breaking news
Mancherial
-
బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు సాధించాలి
రెబ్బెన: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరుగనున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని గోలేటి సర్పంచ్ అజ్మీర బాబురావు అన్నారు. మంగళవారం గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో అండర్ 19 బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్ల క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈనెల 10 నుంచి రెండు రోజుల పాటు జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, షార్ప్స్టార్ బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మహేందర్, పీఈటీ భాస్కర్ పాల్గొన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు బాలుర జట్టుకు పి.సాయిచరణ్, డి.ప్రేందీప్, సీహె చ్ గోపాలక్రిష్ణ, సీహెచ్ నిఖిల్, సీహెచ్ వరుణ్, ఏ.నిఖిల్, ఎం.మారుతి, ఎం.కృష్ణ లోకానంద్, జి. కృత్విక్, ఆర్. అశిష్కుమార్, ఏ.సాత్విక్, వి.రాఘవ, డి.సిద్ధు, బాలికల జట్టుకు టి.ప్రజ్వల శ్రీ, పి.శ్రావ్య, ఎస్.సాయి శ్రీ వర్షిని, పి.సిరి, ఎస్.రిషిత, సీహెచ్ శ్రీ లక్ష్మిదేవి, డి. నందిని, జి హన్నా, పి.స్వాద్వి, జే శివాని, కే.సంకీర్తన, జే.దమ్మదీప ఎంపికై నట్లు అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు. -
మంచిర్యాల
7లైట్లు ఎల్గుతలేవ్.. బెల్లంపల్లి మున్సిపాల్టీలోని పలువీధుల్లో రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదు. బలి యా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 9లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీస్తాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో సాధ న పుస్తకాలు అందజేస్తున్నారు. 8లోu -
సిద్ధం చేయాలి
స్పష్టమైన ఓటరు జాబితా మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల్లో భా గంగా ముసాయిదా ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్ర య్య, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ మహ్మమద్ విలాయత్ అలీ, మంచిర్యాల ఆర్డీవోతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, పొరపాట్లపై మున్సిపల్ కమిషనర్కు రాత పూర్వకంగా అందిస్తే సవరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 149 వార్డులకు గాను 2,94,641 మంది ఓటర్లు ఉన్నారని, మంచిర్యాల కార్పొరేషన్లో 264 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేట బల్దియాలో 30, బెల్లంపల్లిలో 68, చెన్నూర్లో 36, క్యాతనపల్లిలో 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి మందమర్రిరూరల్: రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 37వ జాతీయ రహదారిపై టోల్ప్లాజా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జాతీయ రహదారుల సంస్థ జీఎం(టీ) అండ్ పీడీ కేఎస్ అజయ్ మణికుమార్లతో కలసి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నామని, సీటు బెల్టు ధరించాలని, వాహనదారులు ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని బెల్లపల్లి ఏసీపీ సూచించారు. -
అర్హత లేని వైద్య కేంద్రాలపై ఫిర్యాదు
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న కేంద్రాలను గుర్తించామని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ యెగ్గన శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం టీజీఎంసీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో కంపౌండర్గా పనిచేసిన అనుభవాన్ని ఆసరాగా చేసుకుని పలువురు కనీస వైద్య, విద్యార్హతలు, లైసెన్స్ లేకుండా తమకు తామే వైద్యులమని చెప్పుకుని అల్లోపతి మందులు, స్టెరాయిడ్లు, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ వంటివి ఇస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. హమాలీవాడలో షాకీర్ రెండు పడకలతో దవాఖాన నిర్వహిస్తూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్, మల్టీవిటమిన్ ఇంజక్షన్లు ఇస్తూ పట్టుబడ్డ్డాడని తెలిపారు. హరి మెడికల్ షాపులో ఒక పడకతో ప్రకాష్ అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, నెబ్యులైజేషన్ ఇస్తూ వైద్యం చేస్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ అనిల్ కుమార్, హెచ్ఆర్డీఏ సభ్యుడు డాక్టర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు
ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు కర్ను తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో పీడీ హీరాబాయితో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. -
జోనల్స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
ముధోల్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అండర్–23 బాసర జోనల్స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాజీరావు, ఎస్సై బిట్ల పెర్సీస్ పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు ఆదిలాబాద్, మంచిర్యాల టీంలు తలబడ్డాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ లావణ్య, క్రికెటర్ నయీముద్దీన్, కార్యదర్శి తుమ్మల దత్తు, బీజేపీ మండల అధ్యక్షుడు పోతన్న, మాజీ ఎంపీటీసీ మగ్ధూమ్, మేరోజ్ఖాన్, టీసీఏ అభయ్, రోళ్ల రమేశ్, మదన్ పాల్గొన్నారు. -
రాష్టస్థాయి పోటీల్లో విజేతలుగా తిరిగిరావాలి
ఉట్నూర్రూరల్: రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో ఉట్నూర్ క్రీడాకారులు సత్తాచాటి విజేతలుగా తిరిగి రావాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. ఏటూరు నాగారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారుల బస్సులను మంగళవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గిరిజన క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా దుస్తులు, పీడీలు, కోచ్లకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీ అంబాజీ, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీవో సదానందం, ఆత్రం భాస్కర్, చందన్, ప్రకాశ్, కృష్ణారావు, ప్రేందాస్, ఉత్తం, గంగారాం, హేమంత్, మధుసూదన్, జైవంత్రావు, రవీందర్, జలపతి, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్జీయూకేటీ విద్యార్థులు
బాసర: మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ‘విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో కాంపిటీషన్’లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ శ్రీ వాహిద్ పర్యవేక్షణలో విద్యార్థులు పోటీకి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఖలీల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలి
జన్నారం: ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగసభ, శతజయంతి ఉత్సవాల సందర్భంగా రామకృష్ణాపూర్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 3న తాండూర్లో ప్రారంభమైన కళాజాత మంగళవారం జన్నారానికి చేరింది. పాటలతో ర్యాలీ నిర్వహించా రు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, మండల కార్యదర్శి దాసరి తిరుపతి, నాయకులు ఖలీందర్ ఆలీఖాన్ , కొట్టే కిషన్రావు, లింగం రవి, కామెర దుర్గారాజ్, దేవి పోచన్న, చాడ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పథకం ప్రకారమే హత్య చేశారు
చెన్నూర్రూరల్: ఒడిస్సా నుంచి పనికోసం వచ్చిన జితేన్ దర్వ (19)ను పథకం ప్రకారమే హత్య చేశారని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చెన్నూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్నూర్ మండలంలోని సుబ్బరాంపల్లి ఇటుక బట్టీల్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి 20 మంది కూలీలు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. జితేన్ ధర్వ, రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్తో పాటు మరో మైనర్ బాలుడు కలిసి ఉంటున్నారు. ఆదివారం రాజేందర్ భీమల్ సెల్ఫోన్ తీసుకొని జితేన్ ధర్వ తన భార్యకు ఫోన్చేసి మాట్లాడుతూ గొడవపడ్డాడు. గమనించిన బాలుడు అతని వద్ద నుంచి ఫోన్ తీసుకుని ఎందుకు గొడవపడుతున్నారని అడిగాడు. దీంతో జితేన్ ధర్వ బాలుడిని కొట్టడంతో రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్కు విషయం చెప్పాడు. దీంతో ముగ్గురూ కలిసి జితేన్ ధర్వను చంపుదామని పథకం వేసుకున్నారు. సాయంత్రం ముగ్గురూ కలిసి గదిలో జితేన్ ధర్వ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని చెట్టుకింద పడేసి మేమే చంపామని మిగతా కూలీలకు చెప్పి పారిపోయారు. మంగళవారం చెన్నూర్లోని ఆస్నా ద్ ఎక్స్రోడ్డు వద్ద పోలీసులు వారిని పట్టుకుని హత్యకు ఉపయోగించిన టవల్తో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ సీఐ దేవేందర్రావు, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. -
చేపల వలలో చిక్కుకుని మత్స్యకారుడు మృతి
లోకేశ్వరం: గోదావరినదిలో చేపలుపట్టి కు టుంబాన్ని పోషించుకుంటున్న మత్స్యకా రుడు వలలో చిక్కుకు ని మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎ స్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన మాడబోయి చిన్న సాయన్న (50)మంగళవారం ఉదయం చేపలు పట్టేందుకు పంచగుడి గ్రామ సమీపంలోని గోదావరి నదికి వెళ్లి నీటిలో వల విసిరాడు. మధ్యాహ్నం సమయంలో వల తీసే క్రమంలో దానికి చిక్కుకుని నీట మునిగి మృతి చెందాడు. మృతుని భార్య ఆనంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా తయారు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ మంగళవారం మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుకు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్లోని డివిజన్లలో రూట్ మ్యాప్ ఇవ్వలేదని, ఒక్కో డివిజన్లో ఇష్టారీతిన ఓటరు జాబితాను ప్రచురించారని పేర్కొన్నారు. ఒక డివిజన్లోని ఓటర్లు మరో డివిజన్లోకి వేశారని, బీఎల్వోలు సరైన రీతిలో విధులు నిర్వర్తించకపోవడం, అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క వారికి అనుకూలంగా తయారు చేశారని తెలిపారు. రాజకీయ పార్టీలకు ముసాయిదా ఓటరు జాబితాను ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, సమయం పెంచి ఓటరు జాబితాలో అవకతవకలు సరిచేయాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు బెల్లంకొండ మురళి, కాశెట్టి నాగేశ్వర్రావు, మంత్రి రామయ్య పాల్గొన్నారు. -
యూరియా కొరత లేకుండా నిల్వలు
చెన్నూర్/చెన్నూర్రూరల్: యూరియా కొరత లే కుండా నిల్వలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడకుండా స్థానిక అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం వారు చెన్నూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం, చేనేత ట్రెడర్స్, మండలంలోని అంగ్రాజ్పల్లి, ఆస్నాద గ్రామాల్లో ఉన్న ఫెర్టిలైజర్ దుకాణాల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. యూరియా పక్కదారి పట్టకుండా అవసరమున్న రైతులకు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్, వాష్రూమ్ల నిర్మాణాలు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో యామిని, ఎంపీవో అజ్మత్అలీ, ఏఈవోలు పాల్గొన్నారు. -
గురుకుల ప్రవేశ పరీక్షకు ‘సాధన’
మంచిర్యాలఅర్బన్: వసతితో కూడిన విద్య అంది స్తూ పేద విద్యార్థులకు గురుకులాలు అండగా నిలుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 2026–27 సంబంధించి ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ జారీచేసింది. సర్కారు బడిలో చదివే నాలుగో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నా ఐదో తరగతిలో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. ప్రశ్నల సరళిపై అవగాహన లేకపోవడంతో వారు వెనకబడిపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు సాధన గురుకుల ఐటెం బ్యాంకు పేరిట రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి పుస్తకాలు పంపిణీ చేయనుంది. ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని పిల్లలకు ప్రత్యేకంగా నేర్పిస్తారు. రెండు నమూనా పరీక్షలు నిర్వహించి పోటీ తట్టుకునేలా సమాయత్తం చేయనున్నారు. పుస్తకాలు ఇలా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగవ తరగతి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్లో సాధన గురుకుల ఐటమ్ బ్యాంకు పుస్తకాలు ముద్రించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1690, కుమరంభీం ఆసిఫాబాద్కు 1814, నిర్మల్కు 1582, మంచిర్యాలకు 1662 పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మంచిర్యాల జిల్లాలోనే నాలుగవ తరగతి చదివే విద్యార్థులు 3525 మంది ఉండగా 1662 పుస్తకాలు మాత్రమే జిల్లాకు సరఫరా చేశారు. బోధనకు ఉపాధ్యాయులు పుస్తకాలు ఉపయోగిస్తారా? లేదా విద్యార్థులకు అందిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సర్కారు బడిలో చదివే విద్యార్థులు సాధనతో ఎంతో ఉపయోగకరంగా మారనుంది. రెండు, మూడు రోజుల్లో పుస్తకాల సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
తాతకు తలకొరివి పెట్టిన మనుమరాలు
నెన్నెల: సాధారణంగా ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు పురుషులు చేస్తారు. మృతి చెందిన వ్యక్తి తండ్రి అయితే ఇంటి పెద్ద కుమారుడు, తల్లి అయితే చిన్న కుమారుడు తలకొరివి పెట్టడం సంప్రదాయం. కానీ నెన్నెల మండలం ఆవుడంలో గంగిరెడ్డి లచ్చిరెడ్డి (55) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. అతని ఏకై క కుమార్తె బండం స్రవంతి సైతం గతంలోనే చనిపోయింది. స్రవంతి కూతురైన బండం హర్షిత ఆవుడంలో అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉండి చదువుకుంటోంది. మనుమరాలే కొడుకై తలకొరివి పెట్టి తాత రుణం తీర్చుకుంది. ఈ తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. -
బెటాలియన్లో అట్టహాసంగా క్రీడా పోటీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట 13 వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో మూడు రో జులపాటు నిర్వహించే బెటాలియన్ వార్షిక క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కమాండెంట్ పి.వెంకటరాములు క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అన్ని కంపెనీల పోలీస్ సి బ్బంది, అధికారులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని మైదానంలో కవాతు చేస్తూ కమాండెంట్ వెంకటరాములుకు గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వం, మా నసిక ఉత్సాహంతోపాటు జట్టులో అంతా సమష్టి అనే భావన పెంపొందించడంలో కీల క పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వా రా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మెరుగుపడుతాయని తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వర్రావు, కాళిదాసు, బాల య్య, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోశ్సింగ్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, బెటాలియ న్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యుత్ శాఖ అధికారి(ఎస్ఈ) బి.రాజన్న అన్నా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టౌన్–3 గాంధీనగర్లో ఏర్పాటు చేసిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల మేరకు వంగిన పోల్స్, వేలాడుతున్న విద్యుత్ తీగలు, నేలపై తక్కువ ఎత్తు, కంచె లేని ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు సవరించామని, కొన్ని చోట్ల కొత్తవాటిని బిగించామని తెలి పారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలను ఏఈ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కారా నికి చర్యలు తీసుకుంటారని అన్నారు. టోల్ఫ్రీ నంబరు 1912లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తమ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం వేసిన 33 కేవీ విద్యుత్ లైన్ కింద ఇళ్లు నిర్మించుకున్నామని, ఈ లైన్ ఇతర చోట నుంచి వెళ్లేలా చూడాలని వినియోగదారులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ రాజేశం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వినియోగదారులు పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి నస్పూర్: రైతులు, వినియోగదారులు విద్యుత్ ప్ర మాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవా లని మంచిర్యాల విద్యుత్ శాఖ డీఈ మల్లేశం అన్నా రు. మంగళవారం ఆయన నస్పూర్లోని సీతారాంపల్లి గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా రైతులు, వినియోగదారులకు విద్యుత్ భద్రతా సూత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురమి ల్ల వేణు, విద్యుత్ శాఖ ఏడీఈ ఎన్.రాజశేఖర్, ఏఈ కే.రాంచందర్ పాల్గొన్నారు. -
జిల్లా కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి
జన్నారం మండలం కిష్టాపూర్కు చెందిన ఓ కార్మికుడు గత ఏడాది మరణించగా కార్మిక శాఖ నుంచి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి రూ.30వేలు ఇస్తే పని చేస్తామని చెప్పారు. అంత ఇచ్చుకోలేమని చెబితే పరిహారం రూ.2లక్షల్లో తమకు రూ.30వేలు ఇస్తామని ఓ ప్రమాణ పత్రం రాసి ఇవ్వమని అడిగారు. దీనిపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కొన్ని రోజులు పెండింగ్లో పెట్టారు. చివరకు తమకు తెలిసిన వారితో వెళ్తే రూ.10వేలు తీసుకుని పరిహారం అందేలా పని చేసి పెట్టారు.ఆర్కేపీకి చెందిన ఒకరు చనిపోతే.. కార్మిక శాఖ నుంచి పరిహారం పొందాలని గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేస్తే రూ.30నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతుందని, మృతుని అన్ని పత్రాలు ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉంటుందని చెప్పారు. పరిహారం పెంచినప్పటి నుంచి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరుగుతుందని, ఇదంతా పైసలిస్తేనే పని అవుతుందని వివరించాడు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి ఆగడం లేదు. కొత్తగా కార్మిక కార్డు నుంచి రెన్యూవల్, పరిహారం వరకు పైసలు ఇస్తేనే పని జరుగుతోంది. గత జూలైలో ఒకేసారి జిల్లాలో ఇద్దరు కార్మిక శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అయినా ఆ శాఖ సిబ్బంది అదే తీరుగా వసూళ్లు చేస్తుండడం గమనార్హం. జిల్లాలో మంచిర్యాల–1, 2, బెల్లంపల్లి సర్కిళ్లలో సుమారు 65వేల మంది రిజిష్టర్డ్ కార్మికులు ఉన్నారు. ఐదేళ్లకోసారి గుర్తింపు కార్డులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా చేసుకోవడం లేదు. ప్రస్తుతం 45వేలకు పైగా కార్మికులే ఉన్నారు. అధికంగా భవన నిర్మాణ రంగం వారితోపాటు మిగతా వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. గుర్తింపు పొందిన కార్మికులకు వారి పిల్లలు చదువుకునేందుకు స్కాలర్షిప్పులు, ఆడపిల్లల పెళ్లి, మెటర్నిటీ కోసం రూ.30వేల నగదుతోపాటు కార్మికులు ప్రమాదాలతో వైకల్యం, సహజ మరణం చెందినా, వారికి ఆస్పత్రి, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. కార్మికులు తమ వాటా కొంత చెల్లిస్తే కార్మిక సంక్షేమ బోర్డు ఈ మేరకు ప్రయోజనాలు అందిస్తుంది. పరిహారం పెంచడంతో..గతంలో గుర్తింపు కార్డు ఉన్న కార్మికుడు చనిపోతే రూ.1.30లక్షల పరిహారం అందేది. ప్రస్తుతం రూ.2లక్షలు చెల్లిస్తున్నారు. దీంతో అనధికారికంగా రూ.30వేల వరకు వసూళ్లు సాగుతున్నాయి. పనిలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6లక్షల వరకు ఇస్తారు. మీ సేవలో కార్మికులు దరఖాస్తు చేసుకోగానే ఆఫీసు నుంచి కొందరు, మీ సేవ నుంచి మరికొందరు రంగ ప్రవేశం చేస్తూ వసూళ్లు చేసుకుంటున్నారు. బీమా పరిహారం చెల్లింపులో థర్డ్ పార్టీతో విచారణ చేయాలి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులే కొందరు ఈ వసూళ్లలో ప్రధానంగా మారారు. మృతుని మరణం, వివరాలు అన్ని ఉన్నా డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చూపి పరిహారం రాకుండా చేస్తారనే భయంతో పైసలు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు. డబ్బులిస్తే ఎవరికై నా కార్డు..జిల్లాలో కార్మిక గుర్తింపు కార్డులు సైతం దుర్వి నియోగం అవుతున్నాయి. కార్డు పొందేందుకు 18ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న భవ న నిర్మాణ కార్మికులు అర్హులు. రెండు ఫొటోలు, ఏదేని గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్బుక్, రేషన్కార్డు వివరాలు ఇస్తే మీ సేవ కేంద్రాల్లో కార్డు పొందుతున్నారు. రూ.110 బదులు రూ.వెయ్యి తీసుకుని అనుర్హులకు సైతం కార్డులు ఇచ్చేస్తున్నారు. రెన్యూవల్ కోసం రూ.60కి బదులు రూ. 200వరకు తీసుకుంటున్నారు. నిజమైన కార్మికులు కాకుండా సాగు భూములున్న యజమానులు, వారి కుటుంబాలు, ఎల్ఐసీ ఏజెంట్లు, ప్రైవేటు, అవుట్ సోర్సింగ్, వ్యాపారులు, విద్యావంతులు సైతం పొందారు. దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోంది. అనర్హులు అధికంగా ఉండడంతో పరిహారం చెల్లింపులకు సైతం పైసలు చెల్లించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. జిల్లా కార్మిక శాఖలో జరుగుతున్న తెరవెనుక అవినీతిని నిర్మూలించాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు. -
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు..
దిలావర్పూర్: బంధువు అంత్యక్రియలకు వచ్చి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూర్(జి) గ్రామానికి చెందిన గడ్డం నిఖిల్ (21) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామంలో సమీప బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు నీరటి హర్షరాజ్తో కలిసి ద్విచక్ర వాహనంపై నిర్మల్కు బయలుదేరాడు. నిర్మల్–భైంసా రహదారిపై న్యూలోలం గ్రామ సమీపంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన అటవీ జంతువును తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఘటనలో బైక్ నడుపుతున్న నిఖిల్కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న హర్షిత్రాజ్కు గాయాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
పండుగ వేళ ‘శిక్ష’ణ..!
