Mancherial
-
పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. -
జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలటౌన్: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీ పక్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రా వుతో కలిసి మంచిర్యాలలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.16.06 కోట్ల తో ఆరు వరుసల రహదారి, రూ.1.57 కోట్లతో రంగంపేట్లో డ్రెయినేజీ, రోడ్లు, రూ.65 లక్షలతో బృందావనంలో డ్రెయినేజీ, రూ.2.91 కోట్లతో రాజ రాజేశ్వరి కాలనీలో రోడ్లు, రూ.2.70 కోట్లతో సూర్యనగర్లో డ్రెయినేజీ, రూ.2 కోట్లతో హమాలీవాడ నుంచి తిలక్నగర్ వరకు డ్రెయినేజీ, రూ.3.37 కోట్లతో రాజీవ్నగర్లో రోడ్లు, రూ.2 కోట్లతో దొరగారిపల్లెలో డ్రెయినేజీ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచిర్యాలను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తామని తెలి పారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు హైదరాబాద్–కరీంనగర్–చాందా రహదారిపై 251/9 నుంచి 255/7 వరకు బీటీ రహదారితో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీలతో రవాణా సౌకర్యం మెరుగవుతాయని వివరించారు. రోడ్లు భవనాల శాఖ ఈఈ భవర్సింగ్, కమిషనర్ శివాజీ పాల్గొన్నారు. -
‘నమో భారత్’కు మోక్షమెప్పుడో?
● సిర్పూర్ కాగజ్నగర్–హైదరాబాద్ మార్గంలో నడపాలంటున్న ప్రయాణికులు బెల్లంపల్లి: రైల్వే శాఖ ఆధునికీకరించిన నమో భారత్ ర్యాపిడ్ రైలుపై ప్రయాణికులు గొప్ప ఆశలు పెట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్నగర్–హైదరాబాద్ మధ్య ఈ రైలును నడపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో తయారైన ఈ రైలును రాష్ట్ర రాజధానిని ముఖ్య నగరాలతో అనుసంధానం చేయడానికి రూపొందింది. ఆధునిక సౌకర్యాలు..నమో భారత్ ర్యాపిడ్ రైలు, గంటకు 130 కి.మీ. వే గంతో 300–350 కి.మీ. దూరం ప్రయాణించే సా మర్థ్యం కలిగి ఉంది. 12–16 ఏసీ చైర్కార్లతో, ఆటోమేటిక్ తలుపులు, ఆధునిక సౌచాలయాలు, చార్జింగ్ పోర్టులు, కవచ్ భద్రతా వ్యవస్థ వంటి సౌకర్యాలు ఈ రైలును ప్రత్యేకం చేస్తాయి. గుజరాత్, బీహా ర్లో ఇప్పటికే నడుస్తున్న ఈ రైలును తెలంగాణలో ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సిర్పూర్–హైదరాబాద్ మార్గంలో నడపాలని..సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ మధ్య భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్ల మధ్య 7 గంటల వ్యవధి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంది. నమో భారత్ రైలును ఈ రెండింటి మధ్యలో భాగ్యనగర్ తర్వాత నడిపితే ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, జనగాం, భువనగిరి వంటి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించాలని కోరుతున్నారు. పుష్కరకాలంగా నిరీక్షణ..పుష్కర కాలంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైళ్లు తప్పా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో పట్టాలెక్కిన కొత్త రైలు లేదు. 90% మూడో రైల్వేలైన్ పూర్తయినా, కొత్త రైళ్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు గడ్డం వశీకృష్ణ, గొడెం నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఈ రైలు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అన్ని ముఖ్య స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే, రైల్వే ఆదాయంతోపాటు ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. -
ఓంకార్ శతజయంతి పోస్టర్లు విడుదల
బెల్లంపల్లి: ఎంసీపీఐ(యూ)వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శతజ యంతి ఉత్సవాల పోస్టర్ను బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఓంకార్ ప్రజల పక్షాన అనేక పోరా టా లు చేశారన్నారు. తన జీవితాన్నీ ప్రజలకు అంకితం చేసిన నాయకుడని పేర్కొన్నారు. ఓంకార్ శతజయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్, పట్టణ కార్యదర్శి రమేశ్, మండల కార్యదర్శి సతీశ్, నాయకులు పాల్గొన్నారు. -
డప్పు కళాకారుడికి అవార్డు
జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు కొండుకూరి రాజుకు గద్దరన్న ఐకాన్–2025 అవార్డు లభించింది. హైదరాబాదులోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల, తెలంగాణ జేఏసీ నా యకుడు కవి గాయకుడు దరువు అంజన్న పాల్గొన్నారు. అవార్డులు ప్రదానంచేసి సత్కరించారు. కొండుకూరి రాజు అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నాగరాజుకు.. మందమర్రిరూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం కళాకారుడుడు అంతడుపు ల నాగరాజుకు సాయిఅలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ వారు గద్దర్ ఐకాన్ అవా ర్డు 2025ను ప్రదానం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అవార్డు అందుకున్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
భీమారం: ప్రకృతి ప్రకోపానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మండలంలోని పోతన్పల్లి, బూర్గుపల్లి, నర్సింగాపూర్, కాజిపల్లి గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘మాకు రెండెకరాల పొలం ఉంది. మరోఐదెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాం. కోతకు వచ్చిన సమయంలో ఈదురుగాలులుతో కురిసిన వర్షానికి పంట మొత్తం నేలమట్టమైంది. మీరే ఆదుకోవాలి’ అని పోతన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు జర్పుల స్వరూప ఎమ్మెల్యే ఎదుట బోరున విలపించింది. అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యమని కన్నీరు పెట్టుకుంది. ఇంత నష్టం జరిగినా అధికారులు ఎలాంటి సర్వేలు చేయలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వివేక్ వెంటనే కలెక్టర్ కుమార్ దీపక్కు ఫోన్ చేశారు. పంట నష్టం సర్వే చేయాలని సూచించారు. అనంతరం బాధిత రైతులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. 35 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపారు. నష్టపోయిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు పంటలను ప్రత్యక్షంగా చూపి వారి వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇళ్లకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో సర్వే జరిపి బాధితుల పేర్లు కలెక్టర్కు అందించాలని తహసీల్దార్ సదానందంను ఎమ్మెల్యే ఆదేశించారు. మామిడి పంటలు కూడా దెబ్బతిన్నాయని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి -
భగీరథ మహర్షి జయంతి
పాతమంచిర్యాల: కలెక్టరేట్లో జిల్లా వెనుకబ డిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ దివారం భగీరథ మహర్షి జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ హాజరై భగీరథ మహర్షి చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సగరుని ముని మనువడు అయిన భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి తీసుకువచ్చాడని చరిత్ర చెబుతుందన్నారు. ఈ సందర్భంగా సగర కు లస్థులు భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా సంక్షేమ అఽధికారి రవూఫ్ఖాన్, సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్రెడ్డి, ఈడీ దుర్గాప్రసా ద్, జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్, డీఆర్పీలు పాల్గొన్నారు. -
● రూ.కోట్లలో పెండింగ్.. నో గ్యారంటీ ● కొత్తగా ఐదు మిల్లులకు ట్యాగింగ్ ● పూర్తి స్థాయిలో రికవరీ కాకుండానే కేటాయింపులు
మంచిర్యాలఅగ్రికల్చర్: రూ.కోట్లు బకాయి ఉన్న రైస్మిల్లులకే మళ్లీ ధాన్యం కేటాయింపు జరుగుతోంది. బకాయితోపాటు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుండానే ధాన్యం తరలిపోతోంది. ఇప్పటికే ముప్పుతిప్పులు పెడుతున్న మిల్లర్లు సీఎంఆర్ ఏ మేరకు ఇస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి గత నెల 29వరకు 11 రైస్మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వగా.. 30న మరోసారి ఐదు మిల్లులకు ట్యాగింగ్ వచ్చింది. ఈ ఐదింటిలో నాలుగు గతంలో ధాన్యం దించుకుని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని, యాక్షన్ ధాన్యానికి సంబంధించి పెండింగ్ బకాయి చెల్లించనివి ఉన్నాయి. అయినా మళ్లీ ధాన్యం కేటాయించ డం గమనార్హం. జిల్లాలో 2022–23 యాసంగి నుంచి 2023–24 వానాకాలం సీజన్ల సీఎంఆర్ ధాన్యం తీసుకుని రూ.కోట్లు విలువైన బియ్యం ఇవ్వకుండా, యాక్షన్ ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. వీరికి సీఎంఆర్ ధాన్యం కేటాయించొద్దని, బ్లాక్లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటీసులూ జారీ చేశారు. జిల్లాలో ఒకరిద్దరిపై ఆర్ఆర్ యాక్టు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ ఇటీవల పలువురు మిల్లర్లు దొడ్డిదారిన సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు చేసుకుంటున్నారు. జన్నారం, హాజీపూర్, మందమర్రి ప్రాంతాల్లో బ్లాక్లిస్టులో ఉన్న పూర్తి స్థాయిలో బకాయి చెల్లించని మిల్లర్లకు ధాన్యం కేటాయించారు. జిల్లాలో ఇంకా బాయిల్డ్ రైస్మిల్లులు ఉన్నా బకాయిలు చెల్లించకపోవడంతో ధాన్యం కేటాయించలేదు. కొన్నింటికి మాత్రమే నాలుగు రోజుల క్రితం అనుమతి లభించింది. ఇంకా రూ.85కోట్లు పెండింగ్2022–23 సీజన్లో గోదాముల్లో నిల్వ చేసిన ధా న్యానికి తాము ఎందుకు నగదు చెల్లించాలని, మి ల్లు పేరిట కేటాయించి ధాన్యం తీసుకోకపోయినా నగదు చెల్లించాలనడం ఏమిటని కొందరు మిల్లర్లు ఉన్నతాధికారుల వద్ద వేడుకోవడంతో కొంత వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. జిల్లాలో బా యిల్డ్ రైస్మిల్లులు 19, రా రైస్మిల్లులు 35 ఉన్నా యి. రెండు సీజన్ల సీఎంఆర్ ఇవ్వకపోవడం, తనిఖీ ల్లో ధాన్యం నిల్వలు లేకపోవడాన్ని గుర్తించారు. సీఎంఆర్, యాక్షన్ ధాన్యానికి సంబంధించి రూ.138.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ధాన్యం దక్కించుకునేందుకు ట్యాగింగ్ కోసం అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఓ మిల్లర్ రూ.11కోట్ల మేర బకాయి ఉన్నా పలుకుబడి, కొంత నగదు చెల్లించి ట్యాగింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. కొందరు గత నెల 21న బకాయిలో 10 నుంచి 30శాతం చెల్లించి మిగతా బకాయిలు వారం పది రోజుల్లో చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా రూ.85కోట్లు బకాయి రావాల్సి ఉంది. ఇందులో ఒక మిల్లు బకాయి మొత్తం చెల్లించగా.. నాలుగు మిల్లులు రూ.కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకు గ్యారంటీ కూడా ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం బకాయిలు లేని మిల్లులు పది శాతం గ్యారంటీ, పాత బకాయి మరో 20శాతం అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు బ్యాంకు గ్యారంటీ లేకుండానే ధాన్యం కేటాయింపులు నడుస్తున్నాయి. జిల్లాలో ఓ మిల్లు ఎదుట బారులుతీరిన ధాన్యం లారీలుధాన్యం దక్కించుకునేందుకు..సీఎంఆర్ ధాన్యం కేటాయింపులకు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి ధాన్యం దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర కమిషనరేట్, కలెక్టరేట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఓ మిల్లర్ తనకున్న పలుబడితో ఎలా కేటాయించరో చూస్తానని సవాల్ చేసి మరీ దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. పెద్ద పెద్ద మిల్లర్లు కొందరు మూలకు పడిన, వివిధ కారణాలతో ఆగిన మిల్లులను అద్దెకు తీసుకుని ధాన్యం కేటాయింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ కొందరు అక్రమార్కులు ఇదే పద్ధతిలో కేటాయింపులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. కొందరు అధికారుల సహకారం వల్లే కేటాయింపులు జరిగినట్లు గతంలో మిల్లర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. హాజీపూర్, బెల్లంపల్లి మండలాల్లో రెండు రైస్మిల్లులు అద్దెకు తీసుకుని ఓ మిల్లు యజమాని గతంలో సీఎంఆర్ ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా రూ.కోట్లలో ప్రభుత్వానికి మొండి చేయి చూపడంతో క్రిమినల్ కేసు నమోదై జైలుకు వెళ్లారు. గడువు తీసుకున్న తర్వాతే.. పాత బకాయి ఉన్న మిల్లులు కొంత మేర చెల్లించిన వారితోపాటు మిల్లర్ల ప్రాపర్టీ, ఇతర ష్యూరిటీలు, పాత బకాయి చెల్లింపునకు గడువు తీసుకున్న తర్వాత ధాన్యం కేటాయిస్తున్నాం. ధాన్యం కేటాయింపు కలెక్టర్ నిర్ణయం మేరకే జరుగుతుంది. – శ్రీకళ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని నౌవాడకు చెందిన దీపక్ (25), మిత్రుడు నితీశ్ ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్పై నాగ్పూర్వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని మన్నూర్ జాతీయ రహదారి పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో దీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన నితీశ్ను పోలీసులు అంబులెన్సులో రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. -
● బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో సందడి ● గత నెల 28న మార్కెట్ ప్రారంభం ● రైతులకు తగ్గిన రవాణా భారం ● కమీషన్ ఏజెంట్లతో కొనుగోళ్లు చేస్తున్న నాగ్పూర్ వ్యాపారులు ● బాక్స్ల్లో ఇతర ప్రాంతాలకు ఎగుమతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో మామిడికాయల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గత నెల 28న మార్కెట్ను లాంఛనంగా ప్రారంభించగా చిన్న, సన్నకారు రైతులు మార్కెట్లో మామిడికాయల అమ్మకాలు సాగిస్తున్నారు. రోజువారీగా క్వింటాళ్ల కొద్ది మామిడికాయలు మ్యాంగో మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న దశేరి, బంగెనపల్లి, హిమాయతి, మల్లిక, తోతపురి తదితర రకాల మామిడి కాయలు లభిస్తున్నాయి. స్థానిక ట్రేడర్స్తో పాటు నాగ్పూర్కు చెందిన బడా వ్యాపారులు కొందరు కమీషన్ ఏజెంట్లను పంపించి కాయల కొనుగోళ్లు చేపడుతున్నారు. కొనుగోలు చేస్తున్న మామిడి కాయలను మార్కెట్లో కూలీలతో గ్రేడింగ్ చేయించి బాక్స్ల్లో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి నాగ్పూర్, అమరావతి, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అమ్మకం, కొనుగోలు దారులతో మ్యాంగో మార్కెట్ సందడిగా మారింది. స్థానికంగా మామిడి కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతాంగానికి రవాణా భారం గణనీయంగా తగ్గింది. దళారుల ప్రమేయం లేకుండా.. మామిడి రైతులు దశాబ్దాల నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి మామిడి కాయల అమ్మకాలు సాగించేవారు. అక్కడ బడా వ్యాపారులు, దళారులు కుమ్మకై ్క మద్దతు ధర దక్కకుండా చేసి రైతులను తీవ్రంగా వంచించేవారు. మార్కెట్ ఆవరణలోకి మామిడికాయలతో అడుగు పెడితే చాలు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్కు శిస్తు కట్టడంతో పాటు పంట ఉత్పత్తులు అమ్మి పెట్టినందుకు దళారికి కమిషన్ చెల్లించుకోవాల్సి వచ్చేది. కానీ బెల్లంపల్లి మార్కెట్లో దళారుల ప్రమేయం లేకుండా, మోసాలకు తావులేకుండా పంటను అమ్ముకునే సౌకర్యం కలిగింది. మద్దతు ధర లేకుంటే పంటను మరోప్రాంతానికి తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ మామిడి కాయల క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మ్యాంగో మార్కెట్కు కళ వచ్చింది.మామిడి కాయలను తూకం వేస్తున్న సిబ్బందిమార్కెట్లో కాయలను గ్రేడింగ్ చేస్తున్న కూలీలు గత ఆరురోజుల్లో మామిడికాయల విక్రయాల వివరాలు.. మార్కెట్కు అమ్మకానికి వచ్చిన మామిడికాయలు 3,000 క్వింటాళ్లు చెల్లించిన మద్దతు ధర రూ.21,000 (కనిష్టం), రూ.53,000 (గరిష్టం) అమ్మకానికి తెస్తున్న మామిడి రకాలు దశేరి, బంగెనపల్లి, హిమాయతి, మల్లిక, తోతపురి పంట అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు 165 మందిమద్దతు ధర కల్పించాలి మామిడి తోటలపై ఎన్నో ఆశలు పెంచుకున్న రైతులకు ఏటా మద్దతు ధర దక్కడం లేదు. వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసి పంట నేలపాలై నష్టపోతున్నాం. మరోవైపు మద్దతు ధర రాక మరిన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. రైతులు నష్టాల పాలు కాకుండా మామిడికి గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – రాజన్న యాదవ్, రైతు, పొట్యాల కోరిక నెరవేరింది.. మ్యాంగో మార్కెట్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. ఇప్పటివరకు నాగ్పూర్కు పంటను తీసుకెళ్లి నష్టాల పాలయ్యాం. రవాణా చార్జీలు భారంగా ఉండేవి. కానీ ప్రస్తుతం బెల్లంపల్లి మార్కెట్ ఆ బాధలు తప్పాయి. నాగ్పూర్ మార్కెట్ కన్నా బెల్లంపల్లి మార్కెట్ చాలా నయం.– బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి -
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని పూలాజీబాబానగర్లో మండాలి బక్కన్న ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని పూలాజీబాబా నగర్కు చెందిన మండాలి బక్కన్న కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లాడు. రాత్రి 10.30 గంటలకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారం, రూ.లక్ష 50వేల నగదు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దొంగలు ఇంటి వెనుకవైపు ఉన్న కిటికీ నుంచి పారిపోయారని తెలిపారు. ఎస్సై సాయన్న అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందం రప్పించి దర్యాప్తు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాఠశాలల అభివృద్ధికి ‘కడేర్ల’ సూచనలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కడేర్ల రంగయ్య పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో గత మూడు రోజులుగా 33జిల్లాల డీఈవోలకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని హెచ్ఎంలకు పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు అవకాశం కల్పించగా.. అందులో రంగయ్య ఒకరు కావడం గమనార్హం. ఆదివారం ఆయన బడిలో విద్యార్థుల సంఖ్యను 55నుంచి 200కు పెంచడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, డిజిటల్ తరగతులు, పదేళ్లుగా ఉచితంగా తన సతీమణి కడేర్ల వీణ విద్యాబోధన చేయడం, సూపర్ 100 విద్యార్థులతో విద్యాబోధన, ఎఫ్ఎం సావర్ఖేడా రేడియో స్టేషన్ ఏర్పాటు, పాఠశాల అభివృద్ధికి సొంతంగా రూ.లక్ష, గ్రామస్తులు, తల్లిదండ్రులు, దాతల విరాళాల సేకరణ, గ్రామంలో మద్యపాన నిషేధం కోసం ధర్నా చేపట్టడం, రంగయ్యను ప్రేరణాత్మక కథనంతో పోల్చి ‘సర్’ చిత్ర నిర్మాతలు రూ.3లక్షలు విరాళం అందజేయడం తదితర అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమాలపై పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి యోగితారాణా, జేడీ రాజీవ్, ఆర్జేడీ సత్యనారాయణ తదితరులు రంగయ్యను అభినందించారు. పాఠశాలల అభివృద్ధికి మీ అనుభవాలు, సేవలు ఎంతో అవసరమని కొనియాడారు. -
చేపల వల చుట్టుకొని జాలరి మృతి
సోన్: చేపల వేటకు వెళ్లి వల చుట్టుకుని జాలరి మృతి చెందిన ఘటన గాంధీనగర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన సాలోకె బసవరాజ్ (47) శుక్రవారం రోజూ మాదిరి తెప్ప తీసుకుని చేపలు పట్టడానికి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులోకి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈక్రమంలో శనివారం ప్రాజెక్టు నీళ్లలో కాళ్లకు చేపల వల చుట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. బసవరాజ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కే.గోపి తెలిపారు. బసవరాజ్కు ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. జంట ఆత్మహత్యాయత్నంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని సీసీఐ టౌన్షిప్లో ఓ జంట గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గడ్చందాకు చెందిన ఓ యువతి, బాలరాజు ఇదివరకే ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్లో బాలరాజు పెళ్లికి నిరాకరించగా లోకేశ్వరం పోలీస్స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలరాజును రిమాండ్కు తరలించారు. నెల రోజులపాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా ఆ యువతికి నాలుగు రోజల క్రితం మామడ మండలం బండల ఖానాపూర్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. శనివారం తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్లే క్రమంలో నిర్మల్ పట్టణానికి చేరుకున్నాక తనకు పని ఉందని కొద్దిసేపు ఇక్కడే ఉండమని భర్తకు చెప్పి అక్కడి నుంచి ప్రియుడితో కలిసి ఆదిలాబాద్కు వచ్చింది. పట్టణంలోని సీసీఐ టౌన్షిప్లో సాయంత్రం నాలుగు గంటలకు వెంట తెచ్చుకున్న గడ్డిమందును ఇద్దరు కలిసి తాగారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వారిని గమనించి 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునీల్కుమార్ను సంప్రదించగా.. జంట ఆత్మహత్యకు యత్నించగా రిమ్స్లో చేర్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ‘దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి గుణపాఠం చెప్పాలి’రెబ్బెన(ఆసిఫాబాద్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా ఈనెల 20న జరగబోయే సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అంబాల ఓదెలు, రాజశేఖర్లు పిలుపునిచ్చారు. శనివారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం నరేందర్కు సమ్మె నోటీసు అందజేశారు. వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా తయారు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు ధన్రాజ్, గోపాల్, ప్రభాకర్, కాంట్రాక్టు కార్మికులు శారద, అనిత తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం కార్యక్రమానికి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. మే 1 నుంచి 31వరకు ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా శిబిరాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలు గుట్కా, మద్యానికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు, యువత, మహిళల ఆధ్వర్యంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షిషాలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చావ్ల, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో జీవన్రెడ్డి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, పార్థసారథి, గ్రామ పటేల్ వెంకట్రావ్, బాదిరావ్, ఆనంద్రావ్ తదితరులు ఉన్నారు. -
రెండు నెలల్లో కొత్త కోర్టు భవనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో కోర్టు భవన నిర్మా ణం మరో రెండు నెలల్లోగా పూర్తవుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య అన్నారు. శనివారం బెల్లంపల్లి మున్సిఫ్ కోర్టు, కొత్త కోర్టు భవనం పనులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పనులు 90శాతం వర కు పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారుల ను ఆదేశించారు. అంతకుముందు మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తికి జడ్జి ముకేష్, న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సబ్ జడ్జి రామ్మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘గడ్కరీ’ సభ విజయవంతం చేయండి
చెన్నూర్/మంచిర్యాలటౌన్: ఈ నెల 5న కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ క్రా స్ రోడ్డులో కాగజ్నగర్–శ్రీరాంపూర్ నాలుగు వరుస జాతీయ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభ విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శనివారం ఆయన చెన్నూర్లో, మంచిర్యాలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు. జాతీయ రహదారి–363 నిర్మాణంతో రవా ణా సౌకర్యం మెరుగుపడిందని తెలిపారు. బహిరంగ సభకు జిల్లాలోని బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ కొయ్యల ఏమాజి, పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, గుండా ప్రభాకర్, వంగపల్లి వెంకటేశ్వర్రావు, బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, జాడి తిరుపతి, గర్రెపల్లి నర్సయ్య, కొండపాక చారి, కేవీఏం శ్రీనివాస్, బుర్ర రాజశేఖర్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ఉద్యోగులను ప్ర భుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ముఖ ద్వారం వద్ద ఈ నెల 7న ఆర్టీసీలో తలపెట్టిన సమ్మె వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిపో కన్వీనర్ గోలి శంకర్, కో–కన్వీనర్ సేని తిరుపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నలుగురికి కమిషనర్లుగా పదోన్నతి
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో వివిధ వి భాగాల అధికారులకు కమిషనర్లుగా పదోన్న తి కల్పిస్తూ సీడీఎంఏ డైరక్టర్ శ్రీదేవి శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన నలుగురికి మున్సిపల్ కమిషనర్లుగా పదో న్నతి లభించింది. మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్ కె.విజయ్కుమార్, సానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, మందమర్రి మున్సి పల్ మేనేజర్ నాగరాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ కమిషనర్లుగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం వీరికి ఏ మున్సిపాలిటీని కే టాయించకపోయినా, త్వరలోనే వివిధ ము న్సిపాలిటీలకు కమిషనర్లుగా వెళ్లనున్నారు. -
మద్యపానం బహిరంగమే..!
