చాతి పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. -
పోడు రైతు ఆత్మహత్యాయత్నం
చింతలమానెపల్లి: మండలంలోని గంగాపూర్ శివారులో పోడు భూముల స్వాధీనం వివాదాస్పదంగా మారింది. రైతు దుర్గం రాజేశ్వర్ ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పా ల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఖర్జెల్లి రేంజ్లోని బాలాజీ అనుకోడ సెక్షన్ బాబాపూర్ బీట్ గంగాపూర్ శివారులో గత కొద్ది రోజులుగా అటవీ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో గంగాపూర్ అటవీ నర్సరీ సమీపంలో కందకాల పనులు నిర్వహిస్తున్నారు. భూములు కోల్పోతున్న పలువురు రైతులు గత కొద్ది రోజులుగా అటవీ అధికారులను అడ్డుకుంటున్నారు. భూములు కోల్పోతున్న రైతు దుర్గం రాజేశ్వర్ శనివారం సాయంత్రం అటవీ అధికారులను సంప్రదించాడు. ఆక్రమణకు గురైన అటవీ భూమిని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని అటవీ అధికారులు తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో భూమిని కోల్పోతానని భావించిన రైతు రాజేశ్వర్ ఆదివారం ఉదయం కందకం తవ్వకాలు జరుగుతున్న చోట గడ్డిమందు సేవించాడు. అక్కడే ఉన్న పలువురు రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై జీవన్ అక్కడికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన రైతును పోలీసు వాహనంలో చికిత్స కోసం తరలించారు. రైతు రాజేశ్వర్ను కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినట్లుగా తెలుస్తోంది. భూముల స్వాధీనంపై ఖర్జెల్లి రేంజ్ అధికారి సుభాష్ను సంప్రదించగా ఈ బీట్లో 50హెక్టార్లలో కందకాలను గతంలోనే తవ్వామని, కొందరు వాటిని పూడ్చివేసి ఆక్రమించుకున్నారని తెలిపారు. అటవీ భూమి అయితేనే స్వాధనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
పూర్వ విద్యార్థులు మార్గదర్శకులు కావాలి
బెల్లంపల్లి: పాలిటెక్నిక్ విద్య చదువుతున్న కొత్త విద్యార్థులకు పూర్వ విద్యార్థులు మార్గదర్శకులు కావాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి (ఎస్బీటీఈటీ) సెక్రెటరీ ఈఆర్. పుల్లయ్య అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక విద్య విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తాను మైనింగ్ విభాగంలో విద్యార్థులకు విద్యాబోధన చేశానని గుర్తు చేశారు. కళాశాల అభివృద్ధికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు పుల్లయ్య పూర్వ విద్యార్థుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ను ఆవిష్కరించి వెబ్సైట్ను ప్రారంభించారు. కొత్తగా ఎన్నికై న పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వినోద్ కళాశాల అభివృద్దికి రూ.లక్ష విరాళం అందజేసి విద్యార్థులకు క్రీడాసామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రెస్టారెంట్లో కుళ్లిన చికెన్
● ఆందోళనకు దిగిన వినియోగదారులు ● సమాచారం ఇచ్చినా స్పందించని ఫుడ్ ఇన్స్పెక్టర్ మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లో కుళ్లిపోయిన చికెన్ పీసులు విక్రయించారని వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితులు కథనం ప్రకారం.. లక్ష్మణ్నాయక్ అనే వినియోగదారుడు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్కు వెళ్లాడు. చికెన్ లాలిపాప్ ఆర్డర్ చేశాడు. కొద్దిసమయం తర్వతా హోటల్ నిర్వాహకులు ఇచ్చిన చికెన్ లెగ్పీస్, లాలిపప్లు కుళ్లిపోయి ఉండడం చూసి లక్ష్మణ్నాయక్ అవాక్కయ్యాడు. వెంటనే హోటల్ నిర్వహకుడిని పిలిచి వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో లక్ష్మణ్నాయక్, హోటల్ యజమాని మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దిక్కున్న చోట చెప్పుకో అంటూ హోట ల్ యజమాని సమాధానం చెప్పడంతో వినియోగదారుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేశాడు. అయినా సదరు అధికారి స్పందించకపోవడంతో డయల్ 100కు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు. ఈ విషయమై ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా స్పందించలేదు. -
యువతను మత్తు నుంచి విడిపించమే లక్ష్యంగా...
గంజాయి, డ్రగ్స్ బారిన పడిన యువతను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణపై ప్రత్యేక దృష్టి సారించాం. నార్కోటిక్ టీమ్ పని చేస్తుంది. గంజాయి విక్రేతలు పద్ధతి మార్చుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. మారనివారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తున్నాం. ఇప్పటికే 300 మందిపై సస్పెక్ట్ షీట్ నమోదు చేశాం. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల మత్తుకు బానిస కావొద్దుయువత గంజాయి, మద్యం, గుడుంబా, ఇతర డ్రగ్స్కు బానిస కావొద్దు. మత్తులో నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. మత్తుకు బానిసైన వారిని డీ అడిక్షన్ సెంటర్కు తీసుకువస్తే ఉచితంగా వైద్యం అందిస్తాం. మానసిక వైద్యుల కోసం హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదు. మంచిర్యాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. – డాక్టర్ రామ్నాయక్, మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్, మంచిర్యాల -
నేటి ప్రజావాణి రద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రతీ సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి నేడు రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా బాసర, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిమంచిర్యాలటౌన్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు స్వలాభం, కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తుండగా బీజేపీ మాత్రం దేశ ప్రగతి కోసం పాటుపడుతుందన్నారు. నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతీ పోలింగ్ బూత్లో ఘనంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, ఆకుల అశోక్వర్దన్, వంగపల్లి వెంకటేశ్వర్గౌడ్, బెల్లంకొండ మురళి, కమలాకర్రావు, నాంపల్లి శ్రీనివాస్, బోయిని దేవేందర్, కొండ వెంకటేశ్, రెడ్డిమల్ల అశోక్, తరుణ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. బాల్క సుమన్, దివాకర్రావు హౌస్ అరెస్ట్ మంచిర్యాలటౌన్/రామకృష్ణాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావును ఆదివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. క్యాతనపల్లిలోని సుమన్ నివాసంలో మందమర్రి సీఐ రమేశ్, పట్టణ ఎస్సై శ్రీధర్, నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని, పోలీసులను ఉపయోగించి నిర్భంద పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మం, న్యాయం గెలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. -
‘ప్రభుత్వ విద్యావ్యవస్థ విధ్వంసం ఆపాలి’
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ప్రభుత్వ విద్యావ్యవస్థ విధ్వంసాన్ని ఆపాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వింత ధోరణితో విద్యారంగం ప్రస్తుతం విచిత్ర పరిస్థితుల్లో పయనిస్తోందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట ప్రజాధనాన్ని కొల్ల గొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో డీఈవోలు, 596 మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు లేరన్నారు. ఉపాధ్యాయుల డీఏ, పీఆర్సీల ఊసే లేకుండా పోయిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమన్నారాయణ, అశోక్, సంతోష్, గంగాధర్, శిల్ప, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన
మంచిర్యాలటౌన్: బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో సోమవారం జరుగనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆ దివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రే మ్సాగర్రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
107 మక్కల బస్తాలు చోరీ
కుంటాల: మండలంలోని కల్లూరు –కుంటాల అంతర్రాష్ట్ర రహదారిపై కొత్త వెంకూర్ సమీపంలో తూకం వేసి ఉంచిన 107 మక్కల బస్తాలు శనివారం రాత్రి చోరీకి గురయ్యాయి. మండలంలోని కొత్త వెంకూర్ గ్రామానికి చెందిన మగ్గిడి చిన్న నారాయణ తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. వారం క్రితం పంట కోసి ఆరబెట్టాడు. శనివారం రాత్రి పాత వెంకూర్ గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యాపారి దత్తు పటేల్కు మక్కలు విక్రయించాడు. బస్తా 55 కేజీల చొప్పున తూకం వేసిన 107 బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లి పోయారని రైతు వాపోయాడు. బస్తాలు చోరీ జరగడంతో రూ.1 లక్ష 42 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం ఎస్సై అశోక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
కోలిండియా పోటీల్లో రాణించాలి
శ్రీరాంపూర్: ఏరియా క్రీడాకారులు కోలిండియా పోటీల్లో రాణించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బీ.జనక్ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ గోదావరికాలనీలోని ప్రా ణహిత స్టేడియంలో ఆర్కే 7 గని కార్మికుల వన్డే క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు తమ క్రీడానైపుణ్యానికి పదునుపెట్టుకొని పోటీల్లో రాణించాలన్నారు. క్రీడాకారులకు యూనియన్ నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కంపెనీ క్రీడా దు స్తులు, స్పోర్ట్స్ మెటీరియల్ను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూని యన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు, కేంద్ర కమిటీ నాయకులు భీంరావు, కలవేని శ్యాం, గరిగే స్వామి, తిరుపతి, రాజు, ప్రవీణ్, జీవన్రావు, తదితరులు పాల్గొన్నారు. విన్నర్గా ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ఫైనల్ మ్యాచ్లో ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ టీం విన్నర్గా, రన్నర్గా సీ రిలే టీం నిలిచాయి. విజేతలకు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధూకర్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. -
‘స్టడీ అవర్స్’కు అంతర్జాతీయ గుర్తింపు
బాసర: ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి, రెండో సంవత్సరాల విద్యార్థుల అకాడమిక్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రారంభించిన ‘స్టడీ అ వర్స్’ కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు, అవార్డులను సొంతం చేసుకుంది. నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ బుక్ ఆఫ్ వర ల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ ఎక్సలెన్స్, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ ఎడ్యుకేషని స్ట్ అవార్డులు వరించాయి. అంతర్జాతీయ పత్రిక ‘యూకే మిర్రర్’ మొదటి పేజీలో ఆర్జీయూకేటీ ముఖచిత్రం ప్రచురించడంతో పాటు స్టడీ అవర్స్పై ప్రత్యేక కథనం ఇచ్చింది. వైస్ చాన్స్లర్ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, క్రమశిక్షణతో పాటు ఉద్యోగుల పర్యవేక్షణ, శ్రమ కారణమన్నారు. -
సమ సమాజ స్థాపనకు కృషి చేయాలి
శ్రీరాంపూర్: సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుద్ధవనం ప్రాజెక్టు అధికారి, సీడీఎస్ చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఇటీవల సుబ్రహ్మణ్యం, బోధివర్ధన్ అవార్డులు అందుకున్న ఆయనతో పాటు మాతా రమాబాయి అవార్డు అందుకున్న ఆయన సతీమణి మల్లేపల్లి జయకు ఆదివారం సీసీసీలోని సింగరేణి గెస్టుహౌజ్ సమావేశ మందిరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజల జీవనం కష్టతరంగా మారిందన్నారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, బీసీ లైజన్ అధికారి, ఏరియా ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, దళిత్ బహుజన ఫ్రంట్ ఫౌండర్ వినయ్కుమార్, సీఐ ప్రవీణ్కుమార్, సింగరేణి అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, నిర్వాహక కమిటీ కన్వీనర్ గోషిక మల్లేశ్, నాయకులు నాగేశ్వర్రావు, సమ్మయ్య, శ్రీనివాస్, సంపత్, లక్ష్మణ్, బుచ్చయ్య, రవి, ప్రవీణ్, శ్యాం, రాజేశ్, కుమార్, అధికారులు ఆనంద్కుమార్, గుండె రావు పాల్గొన్నారు. -
మహనీయుని ఆశయసాధనకు కృషి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్రావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 27 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. సామాజిక సమానత్వం కో సం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగించిన రాజకీయ, సామాజిక వి ప్లవ యోధుడన్నారు. ఉప ప్రధానమంత్రిగా, రక్షణ, వ్యవసాయ, కార్మిక, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్, ఉపాధి, పునరావాసం, ఆహార, రక్షణ, నీటిపారుదల శాఖ, కేంద్ర కేబినెట్ మంత్రిగా 30 ఏళ్ల పాటు పలు సేవలు అందించారన్నారు. 100 సంవత్సరాల తర్వాత పరిస్థితులను ముందే గ్రహించి రచించిన పుస్తకాలతో ప్రజలతో చైతన్యం తీసుకవచ్చారన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారులు భాగ్యవతి, దుర్గాప్రసాద్, నగర మేయర్ ధరణి మధుకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయంమంచిర్యాలక్రైం: భారత ఉప ప్రధాన మంత్రిగా బా బు జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కొనియాడారు. ఆదివారం కమిషనరేట్ ప్రాంగణంలో బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోను, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆధునిక భారత నిర్మాణంలోనూ ఆయన స్ఫూర్తిదాయకమైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఏసీపీ నాగేందర్ గౌడ్, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
మందమర్రిరూరల్: మందమర్రి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు నుంచి ఓ వ్యక్తి కింద పడగా తలకు తీవ్ర గాయలై మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జస్పాల్సింగ్ ఆదివారం తెలిపారు. మృతుని వద్ద హైదరాబాద్ నుంచి పందుర్ణ (మధ్యప్రదేశ్) ప్రయాణపు టికెట్ ఉందని, మిలిటరీ కలర్ షర్ట్, సిమెంట్ కలర్ లోయర్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. చేతిపై జైశ్రీరామ్ రబ్బర్ బ్యాండు, కుడి చేతిపై మై లవ్ ఎం అని టాటూ ఉందని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు ఎస్సై (జీఆర్పీ) 8712658596, జస్పాల్సింగ్ హెడ్ కానిస్టేబుల్ 98490 58691నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చికిత్స పొందుతూ మృతి లింగాపూర్: మండలంలోని ఏల్లాపటార్ గ్రామ పంచాయతీలోని రాముగూడ కాలనీకి చెందిన ఆత్రం అక్బర్షా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై గంగన్న తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధిహామీ పనికి వెళ్లాడు. ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలు కావడంతో జైనూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం వాంతులు, వీరేచనాలు ఎక్కువై మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అనారోగ్యం బారిన కుటుంబం.. ఆత్రం అక్బర్షా భార్య, కుమారులు, కుమార్తె కూ డా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆదివారం గ్రామంలో డిప్యూటీ డీఎంహెచ్వో నాగేంద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఆత్రం అక్బర్షా మృతికి కలుషిత ఆహారమే కారణమని నిర్ధారించారు. అతని కుటుంబ సభ్యులను జైనూర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. వైద్య శిబిరంలో డాక్టర్ మురళీకృష్ణ, సూపర్వైజర్ దత్తారాం ఉన్నారు. కోడి పందేల స్థావరంపై దాడులుదహెగాం: మండలంలోని ఐనం గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం దాడులు చేసినట్లు ఎస్సై సీహెచ్ రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం సిబ్బందితో కలిసి స్థావరంపై దాడి చేసి నలుగురు నిందితులతో పాటు నాలుగు కోడి పుంజులు, రెండు కత్తులు, రూ.7,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వెల్ములే దిలీప్, తక్కల్ల సంజీవ్, రాములు, కోట పోశంలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతదహెగాం: మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగు నుంచి అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై ీసీహెచ్ రమేశ్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన పణ్యాల శ్రీనివాస్కు చెందిన ట్రాక్టర్లో డ్రైవర్ చప్పిడి దామోదర్ ఇసుక తరలిస్తున్నందున పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి డ్రైవర్ దామోదర్, ఓనర్ శ్రీనివాస్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పిడుగుపాటుతో ఒకరికి గాయాలుకౌటాల: బెజ్జూర్ మండలంలో ఆదివారం వేకువజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పోతేపల్లి గ్రామానికి చెందిన డోకి సంజీవ్ తన ఇటుకల బట్టీపై కవర్ కప్పడానికి వెళ్లగా పిడుగు పడడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి బెజ్జూర్ పీహెచ్సీకి, మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈదురు గాలులతో అందుగులగూడ గ్రామంలోని ఐదు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బెజ్జూర్ –కౌటాల ప్రధాన రహదారిపై పలు చోట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. -
తెరుచుకోని డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం
మంచిర్యాల జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం అటెండర్ కూడా లేకపోవడంతో అతను కార్యాలయానికి వచ్చినప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. సిబ్బంది లేకపోవడం, తనిఖీలు, ఇతర కేసులకు సంబంధించి వెళ్లాల్సి వస్తుండడంతో కార్యాలయం ఎప్పుడో గానీ తెరుచుకోవడం లేదు. ఏదైనా ఫిర్యాదు చేసేందుకు బాధితులు కార్యాలయానికి వెళ్తే తాళం వేసి ఉంటోంది. దీంతో బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంగాక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన ఔషధ నియంత్రణ కార్యాలయంలో సరిపడా సిబ్బందిని నియమించాలన్న డిమాండ్ పెరుగుతోంది. -
అనుమతులు ఒకరివి.. నిర్వహణ మరొకరిది
మెడికల్ షాపు నిర్వహించేందుకు బీ ఫార్మసి/ఎం ఫార్మసి పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. షాపుల అనుమతుల కోసం సంబంధిత ఫార్మాసిస్టుల సర్టిఫికెట్లతో పాటు, వ్యక్తిగత గుర్తింపు కార్డు, చిరునామా వంటి వివరాలతో డ్రగ్ ఇన్స్పెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చిన తరువాతే షాపులు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ అనుమతుల సమయంలో ఫార్మాసిస్టుల ధ్రువీకరణ పత్రాలను పెట్టి, షాపు ప్రారంభించిన తరువాత ఫార్మాసిస్టులు లేకుండానే కొందరు మందులు విక్రయిస్తున్నారు. ఫార్మాసిస్టుల పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా, అవేం లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు వారి ప్రాథమిక చికిత్స కేంద్రం వద్దనే ఇతరుల పేరిట మెడికల్ షాపు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. మంచిర్యాలటౌన్: జిల్లాలోని మెడికల్ దుకాణాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రజలు ఆరోగ్య సమస్య ఏదైనా సరే వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి, సమస్యను చెప్పి నిర్వాహకులు ఇచ్చిన మాత్రలు తెచ్చుకుంటున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్తో సంబంధం లేకుండా యాంటిబయాటిక్స్ మందులు సైతం అందిస్తున్నారు. జబ్బు నయం కాని పక్షంలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదిస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో ఇచ్చే మందులతో అప్పటికప్పుడు జబ్బు తగ్గినా, దీర్ఘకాలికంగా దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా షెడ్యూల్ హెచ్, హెచ్ 1 మందులను అమ్మేందుకు వీలు లేదు. ఆ మేరకు రికార్డులు కూడా నిర్వహించి, బి ల్లుల నిర్వహణ కూడా ఉండాలి. గడువు ముగిసిన మందులను షాపుల్లో ఉంచడం, అమ్మడం చేయవద్దు. జిల్లాలో దాదాపుగా 600లకు పైగా మెడికల్ షాపులు నిర్వహిస్తుండగా, ఇందులో చాలా షాపుల్లో నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ఔషధ నియంత్రణ, వాటి నాణ్యతా ప్రమాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లే చూడాల్సి ఉంటుంది. ఇష్టారీతిన అమ్మకాలు జిల్లాలోని కొన్ని మెడికల్ షాపుల్లో ఎమ్మార్పీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ప్రకటిస్తుండడంతో వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్తో ఆయా మెడికల్ షాపులకు వెళ్తున్నారు. నిర్వాహకులకు డాక్టర్లు రాసే మందులు అర్థం కాకున్నా, వారికి అర్థమైన వాటిని అందిస్తున్నారు. దీంతో వైద్యులు సూచించే మందులు ఒకటైతే వారు ఇచ్చే మందులు వేరేగా ఉంటున్నా యి. కొన్ని షాపుల్లో శాంపిల్స్గా ఇచ్చిన మందులను అమాయకులకు కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. శాంపిల్, నాణ్యతలేని మందులను రోగులకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. మందులు కొనుగోలు చేస్తే ఎంతవుతుందో లెక్క వేసి డబ్బులు తీసుకుంటుండగా, ఏ మందు ఎంత ధరకు అమ్ముతున్నారనే విషయాన్ని కొనుగోలుదారులకు చెప్పడం లేదు. కొన్న మందులకు బిల్లులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నా రు. కొన్ని మెడికల్ దుకాణాల్లో మాత్రమే మందుల వివరాలతో కూడిన బిల్లులు ఇస్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు యాంటిబయాటిక్ మందులను అమ్మాల్సి ఉండగా, అలాంటివేం పట్టించుకోకుండానే ప్రజల కు మందులు అమ్ముతున్నారు. యాంటిబయాటిక్ మందులను ఇష్టారీతిన వాడితే సైడ్ ఎఫెక్ట్స్తో కొత్త జబ్బుల బారిన పడే ప్రమాదం ఉన్నా దుకాణదారులు అవేం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
నేడు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటన
భైంసా/బాసర/కై లాస్నగర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా బాసర, ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో పర్యటించనున్నారు. మొదట బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.225 కోట్లతో చేపట్లే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహనం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు