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్ స్కూల్ అనుబంధ వసతిగృహాల కేర్టేకర్ల కు ‘సాధికారపర్చటం’ అనే అంశంపై శిక్షణ ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీలు, నాలు గు మోడల్ హాస్టళ్లు, నిర్మల్ జిల్లాలో 18 కేజీబీవీలు, ఒక మోడల్ హాస్టల్కు చెందిన ప్రత్యేక అధికారులు, కేర్టేకర్లు కం వార్డెన్లకు ఈ నెల 7నుంచి 11వరకు స్పెల్–1 రెసిడెన్షియల్ తరహా శిక్షణ ప్రారంభం కానుంది. రెండు జిల్లాలకు చెందిన వారందరికీ జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ప్రైవేటు హోటల్లో ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఏ ఒక్కరికీ ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ అయ్యాయి. లాడ్జింగ్, బోర్డింగ్తోపాటు అన్ని వసతులు కల్పించే శిక్షణకు సంసిద్ధులు కావాలని సూ చించారు. మాస్టర్ ట్రైనర్లతో సహా పాల్గొనే వారందరికీ వసతి, ఆహార సౌకర్యాలు కల్పిస్తారు. పీపీటీ ప్రజెంటేషన్ల కోసం డిజిటల్ స్క్రీన్, ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన 50మంది పాల్గొనే సీటింగ్ సామర్థ్యంతో కూడిన శిక్షణ వేదికను గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. ఒకరోజు ఆచరణాత్మక సెషన్, కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి 25 కంప్యూటర్లతో కూడిన ఐసీటీ ల్యాబ్ సౌకర్యాలు, అవసరమైన స్టేషనరీతో సహా శిక్షణ పరికరాలు ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ నెల 7న మాస్టర్ ట్రైనర్లు, మోడల్ స్కూల్కు అనుబంధ హాస్టళ్ల కేర్టేకర్లు కం వార్డెన్లు శిక్షణ కార్యక్రమానికి ఉదయం 9గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. అభ్యంతరాలుఈ నెల 10 నుంచి 16వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. కేజీబీవీ, మోడల్ అనుబంధ హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లే ముందు వివరాల నమోదు, కుటుంబ సభ్యులకు అప్పగించడం తదితర విషయాలెన్నో పర్యవేక్షించడం ఎస్వోలు, కేర్టేకర్లదే బాధ్యత. మరోవైపు ఇతర ప్రాంతాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన తమ పిల్లలు కూడా స్వగ్రామాలకు రావడం, పిండివంటలు చేసుకోకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధులు, ఇతరత్రా బోధనేతర పనులతో సతమతం అవుతుండగా ఐదు రోజులపాటు రెసిడెన్షియల్ తరహా శిక్షణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచిర్యాల జిల్లా వారైనా ఇంటికి వెళ్లి శిక్షణకు హాజరయ్యేలా నిబంధనలు విధిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వాయిదా వేయాలి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ హాస్టల్ కేర్టేకర్ల శిక్షణ తాత్కాలికంగా వాయిదా వేయాలి. పండుగ వేళ శిక్షణ సరికాదు. మొదటి ఫేజ్ శిక్షణను సంక్రాంతి పండుగ తర్వాత చేపట్టాలి. పీఆర్టీయూ తెలంగాణ పక్షాన ఈ విషయంలో ఉన్నతాధికారులతో చర్చించనున్నాం. – గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ తెలంగాణసంక్రాంతి తర్వాత ఏర్పాటు చేయాలి ప్రతీ ఇంట్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటారు. కేజీబీవీ ఎస్వోలు, కేర్టేకర్లు అందరూ మహిళా టీచర్లే. ఇంట్లో సెలవులకు పిల్ల లు, బంధువులు వచ్చే వేళ పిండివంటలు చేసుకోవడం ఆనవాయితీ. పండుగ తర్వాత శిక్షణ ఇస్తే సక్రమంగా జరగడంతోపాటు పండుగ కూడా సంతోషంగా జరుపుకునే వీలుంటుంది. – రాజావేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్యూటీఎఫ్ -
బెల్లం వ్యాపారి బైండోవర్
ఇచ్చోడ: నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన బెల్లం వ్యాపారి ముక్క శ్రీనివాస్ను మంగళవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జుల్పీకర్ అహ్మద్ తెలిపారు. ఇచ్చోడ ఎకై ్సజ్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సదరు వ్యాపారి కొంత కాలంగా గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక విక్రయిస్తూ పలుమార్లు పట్టుపడ్డాడన్నారు. దీంతో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి రూ.50 వేల నగదు చలానా రూపంలో ప్రభుత్వ ఖాతలో జమచేయించినట్లు తెలిపా రు. బోరిగామకు చెందిన రాథోడ్ ఉత్తం గుడుంబా విక్రయిస్తూ పట్టుబడగా బైండోవర్ చేసి రూ.15 వేల జరిమానా విధించినట్లు తెలిపా రు. ఇద్దరు వ్యక్తులు ఆరు నెలల కాలంలో మ రోసారి పట్టుబడితే రూ.లక్ష జరిమానా లేదా జైలుకు పంపించనున్నట్లు సీఐ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు నాగోబా మహాపూజకు ఆహ్వానంఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాకు పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18న నిర్వహించే మహా పూజ, 22న దర్బార్కు హాజరు కావాలని మె స్రం వంశీయులు మంగళవారం ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్రెడ్డిలకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి హైదరాబాద్లో వారిని కలిశారు. నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం తుకారం, నాగో బా ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్రావ్, మెస్రం వంశీయులు బాదిరావ్పటేల్, నాగోరావ్, శేఖు తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ఢీకొని 28 గొర్రెలు మృతిలక్సెట్టిపేట: మండలంలోని సూరారం గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్ ఢీకొని సుమారు 28 గొర్రెలు మృతి చెందినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట అశోక్నగర్కు చెందిన కర్రెపోలా గజలప్ప తమ గ్రామంలో గొర్రెలకు మేత లేకపోవడంతో దండేపల్లి మండలంలో మేపుతున్నాడు. మంగళవారం వాటిని మంచిర్యాల వైపు తోలుకెళ్తుండగా లక్సెట్టిపేట వైపు నుంచి మంచిర్యాల వైపు సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో 28 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల యజమాని గజలప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. లాటరీ పేరిట ప్లాటు విక్రయించేందుకు యత్నంబోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన తుమ్మ మహిపాల్ తన ప్లాటును లాటరీ వచ్చిన వారికి బహుమతిగా ఇస్తానని ఒక్కో టికెట్ రూ.2వేల చొప్పున విక్రయిస్తుండగా మంగళవారం బోథ్ పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 13 లాటరీ టికెట్ బుక్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇలా లాటరీ పేరుతో ప్లాట్ల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నెట్బాల్ పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్రూరల్: రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలకు 24 మంది ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలీబిన్ అహ్మద్, తిరుపతి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో జోనల్ అండర్ 14 నెట్బాల్ బాలబాలికల ఉమ్మడిజిల్లా జోనల్స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహేశ్వర్ మాట్లాడుతూ పోటీల్లో 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ప్రథమస్థానం ఆసిఫాబాద్, ద్వితీయస్థానం ఆదిలాబాద్, తృతీయస్థానంలో మంచిర్యాల జట్లు నిలిచాయన్నారు. మూడు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మంది బాలురు 12 మంది బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పీడీలు అఖిల్, అజయ్, యోగి, అంకిలా, కవిత, ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీలో డీఎంహెచ్వో తనిఖీ
చెన్నూర్రూరల్: మండలంలోని అంగ్రాజ్పల్లి గ్రామ పీహెచ్సీని జిల్లా వైద్యాధికారి అని త మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిష్టర్లు, మందుల నిల్వలు పరిశీలించా రు. పాము, కుక్కకాటుకు మందులు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమ్మక్క, సారలమ్మ జాతర ఉన్నందున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల ని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవా లు ఎక్కువ జరిగేలా చూడాలని అన్నారు. అనంతరం ఆరోగ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. వైద్యుడు కృష్ణతేజ, సూపర్వైజర్లు కళావతి, మంగ బాలు, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడంతోపాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ను ఆదేశించారు. ఆసుపత్రి లో సరిపడా మందులు అందుబాటులో లేవని ఎంపీ దృష్టికి రాగా, వెంటనే సరిపడా మందులు తె ప్పించి, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాల ని సూచించారు. వార్డుల పరిశీలన అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో శంకర్ అనే వ్యక్తి తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని పరామర్శించారు. నగరంలో పర్యటనమంచిర్యాలటౌన్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం మంచిర్యాల నగరంలో పర్యటించారు. ప్రజ లతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్లో విక్రయదారులు, కొనుగోలుదారులతో ముచ్చటించారు. అనంతరం రతన్లాల్ హోటల్లో స్థానికులతో కలిసి టీ తాగి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. -
గొర్రెల మందపై కుక్కల దాడి
భీమారం: మండల కేంద్రంలోని బస్డాండ్ సమీపంలోని బర్ల చంద్రయ్య ఇంటి ఆవరణలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో మూడు గొర్రె పిల్లలు మృత్యువాతపడ్డాయి. మరో రెండింటిని ఎత్తుకెళ్లాయి. చంద్రయ్య తన గొర్రెలను పగలు మేత కోసం అడవి ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి ఇంటి పరిసరాల్లో చుట్టూ రక్షణ చర్యలు చేపట్టి ఉంచుతారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో వీధికుక్కల గుంపు దాడిలో పలు గొర్రెలకు గాయాలయ్యాయి. మండల వెటర్నరీ అధికారి రాకేశ్శర్మ, వార్డు సభ్యుడు కోట రవి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన గొర్రెలకు వైద్యులు చికిత్స అందజేశారు. సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. -
ముసాయిదా జాబితా సవరించండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలోని మంచిర్యాల నగరం, పట్టణాల్లో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల కార్పొరేషన్తో సహా మున్సిపాల్టీలు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్షెట్టిపేటలో అనేక అర్జీలు వస్తున్నాయి. స్థానిక తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీ నాయకులు వార్డులు, డివిజన్లలో ఉన్న తప్పులపై దరఖాస్తులు అందజేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా ఒక వార్డులో ఇళ్లు ఉంటే మరో వార్డులోని ఓటరు జాబితాలో ఓట్లు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇళ్లు ఉన్న వార్డులోనే కొనసాగించాలని కోరుతున్నారు. ఇక వార్డుల సరిహద్దుల్లోనూ తప్పిదాలు ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తరహాలోనే మృతుల ఓట్లను జాబితా నుంచి తొలగించలేదు. దీంతో తమ వార్డులో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని, మరోవైపు ఓటింగ్ సమయంలోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, దీంతో ఆ ఓట్లను ధ్రువీకరించి తొలగించాలని కోరుతున్నారు. అంతేకాక వలస వెళ్లిన వారు, వేరే చోటుకు ఓట్లు మార్పిడి చేసుకున్న వారి వివరాలను తొలగించాలని వినతి ఇస్తున్నారు. ఆయా వార్డుల్లో పోటీలో నిలవాలని ఆరాటపడుతున్న నాయకులు ఓటరు జాబితా, తప్పులు దొర్లడంపై అధికారులకు వినతులు ఇస్తున్నారు. సోమవారం మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ ముసాయిదా ఓటరు జాబితాను సవరించాలంటూ చర్చకు వచ్చింది.సోమవారం వరకు వచ్చినవి..మున్సిపాలిటీ/నగరం అభ్యంతరాలుమంచిర్యాల 239 క్యాతనపల్లి 205 చెన్నూరు 71 లక్షెట్టిపేట 57 బెల్లంపల్లి 36 -
పింఛన్దారుల నిరసన
కాసిపేట: పింఛన్లో కోత విధించి చెల్లిస్తున్నారని మండలంలోని రొట్టపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పింఛన్దారులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ రూ. 2016 పింఛన్కు బదులు రూ.2వేలు, రూ.3016కు బదులు రూ.3వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. చిల్ల ర డబ్బుల విషయమై అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. న్యాయం చేయాలని ఆందోళనకు దిగగా రొట్టపల్లి గ్రామ పంచాయతీలో పింఛన్లు ఇవ్వనని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బీపీఎం వెళ్లిపోయారని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. -
ఎంసీసీ కార్మికుల రిలేనిరాహార దీక్ష
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంటు కంపెనీ(ఎంసీసీ) తొలగింపు కార్మికులు తమకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కంపెనీ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నెల 12వరకు దీక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్మికులు మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నష్టాల సాకు చూపి ఉత్పత్తి యూనిట్లు మూసి వేసిందని, మొండిగా వ్యవహరిస్తూ జీతభత్యాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇటీవల ఎంసీసీని బ్యాంకు అధికారులు వేలం వేస్తారనే సమాచారంతో కార్మికుల్లో ఆందోళన మొదలైందని అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించిన తర్వాతే ఏదైనా జరగాలని, లేనిపక్షంలో కంపెనీ భూముల్లో గుడిసెలు వేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి రూ.50లక్షలు నష్టపరిహారంతోపాటు కంపెనీ ఆవరణలోని ప్రభు త్వ భూమిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, రాజకీయ పా ర్టీలు సహకరించాలని కార్మికులు సలిగంటి మహేందర్, అల్కారీ రాజన్న కోరారు. -
వామ్మో చైనా మాంజా!
మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించేందుకు చైనా మాంజా విక్రయాలు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. నిషేధిత చైనా మాంజా వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం వంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. తాజాగా జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో మూడు రోజుల క్రితం చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మధుకర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా పెదాలపై తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని నిలిపి వేయడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన మూడు రోజులు కావస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం, అటవీశాఖ అధికారుల్లో కదలిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా విక్రయిస్తున్నారు. పక్షులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. 2022 జనవరి 16న పాతమంచిర్యాల రాళ్లవాగు బ్రిడ్జిపై చైనా మాంజా తగిలి వలస కూలీ పస్తం భీమయ్య మృతిచెందాడు. ప్రతీ ఏడాది పండుగకు కొద్ది రోజుల ముందు పోలీసు శాఖ అడపాదడపా దాడులు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన దాఖలా లు లేవు. యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నా అధికారుల దాడుల్లో లభించకపోవడం గమనార్హం. పండుగకు నెల రోజుల ముందే వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు సంక్రాంతి పండుగకు ముందు నుంచే వరుస దాడులు నిర్వహించాల్సి ఉండగా పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయ లోపంతో దాడులు చేయ డం లేదనే విమర్శలున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు విక్రయదారులపై కేసులు నమోదు చేసిన దాఖలా లు లేవు. ముందుగానే వ్యాపారులు అధికారులతో ములాఖత్ అయి ఎంతో కొంత ముట్టజెప్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘‘ఏమవుతుంది.. కేసులు అయితే చిన్న చిన్న కేసులే కదా..’’ అంటూ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారంటే అధికారులపై ఎంత భరోసా ఉందో అర్థమవుతోంది. వినియోగిస్తే ఏడేళ్ల జైలుగాజు పూత పూసిన చైనా మాంజాను వినియోగిస్తే పక్షులు, జంతువులు, ద్విచక్ర వాహనదారులు, పతంగులు ఎగురవేసే వారికి సైతం ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం 2017 జూలై 17న నిషేధం విధించింది. వినియోగించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా అమలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ రక్షణ యాక్ట్ 1986, ప్రివెన్షన్ క్రూయాల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం చట్టపరమైన చర్యలు అమలులో ఉండగా చైనా మాంజా జిల్లాకు ఎలా వస్తుందనేది మిస్టరీగా మారింది. -
సహజ వ్యవసాయంతో అధిక లాభాలు
బెల్లంపల్లిరూరల్: సహజ వ్యవసాయంతో అధిక దిగుబడులు, లాభాలు ఆర్జించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఏ.సురేఖ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రవెల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వినియోగం వల్ల భూమి సారం కోల్పోవడంతోపాటు మానవాళి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. సేంద్రియ ఎరువులు జీవామృతం, బీజామృతం వినియోగిస్తూ పంట సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహజ వ్యవసాయం పథకంలో చంద్రవెల్లి గ్రామం ఎంపికై ందని, 125మంది రైతులకు ఒక్కో ఎకరంలో సహజ వ్యవసాయ సాగుపై మెళకువలు, సూచనలు చేస్తామని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజానరేందర్, మండల వ్యవసాయాధికారి ప్రేమ్కుమార్, చంద్రవెల్లి సర్పంచ్ చిలుముల శ్రీనివాస్, ఉప సర్పంచ్ గజ్జెల్లి రాజ్కుమార్, కేవీకే శాస్త్రవేత్త ప్రియసుగంధి, ఏఈవోలు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మాతాశిశు ఆరోగ్య కేంద్రం తనిఖీ
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్డెస్క్, నియోనేటల్ కేర్, పాలిటివ్కేర్, కీమోథెరపి సెంటర్లను పరిశీలించారు. జిల్లాలో కీమోథెరపి కోసం ఎంతమంది రోగులు ఎదురు చూస్తున్నారు, క్యాన్సర్ రోగుల వివరాలు అందించాలని సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి శ్రీనివాస్, డీపీహెచ్ఎన్ పద్మ పాల్గొన్నారు. -
దివ్యాంగుల చట్టం అమలు చేయాలి
పాతమంచిర్యాల: దివ్యాంగుల చట్టం–2016 పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్పీఎస్) జాతీ య నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను దూషించినా, వారిపై దాడి చేసినా కేసులు నమోదు చేయాలని కోరారు. దివ్యాంగుల కోసం అన్ని పోలీస్స్టేషన్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంచాలని, ర్యాంపులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో వికలాంగుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ కన్వీనర్ బీవీ.అప్పారావు, నాయకులు ఇందూరి రమేష్, కంచర్ల సదానందం, దుర్శెట్టి లక్ష్మణ్, మడావి షేక్రావు పాల్గొన్నారు. -
‘మీ సేవా’ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మీ సేవా కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య నిర్వాహకులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన వ్యవసాయ అధికారి సురేఖ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్తో కలిసి మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో మీ సేవా కేంద్రాలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని తెలిపారు. పని వేళలు పాటించాలని, వివిధ సేవలకు నిర్దేశించిన ధరల పట్టిక ప్రదర్శించాలని, నిర్దేశిత రుసుంకు మించి వసూలు చేయకూడదని పే ర్కొన్నారు. ప్రతీ మీ సేవ కేంద్రంలో హెల్ప్లైన్ సెంటర్, తహసీల్దార్ పేరు, మొబైల్ నంబరు ప్రదర్శించాలని, మార్చిలోగా అనుమతులు పునరుద్ధరించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ రైతుకు గుర్తింపు సంఖ్య కేటా యించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, మీ సేవా కేంద్రాలకు అవకాశం కల్పిస్తామని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. -
దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. లైబ్రరీ ఏర్పాటు చేయాలి నస్పూర్: నస్పూర్ మండల పరిధిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు దుర్గం రఘు, మేడ వంశీకృష్ణ, కట్ల శ్రీనివాస్, శ్రీరాంపూర్, నస్పూర్ మండలాల యువకులు కలెక్టర్ను కోరారు. కోల్బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారని, లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. -
మౌలిక సదుపాయాలతో విద్య
మంచిర్యాలఅగ్రికల్చర్: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్య అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వసతిగృహాల్లోని ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ విద్యార్థులు తయారు చేసిన నూతన సంవత్సర గ్రీటింగ్కార్డులను కలెక్టర్, అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాల నమోదులో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, సంక్షేమ అధికారులు చాతరాజుల దుర్గప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
ఒంటరిగా బతకలేక..
రామకృష్ణాపూర్:అతను సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ముగ్గురు కొడుకులు, కూతురును చదివించాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో కుంగిపోయాడు. అయినా కూతురుకు, పెద్ద కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం పిల్లలు ఉద్యోగ రిత్యా దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అతనికి అందరూ ఉన్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. ఒంటరిగా జీవించడంతో జీవితంపై విరక్తి కలిగింది. దీంతో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో ఆదివారం జరిగింది. ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని భగత్సింగ్నగర్కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బచ్చు సుదర్శన్(75) భార్య 20 ఏళ్ల క్రితం మరణించింది. 2007లో గోల్డెన్షేక్ హ్యాండ్ ద్వారా రిటైర్ అయ్యాడు. వృత్తి రీత్యా కుమారులు హైదరాబాద్లో ఉంటుండగా, కుమార్తె అత్తింట్లో ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెద్ద కుమారుడికి ఫోన్ చేశాడు. హైదరాబాద్కు వస్తానని తెలిపాడు. దీంతో కొడుక రెండు రోజల తర్వాత రావాలని సూచించాడు. ఇంతలోనే సుదర్శన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి వద్దకు వచ్చిన పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గోదావరిలో మునిగి ఒకరు..
జన్నారం: బంధువుల కర్మకాండకు వెళ్లివస్తూ గో దావరిలో మునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కుందారపు లక్ష్మీనారాయణచారి (55) ఆదివారం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం జైనా గ్రామంలోని బంధువుల ఇంట్లో కర్మకాండకు తన బాబయ్ చంద్రయ్యతో కలిసి తిమ్మాపూర్ గోదావరి నది దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లక్ష్మీనారాయణచారి మడుగులో నీటమునిగాడు. గమనించిన చంద్రయ్య రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలితం లేదు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి యువకుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై గొల్లపెల్లి అనూష సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య పుష్పలత, కుమారులు వెంకటచారి, రాజుకుమార్ ఉన్నారు. బాసర గోదావరిలో .. బాసర: బాసర గోదావరినది లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తిమృతదేహం లభ్యమైనట్లు ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మృతుడు నలుపు రంగు ప్యాంటు పింక్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపుకార్డు, చిరునామా కలిగిన ఆనవాళ్లు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చుక్కలదుప్పి మాంసం పట్టివేత!చెన్నూర్రూరల్: ఆదివార్పేట శివారులోని పత్తి చేనులో చుక్కలదుప్పిని హతమార్చి మాంసాన్ని తరలిస్తున్న వ్యక్తులను ఆదివారం రాత్రి చెన్నూర్ అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. దుప్పి మాంసంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి
మంచిర్యాలటౌన్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఓసీ నాయకుల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని ఐదేళ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి రూ.10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని, టెట్ అర్హత పరీక్ష మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని కోరారు. తమ డిమాండ్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 11న సాయంత్రం 3గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న ఓసీల సింహగర్జన సభకు రాజకీయాలకు అతీతంగా ఓసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభ పోస్టర్ ఆవిష్కరించారు. వివిధ సంఘాల నాయకులు మెట్టుపల్లి కిషన్రావు, రాకేశ్రెడ్డి, వెంకటరమణారావు, రాజిరెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్, హరీశ్, శ్రీకాంత్, కమల్ కిశోర్, సురేశ్, రామారావు, మురళీధర్రావు పాల్గొన్నారు.మున్నూరుకాపు కార్పొరేషన్.. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ మంత్రి శ్రీధర్బాబును కోరారు. ఆదివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. -
మద్యానికి బానిసై ఒకరు మృతి
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడలో మద్యానికి బానిసై ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ముల్కల్లగూడకు చెందిన చంద్రశేఖర్ (35) చిన్ననాటి నుంచి అమ్మమ్మ భీమక్క వద్ద ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం భీమక్క మృతి చెందింది. గతేడాది అతను ఉంటున్న ఇల్లు కూలిపోవడంతో సమీపంలో ఉన్న జీవన్రెడ్డి ఇంట్లో పడుకుంటున్నాడు. ఈ నెల 2 నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి సమీపంలో దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లిచూడగా మృతిచెంది కనిపించాడు. తిండి, నీరు లేక చనిపోయాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
‘సీపీఐది త్యాగాల చరిత్ర’
బెల్లంపల్లి: సీపీఐది త్యాగాల చరిత్ర అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్ పేర్కొన్నారు. బెల్లంపల్లిలో సీపీఐ చేపట్టిన జీపు జాతాను ఆదివారం ప్రారంభించారు. బజారు ఏరియాలోని దివంగత గుండా మల్లేశ్, సర్దార్ భగత్సింగ్ విగ్రహాలకు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ కంట్రోల్ కమిషన్ సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామితో కలిసి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈనెల 18న నిర్వహించనున్న సీపీఐ శత జయంత్యుత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అన్ని వర్గాల హక్కులు, సమస్యల పరిష్కారానికి సీపీఐ అలుపెరుగని పోరాట చేస్తోందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, బీ పూర్ణిమ, అసెంబ్లీ నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి దాగం మల్లేశ్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, అక్కెపల్లి బాపు, కొండు బానేశ్, బీ తిలక్ అంబేడ్కర్, మాణిక్యం, జీసీ మాణిక్యం, డీఆర్ శ్రీధర్, కే రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మధుకు గద్దర్ అవార్డు
బెల్లంపల్లి: బెల్లంపల్లికి చెందిన సీనియర్ డ్యాన్స్ మాస్టర్, కళాకారుడు హన్మాండ్ల మధు ప్రజాయుద్ధనౌక గద్దర్ అవార్డు అందుకున్నాడు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని జనవరి 1న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో మోక్షిత డ్యాన్స్ అకాడమీ, సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా జానపద నృత్య దర్శకుడిగా ప్రసిద్ధిగాంచిన మధుకు రిటైర్డు ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలిమంచిర్యాలటౌన్: రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం పట్టణంలోని జర్నలిస్టులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రాయితీతో కూడిన రైల్వే పాసులను అందజేసేదన్నారు. మూడేళ్ల క్రితం వాటిని ర ద్దు చేసిందని, పునరుద్ధరించేందుకు కృషి చే యాలని కోరారు. స్పందించిన ఎంపీ రైల్వే మంత్రితో పాటు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. క్రీడలతో మానసికోల్లాసంముధోల్: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో జరుగుతున్న విభాగ్స్థాయి ఖేల్కూద్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో శారీరక ధృడత్వం పెరుగుతుందని, స్నేహాభావం పెంపొందుతుందన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కబడ్డీ పోటీల్లో భైంసా, ఖోఖో పోటీల్లో ముధోల్, పరుగుపందెంలో ఆదిలాబాద్ (ప్రథమ), లాంగ్జంప్లో బజార్హత్నూర్ ప్రథమ, -
● జిల్లా అడవులను వీడిన పులులు ● అనుకూల ఆవాసానికి వెతుకులాట ● ‘కవ్వాల్’ కోర్లోనూ ఆగని బెబ్బులి ● గోదావరి దాటి పొరుగు జిల్లాలకు..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ వచ్చిన వలస పులులు జిల్లాను విడిచివెళ్లాయి. ఇటీవల జిల్లా అడవుల్లోకి కొత్తగా వచ్చిన మూడు పులులు జిల్లా సరిహద్దులను దాటి పోయాయి. కొద్ది రోజులుగా చెన్నూరు, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ వరకు వచ్చిన ఓ మగ పులి పది రోజుల క్రితమే గోదావరి దాటి మంథని మీదుగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వరకు వెళ్లింది. మరో పులి గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి మానేరు వాగు తీరం వెంబడి తిరుగుతోంది. సుల్తానాబాద్, కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాలు, పరిసర గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇక జన్నారం డివిజన్లో సంచరించిన పులి ఇందన్పల్లి మీదుగా గోదావరి దాటి సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దు అడవుల్లో తిరుగుతోంది. ఇలా.. కొత్తగా వచ్చిన మూడు పులులు ప్రస్తుతం జిల్లా దాటి వెళ్లిపోయాయి. ఈ పులులు మహారాష్ట్ర నుంచి తమ అనుకూల ఆవాసం కోసం వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి డివిజన్ల మధ్య ర్యాలీ, గడ్పూర్, దేవాపూర్, తిర్యాణి అడవుల మధ్య మరో పులి సంచరిస్తోంది. అలాగే, వేమనపల్లి మండలం నీల్వాయి, ప్రాణహిత తీర అటవీ పరిసర ప్రాంతాల్లో మరో పులి తిరుగుతోంది. కోర్లోకి వెళ్లలేక.. కవ్వాల్ పులుల అభయారణ్యం పులుల ఆవాసంగా ఉంది. అన్ని అనుకూలతలున్న వందల ఎకరాల భూమి కోర్ పరిధిలోనే ఉంది. అయితే.. ఇప్పటికీ ఒక్క పులి కూడా ఆవాసమేర్పరుచుకోలేదు. ఏటా సీజన్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్లడమే గాని పులులు ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు. కోర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అటవీ సమీపంలో భూములు ఉండడంతో స్థానికులకు కంటపడుతున్నాయి. మరోవైపు ప్రాణహిత, గోదావరి తీరాలతో పాటు వాగులు, వంకలు, దట్టమైన పొదల్లో ఉంటున్నాయి. అయితే.. ఇటీవల శ్రీరాంపూర్ ఆర్కే–8 పరిసర ప్రాంతంలో ఓ పులి కనిపించింది. భీమారం మండలం నరసింహాపురం బస్టాప్ సమీప వాగులో దాని పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఇదే తీరుగా నెలన్నరగా పులులు జిల్లాలో సంచరించాయి. గోదావరి తీరాలు, నీటి కుంటలు, వాగుల వెంట అడవుల్లో కలియదిరుగుతున్నాయి. అయితే.. ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు జిల్లాలో స్థిర నివాసమేర్పరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాగా, మళ్లీ ఆ పులులు తిరిగి జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశముందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.కొత్త పులులు జిల్లా అడవుల్లోకి ప్రవేశించగానే వాటి సంచారంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలు తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా అడవుల్లో రెండు పులులు సంచరించిన విషయం తెలిసిందే. జిల్లాలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, ఓపెన్కాస్టులు, గోదావరి తీర ప్రాంతాలతో పాటు అడవుల్లో పులులు సంచరిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులకు ఇక్కడ అనుకూలమైతేనే ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. ఇక్కడి అడవుల్లో పరిస్థితులు అనుకూలిస్తేనే కొంతకాలం ఉంటున్నాయి. లేకపోతే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో స్థానికులకు తారసపడుతున్నాయి. అలాగే, రైతుల పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఇటీవల సంచరించినవి రెండు మగ పులులుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవి తోడు కోసమే ఆడపులుల కోసం తిరుగుతున్నాయా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఏటా చలికాలంలో పులులు తోడు వెతుక్కునే అవకాశాలుంటాయని చెబుతున్నారు. -
వాకింగ్కు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
మంచిర్యాల(క్రైం): వాకింగ్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మజారొద్దీన్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్ఆర్ఆర్ నగర్లో నివాసం ఉంటూ కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)లో పోస్ట్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాంబట్ల నాగేందర్ శర్మ (58) ఈ నెల 3న సాయంత్రం ఏసీసీ రోడ్ వైపు వాకింగ్కు వెళ్లాడు. ఇంటికి తిరిగివస్తుండగా గడ్పూర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆటో డీమార్ట్ సమీపంలో ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య శీలా, కుమారుడు అక్షయ్, కుమార్తె నికిత ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
అడ్వకేట్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఏఎంసీ క్రీడా మైదానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వకేట్స్ ప్రీమియర్ లీగ్ మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ శనివారం రాత్రి ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ జట్టు విన్నర్స్గా, మంచిర్యాల బార్ అసోసియేషన్ జట్టు రన్నర్స్గా నిలిచాయి. ఇరుజట్లకు ముఖ్య అ తిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య బహుమతులు అందజేశారు. మంచిర్యాల సబ్ జడ్జి రామమోహన్రెడ్డి, బె ల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం శివకుమార్, కార్యదర్శి చేను రవికుమార్, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘జీవో 229ని వ్యతిరేకిస్తున్నాం’
మంచిర్యాలటౌన్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా తీసుకువచ్చిన జీవో 229ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), హెల్త్కేర్ రిఫార్మ్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) మంచిర్యాల విభాగ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడికల్ కౌన్సిల్ అనేది ఒక స్వంతంత్ర చట్టబద్ధమైన సంస్థ అని, ప్రభుత్వ అధి కారుల జోక్యం పెరగడంతో కౌన్సిల్ వృత్తిపరమైన స్వేచ్ఛ, నిర్ణయాధికారం పూర్తిగా దెబ్బతింటాయన్నారు. కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 25 నుంచి 29కి పెంచడం ద్వారా ఇబ్బందులుంటాయని, వైద్య, విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ లాంటి అంశాలపై వైద్యార్హత లేని ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం టీజీఎంసీ నకిలీ వైద్యులపై కఠినచర్యలను తీసుకుంటున్న తరుణంలో జీవో 229ని తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చట్టపరమైన, ప్రజా స్వామ్య మార్గాల్లో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీజీఎంసీ సభ్యులు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, డాక్టర్ సంతోష్ చందూరి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవిప్రసాద్, హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ ముత్తినేని, వైద్యులు పాల్గొన్నారు. -
సదాశివకు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం
ఆదిలాబాద్: తెలంగాణ సాహితీ దిగ్గజం సామల సదాశివ మాస్టార్ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపునిస్తూ ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారం ప్రదానం చేసింది. మరణానంతరం ఆయన గౌరవార్థం ప్రకటించింది. గుంటూరు జిల్లా అమరావతిలోని ఎన్టీ రామారావు ప్రాంగణంలో ఈనెల 3 నుంచి నిర్వహిస్తున్న తెలుగు మహాసభల్లో శనివారం రాత్రి మాస్టార్ కుమారులు రాజవర్ధన్, శ్రీవర్ధన్, చంద్రశేఖర్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుని చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సభలో ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. -
గెలిచిన సంఘాలు విఫలం
శ్రీరాంపూర్: ఎన్నికల్లో గెలిచిన సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం అయ్యాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆర్కే న్యూటెక్ గనిపై ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ కార్మికులకు రెండేళ్లలో సాధించింది ఏమీలేదన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన గెలిచిన తరువాత మోసం చేశారన్నారు. సింగరేణి కార్మికులకు హక్కులు సాధించి పెట్టిన చరిత్ర టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిపై ఉన్న మమకారంతో కారుణ్య ఉద్యోగాలు, క్వార్టర్లలో ఉచిత విద్యుత్తు, లాభాల్లో అధిక శాతం వాటా వంటి అనేక హక్కులు కల్పించారన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్లో చేరగా వారికి నేతలు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు నూనె కొమురయ్య, సతీష్, సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్ రెడ్డి, లాల, వెంగళ కుమార్ స్వామి, దేవేందర్ శ్రీకాంత్, జైపాల్రెడ్డి, రాజేంద్రప్రసాద్, భగవాన్, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మంచిర్యాలటౌన్: అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వడంతో రైల్వేకు ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈఎల్ఐ స్కీంను అమలు చేయాలని తాను పార్లమెంట్లో అడగ్గా రూ.80వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మంచిర్యాలలోని హమాలీవాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ రూ.10వేలకు పెంచాలని తాను పార్లమెంట్లో డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు లేకుండా చేసిన, కూలీల పనిదినాలను 100 నుంచి 60కి కుదించిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. మందమర్రిలో లెదర్ పార్కు, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.4వేల కోట్లతో పెద్దపల్లి–మణుగూరు రైల్వేలైన్ పనులు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. చెన్నూరు, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బసంత్నగర్లో ఎయిర్పోర్టు ఏర్పాటుకు అనుకూలమా కాదా? అనే రిపోర్టు కోసం రూ.55లక్షలను ప్రభుత్వం మంజూరు చేసి సర్వే చేసిందని, త్వరలోనే ఎయిర్పోర్టు కల సాకారమవుతుందని తెలిపారు. బెల్లంపల్లిలో జాబ్మేళా నిర్వహించి 2వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వివరించారు. బాల్క సుమన్ హైదరాబాద్లో కాకుండా చెన్నూరులో ఉండి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని, ఆర్నెళ్లకోసారి వచ్చి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ తదితరులున్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు మంచిర్యాలఅర్బన్: గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో ముచ్చటించారు. అభ్యర్థులు ఎంపీకి సమస్యలు వివరించగా పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బైపాస్రోడ్లోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీసభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, లైబ్రేరియన్ మురళి, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు. -
ఇక మున్సి‘పాలిటిక్స్’..