మంచిర్యాలక్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీసులు నిషేధం విధిస్తున్నా ఎక్కడా అమలు కు నోచుకోవడం లేదు. శనివారం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ వైన్షాపు వద్ద రైల్వేట్రాక్ పక్కన ఓ యువకుడు బహిరంగంగానే మద్యం సేవిస్తూ కనిపించాడు. పట్టపగలే ఓ వైన్స్షాపులో కొందరు యువకులు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి గొడవ పడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదనే ఉద్దేశంతో ఎకై ్సజ్ శా ఖ ఉన్నతాధికారులు మద్యం దుకాణంతోపాటు సి ట్టింగ్కు అనుమతి ఇస్తున్నారు. కానీ కొందరు మ ద్యంప్రియులు రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారు. మంచిర్యాలలో రాత్రి 9గంటలు దాటితే చాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరి సమీపంలో, హైటెక్ సిటీ, ఏసీ సీ క్వారీ రోడ్, గ్రీన్ సిటీ, తిలక్నగర్, రాజీవ్నగర్, హైటెక్ సిటీ క్లబ్ సమీపంలో మందుబాబులకు అ డ్డాగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానా న్ని పోలీసులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ● కలెక్టర్తో కలిసి పనుల పర్యవేక్షణ మంచిర్యాలరూరల్(హాజీపూర్): వచ్చే వైద్య విద్యా సంవత్సరం ప్రారంభంలోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ఇక్కడే ప్రారంభమయ్యేలా చూడాలని మంచిర్యాల ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదేశించారు. శని వారం జిల్లా కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి హాజీ పూర్ మండలం గుడిపేటలో ప్రభుత్వ వైద్య కళాశా ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రూ.216 కో ట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వై ద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచేలా ప్రత్యేక చ ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్టల్ భవనా నికి వేసిన గులాబీ రంగు తొలగించాలని ఆర్అండ్ బీ అధికారులకు సూచించారు. రోడ్లు, భవనాల శా ఖ డీఈఈ సజ్జత్భాషా, ఏఈఈ అనూష, కళాశాల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పనుల పరిశీలనలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ సివిల్ ఆసుప్రతి, జూనియర్ కళాశాల భవనం నిర్మాణ ప నులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమా ర్ దీపక్ శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో పనులు చేపట్టాలని తెలిపారు. -
హైవేపై ఆశలు
● ప్రతిపాదనల్లోనే బెల్లంపలి–గడ్చిరోలీ ఫోర్ లైన్ ● కేంద్ర మంత్రి ‘గడ్కరీ’ పర్యటనలో హామీ ఇస్తారా? ● ఆ రోడ్డు నిర్మిస్తే రెండు జిల్లాలకు ఉపయుక్తంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు, మహారాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన బెల్లంపల్లి గడ్చిరోలీ జాతీయ రహదారిని నిర్మించాలనే డి మాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ ప్రతిపాదిత రోడ్డు కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు లేకపోవడంతో ముందుకు కదలడం లేదు. ఇదే తీరుగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి–63పై గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. ఇక్కడ రెండు సార్లు అలైన్మెంటు మార్పులతోపాటు రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పీఎం ప్రాధాన్యత జాబితాలో చోటు దక్కడంతో మళ్లీ ముందుకు కదులుతోంది. తాజాగా కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో గడ్చిరోలీ వరకు నిర్మించబోయే ప్రాజెక్టుపై కదలిక వస్తుందని రెండు జిల్లాల వాసులు ఆశలు పెట్టుకున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బెల్లంపల్లి, తాండూరు, రెబ్బెన, కాగజ్నగర్, కౌటాల మీదుగా ప్రాణహిత దాటి గడ్చిరోలీ వరకు ఈ రోడ్డు ప్రతిపాదన ఉంది. గతంలో ప్రాణహిత తీరం వెంబడి, కౌటాల నుంచి గోదావరి మీదుగా కొత్త హైవేతో భద్రాచలం వరకు హైవే నిర్మించాలని ప్రతిపాదించినా అటవీ, సాంకేతిక అనుమతుల జాప్యంతో ఆ ప్రాజెక్టునే పూర్తిగా పక్కకు పెట్టారు. ఈ క్రమంలో గడ్చిరోలీ హైవే త్వరితగతిన పూర్తయితే ఈ రెండు జిల్లాలు మహారాష్ట్రకు సులువుగా ప్రయాణం సాగించే అవకాశం ఉంది. పూర్తయిన ఏడాదికి ప్రారంభంకేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డితో కలిసి జాతీయ రహదారి–363ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సోమవారం రెబ్బెన మండలం కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద జరిగే ప్రారంభోత్సవ వేడుకకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.3500కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు గత ఏడాది క్రితమే పనులు పూర్తయి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు సమీపం నుంచి రెండు సెక్షన్లుగా మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు మొత్తం 94.60కి.మీ రోడ్డు నిర్మించారు. ప్యాకేజీ–1 తాండూరు మండలం రేపల్లెవాడ, అక్కడ నుంచి గోయగాం వరకు నిర్మించి మందమర్రి, వాంకిడి మండలం కమాన వద్ద టోల్గేట్లు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు. ప్యాకేజీ–1 2020లో పనులు ప్రారంభం కాగా, ప్యాకేజీ–2 మాత్రం 2021లో మొదలయ్యాయి. కరోనా, వంతెనలు, ఇతర కారణాలతో జాప్యం జరిగింది. అయితే చివరకు పూర్తయింది. మందమర్రి మండలం పులిమడుగు వద్ద ఎన్హెచ్–363 ఫ్లై ఓవర్పై మరమ్మతులు నాణ్యతపై సందేహాలుజాతీయ రహదారి–363 నిర్మాణంలో నాణ్యతపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్లంపల్లి కన్నాల క్రాస్ వద్ద, రెబ్బెన మండలం తక్కెళ్లపల్లి వద్ద వన్యప్రాణుల అండర్ పాస్, గోయగాం చివరన యానిమల్ ఓవర్పాస్ నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో భూ సేకరణ జరిగిన వరకు ఆధీనంలోకి తీసుకోకపోవడం, లైట్లు, మరమ్మతులు, నిర్వహణ లోపం కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రోడ్డు దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణదారు 15ఏళ్లు నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరో 14ఏళ్లు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ క్రమంలో భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు దెబ్బతినకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. -
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం నస్పూర్: ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పట్టణ పరిధిలో కేజీబీవీలో శనివారం ఆయన జిల్లా స్థాయి వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానంతోపాటు వినోదాన్ని పాఠ్య, పాఠ్యేతర అంశాలను నేర్చుకోవడానికి వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయ కర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈఓ దామోదర్రావు, స్పెషల్ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు. రైతుల సౌకర్యార్థం లారీల సంఖ్య పెంపు మంచిర్యాలఅగ్రికల్చర్: వరిధాన్యం తరలింపునకు అవసరమైన లారీల సంఖ్యను పెంచుతామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్లో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సెక్టార్–1, 2, 3, 4 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైస్మిల్లులకు ధాన్యం సరఫరాలో జాప్యం జరగకుండా లారీ సంఖ్య పెంచే విధంగా ట్రాన్స్ఫోర్ట్ యజమానులు సహకరించాలని తెలిపారు. జిల్లాలోని రైస్మిల్లులో దిగుమతి ఆలస్యం అవుతున్నట్లయితే కరీంనగర్కు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ట్రాన్స్ఫోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ మంచిర్యాలఅగ్రికల్చర్: శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరుపేద, అణిచివేతకు గురైన, ఇతర బాధిత బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 17లోగా జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగం బాలరక్షా భవన్, 9908541697, 9441506519 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
కరీంనగర్ జిల్లా మిల్లులకు ధాన్యం తరలింపు
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘బస్తా దిగదు.. బండి కదలదు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సే కరణ వేగవంతంతోపాటు లోడింగ్, అన్లోడింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైస్మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ కాక రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయని కథనంలో ప్రస్తావించడం తెలిసిందే. అన్లోడ్ సమస్య పరిష్కారానికి పక్క జిల్లాలోని మిల్లులకు తరలించాలని సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం నుంచి కరీంనగర్ జిల్లాలోని 26 రైస్మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చి ధాన్యం తరలిస్తున్నా రు. ఇప్పటివరకు 3,371 మంది రైతుల నుంచి 30,516.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిల్లులకు 20,407.400 మెట్రిక్ టన్నుల ధా న్యం తరలించగా.. ఇంకా 10,108.760 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది. ఎఫెక్ట్ -
గాలి వాన బీభత్సం
జిల్లాలో కురిసిన వర్షంఅపార నష్టం భీమారం: మండలంలో వర్షానికి అపార నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కోతలకు వచ్చిన వరిపంట నేలవాలింది. భీమారం–నెన్నెల ప్రధాన రహదారిలో కొత్తగూడెం నుంచి నర్సింగాపూర్ వరకు పెద్ద ఎత్తున చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు చెట్లను ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. బూర్గుపల్లి, కాజిపల్లి, భీమారం, నర్సింగాపూర్ గ్రామాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయి చాలా దూరంలో పడ్డాయి. దీంతో కాజిపల్లి గ్రామానికి చెందిన బాధితులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. బూర్గుపల్లిలోని పలు తోటల్లో 40 ఏళ్ల వయస్సు గల మామిడి చెట్లు వేళ్లతో సహా పడిపోయాయి. ప్రభుత్వం నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జైపూర్: మండలంలో గురువారం రాత్రి భారీ ఈదురుగాలుల వర్షానికి మామిడి కాయలు నేలరాలయి. కిష్టాపూర్, వేలా ల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్డు వైపు ఉన్న పెద్దపెద్ద చెట్లు నెలకొరిగాయి. కిష్టాపూర్, శివ్వారం, పౌనూర్లో రేకులతో నిర్మించుకున్న ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి ధాన్యం తడిసింది. వేమనపల్లి: మండలంలోని నీల్వాయి, నాగారాం గ్రామాల్లో తోటల్లో మామిడికాయలు నేలపాలయ్యాయి. కోతకు వ చ్చిన వరి పైరు నేలవాలగా.. పలు గ్రా మాల్లో కళ్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. చేతికొచ్చిన వరి ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పంటలను నీట ముంచేసింది. దిగుబడి దశలో ఉన్న మామిడి నేలరాలింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలో 5.2మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నెన్నెల, భీమారం, జైపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయి రూ.30లక్షల నుంచి రూ.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులతో చెట్లు విరిగి ఇళ్లు, రోడ్లు, విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో 33కేవీ లైన్ స్తంభాలు 5, 11కేవీ లైన్ స్తంభాలు 92, ఎల్టీ స్తంభాలు 99, ట్రాన్స్ఫార్మర్లు 14 నేలకూలాయి. విద్యుత్ శాఖకు రూ.50లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. జైపూర్, భీమారం, నెన్నెల, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు విరిగి, తీగలు తెగిపడి నష్టం తెచ్చిపెట్టాయి. గురువారం రాత్రి నుంచి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. శుక్రవారం మధ్యాహ్నం వరకు పనులు చేపట్టి సరఫరా పునరుద్ధరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసింది. జిల్లాలో పంట నష్టం జిల్లాలో గురువారం రాత్రి వీచిన ఈదురుగాలు లు, అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాన్ని శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. నెన్నెల, భీ మారం, జైపూర్ మండలాల్లో 83మందికి చెందిన కోత దశలో ఉన్న వరి పంట 133ఎకరాల్లో దెబ్బ తిన్నట్లు గుర్తించారు. 1386 ఎకరాల్లోని మామిడితోటల్లో 33శాతం పైబడి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. చెట్లకొమ్ములు విరగడంతోపాటు వేర్లతో నే లకు వంగడం, కాయలు నేలరాలినట్లు తేల్చారు.నేలకొరిగిన వరి పంట నెన్నెల/భీమిని: నెన్నెల మండలం గంగారాం, నెన్నెల, కొత్తగూడం గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చిత్తాపూర్, నార్వాయిపేట, ఆవుడం, గంగారాం, చిన్నవెంకటాపూర్, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో 800 ఎకరాల్లో మామిడికి, 300 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంగారాం, చిన్నవెంకటాపూర్, పొట్యాల, కొంపల్లిలో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగి ధాన్యం రాలింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో 16గంటలపాటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఏఈ రాజ న్న సిబ్బందితో కలిసి మరమ్మతులు చేసి అంతరాయం లే కుండా చర్యలు తీసుకున్నారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి గోడలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వృక్షాలు నేలకూలి రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రూ.లక్షల్లో నష్టం ఏర్పడిందని, అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ● ఒక్కసారిగా గాలివాన రావడంతో కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో జంపాల అంజన్న రేకుల టేల ఎగిరి ఇంటిపై పడింది. ఇంటిపై ఉన్న రేకులు పగలడంతో నష్టం జరిగింది. చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. రాంపూర్ రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తడిసిన ధాన్యం చెన్నూర్రూరల్: మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. లంబడిపల్లి, లింగంపల్లి, అక్కెపలి, అంగ్రాజ్పల్లి, కిష్టంపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యంపై కవర్లు కప్పారు. కొన్ని చోట్ల కవర్లపై నీరు చేరి కొంత మేర ధాన్యం తడిసింది. వర్షపు నీరు చేరడంతో రైతులు నీటిని ఎత్తి పోస్తున్నారు. ఆకాశంలో మబ్బులు అలాగే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులకు చెన్నూర్–మంచిర్యాల ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరిగాయి. శుక్రవారం వాటిని తొలగింపజేశారు. నేలరాలిన మామిడి విరిగిన విద్యుత్ స్తంభాలు కూలిన ఇళ్ల పైకప్పులు 5.2 మిల్లీమీటర్ల వర్షపాతంమండలం వర్షపాతం (మిల్లీమీటర్లలో) భీమారం 23.8 నెన్నెల 21.3 చెన్నూర్ 12.3 జైపూర్ 10.8 భీమిని 9.1 కన్నెపల్లి 6.5 కోటపల్లి 6.5 వేమనపల్లి 2.2 -
రైస్మిల్లర్లు లక్ష్యాలను పూర్తి చేయాలి
మందమర్రిరూరల్: రైస్మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల ని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంబికాసాయి, వాసవి, లక్ష్మీగణపతి, వెంకటేశ్వర రైస్మిల్లులను తహసీల్దార్ సతీష్కుమార్శర్మతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం లారీలను లోడ్తో గంటల తరబడి వేచి ఉంచొద్దని, అవసరమైన హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, వెంటనే అన్లోడ్ చేసి పంపించాలని తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం సందర్శించారు. వడదెబ్బపై అవగాహన కల్పించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● జెడ్పీ సీఈవో గణపతి ● ఎంపీడీవో, ఎంపీవో, సూపరింటెండెంట్కు నోటీసులు మందమర్రిరూరల్: విధుల నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జెడ్పీ సీఈవో గణపతి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో రాజేశ్వర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందే విధంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం, సంక్షేమ ఫలాల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఉదయం 10గంటలకు కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంపీడీవో, ఎంపీవోతోపాటు సిబ్బంది కూడా లేరు. దీంతో సమయపాలన పాటించలేదని ఎంపీడీవో, ఎంపీవో, ఆఫీస్ సూపరింటెండెంట్, ఎనిమిది మంది ఆఫీస్ సిబ్బందితోపాటు ఉపాధి హామీ సిబ్బందికి జెడ్పీ సీఈవో గణపతి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
వాహన అనుమతిపై సందిగ్ధం
● పది రోజులుగా యజమాని పరేషాన్ ● ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వాహనాల అనుమతిలో కంపెనీ పేర్కొన్న.. రవాణా శాఖ అధికారులు ఇచ్చే అనుమతుల్లో తేడాలు వస్తున్నాయి. జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరుకు చెందిన జంగా రమేశ్రెడ్డి ఆరు టైర్ల ఇంజన్ కలిగిన ఐదు భారీ వాహనాలు కొనుగోలు చేశారు. ట్రెలర్తో కలిపి 22టైర్ల డబుల్ క్రోన్(టైర్ల సస్పెన్షన్) వాహనానికి జీవీడబ్ల్యూ(గ్రాస్ వెయిట్ వెహికిల్) 55టన్నులు(ఖాళీ ఇంజిన్, మోసే బరువు సహా) సామర్థ్యం అనుమతి ఇచ్చారు. మరో 18టైర్ల సింగిల్ క్రోన్ నా లుగు వాహనాలకు 54టన్నులు అనుమతి కోరితే, స్థానిక ఎంవీఐ తనిఖీ చేసి 45.5టన్నులకే అనుమతి ఇచ్చారని తెలిపారు. వాహన కంపెనీ ప్రతినిధులు 54టన్నుల జీవీడబ్యూతో ఎస్టీఏ(స్టేట్ ట్రాన్స్పోర్టు అథారిటీ) అనుమతి ఉందని చెబితేనే కొనుగోలు చేశానని, గత పది రోజులుగా యజమాని ఆర్టీఏ అధికారులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిబంధనల మేరకే సామర్థ్య అనుమతి ఇచ్చామని, ఏదైనా జీవో ఉంటే తీసుకు రావాలంటూ డీటీవో సంతోశ్కుమార్ యజమానికి సూచించారు. దీంతో ఆ య జమాని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ సంప్రదించగా, ఇంకా ఈ వాహనాల సామర్థ్యాలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వాహన తయారీ కంపెనీ ప్రతినిధులు ఎస్టీఏ నుంచి నిర్ణీత సామర్థ్యానికి అప్రూవ్ ఉందంటున్నారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేశానని, డీడీలకే రూ.6లక్షలకు పైగా చెల్లించానని, తీరా అనుమతి రాకపోతే నష్టపోతానని యజమాని వాపోతున్నారు. దీనిపై డీటీవోను ‘సాక్షి’ వివరణ కోరగా, నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చామని, మరోసారి పరిశీ లిస్తామని తెలిపారు. సాధారణంగా ఆర్టీఏ అధికా రులు వాహన ఇంజన్, టైర్లు, సింగిల్, డబుల్ క్రోన్ సామర్థ్యాలు, ముందు, వెనక భాగాల్లో నిర్మాణం, ట్రెలర్ అమరిక, సాంకేతికత, తదితర పరిశీలించి, ఎస్టీఏ ప్రకారం సామర్థ్య అనుమతులు జారీ చేస్తారు. ఆమేరకే వాహనాల్లో లోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇంటర్నేషనల్ కరాటే సెమినార్లో ప్రతిభ
బెల్లంపల్లి: కేరళ రాష్ట్రంలో గతనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ ఇంటర్నేషనల్ సిటోరియా కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా టెక్నికల్ సెమినార్లో మాస్టర్లు ప్రతిభకనబర్చారు. పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొనగా, రాష్ట్రం నుంచి ఏడుగురు మాస్టర్లు హాజరయ్యారు. టెక్నికల్ సెమినార్లో నైపుణ్యత కనబర్చిన మాస్టర్లకు జపాన్కు చెంనని కేఎస్కేఎస్ఐ ఫౌండర్ గ్రౌండ్ మాస్టర్ సోకే కేఎన్యూమ భూని ప్రతిభ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్టిఫికెట్లు అందుకున్న వారిలో రమేశ్కుమార్, విజ్జగిరి రవి, సారిక రాజు, మారపాక దేవయ్య, ఎస్.సురేశ్, సోలంకి అశోక్, నారాయణ శెట్టి శ్రీనివాస్ ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు. -
సీపీఆర్ఎంఎస్లో గందరగోళం
శ్రీరాంపూర్: సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు సంస్థ కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం(సీపీఆర్ఎంఎస్) సదుపాయం కల్పించింది. ఈ స్కీం కింద హెల్త్కార్డులు పొందిన కార్మికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తమకు కార్డులో ఎంత మొత్తం ఖర్చయిందో, ఇంకా ఎంత మిగిలి ఉందో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు ఈ స్కీం కింద చేరాలంటే రూ.60 వేలు ముందుగా చెల్లించాలి. గతంలో ఈ మొత్తం రూ.40 వేలుగా మాత్రమే ఉండేది. ఈ మొత్తాన్ని సర్వీసులో ఉండగానే రికవరీ చేస్తారు. ఈ స్కీం రాక ముందు రిటైర్డ్ అయిన వారు తర్వాత డబ్బులు చెల్లిస్తే వారికి కూడా కార్డులు అందించారు. ఈ కార్డు కింద రిటైర్డ్ కార్మికునికి, ఆయన భార్యకు కలిపి రూ.8 లక్షల వైద్యం చేయించుకోవచ్చు. ఈ మొత్తం ఖర్చయితే ఇక అంతే. మళ్లీ రూ.60 వేలు చెల్లిస్తామన్నా కూడా కార్డు ఇవ్వరు. వన్టైం కిందే కార్డు ఇస్తారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆసుపత్రులు, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో కంపెనీ ఈ కార్డుతో చికిత్స అందించేలా అనుసంధానం చేసుకుంది. ఆ ఆసుపత్రులకు కార్డు పట్టుకుని రిటైర్డ్ కార్మికుడు వెళ్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. భార్యాభర్తలిద్దరికి కలిపి రూ.8 లక్షల విలువ గల చికిత్స పొందవచ్చు. బ్యాలెన్స్ వివరాలు లేవు.. రిటైర్డ్ కార్మికుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముందుగా అతను అక్కడ కార్డు చూపించి అడ్మిట్ అవుతారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడానికి ముందు సదరు ఆసుపత్రి యాజమాన్యం కంపెనీ సీఎంఓకు వైద్య ఖర్చుల బిల్లులను ఎస్టిమేట్ చేసి పంపుతారు. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఐతే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సదరు రిటైర్డ్ ఉద్యోగికి తన కార్డులో ఎంత మొత్తం ట్రీట్మెంట్ కింద కట్ అయిందో తెలియడం లేదు. కంపెనీ వారు చెప్పడం లేదు. ఆసుపత్రి వారు చెప్పే అంచనే తప్ప, డిశ్చార్చి అయిన తర్వాత తన వైద్యానికి ఆసుపత్రుల్లో కార్డు నుంచి ఎంత మొత్తం కట్ అయిందో తెలియక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ కార్యాలయం వద్దకు వెళ్లి అడిగిన కూడా వివరాలు ఇవ్వడం లేదు. మళ్లీ ఏదైనా జబ్బు పడ్డప్పుడు దానికి సరిపడా డబ్బులు కార్డులో ఉన్నాయా లేవో అని గందరగోళపడుతున్నారు. ఖర్చు, మిగులు ఎంతో తెలియదు లెక్క చెప్పాలంటున్న రిటైర్డ్ కార్మికులు ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు ఎస్ఎంఎస్ అలర్ట్ పెట్టాలి రిటైర్డ్ కార్మికుడు ఆసుపత్రిలో డిశార్చి అయిన వెంటనే అతని సెల్ఫోన్కు ఎంత మొత్తం కార్డు నుంచి వైద్యానికి కట్ అయిందో వారి ఫోన్కు మెసేజ్ వచ్చేలా యజమాన్యం ఏర్పాటు చేయాలి. కనీసం జీఎం కార్యాలయానికి వెళ్లి అడిగిన అక్కడ వివరాలు చెప్పేలా ఏర్పాటు చేయాలి. ఇవేవి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. – నాతాడి శ్రీధర్రెడ్డి, బీఎంఎస్ ఎస్సార్పీ బ్రాంచి ఉపాధ్యక్షుడు -
నరేందర్కు శ్రమశక్తి అవార్డు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో విధులు నిర్వర్తిస్తున్న రాంశెట్టి నరేందర్ను మేడే సందర్భంగా ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్లోని రవీంద్రబారతిలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్ చేతులమీదుగా అవార్డుతోపాటు ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు. తనకు సహకరించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్, నాయకులు కాంపెల్లి సమ్మయ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు
ఆదిలాబాద్టౌన్(జైనథ్): ఇసుక రాయల్టీ తీసుకున్న పెండల్వాడ, సాంగ్వి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. గురువారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గతనెల 13న భోరజ్ మండలం పెండల్వాడ గ్రామ శివారులో పెన్గంగా నది నుంచి ఇసుక తీసుకోవడానికి ట్రాక్టర్ డ్రైవర్ వచ్చాడు. వీడీసీ సభ్యులు భూమారెడ్డి, అతని సోదరుడు రామ్రెడ్డితోపాటు మరికొంత మంది సభ్యులు అతని వద్ద రూ.500 రాయల్టీ అక్రమంగా తీసుకున్నారు. దీంతోపాటు ఆయనతో దుర్భాషలాడి బెదిరించారు. సాంగ్వి గ్రామంలో ఇసుక తరలింపులో వసూళ్లకు పాల్పడుతున్న అశోక్, మరికొందరిపై ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జైనథ్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
గిరిజన గురుకులాల్లో 99 శాతం ఉత్తీర్ణత
ఉట్నూర్రూరల్: పది ఫలితాల్లో గిరిజన గురుకులాలు 99 శాతం ఉత్తీర్ణత సాధించాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. గత విద్యాసంవత్సరం 96.33 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈసారి మూడు శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 గిరిజన బాల, బాలికల గురుకులాల్లో బాలికలు 591 మంది, బాలురు 253 మంది ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల్లో మిషన్ లక్ష్యం కార్యక్రమాన్ని అమలు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది కృషి ఉందంటూ పీవో, ఆదిలాబాద్ ఆర్సీవో అగస్టిన్ అభినందించారు. ‘పరిహారం అందేలా చూస్తాం’నెన్నెల: వడగళ్ల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు పరి హారం అందేలా చూస్తామని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి గుండ్లసోమారం, బొప్పారం, చిత్తాపూర్, ఆవుడం, గంగారాం, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రై తులతో మాట్లాడారు. గుండ్లసోమారంలో ఇళ్లు కూ లిపోయిన బాధితులకు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. భీమిని ఏడీ ఏ సురేఖ మాట్లాడుతూ మండలంలో సుమా రు 150 ఎకరాల్లో వరి, ఐదు ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక పరి శీలనలో తేలిందని అన్నారు. సుమారు 300 ఎకరాల్లో వందమంది రైతులకు సంబంధించిన మామిడి కాయలు నేలరాలినట్లు గుర్తించామని ఉద్యానవన అధికారి అరుణ్ తెలి పారు. తహసీల్దార్ మహేంద్రనాథ్, ఏఓ సృజన, ఏఈఓలు రాంచందర్, శైని, మాజీ జెడ్పీటీసీ సింగతి శ్యామలరాంచందర్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో పశువుల దొంగలు!మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలో రోడ్లపై పడుకుని ఉన్న పశువులను ఎత్తుకెళ్లిన దొంగలు పో లీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. జన్మభూమినగర్ ప్రాంతంలోఓ పశువును కొ ందరు ఎత్తుకెళ్లి ఆటోలో తరలిస్తుండగా పోలీ సులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఆటోడ్రైవర్తోపాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
అధికార లాంఛనాలతో సీఆర్పీఎస్ జవాన్ అంత్యక్రియలు
● హాజరైన సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లుభీమారం: గుండెపోటుతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రామళ్ల సాగర్కు అధికార లాంఛనాలతో గురువారం భీమారంలో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండలకేంద్రానికి చెందిన సాగర్ సీఆర్పీఎఫ్ జవాన్గా శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం ఆయన మంచిర్యాలలో ఫంక్షన్కు వెళ్లగా గుండెపోటుతో మృతిచెందాడు. హకీంపేట్లోని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ రాకేశ్ దేహార్య, జవాన్లు అంత్యక్రియలకు హాజరై తల్లిదండ్రులు గట్టయ్య, కళ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో అధికారులు పాల్గొని పాడె మోశారు. శ్మశానవాటికలో మృతదేహానికి జాతీయజెండా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి నివాళులర్పించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు తరలివెళ్లారు. -
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్లో 19మంది రిపోర్టు
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు 8, పెద్దపల్లికి 5, ఆసిఫాబాద్కు 4, ములుగుకు 1, జయశంకర్ భూపాలపల్లికి 1 అభ్యర్థిని ఎస్సీ వసతిగృహా సంక్షేమ అధికారులుగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు కేటాయించారు. నియామకపత్రాలు అందజేస్తున్న ఎస్సీ డీడీ రవీందర్రెడ్డి, ఏఎస్డబ్ల్యూవో రవీందర్గౌడ్ కాళేశ్వరం జోన్లో ఇలా.. మంచిర్యాల జిల్లాలో.. అభ్యర్థి పేరు కేటాయించిన పోస్టింగ్ యాసం శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్హాస్టల్, కోటపల్లి చీపెల్లి శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, మందమర్రి చండి రజనీకాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, తాండూర్ చిందికింది ప్రశాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, దండేపల్లి అల్గూనూరి భార్గవ్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చెన్నూర్ డి.శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చింతగూడ టి.రాజు ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, బెల్లంపల్లి సద్గుణ, కూడెల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్, లక్సెట్టిపేట ఆసిఫాబాద్ జిల్లా.. రాహుల్కుమార్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, ఆసిఫాబాద్ జలంపల్లి ప్రేమ్కుమార్ కాలేజీ బాయ్స్ హాస్టల్, కాగజ్నగర్ ఈశ్వరి ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఆసిఫాబాద్ రత్నం కవిత ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ కాగజ్నగర్ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో.. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ(గర్ల్స్), పెద్దపల్లి ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్, మంథని ప్రశాంత్ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని డి.తిరుపతి ఎస్సీడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని సాధుల రమేష్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, మంథని ఎ.స్వాతి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రేగోండ డి.మమత ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఏటూరునాగారం -
ఆత్మహత్యాయత్నం
ఇళ్ల జాబితాలో పేరు లేదని కోటపల్లి: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని మనస్తాపం చెంది మండలంలోని రొయ్యపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్(30) ఆత్మహత్యాయత్నం చేశాడు. రవీందర్ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామంలో 93మందితో అర్హుల జాబితా ప్రకటించగా అందులో పేరొచ్చింది. మొదటి దశలో 22మందిని ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. ఇందులో పేరు లేకపోవడంతో కమిటీ సభ్యులు రాజకీయ కారణాలతో తన పేరు తొలగించారని మనస్తాపం చెందిన రవీందర్ బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవీందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని, నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. మళ్లీ సర్వే నిర్వహించి అర్హులకే ఇళ్లు అందజేస్తామని తెలిపారు. రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, ఆయనతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
దగ్ధమైన జొన్నపంట పరిశీలన
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సంబంధించిన పదెకరాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన జొన్న పంటను తహసీల్దార్ శ్యాంసుందర్ గురువారం పరిశీలించారు. జొన్న పంటతోపాటు రెండు టార్పాలిన్, 40 స్పింక్లర్లు, 85 పైప్లు, 27 స్పింక్లర్ నౌజల్స్, 1 సోలార్ ఫెన్సింగ్ పలక, బ్యాటరీ కాలిబూడిదైందని తెలిపారు. మొత్తం నష్టం విలువ రూ.8.83 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామని, రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తహసీల్దార్ వెంట ఎంఆర్ఐ నూర్సింగ్, బాధిత రైతులు కొడారి నరేశ్, సట్ల రమేశ్, లక్ష్మి, రాజేందర్, శ్రీకాంత్, మహేశ్, ప్రవీణ్ ఉన్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
తానూరు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన అక్కం రమేశ్ గతకొన్నేళ్లుగా మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతున్నాడు. భర్త తాగుడు మానడం లే దని కుమారుడు, కుమార్తెతో కలిసి భార్య స్వరూప పుట్టిల్లు అయిన ముధోల్కు వెళ్లింది. రెండునెలల క్రితం రమేశ్ ముధోల్కు వెళ్లి భార్యతో ఉంటున్నాడు. భార్య కాపురానికి రావాలని అడిగితే రాకపోవడంతో ఒక్కడే రెండురోజుల క్రితం బోల్సాకు వెళ్లాడు. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై తెలిపారు. -
పాఠశాలల్లో మరమ్మతు పూర్తిచేయాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష ఉట్నూర్రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సెలవులు ముగియకముందే మరమ్మతు పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల డీఈలు, ఏఈలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, ఏజెన్సీ గ్రామాల్లో చేపడుతున్న మరమ్మతులు ఎంతవరకు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గేట్లను, ఆర్వో ప్లాంట్ల మరమ్మతు చేయించాలని సూచించారు. భోజనశాలల భవనాల షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని, అంగన్వాడీ మోడల్ స్కూల్, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంక్, డార్మంటరీ గదుల మరమ్మతు పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో గదుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు. -
మేడే రోజూ కూలీలకు ‘పని’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మేడే వేడుకలు జరుపుకుంటున్న కార్మికులు ఓవైపు సంతోషంగా ఉండగా హాజీపూర్ మండలం పెద్దంపేటలోని ఈజీఎస్ కూలీలు పనుల్లో మునిగిపోయారు. ఈజీఎస్ నిర్వాహకులు వారితో ఉపాధి పనులు చేయించారు. కార్మిక దినోత్సవ వేళ ప్రభుత్వ సెలవు ఉండగా ఇలా పనులు చేయించడంపై కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. కాగా ఈజీఎస్ ఏపీవోను వివరణ కోరగా ఇటీవల పనిచేసిన దినాల్లో కొలతలు తక్కువ ఉండటంతో వాటిని సరిచేసేందుకు ఏడుగురు కూలీలు స్వచ్ఛందంగా వెళ్లారన్నారు. కార్మిక సెలవు కారణంగా ఎవరికీ ఎలాంటి మస్టర్ వేయలేదని తెలిపారు. -
సమస్యలు లేకుండా చూస్తాం
దండేపల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు లేకుండా, కొనుగోళ్లు వేగవంతం చేయడంతోపాటు లోడింగ్, అన్లోడింగ్లో ఆలస్యం కాకుండా, గన్నీ సంచులు అందుబాటులో ఉంచేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని ముత్యంపేట, నెల్కివెంకటాపూర్, దండేపల్లి, పాతమామిడిపల్లి, ధర్మరావ్పేట, వెల్గనూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. బస్తాలను మిల్లులకు తీసుకెళ్లిన లారీలు అన్లోడ్ కాక రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయని, దీంతో కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు లారీలు రాక ఇక్కడే ఉండి పోతున్నాయని నిర్వాహకులు చెప్పారు. కలెక్టర్ వెంటనే సివిల్ సప్లయ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి అన్లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, వీలయితే పక్క జిల్లాల మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చి అక్కడికి పంపించాలని సూచించారు. లోడింగ్, అన్లోడింగ్లో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వెల్గనూర్ కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచుల సమస్య ఉందని, లారీలు కూడా సరిగా రావడం లేదని చెప్పడంతో.. సమస్యలన్నీ తీరుస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ వేగవంతంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కన్నెపల్లి రైస్మిల్ వద్దకు వెళ్లారు. ధాన్యం లోడ్తో నిలిచి ఉన్న లారీలను చూసి వెంటనే అన్లోడింగ్ చేయాలని సూచించారు. డీఆర్డీవో కిషన్, తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్ఐ భూమన్న, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలి మంచిర్యాలటౌన్: వేసవిలో విద్యతోపాటు కళలు, చిత్రలేఖనం, పెయింటింగ్ శిక్షణకు వేసవి శిక్షణ శి బిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా వి ద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్యతో కలిసి పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లాలో ని 50 పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని, 15 రోజులపాటు శిబిరాలు నిర్వహించాలని, ఒక్కో శిబిరానికి రూ.50 వేలు అందిస్తామని తెలిపారు. ప్రతీ శిబిరంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ అందించాలని తెలిపారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొనుగోలు కేంద్రాల సందర్శన -
రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి..