చెన్నూర్: పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ముందస్తు సమాచారం, అనుమతులు లేకుండా గుంపుగా చేరి ప్రజారవాణాకు ఆటంకం కలిగించడం, దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్వీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.బీఆర్ఎస్వీ నాయకులు బడికెల శ్రావణ్, నాయబ్, శ్రీనివాస్, నవీన్, సంపత్, శివ, మహేందర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేక, ప్రజాశాంతికి భంగం కల్గించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. -
గిరిజన గ్రామాల్లో పర్యటించిన డిప్యూటీ కలెక్టర్లు
ఉట్నూర్రూరల్: గిరిజన గ్రామాల్లో పర్యటించి గిరిజనుల జీవన స్థితిగతులను పరిశీలిస్తున్న డిప్యూటీ కలెక్టర్ల బృందం సభ్యులు శనివారం పీఎంఆర్సీలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉట్నూర్ మండలంలోని కామాయిపేటలో పర్యటించారు. కొలాం గిరిజనులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్, వర్షాకాలంలో ఎదుర్కొనే రవాణా సౌకర్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి జన్ మన్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా గిరిజనులకు అందుతున్న లబ్ధి వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు పరిశీలించారు. పీవీటీజీ కొలాం గిరిజన విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలకు రక్తహీనతను తగ్గించిన పోషక విలువ గల మోవలడ్డు ఆదివాసి ఆహారం పరిశ్రమను సందర్శించి, మోవలడ్డు రుచి చేసి చాలా బాగుందని నిర్వాహకులను అభినందించి, కొనుగోలు చేశారు. -
మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 63శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
నస్పూర్: నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజురుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కృషి చేస్తున్నారని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శనివారం ఆయన డిప్యూటీ మేయర్ సల్ల రమ్యతో కలిసి 24వ డివిజన్లోని సింగపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో అట్కపురం తిరుమల, రాజేశం ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొడ్డు స్వప్న, సిబ్బంది శీపతి సురేష్, నాయకులు బొడ్డు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
● ఆశలు రేపి రాలిన పూత ● అకాల వర్షాలతో నేలపాలైన పిందెలు, కాయలు ● పూత, పిందె లేక రైతుల దిగులు
బెల్లంపల్లి: మామిడితోటలకు జిల్లా ఎంతగానో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో ప్రతియేటా రూ.200కోట్లకు పైగా మామిడికాయల వ్యాపారం జరుగుతోంది. ప్రకృతి ప్రభావంతో ఈసారి మామిడికాయల దిగుబడి గణనీయంగా పడిపోయి వ్యాపారంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఏటా ఉగాది పర్వదినం నాటికి ఓ మోస్తారు పరిమాణానికి వచ్చిన మామిడికాయలు మార్కెట్ను ముంచెత్తాల్సి ఉన్నా కనీసం కనిపించకుండా పోయాయి. ఉగాది పచ్చడికీ మామిడికాయల కొరత ఏర్పడిందంటే కాపు ఎంతగా పడిపోయిందో ఊహించుకోవచ్చు. వరుసగా గత రెండేళ్ల నుంచి మామిడికాయల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడం లేదు. కనీసం ఈసారైనా కాలం కలిసి వస్తుందనే ఆశతో ఉన్న మామిడితోటల రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. చెట్లకు ఈ దఫా పూత విరబూసినప్పటికీ చీడపీడలు ఆశించి 90శాతం వరకు రాలిపోగా, కొద్దిపాటిగా నిలిచిన పూత పిందె దశకు చేరగానే అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ముఖం చాటేసిన నాగ్పూర్ వ్యాపారులు సాధారణంగా మామిడిచెట్లకు పూత వచ్చే క్రమంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ బడా వ్యాపారులు, దళారులు వచ్చి మామిడి తోటలోని పూత ఆధారంగా లీజు ఒప్పందం చేసుకోవడం దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పూత భారీగా వచ్చి వెంటనే రాలిపోవడంతో వ్యాపారులు ఇటు వైపు రాలేదు. కనీసం వ్యాపారుల గుమాస్తాలు, దళారులు సందర్శించలేదు. పూతను అంచనా వేసి రైతులతో ఒప్పందం చేసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడాన్ని పరిశీలిస్తే దిగుబడి దుస్థితికి అద్దం పడుతోంది. కొందరు స్థానిక చిరు వ్యాపారులు కొంత మొత్తం చెల్లించి ఒప్పందం చేసుకున్నా కాత లేక తోటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. సన్నగిల్లుతున్న ఆశలు మామిడి తోటలను నమ్ముకున్న రైతులు ఏటా ఏదో ఒక తీరుగా నష్టపోతున్నా రు. ఓసారి కాలం కలిసిరాక, మరో ఏడాది మద్దతు ధర లేక.. ఇంకోసారి నాగ్పూర్ బడా వ్యాపారుల నయవంచనతో గి ట్టుబాటు ధర రాక ని లువుదోపిడీకి గురవుతున్నారు. జిల్లాలో సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. కోల్డ్ స్టోరేజీలు లే కపోవడం ప్రధాన స మస్యగా ఉంది. గతేడాది బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో ఏదో మొక్కుబడిగా అమ్మకాలు జరిగాయి. కా నీ రైతులు మద్దతు ధరకు నోచుకోలేక పోయారు. ఇన్ని రకా ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా తోటలపై ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాపు కానరాని మామిడి తోట వెలవెలమామిడి చెట్లకు పూత నిలిచి కాత వస్తే ఎకరాకు గరిష్టంగా 3నుంచి 4టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఎకరాకు టన్ను కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో అత్యధికంగా భీమారం, జైపూర్, నెన్నెల, మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి, తాండూర్, హాజీపూర్ మండలాల్లో మామిడితోటలు విస్తరించి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 15,475 ఎకరాల్లో మామిడితోటల పెంపకం ఉండగా.. బేరింగ్ ఏరియాలో 13వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. నాన్బేరింగ్ ఏరియా పరిధిలో 2,475 ఎకరాల్లో తోటలు ఉన్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో బంగెనపల్లి, దశేరి, హిమాయత్, తోతపురి, నీలం తదితర రకాల మామిడి తోటలు ఉన్నాయి. -
పేదింట ‘న్యాయ’ పరిమళం
● జడ్జిగా ఎంపికై న లిఖిత ● తండ్రి తోపుడు బండి వ్యాపారి శ్రీరాంపూర్: ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని కష్టపడి చదివితే సాధించవచ్చని శ్రీరాంపూర్ ఏరియా అరుణక్కనగర్కు చెందిన ఏకారి లిఖిత నిరూపించారు. ఇటీవల న్యాయశాఖ వెల్లడించిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఏకారి వెంకటేశ్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు లిఖిత చిన్నప్పటి నుంచీ చదువులో ముందుంటోంది. పదో తరగతి వరకు స్థానిక ప్రైవేటు పాఠశాలలో, హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలోని కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్ఎల్బీ చేసి ప్రస్తుతం ఎల్ఎల్ఎం చదువుతోంది. నల్లకోటు ధరించి న్యాయమూర్తిగా నిలువాలనే లక్ష్యంతో కష్టపడి చదివి జడ్జి పరీక్ష రాసి ఎంపికై ంది. తండ్రి వెంకటేశ్ సీసీసీ కార్నర్లో తోపుడు బండిపై పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలైన కూడా వారిని బాగా చదివించి ఉన్నత స్థాయిలో నిలుపాలనే తన ఆకాంక్షను పెద్ద కూతురు నెరవేర్చడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివినట్లు లిఖిత పేర్కొంది. ఈ సందర్భంగా లిఖితకు స్థానిక మాజీ కౌన్సిలర్ మేకల దాసు, నాయకులు అభినందనలు తెలిపారు. -
‘కారుణ్యం’పై విచారణ జరిపిస్తే సమ్మె
శ్రీరాంపూర్: సింగరేణిలో కారుణ్య నియామకాలపై ఏసీబీ విచారణ జరిపిస్తే సమ్మె చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యజమాన్యాన్ని హెచ్చరించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డులో అవినీతి జరిగిందనే సాకుతో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓబీల్లో ఎక్సెస్ టెండర్లు వేసిన కాంట్రాక్ట్ సంస్థలపై చర్య తీసుకోవాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం 63 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే అదనంగా మరో 6 మిలియన్ టన్నులు తప్పుడు లెక్కలు చూపిన అధికారులపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని కార్మికులకు వేతనాలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవన్నారు. ఈ స్థితికి కారణమైన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు నాయకులు నర్సింగరావు, సదానందం, జీవీ రావు, రాజ్కుమార్, చిలక రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ ఏరియాలో నివాసముంటున్న తౌటి సురేష్ (37) కొంతకాలంగా పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున అతని భార్య మమత ఏదైనా పనికి వెళ్లమని చెప్పడంతో ఆమెతో గొడవపడ్డాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి అద్దెకు ఉంటున్న భవనం మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని సోదరుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు. పురుగుల మందు తాగి ఒకరు.. భీమిని: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఖర్జిభీంపూర్లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కారెంగుల రవీందర్ (34) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలో శనివారం పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య శ్రీవిద్య, కుమారుడు విష్ణు ఉన్నారు. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. వివాహం కావడం లేదని యువకుడు.. కౌటాల: వివాహం కావడంలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు కౌటాలకు చెందిన దుర్గం కిరణ్ (36) శనివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గ్రామ సమీపంలోని వ్యవసాయ చేనులో మృతదేహాన్ని గుర్తించారు. పెళ్లి కావడంలేదని మానసిక ఒత్తిడికి గురై గుర్తు తెలియని విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతునికి తండ్రి, ఇద్దరు సోదరులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బ్రాంచ్ పోస్ట్మాస్టర్ రిమాండ్
తలమడుగు: తపాలా శాఖకు చెందిన నిధులను దుర్వినియోగం చేసిన ఘటనలో బ్రాంచ్ పోస్ట్మాస్టర్ను శనివారం రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ కే.ఫణిదర్ తెలిపారు. మండలంలోని రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం రూ.2,12,033 తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడన్నారు. పోస్టల్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులకు గాయాలు వేమనపల్లి: మండలంలోని నీల్వాయి కొత్తగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులకు తీవ్ర గాయాల్యయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చల్ల కుమార్ తన తల్లి లచ్చక్కతో కలిసి శనివారం కోటపల్లి మండలం నాగంపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. నీల్వాయి కొత్తగూడెం సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెన్నూర్ మండలం నారాయణపూర్కు చెందిన ఆత్రం ప్రశాంత్ మద్యంమత్తులో అజాగ్రత్తగా కారు నడిపి మోటార్సైకిల్ను ఢీకొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుమార్, లచ్చక్కలకు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్లో మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరో ప్రమాదంలో..మండలంలోని కల్మలపేట చర్చి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారుసైకిళ్లు ఢీకొనడంతో ముల్కలపేటకు చెందిన డోలె అశోక్, నీల్వాయికి చెందిన శంకర్, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఏఎస్సై అమానుల్లాఖాన్ తెలిపారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారని, ఫిర్యాదు అందలేదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు లింగాపూర్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సిర్పూర్(యు) మండలంలోని రుద్రకాసకు చెందిన ఆత్రం భీంరావ్, లక్ష్మణ్, శంకర్ శనివారం ద్విచక్ర వాహనంపై ఆసిఫాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా జైనూర్ మండలంలోని జామ్ని గ్రామ సమీపంలో అడవిపంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను జైనూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పైలట్ కొమురయ్య, టెక్నీషియన్ రజనీకాంత్ తెలిపారు. -
నేత్రపర్వంగా వీరహనుమాన్ విజయయాత్ర
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రం మంచిర్యాలలో హనుమాన్ నినాదం మార్మోగింది. శనివారం రాత్రి బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నేత్రపర్వంగా సాగింది. నగర వీధుల గుండా సాగిన ర్యాలీలో పార్టీలకతీతంగా యువకులు, మహిళలు పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు. ఐబీ చౌరస్తా హనుమాన్ విగ్రహం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర వెంకటేశ్వర టాకీస్, ముఖరాం చౌరస్తా మీదుగా సాగింది. మహిళలు కోలాట ప్రదర్శనలు, యువకులు నృత్యాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నగర ధర్ని మేయర్ ఽమధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
రీల్స్.. ఫొటోలకు
బహుమతి యోగంనిర్మల్ఖిల్లా: యువతకు రీల్స్, ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రీల్స్, ఫొటోగ్రఫీలో తమ సృజనాత్మకతకు పదును పెట్టాలంటూ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యోగా ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొంటున్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. యోగా ప్రాధాన్యతను తెలిపేలా ఫొటోగ్రఫీ, రీల్స్ రూపొందించే చక్కని అవకాశం కల్పించింది. ఇందులో యువత, సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ అవకాశం కల్పిస్తున్నాయి. యోగా ప్రాధాన్యతపై రీల్స్...అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా యోగా ప్రేమికులకు ప్రత్యేక అవకా శం కల్పిస్తున్నాయి. ‘యోగా మై ప్రైడ్’ కార్యక్రమంలో భాగంగా క్రియేటివ్ యోగా రీల్స్ రూపొందించాలని సూచిస్తున్నాయి. ఈ పోటీ ద్వారా యోగా సాధన, ఆసనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత వంటి అంశాలను సృజనాత్మకంగా ప్ర జలకు చేరవేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. యువతతో పాటు అన్ని వయస్సుల వారు తమ ప్ర తిభను ప్రదర్శించి ఆరోగ్యకర జీవనశైలిపై అవగా హన పెంచేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. ఫొటోగ్రఫీలోనూ...కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ‘యోగా మై ప్రైడ్–2026’ ఫొటోగ్రఫీ పోటీలకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. యోగా ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీ నిర్వహించబడుతోంది. ఏప్రిల్ 20 వరకు ఎంట్రీలు స్వీకరించనున్నారు. అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చు. మహిళలు, పురుషులు వేర్వేరు విభాగాల్లో యువత (18 సంవత్సరాల లోపు), పెద్దలు (18 పైబడిన వారు), యోగా ప్రొఫెషనల్స్గా మూడు కేటగిరీలుగా పాల్గొనే అవకాశం ఉంది. ప్రతీ కేటగిరీలో ప్రథమ బహుమతి రూ.75 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.25వేల నగదు బహుమతులు అందజేయనున్నారు. పాల్గొనదలచిన వారు తమ యోగాసనంతో కూడిన ఫొటోను, 15 పదాలకు మించని స్లోగన్తో అప్లోడ్ చేయాలి. ఫొటోలు జేపీజీ ఫార్మాట్లో 2ఎంబీ లోపే ఉండాలి. ఒక వ్యక్తి ఒకే కేటగిరీలో ఒకఫొటో మాత్రమే పంపించాలి. మరిన్ని వివరాలకు వెబ్పోర్టల్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. పాల్గొనేవారికి మార్గదర్శకాలుపోటీలో పాల్గొనేవారు కనిష్టంగా 60 సెకన్ల నుంచి గరిష్టంగా 90 సెకన్ల వ్యవధిలో యోగా రీల్స్ రూపొందించాలి. వీడియోలు ఎంపీ4 ఫార్మాట్లో, పోర్టైడ్ మోడ్ (9:16)లో, ఉన్నత నాణ్యతతో ఉండాలి. పంపే కంటెంట్ పూర్తిగా స్వయం సృష్టిగా ఉండాలి. తమ వీడియో లింకును www.m ygov.i n పోర్టల్లో సమర్పించాలి. వీడియోలు గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ లేదా ఇన్స్ట్రాగామ్ వంటి ప్లాట్ఫార్మ్లలో పబ్లిక్గా అందుబాటులో ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లేదా ఏదైనా ప్రాంతీయ భాషలో వీడియోలు రూపొందించవచ్చు. ఉత్తమంగా ఎంపికై న 10 మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ.10వేల నగదు బహుమతిని అందిస్తారు. ఉమ్మడి జిల్లాలోని యువత, యోగా అభ్యాసకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటాలని అధికారులు సూచిస్తున్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం, సమతుల్యతను ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని కోరుతున్నారు. -
ఎట్టకేలకు ఎన్నికలు ప్రశాంతం
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాల్టీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఎట్టకేలకు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య రెండుసార్లు వాయిదా పడ్డ ఎన్నికలు చివరికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తయ్యాయి. మొత్తం 22 స్థానాలకు గాను ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ కూటమి 14, కాంగ్రెస్ పార్టీ ఏడు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్, సీపీఐ కూటమికి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరుకావడం.. అందులో కోరం కూడా స్పష్టంగా ఉండడంతో ఎన్నికల ప్రత్యేకాధికారి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ గంటన్నర వ్యవధిలో పూర్తయింది. బీఆర్ఎస్కు చెందిన గొడిసెల సంధ్యారాణి చైర్పర్సన్గా, సీపీఐకి చెందిన మిట్టపల్లి సరిత వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సమావేశ మందిరంలోకి ఎవరినీ అనుమతించలేదు. ఉద్రిక్తతలు తలెత్తకుండా సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాతనపల్లి ఫ్లై ఓవర్ను తాత్కాలికంగా మూసివేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝా పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బీఆర్ఎస్–సీపీఐ శ్రేణుల సంబురాలు.. మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్–సీపీఐ కూటమి దక్కించుకోవడంతో ఆ పార్టీల శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. దాదాపు 51 రోజులపాటు కుటుంబాలను వదిలి క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు అక్కడి నుంచి కరీంనగర్కు చేరుకుని ఎన్నికల రోజు శనివారం ఉదయం నేరుగా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి చేరారు. భారీ కాన్వాయ్తో ఇక్కడికి చేరుకున్న అనంతరం 12గంటల ప్రాంతంలో బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి సుమన్ ఇంటి వద్దకు చేరుకోగా పార్టీ శ్రేణులు భారీగా సంబురాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. దాదాపు నెలన్నర రోజులకు పైగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఈ ఎన్నికలతో తెరపడగా.. మంత్రి వివేక్ ఇలాకాలో క్యాతనపల్లి పీఠాన్ని బీఆర్ఎస్–సీపీఐ కూటమి దక్కించుకోవడం స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. -
బల్దియాల్లో ముందస్తు రాయితీ
మంచిర్యాలటౌన్: మున్సిపాల్టీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ‘ఎర్లీబర్డ్’ పథకం అమలు చేస్తోంది. పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు మార్చి నెలాఖరున ముగిసాయి. నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభంతో ముందస్తు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026 మార్చి వరకు పూర్తి పన్ను బకాయిలు చెల్లించిన వారు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను చెల్లించేందుకు అర్హులుగా పేర్కొంది. బకాయిలు పేరుకుపోకుండా, ముందస్తు చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. ఐదు శాతం రాయితీ అందిస్తుండడంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఏప్రిల్ 30లోపు పన్ను చెల్లిస్తే రాయితీ వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. విస్తృత ప్రచారాన్ని కల్పిస్తేనే ఎర్లీబర్డ్ పథకానికి సంబంధించి మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది విస్తృత ప్రచారం కల్పిస్తేనే పన్నులు వసూలవుతాయి. సరైన ప్రచారం లేకపోవడంతో గత ఏడాది చాలామందికి ఈ పథకం, రాయితీపై తెలియలేదు. మొన్నటి ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూలు మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సవాల్గా మారింది. అంతంత మాత్రంగానే వసూలయ్యాయి. ఈ పథకంపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎర్లీబర్డ్ ద్వారా పన్ను చెల్లింపులపై ప్రచారం కల్పించేందుకు మున్సిపల్ అధికారులు సమాయత్తం అయ్యారు. -
పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయండి
● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి చెన్నూర్: చెన్నూర్ గోదావరి పుష్కరాలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన చెన్నూర్ గోదావరి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభామేళా తరహాలో నిర్వహించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా రవాణా వ్యవస్థ, పుష్కర ఘాట్ ప్రాంతంలో లైటింగ్, తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. పుష్కర స్నానాలకు రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏర్పాట్ల పనులన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాన్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి, బస్సు డిపో, మినీ స్టేడియం నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, కమిషనర్ మురళీకృష్ణ, సీఐ బన్సీలాల్, కౌన్సిలర్లు, దేవాదాయ, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీని మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయిస్తానని, సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి వివేక్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్లు, కమిషనర్తో సమావేశం నిర్వహించారు. మదనం పోచమ్మ ఆలయ పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, కమిషనర్ మురళీకృష్ణ, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