● కసరత్తు చేస్తున్న రాజకీయ పార్టీలు ● పోటీకి సై అంటున్న ఆశావాహులు ● పార్టీ పెద్దల వద్ద జోరుగా పైరవీలు ● రిజర్వేషన్ల కోసమే ఎదురుచూపులుమంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేయాలని ఆశావహులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించారు. ఓ డివిజన్కు చెందిన ఓట్లు మరో డివిజన్లోకి వెళ్లడంపై ఇప్పటికే 100 వరకు అభ్యంతరాలు వచ్చాయి. ఆశావహులు స్వయంగా ఓటరు జాబితాను పరిశీలించి ఏయే ఓట్లు ఇతర డివిజన్లోకి వెళ్లాయనే వివరాలు సేకరిస్తున్నారు. ఆయా ఓటర్లతో మాట్లాడి అభ్యంతరాలను నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇప్పిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో దొర్లిన తప్పులను అధికారులు సరిచేసి ఈ నెల 10న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. దీంతో డివిజన్లలోని ఓటర్లు ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించగా ఓటరు తుది జాబితా విడుదల అనంతరం రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. రిజర్వేషన్ మారితే ఎలా? మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లున్నాయి. 254 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,82,029 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 90,757 మంది, మహిళలు 91,251 మంది ఉండగా, 21 మంది ఇతరులున్నారు. వీరిలో ఎస్సీ ఓటర్లు 25,419 మంది, ఎస్టీ ఓటర్లు 2,946 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తుది ఓటరు జాబితాను ఈ నెల 10న ప్రకటిస్తే రిజర్వేషన్లు ఏవిధంగా వస్తాయనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. మహిళలకు రిజర్వేషన్ వస్తే తమ కుటుంబ సభ్యుల్లోని వారిని పోటీ చేయించాలనే దానిపై ఆశావహులు కసరత్తు చేస్తున్నారు. రిజర్వేషన్ కలిసి రాకపోతే పక్క డివిజన్ నుంచైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటికే డివిజన్ల వారీగా ఆయా పార్టీల కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ సూచించిన అభ్యర్థులు ఎవరైనా సరే గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచిస్తున్నారు. బెల్లంపల్లిలో మొదలైన హడావుడి.. బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఓటరు జాబితాలో వార్డుల మార్పిడి జరగడం, తప్పుడు వివరాలు నమోదు కావడంతో సవరించాలని కోరుతూ ఓటర్లు మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఈనెల 11న లేదా సంక్రాంతి తర్వాత 20లోపు ఎన్నికల నోటిఫికేషన్జారీ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ప్రధాన రాజకీయపక్షాలు పోటీకి సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు సమావేశాల నిర్వహణలో తలమునకలయ్యాయి. ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలు స్వీకరిస్తున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గెలుపోటముల గురించి చర్చిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులుండగా.. ఆశావహుల వివరాలు నేతలు తెలుసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం బీజేపీ శ్రేణులు సమావేశం నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని పోటీకి సిద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం సీపీఐ ముఖ్య నాయకులు ఎన్నికల్లో పోటీ గురించి సమాలోచనలు చేయగా, ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఏ ర్పాటు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు వార్డుల్లో పోటీ చేయనున్న మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఔత్సాహికుల గురించి గుట్టుగా ఆరా తీసే పని లో నిమగ్నమయ్యారు. అయితే.. అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యే చేయనుండటంతో ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయం దిశగా కాంగ్రెస్ రాజకీయాలు మళ్లుతున్నాయి. ఆశావహులు వార్డుల రిజర్వేషన్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ చేస్తారో.. తమకు పోటీ చేసే అవకాశం దక్కుతుందో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొందరు పక్క వార్డుల వైపు చూస్తున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల కన్నా ఈసారి జరిగే ఎన్నికల్లో అత్యధికులు పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థ వివరాలు మొత్తం డివిజన్లు 60 పోలింగ్ కేంద్రాలు 254 మొత్తం ఓటర్లు 1,82,029 ఎస్సీ ఓటర్లు 25,419 ఎస్టీ ఓటర్లు 2,946చెన్నూర్లో గెలుపు గుర్రాల వేట..చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లను గెలిపించుకునేందుకు ఆయా పార్టీలు సమాయాత్తమవుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టాయి. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు ఆశావహులపై సర్వే చేస్తున్నాయి. మరోవైపు ఆశావహులే టిక్కెట్ల కోసం పార్టీ పెద్దల వద్ద క్యూ కడుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహులు పార్టీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నెల 10న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అనంతరం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించే అవకాశముంది. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో మున్సిపల్ అభ్యర్థుల ఎంపికను మంత్రి వివేక్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. చెన్నూర్ నియోజకవర్గంలో ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికల్లో కొంత మైలేజీ రాగా చెన్నూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇవ్వాలని మిగతా పార్టీలు చూస్తున్నాయి. -
నాగోబా జాతర పనులు షురూ
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం ఈ నెల 18న మెస్రం వంశీయుల మహా పూజతో ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాటు పనులను అధికారులు ప్రారంభించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలతో పాటు జాతర నిర్వహణ, మర్రిచెట్టు, గోవడ్ పరిసర ప్రాంతాల్లోని పిచ్చిమొక్కలను బ్లేడ్ ట్రాక్టర్తో తొలగించారు. గోవడ్కు రంగులు వేయిస్తున్నారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందే ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. -
సింగరేణికి బకాయిలు చెల్లించాలి
శ్రీరాంపూర్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.45 వేలకోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్లోని నరసయ్య భవన్లో నిర్వహించిన యూనియన్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బహిరంగసభకు సింగరేణి కార్మికులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్రావు, నాయకులు కొమురయ్య, రాచర్ల చంద్రమోహన్, అఫ్రోజ్ ఖాన్, ప్రసాద్ రెడ్డి బుచ్చయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న సింగరేణి మందమర్రిరూరల్: సింగరేణి యాజమాన్యం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కార్మిక సమస్యలు పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కంటే ఈ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం అధికమైందన్నారు. యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేశ్, రామకృష్ణాపూర్ కార్యదర్శి అక్బర్అలీ, నాయకులు చిప్ప నర్సయ్య, లింగయ్య, శ్రీనివాస్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలి
జైనథ్: ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని త్రి దండి దేవనాథ్ రామానుజ జీయర్ స్వామి అ న్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం వికాస తరంగణి ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాసంలో సూర్యుడు ధనురాశిలో ఉండడంతో ఈ వ్రతాన్ని ధనుర్మాస వ్రతం అని అంటారన్నారు. ఈ వ్రతాన్ని ఆచరించిన మహిళల కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొంటాయన్నారు. లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షుడు హనుమంతరావు, సభ్యులు రాజేశ్వర్, బాలకిషన్, సర్పంచ్ గడ్డం మమత జగదీ ష్, ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
● కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు ● నాగోబాను స్మరిస్తూ ‘మెస్రం’ పాదయాత్ర ● గత నెల 30న కేస్లాపూర్లో ప్రారంభం ● హస్తినమడుగు దారిలో 145మంది వంశీయులు
పాదయాత్రలో మెస్రం వంశీయులు పూర్తిగా తెల్లని వస్త్రాలతోనే ముందుకు సాగుతారు. తలపాగా, చొక్కా, దోవతి/ప్యాంట్ అన్నీ శ్వేతవస్త్రాలే విని యోగిస్తారు. చెప్పులు లేకుండా రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లచొప్పున నడుస్తారు. ముందుగా నిర్దే శించిన ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బస చేస్తారు. శాకాహారంతో కూడిన భోజనం స్వీకరిస్తారు. కల శం చేతబూనిన కటోడా పర్యవేక్షణలో, పర్దాన్ ముందుండగా వారిని మిగతా వారు అనుసరిస్తా రు. నాగోబాను స్మరిస్తూ అడుగులో అడుగేస్తారు. ఈ సారి ప్రధాన కటోడగా మెస్రం హన్మంతరావు, పర్దాన్గా దాదారావ్ వ్యవహరిస్తున్నారు. శనివారం డబోలి గ్రామానికి చేరుకున్నారు. -
ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ
మంచిర్యాలటౌన్: జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయంలో 37అ భ్యంతరాలు స్వీకరించారు. 49వ డివిజన్లో 3,187 మంది ఓటర్లతో డివిజన్ ఏర్పాటు చేసి ము సాయిదా జాబితాలో 3,823 మంది ఉన్నట్లుగా ప్రకటించారని డివిజన్కు చెందిన అబ్దుల్ సత్తార్ అభ్యంత రం వ్యక్తం చేశారు. 503 ఓట్లు తొలగించేవి ఉన్నట్లుగా పేర్కొన్నారు. హైటెక్సిటీ కాలనీకి చెందిన బో డకుంట పుష్పలత, మహేందర్రెడ్డి 52వ డివిజన్లోని తమ కుటుంబ సభ్యుల ఓట్లు 21వ డి విజన్లోకి మారాయని తెలిపారు. 15వ డివిజన్కు చెంది న ఓటర్లను 14, 19వ డివిజన్లలోకి వేశారని, వాటిని 15వ డివిజన్లో చేర్చారని పేర్కొన్నారు. 23వ వా ర్డులోకి వెళ్లిన తమ ఓట్లను 39వ వార్డులోకి మార్చాలని లక్ష్మణమూర్తి వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లిలో..బెల్లంపల్లి: బెల్లంపల్లిలో పదుల సంఖ్యలో ఓటర్లను ఓ వార్డు నుంచి మరో వార్డులో చేర్చారని, 20వ వార్డులో పంది మంది మృతుల పేర్లు తొలగించలేదని పలువురు అభ్యంతరం తెలిపారు. ఏళ్ల క్రితం పట్టణం వదిలి వెళ్లిన వారి పేర్లు తొలగించలేదని, ఒకే పేరు రెండు చోట్ల వచ్చాయని ఓటర్లు, పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న వారు మున్సిపల్ కార్యాలయంలో శనివారం వినతిపత్రాలు అందజేశారు. అభ్యంతరాలను పరిశీలించి తప్పులు దొర్లితే సవరణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు. చెన్నూర్లో..చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీలో ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులు సవరించాలని 25 మంది దరఖాస్తులు అందజేశారు. ఒక కుటుంబ సభ్యుల ఓట్లు రెండు మూడు వార్డుల్లోకి మార్చారని, ఒకే వార్డులోకి సవరించాలని కోరారు. ఈ నెల 8 నాటికి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఓటర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ తెలిపారు. -
గట్టు మల్లన్న క్షేత్రం అభివృద్ధి చేస్తాం
జైపూర్: ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టు మల్లన్న క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలోని వేలాల గట్టు మల్లన్నస్వామి 16వ గిరి ప్రదక్షిణలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పా ల్గొన్నారు. అనంతరం దొణలో మల్లన్న స్వామిని ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేలాల గ్రామం, గట్టు మల్లన్న స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాన్ని, రోడ్లు అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులతో కలిసి గిరి ప్రదక్షణ పోస్టర్లు ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీఽనివాస్రెడ్డి, నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, ముక్త శ్రీనివాస్, విశ్వంభర్రెడ్డి, సర్పంచ్ డేగ స్వప్ననగేశ్ పాల్గొన్నారు. మాలీలకు ఎస్టీ హోదాకు పార్లమంటు ప్రస్తావిస్తా భీమిని: మాలీలకు ఎస్టీ హోదా కోసం పార్లమెంటులో ప్రస్తావిస్తానని, మాలీల హక్కుల కోసం పోరా డుతానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివా రం కన్నెపల్లి మండల కేంద్రంలో జ్యోతిరావుపూలే–సావిత్రీబాయిపూలే విగ్రహాలను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చేలా చూడాలని మాలీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చెండే సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. కన్నెపల్లి వాగు కోతకు గురికాకుండా కరకట్ట ఏర్పాటు చేయాలని, వీరాపూ ర్ దుబ్బగూడం ప్రాజెక్టు కాలువలను పునరుద్ధరించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో మా లీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్ల మొండి, పొలిట్ బ్యూరో సభ్యుడు లక్ష్మణ్, జిల్లా సంయుక్త కార్యదర్శి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగరావు పాల్గొన్నారు. -
వైద్యులు సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికా రి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాల అర్బన్ హెల్త్ సెంటర్లో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమ అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలను ఎప్పటికప్పుడు సరిచూసుకుని, తెప్పించుకోవాలని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలి పారు. కుక్క, పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రతాప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
‘సంక్రాంతి’కి ప్రత్యేక బస్సులు
మంచిర్యాలఅర్బన్: సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. పండుగ వేళ ఆంధ్రా ప్రాంతానికి నెల రోజుల ముందు నుంచే ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి కాగజ్నగర్ వైపు ప్రత్యేక రైళ్లు ప్రకటించకపోవడంతో బస్సులకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తోంది. సెలవులు కూడా వస్తుండడంతో పండుగ సందడి మొదలు కానుంది. గత ఏడాది సంక్రాంతికి మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి 81 బస్సులు నడిపించారు. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీ, సౌకర్యార్థం 101 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. సంక్రాంతి పండుగకు ముందు రోజు 17నుంచి 20 బస్సులు నడిపించనున్నారు. మంచిర్యాల–సికింద్రాబాద్–మంచిర్యాలకు ఈ నెల 7న 5బస్సులు, 8న 6, 9న 21, 10న 20, 11న 8, 12న 17, 13న 20, 14న నాలుగు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. జేబీఎస్లో ప్రయాణికులకు బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు మేనేజర్, అసిస్టెంటు మేనేజర్, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి మేడారానికి.. మంచిర్యాల నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆదివారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉదయం 6గంటలకు బస్సు బయలుదేరి చెన్నూర్, కాళేశ్వరం మీదుగా మేడారం చేరుకుంటుంది. మధ్యాహ్నం 1గంటకు తిరుగు ప్రయాణంలో మంథని, గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు చేరుతుంది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నారు.రద్దీకి అనుగుణంగా నడిపిస్తాం.. పండుగ సందర్భంగా రద్దీ అధికంగా ఉంటే మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి. ఆయా బస్స్టేషన్లో సమాచారం అందించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాం. – శ్రీనివాసులు, డిపో మేనేజర్, మంచిర్యాల -
సావిత్రీబాయి పూలే సేవలు మరువలేనివి
మంచిర్యాలఅగ్రికల్చర్: బాలిక విద్యకు కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావి త్రీబాయి పూలే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సావిత్రీబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా వి ద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి సావి త్రీబాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పది మంది మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మెనూ అమలు చేయాలి జైపూర్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం మెనూ కచ్చితంగా అమలు చేయాల ని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన సందర్శించారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి ఫణిబాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’
చెన్నూర్: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, చెన్నూర్ మున్సిపాలిటీలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ఎంపీ ఎన్నికల్లో చెన్నూర్ మున్సిపాలిటీలో బీజేపీకి అత్యధికంగా ఓట్లు వేశారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజే పీ అభ్యర్థుల గెలుపు కోసం బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, నాయకులు జాడి తిరుపతి, రాపర్తి వెంకటేశ్వర్, కొండపాక చారి, కమ్మల శ్రీనివాస్, ఏతం శివకృష్ణ, మానికరౌతు శంకర్, నాయకురాలు శ్రావణి, స్వరూప పాల్గొన్నారు. -
‘ఎల్లంపల్లి’లో నీటమునిగి కౌలురైతు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ప్రమాదవశాత్తు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీట మునిగి కౌలురైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పడ్తనపల్లికి చెందిన చిందం ఆంజనేయులు (38) గ్రామ శివారులో పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున పొలానికి నీరు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఎల్లంపల్లి బ్యాక్వాటర్లో పడిపోవడంతో ఈత రాక నీట మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య సుమలత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. జోనల్ కార్యాలయం ప్రారంభంలక్సెట్టిపేట: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల కాళేశ్వరం జోన్ పరిధి జోనల్ కార్యాలయ భవనాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల భవనంలో శనివారం జోనల్ అధికారి గిరిజ ప్రారంభించారు. మంచిర్యాలలోని ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న భవనాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణానికి మార్చినట్లు తెలిపారు. జోనల్ స్థాయి సేవలన్నీ ఇక్కడి నుంచే లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వర్రావు, సిబ్బంది నవీన్, ధర్మేందర్, లక్ష్మణచారి, నాగరాజు, జ్యోతి, గీతాంజలి, శిరీష, తదితరులు పాల్గొన్నారు. -
‘రక్షణాధికారిపై చర్యలు తీసుకోవాలి’
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని రక్షణాధికారి సంతోశ్రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యాక్టింగ్ కోల్కట్టర్ బాదావత్ రమేశ్, సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజునాయక్ శనివారం గని మేనేజర్ తిరుపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవుని ప్రసాదాన్ని సంతోశ్రావుకు ఇవ్వబోతే గిరిజనుడని ఇష్టం వచ్చినట్లు దూషించారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మేనేజర్ను కోరారు. గూడెంలో పౌర్ణమి జాతరదండేపల్లి: మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెంలో గల శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం పుష్యపౌర్ణమి జాతర వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకున్నారు. 133 జంటలు సామూహిక సత్యనారాయణవ్రతాలు నోముకున్నాయి. జాతరకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. జాతర సందర్భంగా గూడెం ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలితాండూర్: సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన జరిగేలా కృషి చేయాలని జిల్లా సంక్షేమాధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనంపై ఆరా తీశారు. తానే స్వయంగా వడ్డించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొద్దిసేపు వారికి పాఠాలు బోధించారు. -
అడవిజంతువు దాడిలో ఏడు గొర్రెలు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగాపూర్లో అల్లంల రమేశ్కు చెందిన ఏడు గొర్రెలపై శనివారం వేకువజామున అడవిజంతువు దాడి చేయడంతో మృతి చెందాయి. మండల పశువైద్యాధికారి డాక్టర్ శాంతిరేఖ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. షెడ్డులో ఉంచిన గొర్రెలపై గుర్తు తెలియని అటవీ జంతువు దాడిచేసి ఉంటుందని, ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. గొర్రెల విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. 20 రోజుల క్రితం అదే గ్రామంలో గుండాల రమేశ్, కొమ్ము పోచయ్యకు చెందిన 20 గొర్రెలు అడవి జంతువుల దాడిలో మృతి చెందాయని స్థానికులు పేర్కొన్నారు. రాత్రివేళ నక్కల అరుపులు వినిపిస్తున్నాయన్నారు. -
హోరాహోరీగా ఖేల్ఖూద్ పోటీలు
ముధోల్: మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శనివారం ఖేల్ఖూద్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సరస్వతి విద్యాపీఠం విభాగ్ అధ్యక్షులు భజరంగ్లాల్ అగర్వాల్, మండల విద్యాధికారి గోపిడి రమణారెడ్డి, ముఖ్యఅతిథి యార్లగడ్డ శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోటీల్లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, తదితర పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, జిల్లా కార్యదర్శి గోపాల్ కిషన్, ముధోల్ పాఠశాల సమితి అధ్యక్షులు రవీంద్రనాథ్ పాండే, కొండావార్ సంజీవ్, లోకేశ్వరం మాజీ ఎంపీపీ నగరం నారాయణరెడ్డి, రోళ్ల రమేశ్, ప్రధానాచార్యులు, ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు. -
పాము కాటుకు బాలుడు మృతి
ఇంద్రవెల్లి: పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సకారంతాండలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన బ ద్లుట్ దయరామ్, భాగ్యశ్రీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ (4) శుక్రవారం సాయంత్రం తోటి పిల్ల లతో కలిసి గ్రామ సమీపంలో గల రెగిచెట్టు వద్దకు వె ళ్లి పండ్లు తిన్నాడు. కొంతసేపటికి స్పృహతప్పి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు మండ ల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కాలుకు పాము కాటు వేసినట్లు అనుమానం ఉందని కుటుంబ సభ్యు లు తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
వికేంద్రీకృత వ్యవస్థతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
కై లాస్నగర్: ప్రజా సమస్యల పరిష్కారంలో వికేంద్రీకృత వ్యవస్థల అమలు అత్యంత కీలకమని కలెక్టర్ రాజార్షి షా అన్నారు. కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో వికేంద్రీకృత ప్రజావాణి విధానంపై శనివారం నిర్వహించిన సెమినార్కు హాజరయ్యారు. వికేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు అనే అంశంపై ప్రసంగించారు. ప్రజావాణి వ్యవస్థను స్థానిక స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, న్యాయసమ్మత పరిష్కారాలు అందించవచ్చన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘వికేంద్రీకృత ప్రజావాణి’ విధానాన్ని వివరించారు. అనంతరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ న్యాయ, ప్రజా విధాన విభాగాల విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా సంభాషించారు. అడ్మినిస్ట్రేటర్గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు, తెలంగాణలో వికేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ భవిష్యత్ దిశ పై అవగాహన కల్పించారు. సివిల్ సర్వెంట్లుగా మారాలని ఆకాంక్షించే విద్యార్థులకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ ప్రసంగం ప్రజా పాలనపై లోతైన అవగాహనను కల్పించిందని ఎన్ఎల్ఎస్ఐయూ వర్గాలు ప్రశంసించాయి. -
లారీ ఢీకొని ఒకరు దుర్మరణం
దండేపల్లి: మండలంలోని తాళ్లపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జన్నారం మండలం రాంపూర్కు చెందిన కోల మల్లయ్య (60) దుర్మరణం చెందాడు. దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. మల్లయ్య బైక్ రిపేర్ ఉందని ఇంటి నుంచి తాళ్లపేటకు బయల్దేరాడు. తాళ్లపేటకు చేరుకోగానే అతివేగంగా వచ్చిన లారీ బైక్ను వెనక నుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన మృతుడి బంధువు కాశయ్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటన స్థలికి చేరుకుని బోరున విలపించారు. తన భర్త మృతికి కారకుడైన లారీ డ్రైవర్పై చర్యలు తీసుకోవా లని మృతుని భార్య అసుమతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
నాటు వైద్యానికి దూరంగా ఉండాలి
బజార్హత్నూర్: ఆదివాసీ గిరిజనులు అనారోగ్యానికి గురైతే నాటు వైద్యం నమ్మకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం మండలంలోని డేడ్రా గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత లక్ష్యాలను ఏర్పర్చుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. డేడ్రా, మాన్కపూర్, గిరిజాయి, కొలాంగూడ, ఉమార్డ, భూతాయి(కే), బద్దునాయక్తాండ గ్రామాల గిరిజనులకు బ్లాంకెట్లు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ రాహుల్కాంత్, డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సైలు సంజయ్కుమార్, శ్రీసాయి, సర్పంచ్ విజయలక్ష్మి, లింగుపటేల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ అధ్యక్షుడు డాక్టర్ వెంకట్రెడ్డి, వైద్యులు అభిజిత్, శిల్పా, సందీప్, హేమలత, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు పెంచాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఖందేవ్ జాతర షురూ..