● వీధి దీపాలు వెలుగడం లేదు.. ● కమిషనర్తో ఫోన్ ఇన్లో సమస్యల వెల్లువప్రశ్న: హైటెక్సిటీ కాలనీలో రోడ్లు గుంతలుగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నుంచి మురుగు నీరు రోడ్లపైకి పారుతోంది. తాగునీరు సన్నగా రావడం వల్ల సరిపోవడం లేదు. ఎక్కువ సమయంతోపాటు నీరు బాగా వచ్చేలా చూడాలి. – తౌటం సరళ, శ్రీనివాస్, వెంకటేశ్వర్రావు, ప్రకాశ్, రవికుమార్, హైటెక్సిటీ కాలనీ కమిషనర్: హైటెక్సిటీ కాలనీలో రోడ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపునకు ప్రయత్నిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలో సమస్య వల్ల అక్కడక్కడ మురుగు నీరు లీకేజీతో రోడ్లపైకి వస్తోంది. దీని పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాల్టీ కార్పొరేషన్గా మారి మూడు నెలలు పూర్తయినా మంచిర్యాలతోపాటు విలీన మున్సిపాలిటీ నస్పూర్, హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాల్లో వీధి దీపాలు వెలుగడం లేదు. డ్రెయినేజీలు నిర్మించాలి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి ప్రతీ రోజు చెత్త తీసుకెళ్లేలా చూడాలి.. అంటూ పలువురు గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్లో మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ శివాజి దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని, ఆన్లైన్ సేవలు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రశ్న: మా కాలనీల్లో వీధి దీపాలు వెలుగడం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పాములు, విషసర్పాలతో భయభ్రాంతులకు గురవుతున్నాం. – చుంచు సత్తయ్య(శ్రీనివాస కాలనీ), నజార్, కృష్ణకాలనీ(నస్పూర్), మల్లేశ్, గర్మిళ్ల, సత్యనారాయణ(వేంపల్లి), సత్యనారాయణ(ముల్కల్ల), వెంకట్(వేంపల్లి) కమిషనర్: వీధి దీపాల కోసం ఇటీవల టెండర్ల ప్రక్రియ చేపట్టాం. వారం రోజుల్లో టెండర్లు తెరిచి వెంటనే వీధి దీపాలను కార్పొరేషన్ పరిధిలోని అన్నిచోట్ల ఏర్పాటు చేయిస్తాం. ప్రశ్న: తాగునీటి పైపులైన్ లీకేజీ అవుతోంది. రోడ్డుపై నీరు నిలిచి ఇబ్బందిగా మారుతోంది. రోడ్లు ఉన్నా డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి వచ్చి చేరుతోంది. – మధుసూదన్(అర్కలవాడ, మంచిర్యాల), వెంకటయ్య(లక్ష్మీనగర్, మంచిర్యాల), సత్తయ్య(శ్రీశ్రీనగర్, మంచిర్యాల), హబీబ్(జాఫర్నగర్, మంచిర్యాల) కమిషనర్: తాగునీటి పైపులు లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అర్కలవాడకు లైన్మెన్ను వెంటనే పంపించి లీకేజీ సమస్య పరిష్కరిస్తాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు ఎక్కడెక్కడ అవసరమనే వివరాలు సేకరిస్తున్నాం. ప్రణాళిక రూపొందించి నిధుల విడుదలను బట్టి నిర్మాణాలు చేపడుతాం. ప్రశ్న: డ్రెయినేజీపై కంపౌండ్ వాల్ నిర్మించడంతో నీరు పారడం కష్టంగా మారింది. – మహ్మద్ అసీనుల్లా, ఇస్లాంపుర, మంచిర్యాలకమిషనర్: కార్పొరేషన్ నిర్మించిన కట్టడాలు, డ్రెయినేజీలను ఆక్రమించి ఏ కట్టడం ఉన్నా వాటిని పరిశీలించి తొలగిస్తాం. వెంటనే ఆయా కట్టడాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: రైల్వే గేటు దగ్గర చెత్త కుప్పులుగా పోసి ఉంచుతున్నారు. ఈ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. – ఓంప్రకాశ్, హమాలివాడ కమిషనర్: చెత్త నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా చూస్తాం. చెత్త తొలగించకుంటే వెంటనే మా దృష్టికి గానీ వార్డు ఆఫీసర్ల దృష్టికి గానీ తీసుకొస్తే చర్యలు చేపడుతాం. ప్రశ్న: రోడ్లు లేవు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వారం రెండ్రోజులే చెత్తబండి వస్తోంది. నాలుగు రోజులు వచ్చేలా చూడాలి – సుధీర్కుమార్, రాయల్ టాకీస్, నస్పూర్, ఎం.కుమార్, విద్యానగర్, నస్పూర్కాలనీ కమిషనర్: నస్పూరు పరిధిలో రోడ్లు వేసేందుకు ఒక ప్యాకేజీలా రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు రాగానే ఆ ప్రాంతంలో రోడ్లు వేస్తాం. తాగునీటి సమస్య లేకుండానే చూస్తున్నాం. రాయల్టాకీస్ ఏరియాలో తాగునీటి సమస్యను గుర్తించి పరిష్కరిస్తాం. చెత్తబండి రెగ్యులర్గా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. తడిపొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా ప్రజలు సహకరించాలి. ప్రశ్న: సుభాష్నగర్లో కల్వర్టు లేక డ్రెయినేజీ నీరు రోడ్డుపై పారుతోంది. హమాలీవాడ హనుమాన్ టెంపుల్ నుంచి బాలమల్లు తోట వరకు డ్రెయినేజీ వ్య వస్థ లేక ప్రజల రాకపోకలకు ఇబ్బంది మారింది. – చందు, సుభాష్నగర్, మంచిర్యాల, శ్రీరాముల మల్లేశ్, హమాలీవాడ కమిషనర్: కల్వర్టు లేక డ్రెయినేజీ నీరు పారకపోతే పరిశీలించి కల్వర్టు నిర్మిస్తాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఇంజినీరింగ్ అధికారులను పంపించి పరిశీ లిస్తాం. డ్రెయినేజీ నిర్మాణాలు పదిహేను రోజుల్లో ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: చున్నంబట్టి రోడ్డులోని వంద ఫీట్ల రోడ్డులో వాటర్ ట్యాంకు కట్టేందుకు గుంత తవ్వి వదిలేయడం వల్ల ప్రమాదకరంగా మారింది. గుంతను పూడ్చాలి. – ఉపేందర్ తుంగపల్లి, మందమర్రి కమిషనర్: వెంటనే గుంత పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: నర్సరీతో కోతుల బెడద, పాములు, విషపు సర్పాలు వస్తున్నాయి. ఆరో వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. – సతీశ్కుమార్, హైటెక్సిటీ కాలనీ, మంచిర్యాల, అర్కల హేమలత, 6వ వార్డు కమిషనర్: హైటెక్సిటీ కాలనీ నర్సరీ ద్వారా కోతులు, విష సర్పాలు స్థానికుల ఇళ్లకు రాకుండా చర్యలు తీసుకుంటాం. కుక్కల బెడద తగ్గించేందుకు ఇ ప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని వార్డుల్లో యానిమల్ కేర్ సెంటర్ ద్వారా చర్యలు చేపడుతాం. ప్రశ్న: వీధి దీపాల సమస్య తీర్చండి. ఉన్న లైట్లు తక్కువ వెలుతురుతో వస్తున్నాయి. వెలుతురు ఎక్కువగా వచ్చే దీపాలు ఏర్పాటు చేయాలి. – సదానందం(గొల్లవాడ మంచిర్యాల), తిరుపతిరెడ్డి(అశోక్రోడ్డు), మల్లేశ్(గర్మిళ్ల), రావి సురేశ్(ఆవోపా కాలనీ, మంచిర్యాల) కమిషనర్: వీధి దీపాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. వారం రోజుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయించేలా చూస్తాం. ప్రశ్న: ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ లేక ఇబ్బందిగా ఉంది. ఆన్లైన్ చేసేలా చర్యలు తీసుకోండి. – గజ్జల రాజశేఖర్, ముల్కల్లకమిషనర్: విలీన గ్రామాలకు సంబంధించిన వాటి ఆన్లైన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రాపర్టీ ట్యాక్స్తోపాటు ఇతర సదుపాయాలు ఆన్లైన్ ద్వారా జరిగేలా చూస్తాం. ప్రశ్న: పాతమంచిర్యాలలో డ్రెయినేజీలు శుభ్రంగా లేవు. సమయం లేకుండా తాగునీటి సరఫరా చేయ డం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశ్రీనగర్లో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి. – పెంట శ్రీనివాస్, పాతమంచిర్యాల, లక్ష్మి, శ్రీశ్రీనగర్ కమిషనర్: డ్రెయినేజీలు శుభ్రం చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. తాగునీరు ఒకే సమయానికి సరఫరాకు చర్యలు తీసుకుంటాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. వీలైనంత త్వరగా నిర్మాణం చేపడుతాం. ప్రశ్న: కాలేజీరోడ్డులో ఆకతాయిల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ఉదయం వాకింగ్ వెళ్లే వారితోపాటు కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – చింతకింది పద్మావతి, ఎన్టీఆర్నగర్, మంచిర్యాల కమిషనర్: పోలీసు శాఖ వారి దృష్టికి తీసుకెళ్లి ఆకతాయిల ఇబ్బందులు లేకుండా చూస్తాం. -
‘ఉపాధి’లో పండ్ల తోటలు
● జిల్లాలో 400 ఎకరాలు లక్ష్యం ● రైతులు ముందుకు రావాలని అధికారుల సూచన చెన్నూర్రూరల్: కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవనాల పెంపకం చేపట్టేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 400 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి నిర్ణయించింది. జిల్లాలో 16మండలాలు ఉండగా.. మండలానికి 25ఎకరాల చొప్పున పండ్ల మొక్కలు పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలు ముగిసినందున ఎవరైనా ఆసక్తి కలిగిన చిన్న, సన్నకారు రైతులు ముందుకు వస్తే ప్రోత్సాహం అందించనున్నారు. ఉద్యానవన పంటల సాగులో భాగంగా మామిడి, బత్తాయి, నారింజ, జామ, సీతాఫలం, యాపిల్, కొబ్బరి, దానిమ్మ, మునగ, చింత, ఆయిల్ఫాం వంటివి రైతులు తమ భూముల పరిస్థితికి అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఏదైనా ఒకే రకం సాగు చేసుకోవాల్సి ఉండగా.. అందుకు నిర్ణీత ధరలు చెల్లిస్తారు. రైతులు తమకు నచ్చిన నర్సరీల్లో ఎంపిక చేసుకోవచ్చు లేని పక్షంలో ప్రభుత్వం ఎంపిక చేసిన నర్సరీల నుంచి తీసుకోవచ్చు. స్వయంగా కొనుగోలు చేస్తే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ముందస్తుగా బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకుంటే 90శాతం సబ్సిడీపై పరికరాలు అందజేస్తారు. ధ్రువీకరణ పత్రాలుచిన్న, సన్నకారు రైతులు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండి పట్టాదారు పాస్పుస్తకం జిరాక్స్ ఇవ్వాలి. వ్యవసాయ పొలాల వద్ద నీటి వసతి కలిగి ఉండాలి. ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి ఉద్యానవనాలు మంజూరు చేస్తారు. మొక్కలకు నిధులతోపాటు గుంతలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులు ఉపాధి హామీ పథకం కిందనే చేపడుతారు. రైతులు దరఖాస్తు చేసుకోవాలి ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యావన పంటలతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 400 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి లక్ష్యం ఉంది. రైతులు ముందుకు రావాలి. – కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల -
కుల గణన చరిత్రాత్మక నిర్ణయం
దండేపల్లి: దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మ కం అని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. హర్షం వ్యక్తం చేస్తూ దండేపల్లి బీజేపీ కార్యాలయంలో గురువారం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం ఇదే మొ దటిసారి అన్నారు. గతంలో కేంద్రంలో అధి కారంలో ఉన్న ప్రభుత్వాలు కులగణపై ఆలో చన చేసినా ముందుకు సాగలేదని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం కులగణ నకు అంగీకరించడం హర్షణీయమని అన్నా రు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజయ్య, నాయకులు గురువయ్య, సురేందర్, నరేష్, సంతోష్, లక్ష్మణ్, శేఖర్, అశోక్, కిషన్, రవీందర్, రాకేష్, వెంకటేశ్వ ర్లు, మల్లేష్, గురువయ్య, మహేష్ పాల్గొన్నా రు. -
మున్సిపల్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ ము రళీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తునారని ఆరోపిస్తూ గురువారం బీ ఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేశ్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదు ట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ము న్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజారమేశ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తీయకుండా బీఆర్ఎస్ ఫ్లేక్సీలను తొలగించడం దారుణమని అన్నారు. అధికారిగా ఉంటూ ఏకపక్షంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. సీఐ దేవేందర్రావు సంఘటన స్థలానికి చేరుకొని ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని ఫ్లెక్సీలు తొలగిస్తామని నచ్చజెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన విరమించారు. బీఆర్ఎస్ నాయకులు రాంలాల్గిల్డా, నవాజ్, కృష్ణ, రెవెల్లి మహేశ్, బాపు, తిరుపతి, సురేశ్రెడ్డి, జోడు శంకర్ పాల్గొన్నారు. -
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రాక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల తలభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదావరి ఒడ్డున కుప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం పురాతన ఆలయం ఉన్నచోట గ్రామానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, రాజ్కుమార్ తెలిపారు. -
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్లపుస్తకాన్ని అనువదించిన జిల్లాకవి నిర్మల్ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్కు బైక్లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుకెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం. నేడు దీపోత్సవం జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు. దేవతలకు విత్తనాలను చూపిస్తారు మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు. దేవతలకు చూపించాకే.. పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతిబెల్లంపల్లి: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన మారెపల్లి రవీందర్ రెడ్డి (56) శాంతిఖని సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం..భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి మంగళవారం రాత్రి భోజనం చేస్తూ కుర్చీలో కుప్పకూలిపోయాడు. బుధవారం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్సిల్ రావడంతో విషయాన్ని భర్తకు చెప్పడానికి భార్య మంజు పలుమార్లు ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సహచర కార్మికుడికి ఫోన్ చేసి ఓసారి ఇంటికి వెళ్లి చూడాలంది. అతను వెళ్లి ఇంటి కిటికీ నుంచి చూడగా కుర్చీలో రవీందర్ రెడ్డి బిగుసుకుపోయి ఉన్నట్లు గుర్తించాడు. చుట్టుపక్క ఇళ్ల వారిని పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులకు ఆయన సమాచారం అందించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. వడగళ్ల వానకు అతలాకుతలం● తడిసిన ధాన్యం, విరిగిన స్తంభాలు ● నేలరాలిన మామిడి నెన్నెల/భీమారం/మంచిర్యాలఅగ్రికల్చర్/జైపూర్: నెన్నెల మండలం గుండ్లసోమారం, చిత్తాపూర్, ఆవుడం, జెండావెంకటాపూర్, మైలారం, గొల్లపల్లి, కొత్తూర్, గంగారాం గ్రామాల్లో బుధవారం సాయంత్రం వడగళ్లతో కూడిన గాలివాన కురిసింది. ధాన్యం కుప్పలు తడిసిపోగా కోతకు వచ్చిన వడ్లు, మామిడికాయలు నేలరాలిపోయాయి. గుండ్లసోమారంలో రెండు విద్యుత్ స్తంభాలు, నాలుగు రేకుల షెడ్లు కూలిపోయాయి. నెన్నెల హన్మాన్ మందిర్ వద్ద విద్యుత్వైర్ తెగిపోవడంతో మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భీమారం మండలంలో వడగళ్ల వానకు మామిడితోటలకు నష్టం వాటిల్లింది. దాంపూర్ గ్రామంలో ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. మంచిర్యాలలో తేలికపాటి వర్షం కురిసింది. జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన ఐటిపాముల మల్లేశ్ ఇంటి రేకులు గాలికి ఎగిరిపోయి ఇల్లు కూలింది. శివ్వారంలో పెద్దపల్లి నర్సయ్య ఇల్లు ధ్వంసమైంది. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. ఈదురు గాలులతో కాత దశకు చేరిన మామిడి కాయలు నేలరాలిపోయాయి. -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. -
ఉమెన్స్ హ్యాండ్బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచింది. బుధవారం ఫైనల్మ్యాచ్లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్లోని బూజ్లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్రెడ్డి, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు. ● రన్నరప్గా రంగారెడ్డి జట్టు -
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గతనెల 25న మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించిన ఆ టో రథయాత్ర బుధవారం బెల్లంపల్లికి చేరుకు ంది. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్స్ యూని య న్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్, నాయకులు, ఆటోడ్రైవర్లు రథయాత్రకు స్వాగతం పలికారు. బజారుఏరియా పురవీధుల మీదుగా రథయా త్ర, ఆటోలతో ర్యాలీ చేశారు. రథయాత్ర మే 27న హైదరాబాద్కు చేరుకుంటుందని, ఈసందర్భంగా ఇందిరాపార్కులో నిర్వహించే ఆటో ఆకలికేకలు మహాసభకు ఆటోడ్రైవర్లు తరలిరావాలని కోరారు. గేదెల మృతి కారకుడికి 9 నెలల జైలుఆసిఫాబాద్: విద్యుత్ తీగలు అమర్చి, నాలుగు గేదెల మృతికి కారణమైన తిర్యాణి మండలం చెలిమెల కొలాంగూడకు చెందిన టేకం కొండుకు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పుచెప్పారు. తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. తిర్యాణి నుంచి మాణిక్యాపూర్ వెళ్లే మార్గంలో గుట్టమేడి అటవీ ప్రాంతంలో జంతువులకోసం టేకం కొండు విద్యుత్ తీ గలు అమర్చాడు. భీమ్రావు, భుజంగరావు, సోంబాయి, విజయలకు చెందిన నాలుగు గేదెలు 2017 మే 31న మేత కు వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో అటవీప్రాంతంలో గాలించగా మృతిచెంది ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో అ ప్పటిఎస్సై బుద్దేస్వామి కేసు నమోదు చేశా రు. రెబ్బెన సీఐ బుద్దేస్వామి, తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కోర్టులో సాక్షులు ప్రవేశపెట్టగా పీపీ జనన్మోహన్రావు విచారించి నేరం రుజువుచేశారు. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పుచెప్పా రు. నిందితుడికి శిక్షపడేలా కృషిచేసిన కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, కానిస్టేబుల్ వినో ద్ను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. మంచిర్యాల సీఈగా సత్య రాజచంద్రకై లాస్నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖలో ఇద్దరు అధికారులకు ఇన్చార్జీలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ చేసి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న స్థానాల్లో ఇన్చార్జీలకు బాధ్యతలు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న ఎ.సత్య రాజచంద్రను మంచిర్యాల చీఫ్ ఇంజినీర్గా నియమించారు. ఆదిలాబాద్ ఇరిగేషన్ సర్కిల్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఎం.లక్ష్మిని నిర్మల్ సర్కిల్ డీఈగా బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ప్రి న్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ పేర్కొన్నారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలక్రైం: కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం కమిషనరేట్ ఆవరణలోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఎస్బీ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, నర్సింహులు, మల్లారెడ్డి, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. నలుగురికి ఎస్సైగా పదోన్నతి మంచిర్యాలక్రైం: కమిషనరేట్ పరిధిలో ఏఎస్సైలుగా పని చేస్తున్న సయ్యద్ మజారొద్దీన్, అబ్దుల్ మున్నిర్ అహ్మద్, ఎం.రాజన్న, ఆర్.బిక్లాల్కు ఎస్సైగా పదోన్నతి లభించింది. వీరికి సీపీ తన చాంబర్లో చిహ్నాలను అలంకరించారు. మంచిర్యాలక్రైం: ఉద్యోగ విరమణ పొందిన సీఐ డీ.కమలాకర్, ఏఆర్ఎస్సై ఎం.నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎస్.సుందర్లను సీపీ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యుల గైర్హాజరుకు చెక్
● నేటి నుంచి ముఖ ఆధారిత గుర్తింపుతోనే హాజరు ● వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రుల్లో అమలు ● ఎన్ఎంసీ ఆదేశాలతో బయోమెట్రిక్కు స్వస్తి మంచిర్యాలటౌన్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది గైర్హాజరుకు చెక్ పడనుంది. నేటి నుంచి ముఖ ఆధారిత గుర్తింపు(ఫేస్ బేస్డ్ ఆధార్ అథెంటికేషన్) హాజరు అమలుకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) చర్యలు చేపట్టింది. మంచిర్యాల వైద్య కళాశాలతోపాటు అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, బోధకులు, సహాయ బోధకులు, అసోసియేట్లు అందరూ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ విధానంతోనే హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వైద్య కళాశాలలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం కారిడార్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఆయా ప్రాంతాల అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా నమోదు చేసిన వీటి పరిధిలోని వంద మీటర్ల లోపు ఉండి ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేస్తేనే హాజరు పడనుంది. ఫేస్బేస్డ్ ఆధార్ అథెంటికేషన్కు సంబంధించిన మూడు యంత్రాలు ఎన్ఎంసీ నుంచి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం మొబైల్ ఫోన్లోనే యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోనున్నారు. గత వారం రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. ఈ విధానంతో కొందరు ఇష్టారీతిగా హాజరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో సమయపాలన పాటించడం లేదు. వారి సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. కొత్త విధానంతో బయోమెట్రిక్కు స్వస్తి పలుకుతోంది. కొత్త విధానం అమలు మే ఒకటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, బోధన వైద్యులు హాజరు ఇకపై కొత్త విధానంలోనే తీసుకోవడం జరుగుతుంది. కచ్చితమైన హాజరు కోసం ఎంసీహెచ్, జీజీహెచ్, మెడికల్ కాలేజీకి మూడు మిషన్లు ఎన్ఎంసీ నుంచి రావాల్సి ఉంది. అప్పటివరకు మొబైల్ యాప్ను వినియోగించి హాజరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. – ఎండి.సులేమాన్, మంచిర్యాల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ -
బస్తా దిగదు.. బండి కదలదు..
మంచిర్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతుండగా.. మిల్లుల ఎదుట కిలోమీటర్ల మేర లారీలు బారులు తీరుతున్నాయి. బస్తాలను దింపకపోవడంతో ఒక్కో మిల్లు ఎదుట 20 నుంచి 30 లారీలు ఉంటున్నాయి. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్, జైపూర్, భీమారం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో 332 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. 138 కేంద్రాల్లో ధాన్యం వస్తోంది. కొనుగోలు కేంద్రాల నుంచి జిల్లాలోని 11రైస్మిల్లులకు ధాన్యం దించుకునేందుకు ట్యాగింగ్ ఇచ్చారు. జిల్లాలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఎండ వేడిమి..అధిక లోడ్ కారణంగా లారీల టైర్లు పేలిపోవడంతోపాటు లారీ పాడై నష్టపోవాల్సి వస్తోందని డ్రైవర్లు, యజమానులు వాపోతున్నారు. తూకం వేసిన ధాన్యం అన్లోడ్ కోసం లారీలు ఐదారు రోజులపాటు రైస్మిల్లుల వద్ద ఉంటున్నాయి. తాలు, తప్ప, ధాన్యం గింజ విరిగి నూక ఎక్కువగా వస్తున్నాయంటూ ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు తిరకాసు పెడుతున్నారు. సెంటర్ నిర్వాహకులు మిల్లు యజమానులతో బస్తాకు రెండు మూడు కిలోల కోతకు ఒప్పుకుంటే దించుకునేందుకు ఒప్పదం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లారీలు అన్లోడ్ అయి రాకపోవడం, తూకం వేయకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. తరుగు కోసమే తిరకాసు పెడుతున్నారని, ఆలస్యం చేయకుండా ధాన్యం తూకం వేసి దించుకోవాలని కోరుతున్నారు. కేంద్రాల్లో భారీగా ధాన్యం జిల్లాలో 3.25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 2,724మంది రైతుల నుంచి 24,603.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 16,466.040 మెట్రిక్ టన్నులు మిల్లులకు తరలించాల్సి ఉండగా, 8,137.120 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం వేసి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 696లారీల్లో ధాన్యం మిల్లులకు తరలించగా.. అన్లోడ్ కోసం 311 లారీలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు వరి కోతలు వేగవంతం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. ధాన్యం ఆరబోసుకునే వీలు లేకుండా నిల్వలు ఉంటున్నాయి. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడంతో కుప్పలు పేరుకుపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15వేల నుంచి 20 వేల బస్తాలతోపాటు ధాన్యం రాశులు కుప్పలుగా కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా కాంటా వేసేందుకు స్థలం లేక నిలిపి వేస్తున్నారు. రైస్మిల్లర్ల తిరకాసు మిల్లుల ఎదుట ధాన్యం లారీలు కిలోమీటర్ల మేర బారులు అధికలోడు.. ఎండవేడిమితో పేలుతున్న టైర్లు లారీటైర్ పేలింది.. ఏప్రిల్ 26న దండేపల్లి మండలం వెల్గ నూర్ సెంటర్ నుంచి ధాన్యం లోడుతో మందమర్రి మండలం అందుగులపేట రైస్మిల్లుకు వచ్చిన.. రోజుల తరబడి ధాన్యం బస్తాలోడు, ఎండతో లారీ టైర్ పగిలిపోయింది. ఇప్పటికే రూ.20 వేల వరకు నష్టం. ఇంకో టైర్ కూడా పగిలిపోయేలా ఉంది. –ఎస్.నర్సయ్య, డ్రైవర్, గ్రామం: వెల్లనూర్, మం: దండేపల్లి -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వడగాలులు బలంగా వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది. భూభారతి చట్టంతో భూమిపై హక్కు● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలటౌన్: భూభారతి నూతన ఓఆర్ఆర్ చట్టంతో రైతులకు భూమిపై హక్కు, రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాలులో బుధవారం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత పాల్గొన్నారు. రైస్మిల్లుల తనిఖీ.. లక్సెట్టిపేట: రైస్మిల్లుల యాజమాన్యాలు త్వరితగతిన ధాన్యం అన్లోడింగ్ చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం లక్సెట్టిపేటలో రైస్మిల్లులను జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆలస్యం చేయకుండా ఎక్కువ మంది హమాలీలను నియమించుకోవాలని తెలిపారు. -
మూడు స్థానాలు ముందుకు..!