‘ఎస్టీపీపీ’లో మెరుగైన వైద్య సదుపాయాలు
జైపూర్: ఎస్టీపీపీ డిస్పెన్సరీలో మెరుగైన వైద్యసదుపాయాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్టీపీపీని సందర్శించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం నర్సింహారావు ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగ తం పలికారు. డిస్పెన్సరీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. డిస్పెన్సరీలో క్యాజువాలిటీ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. పీరియాడికల్ మెడికల్ పరీక్షలు(పీఎంఈ, ఐఎంఈ) ఇక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సర్వీస్ బిల్డింగ్లో ని ర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వోఅండ్ఎం చీఫ్, జీఎం పీసీఎస్ మదన్మోహన్, డీజీఎం, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంతుల, డీజీఎం ప ర్సనల్ కిరణ్బాబు, డిప్యూటీ సీఎంవో రమేశ్బా బు, మెడికల్ సూపరింటెండెంట్ జానకి, ఎస్వోటూ ఈడీ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
చెన్నూర్: చెన్నూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని డెటాల్ సేవించి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం రేపింది. గత నెల 25న ఏడోతరగతి విద్యార్థిని శ్రీహిందు పాఠశాలలో గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ 29న మృతిచెందిన విషయం తెలిసిందే. పది రోజులు గడువక ముందే అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని డెటాల్ తాగడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, పాఠశాల సిబ్బంది, వైద్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జైపూర్ మండలం నర్వ గ్రామానికి చెందిన విద్యార్థిని పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన గదిలో ఉన్న స్నేహితురాలితో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో బాత్రూమ్కు వెళ్లి డెటాల్ తాగింది. పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సీఐ బన్సీలాల్ పాఠశాలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బీఆర్ఎస్దే విజయం.. క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో బీఆర్ఎస్కు ఘన విజయం దక్కింది. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎరిగింది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్, సీపీఐ మైత్రితో అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పడింది.రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ నేడు జరిగింది. ఈ సందర్భంగా ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నిక కాగా.. వైస్ చైర్ పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు.ఇక, క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఎట్టకేలకు క్యాతనపల్లి మున్సిపాలిటీపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పంతం నెగ్గించుకున్నారు. కాగా, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు పెట్టుకోగా 22 వార్డులకుగాను 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్-సీపీఐ కూటమికి స్పష్టమైన బలం ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడు స్థానాల్లోనే గెలిచారు. కానీ, మంత్రి వివేక్, కాంగ్రెస్ నేతల అరాచకాల వల్ల గతంలో చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లుగా పొత్తు ధర్మంలో ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. -
సమగ్ర గిరిజనాభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: సమగ్ర గిరిజనాభివృద్ధికి ఐటీడీఏ కృషి చేస్తోందని పీవో యువరాజ్ మర్మాట్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో రెండురోజుల క్షేత్ర పర్యటనకు వచ్చిన 20 మంది డిప్యూటీ కలెక్టర్లతో సంక్షేమ పథకాల అమలు, గిరిజనులకు కల్పిస్తున్న వి ద్య, వైద్యం, గిరిజనులు, పీవీటీజీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార యంత్రాంగం సమన్వయంతో సమర్ధవంతంగా అమలు చేస్తూ అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. అనంతరంఐటీడీఏ ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్కుమార్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీ, శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ కలెక్టర్లు సందర్శించారు. నర్సరీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సందీప్కుమార్ వివరించారు. వివిధ రకాల పండ్ల తోటల పెంపకం, సాగులో మెళకువలు, అంటుకట్టే విధానం, కొమ్మలు కత్తిరించే విధానం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కూరగాయల నారు పెంపకం, వేసవిలో పండ్లు, కూరగాయల పెంపకంలో తీసుకోవాల్సిన జా గ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉట్నూర్ పరిధిలోని ప్రభుత్వ ఆ స్పత్రిని సందర్శించి వైద్యసేవలు, మందుల నిల్వ లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, విద్యాబోధన తీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. -
రాయితీ సిలిండర్ల పట్టివేత
కాగజ్నగర్టౌన్: ప్రభుత్వం రాయితీపై అందిస్తు న్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై అధి కారులు కఠిన చర్యలు చేపట్టారు. శుక్రవారం కాగజ్నగర్ పట్టణంలోని న్యూ స్వాగత్ హోటల్, స్వాగత్ హోటల్లో ఐదు సబ్సిడీ సిలిండర్లు, రీఫిల్లింగ్ కోసం ఉపయోగిస్తున్న డంపింగ్ మెషిన్ పరికరాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాణిజ్య సిలిండర్లకు ధర ఎక్కువగా ఉండడంతో ఖర్చు తగ్గించుకునేందుకు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్కుమార్, శ్రీనివాస్, పోచయ్య పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
కుంటాల: హనుమాన్ జయంతి, మహాదేవుని పౌర్ణమిని పురస్కరించుకుని కుంటాలలో శుక్రవారం నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన మాధవ్ జావూర్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిద్రాలికి చెందిన సాయినాథ్ తలపడగా సాయినాథ్ గెలిచాడు. ఆయనకు రూ.5వేల నగదు అందజేసి శాలువాతో సన్మానించారు. సర్పంచ్ జక్కుల గజేందర్, ఉప సర్పంచ్ పరికిపండ్ల రమణ, జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, ఐకేఆర్ వ్యక్తిగత సహాయకుడు నాలం శ్రీనివాస్, నాయకులు రమణారావు, లక్ష్మణ్, గజ్జారాం, మహేందర్, దత్తాద్రి, కిషన్, మహిపాల్, కళ్యాణ్ గజేందర్, శివ తదితరులున్నారు. -
మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు
కాసిపేట: మండలంలోని దుబ్బగూడెం శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లతోపాటు జే సీబీని శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు అడ్డుకున్నారు. రోజు వారీగా భారీగా ట్రాక్టర్లలో మట్టి తరలిస్తూ రోడ్లు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం మట్టిని తరలించి గుంతలమయంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, త మకు సింగరేణి ఓపెన్కాస్టు అధికారుల అనుమతి ఉందని ట్రాక్టర్ల యజమానులు చెప్పగా, బయటకు మట్టి తరలింపు అనుమతి ఇచ్చే అధికారం మైనింగ్ అధికారులకే ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నా రు. సింగరేణి అధికారులు అనుమతి ఇచ్చింది ఓపె న్కాస్టు డంప్ వద్ద కాగా, ఆ పత్రాలు చూపి తమ గ్రామ సమీపంలో మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీ, ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై ఎస్సై ఆంజనేయులును వివరాలు అడగగా ట్రాక్టర్లు, జేసీబీని తహసీల్దార్కు అప్పగించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వ్యక్తి అదృశ్యం
సిర్పూర్(టి): మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన ముదురుకోల నర్సయ్య (54) అనే వ్యక్తి మార్చి 20న వరంగల్ నుంచి సిర్పూర్(టి)కి వచ్చి దేవార పండుగకు హాజరై తిరిగి 29న ఉదయం 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం వరంగల్లో పనిచేస్తున్న యజమాని సిరాజ్కు ఫోన్ చేసి అడుగగా ఇంకా రాలేదని చెప్పారు. కాగా, తన భర్తకు చదువు రాదని, ఫోన్ ఆపరేటింగ్ రాదని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్లో అతడి భార్య మంగమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
భైంసారూరల్: మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన రైతు దశరథ్ మొక్కజొన్న పంట శుక్రవారం దగ్ధమైంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి పక్కనే ఉన్న పంట పొలంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మొక్కజొన్న చేనంతా మంటలు వ్యాపించాయి. రెండు గంటల్లో పంటచేనంతా కాలిబూడిదైంది. కోతకు వచ్చిన పంట కాలిపోవడంతో బాధిత రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు రూ.1.20లక్షల పంట కాలిపోయినట్లు బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. -
దాడి కేసులో నలుగురి అరెస్ట్
భైంసాటౌన్: ముగ్గురిపై దాడి చేసిన కేసులో నలు గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సా యికుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఇటీవల పట్టణంలోని ఓ వైన్స్వద్ద బైక్ యూటర్న్ విషయమై కొందరు గొడవపడ్డారు. ఈ ఘటన గ్యాంగ్ గొడవకు దారితీసింది. ఈ క్రమంలో నలుగురు కలిసి ముగ్గురిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడి న నలుగురు నిందితులను గుర్తించారు. వీరిని అరె స్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అలాగే, వీరికి ఆర్థి క సహాయం, ఆశ్రయం కల్పించిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. కేసును త్వరగా ఛేదించి నిందితుల ను పట్టుకున్నందుకు సీఐ సాయికుమార్, ఎస్సై కృష్ణారెడ్డి, నవనీత్, సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల, ఇన్చార్జి ఏఎస్పీ సాయికిరణ్ అభినందించారు. -
మూడు ఎద్దుల చోరీ
నెన్నెల: మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కర్ణకొండ చందు అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు, నార వెంకన్నకు చెందిన ఒక ఎద్దును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు రోజులాగే ఎడ్లను కట్టేసి ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారేసరికి వారి ఎడ్లు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బొప్పారం బస్షెల్టర్ వద్ద బొలెరో వాహనంలో ఎక్కించుకున్నట్లు ఆధారం దొరకగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఎద్దుల విలువ రూ.1.70 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. పోలీసులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పలు కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నందులపల్లి, గన్పూర్, ఆవుడం, ఆదిల్పేట్ మీదుగా బొలెరో వాహనం శ్రీరాంపూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
సమావేశాన్ని విజయవంతం చేయాలి
ఆదిలాబాద్రూరల్: ఈ నెల 5న మంచిర్యాల మార్క్స్ భవన్ బస్టాండ్ వెనుకాల నిర్వహించనున్న ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జాతీయ, రాష్ట్ర కమిటీల ఉద్యమ సహచరుల ఐక్యత విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మావల మండలంలోని కుమురంభీంగూడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు తుడుం దెబ్బ సంఘాల జాతీయ, రాష్ట్ర కమిటీల బాధ్యులు, సభ్యులు, అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర కమిటీల ఉద్యమ సంస్థల బాధ్యులు కోట్నాక్ విజయ్కుమార్, వట్టం ఉపేందర్, మైపతి అరుణ్కుమార్, ఈసాం సుధాకర్, కల్తి సత్యనారాయణ, ఉద్యమ సహచరులు అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి పనిచేయాలని గతంలో నిర్ణయించినట్లు తెలిపారు. తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వేడమ ముకుందరావు, తొడసం ప్రకాశ్ తదితరులున్నారు. 120 కిలోల బండరాయిని ఎత్తిన సర్పంచ్ గజేందర్, ఎల్లమ్మల గజేందర్హనుమాన్ జయంతి, మహాదేవుని పౌర్ణమిని పురస్కరించుకుని కుంటాల మహాదేవుని ఆలయం వద్ద గురువారం రాత్రి బండరాయిని ఎత్తే పోటీలు నిర్వహించారు. 80 కేజీలు, 120 కేజీల బరువు గల బండరాయి ఎత్తే పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ జక్కుల గజేందర్, ఎల్లమ్మల గజేందర్ 120 కేజీల బండరాయిని అలవోకగా ఎత్తి సత్తా చాటారు. వీరిని గ్రామస్తులు అభినందించి సన్మానించారు. అనంతరం మహాదేవుని ఆలయ జెండాలను భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకుని ఆలయం వద్ద ప్రతిష్ఠించారు. ఉప సర్పంచ్ పరికిపండ్ల రమణ, ఆలయ అర్చకుడు జంగం మధు తదితరులున్నారు. – కుంటాలఆకట్టుకున్న బండరాయి ఎత్తే పోటీలు -
వలస కార్మికులకు భరోసా
ఎవరు అర్హులంటే?నిర్మల్ఖిల్లా: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల నైపుణ్యాలను పెంచి, వారికి మెరుగైన ఉ పాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల (బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు) సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆర్పీఎల్ (రికగ్నిషన్ ఆఫ్ ప్రి యర్ లర్నింగ్) ఆధారిత డేటాబేస్ నమోదు కార్యక్రమం ప్రస్తుతం జిల్లాలో అమలవుతోంది. ఈ కా ర్యక్రమం ద్వారా ఇప్పటికే పనిలో అనుభవమున్న కార్మికులకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు వారి నైపుణ్యాలకు అనుగుణంగా సర్టిఫికెట్లు అందించబడుతున్నాయి.దీంతో దేశవ్యాప్తంగా మా త్రమే కాకుండా విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశంఉందని కార్మికశాఖ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలా బాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దాదాపు లక్షా 20వేల మంది కార్మికులు న్నట్లు కార్మికశాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తు న్నాయి. వీరికి విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నమోదైన బీవోసీడబ్ల్యూ కార్మికుల ఆధారితులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. డేటా సేకరణలో భాగంగా అభ్యర్థుల పేరు, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, విద్య, వృత్తి వివరాలు, విదేశీ ఉపాధిపై ఆసక్తి తదితర వివరాలను నిర్దిష్ట నమూనాలో నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సేకరించిన సమాచారం కచ్చితంగా, పూర్తిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ చర్యల ద్వారా అర్హత గల యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించ డమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకు సాగుతోందని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలకు సరైన మార్గం ఈ పథకం ద్వారా అధికారికంగా నమోదు కావడంతో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడమే కాకుండా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్మికులు ఉద్యోగావకాశాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. నైపుణ్యానికి గుర్తింపు రావడం ద్వారా వేతనాలు కూడా మెరుగుపడే అవకాశముంది. ఈ కార్యక్రమం కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా, నిర్మాణ రంగానికి నైపుణ్యంతో కూడిన మానవ వనరులను అందించే దిశగా ఒక కీలక ముందడుగు అని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. శిక్షణ ప్రత్యేకతలు ఈ డేటాబేస్ నమోదు అంటే పేరు నమోదు మాత్రమే కాదు. ఇది పూర్తిస్థాయి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. ఇందులో భాగంగా కార్మికులకు వారి పనికి సంబంధించిన ప్రాక్టికల్, థియరీ శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తారు. వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలకు యువతను అనుసంధానం చేస్తూ నైపుణ్యాలు పెంపొందించి సర్టిఫికేషన్ జారీ చేస్తారు.ఈ పథకానికి రిజిస్టర్ అయిన బీవోసీడబ్ల్యూ కార్మికులు, ఆధార్ కార్డు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా 18 నుంచి 30ఏళ్లున్నవా రికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు కనీసం ఎని మిదో తరగతి చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, విద్యార్హత పత్రాలు, విదేశాలకు వెళ్లే ఆసక్తి ఉంటే పాస్పోర్ట్ లాంటి పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. -
ఆర్థిక దోపిడీకి గురవుతున్న కార్మికులు
జైపూర్: సింగరేణి సంస్థలో కార్మికులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. మండలంలోని ఇందారం ఐకే 1ఏ, ఐకే–ఓసీపీపై శుక్రవారం నిర్వహించిన గేట్మీటింగ్కు యూనియన్ జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి సురేందర్రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్తో కలిసి హాజరై మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధికంగా చూపించి లాభాలు పెంచినట్లు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. లాభాలను పంచే సమయంలో సగానికి తగ్గించి ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. మెడికల్ బోర్డు అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులపై ఏసీబీ విచారణ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. సింగరేణిలో అక్రమాలు, ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ వినియోగం, జైపూర్ పవర్ ప్లాంట్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్, గుర్తింపు కార్మిక సంఘాలు నెరవేర్చలేదని ఆరోపించారు. అనంతరం ఏఐటీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ధరణి దేవేందర్, సేఫ్టీ కమిటీ అసిస్టెంట్ పిట్ సభ్యులు మనోహర్, వెంకటేశ్, రాజేందర్, రమేశ్తో పాటు 30మంది టీబీజీకేఎస్లో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ జావిద్ పాషా, సెంట్రల్ ఆర్గనైజ్ సెక్రటరీ అన్వేశ్రెడ్డి, డివిజన్ సెక్రటరీ గడ్డం మైపాల్రెడ్డి, గొర్ల సంతోష్, పిట్ సెక్రటరీ గడ్డం మల్లయ్య, గోగర్ల పాల్ రామారావు, ఆకుల సతీశ్, రమణకుమార్, వేణుగోపాల్, నర్సింహస్వామి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇంద్రవెల్లి: మ్యాక్స్ ట్రాలీని వెనుక నుంచి ద్విచక్ర వాహనంతో ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పిప్రి గ్రామానికి చెందిన ఆ త్రం లోకేశ్ (20) అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కినక ప్రేమిత్తో కలిసి ద్విచక్ర వాహనంపై దనోరా (బి) గ్రామానికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో దనోరా (బి) గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పిప్రి గ్రామ చౌక్ వద్ద ఇంద్రవెల్లి వైపు నుంచి వస్తున్న మ్యాక్స్ ట్రా లీని వేగంగా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఆత్రం లోకేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందా డు. వెనుక కూర్చున్న అతడి స్నేహితుడు ప్రేమిత్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రేమిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. చేతికు అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధించారు. విద్యుత్ తీగల చోరీలక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్ సమీపంలో సరస్వతి కాలువపై గ్రామానికి చెందిన రైతులు నవీన్, ముత్యం, రాందేని భీమన్న ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్ల నుంచి విద్యుత్ తీగలను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోసుకువెళ్లారు. గతంలోనూ పలువురి రైతుల విద్యుత్ మోటార్ల తీగలు ఇలాగే చోరీ చేశారు. తీగలు చోరీకి గురవుతుండడంతో రైతులు భూమిలోంచి అమర్చుకున్నప్పటికీ దుండగులు వాటినీ వదలకపోవడం గమనార్హం. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టి విద్యుత్ తీగలు చోరీ కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇంట్లో పట్టపగలే చోరీసిర్పూర్(టి): మండలకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. తహసీ ల్దార్ కార్యాలయం పక్కనున్న ఇంట్లో మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.లక్షా 50వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కౌటాల సీఐ సంతోష్కుమార్, సిర్పూర్(టి) ఎస్సై సాగర్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం సేకరించాక వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. యువకుడి హత్యఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బంగారుగూడకు చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన వెల్చల రాజేశ్ (25), జమ్ము అలియాస్ జమీర్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రాజేశ్ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మృతుడు రాజేశ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సద్వినియోగం చేసుకోవాలి
బీవోసీడబ్ల్యూ కార్మికులు, వారి పిల్లలకు విదేశీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వివిధ దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు మంచి డిమాండ్ ఉంది. సరైన శిక్షణ, ప్రాథమిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ప్రభుత్వం చేపడుతున్న గుర్తింపు, డేటా సేకరణ కార్యక్రమం ద్వారా అర్హులైన అభ్యర్థులు సులభంగా ఎంపికయ్యే అవకాశముంటుంది. విదేశాలకు వెళ్లే ముందు సంబంధిత నైపుణ్యాల్లో శిక్షణ పొందడం, పని పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఇందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య’
మంచిర్యాలఅగ్రికల్చర్: నిజాం నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం చేశారని తెలిపారు. వెట్టిచాకిరీ విముక్తి కోసం ఎన్నో పారాటలు చేశారని, యువతకు మార్గదర్శకులని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖల అధికారులు భాగ్యవతి, దుర్గప్రసాద్, వ్యవసాయ అధికారి సురేఖ, మాదవ, కురుమ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
సజావుగా సాగేనా!