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఖందేవ్ ఆలయం పుష్యపౌర్ణమి సందర్భంగా జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా తరలిరావడంతో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంది. తొడసం వంశీయులు ఈ నెల 1న గురువారం మాన్కాపూర్ వద్ద మాసేమాల్ పేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి అక్కడే బస చేశారు. 2న శుక్రవారం సాయంత్రం ఖందేవ్ ఆలయానికి చేరుకున్నారు. అదేరోజు రాత్రి మహాపూజతో జాతర ప్రారంభమైంది. 3న శనివారం తొడసం వంశీయుల సంప్రదాయ భేటి నిర్వహించారు. సంప్రదాయ భేటీ ఖందేవ్ ఆలయ ప్రాంగణంలో తొడసం వంశీయులు పూజ అనంతరం సంప్రదాయ భేటి నిర్వహించారు. కొత్త కోడళ్లను దేవునికి పరిచయం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశీయులు వారి సాధక బాధలతో పాటు ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భావితరాలకు ఆదర్శంగా ఉండేలా ఆలయ అభివద్ధి నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తొడసం వంశీయులు, కటోడాలు తొడసం మోతీరాం, తొడ సం బాపూరావు, తొడసం ఆనందరావు, తొడసం చిత్రు, పటేళ్లు తొడసం రాజు, తొడసం తెలంగాణరావు, తొడసం గంగు, తొడసం భీంరావు, తొడసం బండు, ఆదివాసీ జేఏసీ చైర్మన్ మెస్రం రూప్దేవ్, సర్పంచ్ బానోత్ కావేరి, జ్ఞానేశ్వర్, రాథోడ్ సురేశ్, మాజీ సర్పంచులు బానోత్ గజానంద్ నాయక్, ఉర్వేత రూప్దేవ్, మడావి రూప్దేవ్, రాథోడ్ రాజునాయక్, ఖందేవ్ ఆలయ కమిటీ సభ్యుడు తొడసం నాగోరావు, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులు మెస్రం శేఖర్బాబు, మాజీ జెడ్పీటీసీ బిర్జులాల్ కర్మానకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకండే దేవరావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ షేక్ దాదేఅలి, తదితరులు పాల్గొన్నారు. నువ్వుల నూనె నైవేద్యం..ఖందేవుని సన్నిధిలో తొడసం వంశీయుల వద్ద నుంచి నువ్వుల నూనె సేకరించి కటోడ దేవుని కి నైవేద్యం సమర్పించారు. అనంతరం తొ డసం వంశ ఆడపడుచు ఆదిలాబాద్ మండలంలోని ఖన్నాపూర్ గ్రామానికి చెందిన సుర్పం సాక్రుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొదటి మొక్కును తీర్చుకుంది. మహారాష్ట్రలోని జివితి తాలూకా కొద్దేపూర్ గ్రామానికి చెందిన మెస్రం నాకుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మూడోసారి మొక్కు తీర్చుకుంది. -
చికిత్స పొందుతూ లోకో పైలెట్ మృతి
రెబ్బెన: మండలంలోని దేవులగూడ వద్ద ఆర్టీసీ లహరి బస్సును బొలెరో వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రైల్వే లోకో పైలెట్ జితేందర్ కుమార్ బరియా(41) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బెల్లంపల్లి రైల్వే లోకో పైలెట్గా పనిచేస్తున్న జితేందర్ బరియా తన తోటి అసిస్టెంట్ లోకో పైలెట్ అమిత్ శర్వన్తో కలిసి గత నెల 23న తెల్లవారు జామున బొలెరోలో రెబ్బెనలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్కు బయలుదేరారు. మార్గమధ్యలో దేవులగూడ వద్ద జాతీయ రహదారిపై ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ లహరీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో బొలెరో బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో బొలెరో డ్రైవర్ కొమరే విజయ్ (25) అదే రోజు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన జితేందర్ బరియాను హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని స్వస్థలం రాజస్థాన్లోని కోటా జంక్షన్. మృతునికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. -
మహాపూజకు సిద్ధమవుతున్న మెస్రం వంశీయులు
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 18న నిర్వహించనున్న నాగోబా మహాపూజతో పాటు సంప్రదాయ పూజల నిర్వహణకు మెస్రం వంశీయులు సిద్ధమవుతున్నారు. శనివారం మెస్రం వంశ మహిళలు నాగోబా మహాపూజతో పాటు సంప్రదాయ ముగింపు వరకు ప్రత్యేక పూజలకు అవసరమయ్యే స్వచ్ఛమైన నువ్వులతో గానుగ ద్వారా నూనె తీశారు. ఈ నూనెను నాగోబా మహాపూజతో పాటు నైవేద్యానికి వాడుతామని మెస్రం వంశ మహిళలు తెలిపారు. రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేతజన్నారం: జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్కు అందిన సమాచారం మేరకు సెక్షన్ అధికారులు రవి, హన్మంతరావు, బీట్ అధికారులు రాజేశ్వర్, శ్రీనివాస్, తన్వీర్ పాషా ఇందన్పల్లి పరిధిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఇకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అనుమతి లేకుండా ఇసుక తీయడం నేరమని, ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని రేంజ్ అధికారి హెచ్చరించారు. -
బాసరలో భక్తుల సందడి
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో సందడిగా మారింది. వేకువజామున భక్తులు పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఎస్సై నవనీత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. -
ఖందేవ్ చెంతకు తొడసం వంశీయులు
నార్నూర్: మండలంలోని మాన్కాపూర్ గ్రామం వద్ద మాసే మాల్ పేన్కు తొడసం వంశీయులు గురువారం అర్ధరాత్రి పూజలు చేసిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఖందేవ్ పుణ్యక్షేత్రానికి ఎడ్లబండ్లపై వచ్చారు. కొందరు కాలినడకన ఆలయానికి పూజ సామగ్రితో చేరుకున్నారు. రాత్రి 9.30 గంటలకు పుష్య పౌర్ణమి సందర్భంగా ఖందేవుడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తొడసం వంశీయుల సమక్షంలో వంశ పెద్దలు మహాపూజలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం 9గంటలకు ఆదిలాబాద్ మండలం ఖండాల గ్రామానికి చెందిన తొడసం దుర్గుబాయి, దుర్గు దంపతుల కూతురు ఆదిలాబాద్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన సుర్పం సాక్రుబాయి, మల్కు వంశానికి చెందిన ఆడబిడ్డ దేవుని సన్నిధిలో వారి వంశం నుంచి సేకరించిన దాదాపు రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొదటిసారిగా తన మొక్కు తీర్చుకోనుంది. తొడసం వంశీయులు భారీగా క్షేత్రానికి చేరుకోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం రూప్దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తొడసం నాగోరావు తెలిపారు. మహాపూజకు ముస్తాబైన ఖందేవ్ ఆలయంఎడ్లబండ్లపై వస్తున్న తొడసం వంశీయులు -
మంత్రిని కలిసిన రోడ్డు విస్తరణ బాధితులు
చెన్నూర్: చెన్నూర్ అంబేద్కర్ చౌరస్తా పెద్ద చెరువుకట్ట వరకు రోడ్డు విస్తరణ బాధితులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని శుక్రవారం హైదరాబాద్లో మాజీ జెడ్పీటీసీ పోటు రాంరెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. రోడ్డు విస్తరణలో 60 ఫీట్లు కాకుండా 40 ఫీట్లు వెడల్పు చేయాలని విన్నవించారు. 60 ఫీట్ల రోడ్డు వెడల్పుతో 20 నుంచి 30 కుటుంబాటు రోడ్డున పడే అవకాశం ఉందని, వెసులుబాటు కల్పించాలని కోరారు. మంత్రి స్పందిస్తూ రోడ్డు విస్తరణలో పూర్తిగా భవనాలు కోల్పోయిన వారికి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్మించే కమర్షియల్ కాంప్లెక్స్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఈ నెల 6న చెన్నూర్కు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని తెలిపారు. కార్యక్రమంలో సామాజిక వేత్త పోటు సత్యనారాయణరెడ్డి, రోడ్డు విస్తరణ బాధితులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా తప్పుల తడక
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల ఒకటిన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా మారింది. ఒక డివిజన్ ఓటర్లను మరో డివిజన్లో చేర్చారంటూ అభ్యంతరం వ్యక్తమవుతోంది. మంచిర్యాల మున్సిపాల్టీలో నస్పూర్ మున్సిపాల్టీతోపాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్గా గత ఏడాది జనవరిలో ఏర్పాటు చేయడం, 60 డివిజన్లుగా విభజించడం తెలిసిందే. ఒక్కో డివిజన్లో 1800 నుంచి 4వేల మంది ఓటర్లు ఉండేలా ప్రాంతం ఆధారంగా విభజించారు. కొన్ని డివిజన్లలో తక్కువ ఓటర్లు నమోదు కాగా, మరికొన్ని డివిజన్లలో 3,800 మంది వరకు ఉన్నారు. డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో భారీగా తేడాలు ఉండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నివాసం ఓ చోట.. ఓటు మరోచోట నగరంలో 1,82,029 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 90,757మంది, మహిళలు 91,251 మంది, ఇతరులు 21మంది ఉన్నారు. 254 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 42వ డివిజన్లో 1,883మంది ఓటర్లు మాత్రమే ఉండగా.. 49వ డివిజన్లో అత్యధికంగా 3,823 మంది ఉన్నారు. ఒకే ఇంట్లోని ఓటర్లు ఒకే డివిజన్లో కాకుండా వేర్వేరు డివిజన్లలోకి వచ్చినట్లు ఓటర్లు గుర్తించారు. ఒక డివిజన్లో నివాసం ఉంటే మరో డివిజన్లో ఓటు హక్కు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితాపై అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తుండగా.. మొద టి రోజు శుక్రవారం 11 అభ్యంతరాలు వచ్చాయి. డివిజన్ ఒకటైతే ఓటు హక్కు మరో డివిజన్లో కల్పించడం, అత్యధికంగా ఓటర్లు ఉండేలా కొన్ని డివిజన్లు ఏర్పాటు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఇంటి నంబర్లలో కొన్ని నస్పూరుకు చెందిన ఓటర్లు, మంచిర్యాలలోకి చేర్చినట్లుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితాపై శుక్రవారం ఇద్దరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 20వ వార్డులోని ఓ ఓటరు తన పేరును 21వ వార్డు నుంచి 20వ వార్డు పరిధిలో చేర్చాలని, 34 వార్డు ఓటరు జాబితాలో ఉన్న తన పేరును 33వ వార్డులోకి మార్చాలని మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. వార్డు మార్చాలని వినతి -
నారుమడి.. జాగ్రత్తలు తప్పనిసరి
చెన్నూర్రూరల్: యాసంగి సాగులో భాగంగా రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకోగా, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ సూచించారు. కలుపు, ఊద సమస్యలు రాకుండా ఎకరా నారుమడిలో 1.5 లీటర్ల బుటీక్లోర్ను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వేసే సమయంలో లేదా ఎనిమిదో రోజున పిచికారీ చేయాలని తెలిపారు. లేదా విత్తిన 14–15రోజుల్లో సైహలోపాప్ బ్యుటైల్ 10శాతం 400మి.లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వరి నాట్లు వేసిన 4–5 రోజులకు ఎకరాకు 30–40గ్రాముల ఆక్సిడయార్జిల్ 25కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవాలని తెలిపారు. నాటిన 25–30 రోజుల్లో పొలంలో వెడల్పాటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాముల 2.4–డీ సోడియం సాల్ట్ 80శాతం పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేలా పిచికారీ చేయాలని సూచించారు. నారు మడిలో పిచ్చుకలు వాలి గింజలు తినకుండా, అడవి పందులు నారును నాశనం చేయకుండా ఉండేందుకు నాలుగు వైపులా నాలుగు పొడవాటి కర్రలు ఏర్పాటు చేసి వాటికి కవర్లు తొడగాలని తెలిపారు. గాలి వీచినప్పుడు ఆ కవర్లు చప్పుడై అవి నారుమడి దగ్గరకు రావని పేర్కొన్నారు. నారు మడి చుట్టూ ఏర్పాటు చేసిన కర్రలకు ఖాళీ సీసాలతో పాటు నట్, బోల్ట్ ఏర్పాటు చేయాలని లేదా పాత పల్లానికి రంధ్రం చేసి దానికి బోల్ట్ కడితే గాలికి అవి కదిలి వచ్చే శబ్ధానికి పిచ్చుకలు, అడవిపందులు అటువైపు రావని తెలిపారు. -
నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రోడ్డు భద్రతలో భాగస్వామ్యం అవుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకుంటారని జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ) రంజిత్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని వేంపల్లిలో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని, అవసరమైతే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ, కిషోర్చంద్రారెడ్డి, ఏఎంవీఐలు ఖాసిం, సూర్యతేజ, సాయిలెనిన్, రవాణా శాఖ సిబ్బంది, వాహనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవగాహన ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు ఏఎంవీఐ సూర్యతేజ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ మహేశ్వర్రావు, జూనియర్ లెక్చరర్ ముత్యం, పీజీటీ రాజేశ్వర్, పీఈటీ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి జైపూర్: వాహనదారులు నిబంధనలు పాటించాలని ఎంవీఐలు రజింత్, కిశోర్రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా శుక్రవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఈ–స్పెషల్ డ్రైవ్ చేపట్టి 300కుపైగా వాహనదారులకు పలు అంశాలు వివరించారు. సీటుబెల్ట్ ధరించని, నంబరు ప్లేట్ లేని వాహనాలు, విండోగ్లాస్ బ్లాక్ఫిల్మ్ ఉన్న 32వాహనదారులకు జరిమానా విధించారు. అనంతరం స్థానిక హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అధికారులు ఎస్కే.ఖాసిం, సూర్య, సాయి పాల్గొన్నారు. -
భార్యపై గొడ్డలితో దాడి
భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కన్నెపల్లి మండల కేంద్రానికి చెందిన గురుండ్ల సాయి అతడి భార్య వనితపై మద్యం మత్తులో గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో వనిత కాలు, చేతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిరోజులుగా సాయి మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యను అనుమానిస్తూ ఉండేవాడు. దీంతో క్షణికావేశంలో గొడ్డలితో శుక్రవారం దాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్రావు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిందితుడికి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: మహిళ చేతిలో నుంచి సెల్ఫోన్ చోరీకి పాల్పడిన నిందితుడు రాచర్ల రాకేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గతనెల 29న మహారాష్ట్రలోని కిన్వట్కు చెందిన మోరె సంగీత ఆస్పత్రి పని నిమిత్తం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్టాండ్కు రాగా, ఆమె చేతిలో నుంచి సెల్ఫోన్ను భోరజ్ మండలంలోని గూడ రాంపూర్కు చెందిన రాచర్ల రాకేశ్ లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోగల హైదరాబాద్ కృష్ణవేణి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్కే షహబాజ్ నెట్బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 8న రాజస్థాన్ రాష్త్రంలోని బర్మర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ రామ్వేణు తెలిపారు. గత నెలలో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థి సత్తా చాటాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్, పాఠశాల సిబ్బంది విద్యార్థిని శాలువాతో సన్మానించి జాతీయ పోటీల్లో మందమర్రి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. వాలీబాల్ పోటీలకు ఎంపిక మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఈ నెల 4నుంచి వారణాసిలో నిర్వహించనున్న జాతీయస్థా యి సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు పా ల్గొననున్నారు. అంకం అనుదీప్, ఎండీ షారు క్, అనూష ఎంపికయ్యారు. వీరిని శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకుడు గాజుల ముఖేశ్గౌడ్, తాళ్లగురిజాల సర్పంచ్ వంగ రాముగౌడ్, వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బోరె యాదగిరి, బైరగోని సిద్ధయ్యగౌడ్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, సీనియర్ క్రీడాకారులు తెలిపారు. -
కార్మిక సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
మందమర్రిరూరల్: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితి ముగిసిందని అన్ని కార్మిక సంఘాలకు అధికారులు ప్రాధాన్యమివ్వాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏరియాలోని కేకే–ఓసీ ఆవరణలో ఆ యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు విజ య్కుమార్, పిట్ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆ యూనియన్లో చేరగా వారికి హెచ్ఎంఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం రియాజ్అహ్మద్ మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఆరోపించా రు. కేకే–ఓసీలో హెచ్ఆర్ఏ రాని ఉద్యోగులకు ఇ ప్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం యాజమాన్యం పక్షాన చేరడంతో కార్మికులు సమస్యలు పరిష్కరించేవారు లేరని ఆరోపించా రు. శ్రమదోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కార్మి కుల పక్షాన హెచ్ఎంఎస్ పనిచేస్తోందని, మహిళా ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. నాయకులు సుదర్శన్, రాజిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అనిల్రెడ్డి, అశోక్, రతన్సింగ్ తదితరులున్నారు. -
సాగునీటికి ఢోకా లేదు..
దండేపల్లి: కడెం ఆయకట్టు కింద యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. కడెం ప్రాజెక్టుతోపాటు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కడెం నీటిని ఈ నెల 4న విడుదల చేయనుండగా.. గూడెం ఎత్తిపోతల నీరు సంక్రాంతి పండుగకు ముందు గానీ తర్వాత గానీ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత యాసంగిలో కడెం ప్రాజెక్టు నీరు డీ–1 నుంచి డీ–28వరకు, గూడెం ఎత్తిపోతల నీరు డీ–30నుంచి 42వరకు అందించనున్నారు. కడెం ఆయకట్టు కింద ఆరుతడి పంటలకు సరిపడా సాగునీరు ఉండడంతోపాటు సాగునీటికి ఢోకాలేదు. వరి వైపే మొగ్గు కడెం ఆయకట్టు కింద వర్షాకాలంలో సుమారు 60వేల ఎకరాల వరకు సాగునీరందిస్తారు. యాసంగిలో సాగువిస్తీర్ణం తగ్గుతుంది. కడెం నీటిని కడెం, జన్నారం, దండేపల్లి మండలాలకు, గూడెం ఎత్తిపోతల నీటిని కడెం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాలకు అందిస్తారు. గూడెం ఎత్తిపోతల నీటిని దండేపల్లి మండలం తానిమడుగు వద్ద కడెం ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ 30వద్ద ఎత్తిపోస్తారు. ప్రస్తుతం యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు ద్వారా ఆరుతడి పంటల కోసం డీ–1నుంచి డీ–28వరకు సుమారు 16వేల ఎకరాలకు ఆరుతడి విధానంలో సాగునీరు అందిస్తుండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 17వేలకు పైగా ఎకరాలకు అందించనున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నా ప్రతియేటా చాలామంది రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కొందరు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. కడెం ఆయకట్టు కింద సాగునీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని, యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని కడెం ప్రాజెక్టు డీఈ వీరన్న తెలిపారు.ప్రాజెక్టు పేరు పూర్తిస్తాయి నీటిమట్టం ప్రస్తుత నీటిమట్టం (టీఎంసీల్లో) (టీఎంసీల్లో)కడెం నారాయణరెడ్డి 4.699 4.699 శ్రీపాద ఎల్లంపల్లి 20.17 19.67 -
ట్రామా.. కేర్ లేదా..!
బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన బొలేరో డ్రైవర్ కొమ్మెర విజయ్ గత నెల 23న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన శివారులో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. బెల్లంపల్లి కాల్టెక్స్ అండర్ బ్రిడ్జి వద్ద గత నెల 25న కారు ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాకు చెందిన సాయికుమార్ తలకు తీవ్ర గాయాలై దుర్మరణం చెందాడు.బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులకు వైద్యం అందడంలో మొదటి గంట కీలకమని వైద్యులు చెబుతుంటారు. సకాలంలో ఆ స్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తే ప్రాణా లు నిలబెట్టవచ్చని అంటారు. బెల్లంపల్లిలో ప్రభు త్వ ఆస్పత్రి ఉన్నా ట్రామాకేర్ సెంటర్ లేక రోడ్డు ప్రమాద క్షతగాత్రులను దూర ప్రాంతాల్లోని ఆస్పత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. బె ల్లంపల్లి శివారు నుంచి హైదరాబాద్–చంద్రాపూర్ జాతీయ రహదారి నిర్మించారు. నాలుగు వరుసల రహదారి ఏర్పడడంతో వన్వేలో వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. మోటార్సైకిళ్లు, కార్లు పరిమి తికి మించిన వేగంతో పరుగులు తీస్తున్నాయి. కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన నుంచి బెల్లంపల్లి శివారు సోమగూడెం వరకు కొన్ని చోట్ల బ్లాక్స్పాట్లను గుర్తించారు. జాతీయ రహదారిపై సో మగూడెం శివారు కల్వరి చర్చి, బెల్లంపల్లికి వచ్చే హైవే చౌరస్తా, సెయింటు మేరీస్ హైసూ్క్ల్ ముందు, కుంటరాములు బస్తీ, కన్నాల చౌరస్తా, బోయపల్లి వార్డు, తాండూరు, రేపల్లెవాడ, రెబ్బెన మండలం గోలేటి టౌన్షిప్కు వెళ్లే చౌరస్తా, కాగజ్నగర్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలు బ్లాక్స్పాట్ జాబి తాలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అజాగ్రత్త, అతివే గం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా మోటారుసైకిళ్లు నడపడం, మద్యం తాగి, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్, చౌరస్తాలు, మూలమలుపుల వద్ద గందరగోళానికి గురి కావడం, కారు డ్రైవర్, ముందు సీటులోని వ్యక్తి సీటుబెల్ట్ ధరించకపోవడం, మైనర్ డ్రైవింగ్ తదితర కారణాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
● జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ నెన్నెల: ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు సూచించారు. శుక్రవారం జోగాపూర్ రైతువేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే నేల ఆరోగ్యాన్ని పెంచవచ్చని అన్నారు. జీవామృతం వంటి సహజ ఎరువులు వాడడంతో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులతో మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన మెలకువలు, సాగు పద్ధతులపై వివరించారు. యాసంగిలో సకాలంలో సాగు చేయడం ద్వారా కోతల సమయంలో వచ్చే వర్షాలతో నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. 50శాతం సబ్సిడీపై వేప నూనె మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో అందుబాటులో ఉందని తెలిపారు. ఆయిల్ఫామ్ సాగుకు ఈ ప్రాంతంలో భూములు అనుకూలంగా ఉన్నాయని, రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సృజన, ఏఈఓ శైని, రైతులు పాల్గొన్నారు. -
వార్షిక రుణ లక్ష్యాలు సాధించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వార్షిక రుణ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఏజీఎం చేతన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ ప్రశాంత్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సురేష్తో కలిసి రుణ లక్ష్యసాధనపై సమీక్ష నిర్వహించారు. సె ప్టెంబర్ 2025 వరకు పంట రుణాలకు రూ.2,541 కోట్ల లక్ష్యం కాగా రూ.1,045 కోట్లు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలు రూ.922 కోట్లకు గాను రూ.323 మంజూరు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ, గృహ నిర్మాణం, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాల రుణాలపై వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పనులు వేగవంతం చేయండి చెన్నూర్/చెన్నూర్రూరల్: చెన్నూర్లో వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి నిర్మాణ పనులు, తహశీల్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, మండలంలోని కిష్టంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు. సకల సదుపాయాలతో కూడిన విద్య వేమనపల్లి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల, నీల్వాయి కేజీబీవీ తనిఖీ చేశారు. కేజీబీవీలో అదనపు గదుల నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. భోజన నాణ్యత, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ కుమారస్వామి, సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాబీర్ ఆలీ, ఎస్ఓ మాయూరి, హెచ్ఎం మాధవ్, ఏఈ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ఈసారీ ఎన్నికలు లేనట్టే!