● మెరుగైన ‘పది’ ఫలితాలు ● 96.54శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రస్థాయిలో 17వ స్థానం ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత మంచిర్యాలఅర్బన్: జిల్లాలో 167 ప్రభుత్వ పాఠశాలల్లో 78 పాఠశాలలు ఉత్తమ ఫలితాలతో వంద శాతం సాధించాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ముందు వరుసలో నిలిచాయి. ఇందులో 101 లోకల్బాడీ పాఠశాలల్లో 46 స్కూళ్లు వందశాతం దూసుకెళ్లాయి. రెండో స్థానంలో 45 ప్రైవేట్(నూరుశాతం) పాఠశాలలు సరిపెట్టుకున్నాయి. 10 కేజీబీవీలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించా యి. జీఏహెచ్ఎస్–6 టీఎస్డబ్ల్యూఆర్ఎస్ –6, టీఎస్ఎంఎస్–3, ఎంజేపీ–5, ఎయిడెడ్–1, టీఎంఆర్ఎస్–1 వందశాతం ఫలితాలు సాధించాయి. టీఎస్ఆర్ఎస్, 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకటి కూడా నూరుశాతం ఫలితాలు సాధించలేకపోయాయి. మంచిర్యాలఅర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా గతంతో పోల్చితే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది. జిల్లా 2023–24లో రాష్ట్రస్థాయిలో 20వ స్థానంలో నిలువగా.. ఈసారి మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానంలో నిలిచింది. బుధవారం ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసింది. గత ఏడాది 92.42శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 96.54కు ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొత్తం 9,179మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,861మంది ఉత్తీర్ణత సాధించారు. 318మంది అనుత్తీర్ణులయ్యారు. బాలురు 4,743మంది పరీక్షకు హాజరు కాగా 4,560మంది పాసయ్యారు. బాలికలు 4,436మంది పరీక్షకు హాజరు కాగా 4,301మంది ఉత్తీర్ణత పొందారు. బాలుర ఉత్తీర్ణత శాతం 96.14 కాగా, బాలికలు 96.96ఉత్తీర్ణత శాతంతో పై చేయి సాధించారు. ఫెయిలైన వారిలో బాలురు 183మంది, బాలికలు 135మంది ఉన్నారు. ఫలితాల్లో 2022–23లో 23 స్థానం, 2023–24లో 20వ స్థానం సాధించగా రెండేళ్లుగా వరుసగా మరో మూడడుగులు(ఈ ఏడాది) సాధించి స్థానాన్ని ‘పది’ల పర్చుకుంది. మోడల్స్కూల్ విద్యార్థుల ప్రతిభ మంచిర్యాల మోడల్స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. 98 మందికి 95మంది ఉత్తీర్ణత సాధించారు. దినసరి కూలీ కుటుంబానికి చెందిన నల్లచరణ్ 600 మార్కులకు గాను 571 మార్కులు, వ్యవసాయ కుటుంబానికి చెందిన దుర్గం నక్షత్ర 566, కోడూరి ఆదిత్య 563 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కుటుంబసభ్యుల సమక్షంలో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లాలోని ఐదు మోడల్స్కూళ్లలో 571 మార్కులతో చరణ్ మొదటి స్థానం సాధించాడని ప్రిన్సిపాల్ బుచ్చన్న తెలిపారు. పాఠశాలల వారీగా... యాజమాన్యం స్కూల్ హాజరైన ఉత్తీర్ణత సంఖ్య విద్యార్థులు లోకల్బాడీ 101 2801 2649 ఎయిడెడ్ 02 193 190 జీఏహెచ్ఎస్ 14 382 363 జీహెచ్ఎస్ 07 208 175 కేజీబీవీ 18 642 622 ఎంజేపీ 07 439 436 టీఎంఆర్ఎస్ 03 134 125 టీఎస్ఎంఎస్ 05 443 432 టీఎస్ఆర్ఎస్ 01 68 66 టీఎస్డబ్ల్యూ ఆర్ఎస్ 09 672 668 ప్రైవేట్ 80 3196 3136 మొత్తం 247 9179 8861నాలుగేళ్లుగా ఫలితాలు సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత 2021–22 10522 9528 2022–23 10071 8552 2023–24 9283 8579 2024–25 9179 8861సంవత్సరం ఉత్తీర్ణత శాతం.. బాలురు బాలికలు శాతం 2021–22 88.44 99.82 90.55 2022–23 82.91 87.00 84.87 2023–24 91.36 93.52 92.42 2024–25 96.14 96.96 96.54జిల్లా టాపర్గా సాయి శ్రీవల్లి పదో తరగతి ఫలితాల్లో స్థానిక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని సాయి శ్రీవల్లి 588 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. తల్లిదండ్రులు మధుబాబు, ఉమ ప్రభుత్వ ఉపాధ్యాయులు. సాయి శ్రీవల్లి జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపిక కాగా ఈ ఏడాది జూన్ 13న బయలుదేరి జపాన్లో 15 నుంచి 21 వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననుంది. జాతీయ ఇన్స్పైర్ అవార్డు పొందడంతోపాటు రాష్ట్రపతి నుంచి ప్రశంసలు అందుకుంది. అస్ట్రోనాట్గా అంతరిక్షంలో అడుగుపెట్టి పరిశోధనలు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాయి శ్రీవల్లి తెలిపింది.ఇంజినీర్ అవుతా.. మా నాన్న కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకు పదో తరగతి మొదటి మెట్టుగా భావించి ఇష్టపడి చదివాను. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 571 మార్కులు సాధించాను. ఐఐటీలో చేరాలని ఉంది. – నల్ల చరణ్, మంచిర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి -
బసవేశ్వరుడి సేవలు మరువలేం
మంచిర్యాలఅగ్రికల్చర్: సమాజంలో కుల వ్యవస్థను వ్యతిరేకించి ఆధ్యాత్మికతను ప్రేరేపించిన మహనీయుడు బసవేశ్వరుడు అని, ఆయన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్తోపాటు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం విశ్వగురు బసవేశ్వరుని చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొడుకు మృతదేహంతో మూడురోజులు
మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూడు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్రెడ్డి అశోక్రోడ్డులో నివసిస్తున్నారు.ఈయనకు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్రెడ్డి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారాయణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీవల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆదివారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకున్నారు. అప్పటి నుంచి బయటకు రాలేదు. మంగళవారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించాడు. మరోవైపు వెంకట్రెడ్డి అచేతన స్థితిలో పడుకుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్నిస్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పారు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
రెచ్చగొట్టే పోస్టులుపెడితే కఠిన చర్యలు
ఆదిలాబాద్టౌన్: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై సిగరేట్ తాగడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, మద్యం సేవిస్తూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అనే రౌడీషీటర్ సిగరేట్ తాగుతూ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలోని ఎగ్జిబిషన్ వ్యాపారిని సయ్యద్ మోసిన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడగా అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సోషల్ మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో కత్తులు, నిర్లక్ష్య డ్రైవింగ్, సిగరెట్ తాగుతూ రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒకరిపై చీటింగ్ కేసుఆదిలాబాద్రూరల్: ఇచ్చోడలోని మాధపూర్కు చెందిన మల్లేశ్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు మావల ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. రాంనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి వహబొద్దీన్కు ఫోన్చేసి ఫర్నీచర్పై రూ.5 లక్షల స్కీమ్ ఉందని, మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బిల్స్తో రుణం వస్తుందని మాయమాటలు చెప్పాడు. తాను ఫారెస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాని చెప్పి రూ.20వేలు ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పడంతో బాధితుడు రూ.18వేలు ఫోన్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుండడంతో బాధితుడు మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై..ఆదిలాబాద్టౌన్: పంచాయతీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. తాంసి మండలంలోని సవర్గాంకు చెందిన గజకంటి ప్రభాకర్ పంచాయతీ కా ర్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందడంతో పలువురు నాయకులు మంగళవారం మృతదేహంతో జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో డీపీవో శ్రీలత ఫిర్యాదు మేరకు అనుము ల కిరణ్, బొజ్జ ఆశన్న, అలాలి అజయ్, లంకా రాఘవులు, ఎ.మల్లేశ్, అగ్గిమల్ల స్వామితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
నకిలీ పత్రాల కేసులో తవ్వినకొద్దీ అక్రమాలు
ఇచ్చోడ: నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ద్వారా కొలువులు సాధించిన కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లో నివాసం ఉంటున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు సాధించిన విషయంపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పోలీసు, రెవెన్యూ యంత్రాగం విచారణకు రంగంలోకి దిగింది. మరో తొమ్మిది మందిపై ఫిర్యాదు... గతంలో ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన జాదవ్ రామారావు (ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పనిచేస్తున్నారు) తన డిజిటిల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇస్లాంనగర్ గ్రామ నివాస ధ్రువీకరణ పత్రాలు మార్ఫింగ్ చేసిన అంకిత్పటేల్, బిపిన్యాదవ్, అతుల్కుమార్యాదవ్, ఘాన్శ్యామ్ తివారి, జైనులొద్దీన్, తివారికుల్దీప్, అభిద్ఖాన్, సురాజ్సహని, విశ్వుకర్మపై సోమవారం రాత్రి ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ విషయంలో గోప్యత... నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన 8 మంది సర్టిఫికెట్లు పరిశీలనలో నకిలీవని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఈ విషయంలో గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన 8 మంది వ్యక్తుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని 2025 మార్చి 8న కమాండెంట్ 53 బెటాలియన్ ఐటీబీపీ ఫోర్స్ మండలం కలికిరి, అన్నమయ్య జిల్లా అధికారులు ఆదిలాబాద్ కలెక్టర్ను కోరారు. సంబంధిత పత్రాలు పరిశీలించి పంపించాలని కలెక్టరేట్ అధికారులు ఇచ్చోడ తహసీల్దార్ను ఆదేశించారు. వాటిని పరిశీలించిన తహసీల్దార్ నకిలీ పత్రాలుగా గుర్తించారు. దీనిపై పోలీసులకుగానీ జిల్లా అధికారులకు గానీ ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉండేవారి అండతోనే నివాస ధ్రువీకరణ పత్రాల మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ దిశగా విచారణ జరిపితే అసలు దోషులు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. మరో 9 మందిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సిరాజ్ అన్సారీ అనే వ్యక్తి 2025 జనవరి 16లో ఆర్సీ 022511735376 నంబర్ ద్వారా మీసేవలో నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇదే నంబర్ మహబూబ్నగర్ జిల్లాలోని శేర్ వెంకటాపురం అశ్విని అనే అమ్మాయి పేరుతో జారీ అయిన ధ్రువీకరణపత్రాన్ని ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ నివాసిగా సిరాజ్ అన్సారీ మార్ఫింగ్ చేశారు. -
పచ్చదనానికి కేరాఫ్ కవ్వాల్
ఓ వైపు పచ్చని అటవీ ప్రాంతాలు, వన్యప్రాణులు.. మరోవైపు పురాతన ఆలయాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అడవి దున్నలు, చిరుతలతో పాటు జింకలు, నీలుగాయిలు ఇతర వన్యప్రాణులకు నిలయంగా కవ్వాల్ అభయారణ్యం నిలుస్తోంది. గిరిజన పోరాట స్ఫూర్తిని తెలిపే కుమురంభీం స్మారకం, జైన శిల్పకళతో నిర్మించిన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం, పాండవులు వనవాసం చేసిన పెద్దయ్య దేవుడి గుట్ట, గోదావరి ఒడ్డున వెలిసిన సత్యదేవుని ఆలయం, బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయం పర్యాటకంగా కీలకమైన ప్రాంతాలు. వేసవి సెలవుల్లో ఉమ్మడి జిల్లాలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రాంతాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జన్నారం అటవీ డివిజన్లో చుక్కల దుప్పులు ఆదిలాబాద్టౌన్: దేశంలోనే అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఉంది. ఈ ఆలయాన్ని 11, 13వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కలిగి, గొప్ప శిల్పకళతో అలరారుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ విశిష్టత మహారాష్ట్రాలోని వెమత్మాలపంత్ రాతి తో ఈ ఆ లయం నిర్మించారు. ఉన్నత శిఖరం కలిగి అడుగడుగునా శిల్పకళతో శోభితమైంది. 60 గజాల ఎ త్తు, 40 గజాల వైశాల్యమున్న అష్టకోణాకార మండపము పైనున్న గర్భగుడిలో సూర్యనారా యణ స్వామి విగ్రహం ప్రతిష్టించబడి ఉంది. మూలవిరాట్లు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహానికి దక్షిణ దిశలో లక్ష్మీదేవి, హల్వారులు, అన్యదేవత మూర్తులు ఉన్నారు. ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయానికి ఇరువైపులా శృంగార భంగిమలతో కూడిన శిల్పఖండాలు దర్శనమిస్తాయి. స్వామి పాదాలను తాకే భానుడి కిరణాలు.. ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో, దసరా అనంతరం అశ్వియుజ పౌర్ణమిరోజు ఉదయం లక్ష్మీనారాయణ పాదాల ను సూర్యకిరణాలు తాకుతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూ ర్యదేవాలయంగా కూడా పిలు స్తారు. ఈ అద్భుత దృశ్యం చూడటానికి రాష్ట్ర నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టలు పుణ్యక్షేత్రాలకు నిలయంగా మారాయి. గుట్టపై వెలసిన సత్యనారాయణ స్వామి ఆలయం తె లంగాణలోనే ప్రసిద్ధి గాంచింది. 1964లో గూడెం గ్రామ వాస్తవ్యుడు గోవర్దన పెరుమాండ్ల స్వామి అనే చాదాత్త వైష్ణవుడు ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ సమీపంలోనే పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఎత్తయిన కొండపై అయ్యప్ప, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. గుట్ట కింద షిర్డి సాయినాథుని ఆలయం ఉంది. ఇలా ఒకే చోటా ఇన్ని ఆలయాలు ఉండటంతో గూడెం గ్రామం పుణ్య క్షేత్రాలకు నిలయంగా మారింది. సత్యదేవుని ఆలయంలో ప్రతీ పౌర్ణమికి జాతర నిర్వహిస్తారు. మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా నేరుగా రావచ్చు. జన్నారం: దట్టమైన అడవులు, పచ్చదనం పంచుతున్న చెట్లు, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు కేరాఫ్గా కవ్వాల్ టైగర్జోన్కు పేరుంది. 982 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాలో విస్తరించి ఉంది. పక్షుల కిలకిలలు, వన్యప్రాణుల పరుగులు, వాగుల గలగలలు ఇవన్నీ కలగలిపిన సంపదే కవ్వాల్ టైగర్జోన్. దీనికి గుండెకాయ జన్నారం అటవీ డివిజన్. సఫారీ ప్రయాణం పర్యాటకులను అడవిలో తిప్పేందుకు అటవీ శా ఖ, పర్యాటక శాఖలు సఫారీల ను ఏర్పాటు చేశా యి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఐదు లగ్జరీ సఫా రీలు, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండు సఫా రీలను ఏ ర్పాటు చేశారు. పర్యటక శాఖ ఏర్పా టు చేసిన రిసార్ట్స్లో రాత్రి బసచేసి, ఉదయా న్నే అడవిలో సఫారీ ప్రయాణం చేస్తారు. ఉదయం 7 నుంచి 10 గంటలకు, 10 నుంచి ఒంటిగంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి అడవిలో సుమారు 15 కి లోమీటర్ల దూరం సఫారీ ప్రయాణం ఉంటుంది. వన్యప్రాణుల పరుగులు, పక్షుల కిలకిలలు నేరుగా చూడవచ్చు. పచ్చదనం పంచుకున్న అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హరిత రిసార్ట్లో పర్యాటకుల కోసం కార్టేజీలను ఏ ర్పాటు చేశారు. ఇలా వెళ్లాలి.. మంచిర్యాల నుంచి గంటకో బస్సు ఉంటుంది. మంచిర్యాల నుంచి 60 కిలోమీటర్లు, ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్లు, నిర్మల్ నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కాకుండా నేరుగా సొంత వాహనాలతో కూడ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సొంత వాహనాలకు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలకు అనుమతి ఉండదు. అటవీశాఖ చెక్పోస్టుల వద్ద వాహనాలను నిలిపివేస్తారు. దట్టమైన అడవిలో పెద్దయ్య ఆలయందండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో రెండు గుట్టల నడుమ గలగలా పారే సెలయేరు ఒడ్డున పెద్దయ్యదేవుని ఆలయం ఉంది. ద్వాపర యుగంలో ఇక్కడ పాండవులు వనవాసం చేశారని పూర్వీకులు చెబుతుంటారు. ప్రతీ గురు, ఆదివారాల్లో ఇక్కడ జాతర జరుగుతుంది. జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక్కడ గిరిజనులే పూజారులు. ప్రతీ ఖరీప్, రబీ సీజన్ల ప్రారంభంలో రైతులు పెద్దయ్య దేవున్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆలయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వస్తుంటారు. ఆకట్టుకుంటున్న ‘జోడేఘాట్’కెరమెరి(ఆసిఫాబాద్): భూమి, నీరు, అడవి నినాదాలతో పోరాడి అసువులు బాసిన కుమురం భీం పోరుగడ్డ జోడేఘాట్ పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుమారు 35 ఏళ్లుగా ఆదివాసీలు జోడేఘాట్లో భీం వర్ధంతిని నిర్వహించి నివాళి అర్పిస్తున్నారు. 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులతో నిలువెత్తు భీం విగ్రహం, స్మృతివనం, స్మృతిచిహ్నం, జల్, జంగల్, జమీన్ల ఆర్చీలను ఏర్పాటు చేసింది. సమాధి నిర్మాణం చేసింది. జోడేఘాట్ నుంచి టోకెన్మోవాడ్ వరకు తారురోడ్డు, భీం మ్యూజియం నిర్మించింది. అందులో కుమురంభీం, అతని సహచరుల ప్రతిమలు, గుస్సాడీలు చేస్తున్న నృత్యాలు, ఆదివాసీ ఆభరణాలు, ఆయుధాలు, దేవతల మండపాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి జోడేఘాట్ ప్రాచూర్యంలోకి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, ఏటూరు నాగారం, మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజురా, బల్లార్షా, పాండర్కవడా, తదితర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు జోడేఘాట్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇలా వెళ్లవచ్చు.. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో కెరమెరికి రెండు కిలో మీటర్లు ముందుగానే హట్టి స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి జోడేఘాట్ 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లేనప్పటికీ ప్రైవేటు వాహనాలు నడుస్తాయి. ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్కు వెళ్లే మార్గంలో కెరమెరి తర్వాత వచ్చే హట్టిలో దిగాల్సి ఉంటుంది. మంచిర్యాలరూరల్(హాజీపూర్): కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పాతమంచిర్యాల అటవీ బీట్ పరిధిలోని హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ శివారు ఎంసీసీ క్వారీ లోని అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ సఫారీలో పాతమంచిర్యాల, తిమ్మాపూర్, బొక్కలగుట్ట అటవీబీట్ అడవులు ఉన్నా యి. 30 హెక్టార్లలో గ్రాస్ప్లాంట్, 30 హె క్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. పర్యాటకులు అడవిఅందాలు, వన్యప్రాణులను వీక్షి ంచేందుకు 6 మంచెలు ఏర్పాటు చేశారు. రెండున్నర గంటలపాటు 25 కిలోమీటర్ల మేర జంగల్ సఫారీ సాగుతుంది. ఆరుగురికి ఒక్కట్రిప్పుకు రూ.2,100, అదన పు వ్యక్తికి రూ.350, ట్రెక్కింగ్కు రూ.200లు తీసుకుంటున్నారు. ఉదయం 6:30, 9:30 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రిప్పులు ఉన్నాయి. నిర్మల్ జిల్లా.. పర్యాటక ఖిల్లాబాసర సరస్వతీ మాత ఆలయం నిర్మల్/కడెం/సారంగపూర్: నిర్మల్ జిల్లాలో అణువణువునా ప్రత్యేకతలున్న పర్యాటక, దర్శనీయ స్థలాలు ఉన్నా యి. బాసరలో గోదారి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో గల కోవెలలో చదువుల తల్లి కొలువై ఉంది. ఈ అమ్మ ఒడిలోనే తమ పిల్లలకు అక్షర శ్రీకారాలు చేయిస్తుంటారు. నిర్మల్–భైంసా మీదుగా, నిజామాబాద్ మీదుగా బాసర చేరుకోవచ్చు. బస్సులతో పాటు రైల్వే సౌకర్యమూ ఉంది. కదిలె.. పాపహరేశ్వరుడు దిలావర్పూర్ మండలంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో వెలిసిన దర్శనీయ స్థలం కదిలె. దిలావర్పూర్ నుంచి ఘాట్రోడ్డు మీదుగా వెళ్లాలి. దిలావర్పూర్ నుంచి 4కి.మీ దూరంలో కదిలె ఆలయం ఉంటుంది. కొయ్యబొమ్మల ఖిల్లా.. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. నిమ్మనాయుడు కాలంలో వచ్చిన నకాశీలు ఇప్పటికీ ఈ కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ‘కడెం’ ఒడ్డున సేదదీరాల్సిందే.. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 50 కి.మీ దూరంలో కడెం నదిపై ప్రాజెక్టు నిర్మించారు. పాపికొండలను తలపించే పచ్చని కొండల మధ్య ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఉంటుంది. ఆ అందాలను ఆస్వాదించేందుకు ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది. ప్రాజెక్టు పక్కనే రిసార్టులు ఉన్నాయి. నిర్మల్ నుంచి 48 కి.మీ, మంచిర్యాల నుంచి 90 కి.మీ, ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పుణ్యక్షేత్రాల గూడెం..నమోః సూర్య నారాయణవిహారయాత్రగా జంగల్ సఫారీ -
రహదారికి ప్రాధాన్యత!