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ ఎన్నిక మూడోసారైనా సజావుగా సాగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లు, గొడవల కారణంగా గతంలో ఎన్నికలు రెండుసార్లు వాయిదా పడడం, ఎన్నికల కోడ్ అమలులో లోపాలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమావేశ మందిరంలో ఆయా పార్టీల కౌన్సిలర్లు వేర్వేరుగా కూర్చునేందుకు వీలుగా ఇనుప రెయిలింగ్ ఏర్పాటు చేశారు. గత ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్ల మధ్య గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ దఫా అలాంటి వాటికి అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్స్అఫీషియో సభ్యులకు వేరుగా సీట్లు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. భారీగా పోలీసు బలగాలు.. ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా క్యాతనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. వందలాది సంఖ్యలో పోలీసులు ప్రధాన కూడ ళ్లు, కార్యాలయ పరిసర ప్రాంతా ల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6గంటల వ రకు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని, నలుగురికి మించి గుంపులుగా చేరడం, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, సభలు నిషేధమని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. పారదర్శకంగా ఎన్నిక జరిగేనా? చైర్పర్సన్ ఎన్నికపై ఓ వర్గం మళ్లీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నిక సందర్భంగా లోపల ఏం జరిగిందన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయిందని, గొడవలు, తోపులాటలు జరిగాయని కౌన్సిలర్లు పరస్పర ఆరోపణలు చేసినా అధికారిక రికార్డులేవి బయటపెట్టలేదని అంటున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కలెక్టర్ కార్యాలయం డీపీఆర్వో ద్వారా అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు సమావేశ మందిరంలోకి ప్రవేశం కల్పించాల్సి ఉండగా ఈసారి కూడా అలాంటిదేమీ లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. -
కార్యకర్తల వల్లే అధికారంలోకి వచ్చాం
రామకృష్ణాపూర్: కార్యకర్తల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. పార్టీ పటిష్టత కోసం కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు భవిష్యత్లో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. క్యాతనపల్లిలోని ఎంఆన్ఆర్ గార్డెన్స్లో శుక్రవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు నియామకపు పత్రాలు అందించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ నిర్బంధ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి త్యాగాలను పార్టీ ఎన్నటికీ మరిచిపోదని స్పష్టం చేశారు. 65 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ హయాంలో రూ.68వేల కోట్లు అప్పులు చేస్తే బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో రూ.8లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. దూరదృష్టి లేకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపర్చారని, గత అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాల పేరుతో ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు గురించి ప్రస్తావిస్తూ కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డారని, ఆయన కష్టం వృథాగా ఏమిపోదని అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రావడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని, అన్ని జిల్లాల్లో మహేష్కుమార్గౌడ్ పర్యటించడం అభినందనీయమని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్రావు మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి సముచిత స్థానం కల్పించాలని, ఎన్నికలప్పుడు వచ్చిన వారికి పదవులు ఇస్తే పార్టీ నష్టపోతుందని, తన మాటలను పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేశారు. కాగా, మంచిర్యాలలో హెలిప్యాడ్ వద్ద నేతలకు స్వాగతం పలికి ఎంఎన్ఆర్ గార్డెన్స్ వరకు ర్యాలీ నిర్వమించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సబ్సిడీ పడడం లేదు.. సమావేశంలో డీసీసీ కార్యదర్శి శారద మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ అందరికీ పడడం లేదని వ్యాఖ్యానించారు. తాను గతంలోనే రాష్ట్ర కమిటీలో పనిచేశానని, ప్రస్తుతం మళ్లీ జిల్లా కమిటీకి పరిమితం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వేదికపై ఉన్న మంత్రులు, నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. -
● రైల్వే బడ్జెట్లో ఏటా రూ.కోట్లు అంచనా ● నిధులు రాక కొత్త పనులకు కలగని మోక్షం ● మంచిర్యాల నుంచి సిర్పూర్(టీ) స్టేషన్ల దాక ఇదే తీరు ● తాజాగా పాతవాటికే మరోసారి రూ.కోట్లలో నిధులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వే బడ్జెట్లో గతేడాది తరహాలో దక్షిణ మధ్య రైల్వే పరిధి కాజిపేట–బల్లార్షా సెక్షన్కు మళ్లీ ప్రతిపాదనలు వచ్చాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, రేచినీ రోడ్డు, ఆసిఫాబాద్ రోడ్, కాగజ్నగర్, సిర్పూర్(టీ) వరకు ఉన్న లైన్లో అభివృద్ధి పనులకు రైల్వే రూ.కోట్లలో నిధులు ప్రతిపాదించింది. గత కొన్నేళ్లుగా బడ్జెట్లో ప్రతిపాదించినా నిధులు ఖర్చుకు నోచుకోవడం లేదు. నిధులు విడుదల కాక పనులు నిలిచిపోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టగా, తాజాగా రైల్వే కేటాయింపులపై వివరాలు వెల్లడయ్యాయి. వీటిని పరిశీలిస్తే పలు పెండింగ్ పనులకు మరోసారి బడ్జెట్లో ప్రతిపాదించారు. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ లైన్కు సర్వే ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కలిగే మంచిర్యాల వయా ఉట్నూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు 186 కిలోమీటర్ల నిడివితో కొత్తగా రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వేకు రూ.100.28 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. గత రెండు బడ్జెట్ల్లోనూ కేటాయించినా అడుగు ముందుకు పడలేదు. ఇక రాఘవపురం, మందమర్రి మధ్య మూడో లైన్ పనుల కోసం గతంలో కేటాయించిన రూ.180 కో ట్లు యధావిధిగా ఈ బడ్జెట్లో చే ర్చారు. 4.37కి.మీ నిడివి గల మంచిర్యాల–పెద్దంపేట మూడోలైన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆర్వోబీలు, ఓఆర్వోబీ.. కొత్తగా ఆయా స్టేషన్లు, రైల్వేలైన్ల పరిధి లో అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల కో సం ఇక్కడి ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పాదనలు పంపగా, బడ్జెట్లో చేర్చారు. వీటిలో రాళ్లపేట–బెల్లంపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ నిర్మాణానికి రూ.5.90కోట్లు, రేపల్లెవాడ–ఆసిఫాబాద్ స్టేషన్ల మధ్య ఆర్యూబీకి ఏర్పాటుకు రూ.10.46కోట్లు, మందమర్రి మంచిర్యాల మధ్య రోడ్ అండర్ బ్రిడ్జి ప్రతిపాదనలు చేశారు. ఇందుకు రూ.9.65కోట్లు అంచనా వేశారు. ఆసిఫాబాద్ రోడ్ సమీపంలోనూ ఆర్వోబీ (రోడ్ఓవర్బ్రిడ్జి) కోసం రూ.40.48 కోట్లు అంచనా ఉంది. రాళ్లపేట–కాగజ్నగర్ మఽ ద్య ఆర్యూబీ నిర్మాణానికి రూ.7.14కోట్లు ప్రతిపాదించా రు. కాగజ్నగర్–రాళ్లపేట మధ్య ఉన్న వంతెనపై రెండు అదనపు గడ్డర్లు ఏర్పాటుకు రూ.1684కోట్లు ప్రతి పాదించారు. కాగజ్నగర్ పట్టణ స్టేషన్లో మరో ఫుట్ ఓ వర్బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50కోట్లు, రైళ్లు, రైల్వే లైన్ పక్కన రోడ్డు లైన్, వాటర్ సిస్టం కోసం రూ.13.02కోట్లు అంచనా వేశారు.నాలుగో లైన్ కోసం సర్వేప్రస్తుతం కాజిపేట–బల్లార్షా మధ్య మూడో లైన్ పూర్తయింది. ఇక భవిష్యత్లో పెరుగుతున్న రాకపోకలకు అనుగుణంగా నాలుగో లైన్ కోసం కాజిపేట–బల్లార్షా మధ్య మొత్తం 234కి.మీ. సర్వే కోసం రూ.4.68కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్లోనూ ప్రతిపాదించారు. నాలుగోలైన్కు ట్రాఫిక్ సర్వే కోసం రూ.1.17కోట్లు, బెల్లంపల్లి యార్డులో మైక్రో టన్నెలింగ్ కోసం రూ.4కోట్లు, స్టేషన్లో వ్యాగన్ల నిర్వహణ కోసం సౌకర్యం కల్పించేందుకు రూ.14.12కోట్లు, సిర్పూర్ టౌన్ స్టేషన్ లోడింగ్లైన్ కోసం రూ.24.72కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్లో చేర్చినప్పటికీ విడుదల కాక పనులు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోంది. -
‘తెలంగాణలో బీజేపీకి స్థానంలో లేదు’
మంచిర్యాల: తెలంగాణాలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలొస్తే దేవుళ్ల పేరు చెప్పడం బీజేపీకి అలవాటని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్పై కూడా మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్లో కేసీఆర్, హరీష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నారు. కవిత వేరుకుంపటితో బీఆర్ఎస్ రోడ్డున పడిందన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్కే పరిమితమయ్యారన్నారు. ‘ బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసుల పాలయ్యారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ రోజు మేము పదవుల్లో ఉన్నామంటే అది కార్యకర్తల కష్టమే. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. కేసీఆర్ శృతి లేని పాలన చేసిండు. వారి హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ. 6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం . తెలంగాణాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సిట్లకు పైగా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. -
పరిమితి దాటని ప్రచార వ్యయం!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు అప్పగించడానికి గడువు ముగిసింది. నిబంధనల మేరకు సోమవారం వరకే వివరాలు అప్పగించాల్సి ఉంది. గెలిచిన వాళ్లు మినహా ఓడిన అభ్యర్థులు చాలా వరకు లెక్కలు అప్పగించలేదు. ప్రచార వ్యయం వివరాలు సమర్పించని అభ్యర్థులు వచ్చే మూడేళ్లలో ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు లక్సెట్టిపేట, చెన్నూర్, క్యాతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా బల్దియాల్లోని 149 డివిజన్లు, వార్డుల్లో మొత్తంగా 692 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45రోజుల్లో ఎన్నికల ప్రచార వ్యయం వివరాలు అప్పగించాల్సి ఉంటుంది. అభ్యర్థుల్లో 504 మంది లెక్కలు అప్పగించగా.. ఇంకా 188 మంది అప్పగించలేదు. వీరిపై ఎన్నికల సంఘం పోటీకి అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. భారీగా వ్యయం.. వివిధ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులూ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ నమూనా పత్రాల ముద్రణ, వాల్పోస్టర్లు, ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రచార ర్యాలీ, టిఫిన్లు, భోజనాలు, కార్యకర్తల ఖర్చుల వివరాలు, ప్రచారం కోసం వినియోగించిన వాహనాల డీజిల్, డ్రైవర్ ఏర్పాటు ఖర్చులు, ఇతర పోలింగ్ ఖర్చుల వివరాలన్నీ లిఖిత పూర్వకంగా అందించాలి. గెలుపోటములతో సంబంధం లేకుండా నామినేషన్ల నుంచి మొదలు ప్రచారం ముగిసే వరకు లెక్కలు ఇవ్వాలి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలువాలనే తపనతో రూ.లక్షలు దాటి రూ.కోటి వరకు ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక్కో కార్పొరేటర్ రూ.1.50లక్షలు, కౌన్సిలర్ అభ్యర్థి రూ.లక్ష వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. కానీ పరిమితి మించి ఖర్చు చేశారు. అభ్యర్థులు పరిమితికి మించకుండా ప్రచార వ్యయం లెక్కలు చూపించినట్లు సమాచారం. పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు.. మున్సిపాలిటీ వార్డులు/ డివిజన్లు అభ్యర్థులు మంచిర్యాల 60 240 బెల్లంపల్లి 34 172 చెన్నూర్ 18 107 క్యాతనపల్లి 22 113 లక్సెట్టిపేట 15 60 మొత్తం 149 692 -
లక్సెట్టిపేట.. అధ్యక్షా..!
లక్సెట్టిపేట: నిజాం కాలం నుంచి లక్సెట్టిపేట పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి జిల్లాలోనూ లక్సెట్టిపేట నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 1952 నుంచి 2004 వరకు లక్సెట్టిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించగా.. రాజకీయంగా ఎన్నికల చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి మంచిర్యాలను నియోజకవర్గంగా ప్రకటించడంతో ప్రాధాన్యత కోల్పోతూ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో లక్సెట్టిపేట తాలూకాను నియోజకవర్గంగా అప్ప ట్లో ప్రకటించారు. ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడడంతో ఇక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్యే ప్రాతిని ధ్యం వహించారు. పునర్విభజనలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడడం, లక్సెట్టిపేట పట్టణం అందులో కొనసాగుతుండడం తెలిసిందే. తాజాగా నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో లక్సెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. జన్నా రం మండలం ఖానాపూర్ నియోజకవర్గంలో ఉండడంతో అక్కడి ప్రజలు దూరభారంతో ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం కూడా దూరంగా ఉందని, అభివృద్ధి జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలను కలుపుతూ లక్సెట్టిపేట శాసనసభ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటే కనీసం లక్షా 30వేల మంది ఓటర్లు ఉండాల్సి ఉంటుంది. లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాల జనాభా సుమారు రెండు లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణవాసులు, అఖిలపక్ష పార్టీల నాయకులు గత నెల 30న లక్సెట్టిపేట ఐబీ ఆవరణలో సమావేశం అయ్యారు. నియోజకవర్గ సాధన కోసం కమిటీ ఏర్పాటు చేసి పోరాటం చేయాలని నిర్ణయించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. నియోజకవర్గం సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మహనీయుల ఆశయాలను కొనసాగించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 317వ వర్ధంతి వేడుకలు గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్తోపాటు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తురుష్క సైనికులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని, రాజ్యాధికార సాధనపై ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఎన్.శ్రీనివాస్, బీసీ సంఘాల ప్రతినిధి కె.లచ్చన్న, గౌడ సంఘం రాష్ట్ర ప్రతినిధి ముఖేష్గౌడ్ పాల్గొన్నారు. నేడు దొడ్డి కొమురయ్య జయంతి మంచిర్యాలటౌన్: కలెక్టరేట్లో ఈ నెల 3న దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.భాగ్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి అధికారులు, ప్రజలు హాజరు కావాలని కోరారు. -
నేడు డీసీసీ సమావేశం
రామకృష్ణాపూర్: క్యాతనపల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావద్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు హాజ రుకానున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకా రంతోపాటు నియామకపు ఉత్వర్వులు అందజేస్తారు. ఎంఎన్ఆర్ గార్డెన్స్లో ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి గురువారం పరిశీలించారు. శ్రీనివాసగార్డెన్స్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని, సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ బాధ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పీసీసీ సభ్యులు హాజరుకావాలని కోరారు. -
ఆర్టీసీ ఆర్ఎంగా విజయభాను
ఆదిలాబాద్: ఆర్టీసీ ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా డి.విజయభాను గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆర్ఎంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.భవానీప్రసాద్ వరంగల్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన విజయభానుకు ఇప్పటివరకు ఆర్ఎంగా విధులు నిర్వర్తించిన భవానీప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంలు రామయ్య, శ్రీహర్ష పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం విజయభాను కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డిపో మే నేజర్ జి.ప్రతిమారెడ్డి పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి
జైపూర్: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండలంలోని టేకుమట్ల గ్రామ రైతువేదికలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. 99రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందించి వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, రుణం పొందిన సభ్యులు సకాలంలో చెల్లించి మళ్లీ పొందాలని చెప్పారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ బల్ల వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. -
● బాయిల్డ్ మాత్రమే ఇస్తామంటూ మిల్లర్ల పట్టు ● యాసంగి ధాన్యం సేకరణపై తర్జనభర్జన ● ఈ నెల చివరలో కొనుగోళ్లకు సన్నాహాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: యాసంగి(రబీ) ధాన్యం కొనుగోళ్లకు తిప్పలు తప్పేలా లేవు. వేసవిలో దొడ్డు ధాన్యం మిల్లింగ్ చేస్తే నూక అధికంగా అవుతాయి. ఈ క్రమంలో రా రైస్(ముడి బియ్యం) ఇవ్వడంలో మిల్లర్లకు నష్టం వస్తుంది. దీంతో బాయిల్డ్ బియ్యం మాత్రమే పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తామని జిల్లా మిల్లర్ల సంఘం అధికారులకు విన్నవించింది. తమకు బాయిల్డ్ మాత్రమే ఇవ్వాలని మిల్లర్లు కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం రా రైస్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) రా రైస్ మాత్రమే తీసుకుంటామని తేల్చిచెప్పింది. దీంతో ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతాయనే తర్జనభర్జన మొదలైంది. జిల్లాలో మరో రెండు వారాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వరి నాట్లు ఆలస్యం కావడంతో ఇతర జిల్లాలో పోలిస్తే దిగుబడిలో కొంత జాప్యం జరుగుతుంది. కొనుగోళ్లపై స్పష్టత రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పౌరసరఫరాల శాఖ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు మిల్లర్లతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. సేకరణ 2లక్షల మెట్రిక్ టన్నులకుపైనే.. జిల్లాలో గత రెండేళ్లుగా యాసంగిలో రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైనే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. గత సీజన్ యాసంగి చూస్తే జిల్లాలో 18మిల్లులకే ధాన్యం ట్యాగింగ్ ఇచ్చారు. మిగతాది పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని 56 మిల్లులకు తరలించారు. మొత్తంగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈసారి సైతం రెండు లక్షల మెట్రిక్ టన్నులపైనే ధాన్యం సేకరణ లక్ష్యం ఉంటుందనే అంచనా ఉంది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతాయనేది పెద్ద సమస్యగా మారింది. మిల్లర్లు రా రైస్ ఇవ్వలేమని, బాయిల్డ్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో టెండర్ ధాన్యంతో సహా పలు సీజన్ల సీఎంఆర్(కస్టం మిల్డ్ రైస్) బకాయిలతో చాలా వరకు బ్లాక్ లిస్టులో ఉన్నాయి. మిల్లర్లపై ఆర్ఆర్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఉన్నవాటిలో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేక వానాకాలంలోనే తిప్పలు పడ్డారు. పొరుగు జిల్లాల మిల్లర్లు సైతం ధాన్యం తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో యాసంగి ధాన్యం సేకరణపై స్పష్టత రావడం లేదు.జిల్లాలో యాసంగి వరి సాగు 1,22,037 ఎకరాలు ధాన్యం సేకరణ లక్ష్యం 2.81లక్షల మెట్రిక్ టన్నులు(అంచనా) -
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు