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ ఏ ర్పడి మూడు దశాబ్దాలవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు. 1/70 (గిరిజన చట్టం) ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న మందమర్రి 1995లో మున్సిపాలిటీగా ఏర్పడింది. 1998లో ఎన్నికల నిర్వహణకు చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మరో ఐదురోజుల్లో ఎన్నికలుండగా అప్పటి మాజీ సర్పంచ్ మద్ది రాంచందర్ మందమర్రి ఏజెన్సీ (1/70) ప్రాంతం కాబట్టి చైర్మన్ పదవిని ఎస్టీకి కేటాయించాలని కోరుతూ కోర్టుకు వెళ్లాడు. దీంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించడంతో ఎన్నికలు ఆగిపోయాయి. కోర్టులో కేసు వీగిపోయినా అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపాలిటీ అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉంటోందని పట్టణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారి నా మున్సిపాలిటీ ఎన్నికల పరిస్థితి మాత్రం మా రడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్థాయి ప్రతినిధులు వచ్చి హామీలు గుప్పించి వెళ్తారు కానీ.. గెలిచాక మున్సిపాలిటీ ఎన్నికల విషయాన్ని మాత్రం పట్టించుకున్న వారే లేరని మందమర్రి మున్సిపాలిటీ ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. త్రిసభ్య కమిటీతోనే అభివృద్ధిమందమర్రి మున్సిపాలిటీ పరిధిలో 24 (సింగరేణి ఏరియాలోని తొమ్మిది వార్డులతో కలిపి) వార్డులున్నాయి. సుమారు 60వేల వరకు జనాభా ఉంది. అభివృద్ధి మాత్రం చెన్నూర్ శాసన సభ్యుడు, మంచిర్యాల జెడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్ ఉన్న త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో పలు వార్డుల్లో సరైన అభివృద్ధి జరగక వెనుకబడి పోతున్నామని ఊరు మందమర్రి, ఎర్రగుంటపల్లె, నార్లాపూర్, ఊరు రామకృష్ణాపూర్ ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. త్రిసభ్య కమిటీ కూడా అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఉన్న నాయకులకు (కాంట్రాక్టర్లు) మాత్రమే ప్రాధాన్యమిస్తూ మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తోందని ఆరోపించారు. (కాంట్రాక్టర్లు) చేసిన అభివృద్ధి పనుల్లోనూ ఎలాంటి నాణ్యత కనిపించడం లేదని, త్రిసభ్య కమిటీ జరిగే అభివృద్ధి పనులపై ఆరా తీసింది లేదని, పట్టించుకోదని స్థానికులు మండిపడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ప్రాంతంలోగల తొమ్మిది వార్డుల్లో మాత్రం అభివృద్ధి సింగరేణి యాజమాన్యమే చూసుకుంటోంది. ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తేనే ఎన్నికలు మందమర్రి మున్సిపాలిటీలో గిరిజనులకు సరైన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నిర్వహించాలి. దీనిపై న్యాయవాదితో కౌంటర్ ఫైల్ వేయడం జరిగింది. కానీ, ఆ కేసు ముందుకురావడం లేదు. మందమర్రి మున్సిపల్ ఎన్నిక కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – వివేక్ వెంకటస్వామి, మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే మంత్రి, ఎంపీ చొరవ తీసుకోవాలి రాష్త్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ సారి కూడా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర గనులు, కార్మిక ఉపాధిశాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా ఉన్న గడ్డం వంశీకృష్ణ చొరవ తీసుకుని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. -
నార్కొటిక్ జాగిలంతో తనిఖీలు
ఆదిలాబాద్టౌన్: నార్కొటిక్ జాగిలం రోమాతో ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ధన్గర్ మొహల్లలో సాహిల్ అహ్మద్ వద్ద గంజాయి ఉండడంతో రోమా అతడిని గుర్తించినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా, పండించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లాగా తయారు చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సీఐ వెంట ఎస్సై నాగనాథ్, రోమా జాగిలం హ్యాండ్లర్ రమేశ్ తదితరులున్నారు. -
ఉత్తర్వులు సరే.. నిధులేవి?
కెరమెరి: జంగుబాయి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు ఇప్పటికీ మంజూరు కాలేదు. గతేడాది జనవరిలో మండలంలోని మహరాజ్గూడలోగల జంగుబాయి పుణ్యక్షేత్రంలో నిర్వహించిన మహాపూజకు హాజరైన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క రూ.50లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసి ప్రొసీడింగ్ కూడా అందించారు. పనులు తుదిదశకు చేరుతున్నా నిధులు మాత్రం విడుదల కాలేదు. నిర్వాహకులతోపాటు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రారంభంకాని మరుగుదొడ్ల నిర్మాణంరూ.15 లక్షలతో చేపట్టాల్సిన మరుగుదొడ్ల పనులు నేటికీ మొదలుకాలేదు. గతేడాది నుంచి ప్రభుత్వ నిధులు మంజూరు కాలేదు. చేసిన పనులకు బిల్లులు వస్తే.. ఇతర పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. పనుల కొలతలు తీసుకుని ఎంబీ రికార్డు చేయలేదు. ఇప్పటికై నా జిల్లాస్థాయి అధికారులు స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఎంబీ రికార్డు చేయలేదు రూ.10 లక్షల నిధులతో షెడ్ల నిర్మాణం పూర్తయి ఏడాదైంది. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు ఎంబీ రికార్డు చేయలేదు. పలుసార్లు వారిని కలిసి బిల్లుల గురించి చెప్పినా సరైన సమాధానం రావడంలేదు. టొప్లకస వరకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. భక్తుల ప్రయాణానికి ఉపయోగపడుతున్న ఈ రోడ్డుకు కూడా నిధులు అందలేదు. బిల్లులు త్వరగా అందించాలి. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ చేపట్టిన పనులివే..జంగుబాయి పుణ్యక్షేత్రానికి రూ.50లక్షలు కేటా యించగా, రూ.25 లక్షలతో తాగునీటి ట్యాంక్, పైపులైన్, రూ.10 లక్షలతో రెండు షెడ్లు, రూ.15 లక్షలతో మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే రూ.10లక్షలు వెచ్చించి ఆలయ కమిటీ సభ్యులు షెడ్లు నిర్మించారు. ప్రస్తుత ఉత్సవాలకు అవి వినియోగంలోకి రానున్నాయి. ఇక తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులు 60శాతం పూర్తికాగా, పైపులైన్ పనులు ప్రారంభించలేదు. మరో రెండు నెలల్లో పనులు పూర్తికావొచ్చని కమిటీ సభ్యులు చెబుతున్నారు. సుమారు రూ.30లక్షల విలువైన పనులు పూర్తయినా అధికారులు నిధులు విడుదలలో జాప్యం చేస్తున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఒకే చేతిపంపు ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మహరాజ్గూడ నుంచి ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో నిర్మించిన వంతెన నుంచి టొప్లకస వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయినా రూ.5లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇంకా అందలేదు. -
ఆర్టీసీ.. తీరు మారదేమి?
మంచిర్యాలఅర్బన్: చుట్టూ చూస్తే పల్లెవెలుగు బస్సు. తీరా ఎక్కిన తర్వాత వెంపల్లిలో ఆగుతుందా? అంటే ఇది ఎక్స్ప్రెస్ అని ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సమాధానం రావడంతో ప్రయాణికులు చేసేదేంలేక దిగిపోకతప్పలేదు. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డు తగిలించి ఆర్టీసీ అధికారులు అధికచార్జీలు వసూలు చేస్తుండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, ఇతర డిపోలకు చెందిన పల్లెవెలుగు బస్సులకు ఎక్కువగా ఇలా ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి రాకపోకలు సాగిస్తున్నాయి. కాళేశ్వరం రూట్లో మంచిర్యాల డిపో బస్సులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్ప్రెస్ చార్జీలతో ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఇలాంటి చర్యలతో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల మాటెలా ఉన్నా నగదు చెల్లించి టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి మరిన్ని బస్సులు వచ్చేలా చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
‘ఫుల్’ జోష్
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలక్రైం: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2025కు వీడ్కోలు.. 2026కు స్వాగతం పలుకుతూ సంబరాలు సాగాయి. అందుకు భారీగానే ఖర్చు చేశారు. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో రూ.21.01 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మంచిర్యాల నగరంతోపాటు కోల్బెల్ట్ పరిధిలోని మందమర్రి, సీసీసీ, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్ తదితర ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకల్లో రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దసరా పండుగ స్థాయిలో వేడుకలు జరుపుకోవడంతో వ్యాపారాలు జోరుగా సాగాయి. గుడిపేట లిక్కర్ గోదాం పరిధిలో 135 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. నిత్యం వీటికి ఇక్కడి నుంచే మద్యం నిల్వలు సరఫరా అవుతాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో మొత్తంగా 18,635 లిక్కర్ కేసులు, 15,153 బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. వీటి విలువ రూ.21.01 కోట్లు ఉంటుంది. నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని బార్లు రాత్రి ఒంటి గంట వరకు, మద్యం దుకాణాలు రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వడంతో పెద్దయెత్తున మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఈ మూడు రోజుల్లో రూ.11.26కోట్ల అమ్మకాలు జరుగగా.. ఈ ఏడాది దాదాపుగా రూ.10 కోట్ల అమ్మకాలు పెరిగాయి. గత దసరాకు మూడు రోజుల్లో రూ.26.38 కోట్ల విక్రయాలు జరిగితే నూతన వేడుకలకు మూడు రోజుల్లో రూ.21.01 కోట్ల వ్యాపారం జరగడం చూస్తే దసరాకు పోటీగా సాగినట్లు తెలుస్తోంది. మాంసం అమ్మకాలు చికెన్, మటన్, చేపల అమ్మకాలూ ఈ ఏడాది పెద్దయెత్తున జరిగాయి. మంచిర్యాలలో 200కు పైగా చికెన్, 100కు పైగా మటన్ దుకాణాలు ఉండగా జిల్లాలో అనధికారికంగా వేలాది సంఖ్యలో ఉన్న మటన్, చికెన్ సెంటర్లలో భారీగా వ్యాపారం జరిగింది. కిలో చికెన్ రూ.200, స్కిన్లెస్ రూ.220, మటన్ కిలో రూ.700 నుంచి రూ.1,000 పలుకగా.. ఒక్కో మేక, గొర్రెపోతులకు రూ.7 వేల నుంచి రూ.16 వేల వరకు ధరలు పలికాయి. మొత్తంగా దాదాపు రూ.10కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క రోజే రూ.9.70 కోట్ల మద్యం తాగేశారు..! జిల్లాలోని మద్యం దుకాణాలకు 30న రూ.8.12కోట్లు, 31న రూ.6.52కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఈ రెండ్రోజులు కలిపి 31న ఒక్క రోజే రూ.9.70 కోట్ల విలువైన మద్యం మందుబాబులు తాగేశారు. 2025 డిసెంబర్ 31న రూ.7.70కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈసారి అంతకంటే రూ.2కోట్ల విలువైన మద్యం అమ్మకాలు పెరిగాయి. అయినా నిర్దేశించిన మేరకు అమ్మకాలు జరగలేదని ఎకై ్సజ్ శాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం.డిసెంబర్లో మద్యం విక్రయాలుతేదీ లిక్కర్ కేసులు బీర్ కేసులు రూ.కోట్లలో29 6,064 4,169 6.37 30 6,607 5,764 8.12 31 5,964 5,220 6.52 మొత్తం 18,635 15,153 21.01కేక్లు.. మిఠాయిలు..మిఠాయిలు, బేకరీ దుకాణాలు కిటకిటలాడాయి. హోటళ్లు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వస్త్ర దుకాణా లు, ఎలక్ట్రానిక్, హోం అప్లయెన్స్స్, మోటార్సైకిల్ దుకాణాల్లో ఇలా పలు వ్యాపార సంస్థల్లో జోరుగా వ్యాపారాలు సాగాయి. జిల్లాలోని బేకరీల్లో కూల్, నార్మల్ కేక్లు, కూల్డ్రింక్స్, మొబైల్ విక్రయాలు, వస్త్ర వ్యాపారం, ముగ్గుల రంగు, బాణాసంచాకు మొత్తంగా మరో రూ.10కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కాలేవార్ పోతన్న, నాగన్నకు గాయాలయ్యాయి. పోతన్న పంటపొలంలో పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న నాగన్న ఢీకొట్టాడు. ఘటనలో నాగన్నకు స్వల్పంగా పోతన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు ఢీకొని కంప్యూటర్ ఆపరేటర్కు.. సారంగపూర్: ఉపాధిహామీ పథకంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న నరేష్ను చించోలి(బి) గ్రామ సమీపంలోని ఎక్స్రోడ్డు వద్ద గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సారంగాపూర్లో విధులు ముగించుకుని నిర్మల్ వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్కు తరలించారు. -
‘ఉద్యోగం పేరిట మోసం’
జన్నారం: కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని పొనకల్కు చెందిన నందాల ప్రదీప్ కోరాడు. ఈ మేరకు రామగుండం పోలీసులు, సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో వి లేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం జన్నారంలో ఉంటున్న జీ.సృజన్ క్రెడిట్ కా ర్డుల ద్వారా రూ.5.80 లక్షలు తీసుకున్నాడ ని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నెలకు రూ.50 వేల చొప్పున ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నానని పేర్కొన్నా డు. డబ్బుల విషయంలో నిలదీస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని, పో లీసులు న్యాయం చేయాలని కోరాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతిఖానాపూర్: గత నెల 28 న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన నేరెళ్ల వెంకటేశ్ (25) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. మెట్పల్లి ఆర్టీసీ డిపోలో ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్న వెంకటేశ్ గత నెల 28న మద్యం మత్తులో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సంప్రదాయాలు భావితరాలకు అందించాలిఇంద్రవెల్లి: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైఉందని జై జంగో జై లింగో జంగామ్ దేవస్థానం పీఠాధిపతి కుమ్ర భగవంత్రావ్ అన్నారు. గురువారం మండలంలోని తుమ్మగూడలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్యమాసం ఆదివాసీలకు ఎంతో పవిత్రమైందన్నారు. జంగుబాయి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తుందని ఆదివాసీల నమ్మకమని, ప్రతిఒక్కరూ జై జంగో జై లింగును ఆరాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ సోయం మాన్కు, సర్పంచ్ విజయలక్ష్మి, కొరెంగా యేశ్వంత్రావ్, సురేష్ మహారాజ్, పెందోర్ అర్జున్, మోహపత్రావ్, విషంరావ్, పుర్క బాపురావ్, పెందోర్ పుష్పరాణి, తదితరులు పాల్గొన్నారు. -
విద్య బలోపేతానికి కృషి చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతానికి కృషి చేయాలని డీఈవో యాద య్య అన్నారు. గురువారం డీఈవో కార్యాలయంలో టీఎస్యూటీఎఫ్–2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. అంతకుముందు చలితీవ్రత నేపథ్యంలో పాఠశాలల సమయసారిణి మార్చాలని టీఎస్యుటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్దీపక్కు వినతిపత్రం అందజేశారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రపాణి, రాజావేణు, ఉపాధ్యక్షుడు కిరణ్కుమార్, కోశాధికారి కిరణ్, కమిటీ సభ్యులు బారిక్రావు, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘నూతన’ వేడుకలు
పవర్ ప్లాంట్లో కేక్ కట్ చేస్తున్న ఈడీ చిరంజీవి, జీఎంలు మదన్మోహన్, నర్సింహారావుమంచిర్యాలటౌన్/మంచిర్యాలఅగ్రికల్చర్/జైపూర్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావును వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కేజియా రాణి, రాంకుమార్, తిరుపతి, అంజయ్య, సంయుక్త కార్యదర్శి సునిత పాల్గొన్నారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కుమార్ దీపక్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమం
మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 31వరకు నెల రోజులపాటు నిర్వహిస్తామని, రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై రూపొందించామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు అవగాహన కల్పించడంతోపాటు హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా, వేగం నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. -
సరస్వతి.. రైతుల పెన్నిధి
లక్ష్మణచాంద: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయం. నిర్మల్ జిల్లా అన్నదాతల జీవనాధారం సరస్వతి కాలువ. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు ఉన్న కాకతీయ, లక్ష్మీ కాలువల తర్వాత మూడో ప్రధాన కెనాల్ ఇది. 1974–75 నుంచి జిల్లాలోని సాగుభూములను సస్యశ్యామలం చేస్తోంది. ప్రవాహాన్ని నిర్వహిస్తూ ఏడు మండలాల్లోని రైతులకు ఆధారంగా నిలిచింది. 1953లో ఎస్సారెస్పీ నిర్మాణం మొదలు పెట్టారు. 1963లో నిర్మాణం పూర్తయింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనిని జాతికి అంకితం చేశారు. సోన్ మండలం గాంధీనగర్, పాక్పట్ల గ్రామాల శివారుల నుంచి ప్రారంభమైన సరస్వతి కాలువ ఏడు మండలాలు, 64 గ్రామాల్లో 33,622 ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. 28 ఉపకాలువల నెట్వర్క్ నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో 47 కిలోమీటర్ల పొడవున సరస్వతి కాలువ విస్తరించి ఉంది. దీనికి 28 డిస్ట్రిబ్యూషన్ ఉపకాలువలు ఉన్నాయి. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందిస్తూ రైతుల అండగా నిలుస్తోంది. అర్ధ శతాబ్దంగా నిర్విరామంగా పనిచేస్తూ, రైతుల ఆర్థిక భద్రతకు తోడ్పాటు అందిస్తోంది. ఇది కేవలం పొలాలకు మాత్రమే కాక, 64 గొలుసుకట్టు చెరువులను కూడా నింపుతూ కింది ఆయకట్టులకు మద్దతు ఇస్తోంది. నీటి ప్రవాహం మార్పు వ్యూహం లక్ష్మణచాందలోని వడ్యాల్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటిని కనకాపూర్ వాగుకు మళ్లించి, మునిపెల్లి వద్ద గోదావరి నదిలో కలిపి, సదార్మాట్ వరకు విస్తరించాలనే ప్రణాళిక జోరుగా సాగుతోంది. ఈ చర్యలతో కాలువ సామర్థ్యం పెరిగి, మరింత ఆయకట్టు సాగుకు దోహదపడుతుంది. సరస్వతి కాలువ ఆధునీకరణ జరిగితే, నిర్మల్ జిల్లా సాగు ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అంచనా.ప్రవహించే మండలాలు : 7 కాలువ ప్రవహిస్తున్న దూరం : 47 కి.మీ కాలువకు ఉన్న ఉప కాలువలు : 28 సాగునీరు అందుతున్న గ్రామాలు : 64 మొత్తం ఆయకట్టు : 33,622 ఎకరాలుఆధునీకరణకు ప్రణాళికలు.. ఇక సరస్వతి కాలువలో లైనింగ్ లోపాలు, మట్టి పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరగంతో నీరు చివరి వరకు చేరడం లేదు. దీంతో నీటిపారుదల శాఖ రూ.70 కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ఆమోదం జరిగిన వెంటనే మార్చి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. లైనింగ్ పోయిన ప్రదేశాల్లో కొత్త లేయర్లు వేయడం.. మట్టి, చెత్త తొలగింపు, గండ్లు, డ్యామేజ్ల మరమ్మతు, చెట్ల కత్తిరింపు, ఇరువైపులా రోడ్లు ఏర్పాటు, 28 ఉప కాలువలకు అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు.సరస్వతి కాలువ వివరాలు..50 ఏళ్లుగా సాగునీరు.. పోచంపాడు ప్రాజెక్టు నుంచి మా లక్ష్మణచాంద మండలానికి వస్తున్న సరస్వతి కాలువ 50 ఏళ్లుగా మా మండల రైతులకు సాగు నీటిని అందిస్తోంది. ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూస్తోంది. – నాగుల నారాయణ, రైతు, పొట్టపెల్లి ఆధారం కాలువే సోన్ మండల ప్రజల పంటల సాగుకు జీవనాధారం సరస్వతి కాలువ. దీంతోనే అన్ని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఏటా రెండు పంటలు ఈ కాలువ ఆధారంగానే సాగవుతున్నాయి. – సాయన్న, రైతు న్యూవెల్మల్ -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనదారుల పాత్ర కీలకమని తెలిపారు. పోస్టర్లు ఆవిష్కరించిన డీసీపీ భాస్కర్ మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గురువారం తన చాంబర్లో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లు, ఇతర వాహన చోదకులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వివరించారు. ఇంచార్జీ డీటీఓ రంజిత్కుమార్, ఎంవీఐ కిషోర్చంద్రారెడ్డి, ఏఎంవీఐలు ఖాసిం, సూర్యతేజ, సాయిలెనిన్ పాల్గొన్నారు. -
మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లి..