● ఎన్హెచ్–63పై కదలిక ● కేంద్రమంత్రి పర్యటన ముందు టెండర్లు ● గత కొంతకాలంగా పనుల్లో జాప్యం ● భూములు ఇచ్చేందుకు రైతుల వ్యతిరేకతసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జాతీయ రహదారి–63 పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ‘ప్రధానమంత్రి ప్రాధాన్యత జాబితా’లో చ్చేడంతో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆర్మూర్, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల వరకు నాలుగు వరుసల రహదారికి ప్రణాళిక రచించిన విషయం తెలిసిందే. చెన్నూర్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు కలుపుతూ ప్రతిపాదించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక ప్రాజెక్టుల్లో ఈ హైవే చేర్చినప్పటికీ జాప్యం జరిగింది. సాంకేతిక, పర్యావరణ, అటవీ అనుమతులు, భూ సేకరణ, కోర్టు కేసులతో జాప్యం జరుగుతోంది. తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ రాష్ట్ర పర్యటన ముందు మళ్లీ పురోగతి కనిపిస్తోంది. మరోవైపు భూ సేకరణతో ప్రభావితం అవుతున్న రైతులు వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. స్థానికంగా, జిల్లా ఉన్నతాధికారులు, ఎన్హెచ్ఏఐ, పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనూ నిర్వాసితులు భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. అంతేగాక భూ సేకరణ, హైవే అలైన్మెంటు మార్పుపైనా హైకోర్టులోనూ ఐదు కేసులు విచారణలో ఉన్నాయి. పనులు సాగేనా?మొత్తం నాలుగు ప్యాకేజీల్లో నిర్మిస్తున్నప్పటికీ ఆర్థిక పర బిడ్లో రెండు ప్యాకేజీల్లోనే నిర్మించనున్నారు. గ్రీన్, బ్రౌన్ ఫీల్డ్, అంటూ ఇప్పటికే రెండుసార్లు అలైన్మెంట్లు మార్చారు. చివరగా గీన్ ఫీల్డ్ హైవేగానే నిర్మితం కావడంతో పంట పొలాల నుంచి రోడ్డు వెళ్లనుంది. కొద్దిమేర ప్రస్తుతమున్న రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఇక ముల్కల శివారు నుంచి బైపాస్ మందమర్రి మండలం కుర్మపల్లి క్రాస్ జంక్షన్ వద్ద ఎన్హెచ్–363కి కలుపనున్నారు. రాష్ట్ర జాతీయ రహదారుల పరిధిలోని పాత మంచిర్యాల మీదుగా, శ్రీరాంపూర్ జంక్షన్, జైపూర్, చెన్నూరు బైపాస్తో మహారాష్ట్ర సరిహద్దు వరకు పూర్తయింది. ఇక్కడ టోల్గేటు సిద్ధమైంది. అటు నుంచి ఛత్తీస్గఢ్ వరకు వెళ్లనుంది. తాజాగా అన్ని అనుమతులు రావడంతో పనులు మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణ, పరిహారం చెల్లింపులు పూర్తయి, టెండరు పిలిచి, కాంట్రాక్టర్లతో ఒప్పందమైతే పూర్తిస్తాయిలో నిర్మాణం మొదలు కానుంది. అయితే స్థానికంగా నిర్వాసితుల వ్యతిరేకతతో పనులు సాగుతాయా? అనే సందేహాలు వస్తున్నాయి.మంచిర్యాల–లక్సెట్టిపేట రోడ్డుఆర్మూర్–మంచిర్యాల హైవే సెక్షన్ భూ సేకరణ వివరాలు(ఎకరాల్లో) ప్రభుత్వ 176.11ప్రైవేటు 1317అటవీ 38.05ప్రభావిత నిర్మాణాలు 135నిర్వాసిత కుటుంబాలు 162నిర్మించే రోడ్డు 131.895కి.మీ వ్యయం రూ.2937.36కోట్లు పట్టణాలు: ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల -
30న కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
శ్రీరాంపూర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న చలో కొత్తగూడెం కార్యక్రమం చేపట్టినట్లు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. మంగళవారం జేఏసీ నాయకులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కే విశ్వనాథ్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి పోచమల్లు, టీసీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఉల్లి మొగిలి, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతీనెల 7న వేతనాలు చెల్లించాలని, బోనస్, ఈఎస్ఐ, సీఎంపీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా, నిరాహార దీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపీనాథ్, రాజ్ కుమార్, శ్రీ విముక్తి సంఘం, నాయకురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలను నియంత్రించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాన్ని నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాలు, వినియోగం వల్ల కలిగే నష్టాలను ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం ఇతర వివిధ రకాల పద్ధతులు, మానసిక వైద్య నిపుణుల శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ రిహ్యాబిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాలను అరికట్టేందుకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీ మాట్లాడుతూ ఎక్కడైనా మత్తపదార్థాల నిల్వ ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని అన్నారు. నీట్కు పకడ్బందీ ఏర్పాట్లుమంచిర్యాలఅర్బన్: జిల్లాలో మే 4న నిర్వహించే నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నీట్ కేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పరీక్ష కోసం కంట్రోల్రూం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరీక్ష కో–ఆర్డినేటర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రాణకోటికి కల్పవల్లి ‘ఎల్లంపల్లి’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు 2008 జూలై 28 మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 62 గేట్లతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్ దాదాపు రూ.4,950 కోట్లతో రెండేళ్ల క్రితం పూర్తి చేశారు. ప్రాజెక్ట్ కింద 1.118 కిలో మీటర్ల మేర 4 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కింద రోజుకు 220 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. హాజీపూర్ మండలం ర్యాలీ గిరిజన గ్రామ శివారు అటవీ ప్రాంతంలోని జాలువారే జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఎల్లంపల్లి జలాశయం -
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
పాతమంచిర్యాల: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ పంపించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నా రు. ఎన్నికల హామీలను అమలు చేసి బీసీల ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు. నాయకులు గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, అంకం సతీష్, భిక్షపతి, సల్మాన్, మహిళా నాయకురాలు లలితముదిరాజ్, రవికిరణ్, రాజం పాల్గొన్నారు. -
భూభారతితో వివాదాలు దూరం
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్వేమనపల్లి: భూభారతి చట్టంతో భూ వివాదాలు దూరమవుతాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో ద్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్తో కలిసి నీ ల్వాయి రైతువేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణితో గ్రామాల్లో లక్షలాది భూ వివాదాలు తలెత్తాయని, సాదాబైనామా, ఆర్ఓఆర్, మ్యుటేషన్, అన్ని రకాల భూ సమస్యలకు భూభారతితో పరి ష్కారం దొరికిందని అన్నారు. రికార్డు ప్రకారం ఏ తప్పులు ఉన్నా మార్పులు, చేర్పులు, విరాసత్ పట్టా, పాలు పంపకాలు, దస్తావేజులు సరి చేసుకో వడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అ నంతరం 19మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చె క్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరి కృష్ణ, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ సంతోష్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్ఆలీ పాల్గొన్నారు. ‘అప్పులపాలు చేసిన కేసీఆర్’వేమనపల్లి: తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పా ర్టీదైతే అనుభవించి అప్పుల పాలు చేసింది కేసీఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విమర్శించా రు. మంగళవారం నీల్వాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులపాలు చేశారని, ప్రభుత్వం ఏటా 65 వేల కోట్ల మిత్తిలు చెల్లిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సంతోష్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్ఆలీ, గాలి మధు, సత్యనారాయణ, రాజన్న పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్కు తప్పని తిప్పలు
మంచిర్యాలటౌన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. ఎల్ఎస్ఆర్లో 25శాతం రాయితీ వర్తింపు అవకాశం ఈ నెల 30వరకు కల్పించిన విషయం తెలిసిందే. వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎల్1 ఆఫీసర్ లాగిన్లోకి కొన్ని రాకపోవడం, ఎఫ్టీఎల్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సమస్యలు తీర్చకపోవడంతో ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఎదురవుతోంది. బుధవారం చివరి రోజు కావడంతో మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చి ఫీజు చెల్లించేందుకు తిప్పలు పడ్డారు. నేడు బసవేశ్వర జయంతి మంచిర్యాలటౌన్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 30న ఉదయం 9గంటలకు బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, వివిధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
‘ఉపాధి’లో అవకతవకలు
మందమర్రిరూరల్: మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. డీఆర్డీవో కిషన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. తనిఖీ బృందం దృష్టికి వచ్చిన వివరాలు వెల్లడించారు. మండలంలోని పది పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన పనులపై ఈ నెల 19నుంచి 28వరకు సామాజిక తనిఖీ చేపట్టారు. ఆయా పంచాయతీల్లో రూ.48వేల జరిమానామాతోపాటు రూ.34వేలు రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ కిరణ్, మండల ప్రత్యేక అధికారి అనిత, జీఎస్ ఏపీవో రజియాసుల్తానా, ఎస్ఆర్వోలు, డీఆర్వోలు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
బార్కు లక్కీ డ్రా
మంచిర్యాలక్రైం: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బార్కు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. హాజీపూర్ మండలం నమ్నూర్కు చెందిన నడిపెల్లి ధనుంజయ్రావు లక్కీడ్రాలో గెలుపొందినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. 15దరఖాస్తులు రాగా లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. ధనుంజయ్రావుకు ఎంపిక పత్రాన్ని అందజేశారు. సీఐ గురువయ్య, ఎస్సైలు పాల్గొన్నారు. బెల్లంపల్లిలో దరఖాస్తు గడువు పొడిగింపుబెల్లంపల్లి: బెల్లంపల్లిలో బార్ ఏర్పాటుకు ఒకటే దరఖాస్తు రావడంతో మే 5వరకు గడువు పొడిగించినట్లు బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ జే.ఇంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 8712658785 నంబరులో, బెల్లంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మే 6న ఉదయం 11గంటలకు కలెక్టరేట్లో లక్కీడ్రా తీస్తామని ప్రకటించారు. -
జిల్లా రిసోర్స్పర్సన్లకు ఇంటర్వ్యూలు
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడుల్లో మెరుగైన విద్య అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేసవి సెలవుల్లో వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లిషు, ఉర్ధూ మాధ్యమాల్లో బోధనకు జిల్లా రిసోర్స్పర్సన్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సోమవారం మంచిర్యాల డీసీఈబీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలకు రిసోర్స్పర్సన్లుగా సేవలు అందించడానికి దరఖాస్తు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ కేడర్లకు చెందిన 60 మంది ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. వివిధ రకాల ప్రశ్నలకు మెరుగైన స్కోర్ సాధించిన వారిని ఎంపిక చేయనున్నారు. ఆదిలాబాద్ డైట్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, సమగ్రశిక్ష శిక్ష కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్, లెక్చరర్లు శంకర్, కిషోర్కుమార్, సురేష్, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి, చౌదరి పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 44 మంది ఉపాధ్యాయులను జిల్లా రిసోర్సుపర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. -
‘ఉపాధి’లో రిక‘వర్రీ’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వంద రోజుల పని కల్పించి ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో రూ.లక్షలు పక్కదారి పడుతున్నాయి. ఏటా సామాజిక తనిఖీల్లో భారీగా ఆర్థిక తేడాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సామాజిక తనిఖీ ప్రజావేదిక సభలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా గుర్తిస్తున్నారు. అయినా అక్రమాలు ఆగడం లే దు. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో మొత్తం రూ.5లక్షలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. జిల్లాలో ఈ పథకం అమలవుతున్న 16మండలాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక ఆర్థిక తనిఖీలు మొదలు కానుంది. సోమవారం మందమర్రి మండలంలో ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఆ ఏడాదిలో జరిగిన ఉపాధి హామీ పథ కం నిధుల ఖర్చు, అందులో తేడాలు గుర్తించి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల ముందే వివరిస్తారు. కూలీల హాజరు పని దినాల నుంచి మెటీరియల్ పనులు, ఇతర నిధుల ఖర్చు పారదర్శకంగా జరిగిందా..? లేదా అని గుర్తిస్తారు. ఇక ఆన్లైన్తోపాటు మాన్యువల్ రికార్డులు పరిశీస్తున్నారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి పై స్థాయి వరకు ఎవరు బాధ్యులైతే వారిపై చర్యలు తీసుకుంటారు. వసూలు అంతంతే..తనిఖీల్లో గుర్తించిన నిధులపై మళ్లీ రికవరీ మాత్రం అంతంతగానే ఉంటోంది. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా నుంచి జిల్లా ఏర్పడిన వరకు అత్యధికంగా కొన్ని మండలాల్లో 15 వ రౌండ్ వరకు సభలు పూర్తి కాగా, రూ.లక్షల్లోనే నిధుల అవకతవకలు బయటపడ్డా యి. ఇప్పటికీ ఆయా నిధుల రికవరీ పూర్తి కావడం లేదు. గతేడాది పరిశీలిస్తే ఒక్క మందమర్రి మండలంలో రూ.47వేలకుపైగా తేడాలు గుర్తిస్తే, అందులో రూ.4,539 వసూలు అయ్యాయి. మిగతా ఏ మండలంలోనూ పైసా వసూలు కాలేదు. ఈ ఏడాది లోనూ డబ్బులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏప్రిల్ నుంచే మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాదికి సంబంధించి మొత్తం రూ.5లక్షలకు పైగా గు ర్తించగా, ఇందులో ఇంకా రూ.4లక్షలకు పైగా మిగిలి ఉన్నాయి. ఇక అంతకుముందు తనిఖీల్లో గుర్తించిన మొత్తం రూ.లక్షల్లో నే ఉంది. ఏటేటా సామాజిక సర్వేలో అవకతవకలు గుర్తిస్తున్నప్పటికీ ఆ మేరకు రికవరీ జరగడం లేదు.2024–25లో గుర్తించినవి విలువ (రూ.ల్లో)మండలం రౌండ్ గుర్తించింది మిగిలింది భీమిని 13 90046 90046 మందమర్రి 14 47387 42848 హాజీపూర్ 03 10428 10428 భీమారం 03 15701 15701 కన్నెపల్లి 03 20364 20364 జన్నారం 14 97278 97278 కాసిపేట 14 18166 18166 వేమనపల్లి 14 975 975 జైపూర్ 14 41632 41632 చెన్నూరు 14 51131 51131 దండేపల్లి 14 6507 6507 కోటపల్లి 15 26166 26166 లక్సెట్టిపేట 14 44088 44088 నెన్నెల 14 3872 3872 తాండూరు 15 13084 13084 బెల్లంపల్లి 15 14237 14237 మొత్తం 5,00,382 4,95,843 నోట్:మందమర్రి మండలంలో రూ.4,539 రికవరీ అయ్యాయి. పనుల్లో ఏటా రూ.లక్షల్లో అవకతవకలు కింది స్థాయి సిబ్బంది పాత్రే అధికం -
కేంద్రం హయాంలో జాతీయ రహదారుల నిర్మాణం
చెన్నూర్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారుల నిర్మాణా లు చేపట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 63వ జాతీయ రహదారి జగ్దల్పూర్ నుంచి నిజామాబాద్ రోడ్డు పనులు పూర్తయ్యాయని తెలిపారు. నిజామాబాద్ ఆర్మూర్ వయా మంచిర్యాల వరకు రూ.3376 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిందని తెలిపారు. ఈ పనులు పూర్తయి తే మంచిర్యాల నుంచి నిజామాబాద్కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అన్నారు. శ్రీరాంపూర్ నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వరకు జాతీయ రహదారి–363 నిర్మాణానికి రూ.2497 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. మంచిర్యాల నుంచి జైపూర్ మీదుగా వరంగల్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు రూ.2606 కోట్లతో ప్రారంభం అయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ నిర్మాణం చేపడితే కాంగ్రెస్, బీఆర్ఎస్లు తామే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ఆశోక్, పట్టణ అధ్యక్షుడు జాడి తిరుపతి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మ శ్రీపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎతం శివకృష్ణ, నాయకులు వంశీగౌడ్, శంకర్, రాజు పాల్గొన్నారు. -
పరిష్కారంలో అలసత్వం వద్దు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ప్రజావాణిలో అధికారులకు సూచనలు మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ● చెన్నూర్ మండలం ఓత్కులపల్లి గ్రామ రైతులు అస్నాద్ శివారులో 55ఎకరాల భూమికి సంబంధించి విరాసత్ పట్టా అమలు చేయాలని దరఖాస్తు అందజేశారు. ● మంచిర్యాలకు చెందిన నంద్యాల చంద్రమౌళి రెడ్డి మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, రిజిష్టర్ కార్యాలయంలో అక్రమ వసూళ్లు, చట్ట వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ● ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా ఇందిర మ్మ ఇల్లు మంజూరు కాలేదని, పేదలకు మంజూ రు చేయకుండా ఉన్నవాళ్లకే మంజూరు చేస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో వడం లేదని మందమర్రి మండలం కోటేశ్వర్పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. ● తన కుమారుడు కొడిత్యాల లక్ష్మినారాయణకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా మంచిర్యాల కన్సల్టింగ్ ఏజెంటు శ్రీనివాస్, ఆర్డీవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏడాది నుంచి వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన కొడిత్యాల వెంకటశివప్రసాద్ ఫిర్యాదు చేశారు. జన్నారం: జన్నారం మండలం రేండ్లగూడ గ్రామ వైకుంఠధామం కోసం 1.25ఎకరాలు కొనుగోలు చేశామని, గ్రామానికి చెందిన రాజమౌళి అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకున్నాడని, అక్రమ పట్టా రద్దు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ రవి, మాజీ సర్పంచ్ ఆశరాజ్, ఏఎంసీ డైరెక్టర్ రాజన్న, మాజీ ఎంపీటీసీ వెంకటరాజం కోరారు. 41 కాదు.. 42కిలోలు జోకుతున్నారు.. మొదట కొనుగోలు చేసిన ధాన్యం బస్తాకు 41కిలోల చొప్పున తూకం వేశారు. మిల్లుకుపోయినా లారీ ఇంకా బస్తాలు దించుకోకుండా అక్కడే ఉంది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో 41కిలోలు కాదు 42కిలోలు జోకుతున్నారు. తేమ 15శాతంలోపు వచ్చినా, తూర్పాల పట్టినా, చెత్తాచెదారం లేకుండా చేసినా బస్తాకు 42కిలోల ధాన్యం జోకుతున్నారు. తాలు, తప్ప ఉన్నా, నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినా అందరికీ ఒకేలా 42కిలోలు తూకం వేస్తున్నారు. క్వింటాల్కు నాలుగు కిలో చొప్పున లారీ లోడు ధాన్యానికి రూ.30 వేల వరకు నష్టపోతున్నాం. అధికారులే కిలోకు రెండు కిలోలు జోకాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చిన రైతుల నుంచి తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోలు చేయాలి. – రైతులు ఆర్.శ్రీకాంత్రెడ్డి, శివప్రసాద్రెడ్డి, జే.మల్లేష్, సతీష్, కిష్టాపూర్, జైపూర్ -
మామిడి మద్దతు ధరకు కృషి
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ● మ్యాంగో మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం బెల్లంపల్లి: మామిడికాయలకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. సోమవారం బెల్లంపల్లిలో మ్యాంగోమార్కెట్, కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మామిడి రైతులు మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కష్ట, నష్టాలను రైతులు తన దృష్టికి తేవడంతో క్రయవిక్రయాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసం ట్రేడర్లతోపాటు ఫ్రూట్ ఎక్స్ కంపెనీతో సంప్రదింపులు జరిపి ఒప్పించినట్లు వివరించారు. రైతులు వివిధ రకాల పండ్ల తోటలు పెంపకం చేపట్టి ఫలసాయాన్ని ఇదే మార్కెట్లో అమ్ముకుని లాభాలు గడించవచ్చని సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు పాటు పడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎండీ.షాబుద్దీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంచార్జి కార్యదర్శి ఎస్.భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కారుకూరి రాంచందర్, మాజీ ఎంపీటీసీలు ముడిమడుగుల మహేందర్, హరీష్గౌడ్, కాంగ్రెస్ నాయకులు బత్తుల రవి, నాతరి స్వామి, ఫ్రూట్ కంపెనీ యజమాని, ట్రేడర్లు, రైతులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి కృషి
దండేపల్లి: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కే.ప్రేమ్సాగర్రావు అన్నారు. మండలంలోని నంబాల గ్రామంలో సీతారామాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ఐక్యతగా చందాలు పోగు చేయడం, దానికి తోడు దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. నంబాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని, ఆలయ అభివృద్ధి కూడా కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజల అవసరాలకే ఇసుక రీచ్
జైపూర్: జిల్లా ప్రజల అవసరాలు తీర్చడానికి ఇందారం వద్ద మరో ఇసుక రీచ్ అందుబాటులోకి తీ సుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపా రు. మండలంలోని ఇందారం గోదావరి బ్రిడ్జి వద్ద మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను సోమవారం ఆయన మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మన ఇసుక వాహనం ద్వారా సరఫరా చేస్తారని తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, పంచాయతీ కార్యదర్శి సుమన్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా ఐదు..మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రజలు అవసరాలకు సరిపడా ఇసుక లభ్యతకు కొత్తగా ఐదు ఇసుక రీచ్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముల్కల్ల, వేంపల్లి–1, వేంపల్లి–2, తాళ్లపల్లి, ఇందారం ఇసుకరీచ్లను ప్రారంభించినట్లు తెలిపారు. మైనింగ్ శాఖ ఏడీ జగన్మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: భవిష్యత్లో విద్యార్థులు ఉ న్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచి ర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలతో కలిసి ప్రభుత్వ బీసీ బాలుర, బాలికల కళాశాల వసతిగృహాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇంటర్మీడియెట్ విద్యార్థులు గురుండ్ల రవీందర్, ఎస్.అభినయ్లను శాలువాలతో సన్మానించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అ భివృద్ధి అధికారి పురుషోత్తంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ డీడీ దుర్గాప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధి కారులు మోసీన్ అహ్మద్, సుధాలక్ష్మి పాల్గొన్నారు. ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
క్షయవ్యాధి నిర్మూలనకు కృషి
జైపూర్: జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ఓల్డ్ఏజ్ హోమ్స్, భవన కార్మికులు, టీబీ వ్యాధిగ్రస్తులకు ఇంటిలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా వైద్యం అందిస్తామని జిల్లా వైద్యాధికారి హరీశ్రాజు తెలిపారు. జైపూర్ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. జిల్లాలో 998 మంది టీబీ వ్యాధిగ్రస్తులు వైద్యం పొందుతున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో అంబులెన్స్ ద్వారా వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. వైద్యులు సుధాకర్నాయక్, ప్రసాద్, ముస్తఫా, జిల్లా అక్షయ ప్రోగ్రాం అధికారి సురేందర్, మాస్మీడియా అధికారి వెంకటేశ్వర్, వైద్యసిబ్బంది వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి రహిత పాలనే లక్ష్యం
● బాల్క సుమన్ హయాంలో ఇసుక దందా ● చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి రామకృష్ణాపూర్: చెన్నూర్ నియోజకవర్గంలో అవినీ తి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బాల్క సుమన్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇసుక దందా విచ్చలవిడిగా సాగిందని, తాను గెలుపొందిన తర్వాత ఇసుక దందాకు అడ్డుకట్ట వేశామని అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భీమా గార్డెన్స్లో సోమవారం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసీఆర్ తనకు తన కొడుకు, కూతురికి ఫామ్హౌజ్లు కట్టించారు తప్ప ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఉంటే బీఆర్ఎస్ పాలనలో 60 వేల ఉద్యోగాలు పోయాయని అన్నారు. ఏడాదిన్నర పాలనలో చెన్నూర్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా బాల్క సుమన్ పదేళ్లు ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్టీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి, రామ్భూపాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో బాలింత..
కాసిపేట: అనారోగ్యంతో బాలింత మృతిచెందింది. మండలంలోని మల్కేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మల్కేపల్లికి చెందిన పెరుగు రజిత(28), వెంకటేశ్ భార్యభర్తలు. పెళ్లయినప్పటి నుంచి రజిత సికిల్సెల్ వ్యాధితో బాధపడుతోంది. ఈనెల 8న కరీంనగర్లోని ప్రతిమ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చింది. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆస్పత్రిలో ఉండగానే మూడుసార్లు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు వైద్యులతో వాదనకు దిగినట్లు సమాచారం. -
తప్పుడు పత్రాలతో కొలువులు!
● ఆదిలాబాద్ జిల్లా నివాస ధ్రువపత్రాలతో బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు ● ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ మండలాల నుంచి దరఖాస్తులు ● నకిలీ సర్టిఫికెట్లు పొందిన ఇతర రాష్ట్రాల యువకులు ● ఇచ్చోడలో ముగ్గురిపై కేసు ● ఆలస్యంగా వెలుగులోకి ఘటనఇచ్చోడ: ఇతర రాష్టాల నిరుద్యోగ యువకులు కొందరు ఆదిలాబాద్ జిల్లా నివాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు సాధించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నేరడిగొండ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నివాసముంటున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందారని సమాచారం. ఈ విషయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ద్వారా బయటకు రావడంతో విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందిన ముగ్గురిపై ఆదివారం ఇచ్చోడలో కేసు నమోదైంది. ఎస్బీ అధికారుల ఫిర్యాదు మేరకు సహని సురాజ్, డాగ్ విజయ్, విశ్వుకర్మలపై కేసులు నమోదు చేశారు. మీసేవ ద్వారా దరఖాస్తులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువకులు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ గ్రామంలో నివాసముంటున్నట్లు దరఖాస్తులు చేసుకున్నారు. నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ఆధార్, రేషన్ కార్డులు పాస్ఫొటోతో జిరాక్స్ పత్రాలు జతచేసి మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి మీసేవ ద్వారా ధ్రువీకరణపత్రం జారీ చేస్తారు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తప్పుడు ఆధార్, రేషన్ కార్డులను సృష్టించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. భారీగా దరఖాస్తులు ఇచ్చోడ మండలంలో భారీగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఒక్క ఇస్లాంనగర్ గ్రామం నుంచే 189 మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీ గతంలో కొకస్మన్నూర్ పంచాయతీలో ఉండేది. ఇటీవల సాథ్నంబర్, ఇస్లాంనగర్ గ్రామాలు కలిసి నూతన పంచాయతీగా ఏర్పాటైంది. ఇస్లాంనగర్లో మొత్తం జనాభా మూడు వందల లోపు ఉంటుంది. ఇక్కడ ఉన్నత చదువులు చదువకున్న వారిని సైతం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం ఇస్లాంనగర్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా లేరు. అఽధికారులు ఆ దరఖాస్తులను రిజెక్ట్ చేశారే తప్ప, తప్పుడు ఆధార్, రేషన్కార్డులు ద్వారా నివాస ధ్రు వీకరణపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు గుర్తించకపోవడం వారి తప్పిదం కనిపిస్తుంది. అభినవ్ యాదవ్ తండ్రి ప్రేమంత్హెచ్యాదవ్. ఇతడు ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్లో ఉంటున్నట్లు 2024 ఆగస్టు 14న నివాస ధ్రువపత్రం కోసం మీసేవ ద్వారా నంబర్(ఆర్సీ022411234864) దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు పరిశీలించి రిజెక్ట్ చేశారు. మరోసారి నిజామాబాద్ జిల్లా నుంచి మీ సేవ ద్వారా నంబర్ (ఆర్సీ 022511946191) ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు పరిశీలించి గతమార్చి 15న రిజెక్ట్ చేశారు.సునీల్యాదవ్ తండ్రి రామనంద్ యాదవ్. అతనికి 2024 డిసెంబర్ 23న బీఎస్ఎఫ్లో ఉద్యోగం వచ్చింది. కాల్ లెటర్లో ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ నివాసిగా అడ్రస్ ఉంది. కానీ ఇతను ఇక్కడ లేకపోవడం, గ్రామం నుంచి బీఎస్ఎఫ్, ఆర్మీలో ఉద్యోగం చేసేవారు లేరని గ్రామస్తులు తెలిపారు. సదరు వ్యక్తి ఇస్లాంనగర్ నుంచి నివాస ధ్రువీకరణ పత్రం పొంది ఉద్యోగంలో చేరడం గమనార్హం.రిజెక్ట్ అయిన నంబర్ ద్వారానే మార్ఫింగ్ అధికారులు రిజెక్ట్ చేసిన దరఖాస్తు నంబర్తో నివాస ధ్రువీకరణ పత్రాలను మార్ఫింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇతరుల పత్రాన్ని రిజెక్ట్ అయిన దరఖాస్తు పత్రం నంబర్ ఆధారంగా మార్ఫింగ్ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. గత కొన్నిరోజుల నుంచి మీసేవ కేంద్రాలు ఓటీపీ పద్ధతి ద్వారా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఓటీపీ ద్వారా మీసేవలో లాగిన్ కావచ్చు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్లో నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లా మీసేవల నుంచి దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తులను రిజెక్ట్ తర్వాత కొందరు మీసేవ నిర్వాహకులు నివాస ధ్రువీకరణ పత్రాలను మార్ఫింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు నిందితులు బయటపడే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటాం తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగాలు సాధించినట్లు తమ దృష్టికి వచ్చింది. ఈ విషయమై విచారణ చేపట్టాలని స్థానిక తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశాం. – వినోద్కుమార్, ఆర్డీవో -
కర్రెగుట్టలో కూంబింగ్ ఆపాలి
ఉట్నూర్రూరల్: కేంద్రప్రభుత్వం చర్చలకు స్పందిస్తే మేము కూడా సిద్ధమేనని సీపీఐ మావోయిస్తు పార్టీ ప్రకటించినందన కర్రెగుట్టలో చేపట్టిన పోలీ సుల కూంబింగ్ ఆపాలని శాంతి చర్చల కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ ఆత్రం భుజంగ్రావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కోకన్వీనర్ బానోత్ రామారావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ‘ఆపరేషన్ కగార్’అంతర్యుద్దాన్ని కేంద్రం మానుకోవాలన్నారు. నక్సలైట్ల హింసలో, పోలీసుల ఎన్కౌంటర్లో, ఉగ్రవాదుల కాల్పుల్లో సామాన్య ప్రజలు సమిధలు అవుతున్నారన్నారు. కర్రెగుట్టలో పోలీసులు చేపట్టిన కూంబింగ్తో ఆదివాసీ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారు. పోలీసుల కాల్పుల చర్యలను విరమించుకోవాలని, శాంతి చర్చలకు అవకాశం ఇ వ్వాలని కోరారు. సమావేశంలో నేతావత్ రాందా స్, బండి విజయ్కుమార్, దిలేశ్ చౌహాన్, జాదవ్ రాంకిషన్, పవార్ గంగారాం నాయక్ పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి●
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలను ఖుష్బూ గుప్తా స్వీకరించారు. అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. పెంబి మండలం గుమ్మనా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని టేకం భీంరావ్, తాండూర్ మండలం కిష్టంపేట గ్రామస్తులు తమ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, ఏవో దామోదర స్వామి, ఈఈ తానాజీ, పీహెచ్వో సందీప్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు. పోలీసుల అదుపులో మైనర్ బాలుడుఆదిలాబాద్టౌన్: పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు పదేళ్లలోపు ఇద్దరు బాలురు, ఒక బాలికను నిర్బంధించాడు. తన నివాసానికి తీసుకెళ్లి తలుపు పెట్టి నిర్బంధించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆ ము గ్గురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మైనర్ బా లుడిని అదుపులో తీసుకుని సోమవారం జువైనెల్ కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. టూటౌన్ పోలీసుస్టేషన్లో కిడ్నాప్ కేసుతోపా టు అక్రమ నిర్బంధం, పోక్సో కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
ఉట్నూర్రూరల్: తండ్రి మందలించాడని కొడుకు షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలో ఈఘటన చోటు చేసుకుంది. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. ఉట్నూర్లోని శాంతినగర్ కాలనీకి చెందిన చౌహాన్ రాంకుమార్ కుమారుడు చౌహాన్ సాయి (20) ఇంటర్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పని చేసుకోవాలని తండ్రి మందలించాడు. క్షణికావేశంలో ఈనెల 26న రాత్రి ఇంట్లో అధిక మోతాదులో షుగర్ మాత్రలు మింగాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గమనించి ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్కు పంపించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. తండ్రి రాంకుమార్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక యువకుడు.. తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన యువకుడు పిట్లెవాడ్ లక్ష్మణ్ (25) అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి కథనం ప్రకారం..లక్ష్మణ్ గత రెండేళ్ల క్రితం రూ.2 లక్షల అప్పు తీసుకుని ఫైనాన్స్పై ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కిరాయికి ట్రాక్టర్ నడవకపోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదు. దీంతో ట్రాక్టర్ను అమ్మి కిస్తీలు కట్టాడు. గతంలో తీసుకున్న రూ.2 లక్షల అప్పు ఎలా తీర్చాలనే బెంగతో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి అందరు నిద్రపోయాక ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న ట్రెయినీ ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
● సీఎంఓ కిరణ్ రాజ్కుమార్ శ్రీరాంపూర్/మందమర్రిరూరల్/రామకృష్ణాపూర్: సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కంపెనీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని సి ంగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) కిరణ్ రాజ్కుమార్ అన్నారు. సోమవారం ఆయన శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఆర్కే 8 డిస్పెన్సరీ, నస్పూర్ డిస్పెన్సరీ, మందమర్రిలోని కేకే డిస్పెన్స రీ, రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రుల ను సందర్శించారు. వార్డులను సందర్శించి వైద్య సేవలు, చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది సమయపాలన పా టించాలని సూచించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్తో కలిసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేసవి దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఆయనను ఆయా ప్రాంతాల్లో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) బీభత్సా, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రె డ్డి, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, డీవైసీఎంఓ రమేశ్బాబు, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, వైద్యులు వేద వ్యాస్, మురళీధర్, లోక్నాథ్ రెడ్డి, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, ఐఈడీ ఎస్ఈ కిరణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ అధి కారి హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు. ఉద్యోగులకు వైద్యసేవలు జైపూర్: పవర్ ప్లాంట్ ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎంఓ కిరణ్రాజ్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో డిస్పెన్సరీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో వసతులు, ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్ రవీందర్, శ్యామల ఉన్నారు. -
పాన్షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
నిర్మల్టౌన్: ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్, శాంతినగర్, చైన్గేట్ సమీపంలోని పలు పాన్షాపుల్లో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓసీబీ పేపర్స్ లభ్యం కాగా, సాధారణంగా వీటిలో గంజాయితో చుట్టి కాల్చడానికి ఈ పేపర్లు వాడతారని ఏఎస్పీ తెలిపారు. దీనిపై విచారణ చేయిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ సేవించిన, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్సై రవి, ప్రొబేషనరీ ఎస్సై జుబీర్, సుప్రియ, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఎస్టీపీపీకి పలు విభాగాల్లో బహుమతులు
జైపూర్: ప్రపంచ భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని డిపార్టుమెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ని ర్వహించిన వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎస్టీపీపీ సే ఫ్టీ బృందం రెండు బహుమతులు గెలుపొందింది. సేఫ్టీ పోస్టర్ డ్రాయింగ్ కాంపిటీషన్లో శ్రీ నాథ్ బహుమతి గెలుపొందగా, ఎస్టీపీపీ నాటి క బృందం రక్షణపై అవగాహన కల్పిస్తూ నాటికను ప్రదర్శించగా మరో బహుమతి గెలుపొందింది. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్రా వు, డాక్టర్ సంజయ్ చతుర్వేది, హేమచంద్ర చే తులమీదుగా బహుమతులు అందుకున్నారు. డీజీఎం పంతులా, ఎస్ఈ సేఫ్టీ సురేశ్, డివైఎస్సీ శ్రీనాథ్, పవర్మేక్ సేఫ్టీ అధికారి శ్రావణ్, ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు ఎంపికకుంటాల: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ ధ్వర్యంలో ఈనెల 26, 27, 28 తేదీల్లో రాజన్న సిరిసిల్లలో వుషు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. కుంటాలలోని విజయసాయి పాఠశాల విద్యార్థి జాదవ్ ఆర్యన్ సబ్జూనియర్ వుషు ఛాంపియన్ పోటీల్లో జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. తమిళనాడులోని తిరుచెంగోడేలో మే 26 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనున్నాడు. -
అడవి పందుల దాడిలో ముగ్గురికి గాయాలు
ఆసిఫాబాద్రూరల్: మండలంలో కౌటగూడలో సోమవారం అడవిపందుల దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. కుమురం రవి, ప్రేమలత, రాజుబాయిలు ఉదయం 10 గంటల ఇంటి ముందు కూర్చొన్నారు. వీరిపై ఒక్కసారిగా అడవిపందులు వచ్చి దాడి చేయగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రేమలత, రాజుబాయిను మంచిర్యాలకు రెఫర్ చేశారు. యువౖ రెతు కూడా.. కోటపల్లి: పంట కాపలా వెళ్లిన యువరైతు అడవి పందుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని బోరంపల్లికి చెందిన దుర్గం శేఖర్కు రాంపూర్ శివారులో వరి పొలం ఉంది. అడవి పందుల బెడద కారణంగా ఆదివారం రాత్రి పంటకు కాపలాగా ఉండేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అడవిపందులు ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి రైతులు వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు..