నస్పూర్: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా గురువారం 32వ డివిజన్లో వార్డు సభ నిర్వహించారు. అధికారులు సీఎం రేవంత్రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం మేయర్ మధుకర్ మాట్లాడుతూ నగరంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోల్బెల్ట్ పరిధిలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత తమేదనని అన్నారు. మంచిర్యాల శుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత నినాదంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రతీ డివిజన్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వార్డు సభల్లో తమ దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కాగా, 10వ డివిజన్లో కార్పొరేటర్ రాచకొండ గోపాల్రావు, 24వ డివిజన్లో కార్పొరేటర్ బొడ్డు స్వప్న, 25వ డివిజన్లో కార్పొరేటర్ తోట రజిత, హౌసింగ్ ఏఈ ప్రశాంతి, టీపీఎస్ అవినాష్, ఆర్ఐ చందర్, విద్యుత్ శాఖ ఏఐ రాంచందర్, వార్డు ఆఫీసర్లు శీపతి సురేశ్, రాజమణి, రమణారెడ్డి, గోపి, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. -
జై హనుమాన్
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ నామ స్మరణ మారుమోగింది. మంచిర్యాలలోని విశ్వనాథ స్వామి దేవస్థానంలోని ఆంజనేయ ఆలయంలో గణపతి పూజ, అభిషేకం, నివేదన, మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తమలపాకులతో హనుమాన్కు అభిషేకం చేశారు. గౌతమినగర్ కోదండ రామాలయం, గర్మిళ్ల భక్తాంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హమాలీవాడ, తిరుమలగిరి కాలనీలో జయంతి వేడుకలు జరిపారు. గౌతమినగర్ రాళ్లపేట్ రోడ్ నంబరు–1లో శివపంచాయతన ఆలయంలో అర్చకుడు శంశాక్శర్మ ఆధ్వర్యంలో మన్యుసూక్త సహిత ఆంజనేయ మూలమంత్ర హోమం జరిపించారు. -
నియోజకవర్గం ఏర్పాటు చేయాలి
లక్సెట్టిపేట కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చే యాలని గతంలో క మిటీ వేశారు. నియోజకవర్గం కోసం అందరూ కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉన్న నియోజకవర్గాన్ని మంచిర్యాలగా మార్చడంతో లక్సెట్టిపేట చాలా వెనుకబడిపోయింది. – చుంచు రాజ్కిరణ్, వైద్యులు, గ్రామం: కన్నెపల్లి, మం: దండేపల్లిపూర్య వైభవం వస్తుంది..మూడు మండలాలు కలుపుతూ లక్సెట్టిపేటను నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే పట్టణానికి పూర్వ వైభవం వస్తుంది. జనాభా పెరుగుదలతోపాటు నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రజలు నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నూతన నియోజకవర్గాల ఏర్పాటులో పట్టణాన్ని ప్రకటించాలి. – కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్, లక్సెట్టిపేట -
ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలి
నస్పూర్: 2026–27 ఆర్థిక సంవత్సరం నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. గురువారం జీఎం కార్యాలయంలో అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం 64 లక్షల 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. శ్రీరాంపూర్ ఓసీలో కొత్త కాంట్రాక్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఐకే ఓసీలో త్వరలోనే టెండర్ల నిర్వహణ ద్వారా మరో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఉపరి తల గనులలో వీలైనంత త్వరగా ఉత్పత్తి మొదలు పెట్టి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ రమణారావు, ఎస్ఆర్పీ ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, ఐకే ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ ఏవి రెడ్డి, ఆర్కే 5 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్, ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
మంచిర్యాలక్రైం: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రమోద్రావు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. స్థానిక జ్యోతినగర్ కాలనీకి చెందిన ఇందారపు రాజయ్య ఇంట్లో గత నెల 13న చోరీ జరగడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ నెల1న రాత్రి స్థానిక ఏసీసీ సాయిరాం నగర్కు చెందిన కలవేన వసంత్ దొంగిలించిన సొమ్ము విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్దనుంచి 19.37 గ్రాముల బంగారం, యమహా బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా అక్షయ్, అభి, మరొకరితో కలిసి 8 తులాల బంగారం, 29 తులాల వెండి, రూ.18 వేల నగదు చోరీ చేసి పంచుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై శ్రవణ్కుమార్, సీసీఎస్ పోలీసులు, భరత్, మహేష్, తిరుపతిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
కన్నోళ్లకు ఊరట
నిర్మల్చైన్గేట్: కనీ పెంచి ప్ర యోజకులను చేసిన తల్లిదండ్రులను కొందరు పట్టించుకోవడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. తమను సరిగా చూసుకోవడం లేదని ఎందరో వృద్ధ తల్లిదండ్రులు వయోవృద్ధుల ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంట బిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్ట్ యాక్ట్–2026 (టీఈఏఎంపీఎస్) పేరుతో ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఇది పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రులకు అండగా నిలవనుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకు.. పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ను కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారితో పాటు ప్రజాప్రతి నిధులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. వారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేల చొప్పున కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారు. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్రాంత ఉద్యోగులకూ తప్పని కష్టాలు ఉద్యోగం చేసి రిటైరైన పెన్షనర్లలో చాలామంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల నెలా వచ్చే పింఛన్ డబ్బుల కోసం వేధించే వారు ఎందరో ఉన్నారు. కొందరైతే తల్లి లేదా తండ్రి బ్యాంకు పాస్ పుస్తకం, ఏటీఎం కార్డులను తమవద్దే ఉంచుకుని, వారి పెన్షన్ ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు.ఫిర్యాదు చేయండిలా.. బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. -
పకడ్బందీగా అమలు చేయాలి
కన్నవారిని చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించే వారిపై కఠిన చర్యలుండాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. అయితే కచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. గతంలో ఒక జిల్లాస్థాయి అధికారి తన తల్లిని సరిగా చూసుకోవడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే పరిశీలించిన అధికారి ప్రతీనెల తల్లికి రూ.పదివేల చొప్పున ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ అమలుకాలేదు. ఇలా తూతూమంత్రంగా కాకుండా పథకం పకడ్బందీగా అమలు చేయాలి. – ఎంసీ లింగన్న, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
రెబ్బెన: మండలంలోని మాద్వాయిగూడ సమీపంలో గల జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. కాగజ్నగర్కు చెందిన అర్ఫజ్ బేగ్ (21) బుధవారం తన స్నేహితులైన గౌస్, కిరణ్, సాయి, జిబిల్తో కలిసి ఈత కొట్టేందుకు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అందరూ కలిసి నీటిలో దిగగా అర్ఫజ్ నీటమునిగాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ప్రాజెక్టులో గాలించారు. రాత్రయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం తెల్లవారు జామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుని మేనమామ మహ్మద్ నౌషద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పీఎం ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవాలిపాతమంచిర్యాల: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 25 సంవతర్సాల వయస్సు కలిగి ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ/ పీజీ చదువుతున్న విద్యార్థుఽలు అర్హులన్నారు. ఎంపికై న వారికి 6–9 నెలల పాటు ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఉంటుందని నెలకు రూ.9వేల స్టైఫండ్, రూ.6 వేల గ్రాంట్ అందిస్తారన్నారు. ఆసక్తి కలవారు http/pminternship.mca.gov.in. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 1800 116 090 నంబరులో లేదా కలెక్టరేట్లోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. స్థలం ఆక్రమించిన నలుగురిపై కేసుఆదిలాబాద్రూరల్: తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్హెచ్ఓ రాహుల్ కాంత్ (ఐపీఎస్) తెలిపారు. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ సర్వే నం.1లో ప్లాట్ నం.20లో మంద జయనారాయణ రెడ్డికి చెందిన స్థలాన్ని మైసర్ల లక్ష్మి, సిరిపురం రమాదేవి, ప్రసన్న, రాణి ఆక్రమించారు. బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైసర్ల లక్ష్మిని అరెస్టు చేయగా, మిగితా ముగ్గురు పరారీలో ఉన్నారు. -
తాత అంత్యక్రియలకు వెళ్తూ.. మనుమడు అనంతలోకాలకు
జన్నారం: తాత అంత్యక్రియలకు వెళ్తూ గుండెపోటుకు గురై మనుమడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్కు చెందిన సంకపాగ దేవన్న (35) గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్లలో వరుసకు తాత అయిన చిన్నరాజన్న అంత్యక్రియలకు బస్సులో బయలుదేరాడు. కడెం మండలం ఉడుంపూర్ సమీపంలోకి వెళ్లే సరికి చాతిలో నొప్పి రావడంతో జన్నారం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుని సూచన మేరకు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందాడు. పానీపూరి బండి వద్ద గొడవలో ఒకరిపై దాడి భైంసాటౌన్: పానీపూరి బండి వద్ద జరిగిన స్వల్ప తగాదా ఒకరిపై దాడికి దారితీసిన ఘటన పట్టణంలోని మున్సిపల్ చౌక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దెగ్లూర్కు చెందిన రాహుల్ భైంసాలో కొద్దిరోజులుగా పానిపూరి బండి నిర్వహిస్తున్నాడు. ఓవైసీనగర్కు చెందిన షేక్ మస్తాన్ గురువారం బండి వద్దకు వచ్చి పానీపూరి అడిగితే నిర్వాహకుడు లేదని బదులిచ్చాడు. అయినా వినకుండా దుర్భాషలాడడంతో ఆగ్రహించిన రాహుల్ రాడ్తో మస్తాన్ను గాయపర్చాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయికుమార్ తెలిపారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తే చర్యలు చిన్నపాటి గొడవలు, తగాదాలతో జరిగే ఘటనలకు విద్వేషాలు రెచ్చగొట్టేలా పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నకిలీ భూదస్త్రాలతో మోసగించిన ఇద్దరు అరెస్టుబెల్లంపల్లి: నకిలీ భూ దస్త్రాలు సృష్టించి కొనుగోలు దారుడిని మోసగించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సీ.హెచ్.హనోక్ తెలిపారు. బెల్లంపల్లి మండలం బుధాకలాన్లో రాంపల్లి గణేశ్కు చెందిన వ్యవసాయ భూమిని మంచిర్యాలకు చెందిన సంగం సాగర్కు లాశెట్టి సతీష్ (బుధాకుర్దు), రామటెంకి హరికృష్ణ, రామటెంకి శివకుమార్ (బట్వాన్పల్లి), కామెర రాజు (మంచిర్యాల), కట్టా పవన్ కుమార్ (బెల్లంపల్లి బస్తీ) ముఠాగా ఏర్పడి నకిలీ పట్టేదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు సృష్టించి అమ్మకానికి ఒప్పందం చేసుకున్నారు. సాగర్ వద్ద నుంచి ముఠా సభ్యులు పలు దఫాలుగా రూ.31,80,000 నగదు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం లాశెట్టి సతీష్, కట్టా పవన్ కుమార్ను అదుపులోకి తీసుకోగా హరికృష్ణ, శివకుమార్, రాజు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
హనుమాన్ జయంతిలో కుస్తీ పోటీలు
ముధోల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో గురువారం వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ముధోల్తో పాటు పక్క మండలాలు, మహారాష్ట్ర నుండి వచ్చిన మల్లయోధులు పోటీల్లో తలబడ్డారు. మొదటి విజేతకు రూ.5వేలు, రెండో విజేతకు రూ. 2,500 బహుమతిగా అందజేశారు. గూడెంలో పౌర్ణమి జాతరదండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం చైత్రపౌర్ణమి జాతర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 178 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఆలయం తరుపున ఉచిత అన్నదానం చేశారు. దొంగతనం, దాడి కేసులో నిందితుడి రిమాండ్ ఆదిలాబాద్రూరల్: దొంగతనం, దాడి కేసులో ఆదిలాబాద్ పట్టణంలోని నీలానగర్కు చెందిన ఆటోడ్రైవర్ సొంకాంబ్లే బయ్యసాహెబ్ను 24 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ట్లు మావల ఎస్హెచ్ఓ, ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్ తెలిపారు. ఆదిలాబాద్లోని శాంతినగర్ కాలనీకి చెందిన కుర్సెంగా మాణిక్రావుకు సొంకాంబ్లే బయ్యసాహెబ్ తక్కువ ధరకు ప్లాట్ చూపిస్తానని మార్చి 31న డుబ్బ గూడ బైపాస్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించి డబ్బులు, మొ బైల్, బైక్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ప్రతిఘటించగా రాయితో తలపై దాడి చేశాడు. డబ్బులు, మొబైల్, బైక్ తో పారిపోయాడు. ఈనెల1న బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై కె.రాజశేఖర్రెడ్డి దర్యాప్తు చేశారు. గురువారం దస్నాపూర్ సమీపంలో సొంకాంబ్లే బయ్యసాహెబ్ను అదుపులోకి తీసుకుని బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు. పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యభీమిని: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై భాస్కర్రావు తెలిపిన వివరాల మేరకు కన్నెపల్లి మండలంలోని లింగాలకు చెందిన జంపాల తిరుపతి (35) రూ.2 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి గుర్తుతెలియని పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని సోదరుడు అంజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బ్యాగు అప్పగింత
లక్సెట్టిపేట: గొల్లపల్లి మండలం ధనురుకు చెందిన కొల్లూరి భాగ్యలక్ష్మి గురువారం పని నిమిత్తం ఉట్నూర్కు వెళ్ళింది. తిరుగుప్రయాణంలో మంచిర్యాల వెళ్లే బస్సు ఎక్కి లక్సెట్టిపేటలో దిగింది. తన బ్యాగ్ బస్సులోనే మరిచిపోవడంతో వెంటనే లక్సెట్టిపేట పోలీసులకు సమాచారం అందించింది. బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న ఎంబడి సత్యనారాయణ, రాజేందర్ వెంటనే మంచిర్యాల బస్టాండ్కు వెళ్లి డిపో మేనేజర్తో మాట్లాడి బ్యాగును తెప్పించి బాధితురాలికి అప్పగించారు. బ్యాగులో బంగారంతో పాటు నగదు కూడా ఉన్నట్లు బాధిత మహిళ పేర్కొంది. -
నిర్వాసిత గ్రామాలుగా ప్రకటించాలి
కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె) గ్రామ పంచాయతీలోని ట్యాంకుబస్తీ, ఎన్టీఆర్ కాలనీలను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు, సర్పంచ్, వార్డుసభ్యులు తీర్మానం చేశారు. ఓసీ ప్రాజెక్టు పేలుళ్లకు ఇళ్లు పగుళ్లు తేలుతున్నాయని, దుబ్బగూడం మాదిరి పునరావాసం కల్పించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీ స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చైతన్య ప్రవీణ్ నాయక్, ఉపసర్పంచ్ మల్యాల స్రవంతి, పంచాయతీ కార్యదర్శి కీర్తి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు సంకె రవి, కనుకుల రాకేష్, శ్రీనివాస్, తోడేటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్కేపీ ఓసీపీని పరిశీలించిన కేంద్ర బృందం
రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలో అమలు చేస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నతాధికారుల బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సలహాదారు తరుణ్ కత్తుల నేతృత్వంలోని బృందం సింగరేణి కార్పొరేట్ జీఎం (ఎన్విరాన్మెంట్) సైదులు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ గని పరిసర ప్రాంతాలను సందర్శించింది. ఓసీ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న కాలుష్య నియంత్రణ చర్యలు, ట్రావెలింగ్ రోడ్ల వెంట నిర్వహిస్తున్న ఎవెన్యూ ప్లాంటేషన్, గని పరిసరాల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం జీఎల్ ప్రసాద్, ఓసీ మేనేజర్ పంకజ్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని నిరసన
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాత మంచిర్యాల ట్రాన్స్కో కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్స్ కార్మికులు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా, ఆర్టిజన్స్ అనే దినసరి కూలీలుగా మిగిలిపోయామని వాపోయారు. విద్యార్హతలు, సీనియారిటీ ఉండి కూడా కనీస సర్వీస్ రూల్స్ లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్నామని తెలిపారు. వెంటనే కన్వర్షన్ అనే డిమాండ్ను పరిశీలించి ఆర్టిజన్స్కు న్యాయం చేయాలని, వివిధ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు సత్యనారాయణ, పవన్, 541 జిల్లా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శివ, చుంచు రమేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నంపై విచారణ జరపాలి
ఖానాపూర్: మండలంలోని ఎర్వచింతల్ ఆశ వర్కర్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ డిమాండ్ చేశారు. ఎర్వచింతల్ గ్రామాన్ని సందర్శించి బాధిత ఆశవర్కర్ పద్మతోపాటు బాలింత రమణబాయిని గురువారం పరామర్శించారు. గర్భిణికి సంబంధిత అధికారులు, సిబ్బంది వైద్యం నిలిపివేయడం అమానుషమన్నారు. వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోపాటు సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందన్నారు. ఘటనపై ఆయా శాఖల అధికారులు సమగ్ర విచారణ చేసి బాధితురాలికి రక్షణ కల్పించడంతోపాటు బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు గంగమణి, తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ సమ్మేళనానికి సీఎండీకి ఆహ్వానం
శ్రీరాంపూర్: పట్టణంలోని ప్రగతి మైదానంలో ఈ నెల 19న నిర్వహించనున్న ఉద్యోగ, అధికారులు, క్రీడాకారులు, కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు సీఎండీని కోరారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ మైదానంలో ఆడిన ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారన్నారు. కళాకారులకు కూడా గొప్ప వేదికై ందన్నారు. కార్మికులు, అధికారులు ప్రతీరోజు వ్యాయామం చేయడానికి ఈ మైదానానికే వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వై.యాదిరెడ్డి, శ్యాంసుందర్, పీ.సంపత్కుమార్, ప్రేంకుమార్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష
చెన్నూర్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పెద్దింటి పద్మ అధ్యక్షతన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, రోడ్లు భవనాలు, దేవా దాయ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది టైర్వన్ గోదావరి ఘాట్లలో చెన్నూర్ ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. చెన్నూర్కు నలువైపుల రోడ్డు సౌకర్యం పెరగడంతో రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, రోడ్లు, పార్కింగ్, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వానికి నివేదిస్తామని అ న్నారు. అనంతరం నది సమీలోని పుష్కర ఘా ట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సి పల్ కమిషనర్ మురళీకృష్ణ, సీఐ బన్సీలాల్, డీటీ సనత్కుమార్, హైదరాబాద్ ఫ్లై ఏజెన్సీ అధికారి అనిరుధ్, వైస్ చైర్మన్ వినయ్కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, శివకృష్ణ, కాంగ్రెస్ నాయకులు గొడిసెల బాపురెడ్డి, పెద్దింటి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
యజమాని ఇంట్లోనే దొంగతనం
ఆదిలాబాద్టౌన్: డబ్బుపై వ్యామోహంతో ఓ పని మనిషి కూతురితో కలిసి దొంగతనానికి పాల్పడింది. ఈమేరకు ఇచ్చోడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దొంగలించిన 10 తులాల బంగారం, 10 తులాల వెండిని పోలీసులు రికవరీ చేశారు. బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇచ్చోడలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్న ఉపాధ్యాయుడు పవార్ ప్రేమ్సింగ్ ఇంట్లో పని మనిషిగా ఉన్న ఇచ్చోడ మండలం అడిగామకు చెందిన దేవ లక్ష్మి ఆమె కూతురుతో కలిసి యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడింది. గత నెల 16న శుభకార్యానికి వెళ్లి వచ్చిన తర్వాత యజమాని కుటుంబం బంగారాన్ని ఇంట్లో భద్రపర్చారు. ఈ విషయాన్ని పని మనిషి లక్ష్మి గమనించి దొంగతనానికి కుట్ర పన్నింది. ఇంటి యజమాని లేని సమయంలో గత నెల 18న ఇంట్లో నుంచి బంగారం, వెండిని అపహరించింది. 26న మరో శుభకార్యానికి వెళ్లేందుకు యజమాని కుటుంబ సభ్యులు ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. 27న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. దొంగలించిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలో ఇచ్చోడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. -