చెన్నూర్/కాళేశ్వరం: మొక్కులు చెల్లించుకోవడానికి సంతోషంగా వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవర్పూర్ మండలం కాళేశ్వ రం దర్గాలో చోటు చేసుకుంది. ఎస్సై తమాషారెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని లైన్గడ్డకు చెందిన ఎంఏ.మజీద్(32), స్నేహితుడు మహమ్మద్ సమీరుద్దీన్తోపాటు మరి కొంత మంది ముస్లింలు కాళేశ్వరంలోని మజీద్పల్లి దర్గా వద్ద మహ్మద్ షా వలీ జన్మదిన వేడుకల్లో(సందల్) పాల్గొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో దర్గా వద్ద జెండా ఎక్కించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇనుప పైపునకు జెండాను బిగించి పైకి ఎత్తుతున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగి లింది. దీంతో ఆ పైపును పట్టుకున్న ఎం.ఏ.మజీద్, మహమ్మ ద్ సమీరుద్దీన్కు విద్యుత్ సరఫరా కావడంతో అపస్మారక స్థి తికి చేరుకున్నారు. వారిని వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఎం.ఏ. మజీద్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమీరుద్దీన్ను మె రుగైన వైద్యం కోసం మంచి ర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు మీర్జా అహ్మద్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
బోగస్ పింఛన్ల ఏరివేత
పాతమంచిర్యాల: చేయూత పథకం ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లలో అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికే అందించేలా ముఖ గుర్తింపు యాప్(ఫేషియల్ రికగ్నిషన్ యాప్) తీసుకొచ్చింది. ఈ విధానంలోనే గత నాలుగు నెలలుగా పింఛన్లు అందజేస్తోంది. పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం ప్రతీ జిల్లాలో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్లో కొత్త పింఛన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉండగా అంతకుముందే పింఛన్ల వడపోత కార్యక్రమాన్ని ప్రత్యేక విజిలెన్స్ కమిషన్తో సోషల్ ఆడిట్ చేపట్టనున్నారని సమాచారం. బోగస్ పింఛన్లలో అక్రమాలను అరికట్టడానికి పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని జిల్లాల్లో చేపట్టిన సోషల్ ఆడిట్లో 50ఏళ్లు నిండనివారు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఎలాంటి శారీరక వైకల్యం లేకున్నా బోగస్ సదరం ధ్రువీకరణ పత్రాలు పొంది పింఛన్లు పొందుతున్న ఘటనలు బయటపడ్డాయి. దీంతో గ్రామసభల ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి నిజమైన లబ్ధిదారులుగా అర్హులను గుర్తించి పింఛన్లు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపా రు. చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవీ, డయాలసిస్ పేషెంట్లు, బీడీ టేకేదారులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు 93,880 మందికి పింఛన్లు అందజేస్తున్నారు. ప్రతీ నెల రూ.22,48,22,016 పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం 2022లో ఆసరా వృద్ధాప్య పింఛన్దారుల వయస్సును 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించింది. పింఛన్ మొత్తాన్ని పెంచింది. దీంతో చాలామంది ఆధార్కార్డుల్లో తమ వయస్సును తక్కువ చేయించి పింఛన్లు పొందారనే సమాచారం అధికారుల దృష్టికి వచ్చింది. పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్న వాటిలో మృతులకు అందుతున్నాయని, నిలిపి వేయలేదని పేర్కొంటున్నారు. అక్రమాల నిరోధానికి పింఛన్దారుల గుర్తింపు కోసం పోస్టుమాస్టర్లకు మొబైల్ఫోన్లు, ఫింగర్ప్రింట్ డివైజ్లు అందజేశారు. మొబైల్ఫోన్ ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ పరికరాల్లో లబ్ధిదారుల గుర్తింపు జరగపోతే పోస్టుమాస్టర్, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం ద్వారా ప్రస్తుతం పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.జిల్లాలో లబ్ధిదారులువృద్ధులు 36972 దివ్యాంగులు 11540 వితంతువులు 38954 చేనేత కార్మికులు 278 గీతకార్మికులు 873 ఒంటరి మహిళలు 2472 బీడి వర్కర్లు 2336 ఫైలేరియా రోగులు 268 డయాలసిస్ 172 బీడీ టేకేదార్లు 15 -
ఆర్జీయూకేటీలో ఐఐఈడీ సెల్
బాసర: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బాసర ఆర్జీయూకేటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ (ఐఐఈడీ) సెల్ను గురువారం గవర్నర్ జిష్ణుదేవ్వర్మ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ డాక్టర్ మురళీదర్శన్ పర్యవేక్షణలో ఈ కేంద్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థి కేవలం చదువులకే పరిమితం కాకుండా తమ వినూత్న ఆలోచనలకు ప్రాణం పోసి నమూనాలను తయారు చేసుకునేందుకు ఈ సెల్ ఒక అద్భుతమైన వేదికగా నిలవనుందన్నారు. ఈ ఇంక్యుబేషన్ సెల్ మరింత విస్తరించాలని, దీని ఫలాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ ‘స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా రైజింగ్ తెలంగాణ 2047’ స్ఫూర్తితో సెల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థాపనల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టీ.రాకేష్రెడ్డి, డీన్లు డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ కె.మహేశ్, ఎస్.శేఖర్, జి.నాగరాజు, డాక్టర్ అన్పత్ రాహుల్, డాక్టర్ దిల్ బహార్, డాక్టర్ జి దేవరాజు, డాక్టర్ కె.మధుసూదన్, డాక్టర్ భావ్సింగ్, ఎస్.రాజేశ్వర్, అరుణజ్యోతి, సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్ వి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 65 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
మంచిర్యాలక్రైం: జిల్లాలో 65 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31న రాత్రి 10గంటలకు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వేకువజామున 3గంటల వరకు కొనసాగాయి. అవాంఛనీయ సంఘటనలు, దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అర్ధరాత్రి వరకు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు. రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కొరఢా ఝళిపించారు. వాహనాలు సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. నంబర్ ప్లేటు, పేపర్లు సరిగా లేని 16 కార్లు, 11 ఆటోలు, 140 ద్విచక్రవాహలు సీజ్ చేశారు. అనంతరం గురువారం ఉదయం స్థానిక డీసీపీ కార్యాలయంలో డీసీపీ భాస్కర్ కేక్ కట్ చేశారు. తనిఖీల్లో స్థానిక ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేష్కుమార్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సైలు, ఏఎస్సైలు పాల్గొన్నారు. -
రూ.39 లక్షల విలువైన 200 ఫోన్ల అప్పగింత
ఆదిలాబాద్టౌన్: దొంగిలించిన, పోగొట్టుకున్న రూ.39 లక్షల విలువైన సెల్ఫోన్లను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అప్పగించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో 200 సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇంత పెద్దమొత్తంలో సెల్ఫోన్లను తిరిగి రాబట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమమన్నారు. రైతు బజార్, రిమ్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్, ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్ చేస్తానంటూ ఫోన్ తస్కరించడం జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 సెల్ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ రిపేరింగ్ దుకా ణాల యజమానులు సెల్ఫోన్లను కొనుగోలు చేసే ముందు ఫోన్ యజమాని అనుమతి, సరైన పత్రాలు తీసుకోవాలన్నారు. దొంగ ఫోన్లు కొన్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబట్టిన ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండటంతో వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆర్ఎస్ఐ పి.గోపికృష్ణ, ఎంఎ రియాజ్, మజీద్, త్రిశూల్, అన్వేష్, నవనీత్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో పాస్టర్ బలవన్మరణం
నస్పూర్: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు బలవన్మరణం చెందిన ఘటన సీసీసీ న స్పూర్ పోలీస్స్టేషన్ పరి ధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్రావు తెలి పిన వివరాల మేరకు సీసీ సీలోని సుందరయ్య కాలనీకి చెందిన సుందరగిరి శ్రీధర్(45) స్థానిక హోలి మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గతనెల 31 న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. బంగ్లాస్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అతని ద్విచక్ర వాహనం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా చికిత్స పొందుతూ 31న రాత్రి మృతి చెందాడు. మృతుని కుమారుడు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శన
మంచిర్యాలటౌన్/లక్సెట్టిపేట/బెల్లంపల్లి/చెన్నూర్: మున్సిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం మంచిర్యాల కార్పొరేషన్తోపాటు మున్సిపాల్టీల్లో ఓటరు ముసాయిదా జాబితా గురువారం ప్రదర్శించారు. మంచిర్యాల కార్పొరేషన్ ఆవరణలో 60 డివిజన్లకు సంబంధించిన జాబితాను అతికించారు. కమిషనర్ సంపత్కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్లో 225 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు జాబితాను ప్రదర్శించామని, ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా స్వీకరిస్తామని తెలిపారు. నగరంలో 1,82,059 మంది ఓటర్లు ఉండగా, 254 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బి.రాజమనోహర్, మేనేజర్ ఎస్.కరుణాకర్, రెవెన్యూ ఆఫీసర్ కె.శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
మందుబాబులపై పోలీసుల కొరడా
ఆదిలాబాద్టౌన్: మందుబాబులపై పోలీసులు కొరడా ఝులిపించారు. నూతన వేడుకల సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 30 చెక్పోస్టులను ఏర్పాటు చేసి బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు తనిఖీలు కొనసాగించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జిల్లా వ్యాప్తంగా 211 కేసులు నమోదు కాగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు డివిజన్ పరిధిలో ఒక్కరోజే 175 కేసులు నమోదు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ అర్ధరాత్రి సమయంలోనూ ఈ తనిఖీలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, కర్రె స్వామి, ప్రణయ్ కుమార్, ఫణీదర్, శ్రావణ్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
సమ్మక్క జాతరకు ఏర్పాట్లు చేయాలి
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని గోదావరి నదీ తీరాన ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే సమ్మక్క, సారక్క జాతరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి ఒడ్డున జరిగే జాతర కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. మరుగుదొడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుతోపాటు వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలం కేటాయించాలని తెలిపారు. -
మార్కెట్ ‘బంగారు’మయం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ ఏడాది జిల్లాలో జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ముందస్తుగా ఇళ్లల్లో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. తాము కోరిన కోర్కెలు నెరవేరితే తల్లులకు అత్యంత ఇష్టమైన బంగారం(బెల్లం) నిలువెత్తు సమర్పించుకుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లో గత ఆదివారం నుంచి బంగారం (బెల్లం) కొనుగో ళ్లు ఊపందుకున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచే కా కుండా మహారాష్ట్రలోని లాథూర్, నాందేడ్, నాగ్పూర్ల నుంచి బెల్లం సరఫరా జరుగుతోంది. కిలోకు రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు 50 నుంచి 80 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. జాతర సీజన్ మొత్తంగా 60 నుంచి 100 లారీల వరకు అంటే 2 వేల టన్నులకు పైగా వ్యాపా రం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. -
కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తా
ఉట్నూర్రూరల్: జిల్లాలోని పలు కొలాం గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ తెలిపారు. గురువారం ఉట్నూర్ మండలంలోని కొలాంగూడలో 16 కోర్ ఏరియా గ్రామాల పటేళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరయ్యాయని కొలాం తెగకు చెందిన లబ్ధిదారులు ఉన్న గుడిసెలను తొలగించుకుని నిర్మాణాలు చేపట్టగా అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీవో, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జీ మంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం తమ సమస్యను వివరించామన్నారు. సమావేశంలో పీవీటీజీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు టేకం వసంత్ రావ్, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, మాజీ ఉపాధ్యక్షుడు మడావి మాణిక్ రావ్, నాయకులు బాపురావ్, రమేశ్, తుకారాం, టేకం భీంరావ్, వివిధ కొలాం గ్రామాల పటేళ్లు, పాల్గొన్నారు. -
● మున్సిపాలిటీల్లో ఎన్నికలకు అధికారుల కసరత్తు ● వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా ప్రదర్శన ● జిల్లా కేంద్రంతో సహా నాలుగు పట్టణాల్లో హడావుడి ● రిజర్వేషన్లు కలిసొస్తే పోటీకి సై అంటున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పురపాలికల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. వార్డుల వారీగా ఓటరు జాబితా ప్రకటన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఆయా డివిజన్లు, వార్డుల్లో పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు, తుది ఓటరు జాబితా ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. గురువారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో సహా బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాల్టీల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. మందమర్రి మున్సిపాల్టీలో ఏజెన్సీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండగా.. ఈసారి సైతం ఇక్కడ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. మిగతా పట్టణాల్లో ఈ నెల 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, 6న జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సమావేశం, 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా వెల్లడి ఉంటాయి. పట్టణాల్లో చివరిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. గత ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం అంతా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్కు నివేదించి త్వరలోనే ఎన్నికలకు వెళ్లనుంది. ఆశావహుల ప్రయత్నాలు పట్టణాల్లో గత ఏడాదిగా ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. తాజా, మాజీ కౌన్సిలర్లు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమ వార్డుల్లో ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం మంచిర్యాల కార్పొరేషన్తో సహా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలైన చెన్నూర్, బెల్లంపల్లి, క్యాతనపల్లి, లక్షెట్టిపేట పట్టణాల్లోనూ రాజకీయ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వార్డు, డివిజన్లలో రిజర్వేషన్లు అనుకూలిస్తే మహిళా, జనరల్, రిజర్వు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై జరుగనున్న తరుణంలో కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ కోసం అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల జిల్లా నాయకత్వం పట్టణాల్లో అధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. -
కోతులను తరిమిన ఎలుగుబంటి వేషధారి
జన్నారం: రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడదను తొలగిస్తామని హామీలు ఇచ్చి గెలిచిన సర్పంచులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని కలమడుగు గ్రామంలో సర్పంచ్ బొంతల నాగమణి గ్రామంలో ఒక వ్యక్తికి ఎలుగుబంటి వేషధారణ వేయించి కోతులు ఉన్న ప్రాంతంలో తిప్పుతున్నారు. చూసిన కోతులు పరుగులు తీస్తున్నాయి. గ్రామంలో ఎక్కడైన కోతుల బెడద ఉంటే సంప్రదించాలని సర్పంచ్ నాగమణి సూచించారు. -
ఎస్టీపీపీలో ప్రమాదం.. ఆపరేటర్కు గాయాలు
జైపూర్: మండల కేంద్రంలోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో బుధవారం ఉదయం 7గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న పవర్మేక్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుగా వ్యవహరిస్తున్న గ్లోబస్ కంపెనీలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన కుడక శ్రీనివాస్ స్విచ్గేర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులకు వచ్చిన శ్రీనివాస్ ఉదయం 6:50సమయంలో యాష్హ్యాండ్లింగ్ ప్లాంటు(ఏహెచ్పీ)లో మాడ్యుల్ ఆఫ్ చేసి పని చేస్తున్న క్రమంలో దాంట్లో నుంచి ఒక్కసారిగా ఫ్లాష్ అవుట్ అయి మంటలు వచ్చాయి. దీంతో శ్రీనివాస్ ముఖం, కళ్లు, చేతులు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కార్మికులకు రక్షణ పరికరాలు అందించకుండానే వారితో పని చేయించడంతో శ్రీనివాస్ గాయపడినట్లుగా స్థానిక యూనియన్ నాయకులు వాపోయారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గాయపడ్డ శ్రీనివాస్ -
‘జలశక్తి అవార్డు’పై తప్పుడు ప్రచారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర జల్ శక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్లో భాగంగా గత నవంబర్లో జాతీయ స్థాయిలో ‘జల్ సంచాయ్ జన్ భాగిధారి’ మంచిర్యాల జిల్లా రూ.2కోట్ల అవార్డు గెలుచుకున్నది తెలిసిందే. అయితే క్యాచ్ ద రెయిన్(సీటీఆర్) పోర్టల్లో పని ప్రదేశానికి బదులు ఏఐ జనరేటెడ్తో ఉన్న జాతీయ జెండాను పోర్టల్ అప్లోడ్ చేసి అవార్డు పొందారంటూ ఓ హిందీ యూ ట్యూబ్ చానల్లో ప్రసారమైంది. మంచిర్యాల జిల్లాతోపాటు మధ్యప్రదేశ్ కాండ్వా జిల్లాలోనూ పెళ్లి పత్రికను అప్లోడ్ చేసి, క్షేత్రస్థాయిలో పని జరగకున్నా, తప్పుడు ఫొటోలు నమోదు చేసినా అధికారులు గుర్తించకుండా అవార్డులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఏఐ ఫొటో అప్లోడ్ చేసిన మందమర్రి మండలం పొన్నారం ఇంకుడు గుంతలను బుధవారం నేరుగా వెళ్లి పరిశీలించారు. పని ప్రదేశంలో నీటిగుంతలు ఉన్నాయి. సీటీఆర్ పోర్టల్లో ఎవరైనా ఫొటోలు అప్లోడ్ చేయొచ్చని, వాటికి అవార్డులకు సంబంధం లేదని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అలాగే ఏఐ ఫొటోను తొలగించామని, ఆ ఫొటో అప్లోడ్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో జరిగిన ప్ర చారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) వి వరణ ఇస్తూ నీటి సంరక్షణ పనుల పరిశీలన, అవార్డుల ఎంపిక పలు దశల్లో జరుగుతుందని, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవమని ఓ ప్రకటన విడుదల చేసింది. -
విద్యార్థులు సృజనాత్మకత పెంచుకోవాలి
బెల్లంపల్లి: విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకుని భవిష్యత్లో ఉన్నతంగా రాణించడానికి సంసిద్ధులు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ‘వేస్ట్ టు వెల్త్’ కార్యక్రమం నిర్వహించారు. 38 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పనికి రాని వస్తువుల నుంచి 50 రకాల పైబడి గృహ, అలంకరణ వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. కళాత్మకంగా తయారు చేసిన వస్తువులు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాసిపేట మండలం దేవాపూర్ డీఏవీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో, బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ, కాసిపేట మండలం ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం దక్కించుకున్నారు. విద్యార్థులను అభినందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, డీసీబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి, ఎంఈవో జాడి పోచయ్య, రాష్ట్ర ఎన్జీసీ కోఆర్డినేటర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● పకడ్బందీగా ధాన్యం సేకరణ ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే.. వంద శాతం ఉత్తీర్ణతకు చర్యలు జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. సంక్షేమ వసతిగృహాలు, విద్యాలయాలు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరిశీలిస్తూ ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నాం. లక్సెట్టిపేట పాఠశాల, జూనియర్ కళాశాలను ఆధునిక హంగులతో నిర్మించాం. ఇందులో 400మంది చేరగా.. ఈ విద్యాసంవత్సరం వెయ్యి మంది అభ్యసించేలా సీట్లు కల్పించనున్నాం. ప్రతీ మండలానికి కేజీబీవీ పక్కా భవనాల నిర్మాణాలు చేపట్టడంతోపాటు మెరుగైన ఫలితాల సాధనకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. మూడు నియోజకవర్గాల్లో రూ.200 కోట్లలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించడం జరుగుతుంది. -
అవిశ్రాంతంగా శ్రమిస్తా
చెన్నూర్: గత ఏడాది గ్రూప్–3, పంచాయతీ సెక్రెటరీలకు ప్రయత్నం చేశా. గ్రూప్–3 కొంచెంలో మిస్సయింది. పంచాయతీ సెక్రెటరీ 1ః2 ఉన్నాం. పంచాయతీ సెక్రెటరీ వస్తుందని నమ్మకం ఉంది. వచ్చినా రాకున్నా పోయినేడాది పరీక్షలు రాసిన అనుభవంతో గ్రూప్స్ సాధించి తీరుతా. కొత్త సంవత్సరం 2026లో నా లక్ష్యాన్ని సాధించేవరకు అవిశ్రాంతంగా శ్రమిస్తా. – చెన్నూరి రాజేశ్, ఎంఏ, ఎంఎస్సీ, బీఎడ్, ఎల్ఎల్బీ, చెన్నూర్ తల్లిదండ్రుల కోరిక నెరవేరుస్తా బెల్లంపల్లి: గతేడాది డిగ్రీ(బీకాం) పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని చదివి సాధించాను. చాలా సంతోషం కలిగింది. ఈ ఏడాది నా తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలని బలంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాను. పీజీ ఫస్టియర్ చదువుతూనే గ్రూప్–1 ప్రిపేర్ అవుతున్నాను. ఎంతకష్టమైన సరే పరీక్ష రాసి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కోరిక నెరవేరుస్తా. – బి.జ్ఞానేష్, పీజీ విద్యార్థి -
పనులు పూర్తి చేయడమే లక్ష్యం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వనివీ నెరవేర్చుతున్నా. పనులన్నీ ఈ సంవత్సరంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. కొత్తగా నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రూ.74.40 కోట్లతో మంజూరు కాగా, టెండరు ప్రక్రియ పూర్తి చేసి ప్రారంభిస్తాం. మంచిర్యాల మార్కెట్లో రోడ్ల వెడల్పును రూ.78 కోట్లు, రాళ్లవాగు వరద రాకుండా కరకట్ట నిర్మాణం రూ.255 కోట్లతో చేపడుతున్నాం. కాలేజీరోడ్డులో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తా. ఇండస్ట్రీయల్ పార్కు, ఐటీ హబ్ పనులు పూర్తి చేస్తాను. – కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల ఎమ్మెల్యే -
గ్రామాల అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు ● సర్పంచులకు సన్మానం మంచిర్యాలటౌన్: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. బుధవారం స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలంలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, దేవాపూర్ సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు, నాయకులు పాల్గొన్నారు. రైతులకు రూ.46 లక్షలు అందజేత దండేపల్లి మండలానికి చెందిన పలువురు రైతులు ఓ వ్యాపారి చేసిన ఆర్థిక మోసంపై ఎమ్మెల్యేను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. బుధవారం 70 మంది బాధిత రైతులకు రూ.46 లక్షలు సదరు వ్యాపారి వద్ద నుంచి వసూలు చేసి అందజేశారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమార్ దీపక్ చెక్కులు అందజేశారు. తహసీల్దార్లు రఫతుల్లా హుస్సేన్, శ్రీనివాస్రావు దేశ్పాండే పాల్గొన్నారు. -
రాష్ట్రంలోనే మొదటిస్థానంలో 102 సేవలు
మంచిర్యాలటౌన్: రాష్ట్రవ్యాప్తంగా గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సేవలు అందించడంలో 102 అమ్మఒడి వాహనం ప్రథమస్థానంలో నిలిచింది. గర్భిణులను మూడు నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు ప్రభుత్వ ఆసుపత్రికి నెలవారీ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడంలో అందిస్తున్న సేవలకు మొదటిస్థానం పొందింది. ప్రసవం అనంతరం బాలింతలను ఇంటికి చేర్చడంలో, పసిపిల్లలకు షెడ్యూల్ ప్రకారం వాక్సినేషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇంటికి చేర్చడంలోనూ సేవలు అందిస్తోంది. అక్టోబర్లో 3,250, నవంబర్లో 3,102, డిసెంబర్లో 3,509 కేసులకు 102 అమ్మ ఒడి వాహనం సేవలు అందించింది. రెండోస్థానంలో 108 జిల్లాలో 108 వాహనాలు 18 ఉండగా 45 మంది పైలట్లు, 44 మంది ఈఎంటీలు పని చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లడంలో జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. అక్టోబర్లో 2,690, నవంబర్లో 2,910, డిసెంబర్లో 3,246 మందిని సంఘటన స్థలం నుంచి దగ్గరలోని ఆసుపత్రికి చేర్చింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ప్రాణహాని కలుగకుండా చూసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాంజిల్లాలో 102 అమ్మ ఒడి వాహనాల సేవలు, 108 అత్యవసర సేవలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వైద్య సేవలను అందించడంలో సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. అందువల్లనే రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ స్థానాల్లో ఉండగలిగాం. ప్రజలు అత్యవసర సమయాల్లో సేవలను వినియోగించుకోవాలి. – కొండలరావు, 108, 102 వాహనాల జిల్లా అధికారి -
పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజల సేకరణకు మెస్రం వంశీ యులు మంగళవారం పాదయాత్ర ప్రారంభించా రు. మహాపూజపై కటోడ మెస్రం హనుమంత్రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్ ప్రచారం ముగించుకుని కేస్లాపూర్కు చేరుకున్న విషయం తెలుసుకున్న ఉ మ్మడి జిల్లా మెస్రం వంశీయులు మంగళవారం మ ధ్యాహ్నం గ్రామంలోని నాగోబా మురాడి వద్ద స మావేశమయ్యారు. గంగాజల సేకరణ పాదయా త్ర, జాతర నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఝారి (కలసం) దేవతకు వంశీయులు, గ్రామ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం పవిత్రమై గంగాజల సేకరణ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశ అల్లుళ్లు, ఆడబిడ్డలు బూందో (కానుక) పట్ట గా పెద్దలు కానుకలు వేసి ముందుకుసాగారు. పాద యాత్రగా బయల్దేరి మొదటిరోజు కేస్లాగూడలో బ స చేశారు. ఈ నెల 31న మండలంలోని చిలటిగూ డ, జనవరి 1న నార్నూర్ మండలం మాన్కపూర్, 2న జైనూర్ మండలం మామడ, 3న డబోలి, 4న సిర్పూర్(యూ) మండలం దనోర, 5న జన్నారం మండలం ఇస్లాంపూర్, 6న దస్తురాబాద్ మండలం నర్సింగ్పూర్లో బస చేయనున్నారు. 7న గోదావరి నది హస్తిన మడుగుకు చేరుకుని ప్రత్యేకపూజలు ని ర్వహించి గంగాజలాన్ని సేకరించనున్నారు. తిరిగి పవిత్ర గంగాజలంతో బయల్దేరి 9న జైనూర్ మండలం కటోడ(పూజారి) మెస్రం హనుమంత్రావ్ గ్రా మమైన గౌరికి చేరుకుంటారు. గంగాజలాన్ని గ్రామ పొలిమేరలో భద్రపరిచి తమతమ గ్రామాలకు వెళ్లనున్నట్లు వారు తెలిపారు. జనవరి 14న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేరో జు సాయంత్రం గ్రామ సమీ పంలోగల మర్రి చెట్టు (వడ మర) వద్దకు చేరి బస చేయనున్నారు. మర్రి చెట్టు వద్ద జనవరి 15, 16, 17తేదీల్లో సంప్రదాయ, తూమ్(కర్మఖాండ) పూజలు చేయనున్నారు. పుష్యమాస అవమాస్యను పురస్కరించుకుని జనవరి 18 న రాత్రి 10.30 గంటల సమయంలో పవిత్ర గంగా జలంతో ఆలయాన్ని శుద్ధిచేస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. భక్తిశ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించాలిగంగాజలం సేకరణ పాదయాత్రలో పాల్గొన్న వంశీయులు నియమనిష్టలు, భక్తిశ్రద్ధలతో ఉండాలని, బడికి వెళ్లే విద్యార్థులు వద్దని, సెల్ఫోన్లు తీసుకెళ్లరాదని ఎప్పటిలాగే పెద్దలు నిర్ణయించారు. మంగళవారం కేస్లాపూర్ నాగోబా మురాడి వద్ద సమావేశమైన ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు గంగాజల సేకరణ యాత్రలో పాల్గొనేవారికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు చేశారు. మార్గమధ్యలో బస చేసి న గ్రామాల నుంచి బంధువుల ఇళ్లకు గాని లేదా ఇ తర ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. విద్యార్థులను తీసుకువచ్చి వారి చదువులకు ఆటంకం కలి గించవద్దని నిర్ణయించారు. వంశ పెద్దల నిర్ణయాలకు అందరూ కట్టుబడి నియమనిష్టలతో గంగా జల సేకరణ యాత్రతో పాటు నాగోబా పూజలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, వంశ పెద్దలు మెస్రం చిన్నుపటే ల్, బాదిరావ్, కోసేరావ్, ఆనంద్రావ్, వంశం పర్ధా న్ సమాజ్ పెద్ద మెస్రం దాదారావ్, వంశ ఉద్యోగులు మెస్రం సోనేరావ్, మెస్రం శేఖర్బాబు, మెస్రం దేవ్రావ్, మెస్రం కోసేరావ్ తదితరులున్నారు.కరచాలనం చేసుకుంటున్న మెస్రం వంశీయులుపెద్దలకు బూందో పడుతున్న అల్లుళ్లు, ఆడబిడ్డలు -
పోలీస్శాఖలో బదిలీల జాతర
మంచిర్యాలక్రైం: పోలీస్శాఖలో బదిలీల జాతర మొదలైంది. రానున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ మంగళవారం కాళేశ్వరం మల్టీజోన్–1 డీఐజీ చంద్రశేఖర్రెడ్డి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా బదిలీ ఉత్తర్వులను సంబంధిత బదిలీ అధికారులకు అందజేశారు.ఎం.ప్రశాంత్ సీసీఎస్ కు.ఆసిఫాబాద్ సీసీఎస్ నస్పూర్ యూ ఉపేందర్రావు సీసీసీ నస్పూర్ టాస్క్ఫోర్స్ రామగుండం డీ కిరణ్కుమార్ తాండూర్ హాజీపూర్ ఎన్.స్వరూప్రాజ్ హాజీపూర్ పీసీఆర్ రామగుండం ఎల్.భూమేశ్ గోదావరిఖని 1టౌన్ రామకృష్ణాపూర్ జీ రాజశేఖర్ రామకృష్ణాపూర్ సీసీఆర్బీ రామగుండం ఎన్.సుగుణాకర్ వీఆర్ రామగుండం వీఆర్ కు.ఆసిఫాబాద్ (అండర్ సస్పెన్షన్) (లైన్ షిఫ్టెడ్) -
ఏసీబీ వలలో సర్వేయర్
నిర్మల్ రూరల్: మండల సర్వేయర్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన నాంపల్లి బాలకృష్ణవర్మ నిర్మల్ అర్బన్ మండల సర్వేయర్గా ప నిచేస్తూ రూరల్ మండలానికీ ఇన్చార్జీగా వ్యవహరి స్తున్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మేకల చిన్నయ్య ఎల్లపల్లి గ్రామంలోని తన భూమిని సర్వే చేయాలని బాలకృష్ణవర్మను సంప్రదించాడు. ఇందుకు సదరు సర్వేయర్ రూ.15వేలు డిమాండ్ చేశారు. ఇందులో రూ.5వేలు ముందే చె ల్లించాడు. మిగతా రూ.10వేల నుంచి రూ.7,500 నగదు జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం బాలకృష్ణ, అసిస్టెంట్ నాగరాజుకు చిన్నయ్య ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం నిందితులను రూరల్ తహసీల్దార్ కా ర్యాలయానికి తరలించి పంచనామా నిర్వహించా రు. లంచం తీసుకుంటూ పట్టుబడిన బాలకృష్ణ, అ తని అసిస్టెంట్ నాగరాజును కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. -
హామీ ఇచ్చారు.. కోతులను పట్టించారు
తాండూర్: కోతుల బెడద నివారిస్తామని, కాంగ్రెస్ బలపరిచిన కుశ్నపల్లి లక్ష్మీనారాయణను మండలంలోని మాదారం సర్పంచ్గా గెలిపించాలని డీసీసీ ఉపాధ్యక్షుడు సూరం ర వీందర్రెడ్డి ఎన్నికలకు ముందు గ్రామస్తుల కు హామీ ఇచ్చారు. నమ్మిన గ్రామస్తులు లక్ష్మీనారాయణను భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో రవీందర్రెడ్డితోపాటు సర్పంచ్గా గెలి చిన లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ సూరం దా మోదర్రెడ్డి తిరుపతికి చెందిన కోతులు పట్టే వారిని గ్రామానికి పిలిపించారు. వారంపాటు ఈ బృందం గ్రామంలోనే ఉండి కోతులను పూర్తి స్థాయిలో బంధించి దూరప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. మాదారంలో కోతుల బెడద నివారించినట్లుగానే మిగతా గ్రామాల్లోనూ ప్రజాప్రతినిధులు ఆ దిశగా చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. -
ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వాలి
ఆదిలాబాద్రూరల్: కోర్ ఏరియా పేరుతో ఆదివాసీ కొలాం తెగలకు చెందిన అర్హులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి వెంటనే అనుమతులివ్వాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించా లన్న అధికారులు, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేర కు కొందరు గుడిసెలు తొలగించుకుని పునాదులు తవ్వుకున్నారని తెలిపారు. అయితే, అటవీశాఖ అధి కారులు నిర్మాణాలకు అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కూడా కలిసి తమ సమస్య విన్నవించినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్య క్తంజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గోవింద్రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, గౌరవాధ్యక్షుడు టేకం లక్ష్మ ణ్, జైనథ్ మండలాధ్యక్షుడు కొడప రాము, నాయకుడు టేకం శ్యాంరావ్ తదితరులు పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్ సేవలు భేష్
నార్నూర్: మండలంలో నీతి ఆయోగ్ సేవలు బాగున్నాయని నీతి ఆయోగ్ పరిశోధకుడు వి నయ్ ఐఐఎం తెలిపారు. మంగళవారం మండలంలోని జామ్డా, నార్నూర్ గ్రామాల్లో ఆ యన పర్యటించారు. నీతి ఆయోగ్ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జామ్ డా గ్రామంలో గ్రామస్తులతో ఏర్పా టు చేసిన సమావేశంలో పాల్గొని లాభాల గురించి తెలు సుకున్నారు. విద్య, వైద్యం, ఐసీడీఎస్ ద్వారా పిల్లల్లో వచ్చిన మార్పులపై ఆరా తీశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ను పరిశీలించారు. ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్ లర్నింగ్ కార్యక్రమాన్ని గమనించారు. నార్నూర్లో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వెదురు వ స్తువులను పరిశీలించి వాటిపై వచ్చే లాభాల గురించి తెలుసుకున్నారు. అనంతరం నీతి ఆయోగ్ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆయన వెంట డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారిణి మిల్కా, ఎంపీడీవో పుల్లారావు, సీడీపీవో శారద, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, సర్పంచ్ కావేరి, చందర్షావ్, రాయి సెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు పటేల్, మాజీ సర్పంచ్ మాడవి రూప్దేవ్ తదితరులున్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
ఆదిలాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నూ రాణించాలని డీఎస్పీ జీవన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ ఆదిలా బాద్ జోన్ (ఉమ్మడి జిల్లా) క్రికెట్ ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడారంగంలో రాణించిన వారికి గొప్ప భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే క్రీడలపై దృష్టి సారిస్తే గొప్ప క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని అన్ని విధాలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటా లని పిలుపునిచ్చారు. పోటీల ఆర్గనైజర్ డీ సందీప్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఖమ్మం వేదికగా నిర్వహించనున్న ఇంటర్ జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు జనవరిలో 3నుంచి 5వరకు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్.శ్రీచరణ్ (కెప్టెన్), షేక్ అమాన్, ఎ.సాయికిరణ్ యాదవ్, సీహెచ్ పవన్కుమార్, సీహెచ్ వినయ్, ఎం.సుధీర్, జీ వంశీ, ఎం.ఆకాశ్, రాథోడ్ మిథల్రాజ్, కొట్నాక్ లక్ష్మణ్, టీ కార్తిక్, బీ సిద్ధార్థ, ఆర్ వివేక్, ఆర్ ఆకాశ్, ఎల్.కిరణ్, ఝెల్చల్వార్ సాయిప్రసాద్, స్టాండ్బై ఆటగాళ్లుగా డీ రవికిరణ్, ఎన్.నర్సింహ, కే పొల్లు ఎంపికై నట్లు తెలిపారు. డీటీఎస్వో పార్థసారథి, వాగ్దేవి కళాశాల చైర్మన్ బిలాల్, పీడీలు అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
నస్పూర్: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ కాలనీలోని శాంతి సేడియంలో నిర్వహిస్తున్న కంపెనీ స్థాయి అథ్లెటిక్ పోటీలను జీఎం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించడమే కాకుండా జాతీ య స్థాయిలో మెడల్స్ సాధించాలని సూచించారు. రన్నింగ్, లాంగ్జంప్, త్రోస్, స్విమ్మింగ్ విభాగాలతో పాటు మహిళలకు త్రోబాల్, రన్నింగ్, త్రోస్, లాంగ్జంప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం ఎన్.సత్యనారాయణ, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమురయ్య, అధికా రులు అనిల్కుమార్, శ్రీధర్, డాక్టర్ పీ రమేశ్బాబు, స్పోర్ట్స్ సెక్రటరీ సృజన్పాల్, సూపర్వైజర్లు అశోక్, జాన్వెస్లి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సిద్ధం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ వలియత్ అలీతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించి ఉండకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా జనవరి ఒకటిన అందించాలని తెలిపారు. పంట మార్పిడితోనే అధిక దిగుబడి మంచిర్యాలఅగ్రికల్చర్: పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అధికారి ఈ.శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఉద్యానవన శాఖ అధికారి అనితతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాణిజ్య పంటలు, కూరగాయల సాగు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్, మండల వ్యసాయ అధికారులు, విస్తరణ, ఉధ్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, పశువైద్యాధికారులు పాల్గొన్నారు. -
రాజకీయ సందడే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాల చక్రం గిర్రున తిరిగింది. 2025 సంవత్సరం ఎన్నో కీలక పరిణామాలతో చరిత్రలో తనదైన ముద్ర వేస్తూ కాలగర్భంలో కలిసిపోతోంది. మరో ఏడాది 2026ను ముందుకు తీసుకొస్తోంది. గత ఏడాది కాలంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా పురోగతి కోసం అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలతో మొదలైన రాజకీయ సందడి మొన్నటి సర్పంచ్ ఎన్నికలతో ముగిసింది. గత పన్నెండు నెలల్లో కీలక సంఘటనల పర్వం చరిత్రగా మిగిలిపోతోంది. సంక్షేమ పథకాల అమలురాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే రైతు భరోసా, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించింది. గ్రామసభల్లో అర్హుల ఎంపిక కు కసరత్తు మొదలైంది. ఇందుకు ‘హౌజ్ హోల్డ్ వెరిఫికేషన్’ సర్వే నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘కమలం’ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలై.. మార్చిలో ఎన్నిక ముగిసింది. తొలిసారిగా ఈ స్థానాలను బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య దక్కించుకున్నారు. దీంతో ఆ పార్టీలో జోష్ నింపింది. పార్టీ జిల్లా కొత్త సారథిగా నగునూరి వెంకటేశ్వర్గౌడ్ నియామకం అయ్యారు. ఏప్రిల్లో సన్నబియ్యంప్రజాపంపిణీలో లబ్ధిదారులకు దొడ్డు బియ్యం స్థానంలో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఈ ఏడాది ప్రకటించిన సామాజిక ఆర్థిక రాజకీయ సర్వేలో జిల్లా తలసరి ఆదాయం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వృద్ధిలో ఊరట కలిగింది. ఎల్ఆర్ఎస్(లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) అనధికారికంగా ఉన్న లేవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రకటన విడుదలైంది. ఆగస్టులో వందేభారత్ హాల్ట్ఈ నెలలో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సోదరుడు సత్యపాల్ విజయం సాధించారు. వందేభారత్ రైలుకు జిల్లా కేంద్రంలో హాల్ట్ కల్పించారు. అక్టోబర్లో మొదలై..స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తే.. హైకోర్టు స్టే విధించడంతో నిలిచిపోయింది. 42శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలతో నామినేషన్ల స్వీకరణ మొదలైన కాసేపటికే బ్రేక్ పడింది. మరోసారి నోటిఫికేషన్నవంబర్లో డీసీసీ అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథ్ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఎన్ని కల సంఘం మరోసారి ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్కు బారులు తీరిన ఓటర్లు(ఫైల్)జూన్లో మంత్రి పదవిజిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మంత్రి పదవి గడ్డం వివేక్ను వరించింది. పదవి కోసం పోటీ పడిన మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్రావు, గడ్డం వినోద్కు ఈ ఏడాది నిరాశే ఎదురైంది. ముగిసిన పల్లె ‘పంచాయతీ’స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. 303పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. ఇక ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర నుంచి పులులు వలస వస్తున్నాయి. జన్నారం, హాజీపూర్, లక్షెట్టిపేట, చెన్నూరు, భీమారం, జైపూర్, వేమనపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, నెన్నెల మండలాల్లో సంచరిస్తున్నాయి. గోదావరి తీరం ముల్కల్లలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. -
చలి నుంచి రక్షణ పొందాలి
మంచిర్యాలటౌన్: ‘జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న చలి నుంచి ప్రజలు రక్షణ పొందాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, నిమోనియా వంటివి వస్తున్నాయి. రెండ్రోజుల కంటే ఎక్కువ ఉంటే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స, మందులు తీసుకోవాలి. చలి తీవ్రత వల్ల పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ సూచించారు. చలి తీవ్రత నేపథ్యంలో వ్యాధులు, జాగ్రత్తలపై సాక్షి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్ ఇన్లో ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: పిల్లలకు దగ్గు, జలుబు రావడం, మందులు వాడగానే తగ్గిపోవడం జరుగుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. – బొమ్మన మహేశ్, దండేపల్లి, మహేశ్ జానె, జన్నారంసూపరింటెండెంట్: చలి పెరిగినప్పుడు పిల్లలు దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఇంట్లోనూ చలితో ఇబ్బంది పడకుండా రూం హీటర్, ఇతర ప్రత్యామ్నాయాలు చేసుకోవాలి. చలి నుంచి రక్షణకు స్వెట్టర్లు వేసి ఉంచాలి. వేడి ఆహారం మాత్రమే పెట్టాలి. చలిగాలి ముక్కు, చెవుల ద్వారా శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న: పాపకు మూడేళ్లు. మందులు వాడుతున్నా దగ్గు, జలుబు తగ్గడం లేదు – మనోజ్కుమార్, రాంనగర్, మంచిర్యాల సూపరింటెండెంట్: వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడికి చూపించి అవసరమైన మందులు వాడాలి. చల్లని నీరు, ఆహార పదార్థాలు తినకుండా చూడాలి. గోరు వెచ్చని నీటిని తీసుకోవడం, రూంహీటర్తో గది ఉష్ణోగ్రతలను తగ్గకుండా చూసుకోవాలి. మూడు లీటర్ల నీటిని ప్రతీరోజు తాగేలా చూడడంతోపాటు పిల్లలు వయస్సుకు తగిన బరువు పెరిగేలా చూడడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రశ్న: రాత్రి, ఉదయం సమయాల్లోనే దగ్గు ఎక్కువగా వస్తుంది – సుదర్శన్గౌడ్, గ్రామం: పారాపూర్, మం: కన్నెపల్లి, సాకేత్, గ్రామం: కొత్తపల్లి, మం: చెన్నూర్, కార్తీక్, తిలక్నగర్, మంచిర్యాల సూపరింటెండెంట్: ఎక్కువ రోజులు దగ్గు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాలి. దాహం వేయక పోయినా ప్రతీరోజు మూడు లీటర్ల నీటిని తాగాలి. దగ్గు, జలుబు వంటివి వచ్చినప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవాలి. ప్రశ్న: చలితో గొంతులో నొప్పిగా ఉండడం, కాళ్ల పగుళ్లు వస్తున్నాయి. – తిరుపతి బొజ్జ, శ్రీరాంపూర్ సూపరింటెండెంట్: గొంతులో నొప్పిగా అనిపిస్తే గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మాలి. చలితో నీరు కూడా చల్లగా అవుతుండడం వల్ల గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగాలి. చలికి రక్తం చిక్కగా అయ్యే అవకాశం ఉండడం వల్ల పాదాలకు సక్రమంగా రక్తప్రసరణ కాదు. దీనివల్లనే కాళ్ల పగుళ్లు ఏర్పడతాయి. రాత్రి సమయంలో కాళ్లకు నూనె రాసుకుని, సాక్సులు వేసుకుంటే సమస్య తగ్గిపోతుంది. ప్రశ్న: జ్వరం, నంజుతో కూడిన దగ్గు వస్తుంది. – రమేశ్, చింతగూడ, జన్నారంసూపరింటెండెంట్: దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని మందులు వాడాలి. అలర్జీకి సంబంధించిన మందులు వాడవద్దు. దగ్గు, జలుబు వంటివి వచ్చినప్పుడు అలర్జీ మందులు వాడితే తెమడ చిక్కగా మారి ఇబ్బంది పెడుతుంది. తగినంత నీటిని తాగుతూ మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ప్రశ్న: ఏ కాలంలోనైనా మా పిల్లలు తరుచూ ఏదో ఒక ఆరోగ్య సమస్యకు గురవుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సతీశ్ కుమార్, కోటపల్లి సూపరింటెండెంట్: పిల్లల్లో ఆరోగ్య సమస్యలకు సరైన పౌషకాహారం తీసుకోకపోవడమే. వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. లేకుంటే త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. బరువు తక్కువగా ఉంటే ప్రతీరోజు రెండు కోడిగుడ్లు బరువు పెరిగే వరకు ఇవ్వాలి. పిల్లలు తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూడడంతోపాటు ప్రతీరోజు మూడు లీటర్ల నీరు తప్పనిసరిగా తాగేలా చూడాలి. ప్రశ్న: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి సమయంలో మరింత ఎక్కువ అవుతుంది. – కే.శ్రీనివాస్, లక్సెట్టిపేట సూపరింటెండెంట్: చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటివి వస్తాయి. అస్తమా సమస్య ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇన్హేలర్లు వైద్యులు సూచించినట్లుగానే వాడాలి. మందులు సైతం ఎవరికి వారు మెడికల్ షాపునకు వెళ్లి తీసుకోకుండా, వైద్యుడు సూచించిన విధంగానే వాడాల్సి ఉంటుంది. -
వడ్లు లేవు.. మళ్లీ ధాన్యం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వడ్లు లేకున్నా మరోసారి అనుమతి ఇచ్చి పౌరసరఫరాల శాఖ అధికారులు తమ ఉదారతను చాటుకున్నారు. సీఎంఆర్(కస్టం మిల్డ్ రైస్) బకాయిలు ఉన్న మిల్లులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఆంక్షలు విధిస్తోంది. ఇచ్చిన ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు 10శాతం, ఇంకా అదనంగా బకాయి, జరిమానా, వడ్డీతో కలిపి ఆ మేరకు గ్యారంటీలు ఇవ్వాలి. ఇక టెండర్ ధాన్యం బకాయిలకు పూర్తిగా చెల్లిస్తేనే అనుమతులు ఇస్తున్నారు. లేకపోతే బ్లాక్ లిస్టులోనే ఉంటున్నాయి. కానీ జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం శివారు ఓ మాడ్రన్ రైస్ మిల్లులో గత రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం తక్కువగా ఉంది. అయినప్పటికీ మంగళవారం ఖరీఫ్లో ధాన్యం తీసుకునేందుకు అనుమతి వచ్చింది. ఇదే తీరుగా మరో ఏడు మిల్లులు సైతం బకాయిలు ఉన్నాయి. వాళ్లు సైతం ప్రభుత్వ అనుమతి పాటిస్తామని చెబుతున్నా అధికారులు కనికరించలేదు. కానీ ధాన్యం సేకరణ తుది దశలో ఆగమేఘాల మీద ఇందారంలోని ఓ మిల్లుకు ట్యాగింగ్ రావడం గమనార్హం. ఆ మిల్లు సీఎంఆర్ కింద 19ఏసీకే(ఒక ఏసీకే 290క్వింటాళ్లు)ల బియ్యం పెట్టాలి. ధాన్యం బస్తాల్లో లెక్కగడితే 20వేలకు పైగా బస్తాలు మిల్లులో ఉండాలి. అయితే ఆ ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్, బియ్యం నేరుగా కొనుగోలు చేసి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. అయితే ఆ మిల్లులో రెండు వేలలోపు కూడా బస్తాలు లేకపోవడం గమనార్హం. బకాయి మేరకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చానని చెబుతూ అనుమతి తెచ్చుకున్నారు. మరోవైపు ప్యాడీ షిఫ్టింగ్(ధాన్యం బదిలీ) పేరుతో ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు అధికారికంగానే బదిలీ చేసుకుని, ఇదే మిల్లు లబ్ధిపొందిన ఘటనలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. ట్యాగింగ్ ఎలా ఇచ్చారో..వానాకాలంలో ధాన్యం దిగుబడి తగ్గింది. జిల్లా మిల్లులు పాత బకాయిల కారణంగా ఈ సీజన్లో 27మిల్లుల వరకు ట్యాగింగ్ ఇచ్చారు. మిగతావన్నీ పొరుగు జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లికి పంపారు. ఆ జిల్లాలకు పంపిన వ్యవహారంలోనూ రూ.లక్షలు చేతులు మారినట్లు మిల్లర్లే చర్చించుకుంటున్నారు. ఖరీఫ్లో ఎంతో కొంత ధాన్యం ఇవ్వాలంటూ పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. అయితే ఇందారంలో ఆ మిల్లర్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆఫీసులో అధికారిని మేనేజ్ చేసుకుని అనుమతి తెచ్చుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక జిల్లా అధికారులు మిల్లులో ధాన్యం ఉందా? లేదా? అని ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) చేసి రిపోర్టు ఇస్తూ, ఆ మిల్లు బకాయిలు పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ మిల్లు విషయంలో మాత్రం ఎవర్ని మేనేజ్ చేసుకున్నారో కానీ చివరకు కొనుగోలు కేంద్రాల ట్యాగింగ్ పూర్తి ధాన్యం దించుకునే పనిలో పడ్డారు. మంగళవారం సాయంత్రం నుంచే ధాన్యం దించుకుంటున్నారు. అదే సమయంలో బియ్యం కొనుగోలు చేసి మరీ పౌరసరపరాల శాఖకు అప్పగిస్తున్నారు. తమకు ఇవ్వకుండా ఆ మిల్లుకు అవకాశం ఇచ్చినందుకు మంచిర్యాల, భూపాలపల్లిలో అనుమతి కోసం ఎదురుచూస్తున్న 14మంది మిల్లర్లు ఈ వ్యవహారాన్ని కూపీ లాగుతున్నట్లు సమాచారం. -
న్యూ ఇయర్ వేడుకలపై నిఘా
మంచిర్యాలక్రైం: ‘న్యూ ఇయర్ వేడుకలపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో రాత్రి 10గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతాం. బుధవారం అర్ధరాత్రి 12గంటల తర్వాత రోడ్లపై కేక్ కటింగ్లు, డీజే సౌండ్స్, నృత్యాలు చేయడం నిషేధం. రోడ్లపై కి గుంపులుగా వచ్చి సంబరాలు చేసుకునే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు..’ అని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలు, పోలీసుల భద్రత చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలోని ఏ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తినా 100 డయల్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేడుకల్లో అపశ్రుతులు దొర్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.డీసీపీ: ట్రాఫిక్ పోలీసు, షీటీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్, అదనపు ప్రత్యేక బలగాలతో పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. అక్రమ సిట్టింగ్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గుంపులుగా తిరుగుతూ మహిళలను వేధించడం వంటి ఘటనలు అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ, సీసీ కెమెరాలతో నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తాం. డ్రగ్స్, గంజాయి వినియోగం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. మద్యంమత్తులో గొడవలు, అల్లర్లను ఎలా నివారిస్తారు డీసీపీ: తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను అంధకారం చేసుకోవద్దు. అనుమానిత ప్రాంతాలపై సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టాం. గంజాయి పాత నేరస్తులు, సస్పెక్ట్ నిందితులపై పూర్తి స్థాయి నిఘా ఉంచాం. రౌడీషీటర్స్, పాత నేరస్తులకు హెచ్చరికలు జారీ చేశాం. జిల్లా వ్యాప్తంగా 1200 మంది సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశాం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు. -
‘వీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం’
దండేపల్లి: ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వీబీ జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెద్దయెత్తున పోరాటం చేస్తుందని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి తెలిపారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం డీఆర్డీవో పీడీ కిషన్కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్కల వెంకటేశ్వర్లు, కంది సతీష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్, సర్పంచ్లు పాల్గొన్నారు. -
నాగోబా జాతర నిర్వహణపై నేడు సమావేశం
ఇంద్రవెల్లి: జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రా రంభంకానున్న నాగోబా జాతర నిర్వహణపై ‘జాతర సమీపిస్తున్నా...జాప్యమే’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జాతర నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ ఉత్తర్వులు జారీ చేశారని దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. మంగళవారం ఉదయం నాగోబా దర్బార్ హాల్లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్తో పాటు పీవో హాజరుకానున్నట్లు తెలిపారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, మెస్రం వంశీయులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. -
ఎంతుందో..ఏముందో?