నెన్నెల: ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని కొత్తగూడం గ్రామానికి చెందిన యువకుడు దుర్గం బాలస్వామి(26) వ్యవసాయ పని కోసం తన సొంత ట్రాక్టర్తో సోమవారం నెన్నెలకు వస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా స్టీరింగ్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ కింద బాలస్వామి శరీరం మొత్తం ఇరుక్కుపోయింది. గ్రామస్తులు వచ్చి అతడిని బయటకు తీసి 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తమ్ముడు జీవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి భార్య ప్రసన్న, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రిమ్స్లో చికిత్స పొందుతూ ఒకరు.. ఆదిలాబాద్టౌన్: మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా పల్సితాండకు చెందిన జాదవ్ మనోజ్ (38) రిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు టూటౌన్ ఏఎస్సై ఖైసర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోజ్ మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు రిమ్స్లో ఉదయం చేర్పించగా, రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య జయశ్రీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
వేసవిలో జీవాలు పైలం
● మేత, దాణా సరిపడా అందించాలి ● జాగ్రతలు తప్పనిసరంటున్న పశువైద్యాధికారి సతీశ్ చెన్నూర్రూరల్: వేసవిలో పాడి పశువులు, జీవాల పోషణపై జాగ్రత్తలు తీసుకోవాలని కత్తెరసాల పశువైద్యాధికారి సతీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో.. పాడి పశువులకు వేసవిలో మేత, దాణాను సరిపడా అందించాలి. పచ్చిమేత దొరకని సమయంలో ఎండుమేత దీంతోపాటు ఎక్కువగా దాణాను ఇవ్వాలి. పశువులకు ఎల్లవేళలా పరిశుభ్రమైన చల్లని నీరు లభించేలా చూడాలి. మేత, నీరు సరిపడా ఉంటే పాడి పశువులు వేసవిలో కూడా పాలు బాగా ఇస్తాయి. ఎదకొచ్చి చూలు కడుతాయి. వేసవిలో పాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే పాడి పరిశ్రమకు లాభదాయకం. దీనికోసం పశువుల షెడ్లు(కొట్టాల) వద్ద చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. వీలైతే షెడ్డు(కొట్టాల)పై గడ్డిని కప్పి ఉంచాలి. షెడ్ల చుట్టూ తడికెలు, గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లాలి. పశువులపై మధ్యాహ్నం రెండు, మూడుసార్లు నీళ్లు చల్లితే మంచిది. గేదెలను చెరువులకు పంపి మధ్యాహ్నం కొంతసేపు అందులో ఉండనివ్వాలి. కొట్టాల చుట్టూ పెద్ద చెట్లు ఉంటే లోపల చల్లగా ఉంటుంది. ఈ పద్ధతుల్ని పాటిస్తే పాలు ఎక్కువగా ఉండటమే కాకుండా పశువులు ఎదకొచ్చి చూడి కడుతాయి. అలా అవి సంవత్సరం పొడవునా ఈని పాలిచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం పాలు పితికే ముందు పశువును, పొదుగును చల్లని నీటితో కడిగితే మంచిది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వేసవిలో గొర్రెలు, మేకల్ని జత కలిపి చూడి కట్టించాలి. మూడు నెలల వయసు దాటిన పిల్లలను తల్లుల నుంచి వేరుచేయాలి. పిడుదులు, గోమార్లు లేకుండా మూడు వారాలకోసారి మందు కలిపిన నీటిలో గొర్రెలను తడిపి తీయాలి. అమ్మతల్లి(బొబ్బ, మశూచి) టీకాలు, చిటుక రోగం టీకాలను పిల్లలకు తప్పకుండా వేయించాలి. మధ్యాహ్నం పూట ఎండ వేడిమికి మేతకు బయట మేపకపోవడం మంచిది. బయట మేసే సమయంలో చెట్ల నీడ, తాగునీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలి. నట్టల నివారణ మందులను పశువైద్యుడి సలహా మేరకు వినియోగించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో పశువులను, జీవాలను కాపాడుకోవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
సారంగపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కౌట్ల(బి) గ్రామానికి చెందిన తొండకూరి సాయన్న (45) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో నిర్మల్ నుంచి స్వర్ణ గ్రామానికి వెళ్తున్నాడు. ఆటోను అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్ల కౌట్ల(బి) శాంతినగర్ మూలమలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయం కాగా 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఆదివారం అధికారులకు దావత్!?
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని జన్నారం, బెల్లంపల్లి, కోటపల్లి, హాజీపూర్ తదితర మండలాల్లో శని వారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతుంటే.. అధికారులు మా త్రం ఆదివారం మిల్లర్ల దావత్లో మునిగితేలడం వివాదాస్పదమైంది. వేంపల్లి శివారులోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో రారైస్, బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఏర్పాటు చేసిన ఈ దావత్లో ఒక ఉన్నతాధికారితోపాటు సంబంధిత శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధా న్యం సరఫరా, మిల్లింగ్ తర్వాత సీఎంఆర్ బియ్యం స్వీకరణ వంటి అంశాలకు సంబంధించిన అధికా రుల హాజరు, మిల్లర్లతో సన్నిహిత సంబంధాలపై ఆనుమానాలను రేకెత్తిస్తోంది. మిల్లర్ల తిరకాసు కారణంగా జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరుగు పేరుతో ధాన్యంలో కోత విధిస్తున్నారు. మిల్లులకు ధాన్యం తరలింపులో ఆలస్యం చేస్తున్నారు. లారీలు రోజుల తరబడి మిల్లుల వద్ద నిలిచిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలను సందర్శించాల్సిన అధికారులు మిల్లర్లతో దావత్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర
జన్నారం/బెల్లంపల్లి/కోటపల్లి: జిల్లాలోని జన్నారం, బెల్లంపల్లి, తాండూర్, కోటపల్లి మండలాల్లో శనివారం రాత్రి వరణుడు అన్నదాతపై కన్నెర్రజేశాడు. అకాల వర్షంతో కల్లాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. మామిడి కాయలు నేలరాలాయి. జన్నారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోగా, బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో మామిడి కాయలు గాలి దుమారంతో నేలరాలాయి. ఈ ప్రకృతి విపత్తు రైతులను ఆర్థక దెబ్బతోపాటు మానసిక ఆఘాతంలోకి నెట్టింది. రాత్రి 11 గంటల సమయంలో జన్నారం మండలంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వరదలో కొట్టుకుపోయింది. పొనకల్, ఇందన్పల్లి, మొర్రిగూడ, కవ్వాల్, రేండ్లగూడ వంటి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి, కొన్ని చోట్ల నీటిలో కొట్టుకుపోయింది. ఆలస్యంగా కల్లాల వద్దకు చేరుకున్న రైతులు ధాన్యం కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన అ కాల వర్షం, గాలి దుమారంతో మామిడి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. గాలి దుమారం కారణంగా చెట్లపై ఉన్న మామిడి కాయలు నేలరా లాయి. మరో వారంలో కాయలను సేకరించాలని ఆశించిన రైతులు, వ్యాపారులకు ఈ విపత్తు ఆర్థిక దెబ్బతీసింది. ప్రభుత్వం స్పందించి, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, మామిడి రైతులకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. కోటపల్లి మండలంలో ఆకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. కుప్పపై నిలిచిన నీటిని ఎత్తివేస్తున్న మహిళపొనకల్ మార్కెట్ యార్డులో వరదకు కొట్టుకుపోయిన ధాన్యం అకాల వర్షంతో వరి ధాన్యం వరదపాలు నేలరాలిన మామిడి కాయలు ఆదుకోవాలని బాధిత రైతుల వేడుకోలు -
ప్రశాంతంగా మోడల్స్కూల్ ప్రవేశ పరీక్ష
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొ త్తం 1,686 మంది విద్యార్థులకు 1,365 మంది హాజరయ్యారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వర కు పరీక్షలు జరిగాయి. 6వ తరగతి పరీక్ష కో సం 8 పరీక్ష కేంద్రాల్లో 1,021 మంది విద్యార్థులకు 815 మంది హాజరయ్యారు. ఏడో తరగతిలో 299 మందికి 265 మంది, ఎనిమిదో తరగతిలో 212 మంది విద్యార్థులకు 172 మంది, 9వ తరగతికి 126 మంది 99 మంది, పదో తరగతిలో ప్రవేశ పరీక్షకు 28 మందికి 14 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో యాదయ్య వివరించారు. -
సర్కారు బడిలో వేసవి శిక్షణ
● 12 రోజులు నిర్వహణ ● జిల్లాలో 108 పాఠశాలలు ఎంపిక మంచిర్యాలఅర్బన్: సర్కారు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా వివిధ కార్యక్రమాల్లో రాణించేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు 15 నుంచి 20 రోజులపాటు(12 వర్కింగ్ డేస్) వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో విద్యతోపాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలను నేర్పిస్తారు. జిల్లాలో ఎలాంటి శిక్షణ నిర్వహించాలనే అంశాలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే మే 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 12,600 మంది విద్యార్థులు జిల్లాలో 108 పాఠశాలల్లో 12,600 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, ధ్యానం, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు, సైన్స్ ప్రయోగాలు పలు అంశాలపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్ఎంతోపాటు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో వలంటీర్లు రోజుకు మూడు గంటలపాటు అంశాలపై శిక్షణ ఇస్తారు. 40 మంది విద్యార్థులకు ఒక వలంటీర్ను నియమిస్తారు. ఒక్కో ఇన్స్ట్రక్టర్కు రూ.6 వేల గౌరవ వేతనం అందిస్తారు. ఇందుకు రూ.50 లక్షల బడ్జెట్ అంచనా వేశారు. మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు అవసరమని గుర్తించి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తున్నాయి. -
కాంగ్రెస్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందని తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గం అడ్వైజర్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పీసీసీ సభ్యుడు రామ్ భోపాల్తో కలిసి రాఘవరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్ స్థాయి నుంచి గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో పటిష్టం చేయాలన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు, కార్యకర్తలను నాయకత్వం గుర్తిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. -
ఒప్పందాలతోనే సరి.. అమలు ఏది మరి?
● స్ట్రక్చరల్ ఒప్పందాలకు కలగని మోక్షం ● ఉత్తర్వుల జారీలో సింగరేణి జాప్యం ● నష్టపోతున్న కార్మికులు ● గుర్తింపు సంఘం ఒత్తిడికి డిమాండ్శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశాలు చాలా కాలం తర్వాత ఫలప్రదమయ్యాయి. అనేక డిమాండ్లపై యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాల అమలులో జాప్యం కార్మికులను నిరాశకు గురి చేస్తోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యజమాన్యంతో జరిపిన చర్చల్లో ఆమోదించిన డిమాండ్లు ఇప్పటికీ కాగితంపైనే ఉన్నాయి. సమావేశాల పునరుద్ధరణఐదేళ్లుగా నిలిచిన స్ట్రక్చరల్ సమావేశాలు, 2024లో ఏఐటీయూసీ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 24న డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్), మార్చి 6, 2025న సీఎండీ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు మెడికల్ అన్ఫిట్ కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు, స్వంత ఇళ్ల కార్మికులకు క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రస్తావించారు. కమిటీల జాప్యంసొంత ఇంటి పథకం, పెర్క్స్పై పన్ను మినహాయింపు, విజిలెన్స్ కేసుల పరిష్కారం వంటి డిమాండ్లపై కమిటీలు ఏర్పాటు చేయాలని యజమాన్యం నిర్ణయించింది. అయితే, కమిటీల ప్రక్రియలో జాప్యం నివారించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యజమాన్యం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, కమిటీల నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కార్మికులు కోరుతున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు కార్మిక సంక్షేమానికి ఆశాకిరణంగా నిలిచినప్పటికీ, ఒప్పందాల అమలులో జాప్యం కార్మికుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. యాజమాన్యం ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి.. కంపెనీ స్థాయిలో డైరెక్టర్ (పా), సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశంలో జరిగిన ఒప్పందాలపై యజమాన్యం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి. జాప్యం సరికాదు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం చాలా కాలంగా కార్మికవర్గం ఎదురుచూస్తుంది. ఉత్తర్వుల కోసం యజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. – కొరిమి రాజ్కుమార్, ఏఐటీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శిఒప్పందాలలో జాప్యంయజమాన్యం కొన్ని డిమాండ్లకు బేషరతుగా ఒప్పుకుంది. మరికొన్నింటిపై కమిటీలు ఏర్పా టు చేస్తామని చెప్పింది. ప్రమోషన్లలో సర్వీసు నిబంధనల మార్పు, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజె క్టు కోడ్ల విభజన, హైదరాబాద్లో సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, క్యాంటీన్ల స్వయం నిర్వహణ వంటి ఒ ప్పందాలు కుదిరాయి. మైనింగ్ స్టాఫ్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు అండర్ గ్రౌండ్లో మెడికల్ అన్ఫిట్ అయితే వారికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ డిమాండ్ పరిష్కా రం కోసం వీరంతా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు. జేఎంవో, జేటీవో, జేఏవోలకు ప్రమోషన్కు సంబంధించిన అంశంలో ఏ1 గ్రేడ్లో 5 సంవత్సరాల సర్వీసు చేసి ఉంటేనే వారికి ఎగ్జిక్యూటీవ్ గా పదోన్నతి కల్పిస్తుండగా దాన్ని మార్చుతూ ఏ గ్రేడ్లోనే 5 సంవత్సరాలు సర్వీసు ఉన్న కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పందమైంది. కాని దీనికి కూడా ఉత్తర్వులు రాలేదు. డిస్మిస్ కార్మికులందరికీ 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక సంవత్సరం 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగం కల్పించడానికి యజమాన్యం ఒప్పుకుంది. ఈ ఒప్పందాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది. -
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలో ని నర్సింగాపూర్, నంనూర్, గుడిపేటలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్దీపక్, నంనూర్, దొనబండ, హాజీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ ఆదివారం వేర్వేరుగా సందర్శించారు. శనివా రం రాత్రి గాలి దుమారంతోపాటు కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని తెలుసుకున్నారు. కేంద్రాల్లోని ధాన్యం తూకం, టాబ్లో నమోదు, ధాన్యం తరలింపు, మిల్లుల్లో అన్లోడింగ్ తదితర వివరాలు తెలుసుకున్నారు. సన్న, దొడ్డు రకం వరి ధాన్యంను నిబంధనల మేరకు కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ప్యాడీ క్లీనర్లు, హస్క్ రీమూవర్లు, తేమ మీటర్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
చెన్నూర్/రామకృష్ణాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెన్నూర్, రామకృష్ణాపూర్లో ఆదివా రం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చెన్నూర్ నియోజకవర్గంలో 40 ఏళ్లు వివేక్ కుటుంబ సభ్యులే అధికారంలో ఉన్నా ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో చెన్నూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది తప్ప 18 నెలల్లో వివేక్ ఒక్క రూపాయి తీసుకురాలేదని తెలిపారు. తన హయాంలో మంజూరైన నిధులకు పేరుమార్చి తాను తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవిపై శ్రద్ధ చూపిస్తున్నారే తప్ప, నియోజకవర్గ అభివృద్ధిపై ఆసక్తి లేదని విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఇక ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మందమర్రి ఆర్వోబీ, క్యాతన్పల్లి ఫ్లైఓవర్ వంటి పనులను వివేక్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై దశలవారీ ఆందోళనలు, మెంబర్షిప్ డ్రైవ్, కమిటీల ఏర్పాటు చేపడతామని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్లోని రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేశ్, రాంలాల్గిల్డా, మంత్రి బాపు, మోతె తిరుపతి, నవాజ్, కృష్ణ, ఆరీఫ్, సుదర్శన్గౌడ్, బడికల సంపత్, జాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ -
కల్మలపేటలో వృద్ధుడి హత్య!
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు వేమనపల్లి: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వృద్ధుడు హత్యకు గురైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కల్మలపేటకు చెందిన బద్ది లచ్చయ్య (64) మొదటి భార్య మధునక్క మృతి చెందగా లక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు నలుగురు కుమారులు నారాయణ, పోచన్న, రాములు, తిరుపతి ఉన్నారు. లచ్చయ్య కౌలు వ్యవసాయం, గుడుంబా అమ్ముకుంటూ అదేఇంట్లో వేరే గదిలో ఉంటున్నాడు. శనివారంరాత్రి చిరుజల్లులు కురుస్తుండగా తన ఎక్స్ఎల్ వాహనంపై బయటకు వెళ్లివచ్చాడు. తెల్లారేసరికి ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. గమనించిన కోడలు సమ్మక్క ఏడుస్తూ కొడుకులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు ఉపయోగించిన ఎడ్లబండికి ఉండే గడుగొయ్య అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పెద్ద కొడుకు నారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటన స్థలాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు , చెన్నూర్రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్ పరిశీలించారు. -
● నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ ● రాష్ట్ర వ్యాప్తంగా 15 బ్యాచ్లు ● ఉమ్మడి జిల్లాలో 1,450 మందికి తర్ఫీదు
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యావ్యవస్థలో నూతనంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు గిరిజన సంక్షేమశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా విద్యాబోధన అందించాలని భావించింది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమోన్నత పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, సీఆర్టీలు, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు నేటి నుంచి ఆన్లైన్ మాధ్యమంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు 15 బ్యాచ్లను తయారు చేశారు. ఒక్కో బ్యాచ్కు 350 నుంచి 400 మంది టీచర్లు క్లాసులు వినేలా ప్రణాళికలు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయులు ఈ నెల 26, 28 తేదీల్లో ఏఐటూల్స్పై శిక్షణ పొందనున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్ లోకల్ బాడి పాఠశాలల్లో ఎంపిక చేసిన 3, 4, 5వ తరగతుల విద్యార్థులకు ఏఐ విద్య కొనసాగుతుండగా కొంతమార్పు వచ్చింది. రీడింగ్, రైటింగ్ స్కిల్స్ పెరిగాయి. గణితంలోనూ లెక్కలు చేయగలుగుతున్నారు. ఇదే తరహాలో గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఏఐ విద్యాబోధన అందించాలని గిరిజన సంక్షేమశాఖ సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మే 30 వరకు ఆన్లైన్ తరగతులు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,560 మంది ఉపాధ్యాయులు ఏఐపై శిక్షణ తీసుకోనుండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గల 1,450 మంది ఆన్లైన్ వేదికగా ఆన్లైన్ శిక్షణలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాకు 26, 28 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 15 బ్యాచ్లను తయారు చేయగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉపాధ్యాయులకు మే 26న 13వ బ్యాచ్లో ఆదిలాబాద్, నిర్మల్, 28న 14వ బ్యాచ్లో కుమురం భీం, మంచిర్యాల జిల్లాల ఉపాధ్యాయులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఆరు సెషన్లలో సబ్జెక్టుల వారీగా తరగతులు కొనసాగుతాయి. సిగ్నల్స్ లేక.. పాఠాలు వినక కోవిడ్ కారణంగా అనేక మంది విద్యార్థులు చదువులో వెనుకబడి పోయారు. ఐటీడీఏ పరిధిలోని ఆన్లైన్ బోధనలకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో చాలామంది ఆన్లైన్ తరగుతులకు దూరమయ్యారు. కొన్నిచోట్ల సిగ్నల్స్ ఉన్నప్పటికీ డేటా సరిపోక పోవడంతో మధ్యలోనే అంతరాయం ఏర్పడేది. చివరకు ఏపాఠం చెబుతున్నారో.. తామేం వింటున్నమో అనేంతగా విద్యార్థుల్లో గందర గోళం ఏర్పడింది. గత అనుభభవాలను దృష్టిలో పెట్టుకుని సిగ్నల్స్కు అంతరాయం లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆసిఫాబాద్లోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు రెగ్యులర్ ఉపాధ్యాయులు : 878 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు : 26 సీఆర్టీలు : 528 ఉన్నత పాఠశాలలు : 126 ప్రాథమిక పాఠశాలలు : 950 శిక్షణలో పాల్గొనాలి నేటికాలంలో ఏఐ విద్యాబోధన విద్యార్థులకు ఎంతో ఆవశ్యకమైంది. కాలానుగుణంగా బోధనలో మార్పులు తేవడానికి గిరిజన సంక్షేమ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఐటీడీఏ పీవో ఆదేశానుసారంగా మేలో కొనసాగే ఏఐ టూల్స్ పై ఎంపిక చేసిన ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొనాలి. విద్యారంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలి. – పుర్క ఉద్దవ్, ఏసీఎంవో, కుమురంభీం -
జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని బాల కేంద్రానికి చెందిన చిన్నారులు జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మహారాష్ట్రలోని వార్ధాలో ఈనెల 25, 26 తేదీల్లో రాష్ట్రీయ కళామంచ్, సచిన్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి నృత్యోత్సవ పోటీల్లో విజేతలుగా నిలిచారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో కూచిపూడి ఈవెంట్లో దువాస హర్షిని, కోండ్ర అలేఖ్య ప్రథమ స్థానంలో, జాహ్నవి క్షీరసాగర్ ద్వితీయస్థానంలో నిలిచినట్లు బాలకేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి తెలిపారు. జూనియర్ విభాగంలో ప్రథమస్థానంలో వర్ధిని, ద్వితీయ స్థానంలో శ్రీనిధి, సబ్ జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానంలో ఇతీక్ష కొంకటి, ద్వితీయ స్థానంలో రితీక్షా జంగిలి, ప్రాపర్టీ రౌండ్లో సన్నిధి దేశ్ముఖ్, హర్షిని ఠాకూర్ ప్రథమ స్థానంలో నిలిచారు. మహారాష్ట్ర వేదికగా జరిగిన పోటీల్లో బాలకేంద్రం చిన్నారులు ఇప్పటివరకు మూడు పర్యాయాలు ప్రథమ స్థానంలో నిలిచారని నిర్వాహకులు వెల్లడించారు. -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో సెల్పాయింట్ దగ్ధం
జన్నారం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సెల్పాయింట్ దగ్ధమైన సంఘటన మండలంలోని కలమడుగులో చోటు చేసుకుంది. బాధితుడు మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో తాళం వేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో షాపు లోపలి నుంచి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పివేశారు. ఆదివారం ఉదయం ఫైర్ అధికారి శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనలో మొత్తం రూ.16 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
అలనాటి ఇళ్లలో..చల్లగా.. హాయిగా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీంతో పేదల ఇళ్లలో ఫ్యాన్లు, మధ్య తరగత ఇళ్లలో కూలర్లు, ఎగువ మధ్య తరగతి నుంచి సంపన్నుల ఇళ్లలో ఏసీలు 24 గంటలూ నడుస్తున్నాయి. అయినా వాటికింద ఉన్నంతసేపే వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాసేపు బయటకు వెళ్లినా వేడి తట్టుకోలేకపోతున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలోని పాతకాలంనాటి ఇళ్లలో ఉంటున్నవారు మాత్రం మండువేసవిలోనూ చల్లగా.. హాయిగా ఉంటున్నారు. ఎక్కువ ఎత్తుతో కట్టిన మట్టి మిద్దెలు, ఎక్కువ గ్రీనరీతో నిర్మించుకున్న పురాతన ఇళ్లలో ఫ్యాన్ గాలి చల్లదనం సరిపోతుందని పేర్కొంటున్నారు. నాటి నిర్మాణ శైలి, నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి కారణంగా నేటికీ ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా ఆ ఇళ్లలో వేడిగా ఉండదని యజమానులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్చల్లదనం పంచుతుంది మాది రత్నాపూర్ కాండ్లి. మేము ఇద్దరం అన్నదమ్ములం. 1970లో రూ.50 వేలు ఖర్చుచేసి బంకమట్టి ముద్దలు, సున్నపురాయి కలిపి ఇంటిగోడలు నిర్మించాం. ఇంటి పైకప్పుపై మట్టిముద్దలు పేర్చి దానిపై గూనపెంకలు పేర్చాం. అందుకే వేసవి కాలంలో కూడా మాఇల్లు చల్లదనాన్ని పంచుతుంది. – ముత్తన్న, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ఏసీ, కూలర్ అవసరం లేదు మాదీ నిర్మల్ రూరల్ మండలంలోని రత్నాపూర్కాండ్లీ. ఎస్సారెస్పీ రియాబిటేషన్ విలేజ్ కావడంతో 1977లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన వారికి విశాలమైన ఇళ్ల స్థలాలు ఇచ్చింది. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో మా మామయ్యలు ఎంతో ఆసక్తితో చుట్టూ బంతి ఇల్లు నిర్మించారు. వేసవికాలంలో ఎలాంటి ఏసీ, కూలర్ అవసరం ఉండదు. అందుకే ఇప్పటికీ అతి పురాతనమైన ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నాం. – ఉమారెడ్డి, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ డంగుసున్నంతో నిర్మించాం దండేపల్లి: మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మాదాపూర్. 90 ఏళ్ల క్రితం డంగుసున్నంతో మిద్దె ఇల్లు (భవంతి) నిర్మించాం. సాధారణ ఇళ్లకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించాం. ఇప్పటికీ మాఇంట్లో ఫ్యాన్లు తప్పా కూలర్లు, ఏసీలు వాడం. మండు వేసవిలోనూ ఎంతో చల్లగా ఉంటుంది. 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. – వీరమనేని సుభద్ర, మాదాపూర్, దండేపల్లి, మంచిర్యాల చల్లగానే ఉంటుంది మా నాన్నలు ఇద్దరు అన్నదమ్ములు. మేము నలుగురం అన్నదమ్ములం. 1970లో కలిసికట్టుగా బంతి ఇల్లు నిర్మించుకున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా అన్నదమ్ములం ఇదే ఇంట్లో కలిసే ఉంటున్నాం. ఇంటి పైకప్పుకు వేపచెక్కలు కొట్టి వాటిపై మట్టిముద్దలు వేసి పైన గూనపెంకలు పేర్చారు. అందుకే వేసవికాలంలో ఎండలు ఎంతగా ముదిరినా మా ఇంట్లో మాత్రం చల్లగానే ఉంటుంది. – లింగన్న, రత్నాపూర్ కాండ్లి, నిర్మల్ -
● బాధిత కుటుంబాల భరోసాకు ప్రభుత్వం కార్యాచరణ ● ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు ● నేడు అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం
ఉన్న ఊర్లో ఉపాధిలేకనో.. గల్ఫ్ దేశాలకు వెళ్తే జీవనం మెరుగుపడుతుందనో.. తమ కుటుంబాలు బాగుపడతాయనో.. కారణం ఏదైనా కావచ్చు.. ఉమ్మడి జిల్లా నుంచి రెండు దశాబ్దాలకుపైగా ఎడారి దేశాలకు వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే విధి నిర్వహణలో అనారోగ్యం రీత్యా, ప్రమాదాల బారిన పడి, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పలుకారణాలతో మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వారిపై ఆధారపడిన బాధిత కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే 15 రోజుల క్రితం ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేసింది. వారి జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పించింది. నేడు అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం సందర్భంగా కథనం.నిర్మల్ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, కువైట్ తదితర దేశాలకు రెండు దశాబ్దాలకు ముందు నుంచే వలసలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 70 వేలకు పైగా మంది కార్మికులు వివిధ గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. కాగా ఎక్కువమంది నైపుణ్య రహిత కార్మిక రంగంలోనే ఉపాధి పొందేందుకు వెళుతుండడంతో అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడడం, ఒత్తిడికి గురికావడం, ప్రమాదాల బారిన పడటం వంటి అనేక కారణాలరీత్యా తనువుచాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై సలహాలు, సూచనలు అందించేందుకు ప్రత్యేక గల్ఫ్ సంక్షేమ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి బిఎం వినోద్ కుమార్ను చైర్మన్గా, 12 మందిని సభ్యులుగా నియమించింది. ఇందులో నిర్మల్ జిల్లాకు చెందిన స్వదేశ్ పరికిపండ్లకు అవకాశం కల్పించింది. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన గల్ఫ్ బాధిత కుటుంబాల్లో కాసింత భరోసా కల్పించినట్లు అయింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం అందజేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి రెండు దశల్లో ఈ పరిహారం ఆయా బాధిత కుటుంబాల ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయి. అమలుచేయాల్సినవి ఇవే.. ● ఎన్నారై పాలసీ అమలు ● ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయడం ● ఎంబసీలో తెలుగు అధికారుల నియామకం ● మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడం ● అంత్యక్రియలకు ఆర్థికసాయం ● బాఽధిత కుటుంబాలకు పరిహారం ● వివిధ కారణాలతో అక్కడి జైళ్లో మగ్గుతున్న్ల కార్మికులకు న్యాయ సహాయం ● ప్రమాద ఆరోగ్య బీమా అమలు ● నైపుణ్య శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ● తిరిగివచ్చిన కార్మికులకు పునరావాసం నేడు నిర్మల్లో ప్రత్యేక కార్యక్రమం అంతర్జాతీయ కార్మిక స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో గాయపడిన లేదా మృతి చెందిన, అంగవైకల్యం పొందిన కార్మికుల స్మారకార్థం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘చనిపోయిన వారిని స్మరించండి–బతికున్న వారికోసం పోరాడండి’ అనే నినాదంతో టీపీసీసీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ‘అమరుల దినోత్సవం’ నిర్వహించనున్నట్లు గల్ఫ్ కార్మిక సంక్షేమ రాష్ట్ర సలహా మండలి సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల తెలిపారు.స్వగ్రామంలో గల్ఫ్ కార్మికుడి మృతదేహం (ఫైల్) -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూన్ లైట్ బార్ బిల్డింగ్ సెల్లార్ కింద వాష్ రూమ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ ఆకుల అశోక్ తెలిపారు. బార్ యజమాని ఆదివారం సెల్లార్ కిందకు వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు ఉందన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తు తెలియని స్థితిలో ఉందన్నారు. బార్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఽసీసీ పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిబోథ్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ధన్నూర్(బి) గ్రామానికి చెందిన ముసుగు రాకేశ్రెడ్డి (37), ముద్దం రాజు ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బోథ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా సాయినగర్ కాలనీ వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఎదురుగా వచ్చిన టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో 108లో బోథ్లోని సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా రాకేష్రెడ్డి మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
వ్యవసాయరంగం బలోపేతానికి కృషి
● ఎంపీ గోడం నగేశ్ఇంద్రవెల్లి: వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని పిట్టబొంగరంలో ఏర్పాటు చేసిన మన్కీ బాత్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని రైతులకు రేడియో ద్వారా వినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆర్థికాభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మన్కీ బాత్ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగంలో పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు సలహాలు, సూచనలు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతీరైతు పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా పిట్టబొంగరం, దస్నాపూర్, ధర్ముగూడ, బట్టగూడ గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆరెల్లి రాజలింగు, నాయకులు మారుతి దేవ్పూజే, శివకుమార్ జైస్వాల్, ముండే రాజేశ్వర్, దిలీప్ మోరే, రాథోడ్ భీంరావ్, మెస్రం తుకారాం, కనక హనుమంత్రావ్, కోవ రాజేశ్వర్, గేడం యేశ్వంత్రావ్, తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ పోటీల్లో బంగారు పతకాలు
మంచిర్యాలటౌన్: ఈనెల 24 నుంచి 26 వరకు హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ 7వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించింది. ఆదివారం క్రీడాకారులు మంచిర్యాల రైల్వేస్టేషన్కు చేరుకోగా అసోసియేషన్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. జట్టు కెప్టెన్గా వ్యవహరించిన అమూల్య, కోచ్ సునార్కర్ అరవింద్, మేనేజర్ సాయిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి రమేశ్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రెటరీ రఘునాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
జైపూర్: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే 163 భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కిష్టాపూర్ వద్ద ఎగ్జిట్ ఇవ్వాలని వరంగల్–విజయవాడ హైవే రోడ్డు భూనిర్వాసితులు శనివారం కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం మా భూములను సైతం హైవే రోడ్డుకు ఇచ్చి మాకు ఉన్న ఉపాధి కోల్పోయామన్నారు. స్థానిక భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తే పనులను అడ్డుకుంటామన్నారు. స్థానిక కాంట్రాక్టు పనుల్లో కూడా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు సుందిళ్ల మల్లేశ్, రామారావు, రాంరెడ్డి, జనార్దన్రెడ్డి, కృష్ణమూర్తి, భూమయ్య, ప్రభాకర్, రాజారాం, సాగర్రెడ్డి, కృష్ణారెడ్డి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అందాల పోటీలు రద్దు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రపంచ సుందరి అందాల పోటీలు రద్దు చేయాలని మహిళా, విద్యార్థి, యువజన సాంస్కృతిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముష్క జ్యోతి, అరుణ మాట్లాడుతూ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి అనేక మర్గాలు ఉండగా మహిళలకు అవమానకరమైన, మహిళలను ప్రదర్శన వస్తువుగా చూపే సామ్రాజ్యవాద మార్కెట్కు ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడం సిగ్గుమాలిన పని విమర్శించారు. -
ఎండ.. జాగ్రత్తలే అండ..!