ఏజెన్సీ రక్షణ చట్టాలు అమలు చేయాలి
ఇంద్రవెల్లి: ఏజెన్సీ రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. న్యాయమైన హక్కులను పరిష్కరించాలనే డిమాండ్తో అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్వలో బుధవారం మండలంలోని గిన్నెర గ్రామపంచాయతీ ఆదివాసీలతో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడారు. ఏజెన్సీలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి వలస లంబాడాలను తొలగించాలని పేర్కొన్నారు. రిలే దీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహిస్తామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, రాష్ట్ర నాయకుడు పుర్క బాపురావ్, జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్, అమరవీరుల ఆశయ సాధన సమితి మండల అధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్, ఆదివాసీ నాయకులు ఆర్క ఖమ్ము, తుకారం, పుర్క చిత్రు, జుగ్నాక్ భరత్, సోయం రాందాస్, గేడం భారత్ ఉన్నారు. -
‘పది’ మూల్యాంకనం షురూ
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. స్థానిక ఏసీసీ కార్మెల్ హైస్కూల్ స్పాట్ కేంద్రంలో తొలిరోజు ఉదయం పూటంతా ఉపాధ్యాయులు రిపోర్టు చేయడం, విధులపై శిక్షణతోనే సరిపోయింది. కేంద్రానికి వచ్చిన పలువురు టీచర్లు విధుల రద్దుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చెట్ల కింద, తరగతి గదుల వరండాలో అటూ ఇటూ కలియదిరిగారు. అనారోగ్యం, అత్యవసర కారణాల సాకుతో విధులకు దూరంగా ఉండేందుకు పైరవీలు సాగించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి మూల్యాంకనం విధులకు హాజరు కావాలని డీఈవో యాదయ్య సూచించడం కనిపించింది. ఇంగ్లిషు టీచర్ల కొరత, విధులకు హాజరు కాని వారికి డీఈఓ ఫోన్లు చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత ఇతర జిల్లాల నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన 1,31,398 జవాబు పత్రాలు మంచిర్యాల మూల్యాంకన కేంద్రానికి చేరాయి. మూల్యాంకానికి డీఈవో యాదయ్య శిబిరం అధికారిగా, పరీక్షల విభాగం సహాయ కమిషనర్గా మల్లేశం(స్ట్రాంగ్రూం), సహాయ క్యాంపు అధికారులుగా పోచయ్య(అడ్మినిస్ట్రేషన్), తిరుపతిరెడ్డి(స్పాట్ వాల్యూయేషన్) వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల మూల్యాంకానికి చీఫ్ ఎగ్జామినర్లు(సీఈ), ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లుగా పలువురికి రెండ్రోజుల ముందే విధులు కేటాయించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు కొందరు కారణాలు వెతికి తప్పించుకోవాలని చూడడంతో తొలి రోజు మూల్యాంకనం ఆలస్యమైంది. డీఈవో యాదయ్య ఫోన్లు చేసి విధులకు హాజరు కావాలని ఆదేశించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగింది.విధులు కేటాయించిన ఉపాధ్యాయుల సంఖ్యసబ్జెక్టు సీఈలు ఏఈలు స్పెషల్ అసిస్టెంట్లు తెలుగు 5 30 10 హిందీ 4 4 8 ఇంగ్లిషు 12 72 24 గణితం 7 40 13 -
మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
బెల్లంపల్లి: స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకుని మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మండలంలోని బట్వాన్పల్లి గ్రామ పంచాయతీ లంబాడితండా, తాళ్లగురిజాల గ్రామాల మహిళలకు అలీవ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలో తాళ్లగురిజాల పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి కిషన్, డీపీఎం సారయ్య, ఏపీఎం విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధాకర్నాయక్, మెడికల్ అధికారి డాక్టర్ ఎవాంజలీన, సర్పంచ్లు సింగతి రాజేష్, వంగ రాము, సాగర్ల లక్ష్మణ్, అలీవ్ సంస్థ వ్యవస్థాపకుడు కాశీం పాల్గొన్నారు. 11మందికి షోకాజ్ నోటీసులు విధి నిర్వహణలో సమయపాలన పాటించని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిష్టర్లు, రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. హాజరు పట్టిక పరిశీలించి 11మంది సమయపాలన పాటించనట్లు గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి మంచిర్యాలటౌన్: జిల్లా ప్రజలు అసంక్రమణ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వరకు అసంక్రమణ వ్యాధులు, హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమాల వైద్య శిబిరాల నిర్వహణను పాతమంచిర్యాలలో బుధవారం ప్రారంభించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ.ప్రసాద్, డాక్టర్ అశోక్, డెమో బుక్క వెంకటేశ్వర్, సీహెచ్వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పారదర్శకంగా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఈ నెల 4న చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ ఎన్నికలు పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, సీఐ రమేష్, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్తో మాట్లాడి సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లకు సమయానికి నోటీసులు అందించాలని తెలిపారు. -
లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి
శ్రీరాంపూర్: కార్మికులకు గుదిబండగా మారిన నూతన లేబర్ కోడ్లను కేంద్రం ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఆర్కే 7 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామంటున్న లేబర్ కోడ్లను కార్మిక వర్గం తిప్పి కొట్టాలన్నారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు కట్టు బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ శ్రీనివాస్, శ్రీధర్ సమ్మయ్య, గడ్డం శంకర్, అభిలాష్ సదానందం పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన.. లేబర్ కోడ్లకు నిరసనగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శ్రీరాంపూర్లోని పలు డిపార్టుమెంట్ల వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర నాయకుడు దేవయ్య, నాయకులు డీ.బ్రహ్మానందం, శంకరి, సత్యం, అప్పారావు, తిరుపతిరెడ్డి, కనకయ్య పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీల్లో ‘టీమ్ గరుడ’ ప్రతిభ
బాసర: ఆర్జీయూకేటీ, బాసర మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థుల బృందం ‘టీమ్ గరుడ’ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చింది. 2వ, 3వ, 4వ సంవత్సరం విద్యార్థుల 30 మంది బృందం రూపొందించిన ఆల్టైరెన్ వెహికల్(ఏటీవీ)తో ఘనత సాధించింది. మార్చి 27 నుంచి 31వరకు నర్సాపూర్లోని బీవీఆర్ఐటీలో జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 55 జట్లు పాల్గొన్నాయి. టీమ్ గరుడ డిజైన్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ కై వసం చేసుకుంది. కాగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వరకు అహ్మదాబాద్లోని మోనార్క్ యూనివర్సిటీలో 43 జట్లు పోటీ పడగా టీమ్ గరుడ అసాధారణ ప్రతిభ కనబరిచి రెండు ప్రధాన అవార్డులు సొంతం చేసుకుంది. డిజైన్ ఎవాల్యుయేషన్ విభాగంలో ఆల్ ఇండియా 1వ ర్యాంక్ (విన్నర్స్), బెస్ట్ మోటివేటెడ్ టీమ్ అవార్డు గెలుచుకున్నారు. విద్యార్థులను బుధవారం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీదర్శన్, అసోసియేట్ డీన్లు కె.మహేశ్, శేఖర్ శీలం, ఎస్.విట్టల్, మెకానికల్ హెచ్వోడీ ఎ.చరణ్రెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు రాహుల్ అభినందించారు. -
పర్యావరణ చర్యల పరిశీలన
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో తీసుకుంటున్న పర్యావరణ పరిరక్షణ చర్యలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించారు. బుధవారం ఆ శాఖ సలహాదారు తరుణ్ కత్తుల పర్యావరణ అధికారులు, ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్తో కలిసి పరిశీలన చేశారు. ఏరియాలోని ఆర్కే 6, ఎస్సార్పీ 3, ఐకే 1ఏ గని పరిసర ప్రాంతాలు, కృష్ణ కాలనీ, శ్రీరాంపూర్ ఏరియాలోని మైదానాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, సోలార్ ల్యాంప్లు, ట్రావెలింగ్ రోడ్లు, వాటి పక్కన పెరిగిన ప్లాంటేషన్, కాలనీల్లోని పార్కులు, ఇంకుడుగుంతలు సందర్శించారు. గనులపై ఫిల్టర్ బెడ్లను తనిఖీ చేసి పర్యావరణ పరిరక్షణ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులు శ్రీరాంపూర్ ఏరియాలో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న అన్ని చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, ఏజెంట్లు శ్రీధర్, రవికుమార్, డీజీఎం(సివిల్) ఆనంద్కుమార్, కార్పొరేట్ ఎన్విరాన్మెంటు అధికారులు శ్రీనివాస్, సునీల్, సురేష్, ఏరియా క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్రెడ్డి, ఏరియా ఎన్విరాన్మెంటు అధికారి హనుమాన్గౌడ్, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి పాల్గొన్నారు. -
ఓటరు సవరణలో భాగస్వాములు కావాలి
మంచిర్యాలటౌన్: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టే ప్రత్యేక ఓటరు సవరణ(సర్)లో బీజేపీ కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్తో కలిసి జిల్లా పదాధికారులు, సీనియర్, మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడతూ కేంద్ర ఎన్నికల సంఘం 2002 తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా సర్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. బీజేపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్ను నియమించి తప్పులు లేని ఓటరు జాబితా కోసం కృషి చేయాలని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. -
జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో యువకుడు గల్లంతు
రెబ్బెన: సరదాగా స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లిన యువకుడు జగన్నాథ్పూర్ ప్రాజెక్టులో గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాగజ్నగర్కు చెందిన మహ్మద్ అర్భాస్ (18) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాగజ్నగర్ మండలంలోని జగన్నాథ్పూర్ ప్రాజెక్టు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత రాని అర్భాస్ ఒక్కసారిగా లోతుగా ఉన్న నీటిలో మునిగిపోయాడు. ఎంతకీ నీటి నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులు భయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రెబ్బెన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అర్భాస్ కోసం ప్రాజెక్టు నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు మధ్యలోనే నిలిపివేశారు. గురువారం ఉదయం తిరిగి గాలిస్తామని పోలీసులు తెలిపారు. -
దళితుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి
పాతమంచిర్యాల: దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో డీహెచ్పీఎస్ 2వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేడ్కర్ అభయహస్తంకు నిధులు విడుదల చేయాలన్నారు. నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, డీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, జిల్లా బాధ్యులు దాగం మల్లేష్, వనం సత్యనారాయణ, బొంతల లక్ష్మినారాయణ, గుండా చంద్రమాణిక్యం, నక్క వెంకట స్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు, ఆఫీస్బేరర్లు పాల్గొన్నారు. ఆభరణాలు అపహరణనిర్మల్చైన్గేట్: నిర్మల్ బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలు అపహరించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం నిర్మల్లోని బంధువుల ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంగళవారం నిర్మల్ బస్టాండ్కు వెళ్లి బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగులోని 3 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. బస్సు బయల్దేరిన తర్వాత కొంతసేపటికి ఈ విషయం గుర్తించిన ఆమె, బంధువుల సహకారంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందుబాబులకు జైలు శిక్షఆదిలాబాద్టౌన్: మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మద్యం సేవించి వాహనాలు న డుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చగా ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జేఎఫ్సీఎం జడ్జి భుక్య హుస్సేన్ బుధవారం తీర్పునిచ్చారు. మొత్తం 19 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, జడ్జి 13 మందికి మూడు రోజుల పాటు, ఆరుగురికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 17 మందిపై ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో, ఇద్దరిపై వన్టౌన్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
దండేపల్లి: మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండలంలోని నెల్కివెంకటాపూర్, కొండాపూర్, ధర్మరావ్పేట, నాగసముద్రం గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు తహసీల్దార్ రోహిత్దేశ్పాండేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అరైవ్–అలైవ్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఏసీసీ సమీపంలో రహదారిపై వాహనాల తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, ట్రాఫిక్ సీఐ వేణుచందర్, ఎస్సైలు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో బాలింత మృతి
● గత నెల 23న మగ శిశువుకు జననం ఉట్నూర్రూరల్: మండలంలోని హీరాపూర్ –జే గ్రామానికి చెందిన గిరిజన బాలింత కుంర జంగుబాయి (32) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంర చందు –జంగుబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మొదటి సంతానం 7 సంవత్సరాల పాప ఉంది. రెండో కాన్పు కోసం జంగుబాయి గత నెల 22న రిమ్స్లో చేరింది. మరుసటి రోజు మగ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రిమ్స్లో నయం కాకపోవడంతో వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. మంగళవారం హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తల్లి ప్రేమకు దూరం.. తల్లి జంగుబాయి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. జంగుబాయికి ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే బతికి ఉండేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నా సరైన వైద్యం అందలేదని వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నా చికిత్స అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతిమామడ: మండలంలోని రాశి మెట్ల గ్రామానికి చెందిన రాథోడ్ సతీశ్(26) బుధవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలోని చెక్డ్యాం వద్దకు సతీశ్ చేపల వేటకు వెళ్లాడు. విద్యుత్వైరు సాయంతో చేపలు పడుతుండగా వైరు కాలుకు తగలడంతో షాకు తగిలి మృతి చెందాడు. సతీశ్ మృతితో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఎస్సై హన్మాండ్లు సంఘటన స్థలం సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులపై పోక్సో కేసు..?నిర్మల్చైన్గేట్: పట్టణంలోని ఓ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గత నవంబర్లో జూనియర్ విద్యార్థిపై ఈవ్ టీజింగ్, లైంగిక దాడికి యత్నించిన కారణంగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయమై కాస్త ఆలస్యంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై పట్టణ పోలీస్లను సంప్రదించగా స్పందించలేదు. -
పేదల సంక్షేమానికి పెద్దపీట
జన్నారం: ప్రజాపాలనలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అర్హులైన 72మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రైతువేదికలో వ్యవసాయ యాంత్రీకరణ్ పథకంలో భాగంగా ఐదు పవర్ టిల్లర్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేసే బాధ్యత తనదని అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామం అభివృద్ధి జరిగేలా సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని, తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటానని అన్నారు. వేసవిలో నీటి సమస్య రాకుండా అవసరమైన చోట బోరు వేయిస్తామని, ట్యాంకులు, నల్లాల మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమయంలోనైనా తనను కలువవచ్చని, ఫోన్ ద్వారా సమస్య చెప్పినా స్పందిస్తానని తెలిపారు. అనంతరం రాంపూర్, పొనకల్ శ్రీలంక కాలనీ, రేండ్లగూడ గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉమర్షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇసాక్, కార్యదర్శి ముజాఫర్ అలీఖాన్, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి ఈవో ఇంకెన్నాళ్లో..!
భైంసా: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువైన బాసర క్షేత్రంపై గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాలు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంలో బాసర అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు ఇచ్చి రూ. 42 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల క్రితం బాసరలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసర ఆలయ మాస్టర్ ప్లాన్పై వివరించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆలయ విస్తరణ, గర్భగుడి పునర్నిర్మాణం, గోదావరి స్నానఘట్టాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికీ ఇన్చార్జీ ఈవోనే.. బాసర ఆలయంలో గత కొన్నేళ్లుగా ఇన్చార్జీ ఈవోతోనే పాలన కొనసాగుతోంది. సీఎం రేవంత్రెడ్డి బాసర పర్యటన నాటికై నా రెగ్యూలర్ ఈవోను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయ పరిపాలనలో తీవ్ర లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయానికి ఏళ్ల తరబడి శాశ్వత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) నియామకం జరగలేదు. దీని వల్ల కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ లోపించడంతో అక్రమాలకు అవకాశం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది కొరత.. సిబ్బంది కొరత ఆలయ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లలో మొత్తం 6 పోస్టులకు గాను 4 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్లలో 10 పోస్టులకు నలుగురు, రికార్డ్ అసిస్టెంట్లు ముగ్గురు, సూపరింటెండెంట్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక వాగ్దేవి సొసైటీ కింద 84 మంది పని చేస్తున్నారు. ఈ సిబ్బందిని లడ్డూ కౌంటర్లు, ఎలక్ట్రిషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేయిస్తున్నారు. ప్రత్యేక పర్వ దినాల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బాసర సరస్వతీ ఆలయం ఇంజినీరింగ్ విభాగంలో.. బాసర ఆలయంలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ఇక్కడ పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసం డీఈఈ, ఏఈ, జేఈ, వర్క్ఇన్స్స్పెక్టర్లు అవసరం. కానీ ఈ శాఖలో ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఇంజనీర్లు కూడా లేరు. వందల కోట్ల రూపాయలతో పనులు చేపడుతుంటే పర్యవేక్షించే అధికారులు లేక పోవడం గమన్హారం. ఇక బాసరలో ఉత్సవాల్లో కొంత మంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తీరు, ఫిర్యాదులపై ఇప్పటికే దేవాదాయ శాఖ విచారణ కూడా చేపట్టింది. అయినప్పటికీ ఆలయంలో పూర్తిస్థాయి మార్పులైతే జరగడం లేదు. సీఎం పర్యటన.. బాసర మాస్టర్ ప్లాన్లో భాగంగా రూ.100 కోట్లతో సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పనుల శంకుస్థాపనలు సీఎం రేవంత్రెడ్డి చేయనున్నారు. ఇప్పటికే బాసర ఆలయ అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిగాయి. బాసర అభివృద్ధిపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ పలుమార్లు అసెంబ్లీలోనూ చర్చించారు. సీఎం రేవంత్రెడ్డితో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే బాసర అభివృద్ధిపై చర్చించారు. సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