కడెం: సాగునీటి ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికతీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడెం ప్రాజెక్ట్ను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. ఇందులో పేరుకుపోయిన పూడిక తీసేందుకు ఇటీవలే పనులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 4.699 టీఎంసీలుగా ఇరిగేషన్ అధికారుల అంచనా. అంటే 2.904 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు అంచనా. ప్రాజెక్ట్లో పూడిక ఎంతుందో తెలుసుకునేందుకు 2013లో సైతం హైడ్రాలజీ సర్వే నిర్వహించారు. సిబ్బంది సర్వే కడెం ప్రాజెక్ట్లో పూడికతీత పనులు దక్కించుకున్న రాజస్థాన్కు చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఈనెల 27, 28 తేదీల్లో హైడ్రాలజీ సర్వే నిర్వహించింది. ప్రాజెక్ట్లో ఎంత మేర పూడిక నిండుకుంది. అందులో బండరాయి, మట్టి ఉందా? ఇసుక, తదితర మెటీరియల్ ఎంత ఉందో తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన బోటుతో సిబ్బంది సర్వే నిర్వహించారు. ప్రాజెక్ట్కు అడ్డంగా పదిలైన్ల చొప్పున ఏర్పాటు చేసుకుని లోకేషన్, ప్రొఫైల్, తదితర రిపోర్టులు సేకరించారు. జియాలజికల్ రిపోర్ట్ను బట్టి ఎంత మేర పూడిక ఉందో.. ఎలాంటి మెటీరియల్ ఉందో త్వరలో తేలనుంది. -
జాతర రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి
మంచిర్యాలఅర్బన్: మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పగిడిమర్రి సోలోమాన్ సూచించారు. సోమవారం మంచిర్యాల డీఎం కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు డిపో ఆవరణలో మొక్కలు నాటారు. డిపో పరిసరప్రాంతాలు పరిశీలించారు. సమావేశంలో రీజియన్ మేనేజర్ భవానీ ప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం (మెకానికల్) రామయ్య, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, భైంసా డిపో మేనేజర్లు శ్రీనివాసులు, పండరీ, ప్రతిమారెడ్డి, రాజశేఖర్, హరిప్రసాద్, అన్ని డిపోల ట్రాఫిక్, గ్యారేజీల ఇన్చార్జీలు పాల్గొన్నారు. 369 స్పెషల్ బస్సులు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సన్నద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని ఆయా డిపోల నుంచి 369 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన చెన్నూర్ బస్పాయింట్ నుంచి 70 బస్సులు, ఆసిఫాబాద్ నుంచి 10, బెల్లంపల్లి పాయింట్ నుంచి 79, భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్ బస్పాయింట్ నుంచి 45, నిర్మల్ డిపోకు చెందిన 50 బస్సులను మందమర్రి పాయింట్ నుంచి, మంచిర్యాల డిపోకు చెందిన 115 స్పెషల్ బస్సులను మంచిర్యాల పాయింట్ నుంచి నడిపించనున్నట్లు ప్రకటించారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అఽర్టీసీ అధికారులు వెల్లండిచారు. -
జాతరకు రెండు అంబులెన్స్లు కేటాయింపు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరకు రెండు అంబులెన్స్లు కేటాయించనున్నట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ సమ్రాట్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 ఫైలెట్లు, ఈఎంటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఫైలెట్లు విజయ్, బాపురావ్, నాందేవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రెగ్యులర్ వార్డెన్లను నియమించాలి
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ వార్డెన్లు, హెచ్ఎంలను నియమించాలని కోరుతూ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటేషన్ల విధానం రద్దు చేసి రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని, విద్యార్థుల భద్రత కోసం పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేయాలని, భోజన నాణ్యతను మెరుగు పరచి, మోనూ కఠినంగా అమలు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు చేపట్టాలని, సీసీ కెమెరాలు, రాత్రి వాచ్మెన్లను నియమించాలని కోరారు. -
కేస్లాపూర్ చేరిన ప్రచార రథం
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పుష్కరించుకుని జనవరి 18న నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజతో పాటు జాతర నిర్వహణపై ఈ నెల 23న కేస్లాపూర్లోని నాగోబా మురాడి నుంచి ప్రారంభమైన మెస్రం వంశీయుల ప్రచార కార్యక్రమం సోమవారం ముగిసింది. మండల కేంద్రంలోని గోండ్గూడలో మెస్రం వంశీయులు ఎడ్లబండికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం ప్రచారరథం కేస్లాపూర్ గ్రామానికి చేరుకోగా వారి ఆచారం ప్రకారం రాత్రి మడావి వంశీయుల ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం నాగోబా మురాడికి చేరుకుని మధ్యాహ్నం ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులతో సమావేశమై పవిత్రమైన గంగా జల సేకరణ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. ఈ ప్రచార ముగింపు కార్యక్రమంలో కటోడ మెస్రం హనుమంత్రావ్, మెస్రం కోసేరావ్, దేవ్రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్, తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అఽ దికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించి న ప్రజావాణికి తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సత్యనారాయణ తనకు భూమి మంజూరు చేయాలని, కడెం మండల కేంద్రానికి చెంది న ప్రభాకర్ రుణ సదుపాయం కల్పించాలని, వి విధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. -
విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
కాగజ్నగర్రూరల్: విహారయాత్రకు వెళ్లిన యువకుడు నీట మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని విలేజ్ నెం 1కు చెందిన మంజిత్ మండల్(35)ఆదివారం గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి విహార యాత్ర కోసం జగన్నాథ్పూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అక్కడ విందు చేసుకున్న అనంతరం మృతుడు చేపలు పట్టేందుకు వలతో నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువ ఉండడంతో వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. రాత్రి వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం గజ ఈతగాళ్లతో వెతికించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే మంజిత్ మండల్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు సుజిత్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కోత్వల్ కృష్ణ(43) గుండెపోటుతో మృతిచెందాడు. కృష్ణ జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన ఎక్కల్దేవి కృష్ణ వద్ద రూ.70వేలు తీసుకున్నాడు. అనంతరం రెండు ఫోన్నంబర్ల ద్వారా కృష్ణ సెల్ఫోన్కు ఫోన్పే చేయించాడు. ఆ రెండు నంబర్లు సైబర్క్రైంకు సంబంధించినవి కావడంతో ఎక్కల్దేవి కృష్ణ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నవంబర్ 3న కోత్వల్ కృష్ణను అరెస్ట్ చేసి జగిత్యాల స్పెషల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ సోమవారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలపడంతో జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఎస్కార్ట్ సిబ్బందితో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతివార్తను సబ్జైలర్ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్డీవో మదుసూదన్, రెండో అదనపు జుడిషియల్ మేజీస్ట్రేట్ నిఖిష ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో తీవ్రంగా రోధించారు. కృష్ణపై సూర్యపేట, ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిర్మల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు ఉంది. మొత్తంగా అతడిపై సుమారు 50 కేసుల వరకు ఉన్నట్లు సమాచారం. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: మాస్టర్ అథ్లెటిక్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మంచిర్యాల డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ సెక్యూరిటీ ఉద్యోగి తిరుపతి ప్రతిభ కనబరిచారు. ట్రిపుల్ జంప్ (9.32 మీటర్లు)లో ద్వితీయస్థానం సాధించారు. 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయస్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసపత్రం అందుకున్నారు. జనవరి చివరి వారంలో రాజస్థాన్లో నిర్వహించే పోటీల్లో పాల్గొనున్నాడు. తిరుపతిని డీఎం శ్రీనివాస్తో పాటు ఇతర అధికారులు అభినందించారు. -
గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు
బజార్హత్నూర్: స్వాతంత్య్రానికి పూర్వమే రాయిసెంటర్ల ఆవిర్భావం జరిగినా మూడు దశాబ్దాల క్రితం ప్రాచూర్యం పొందాయి. నిరక్షరాస్యత, అమాయకత్వం రాజ్యమేలుతున్న వెనుకబడ్డ గిరిజన జాతుల్లో ఇప్పటికీ రాయిసెంటర్లే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నవీన న్యాయానికి ఏమాత్రం తీసిపోకుండా ఉచిత న్యాయ తీర్పులు చెప్తూ ఆధునిక నాగరికతల్లోనూ వేళ్లూనుకున్నాయి. గిరిజనుల మధ్య తగాదాలకు, వివాదాలకు పరిష్కార మార్గాలకు దారిచూపుతున్నాయి. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య గొడవలే పోలీస్స్టేషన్లకు, కోర్టులకు వస్తుంటాయి. కానీ గిరిజన జాతుల మధ్య కేసులు మాత్రం ఆధునిక కోర్టుల వరకు వెళ్లవు. రాయిసెంటర్లలో గిరిజన పెద్దలు చెప్పే తీర్పులతోనే కేసులు సమసిపోతాయి. అందుకే నేటికీ గిరిజన సమాజంలో వీటికి ప్రత్యేకమైన విలువ ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే? గోండిభాషలో రాయి అంటే సలహా, నిర్ణయం, న్యాయం అనే అర్థాలు ఉన్నాయి. సెంటర్ అనగా కేంద్రం. ప్రారంభంలో సలహా కేంద్రాలుగా ప్రాచూర్యం పొందిన గిరిజన పంచాయతీలు క్రమేణ నిర్ణయ కేంద్రాలుగా మారాయి. కాలగమనంలో అవి గిరిజనుల న్యాయకేంద్రాలుగా రూపందుకున్నాయి. గోండురాజుల ఏలుబడిలో ఎవరికై నా ఎదైన సమస్య వచ్చినప్పుడు పెద్దల సలహా(రాయి) తీసుకునేవారు. సామాజిక సమస్యలు పరిష్కరించుకోడానికి గ్రామంలోని పెద్దలంతా ఒకచోట గుమిగూడి నిర్ణయానికి వచ్చేవారు. ఇప్పుడూ పద్ధతి ఏదైనా ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత సమస్య వస్తే పెద్దలు సమావేశమై న్యాయం చెబుతారు. అవే నేడు రాయిసెంటర్లుగా మారాయి. స్వరూపం... 20 నుంచి 40 గిరిజన గ్రామాల పరిధిలో ఒక రాయిసెంటర్ ఉంటుంది. ఆయా గ్రామాల్లోని పటేల్, దేవరి, మహాజన్, గట్యాల్ (గిరిజన జాతుల పెద్దలు) కలిసి 11 మంది కార్యవర్గంతో రాయిసెంటర్ ఏర్పడుతుంది. రాయిసెంటర్ పెద్దను సార్మేడి (అధ్యక్షుడు), ఉపమేడి(ఉపాధ్యక్షుడు), గీతాదార్ (కార్యదర్శి), ఖజాన్దార్(కోశాధికారి), అవాల్దార్ (సమాచారం), మిగతావారు సలహాదారులు గా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 120 రాయి సెంట ర్లు ఉన్నాయి. వీటన్నింటిపై జిల్లాస్థాయిలో ఉట్నూర్లోని గుస్సాడిగుట్టలో జిల్లా రాయిసెంటర్ ఉంది. అక్కడి పెద్దను జిల్లా మేడి అని సంభోదిస్తారు. నెలకోసారి సమావేశాలు నిర్వహిస్తారు. కుటుంబ, ఆ స్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గిరి జనులకు సంబంధించిన అనేక సమస్యలను గ్రామ పటేల్ పరిష్కరిస్తాడు. అతనితో కానిపక్షంలో ఆ కేసుల ను రాయిసెంటర్ కు బదిలీ చేస్తాడు. ఇక్కడా పరిష్కారం కాకుంటే డివిజన్ సెంటర్కు బదిలీ చేస్తారు. అక్కడా పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయిలో ఉట్నూర్ గుస్సాడిగుట్ట రాయిసెంటర్కు బదిలీ చేస్తారు. అక్కడ మూడుసార్లు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కాని పక్షంలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవోలను పిలిపించుకుని వారి సమక్షంలో సమస్య పరిష్కారం చేస్తారు. సద్గుణాలే సార్మేడిల ఎంపికకు అర్హతలు రాయిసెంటర్లో సా ర్మేడిగా ఎంపిక కా వడానికి ఎలాంటి ఉన్నత విద్య అవసరం లేదు. డ బ్బు, దర్పం పనికిరావు. సత్ప్రవర్త న, సేవాభావం, స ద్గుణాలే గిరిజన పెద్దగా ఎంపిక కావడానికి అర్హతలు. మత్తు పానీ యాలు సేవించకుండా ఉండటం. పొగ, చెడు అలవాట్లు లేకపోవడం వంటి గుణాలే సార్మేడి, జిల్లా మేడిలలో ఉంటాయి. ఎంపికై న తర్వాత వ్యసనాలకు అలవాటు పడితే తొలగించే అవకాశం ఉంది. సెంటర్ల బలోపేతానికి మడావి తుకారాం కృషి బ్రిటిష్ రీసెర్చర్ హైమన్డార్ప్ సూచనతో 1943 నిజాం పాలనలో రాయిసెంటర్లను మొదట ప్రారంభించారు. రాజ్గోండ్ సేవాసంస్థ గిరిజన సంప్రదాయంలో అంతర్భాగమై ఉన్న సెంటర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత మొదటి గిరిజన ఐఏఎస్ మడావి తుకారాంకు దక్కుతుంది. ఉట్నూర్ మండలం లక్సెట్టిపేట వాసి అయిన మడావి తుకారాం హైమన్డార్ప్ వద్ద గోండిభాష అనువాదకుడిగా పనిచేశారు. హైమన్డార్ప్ సూచనల మేరకు గిరిజన సంప్రదాయాలను బలోపేతం చేశారు. గిరిజన వ్యవహారాల్లో కీలకమైన షోడావాజన్ (16 రకాల వాయిద్యాలు), అట్రడెమ్సంగ్ (18 రకాల నృత్యాలు)ను పటిష్టం చేయడానికి తీవ్ర కృషి చేశారు. అందులో భాగంగానే రాయిసెంటర్లకు చట్టబద్ధత కల్పించారు. వీటి పరిధిలో ధాన్యాగారాలను (గ్రెయిన్ బ్యాంకులు) ఏర్పాటు చేసి గిరిజనులు ధాన్యం నిల్వ చేసుకుంటే ఐటీడీఏ ద్వారా వాటికి సమాన ధాన్యాన్ని సబ్సిడీపై అందజేశారు. పొదుపు సంఘాలను ప్రోత్సహించారు. ప్రొఫైల్ పంచాయతీలకే పరిమితం కాదు రాయిసెంటర్లు కేవలం పంచాయతీలు, న్యాయం చెప్పడానికే పరిమితం కాలేదు. అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. గిరిజనుల వ్యవహారాల్లో సంస్కరణలకు బాటలు వేస్తున్నాయి. సామూహిక వివాహాలను ప్రోత్సహించి అనవసర ఆర్థిక వ్యయాన్ని తగ్గిస్తున్నాయి. 2001లో ఇచ్చోడలో జరిగిన 106 గిరిజన పెళ్ళిళ్లలో రాయిసెంటర్ పాత్ర కీలకం. గిరిజనుల పెళ్లి సమయంలో వరుని కుటుంబం వధువు కుటుంబానికి ఆవు, మేక ఇచ్చే ఆచారాలను దూరం చేశారు. 1980–90 దశకంలో దేవ్దాన్ గోదాం(గ్రెయిన్ బ్యాంక్)లను ఏర్పాటు చేసి ధాన్యాలను రాయిసెంటర్ల ఆధ్వర్యంలో నిల్వ ఉంచే వారు. అగ్ని ప్రమాదాల్లో గిరిజన గూడేలు కాలిపోయినపుడు, కరువు పరిస్థితులు ఏర్పడినపుడు నిల్వ ధాన్యాన్ని పంచేవారు. ఆదివాసీల ఆందోళనకు సామరస్యంగా పరిష్కారం లంబాడీల వల్లే ఆదివాసీ గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 2017 డిసెంబర్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నెల రోజులపాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. శాంతి భద్రతలు చేయిదాటే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులను బదిలీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్గా దివ్యదేవరాజన్ వచ్చారు. ఆదివాసీల ఆందోళనకు గల కారణాలను పరిశీలించి ఆదివాసీ గిరిజన పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు రాయిసెంటర్లను వినియోగించుకున్నారు.న్యాయం జరుగుతుందని నమ్మకం ఎంతపెద్ద సమస్య ఉన్నా గిరిజనులు పోలీస్స్టేషన్, కోర్టు గడప తొక్కరు. ఆర్థిక, సామాజిక గొడవలను గ్రామ పటేల్ సమక్షంలోనే పరిష్కారం అవుతాయి. బలమైన సమస్య, గ్రామాల మధ్య గొడవలు రాయిసెంటర్లో పరిష్కారం చేసుకుంటారు. ఇక్కడే తమకు న్యాయం జరుగుతుందని గిరిజనులు నమ్ముతారు. – మెస్రం దుర్గు, జిల్లా మేడి గౌరవిస్తాం రాయిసెంటర్ల తీర్పులను గౌరవిస్తాం. కొంతమంది ఆదివాసీలు ఉన్నత ఉద్యోగాల్లోనూ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఉన్నా రాయిసెంటర్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోం. రాయిసెంటర్లను, సార్మేడిలను, జిల్లా మేడిని గౌరవిస్తాం. మా పూర్వీకులు అందించిన సంప్రదాయాలను కాపాడుకుంటున్నాం. – నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ ఏటా వార్షికోత్సవం 1943 నుంచి కొనసాగుతున్న రాయిసెంటర్లు నేటికీ గోండుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పనిచేస్తున్నాయి. సెంటర్లను 1987లో పునరుద్ధరించినప్పటి నుంచి ఉట్నూర్ కేంద్రంగా స్థానికంగా ఉన్న గోండు రాజుల పురాతన కోటలో జిల్లాలోని సార్మేడిల ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్ 31న వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. – తొడసం దేవరావ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా రాయిసెంటర్ గిరిజనుల న్యాయస్థానం భారత న్యాయ వ్యవస్థలో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్న విదివిధానాలే గ్రామ స్థాయి రాయిసెంటర్ నుంచి జిల్లా రాయిసెంటర్ వరకు ఉంటాయి. గిరిజనుల సమస్య గ్రామ పటేల్ స్థాయిలో పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయి రాయిసెంటర్కు వెళ్తారు. అనేక సమస్యలు ఇక్కడే పరిష్కరిస్తారు. – డాక్టర్ తొడసం చందు, జిల్లా రాయిసెంటర్ సలహాదారు -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అభివృద్ధి పనుల హామీలు నెరవేర్చానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక ఐబీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రూ.255కోట్లతో కరకట్ట పనులు ప్రారంభించామని తెలిపారు. దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 74.40 కోట్లు విడుదలయ్యాయని, వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రిలో భవిష్యత్లో పడకలు పెంచుకునేలా నిర్మిస్తున్నామని అన్నారు. కాలేజీరోడ్డులో 350 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనులు జరుగుతుండగా, పాత ఆసుపత్రిని కూల్చి 100 పడకలతో నూతన ఆసుపత్రి నిర్మాణం చేపడుతామని తెలిపారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతిపక్ష నాయకులు నడిపెల్లి దివాకర్రావు, రఘునాథ్ వెరబెల్లిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీల్ చైర్లో పర్యటన ప్రేమ్సాగర్రావు దాదాపుగా గత నాలుగు నెలలుగా అనారోగ్యంగా ఉండి చికిత్స పొందారు. ఈ నెల 22న మంచిర్యాలకు వచ్చిన ఆయన కాలు కింద పెట్టలేని పరిస్థితుల్లో వీల్చైర్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్టీఏ కార్యాలయానికి.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి(ఆర్టీఏ) ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు విచ్చేశారు. ఇటీవల కొనుగోలు చేసిన నూతన టోయోట వెల్ఫైర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా, 0001 నంబరును ముందస్తుగా రూ.50 వేల ఫీజుతో బుకింగ్ చేసుకుని దక్కించుకున్నారు. దాదాపు రూ.కోటిన్నర విలువైన ఈ వాహనం ఇక్కడి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కావడం కూడా ఒక విశేషమే. -
కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి
కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధుల మంజూరుతోపాటు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ మట్టిపోసి వదిలేశాడు. సీసీ రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలి. – సాయికుటీర్ కాలనీ వాసులు, 7వ వార్డు, క్యాతనపల్లి మున్సిపాలిటీపన్ను కట్టలేదంటున్నారు.. గత ఏడాదికి సంబంధించిన ఇంటి పన్ను రూ. 4,810 మున్సిపాల్టీలో చెల్లించాను. ఈ ఏడాది పన్ను చెల్లించడానికి వెళ్తే గత ఏడాది పెండింగ్లో ఉందని, కట్టలేదని అంటున్నారు. రశీదు చూపించినా, కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. బిల్లు పరిశీలించి న్యాయం చేయాలి. – కే.మోహన్రెడ్డి, సున్నంబట్టివాడ, మంచిర్యాల -
● దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ ● ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ పథకంలో 21 ఆలయాలు.. ● మంచిర్యాల జిల్లాలో ఒక్క గుడికే చోటు
మంచిర్యాలఅర్బన్: ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్య పూజలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకంలో ఉమ్మడి జిల్లాకు శఠగోపం పెట్టింది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా ఆలయాల ఎంపిక మాత్రం రెండు పదులకు పరిమితం కావడం నిరాశకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఒకే ఆలయానికి చోటు దక్కడంపై పెదవి విరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు, కుమురంభీం ఆసిఫాబాద్లో రెండు, నిర్మల్ జిల్లాలో 13 ఆలయాలు మంజూరయ్యాయి. ఆలయాలకు దక్కని చోటు డీడీఎన్ పథకం కింద ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ అనంతరం 146 ఆలయాలు ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో 21 ఆలయాలు మాత్రమే ఈ పథకం కింద మంజూరయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల పైరవీలు, ఒత్తిడితో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆశించిన మేర ఆలయాలకు చోటు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనలు ఇలా.. ఈ పథకం కింద ఆలయాలు ఎంపిక కావాలంటే దేవాదాయ శాఖలో నమోదై నిత్య పూజలు నిర్వహిస్తుండాలి. జాతర సందర్భాల్లో తెరిచే ఆలయాలకు పథకం వర్తించదు. ఆలయానికి ఆదాయం వచ్చే ఎలాంటి భూములు ఉండకూడదు. ఆలయంలో ఒక అర్చకుడికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలకు వర్తించదు. రాష్ట్రంలో 2007లో తీసుకొచ్చిన ఈ పథకం కింద ఒక్కో గుడికి రూ.2,500 చెల్లించేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచారు. పూజ సామగ్రికి రూ.4వేలు, అర్చకుడికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. దరఖాస్తుల వడపోత అనంతరం ప్రత్యేక కమిటీ వందల సంఖ్యలో ఎంపిక చేసి నివేదించినా మంజూరు మూడు పదులకై నా చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరిన్ని ఆలయాలకు మంజూరు అవకాశం కల్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.మంజూరైన ఆలయాలు ఇవే..శ్రీరామ సత్యనారాయణస్వామి ఆలయం(దంతన్పల్లి), నల్లపోచమ్మ ఆలయం(ఖా నాపూర్), దత్తాత్రేయ స్వామి ఆలయం(బా దన్కుర్తి), శివపంచాయతన అభయాంజనే య స్వామి ఆలయం(మాసాయిపేట్), అభయాంజనేయస్వామి ఆలయం(ఆదిలాబాద్ టౌన్), వీర హనుమన్ టెంపుల్(కోలిపూర్ ఆదిలాబాద్టౌన్), హనుమాన్ టెంపుల్(జందాపూర్, ఆదిలాబాద్), అడెల్లి పోచమ్మ ఆలయం(సారంగాపూర్), హనుమాన్ టెంపుల్(వాడి భైంసా), వేంకటేశ్వరస్వామి ఆలయం(సోఫీనగర్, నిర్మల్ టౌన్), జగదాంబ సేవాలాల్ ఆలయం(పారపెల్లి తండా, లక్ష్మ ణచాంద), కోదండరామాలయం(కౌట్ల–కే, నిర్మల్), ఆంజనేయస్వామి ఆలయం(నర్సాపూర్–జీ), మార్కండేయ స్వామి ఆలయం(దిలావర్పూర్), పెద్దమ్మ ఆలయం(గోపాల్పేట్, సారంగపూర్), భక్తాంజనేయ స్వామి టెంపుల్(బీబ్రా, దహెగాం), శివాలయం(అయనం, దహెగాం), పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం(తలమడుగు), కోదండ రామాలయం(మాదారం టౌన్షిప్, మంచిర్యాల)కు మంజూరు చేశారు.జిల్లా దరఖాస్తులు ఎంపిక చేసినవి మంజూరు ఆదిలాబాద్ 219 34 05కుమురంభీం 102 18 02మంచిర్యాల 110 34 01నిర్మల్ 295 60 13మొత్తం 726 146 21 -
విద్యుత్ తీగలు మార్చాలి
తీగల్పహాడ్లోని సర్వేనంబరు 15లో ఉన్న మా వ్యవసాయ భూమిలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. మార్చాలని పలుమార్లు విద్యుత్శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం భయంగా పని చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సవరించాలి. – సిలువేరి మధుకర్, తీగల్పహడ్, నస్పూర్ ప్లాట్లు.. పరిహారం ఇవ్వలేదు..ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన చందనపూర్ గ్రామస్తులకు పునరావాసం కింద 280 ప్లాట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 230 పాట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 50 ప్లాట్లు ఇవ్వలేదు. పరిహారం కింద రూ.3.75లక్షల ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు ప్లాట్లు, పరిహారం ఇవ్వలేదు. ఏళ్ల తరబడిగా తిరుగుతున్నాం. – చందనపూర్ భూ నిర్వాసితులు -
చంద్రవెల్లిలో పులి సంచారం
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి, చర్లపల్లి గ్రామాల అటవీ ప్రాంతంలో సోమవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామీణులు పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో పర్యటించి చంద్రవెల్లి–చర్లపల్లి గ్రామాల శివారు అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించారు. చంద్రవెల్లి, చర్లపల్లి, బుధాకలాన్, గురిజాల, చాకేపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారు జామున, రాత్రి పూట అటవీ ప్రాంతం వైపు రాకపోకలు సాగించవద్దని ఎఫ్ఆర్వో సూచించారు. రైతులు పొలాలకు వెళ్లే క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. -
సంక్రాంతికి ‘గూడెం ఎత్తిపోతల’ నీరు
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని కడెం ఆయకట్టు పరిధిలో డీ–30 నుంచి 42వరకు ప్రతియేటా సాగునీరందిస్తున్నారు. ఈసారి యాసంగి సీజన్ సాగుకు సంబంధించి సంక్రాంతి పండుగ నుంచి నీటి విడుదలకు అధికారులు చర్యలు చేపట్టారు. 2021, 2022లో గోదావరి వరద నీటిలో కంట్రోల్ప్యానల్ గది మునిగిపోవడం, కొంత సామగ్రి పాడవడం తెలిసిందే. ఆ సమయంలో మరమ్మతులు చేయించారు. కంట్రోల్ ప్యానల్ వరద నీటిలో మునిగి పోకుండా ఉండేందుకు ఎత్తయిన ప్రదేశంలో రూ.1.59కోట్లతో కొత్తగా గది నిర్మించారు. ప్రస్తుత గదిలోని సామగ్రిని అందులోకి మారుస్తున్నారు. శరవేగంగా సాగుతున్న పనులన్నీ సంక్రాంతి వరకు పూర్తి చేసి నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. పనులు పూర్తవగానే ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశాల మేరకు నీటి విడుదల తేదీని ప్రకటిస్తామని ఇరిగేషన్ డీఈ దశరథ్ తెలిపారు. -
● బల్దియాల్లో అమలుకు నోచుకోని వైనం ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ● విరివిగా నిషేధిత కవర్ల వినియోగం ● గతంలో తనిఖీలు, జరిమానాలు ● చెత్తలో వేయడంతో పర్యావరణానికి ముప్పు
‘ప్లాస్టిక్’పై నిషేధమేది..!మంచిర్యాలటౌన్: ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలన్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపాల్టీల్లో అమల్లోకి తెచ్చినా అమలు గగనంగా మారింది. గత ఏడాది ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై బల్దియాల్లో అధికారులు తనిఖీలు చేపట్టడం, జరిమానాలు విధించడం వల్ల కొంతవరకు వినియోగం తగ్గింది. గత కొంతకాలంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాస్టిక్ నిషేధంపై అధికారుల పర్యవేక్షణ లోపించి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోజు రో జుకు వినియోగం పెరిగిపోయి నగరంలోని వీధులు, చెత్తకుప్పల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు దర్శనమి స్తున్నాయి. పశువులు ప్లాస్టిక్ కవర్లు తిని మృత్యువా త పడుతుండగా, పర్యావరణ కాలుష్యానికి ప్లాస్టిక్ కవర్లు కారకమవుతున్నాయి. కనీస తనిఖీలు చేపట్టకపోవడం, జరిమానాలు విధించకపోవడం వల్ల వినియోగం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారుల సమావేశాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలూ చేయడం లేదు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం చూకపోవడంతోనూ జిల్లాలో వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. చర్యలేవి..? కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ను పూర్తిగా నిషేధించారు. 120మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి, ఒకసారి వాడినవి ఉన్నా, నిల్వ ఉంచినా, విక్రయించినా, ఉపయోగించినా పర్యావరణ పరిరక్షణ చట్టం(1986) ప్రకారం సీడీఎంఏ హైదరాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సామగ్రి జప్తు, రూ.5వేల నుంచి రూ.10వేల వరకు జరిమానా, లైసెన్స్ రద్దుతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నిషేధం అమలుకు ముందు నుంచే వ్యాపారులు, ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వారికి నిషేధంపై మున్సిపల్ అధికారులు వివరించి ప్రజల్లోనూ మార్పు తెచ్చేందుకు చేతి సంచితోనే కూరగాయల మార్కెట్కు రావాలని, ప్లాస్టిక్ నిషేధం ఉందని, ఎవరూ వినియోగించినా మున్సిపల్ చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ కనిపించినా వెంటనే మున్సిపల్ సిబ్బంది సీజ్ చేశారు. ఇది ఏడాది క్రితం వరకే చేసి ఆ తర్వాత అధికారులు ప్లాస్టిక్ కవర్లపై పట్టించుకోవడమే మానేశారు. దీంతో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించిన ప్రజలు తిరిగి ప్రారంభించారు. బట్ట సంచులను వాడిన వారి చేతుల్లో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. నిరంతర తనిఖీలు చేపట్టకపోవడంతో బట్ట సంచుల స్థానంలో తిరిగి ప్లాస్టిక్ కవర్లు అందుబాటులోకి వచ్చి వినియోగం విరివిగా మారింది. చెత్తకుప్పల్లో.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో వేసే చెత్తకుప్పల్లో అధిక భాగం ప్లాస్టిక్ కవర్లే కనిపిస్తున్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తోపాటు బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూరు, క్యాతన్పల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ప్రతీరోజు దాదాపుగా 150 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడితే అందులో నాలుగోవంతు ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇళ్లల్లో నుంచి వెలువడే చెత్తలో తడి, పొడి చెత్తను ప్లాస్టిక్ కవర్లలోనే వేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తున్నారు. దుకాణాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు చెత్తలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లలో వేస్తున్న చెత్తను కాలనీల్లోని చెత్త వేసే ప్రాంతాల్లో పడేయడంతో, ఏ కాలనీలో చూసినా చెత్తతోపాటు ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో నిత్యం దాదాపు 95 వేలకు పైగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని అంచనా. పశువులు రోడ్డు పక్కన ఉండే చెత్త, అందులోని ప్లాస్టిక్ కవర్లను తింటూ జీర్ణం చేసుకోలేక, అందులోని రసాయనాలు శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడుతున్నాయి. -
సాఫ్ట్బాల్ పోటీల విజేత మహబూబ్నగర్
మందమర్రిరూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మోడల్ స్కూల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో మహబూబ్నగర్ విజేతగా నిలిచింది. నిజామాబాద్, మహబూబ్నగర్ జట్లు ఫైనల్కు చేరుకోగా 3–2 స్కోర్ తేడాతో మహబూబ్నగర్ గెలుపొందగా నిజామాబాద్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా వరంగల్ టీం 9–8స్కోర్ తేడాతో వరంగల్ జట్టు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. గెలిచిన జట్లకు ఒలింపిక్ జిల్లా కార్యదర్శి రఘునాథ్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావు, డీఐఈవో అంజయ్య బహుమతులు, మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సారా తస్నీమ్, కోచ్లు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