ఇంటి మొక్కలు జర జాగ్రత్తవాహనాలకూ ఇబ్బందే.. బైక్లు, కార్లు ఎండలో నిలిపితే సూర్య కిరణాలు నేరుగా వాటిపైపడి కొద్ది కాలంలోనే రంగు వెలసిపోతుంది. తప్పనిసరిగా వాటిపై టార్పాలిన్ కవర్లు కప్పాలి. పెట్రోల్ ట్యాంక్ త్వరగా వేడెక్కి ఇంధనం ఆవిరయ్యే అవకాశం ఉంది. ఉదయం 8 లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వాహనాల్లో ఇంధనం పోయించడం మంచిది. గ్యాస్కిట్లను ఉపయోగించే కార్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలి. గ్యాస్ ట్యాంక్పై మందంగా ఉన్న వస్త్రం లేదా గోనె సంచి కప్పి ఉంచడం వలన గ్యాస్ లీక్ కాకుండా ఉంటుంది. ఎండలో ఎక్కువ సమయం వాహనాలు నిలపడం వల్ల రేడియేటర్ హెడ్ గ్యాస్ కట్ అయ్యే అవకాశముంది. ట్రాఫిక్ జాం అయినప్పుడు సిగ్నల్స్ వద్ద కార్లలో ఏసీ వేయవద్దు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వాహనాలకు విశ్రాంతి ఇవ్వాలి.– చెలిమల చంద్రమౌళి, మెకానిక్, మంచిర్యాల ఎలక్ట్రిక్ బైక్లు హీట్ కానివ్వొద్దు ● ఎలక్ట్రిక్ బైక్ను వారానికోసారి శుభ్రం చేసి ఇంజన్, చైన్లలోని దుమ్ము, ధూళిని తొలగిస్తే ఇంజన్ సామర్థ్యం తగ్గకుండా ఉంటుంది. ● ఈవీ బైక్ ఎంత బరువు మోయగలదో అంతే బరువుతో ప్రయాణించాలి. ● ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, ఎక్కడైనా ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయాలి. దీని వల్ల పవర్ ఆదాతో పాటు, లైఫ్ పెరుగుతుంది. ● ఈవీ బైక్లు లైట్ వెయిట్ ఉండడం వల్ల టైర్లో ఎంత ప్రెజర్ ఉందో తెలియదు. దానిని పట్టించుకోకుండా దీర్ఘకాలంపాటు ప్రయాణాలు చేస్తే ఇంజన్పై దుష్ప్రభావం పడుతుంది. ● ఈవీ బైక్ను చార్జింగ్ పూర్తయిన వెంటనే ప్లగ్ను తీసేయాలి. ఓవర్హీట్ అయితే బైక్లు దగ్ధమయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలి ఎండలో తిరగడం, వడగాలులతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నారులు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశముంది. తగు జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు. పనుల కోసం బయటకు వెళ్లేవారు ఉదయం 10 లోపు, సాయత్రం 6గంటల తర్వాతే వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో గొడుగు, నెత్తికి టోపి, రుమాలు ధరించాలి. వదులుగా ఉండే తెలుపురంగు గల కాటన్ దుస్తులు ధరించాలి. తరచూ నీటిని తాగుతుండాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు తాగడం శ్రేయస్కరం. – డా.ఆడే క్రాంతికుమార్, జనరల్ ఫిజీషియన్ వడదెబ్బ లక్షణాలు శరీరంలో వేడి పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి చేరుకోవడం, ఫిట్స్, వాంతులు, విరేచనాలు వంటివి వడదెబ్బ లక్షణాలు. అలాంటి వారిని శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువగా వచ్చే వరకు తడిగుడ్డతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ బాధితులు డీహైడ్రేషన్కు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఎండలో బయటకు వెళ్లవద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తలపై రుమాలు లేదా టోపీ ధరించాలి. ● నీరు, ద్రవ పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా కాపాడుకోవచ్చు. ● మద్యం సేవించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ● తప్పనిసరిగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి. ● చిన్నారులను ఎండలో ఆడనివ్వకూడదు. ఇంటి ఆవరణలో, చెట్ల నీడలో ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత భగ్గుమంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్లోనే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలతో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు ఇతరత్రా అత్యవసర పనుల్లో బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అధిక వేడి కారణంగా శరీరం నీరసంగా, నిస్సత్తువుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండేవారు సైతం తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. – కై లాస్నగర్/మంచిర్యాలటౌన్/నిర్మల్ చైన్గేట్ ● కూలర్లలో నీళ్లు పోశాక అటూ ఇటు కదల్చ కూడదు. ● ఓపెన్ గదిలో వాడడంతో పాటు, గాలి ప్రవాహం ఉండేలా చూడాలి. ● కూలర్కు చల్లదనాన్ని ఇచ్చే గడ్డి, హానీకాంబ్ ప్యాడ్స్, ఫిల్టర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ● సమ్మర్ సీజన్లో కూలర్ వినియోగించడం అయిపోయాక క్లీన్ చేసి, వాటి తడకలు వేరుచేసి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అలాగే ఉంచితే వచ్చే ఏడాదికి అది పాడైపోతుంది. ● కూలర్ను కిటికీ దగ్గర కానీ, తలుపు దగ్గర కానీ ఉంచి వినియోగిస్తేనే ఎక్కువ గాలి వీస్తుంది. అలా కాకుండా ఇంటి మధ్య భాగంలో పెడితే అనుకున్నంత గాలి రాక ఇబ్బందులు పడుతారు. ● ఏసీలు 1 టన్, 1.5 టన్, 2 టన్స్ అని మూడు రకాలుగా దొరుకుతాయి. గది చిన్నగా ఉంటే 1 టన్, మధ్యస్తంగా ఉంటే 1.5 టన్, పెద్దదిగా ఉంటే 2 టన్స్ ఏసీలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● ఏసీ గాలి బయటకు వెళ్లకుండా గది తలుపులన్నీ మూసి ఉంచాలి ● 24 నుంచి 26 డిగ్రీలలో ఏసీని సెట్ చేసుకుంటే గది ఉష్ణోగ్రతతో చల్లగా ఉండి విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ● ఏడాదిలో ఒకసారి ఏసీని తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించాలి. ● స్టెబిలైజర్ను వాడడం మంచిది. ఫ్రిజ్ వాడకం ఇలా.. ● అవసరమున్నప్పుడే ఫ్రిజ్ డోర్ తీయాలి ● వేడి పదార్థాలను ఉంచకుండా చూసుకోవాలి. ● ఫ్రిజ్ వెనక భాగం శుభ్రం చేసుకోవాలి. ● డోర్ గాస్కెట్ లీక్ ఉందో లేదో చూసుకోవాలి. ● వెనుక భాగానికి గోడకి మధ్య కాస్త గ్యాప్ ఉంచాలి. అప్రమత్తత అవసరం ఎండల తీవ్రత మనుషులపైనే కాదు మూగజీవా లు, పశుపక్షాదులపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. అధిక వేడి కారణంగా జంతువులు ఉష్ణోగ్రతను నియంత్రించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతా యి. దీంతో ఊపిరాడక మృతి చెందే ప్రమా దం ఉంది. మూగజీవాలకు పశుగ్రాసం, నీటికొరత లేకుండా చూడాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచవద్దు. వేడి తీవ్రతను అధిగమించేందుకు గోనె సంచులను తడిపి వాటిపై కప్పితే చల్ల దనం లభిస్తుంది. – బి.కిషన్, జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి, ఆదిలాబాద్ ● రోజువారి వాడకానికి సరిపడా మోడ్ను సెలక్ట్ చేసుకోవాలి ● వేడి నీరు అవసరం లేనిదే వాడవద్దు ● ఎండలో ఉంచకుండా చూడాలి ● ఫిల్టర్లు నెలకోసారి శుభ్రం చేయాలి.వాషింగ్ మెషీన్ వాడకం ఇతరత్రా పరికరాలు ● టీవీని నేరుగా సూర్యకాంతికి పెట్టవద్దు. స్టెబిలైజర్ లేదా సర్జ్ ప్రొటెక్టర్ను వాడాలి. ● అవసరంలేని సమయాల్లో లైట్లను ఆర్పివేడయం వల్ల గదిలో వేడి తగ్గుతుంది. ● ఎల్ఈడీ బల్బులు వాడడం వల్ల హీట్ తక్కువగా ఉంటుంది. విద్యుత్ ఆదా అవుతుంది. ● విద్యుత్ పరికరాలు వేడి వాతావరణంలో వాడకుండా చూసుకోవాలి. వాడిన తర్వాత తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. ● ఉద్యానవన శాఖ కాగజ్నగర్ డివిజన్ అధికారి సుప్రజచింతలమానెపల్లి: మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. పండ్ల ధరలదీ అదే పరి స్థితి. పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండాల్సిందే. మరి వీటికి పరిష్కారం.. కిచెన్లో, ఇంటి కప్పు మీద రూఫ్లో, కూరగాయలు, పండ్లు, మొక్కలు పెంచుకోవడం. ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూల మొక్కలు ఏర్పాటు చేసుకోవడం. గ్రా మాలు, పల్లెలు అనే తేడా లేకుండా పట్టణాలుగా మారుతున్న వేళ ఇరుకు ఇళ్లు, అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈమధ్య కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మన ప్రభుత్వం మన పట్టణ ప్రాంత ఆవాసాల్లో పోషక పదార్థాలను ఇచ్చే కూరగాయలు పెంచే పథకం ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పేరిట ప్రోత్సహిస్తోంది. కానీ.. పెరిగిన ఎండల వేడికి వీటిని కాపాడుకునేందుకు ఏం చేయాలి. వేల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ అర్బన్ ప్లాంటేషన్ల నుంచి లబ్ధి ఎలా పొందాలి. వీటిపై సలహాలు, సూచనలు, జాగ్రత్తలు ఉద్యానవన శాఖ కాగజ్నగర్ డివిజన్ అధికారి సుప్రజ అందించారు. అర్బన్ ప్లాంటేషన్, కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ అంటే వివరాలు తెలపండి?ఈ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ఇంటి వద్దనే పెంచుకోవచ్చు. ప్రధానంగా పట్టణ సంస్కృతి కలిగి ఉండి, వ్యవసాయ స్థ లాలు లేని వారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. మన ప్రాంతంలో ఇవి ఉన్నాయా?మన జిల్లాలో ఇవి తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని భవనాల్లో ఆసక్తి ఉన్న వా రు కూడా ఈ పద్ధతిలో సాగు చేస్తున్నారు. పూల మొక్కలు, పచ్చదనం కోసం విదేశీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మొక్కలు పెంచుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల వంట నిర్వాహకులూ పోషకాలు అందించే కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగు చేస్తే కలిగే ఉపయోగాలేవి? ఈ పద్ధతుల్లో సాగు చేసేవారికి తాజా కూరగాయలు, పండ్లు లభిస్తాయి. ఆరోగ్య రక్షణలో వీటి పాత్ర కీలకం. ఆరోగ్య రక్షణతో పాటు సేంద్రియ ఎరువులు, కూరగాయల వ్యర్థాలను ఎరువులుగా వినియోగించుకోవచ్చు. ఎండ వేడిమి నుంచి వీటి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.మొక్కలు సాగు చేసే చోట గ్రీన్నెట్ షీట్స్ వినియోగించి ఎండవేడిమి నుంచి రక్షించుకోవాలి. ఇంటి దగ్గర సాగు చేసే మొక్కలను పరుచుకునేలా సాగు చేసుకోవాలి. కిచెన్లోని కూరగాయల వ్యర్థాలను మొక్కల వద్ద పరుచుకోవాలి. దీని ద్వారా కింద మట్టిలో ఉండే తేమను రక్షించుకోవచ్చు. మొక్కలకు నీటిని అందించే పద్ధతులేమిటి? ఆధునిక పరిజ్ఞానం వినియోగించే వారు ఇళ్లపై ఉండే నీళ్ల ట్యాంకులను వినియోగించి డ్రిప్ పద్ధతిలో మైక్రోజెట్లను ఏర్పాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ సీసాలు, మట్టి కుండలు లాంటివి వినియోగించడంపై ఆన్లైన్లో చాలామంది నిపుణులు మెళకువలు తెలియజేస్తున్నారు. ఎలాంటి మెలకువలు పాటించాలి?మొక్కల పెంపకంలో ప్రధానంగా కొన్ని సూచనలు పాటించాలి. సూర్యరశ్మి లభ్యత, అందుబాటులో ఉన్న స్థలం, సాగునీటి లభ్యత, నీరు నిల్వ ఉంచే సామర్థ్యం (వాటర్ప్రూఫ్ ఇంటి కప్పు), మన అభిరుచి అవగాహన లాంటివి కీలకంగా పరిశీలించుకోవాలి. ఎలాంటి మట్టిని వినియోగించుకోవాలి?ఈ పద్ధతుల్లో పెంపకానికి మట్టి తయారీ కీలకంగా మారుతుంది. 20శాత ఎర్రమట్టి, 40శాతం వర్మీకంపోస్ట్, 20శాతం కొబ్బరి పీచుపొట్టు, 5శాతం వేపపిండి, 15శాతం పశువుల చివికిన ఎరువులు కలిపి తయారు చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉందా?ప్రభుత్వం ఈ పద్ధతుల్లో పట్టణాలు, నగరాల్లో పో త్సహించడానికి ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతిలో శాఖ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఇతర విషయాలు తెలు సుకోవాలంటే శాఖ అధికారులను సంప్రదించాలి.కూలర్ వినియోగంలో జాగ్రత్తలు ఏసీల వినియోగం -
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన మహిళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ శివారులో హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి (36), సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. సత్యనారాయణ గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటివద్దే ఉంటున్నాడు. రమాదేవి ఈజీఎస్లో మేట్గా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం సదరు మహిళ షెట్పల్లి గ్రామానికి వెళ్లివస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని లక్కేపూర్ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం గుర్తించిన స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉండడంతో లక్కేపూర్లో పరిచయం ఉన్న పండుగు మొగిళిపై అనుమానం ఉన్నట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ● మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో విషాదం -
హమాలీలపై సమ్మె పోటు
● నిలిచిన లారీల రవాణా ● ఉపాధి లేక అల్లాడుతున్న కాంటా కార్మికులు తిండికి తిప్పలైతంది.. పని చేస్తేనే వచ్చిన పైసలతో బతుకుడు. బండ్లు నడవక డబ్బులు లేక తిండికి తిప్పలైతంది. 15రోజులుగా బండ్లు నడుస్తలేవు. పని లేక ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం. కుటుంబం గడువడం కష్టంగా మారింది. – జనగామ నాగరాజు, రామారావుపేట జైపూర్: కాంటా హమాలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఊరి కార్మికులకు ఉపాధి కరువైంది. లారీ యజమానుల సమ్మె కారణంగా ఉపాధి దొరక్క పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడున్నర దశాబ్దాలుగా హమాలీ పనిపైనే ఆధారపడి జీవిస్తున్న వారంతా మరో పనికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. గత పదిహేను రోజులుగా మంచిర్యాల లారీ ట్రాన్స్పోర్టు అసోసియేషన్, శ్రీరాంపూర్ కోల్బెల్ట్ అసోసియేషన్ లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా లారీల్లో బొగ్గు రవాణా నిలిచిపోయింది. లారీలపై బొగ్గు లెవలింగ్ చేసే హమాలీ కార్మికులకు ఉపాధి కరువైంది. మండలంలోని రామారావుపేట గ్రామం నుంచి 300మంది కాంటా హమాలీ కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1990లో శ్రీరాంపూర్ ఏరియాలో లారీ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ ద్వారా కాంటా హమాలీ పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని అప్పటి నుంచి హమాలీ పని చేస్తున్నారు. 300 మంది హమాలీ కార్మికులు మూడు షిఫ్టులుగా సింగరేణి గనులు, కాంటాల వద్ద లోడింగ్కు వచ్చిన లైన్ లారీల్లో బొగ్గు నింపిన తర్వాత కాంటా వేశాక బొగ్గు ఎక్కువగా ఉంటే తీసేయడం, తక్కువగా ఉంటే మళ్లీ లారీలో వేయడం, సమానంగా చేసి టార్పాలిన్ కవర్ కప్పడం వీరి పని. ఇందుకు ట్రాన్స్పోర్టు అసోసియేషన్ ద్వారా పది టైర్ల లారీకి రూ.410, ఆరు టైర్ల లారీకి రూ.360 చొప్పున చెల్లిస్తారు. మూడు షిఫ్టుల్లో బొగ్గు రవాణా డిమాండ్కు అనుగుణంగా లారీలు వస్తాయి. ఆ రోజు వచ్చిన హమాలీ కార్మికులు వేర్వేరు గనులపైకి వెళ్లి అక్కడ పని చేస్తారు. వచ్చిన డబ్బులను రోజువారీగా మస్టర్ లెక్కగట్టి నెలనెలా జీతంగా తీసుకుంటారు. ఇలా గ్రామానికి చెందిన వారిలో అధిక శాతం ఇదే పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. మరో పని చేయలేక.. ఉన్న పనిలో ఏడాదిలో వేర్వేరుగా ఉన్న ట్రాన్స్పోర్టు యూనియన్లు సమ్మె చేయడం ఆరు నెలలకోసారి ఇలా 20 రోజులు సమ్మె చేయడంతో పని కరువై తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. 300 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురించిందని హమాలీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రత లేని బతుకులుసుమారు 35ఏళ్లుగా హమాలీ పని చేస్తున్న కార్మికులకు కనీస భద్రత లేదు. నెలంతా చేసినా రూ.10వేలు దాటవు. అందులో లారీ యూనియన్లు సమ్మె చేయడంతో కనీసం తిందామంటే తిండి దొరకని స్థితిలో అల్లాడుతున్నారు. ఊరు ఊరంతా వారి తండ్రులు చేస్తూ వచ్చిన పనిని కొడుకులకు అప్పగించడంతో వారు కూడా అదే పనికి అలవాటు పడి మరో పని చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. అనేక మార్లు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి భద్రత కల్పించాలని పోరాటాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. కార్మికులుగా గుర్తించాలె.. బొగ్గు లోడింగ్, ఆన్లోడింగ్, లెవలింగ్ హమాలీలను కార్మికులుగా గుర్తించాలి. ఏళ్లుగా హమాలీ పనిచేస్తూ జీవనం గడుపుతున్నాం. కనీసం కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించడం లేదు. కార్మికులుగా గుర్తించి భద్రత కల్పించాలి. – బొద్దున రాజేశం, యూనియన్ లీడర్ -
చేపల కదలికలు గమనించాలి
● జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవి వాతావరణ పరిస్థితుల్లో చేపల పెంపకంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోంది. మత్స్యకారుల సంఘాలు, సభ్యులు జాగ్రత్తలు వహించాలి. చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గితే చేపలు పట్టుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్.అవినాష్ సూచించారు. వేసవి ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు వివరించారు. జిల్లాలో అధికంగా వర్షాధార చెరవులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లోని నీటి నాణ్యత, లోతు విస్తీర్ణం, చేపల కదలికలు ప్రతీ రోజు గమనించాలి. కొన్ని చేపలను పట్టి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం ఇతర లక్షణాలు పరిశీలించాలి. తేడా ఉన్నట్లయితే మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టి ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవాలి. ఉదయం సమయంలో చెరువు పైభాగంలో చేపలు నోరు తెరుచుకొని తిరుగుతుంటే ప్రాణవాయువు కొరత ఉందని గ్రహించి చెరువులో నీరు పెట్టడం, పెద్దగా పెరిగిన చేపలను పట్టి విక్రయించడం చేయాలి. తద్వారా చేపల సాంద్రత తగ్గడం వల్ల ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. చెరువులో నీటి నాణ్యత తగ్గినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు చల్లడంతో నాణ్యతతోపాటు ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. చెరువులో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకపోతే రాత్రి సమయంలో ఆవి విడుదల చేసే కార్బన్ డై ఆకై ్సడ్ కారణంగా ప్రాణవాయువు కొరత ఏర్పడి చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సందర్భాల్లో విషం కలిపారనే అపోహలను నమ్మకుండా నిజనిర్ధారణ చేసుకోవాలి. వ్యాధితో చేపలు చనిపోయిన వెంటనే వాటిని నీటి నుంచి తొలగించి చెరువు దూరంగా కాల్చివేయడం, భూమిలో పూడ్చి వేయడం చేయాలి. వెంటనే సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలు బీకేసీ(బెంజాల్ కొలియం క్లోరైడ్)ను ఒక హెక్టర్కు ఒక లీటర్ చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. అయినప్పటికీ మార్పు లేకపోతే యాంటీ బయోటిక్ మందులు సూచించిన మోతాదులో మేతతోపాటు కలిపి ఇవ్వాలి. నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకుంటే విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెంచుతుంది. -
ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల్లో ఉంటూ ఇంటర్మీడియెట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు గరుండ్ల రవీందర్, ఎన్.అభినయ శనివారం హరిత ప్లాజా టూరిజం భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని ఎంపిక చేయగా జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. మంచిర్యాల ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహం కంప్యూటర్ సైన్స్(వొకేషనల్) విద్యార్థి రవీందర్, బీసీ బాలికల కళాశాల వసతిగృహం ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థిని అభినయ నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడంపై వసతిగృహ సంక్షేమాధికారి మోసిన్ ఆహ్మద్, సుధాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. -
నేలలు నిస్సారం..!
● భూసార పరీక్షలు లేక రైతులకు నష్టం ● జాడలేని భూసార పరీక్ష కేంద్రాలు ● సీజన్కు ముందు ఫలితాలతో ప్రయోజనాలుమంచిర్యాలఅగ్రికల్చర్: రైతులు అధిక పంట దిగుబడి సాధించేందుకు పోటీ పడి ఎరువులు వేస్తున్నా నష్టాలే చవి చూడాల్సి వస్తోంది. భూమిలో పోషక లోపాలు గుర్తించకుండా వేసిన పంటలే వేయడం, అధిక మోతాదులో ఎరువులు చల్లడం వల్ల పంటలపై చీడపీడల దాడి అధికమై సస్యరక్షణ ఖర్చు పెరుగుతోంది. భూములు నిస్సారమై భవిష్యత్లో పంటలు వేయడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. నేలలో అంతర్లీనంగా ఉన్న పోషకాలను కాపాడుకోవాలి. భూసారం తెలుసుకోకుండా ఎలాంటి పంటలు సాగు చేసినా దిగుబడి లేక ఆర్థికంగా చతికిల పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో నెల పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్, మే నెలల్లో భూ సార పరీక్షలు చేయడానికి మట్టి నమూనాల సేకరణకు అనుకూలమైన సమయం. వానా కా లం పంటలు విత్తుకునే సమయానికి ఫలితాలు వస్తే అందుకు అనుగుణంగా విత్తనం, ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది భూసార పరీక్షల నిర్వహణకు ఆదేశాలు రాలేదు. గత రబీ సీజన్ సమయంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో 4,106 మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్లోని భూసార పరీక్ష కేంద్రానికి తరలించారు. అధికంగా ఎరువుల వినియోగంజిల్లాల్లో 3.60 లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 70శాతం నల్లరేగడి, 20 శా తం ఎర్ర, ఇసుక, చౌడు నేలలు ఉన్నాయి. అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నా రైతులు అధికంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. నేల స్వభావం తెలియకుండా అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు ఏ మేరకు ఎరువులు అవసరమో రైతులకు అవగాహన ఉండాలి. భూమిలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలంటే భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మట్టి పరీక్షలు నిర్వహిస్తే పోషక లోపాలను గుర్తించవచ్చు. తద్వారా మోతాదులో రసాయన ఎరువులు వాడితే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. పరీక్షల ఫలితాల ఆధారంగా పంట సాగు మేలుపంటలు భూమిలోని పోషకాలను ఏ మేరకు ఉపయోగించుకుంటాయనే దానిపై దిగుబడులు ఆధారపడి ఉంటాయి. పోషకాలు ఎక్కువైనా తక్కువైనా ఆశించిన దిగుబడులు రావు. సాధారణంగా రైతులు భాస్వారం, పొటాష్ ఎరువులు సిఫార్సు చేసిన మోతాదు కంటే తక్కువగాను, నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదు కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువగా వేస్తుంటారు. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. నత్రజని ఎరువును అధిక వినియోగం వల్ల పంట విపరీతంగా ఎదిగి పడిపోతుంది. పూత ఆలస్యంగా వస్తుంది. తాలు గింజలు ఎక్కువగా ఉంటాయి. పంట చీడపీడలకు సులభంగా లోనవుతుంది. చివరికి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏ పంటకు ఏ పోషక పరిమాణంలో అవసరమో తెలుసుకుని తగిన మోతదులో అందించడాన్నే పోషక సమత్యులత అంటారు. భూసార పరీక్షల్లో ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును సిఫార్సు చేస్తారు. ఆదేశాలు రాలేదు వానాకాలం ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో భూ పరీక్షల నిర్వహణకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. రబీ సీజన్ ముందు డిసెంబర్, జనవరి నెలల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలకు 4,106 మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూసార పరీక్ష కేంద్రానికి తరలించాం. – కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి భూసార పరీక్ష కేంద్రం మూతజిల్లా ఆవిర్భావ సమయంలో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి మంచిర్యాల వ్యవసాయ మార్కెట్లో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయించారు. వివిధ గ్రామాల నుంచి ఏఈవోలు మట్టి నమూనాలు సేకరించి పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులకు సూచనలు చేశారు. 2020లో భారీ వర్షంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భూసార పరీక్ష కేంద్రంలోని యంత్రాలు కాలిపోయాయి. అనంతరం మరమ్మతులు చేయించారు. 2022లో మంజూరైన మెడికల్ కళాశాలను తాత్కాలికంగా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయడంతో పరీక్ష కేంద్రం మూతపడింది. అప్పటి నుంచి భూసార పరీక్షలు లేక రైతులకు నేల స్వభావం తెలియకుండా పోతోంది. -
‘గులాబీ’ దండు కదులుతోంది..!