చెన్నూర్రూరల్: మండలంలోని కొమ్మెర గ్రామానికి చెందిన మేడగోని జ్యోతి (50) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి మంగళవారం ఉతికిన దుస్తులు ఇంటిముందున్న రేకుల షెడ్డు కింద ఇనుప తీగపై ఆరేసే క్రమంలో ప్రమాదవశాత్తు దానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 20 ఏళ్ల క్రితమే జ్యోతి భర్త వెంకటస్వామి మృతి చెందాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఎంతో కష్టపడి ఇద్దరు కూతుళ్లకు వివాహాలు చేసింది. కొడు కు హరికృష్ణ ఆటో నడుపుతూ అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చిన్న తనంలోనే తండ్రిని, ఇప్పుడు తల్లిని కో ల్పోయారు. పోస్టుమార్టం ని మిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బన్సీ లాల్ తెలిపారు. -
విద్యార్థిని మృతిపై కొనసాగుతున్న విచారణ
చెన్నూర్: చెన్నూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలి కల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు మృతిపై అన్ని కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. చికిత్స పొందుతూ మృతిచెందిన నాటి నుంచి నేటి వరకు పాఠశాలలో చెన్నూర్ సీఐ బన్సీ లాల్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. విద్యార్థిని రాసిన కొన్ని లేఖలు పోలీసులు వద్ద ఉన్నాయి. వాటితోపాటు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నిరోషా ఎదుట విద్యార్థిని శ్రీహిందు ఇచ్చిన వాంగ్మూలమే కీలకం కానున్నట్లు తెలిసింది. పాఠశాలలో మానసిక బాధలు, తనకు ఉన్న అలవాట్లను అడ్డుకున్న ఉపాధ్యాయుల తీరుపై లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. గడ్డి మందు ఎక్కడి నుంచి తెచ్చుకుంది.. ఎందుకు తెచ్చుకుంది అనే విషయాలూ అందులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు విద్యార్థిని మృతిచెందిన విషయాన్ని తెలుసుకుని వెంటనే స్పందించడంతో కీలక సమాచారం చిక్కినట్లు సమాచారం. విద్యార్థిని మరణవాగ్మూలం ఆధారంగా కారకులపై చర్యలకు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. గడ్డి మందు సేవించేందుకు ప్రేరణ ఎవరు కల్పించారు.. ఎందుకు మృతిచెందాలని అనుకుంది అనే విషయాలను రెండు రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో విచారిస్తున్నాం ఏడో తరగతి విద్యార్థిని శ్రీహిందు గడ్డి మందు తాగి మృతిచెందిన ఘటనపై అన్ని కోణల్లో విచారణ చేస్తున్నాం. విద్యార్థిని మరణ వాంగ్మూలంతోపాటు స్వయంగా రాసిన లేఖలే కేసుకు కీలకం కానున్నాయి. మృతికి కారకులైన వారిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. – బన్సీలాల్, చెన్నూర్ సీఐ -
సుందరమైన ‘దువ్వెన బాతు’
జన్నారం: ఈ చిత్రంలో కనిపించే బాతు గడ్డితో కూడిన మంచినీటి కొలనులు, కుంటలు, నదుల్లో నివసించే వలస పక్షి. మగ బాతుల్లో ముక్కు మీద దువ్వెన లాంటి నిర్మాణం ఉండడంతో వీటిని కోంబ్ డక్స్ లేదా నాబ్ బిల్డ్ డక్స్ అంటారు. దువ్వెన బాతు, జుట్టు చిలువ అని స్థానిక భాషలో పిలుస్తా రు. ఇవి సుదూర ప్రయాణాలు చేస్తాయి. కొన్ని ప క్షులు మూడున్నర వేల కిలో మీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. గడ్డి విత్తనాలు, నీటిలో పెరిగే మొక్కలు, కీటకాలు, చిన్న చేపలు, కప్పలు వీటి ఆహారం. ఇవి భారత ఉపఖండ దేశాలు, మియన్మార్లో వ్యాపించి ఉన్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా దేశాల్లోనూ వ్యాపించి ఉన్నాయి. ఇవి గరిష్టంగా 30 ఏళ్ల వరకు జీవిస్తాయి. ఈ బాతులు కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారం డివిజన్లోని కిష్టాపూర్ చెరువులో కనిపించగా ఎఫ్డీవో రామ్మోహన్ కెమెరాలో బంధించి వాటి వివరాలు తెలిపారు. -
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి
పాతమంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, ఉద్యోగ, కార్మికులు వేతనాల పెంపు కోసం చలో హైదరాబాద్కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా పోలీసులతో దాడులు చేయించడం దారుణమని అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఐకేపీ వీవోఏలు, భవన నిర్మాణ రంగాల కార్మికులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు సీపీఎం మద్దతు ఉంటుందని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలని, ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని చెప్పారు. అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాల వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అభివృద్ధికి, కాళేశ్వరం ముంపు సమస్యకు, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు కేటాయించాయో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ బహిర్గతం చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడంకి చందు, అశోక్, ప్రకాష్, ఉమారాణి, మల్లేశ్వరీ, లింగన్న, రంజిత్కుమార్, శ్రీనివాస్, ప్రేంకుమార్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. -
విహారయాత్రకు గిరిజన క్రీడాకారులు
ఖానాపూర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన గిరిజన క్రీడాకారులకు అరుదైన అవకాశం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ, క్రీడా పాఠశాలల విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు జూపార్క్, లుంబిని పార్క్ను సందర్శించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విహారయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్తో విద్యార్థులు ఫొటోలు దిగారు. కాగా, 2025–26 సంవత్సరానికి నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఖో–ఖో, ఆర్చరీ, వెయిట్లిఫ్టింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సత్తయ్య
మంచిర్యాలక్రైం: జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొత్త సత్తయ్య ఎన్నికయ్యారు. స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికల కమిషనర్ మదన్మోహన్ పర్యవేక్షణలో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి రంగు మల్లేశం, అనిల్రాజ్్, కొత్త సత్తయ్య పోటీ పడ్డారు. బార్ అసోసియేషన్ సభ్యులుగా 378 మంది ఓటర్లు ఉండగా.. 328 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఠ మధ్య సాగింది. సత్తయ్యకు 224 ఓట్లు రాగా, అనిల్రాజ్కు 81 ఓట్లు వచ్చాయి. అనిల్రాజ్పై కొత్త సత్తయ్య 143 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కార్యవర్గం.. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొత్త సత్తయ్య, ఉపాధ్యక్షురాలుగా టీ.మంజుల, ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సత్తయ్య, సంయుక్త కార్యదర్శిగా జీ.మాధవిలత, కోశాధికారిగా అల్లం శ్రీనివాస్, లైబ్రరీ కార్యదర్శిగా సుధమల్ల శివరామకృష్ణ, మహిళా ప్రతినిధిగా పి.రజిని, స్పోర్ట్స్, కల్చరల్ సెకెట్రరీగా జి.రమణరెడ్డి, కార్వర్గ సభ్యులుగా జీ.లక్ష్మీ ప్రసన్న, ఎన్.సుమలత, పీ.శ్రీకాంత్, ఎస్.మల్లేష్, ఎస్.ప్రదీప్చంద్ర, ఏ.జయపాల్రెడ్డి, కే.నటేశ్వర్ ఎన్నికై నట్లు ప్రకటించారు. -
ఆర్టీసీ బస్టాండ్లో ‘మహాలక్ష్మి’ విజయోత్సవ సభ
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల బస్టాండ్లో ‘మహాలక్ష్మి’ విజయోత్సవ సభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించి 290 కోట్ల ఉచిత ప్రయాణాలతో రూ.10వేల కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల డిపోలో 3.15 కోట్ల మంది ఉచిత ప్రయాణం కింద మహిళల రూ.130 కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా అయినట్లు నగర మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ స్రవంతి, డిపో మేనేజర్ టి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అమృత్.. ఆలస్యమే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ కోసం చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’(ఆర్బీఎస్ఎస్) పనుల్లో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో సికింద్రాబాద్తో సహా మొత్తం 40స్టేషన్ల ఆధునీకరణ కోసం నిధుల ఖర్చు అంచనా రూ.2,750 కోట్లు ఉంది. స్టేషన్ స్థాయిని బట్టి నిధులు వెచ్చిస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న మంచిర్యాల రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసేందుకు రూ.26కోట్లు మంజూరయ్యాయి. 2023 కంటే ముందే ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో నిత్యం ప్రయాణికులు రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పొరుగున ఉన్న రామగుండం రైల్వేస్టేషన్లో పనులు దాదాపు పూర్తయ్యాయి. మంచిర్యాల స్టేషన్లో మాత్రం జాప్యం జరుగుతోంది. త్వరగా పూర్తయితేనే.. ప్రధాన నగరాల్లోని స్టేషన్లతోపాటు రెండో తరగతి పట్టణాల్లో ఉన్న స్టేషన్లు ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో అమృత్ స్కీం కింద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఆధునిక మరుగుదొడ్లు, స్టేషన్ పరిధిని మరింత పెంచడం, పార్కింగ్ ఏరియాను పెంచి షెడ్లు, ప్రవేశ ద్వారా నిర్మాణం, కాలినడక వంతెన(ఎఫ్వోబీ), ప్లాట్ఫాంపై నీడనిచ్చే షెడ్లు(పీవోపీ), ప్లాట్ఫాం నిడివి పెంచి కొత్తగా నిర్మించడం, లైటింగ్, పచ్చదనం పెంపు, రైళ్ల సమాచారం తెలిపే ఆధునాతన బోర్డులు తదితర పనులు చేయాలి. పనులు పొందిన కాంట్రాక్టర్లు మొదట వేగంగా మొదలై తర్వాత జాప్యం చేశారు. కొంతకాలం బిల్లుల చెల్లింపులు లేవని పనులు నిలిచిపోయాయి. త్వరలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో చివరి దశలో ఉన్న స్టేషన్ల పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు రైల్వే ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంకా పనులు ఆశించిన స్థాయిలో పురోగతిలో లేవు. 2023 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించి మూడేళ్లు గడిచిపోయాయి. దీంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే రోడ్డు ప్రమాదాలు
బెల్లంపల్లి: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని బెల్లంపల్లి ఏసీపీ వి.కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం పద్మశాలి భవన్లో పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటివైద్య నిపుణుడు అంజయ్య, వన్టౌన్ ఎస్హెచ్ఓ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, పోలీసు సిబ్బంది, లయన్స్క్లబ్ అధ్యక్షురాలు అరుణసుందరి పాల్గొన్నారు. కంటి పరీక్షను పరిశీలిస్తున్న ఏసీపీ కిరణ్కుమార్ -
చికిత్స పొందుతూ ఒకరు మృతి
భీమిని: మండలంలోని రాజారం గ్రామానికి చెందిన దుర్గం విజయ్కుమార్ (45)పై అదే గ్రామానికి చెందిన దుర్గం దేవాజీ దాడి చేయగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై కొటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన విజయ్కుమార్, దేవాజీలు వ్యక్తిగత కారణాలతో మార్చి 25న దూషించుకున్నారు. ఇదే క్రమంలో మాటామాట పెరగడంతో పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనలో విజయ్కుమార్కు మెడ భాగంలో గాయాలయ్యాయి. దీంతో అతడిని కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కూతురు ఉంది. -
బెల్లంపల్లి డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. డిగ్రీలో ఒకే సబ్జెక్ట్ను స్పెషలైజేషన్గా మూడేళ్లపాటు చదివే అద్భుత అవకాశం విద్యార్థులకు దక్కబోతోంది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సు విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని మల్టీజోన్–1 పరిధిలో ఈ కోర్సు కలిగిన ఏకై క కళాశాలగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రత్యేకత ఏర్పర్చుకుంది. ఉన్నత విద్యావ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కొత్త కోర్సులకు రూపకల్పన చేసి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన బీఏ హానర్స్ కోర్సు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ కాంపల్లి శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బెల్లంపల్లి విద్యార్థులకు చేరువ కానుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. వీరికే ప్రవేశార్హతబీఏ హానర్స్ కోర్సులో చేరడానికి ఇంటర్ తత్సమా న కోర్సులతోపాటు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వి ద్యార్థులు కూడా అర్హులు. ఇంటర్లో హెచ్ఈసీ, సీ ఈసీ, బైపీసీ, ఎంపీసీ కోర్సులతో పాటు ఒకేషనల్ చదవిన విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల కోర్సుల విద్యార్థులు చదవగలిగే సబ్జెక్ట్ను బీఏ హానర్స్ డిగ్రీలో ఎంచుకోవచ్చు. ఒకే సబ్జెక్ట్ను స్పెషలైజేషన్గా తీసుకుని మూడేళ్లపాటు చదవడం ద్వారా ఆ సబ్జెక్ట్లో అత్యుతన్నతమైన పట్టు సాధించే అవకాశం కలగనుంది. అంతటి ప్రత్యేకమైన కో ర్సు కేవలం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద క్కించుకుని అరుదైన ఘనత సాధించడం విశేషం. -
ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలి
దండేపల్లి: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. మండలంలోని కొండాపూర్, ద్వారక, లక్ష్మీకాంతపూర్, పెద్దపేట గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలయితే ఇలాంటి విపత్తులతో పంట నష్టపోతే బీమా ప్రయోజనం కలుగుతుంద ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు కావడం లేదన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, నాయకులు గోపతి రాజయ్య, సురేష్, కిషన్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం మంచిర్యాల నగరంలోని తాళ్లపల్లి, సింగాపూర్, గుత్తేదారుపల్లి ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్తో కలిసి పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల అమలు తీరును పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆండాళమ్మ కాలనీ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాంతంలో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి నెన్నెల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. మంగళవారం మండలంలోని నెన్నెల, గుండ్లసోమారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. గుండ్ల సోమారంలో అంగన్వాడీ కేంద్రం, హైస్కూల్ను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనం కోసం నివేదికలు సిద్ధం చేయాలని డీపీవో వెంకటేశ్వర్లును ఫోన్లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్లు ఇబ్రహీం, సింగతి రాణి, కార్యదర్శులు సురేష్, రంజీత్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఆవు మృతి
ఆదిలాబాద్రూరల్: మండలంలోని చాందా (టి) గ్రామానికి చెందిన చిందం చిన్న దేవన్నకు చెందిన ఆవు సోమవారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి ఆవుపై పడ్డాయి. దీంతో షాక్ తగిలి ఆవు మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని రైతు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. మెరుగైన విద్యనందించాలిఆదిలాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్, వాన్వాట్ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జిల్లా కేంద్రంలోని స్టార్ 50 కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పాఠాలు బోధించారు. ఐటీడీఏ పల్స్ యాప్ పనితరుపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, పల్స్ యాప్పై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులున్నారు. కౌటాలలో తేనెటీగల దాడికౌటాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న పలువురిపై మంగళవారం మధ్యాహ్నం తేనెటీగలు దాడి చేశాయి. సమీప చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు పరుగులు తీశారు. కార్యాలయం తలుపులు మూసుకుని అందులోనే ఉన్నారు. రామగిరి విజయ్, దివాకర్, తిరుమలేశ్, హన్మంతు తేనెటీగల దాడిలో గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తరలించి చిక్సిత అందించారు. అధికారులు స్పందించి తేనెటీగల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. డీఅడిక్షన్ సెంటర్కు బాలుడి తరలింపు చెన్నూర్: చెన్నూర్ పట్టణానికి చెందిన బాలు డు (17) గంజాయికి అలవాటు పడగా పోలీ సులు డీఅడిక్షన్ సెంటర్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ బన్సీలాల్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్ర కారం.. బాధిత బాలుడు స్నేహితులతో కలిసి గంజాయికి బానిసయ్యాడు. మహారాష్ట్రకు వె ళ్లి గంజాయి కొనుగోలు చేసి తాగుతున్నాడు. గతంలో పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినా అతడిలో మార్పు రాలేదు. గంజాయి తరచూ సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో అతడిని పట్టుకుని వైద్యాధికారి సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు రావడంతో కేసు నమో దు చేసి మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలుడిలో మా ర్పు రావడానికి వైద్యపరీక్షల నిమిత్తం మంచిర్యాలలోని డీ అడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చే శారు. ఎవరైనా గంజాయికి అలవాటు పడిడి తే వెంటనే ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో కేసులు నమోదు చేసి డీ అడిక్షన్ సెంటర్కు తరలిస్తామని సీఐ హెచ్చరించారు. సమాశంలో ఎస్సైలున్నారు. -
ఉరేసుకుని మహిళ మృతి
ముధోల్: మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన ముష్కు రజిత (26) ఉరేసుకుని మృతి చెందింది. ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి భర్త పోశెట్టి ఏడాది క్రితం దుబాయికి వెళ్లాడు. ఆరు నెలల క్రితం ఫోన్లో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అతడి అన్నదమ్ములు వచ్చి రజితను సముదాయించి వెళ్లారు. ఈ క్రమంలో పోశెట్టి రజితపై అనుమానం పెంచుకుని నువ్వు బతకొద్దని పదేపదే ఫోన్లో తిట్టేవాడు. దీంతో క్షణికావేశంలో రజిత మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి కొడుకు రిషితేజ, కూతుళ్లు తేజస్విని, వయశ్రీక ఉన్నారు. తల్లి చనిపోవడం, తండ్రి దుబాయిలో ఉండడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గాలివాన బీభత్సం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం రైతులను ఆగం చేసింది. సోమవారం అర్ధరాత్రి బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం దిగుబడి దశలో ఉన్న పంటలను దెబ్బతీసింది. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని 53 గ్రామాల్లో 1,396 మంది రైతులకు చెందిన 2,171 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, మందమర్రి, భీమారం, జైపూర్, హాజీపూర్ మండలాల్లో 748 ఎకరాల్లో దిగుబడి దశలో ఉన్న మామిడి కాయ నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే చేతికి వచ్చిన మిర్చి పంటకూ నష్టం వాటిల్లింది. పొట్ట, గులక దశలో ఉన్న వరి పంట, మరో పదిహేను రోజుల్లో దిగుబడి రానున్న మొక్కజొన్న పంట వందల ఎకరాల్లో నేల వాలింది. చేతికందే సమయంలో చెడగొట్టు వాన దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్ల పైరేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. వర్షంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించి పరిహారం అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లాలో 10.9 మిల్లీమీటర్ల వర్షం.. జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు 10.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి మండలంలో 27.7 మిల్లీమీటర్లు, తాండూర్లో 26, చెన్నూర్లో 19.3, లక్సెట్టిపేటలో 19.2, దండేపల్లిలో 17.1, జన్నారంలో 14.3, కాసిపేటలో 12.6, నెన్నెలలో 9.9, హాజీపూర్లో 8.9, భీమినిలో 7.2, మంచిర్యాలలో 7.1, కన్నెపెల్లిలో 6.1, మందమర్రిలో 5.3, నస్పూర్లో 5, జైపూర్లో 3.6, భీమారంలో 2.8, కోటపల్లిలో 2.4, వేమనపల్లిలో 2.4 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. -
శ్రీకాంత్ షిండేను కలిసిన ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీలో మహారాష్ట్ర ఉప ము ఖ్య మంత్రి ఏకనాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీ కాంత్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహారాష్ట్ర సరిహ ద్దు వడూర్ వద్ద పెన్గంగా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న ఆవశ్యకత గురించి ఆయనతో చ ర్చించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ షిండే త్వరలోనే అధి కారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ అంశాన్ని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీతోపాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గంగాధర్రావు ఉన్నారు. -
యూనిఫామ్ జాప్యమేనా..!
మంచిర్యాలఅర్బన్: పేద, ధనిక తారతమ్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫామ్(ఏకరూప దుస్తులు) అందిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం పునఃప్రారంభం నాటికి అందడం కష్టమేనని తెలుస్తోంది. ముడివస్త్రం ఇప్పటివరకు జిల్లాకు చేరకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఏర్పడింది. గతంలో యూనిఫామ్కు అవసరమైన వస్త్రం మార్చిలో ఎమ్మార్సీలకు చేరగా.. ఇప్పటివరకు ముడివస్త్రంపై స్పష్టత లేకుండా పోయింది. వస్త్రం వచ్చేదెన్నడో.. కుట్టు కోసం దర్జీ చెంతకు వెళ్లేదెన్నడో చూస్తే ఈ ఏడాది ఎదురుచూపులు తప్పేలా లేవు. సర్కారు పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ.. ఇప్పటివరకు జిల్లాకు ముడివస్త్రం రాలేదు. గత ఏడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముడివస్త్రానికి సంబంధించిన లెక్కలు తీసి ముందస్తు చర్యలు చేపట్టినా ఆగస్టు దాటిన తర్వాత యూనిఫామ్ రెండో జత పంపిణీ ప్రక్రియ కొసాగింది. దీంతో ఒకే జతతో ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వర్షాలు కురవడం వల్ల తడిసిన దుస్తుల స్థానంలో సాధారణ దుస్తులతో స్కూల్కు వచ్చారు. ఒకే యూనిఫాంను ఉతికి ఆరేయడం వల్ల రంగు వెలిసి పాతవాటిగా కనిపించాయి. సరఫరాలో ఇబ్బందులు వస్త్రం సరఫరాలో జాప్యం కారణంగా ఇబ్బందులు తలెత్తనున్నాయి. మార్చిలోనే ఎమ్మార్సీలకు చేరాల్సి ఉంది. ముడివస్త్రం జిల్లాకు, అక్కడి నుంచి మండలాలు, పాఠశాలలకు చేరవేస్తారు. దుస్తులు కుట్టేందుకు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఏప్రిల్లో అందించేవారు. మే నెలాఖరు నాటికి కుట్టి పాఠశాలలకు అప్పగించేవారు. ముడిసరుకు ఆలస్యం, సమయం తక్కువగా ఉండడం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కావడం వల్ల కుట్టడంలో మరింత జాప్యం కానుంది. పొట్టిగా.. పొడుగ్గా.. గత ఏడాది 774 సర్కారు బడుల్లో చదివే 43,614మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందించారు. దుస్తులు కుట్టేందుకు 961 మంది స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా.. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలంతోపాటు మరో మండలంలో యూనిఫాంలు అప్పగించడంలో నిర్లక్ష్యం వహించారు. పదే పదే ఫోన్లు చేసినా సకాలంలో అప్పగించలేదని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో విద్యార్థి కొలతలు తీసుకుని వాటికి అనుగుణంగా కుడితే దుస్తులు చక్కగా అమరుతాయి. ఇదివరకు తరగతుల వారీగా ఓ విద్యార్థి నుంచి కొలత తీసుకుని దాని ఆధారంగా దుస్తులు కుట్టడం వల్ల విద్యార్థులు వేసుకోలేక అవస్థలు పడ్డారు. పొట్టి నెక్కర్లు, అంగీలతోపాటు గుండీలు ఊడిపోయాయి. దీంతో విద్యార్థులకు మరో జతను దుకాణాల్లో కొనుగోలు చేయడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడింది. ముడివస్త్రం సరఫరాలో ఆలస్యాన్ని సాకుగా చూపే అవకాశాలు లేకపోలేదు. స్కూల్ యూనిఫాం పొట్టిగా.. పొడుగ్గా లేకుండా సకాలంలో అందించాలని పలువురు కోరుతున్నారు. -
ఆయుష్మాన్ ఆరోగ్య సేవలు విస్త్తృతపర్చాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు అందించాల్సిన ఆరోగ్య సేవలను విస్తృత పర్చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 45 ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాల వైద్య సిబ్బందితో మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ క్వాలిటీ సర్టిఫికెట్ కోసం తయారు చేసుకోవాలని, మూడు బృందాలను ఏర్పాటు చేయాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అందే విధంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. మాతాశిశు సంరక్షణకు వందశాతం టీకాలు ఇప్పించడం, అసంక్రమణ వ్యాధులను గుర్తించడం, మందులు అందించి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు వివరించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి, భాగ్య, ప్రవళిక, జాతీయ క్వాలిటీ మేనేజర్ రాజ్కుమార్, మౌనిక, అఖిల్ భాష పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఇద్దరికి చోటు
చెన్నూర్/బెల్లంపల్లి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన దుర్గం అశోక్, బెల్లంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవిని నియమించారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గంలో ఇద్దరికి చోటు లభించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, చెన్నూర్, బెల్లంపల్లి పట్టణ, మండల కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దుర్గం అశోక్ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి -
‘ప్రణాళిక’ పకడ్బందీగా అమలు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభలు/వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ, వార్డు సభలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ తదితర వా టిపై వివరించాలని అన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట మంచిర్యాలఅగ్రికల్చర్: మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి అనితతో కలిసి ఏపీఎంలు, డీపీఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మహాలక్ష్మి పథకం అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ముదిగుంటను ఆదర్శంగా తీసుకోవాలి జైపూర్: ముదిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, జల సంరక్షణ చర్యలు చేపడుతూ భూగర్భజలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి 132వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ముదిగుంట గ్రామంలో చేట్టిన జల సంరక్షణ చర్యలను ప్రత్యేక అభినందిస్తూ ప్రశంసించారు. మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కిషన్ను ముదిగుంట సర్పంచ్ ఆకుల రవికుమార్, పాలకవర్గం, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, ఏపీవో బాలయ్య శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిగుంట పంచాయతీ కార్యదర్శి సురేశ్, ఈజీఎస్ ఈసీ రాజమొగిలి, సిబ్బంది శిరీష, శృతి, సంతోశ్, సువర్ణ, ఉపసర్పంచ్ పత్తి సంధ్యారాణి, వార్డు సభ్యులు రాజశేఖర్, మనోహర్, విజయ్ పాల్గొన్నారు. -
వానతో అడవికి తప్పిన ముప్పు
కాసిపేట: వర్షం కారణంగా మండలంలోని దేవాపూర్, చింతగూడ శివారు అటవీప్రాంతానికి ముప్పు తప్పింది. వివరాలు.. సోమవారం సాయంత్రం అడవిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రాత్రి వేళ గమనించిన కొందరు మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని భావించారు. కానీ, రాత్రి కాగానే వర్షం కురవడంతో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆరిపోయాయి. దీంతో అడవికి ముప్పు తప్పింది. తెల్లవారే దాకా మంటలు అలాగే ఉంటే అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు, వృక్ష సంపదకు నష్టం వాటిల్లేదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో నిప్పు పెట్టడం లాంటి చర్యలు మానుకోవాలని సూచించారు. అడవిలో మంటలు వ్యాప్తి చెందితే ప్రకృతికి ఎంతో నష్టం వాటిల్లుతుందని డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్నాయక్ తెలిపారు. నిప్పు పెట్టిన వ్యక్తుల సమాచారం తెలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
టోల్ ఇక్కడ తగ్గింది.. అక్కడ పెరిగింది
చౌటుప్పల్/రఘునాథపల్లి/దేవరుప్పుల/మంచిర్యాల: హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్–వరంగల్, జనగామ–సూర్యాపేట రూట్లో స్వల్పంగా పెరిగాయి. తగ్గిన, పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్–విజయవాడ రూట్లో టోల్ చార్జీలు తగ్గడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం చిల్లకల్లు టోల్ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ ధరలు కూడా ఒక టోల్ప్లాజా వద్ద తగ్గితే మరో టోల్ప్లాజా వద్ద యథావిధిగా ఉన్నాయి. ⇒ పంతంగి టోల్ప్లాజా వద్ద త్రీ యాక్సల్ వాహనాలకు మాత్రమే ఇరువైపులా 5 రూపాయలు తగ్గనుంది, మిగిలిన వాహనాలకు తగ్గింపు చేయలేదు. ఇక్కడ త్రీ యాక్సల్ వాహనాలకు ఒక వైపునకు రూ.290 నుంచి రూ.285కు, ఇరువైపులా రూ.435 నుంచి రూ.430 తగ్గింది. ⇒ కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద కూడా కేవలం త్రీ యాక్సస్ వాహనాలకు మాత్రమే ఐదు రూపాయలు తగ్గనుంది. ఇక్కడ ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపులా రూ.675 నుంచి రూ.670కు తగ్గుతుంది. ⇒ ఏపీలోని చిల్లకల్లు వద్ద కారు, జీపు, వ్యాను, లైట్ మోటారు వాహనాలకు ఐదు రూపాయలు తగ్గించారు. ఇక్కడ వీటికి ఒకవైపునకు రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. రెండు యాక్సల్ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కు, మూడు యాక్సల్ వాహనాలకు 24గంటల్లో ఇరువైపులా రూ.570 నుంచి రూ.565కు తగ్గించారు. ⇒ మంచిర్యాల–చంద్రాపూర్ జాతీయ రహదారి 363పై మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరండి టోల్ ప్లాజాల్లో గతేడాదితో పోలిస్తే కనీసం రూ.5 నుంచి నెలవారీ పాస్లపై గరిష్టంగా 25 చొప్పున తగ్గాయి. ఒకవైపు రాకపోకలు సాగించే మినీ వాహనాలకు ఒకవైపు జర్నీకి రూ.150 ఉండగా, 145కు తగ్గించారు. 3 జతల టైర్ల వాహనాలకు రూ.340 ఉండగా, ప్రస్తుతం రూ.335కు తగ్గింది. అలాగే నెలవారీ పాస్లు సైతం ఒక్కో పాస్కు రూ.25 నుంచి గరిష్టంగా ఏడు జతల భారీ వాహనాల వరకు రూ.160 వరకు తగ్గాయి. ⇒ జనగామ –సూర్యాపేట రహదారిలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ప్లాజా వద్ద రూ.5 నుంచి రూ.10 వరకు టోల్ చార్జీలు పెరిగాయి. కారు (నాలుగు టైర్ల వాహనాలు)కు రూ.35 నుంచి రూ.40, లైట్ కమర్షియల్ వాహనాలకు ప్రస్తుత రేటు రూ.60 ఉండగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. బస్సు, ట్రక్కు వాహనాలకు ప్రస్తుతం రూ.125 ఉండగా 130కి పెరిగింది. రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనానికి ప్రస్తుతం రూ.135కి 140 పెరగగా, రిటర్న్ జర్నీకి రూ.5, ఫోర్ టూ సిక్స్ యాక్సల్స్ వాహనాలకు ప్రస్తుతం రూ.295 నుంచి 300కు పెరగగా రిటర్న్ జర్నీకి రూ.5 పెరిగింది. సెవన్ టూఓహెచ్సీ వాహనాలకు ప్రస్తుతం రూ.240 ఉండగా 245కి, రిటర్న్ జర్నీకి రూ.355 నుంచి 365కి పెరిగింది. ⇒ వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై యాద్రాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాల వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలకు ఒకవైపునకు రూ. 5 పెరిగింది. లైట్ కమర్షియల్ వాహనం, లైట్ గూడ్స్ వాహనం, మినీ బస్సు సింగిల్ జర్నీకి రూ. 5పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.10 పెరిగింది. బస్సు, ట్రక్కుకు ఒకవైపునకు రూ.15 పెరిగింది. త్రీ యాక్సల్ కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.10, రిటర్న్ జర్నీకి రూ.15 పెరిగింది. భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.20 పెరగ్గా, రిటర్న్ జర్నీకి రూ.25 పెరిగింది. పెరిగిన వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము టోల్ప్లాజాల వద్ద స్వల్పంగా టోల్ రుసుమును తగ్గించినా, వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుమును సైతం స్వల్పంగా పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వార్షిక ఫాస్టాగ్ పాస్ల రుసుము రూ.3000 ఉండగా దానిని రూ.3075కు పెంచారు. ట్రిప్పుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
మంచిర్యాలటౌన్: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి సోమవారం జిల్లాస్థాయి ఎంపిక పోటీలను స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థులకు ఎత్తు, బరువు, నైపుణ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, షటిల్ రన్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్టు, 800 మీటర్ల పరుగుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. -
స్టెప్పులేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్/జన్నారం: తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్టెప్పులు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే కళల పట్ల తన ఆసక్తితో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, తదితరులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. పోటీల్లో రాణించిన వారికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీవీఏజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్, కన్వీనర్లు పసుల తిరుపతి, తోట నగేష్ మాట్లాడుతూ విద్యార్హతలను బట్టి ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈడీ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గొర్రె రమేష్, చిందం వెంకటేష్, ఉస్మాన్, దేవేందర్రెడ్డి, శ్రావణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, మధుకర్, రాజు, ర మేష్, రాజేష్, దత్తు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల విద్యాప్రమాణాలపై సర్వే
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు బోధన, చదువు కొనసాగింపు గుర్తించేందుకు సోమవారం సర్వే మొదలైంది. ఎంపిక చేసిన పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల భాషా, గణిత సామర్థ్యాల అంచనాకు ఈ నెల 30, 31న పరఖ్ జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఫౌండేషన్ లర్నింగ్ స్టడీ(ఎఫ్ఎల్ఎస్) పేరిట సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా నాలుగు పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులతో సర్వే ప్రారంభించారు. హాజీపూర్ మండలం నాగారం మండల పరిషత్ పాఠశాల, మంచిర్యాలలో స్ప్రింగ్ ఫీల్డ్ హైస్కూల్, వేమనపల్లి మండలం ముల్కల్పేట, కోటపల్లి మండలం దేవులవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. రెండ్రోజులపాటు ఒక్కో పాఠశాలలో 12 మంది విద్యార్థుల చొప్పున 48 మందిని పరీక్షిస్తారు. దీనిద్వారా విద్యావ్యవస్థపై అంచనా ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో చేపట్టే విద్యా కార్యక్రమాల ప్రణాళికకు సమాచారం దోహదపడుతుందని డీఈవో యాదయ్య తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లక్సెట్టిపేట: మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నెన్నెల మండల కేంద్రానికి చెందిన అల్లంపల్లి సంతోష్ హనుమాన్ దీక్ష విరమణ కోసం ఆదివారం కాలినడకన జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరాడు. మార్గమధ్యలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
● రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝాజైపూర్: రోడ్డు భద్రత నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మండలంలోని దుబ్బపల్లి పీఎల్ఎన్ఆర్ గార్డెన్లో సోమవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ మూడో విడతలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్యశిబిరాలు, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వవద్దని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు. రాత్రి వేళల్లో డ్రైవింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు నవీన్కుమార్, బన్సీలాల్, కృష్ణ, స్థానిక ఎస్సై రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
చెన్నూర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
చెన్నూర్: గోదావరి పుష్కరాల దృష్ట్యా చెన్నూర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి పుష్కరాలకు రూ.500 కోట్లు మంజూరు చేయించాలని అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులను గుర్తించాలని తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. జిల్లా కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్లు ఏతం శివకృష్ణ, నాయకులు వెంకటనర్సయ్య, జాడి తిరుపతి, బుర్ర రాజశేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
కాన్కూర్లో జల సంరక్షణ చర్యలు
జైపూర్: మండలంలోని కాన్కూర్ అటవీప్రాంతంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో సోమవారం జల సంరక్షణ చర్యలు చేపట్టారు. టీజీఎఫ్డీసీకి చెందిన నీలగిరి ప్లాంటేషన్ మధ్యలోని వాగులో రెండు చోట్ల నీటి ఊటలను గుర్తించి ఉపాధి హామీ కూలీల సహాయంతో నీరు నిల్వ ఉండే విధంగా పూడిక తొలగించి అడ్డుకట్టలు వేశారు. టీజీఎఫ్డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్ మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్లో వేసవిలో నీటి వృథాను అరికట్టి జల సంక్షరణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటికుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ తప్పనిసరి
మంచిర్యాలటౌన్: జిల్లా నుంచి హజ్కు వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో సోమవారం హజ్ యాత్రికుల వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి పరిశీలించారు. 15 మంది యాత్రికులకు వ్యా క్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్, వైద్యాధికారులు డాక్టర్ తబిసియ, డాక్టర్ ముస్తాఫా, డీపీవో ప్రశాంతి, సీహెచ్వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్ పాషా, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
కొరవడిన క్రమశిక్షణ..కరువైన పర్యవేక్షణ
చెన్నూర్: గురుకుల విద్యాలయాలు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు పెట్టింది పేరు. గతంలో విద్యాబ్యాసం కఠినతరంగా ఉంటుందని ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ విద్యార్థుల్లో కొరవడిందా, ఉపాధ్యాయుల వేధింపులు ఎక్కువయ్యయా అనే అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. వాచ్మెన్ నుంచి పాఠశాలల వరకు పకడ్బందీ పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల తినుబండారాలను తనిఖీ చేసి లోనికి పంపిస్తారు. పాఠశాలకు గడ్డిమందు వచ్చిందంటే పర్యవేక్షణ కొరవడిందని చెప్పుచ్చు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు గాడితప్పుతున్నారా అనే అనుమానులకు తావిస్తున్నాయి. మూడేళ్లలో ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడం పట్ల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. గురుకులాల్లో విద్యార్థులు బయటికి వెళ్లాలంటే కేవలం దసరా, సంక్రాంతి సెలవులు తప్ప మిగతారోజుల్లో మాత్రమే ఇళ్లకు పంపిస్తారు. నెలలో రెండు ఆదివారాల్లో తల్లిదండ్రులు వస్తే ఔటింగ్కు పంపిస్తారు. ఇన్ని నిబంధనలు ఉన్న విద్యార్థులు పిట్టల్లా రాలుతున్న విషయం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. గురుకులాల్లో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. మృతుల వివరాలు ఇలా.. చెన్నూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి చెన్నూర్ గురుకుల పాఠశాలలోనే మూడేళ్లలో ముగ్గురు మృతువాత పడ్డారు. ఏడుగురు విద్యార్థులు సస్పెండ్కు గురయ్యారు. ఇవి వెలుగులోకి వచ్చిన సంఘటనలే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలలో జరుగుతున్న వరుస ఘటనలపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలల పై ప్రజలకు నమ్మకం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఈ దిశగా ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చెన్నూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల, పాఠశాలలో అధ్యాపకురాలు, విద్యార్థిని, మైనార్టీ గురుకులంలో విద్యార్థి చొప్పున ముగ్గురు మృతి చెందారు. మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో తోటి విద్యార్థిని కొడుతూ సెల్ఫోన్లో వీడియో తీసిన పది మంది విద్యార్థులు సస్పెన్స్కు గురికాగా, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ను విధుల నుంచి తొలగించారు. -
లక్సెట్టిపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలి
లక్సెట్టిపేట: లక్సెట్టిపేట కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని మండలంలోని అఖిలపక్ష నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఐబీ ఆవరణలో అఖిలపక్ష పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్సెట్టిపేట పట్టణానికి గతంలో నియోజకవర్గ హోదా ఉన్నదని తెలిపారు. దండేపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాలను కలుపుతూ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తే భవిష్యత్లో అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నియోజకవర్గ ఏర్పాటుకు పోరాటం చేస్తామని, సాధన కమిటీని నిర్ణయించి ముందుకు సాగుతామని అన్నారు. మండల అఖిలపక్ష నాయకులు నల్మాస్ కాంతయ్య, పొట్టేలు శ్రీనివాస్గౌడ్, లింగయ్య, సుధాకర్, దండేపల్లి, జన్నారం, నాయకులు పాల్గొన్నారు. -
హత్యకేసులో ఇద్దరి అరెస్టు
ఆసిఫాబాద్: మండలంలోని గుండి శివారులో నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. సోమవారం హత్య కేసు వివరాలు విలేకరులకు వెల్లడించారు. 2022లో పెంచికల్పేట్ మండలానికి చెందిన సాగర్ ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికివెళ్లే దారిలో శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసును ఎస్పీ చొరవతో దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సాగర్ను కాగజ్నగర్కు రమ్మని పిలిచి, ఆటోలో ఎక్కించి ఆసిఫాబాద్ మండలం గుండి శివారు పంట పొలాల వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసును హత్యగా నిర్ధారించారు. కౌటాల బాలుర వసతి గృహం కుక్ కొండూరి మల్లేశ్వరి, కాగజ్నగర్ ద్వారాకానగర్కు చెందిన ఎన్నం అశోక్, పెంచికల్పేట్ మండలం అగర్గూడకు చెందిన చెన్నూరి స్వామి నేరాన్ని ఒప్పుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా, చెన్నూరి స్వామి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు, వీరిలో సీఐ బాలాజీ వరప్రసాద్, డీసీఆర్బీ సీఐ శ్రీధర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రవీందర్, కౌటాల ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఐటీకోర్ కానిస్టేబుల్ మహేశ్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. -
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
ఆదిలాబాద్రూరల్: ఆదివాసీ పర్ధాన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా గేడం తులసీరాం (ఆదిలాబాద్), గౌరవ అధ్యక్షుడిగా కుర్సేంగే జంగు (మంచిర్యాల), ప్రధాన కార్యదర్శిగా ఆడ వెంకటేశ్ (కుమురం భీం ఆసిఫాబాద్), కోశాధికారిగా ఉయికే విఠల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా మడావి శంకర్, ఆడిటర్గా గేడం కృష్ణ, సాంస్కృతిక కార్యదర్శిగా తొడసం నాగోరావు, ఉపాధ్యక్షులుగా మనోహర్, గంగాసాగర్, అంజనాదేవి, గంగారాం, కుమ్ర శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా మడావి తిరుపతి, కుమ్ర గంగారం, ఆత్రం ప్రహ్లాద్, కుర్సేంగే మహేందర్, మడావి హరిప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులుగా కోవా వినోద్, కోట్నాక భగవంతురావు, మెస్రం దేవరావు, కుర్సేంగే శంకర్, ఆడ సంపత్, సలహాదారుగా పుర్క ఉద్దవ్, మడావి గంగారాం, పూసం ఆనంద్ రావు, ఎన్నికయ్యారు. గవర్నర్ను కలిసిన ‘సొసైటీ’ సభ్యుడుపాతమంచిర్యాల: రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివప్రతాప్ శుక్లాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.మధుసూదన్రెడ్డి కలిశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలిపాతమంచిర్యాల: రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల అశయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజకుల సంక్షేమానికి రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారని, గత బడ్జెట్లో రూ.183 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో కరెంట్ బిల్లులు పెరిగిపోయాయని తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని తెలిపారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి గ్రామ గ్రామాన చైతన్య సదస్సులు నిర్వహిస్తామని, భవిష్యత్లో ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజుల రామచంద్ర, నాయకులు ఓదెలు, చందు, భాగ్య, శనిగారపు సత్యం, మామిడి రమేష్, కోటిపల్లి కళావతి, లక్ష్మణ్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు. -
ఓవరాల్ చాంపియన్గా ఆదిలాబాద్
కై లాస్నగర్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్–2025 (సెకండ్ ఎడిషన్) పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్గా ప్రథమ స్థానంలో నిలిచారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా క్రీడాకారులు, కోచ్లు, సిబ్బంది వారు సాఽధించిన కప్తో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిఽశారు. వారిని అభినందించారు. క్రీడా రంగంలో జిల్లా, రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో ఇదే పట్టుదలతో కృషి చేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సీఎం కప్ పోటీల విజయవంతంలో భాగంగా చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియ, మండల, జిల్లాస్థాయి పోటీల సమర్థ నిర్వహణ కీలక పాత్ర పోషించాయన్నారు. ఈ విజయానికి క్రీడాకారులతోపాటు కోచ్లు, క్రీడా శాఖ సిబ్బంది సమష్టి కృషి కారణమని అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీఓ స్రవంతి, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ఉట్నూర్రూరల్: ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో తేనె, మైనం, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, చిల్లగింజలు మొదలైన చిన్న తరహా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్కుమార్ పేర్కొన్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉట్నూర్ డివిజన్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉట్నూర్ డివిజన్ కార్యాలయంలో మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బందితో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజనుల ఉపాధి అవకాశాలు ఈ చర్యలతో మెరుగుపడుతాయన్నారు. ప్రభుత్వ నిధులు వచ్చేవరకు ఎదురుచూడకుండా, వెంటనే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిత్యం అటవీ ఉత్పత్తుల సేకరణకు కృషి చేయాలని కోరారు. నూతన డీఆర్ డిపోల్లో బియ్యంతోపాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో సీనియర్ మేనేజర్లు సంతోష్ కుమార్, తారాచంద్, రమేశ్, మనోహర్, ఇస్తారి, లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