● ఎల్కతుర్తి రజతోత్సవ సభకు సిద్ధం ● వేలాది మంది హాజరయ్యేలా ప్రణాళిక ● వందలాది వాహనాలు ఏర్పాటు చేసిన నాయకులుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రజతోత్సవ వరంగల్(ఎల్కతుర్తి) బహిరంగ సభకు జిల్లా నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలి వెళ్లనున్నారు. ఆ పార్టీ ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ విజయవంతానికి ముఖ్య నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో గోడలపై రాతలు, ప్రచారం సాగిస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్న య్య, బాల్క సుమన్, నాయకులు నడిపెల్లి విజిత్రావు తదితరు ఇప్పటికే కేడర్ను సిద్ధం చేశారు. జిల్లా నుంచి వేలాదిగా జనాన్ని తరలించి తమ బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అన్ని విభాగాల ఇన్చార్జీ లు, యువత, మహిళలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులను బస్సులు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పెద్దయెత్తున వాహనాల్లో ఎల్కతుర్తి వైపు గులాబీ దండు కదలనుంది. నియోజకవర్గానికి మూడు వేల మందిప్రతీ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది చొప్పున జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8.30గంటల నుంచే వాహనాలను సిద్ధం చేసి 12గంటలకు సభాస్థలికి చేరుకునేలా ప్రణాళిక చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200బస్సులు, 200కార్లు, ఇతర వాహనాలు సమకూర్చుతున్నారు. గ్రామం, పట్టణాన్ని బట్టి ఒకటి నుంచి రెండు, మూడు బస్సులు, కార్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచే అధిక సంఖ్యలో హాజరవుతున్నారని నాయకులు చెబుతున్నారు. ఆ మేరకు పట్టణంలో భారీగా బైక్ర్యాలీ నిర్వహించారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల వారు వయా రాయపట్నం మీదుగా కరీంనగర్ నుంచి వరంగల్కు చేరుకుంటారు. హాజీపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం, మందమర్రి మండలాల వారు వయా ఇందారం గోదావరిఖని మీదుగా వరంగల్కు వెళ్తారు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలు వయా కాళేశ్వరం, భూపాలపల్లి, కాటారం మీదుగా సభకు హాజరుకానున్నారు. ఇక ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాల్లో చల్లని తాగునీరు, ఓఆర్ఎస్, పులిహోర ప్యాకెట్లు, రెండు పూటల భోజన సౌకర్యం కల్పించనున్నారు. మహిళలకు తగిన భద్రత కల్పించనున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాలు, పట్టణా ల నుంచి పెద్ద ఎత్తున, రైతులు, యువత, మహిళలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ వారితోపాటు ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. – నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ యువ నాయకుడు -
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మే 4న నీట్(నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రెన్స్ టెస్ట్)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నీట్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మే 4న జరిగే పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరవుతారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మంచిర్యాల), తెలంగాణ ఆదర్శపాఠశాల(రాజీవ్నగర్), మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలను బందోబస్తుతో భద్రపర్చాలని తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఒక్కో పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకుడు, పాలన విభాగం నుంచి ఒక నోడల్ అధికారి, పోలీస్ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇదే నా ఇల్లు.. నాకు లేదా ఇందిరమ్మ ఇల్లు?
మంచిర్యాల జిల్లా: ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని ఆ మహిళ ఎంతో ఆశపెట్టుకుంది. శిథిలావస్థకు చేరిన ఇంటిని తొలగించి ప్రస్తుతం నాలుగు వైపులా కర్రలు పాతి ప్లాస్టిక్ కవర్లతో గూడు ఏర్పాటు చేసుకుని ఉంటోంది. తీరా ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతోంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల్ గ్రామంలో బండారు లక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది. ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకుంది. శిథిలమైన ఇంటిని తొలగించి 4 నెలల క్రితం తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుంది. గ్రామంలో మొత్తం 104 మందికి ఇళ్లు మంజూరైనట్లు ప్రజాపాలన సభలో ప్రకటించారు. ఇందులో నుంచి 34 మందికి నిర్మాణాలకు అనుమతి ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ జాబితాలో లక్ష్మి పేరు లేకపోవడంతో ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలే గానీ ఆర్థికంగా ఉన్న వాళ్లకి ఎందుకు మంజూరు చేస్తున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. -
ఇందిరమ్మ ఇళ్ల కోసం రాస్తారోకో
కొనసాగుతున్న నిరవధిక సమ్మె బాసర: ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు చేపట్టిన నిరవధిక సమ్మె ఐదోరోజుకు చేరింది. శుక్రవారం బాసర రైల్వేస్టేషన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం శ్రీకాంత్ శ్రీరామ్, శేఖర్, రజిత, భానుప్రియ, ప్రశాంతి, ప్రభాకర్రావు పాల్గొన్నారు. చెన్నూర్రూరల్: మండలంలోని కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామస్తులు శుక్రవారం చెన్నూర్–మంచిర్యాల ప్రధా న రహదారిపై రాస్తారోకో చేశారు. పంచా యతీలో 1,104 మంది ఇందిరమ్మ ఇళ్లకు ద రఖాస్తు చేసుకోగా 70మంది పేర్లు వచ్చాయని తెలిపారు. ఇందులో ఎల్లక్కపేటకు చెందిన ఆరుగురి పేర్లు మాత్రమే ఉన్నాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదని తెలిపారు. అధికారులు మళ్లీ సర్వే చేసి అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
వివాహితపై లైంగికదాడి
తానూరు: మండలంలోని మొగ్లి గ్రామానికి చెందిన యువకుడు సునీల్పై శుక్రవారం అత్యాచారం కేసు నమోదైనట్లు ఏఎస్సై భానుప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉదయం 11 గంటల సమయంలో గ్రామ సమీపంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. అక్కడే ఉన్న సునీల్ ఆమెను వంతెన పైపులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గాయాలతో ఇంటికి చేరకున్న బాధితురాలు భర్తకు విషయం తెలిపింది. అనంతరం తానూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు. బాధితురాలిని చికిత్స కోసం భైంసా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తించాలి చెన్నూర్: ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తించాల ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తని ఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంత రం సంఘ విద్రోహ శక్తులు గుంపులుగా ఏర్ప డి గొడవలు సృష్టించే సమయంలో ఎలా చెదరగొట్టాలో మాక్ ఆపరేషన్ డ్రిల్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో మమేక మై స్నేహపూర్వక వాతావరణంలో పని చేయాలని సూచించారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ దేవేందర్రావు, ఎస్సైలు సుబ్బారావు, వెంకటేశ్వర్రావు, సిబ్బంది ఉన్నారు. -
ఈ స్టేషన్లో రైళ్లు ఆగవు
● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● పక్క స్టేషన్లకు వెళ్లాలంటే ఆర్థిక భారం మందమర్రిరూరల్: సింగరేణి పారిశ్రామిక ప్రాంతం మందమర్రిలోని రైల్వేస్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ కరువైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో స్థిరపడిన వివిధ ప్రాంతాల ఉద్యోగులు, వ్యాపారులు సొంతూళ్లకు, విద్యార్థులు చదువుల కోసం ఇతర పట్టణాలకు వెళ్లాలంటే పక్కనున్న బెల్లంపల్లి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వేస్టేషన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతీరోజు వందలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఈ రైల్వేస్టేషన్లో భాగ్యనగర్, ఇంటర్సిటీ, కరీంనగర్ పుష్పుల్ రైళ్లు తప్ప ఇతర రైళ్లు ఆగడం లేదు. గతంలో సింగరేణి, ప్యాసింజర్, రామగిరి, సిర్పూర్ కాగజ్నగర్(పాత తెలంగాణ) రైళ్లకు హాల్టింగ్ ఉండేది. కరోనా నుంచి రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కనీస సౌకర్యాలు కరువుమందమర్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రతీరోజు భాగ్యనగర్, ఇంటర్ సిటీ రైళ్ల ద్వారా వందలాది మంది ప్ర యాణం సాగిస్తారు. రైల్వేస్టేషన్ ఆవరణలో మరుగుదొడ్డి, తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు తదితర కనీ స సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తెల్లవా రు జామున వచ్చే భాగ్యనగర్ రైలు ప్రయాణికులకు కొన్ని సమయాల్లో విద్యుత్ దీపాల సౌకర్యం లేక విష పురుగుల బాధ తప్పడం లేదు. ఎంపీ చొరవ చూపాలిమందమర్రి రైల్వేస్టేషన్లో గతంలో నిలిపివేసిన రైళ్ల హాల్టింగ్ను పునరుద్ధరించడంతోపాటు మరికొన్ని కొత్త రైళ్లు నిలిపే విధంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు కూడా ఎంపీ హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రమంత్రితో మాట్లాడి కాజీపేట టు ఆజ్నీ ప్యాసింజర్ హాల్టింగ్కు కృషి చేశారు. తెలంగాణ రైలు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లే మరికొన్ని కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.జీవనోపాధికి తిప్పలు మందమర్రి రైల్వేస్టేషన్లో గతంలో పలు రైళ్లకు హాల్టింగ్ ఉన్నప్పుడు కనీసం 30నుంచి 40 మంది ఆటోడ్రైవర్లకు రోజుకు రూ.500 నుంచి రూ.600 వచ్చేది. భాగ్యనగర్, తెలంగాణ రైళ్లకు మాత్రమే హాల్టింగ్ ఉండడం వల్ల జీవనోపాధికి తిప్పలు తప్పడం లేదు. అన్ని రైళ్లకు గతంలో మాదిరిగా హాల్టింగ్ ఉన్నట్లయితే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లభిస్తుంది. – బెంజిమెన్ ఆటో డ్రైవర్, మందమర్రి ప్రయాణానికి ఇబ్బంది తెలంగాణ, సిర్పూర్ కాగజ్నగర్, తదితర ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా ప్రయాణించాంటే పక్కనున్న బెల్లంపల్లి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వేస్టేషన్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ఆటోలను ఆశ్రయించాల్సి రావడంతో ఆర్థిక భారంతోపాటు సమయం వృథా అవుతోంది. మందమర్రి రైల్వేస్టేషన్లోనే రైళ్లు నిలిపితే ఇబ్బంది తప్పుతుంది. – అబ్బాస్, మందమర్రి -
కొడుకును కడతేర్చిన తండ్రి
లక్ష్మణచాంద: ఆర్థిక గొడవల కారణంగా తండ్రి కొడుకును కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని మల్లాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన బైనం ఎర్రన్న–గంగవ్వ దంపతులకు కుమారుడు అశోక్ (32), కూతురు ఉన్నా రు. కూతురుకు వివాహమైంది. అశోక్కు వివాహం కాగా ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, తండ్రీకొడుకులు మద్యం సేవించి నిత్యం గొడవ పడేవారు. చంపుతా.. అంటే చంపుతా.. అని పరస్పరం హెచ్చరించుకునేవారు. తండ్రీకొడుకుల మధ్య గొడవ కారణంగా అశోక్ భార్య ఇద్దరు చిన్నారులతో ఆర్నెళ్ల క్రితం లక్ష్మణచాందలోని పుట్టింటికి వెళ్లింది. అశోక్ తరచూ వెళ్లి భార్య, పిల్లలను చూసి వస్తుండేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా అశోక్ భార్య వద్దకు వెళ్లాడు. రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజులాగానే తండ్రితో గొడవ పడ్డాడు. నిత్యం గొడవలతో వేగలేకపోతున్నానని భావించిన ఎర్రన్న మద్యం మత్తులో ఉన్న కొడుకును చంపాలనుకున్నాడు. రాత్రి ఆరుబయట పడుకున్న అశోక్ను శుక్రవారం వేకువజామున గొడ్డలితో తల, ముఖంపై నరికాడు. తీవ్ర గాయాలతో అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత గొడ్డలిని సమీప పొలంలో పడేసిన ఎర్రన్న లక్ష్మణచాంద పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎర్రన్నను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. అశోక్కు భార్య లక్ష్మి, ఏడేళ్ల కూతురు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. -
వన్యప్రాణుల కోసం నీటి కుంటల నిర్మాణం
జైపూర్: ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్లాంటేషన్, అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి నీటి కుంటలు నిర్మిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్ తెలిపారు. మండలంలోని కాన్కూర్ గ్రామ సమీపంలోగల టీజీఎఫ్డీసీ నీలగిరి ప్లాంటేషన్లో శుక్రవారం నీటి కుంట తవ్వించారు. ఈజీఎస్ కింద చేపట్టిన ఈ పనులను శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమై నీటి కోసం వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీటి ఊటలున్న ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. నీరు నిల్వ ఉండేలా నీటి కుంటలు తవ్విస్తున్నట్లు పేర్కొన్నారు. కాన్కూర్, ముదిగుంట అటవీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాంటేషన్ వాచర్ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్న అటవీ సిబ్బంది -
నిప్పంటుకుని జొన్న పంట దగ్ధం
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామానికి చెందిన రైతు మర్రిపెద్ద భోజన్నకు చెందిన నూర్పిడికి సిద్ధంగా ఉన్న జొన్న పంటకు ప్రమాదవశాత్తు ని ప్పంటుకుని దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన్న ఎకరం జొన్న పంటను కో యించి పొలంలోనే ఆరబెట్టాడు. ఉదయం 11గంటలకు పొలం వద్దకు వెళ్లి ఎండ ఎక్కువ కావడంతో ఇంటికి వెళ్లాడు. సాయంత్రం మరోసారి పొలానికి వెళ్లి చూడగా అప్పటికే జొన్న పంటకు నిప్పంటుకుంది. గమనించి తోటిరైతుల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. జిల్లాకేంద్రంలోని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఫైర్ ఇంజన్ ఆలస్యంగా చేరడంతో అప్పటికే ఎక రం జొన్న పంట అగ్నికి ఆహూతైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే కాలిపోగా భోజన్న బోరున విలపించాడు. సుమారు రూ.75 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ముధోల్ మండలం ఆష్టలో..ముధోల్: మండలంలోని ఆష్ట గ్రామానికి చెందిన రైతు రవి లింగారెడ్డికి చెందిన నాలుగెకరాల మొక్కజొన్న పంట శుక్రవారం షార్ట్షర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వారం క్రితం లింగారెడ్డి మొక్కజొన్నను కోసి చేనులోనే ఆరబెట్టాడు. తన పొలం మీదుగా విద్యుత్ లైన్ ఉండగా మధ్యాహ్నం ఈదురు గాలులు వీచాయి. తీగలు ఒకదానికొకటి రాసుకోగా నిప్పు రవ్వలు ఎగిసిపడి మొక్కజొన్న పంట మీద పడగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో నాలుగెకరాల పంట పూర్తిగా దగ్ధమైందని బాధితుడు తెలిపాడు. రెవెన్యూ అధికారులు నారాయణ్పటేల్, సరస్వతీ పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదించి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
మంచిర్యాలటౌన్: జిల్లాలో మలేరియా వ్యాధి రాకుండా అరికట్టి, మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో దోమలు పెరగకుండా చూడాలని, 2030 నాటికి దేశవ్యాప్తంగా మలేరియా నిర్మూలనలో జిల్లాను భాగస్వామిగా చేయాలని అన్నారు. నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెందుతాయని, నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎస్.అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు శివప్రతాప్, అశోక్, సునిత, అమర్, రాము, రజిత, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సంతోష్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి పాల్గొన్నారు. -
42కిలోలైతే ఓకే..!
● ధాన్యం దించుకునేందుకు మిల్లర్ల మెలిక ● కొనుగోలు కేంద్రాల్లో మొదలైన దోపిడీసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ మొదలైంది. ధాన్యం సరిగా లేదని, తేమ సాకు చూపి బస్తాకు 42కిలోల చొప్పున తూకం వేస్తూ రైతులను ముంచేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభం కాగా, కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు 11మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వగా.. సుమారు 9వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు జరిగాయి. క్రమంగా కేంద్రాలకు ధాన్యం రావడం పెరుగుతుండడంతో మిల్లర్లు మెలిక పెడుతున్నారు. తూకంలో అధికంగా బరువు వేయొద్దని మిల్లర్లకు ముందే చెబుతున్నా ధాన్యం దించుకోబోమని రైతులతోనే చెబుతుండడంతో కేంద్రాల నిర్వాహకులు 42కిలోలు జోకుతున్నారు. నిబంధనల ప్రకారం 40కిలోలు తూకం వేయాలి. గన్నీ సంచితో మరో 500గ్రాములు కలిపి, మరో అర కిలో తరుగు చేర్చినా, మొత్తంగా 41కిలోలకు పరిమితం కావాలి. అయితే శుక్రవారం జన్నారం మండలంలో ఐకేపీ కేంద్రంలో 42కిలోలు, ప్రాథమిక సహకార సంఘం పరిధి కేంద్రంలో 41కిలోలు, దండేపల్లిలో 42కిలోల చొప్పున తూకం వేశారు. దీంతో రైతులు రైతులు గత్యంతరం లేక అమ్మేసుకుంటున్నారు. జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఓ రైతుకు తూకంలో అనుమానం వచ్చింది. దీంతో వేరే చోట బరువు చూస్తే బస్తాకు 42కిలోలు రావడంతో ఆయన కొనుగోలు నిలిపివేశాడు. తేమ, శుభ్రత లేవనే సాకుఏటా ప్రతీ సీజన్లో మిల్లర్లు తేమ, శుభ్రత సాకుతో రైతులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. నిబంధనల ప్రకారం 17శాతం లోపే తేమ ఉంటే మద్దతు ధర చెల్లించాలి. చాలా చోట్ల తేమ ఎక్కువగా ఉంటోంది. ఇక ధాన్యం శుభ్రం చేసే యంత్రాల(ప్యాడీ క్లీనర్లు)తో ధాన్యం శుభ్రం చేసుకునేందుకు చాలామంది రైతులు ముందుకు రావడం లేదు. కేంద్రానికి వెళ్లిన వెంటనే అమ్మేసుకోవాలనే వాతావరణ భయంతో, రైతుల తొందరపాటు మిల్లర్లకు కలిసి వస్తోంది. ఇందుకు నిర్వాహకులు సైతం సహకరిస్తూ ఆ మేరకు ట్రక్ షీట్లు, ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. జిల్లాలో 321 కేంద్రాల్లో 3.31లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ఉంది. ఇందులో ఒక కిలో చొప్పున రైతుల నుంచి కోత పెట్టినా రూ.కోట్లలోనే జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టినా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోగా, ఇంకా ఈ సీజన్లోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. 41కిలోలే తూకం జిల్లాలో ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడా 42కిలోలు తూకం వేయడం లేదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆ మేరకే తూకం వేయాలని ఆదేశాలిచ్చాం. – కిషన్ జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి -
భూభారతితో సమస్యలు పరిష్కారం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్బెల్లంపల్లిరూరల్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టం రూపొందించారని, ఈ చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కన్నాల రైతువేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులకు భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు లభిస్తాయని అన్నారు. ఎలాంటి సమస్యనైనా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి వీలుందని తెలిపారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్, అదనపు కలెక్టర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం బుధాకుర్థు గ్రామ పంచాయతీ పరిధిలో సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో పి.హరికృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రాంచందర్, పీ ఏసీఎస్ చైర్మన్ స్వామి, ఏడీఏ రాజానరేందర్, తహసీల్దార్ జ్యోత్న్స, నాయకులు మహేందర్, శ్రీనివా స్, స్వామి, అనిత, లక్ష్మీనారాయణ, మల్లయ్య పాల్గొన్నారు. రైతులకు వరం..తాండూర్: భూభారతి చట్టం రైతులకు వరమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సురభి గార్డెన్స్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసి భవిష్యత్లో ఎలాంటి భూ సమస్యలు రాకుండా మరింత సమర్థవంతంగా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రైతులు, నాయకులు చేసిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ భూభారతి చట్టం, ప్రయోజనాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, డెప్యూటీ తహసీల్దార్ వీవీఆర్కేడీ ప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సౌమ్య, కాంగ్రెస్ నాయకులు, న్యాయవాదులు హాజరయ్యారు. -
‘మాదీ సైట్ బ్యాచే.. అన్నకు ఫోన్ చేయాలా?’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మాది కూడా సైట్ బ్యాచ్. అన్నకు ఫోన్ చేయాలా?’ అంటూ ఇరువర్గాలు ఘర్షణ పడిన తీరు అక్కడు న్న వారిని ఆశ్చర్యపోయేలా చేసింది. శుక్రవా రం మధ్యాహ్నం జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద ఓ హోటల్ పక్కనే ఉన్న పాన్షాపు యజమానికి మరో ఇద్దరికి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నగదు ఇచ్చినా ఇవ్వలేదనే షాపు నిర్వాహకుడు చెప్పగా, ఇద్దరి మధ్య ఈ విషయంలో ఒకరిపై ఒకరు మాటామాట పెరిగేలా చేసింది. మద్యంమత్తులో ఉన్న ఇద్దరు యువకులు షాపు అతని దగ్గరిగా వస్తూ ‘మాది సైట్ బ్యాచ్, అన్నతో మాట్లాడాలా?’ అంటూ బెదిరించసాగారు. అయితే అక్కడున్న మరొక వ్యక్తి ‘మేం కూడా సైట్ బ్యాచే. మేం కూడా అన్నతో మాట్లాడుతాం. ఎవరికి ఫోన్ చేయాలే, నేను మాజీ కౌన్సిలర్ని’ అంటూ గొడవ పడడం అక్కడున్నవారిని ఆశ్చర్యపడేలా చేసింది. ఇరువర్గాలు ఆ ‘బ్యాచ్’ పేరు చెబుతూనే కాసేపు వా దించుకుని వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంలో సైట్ బ్యాచ్ పేరుతో యువత, గ్యాంగ్లను పెంచిపోషిస్తూ చట్టవ్యతిరేక సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా గొడవ జరిగితే ఆ బ్యాచ్ పేరు చెబితే సామాన్యుల్లో భయం ఉంటుందనే కోణంలో ఆ పేరే వాడుకుంటున్నారు. గతంలో ఇదే షాపు వద్ద గొడవ జరగడం గమనార్హం. -
28 నుంచి రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్బాల్ పోటీలు
మందమర్రిరూరల్: ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున 20 మంది ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న జట్టు గుజరాత్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి రమేష్రెడ్డి, కోచ్ అరవింద్ పాల్గొన్నారు. -
ఆర్కే 7గని సింగరేణికే తలమానికం
● కంపెనీ డైరెక్టర్లు సత్యనారాయణరావు, వెంకటేశ్వర్లు ● ఘనంగా గని స్వర్ణోత్సవాలు శ్రీరాంపూర్: ఆర్కే 7 గని సాంకేతికతలో సింగరేణికే తలమానికమని సింగరేణి డైరెక్టర్లు అన్నారు. గని 50సంవత్సరాలు జీవిత కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరావు, డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలోనే మొట్టమొదట ఎస్డీఎ ల్ యంత్రాలను ఈ గనిలోనే ప్రవేశపెట్టామని తెలి పారు. మ్యాన్ రైడింగ్ యంత్రాలనూ ఇక్కడే ప్రవేశపెట్టామని, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, రక్షణ చర్యల్లో గనికి మంచి చరిత్ర ఉందని అన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఉద్యోగుల కు జ్ఞాపికలు అందజేశారు. గనిపై మైసమ్మ ఆలయంలో హోమాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవులు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం సుశాంత్ సాహూ, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు బాలాజీ పాల్గొన్నారు. -
ఫోన్కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్వాచ్మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్కు వాచ్మెన్ మహేశ్ సెల్ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్మెన్కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
టిప్పర్ ఢీకొని రిటైర్డ్ టీచర్ మృతి
ఆదిలాబాద్టౌన్: టిప్పర్ ఢీకొట్టి రిటైర్డ్ టీచర్ మృతిచెందిన ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్రూరల్ మండలం చాందా (టి) గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దేవళ్ల నారాయణ (65) జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఉంటున్నాడు. ఉదయం మార్నింగ్ వాక్ అనంతరం గాంధీ పార్కు నుంచి విద్యానగర్ వైపు వెళ్తుండగా కుమురంభీం చౌక్లో గల సర్కిల్ వద్ద టిప్పర్ ఆయనపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్కిల్తో ప్రమాదాలు.. సుందరీకరణ పేరిట గత ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని పలు ముఖ్య కూడళ్లలో సర్కిల్స్ ఏర్పాటు చేసింది. గతంలో కుమురంభీం చౌక్ వద్ద సిగ్నల్స్ ఉండేవి. ఉన్నవాటిని తొలగించి పెద్దగా సర్కిల్ను ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సైతం అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ఇటీవల కాలంలో నాలుగు దిక్కులా స్పీడ్ బ్రేకర్లు వేశారు. స్పీడ్ బ్రేకర్లు ఎత్తుగా ఉండడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం కుమురంభీం చౌక్ సర్కిల్లో రెండు కార్లు సైతం ఢీకొట్టాయి. -
కప్పర్లలో భారీ అగ్నిప్రమాదం
తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి పశువుల కొట్టం, మూడు మ్యాక్స్ వాహనాలు దగ్ధమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు బొమ్మని బుచ్చన్న పశువుల కొట్టం గ్రామ శివారులో ఉంది. గ్రామానికి చెందిన పలువురు తమ వా హనాలను సైతం పశువుల కొట్టం దగ్గరే నిలిపి ఉంచుతారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో పశువుల కొట్టం పూర్తిగా దగ్ధమైంది. పక్కనే పార్కింగ్ చేసిన మూడు మ్యాక్స్ వాహనాలకు సైతం మంటలు వ్యాపించాయి. రెండు మ్యాక్స్ వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా మరొక వాహనం పాక్షికంగా కాలిపోయింది. ఫైర్ ఇంజన్ వచ్చే వరకు గ్రామస్తులు వ్యవసాయ బోర్ మోటార్ ద్వారా నీళ్లను చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో పశువుల కొట్టంలో ఉన్న పైపులు, స్పింక్లర్లు, పశుగ్రాసం, వ్యవసా య సామగ్రి, మందులు, ఎరువులు, విద్యుత్ మో టార్లు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. గ్రా మానికి చెందిన గండ్రత్ కృష్ణకుమార్, గండ్రత్ అభిలాష్, దారుట్ల ప్రవీణ్లకు చెందిన మ్యాక్స్ వాహనాలు కాలిపోగా మొత్తంగా రూ.23 లక్షల కు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని ఆర్ఐ సంతోష్ పరిశీలించి పంచనామా ని ర్వహించారు. కాగా ప్రభుత్వం తరఫున సాయం అందించి ఆదుకోవాలని రైతు బుచ్చన్న కోరుతున్నాడు. మ్యాక్స్ వాహన యజమానులకు సైతం సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పశువుల కొట్టం దగ్ధం -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..
నిర్మల్టౌన్: ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తూ ఇన్విజిలేటర్కు పట్టుబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాజేశ్ మీనా బుధవారం వివరాలు వెల్లడించారు. స్థానిక సోమవార్పేట్లో గల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాసర్ల రత్నాకర్ అనే వ్యక్తి పరీక్ష రాయాల్సి ఉండగా అతని స్థానంలో కందుల జయవర్ధన్ పరీక్షకు హాజరయ్యాడు. ఇన్విజిలేటర్ అతని హాల్టికెట్ తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందజేయగా అక్కడకు చేరుకుని రత్నాకర్, జయవర్ధన్లపై కేసు నమోదు చేయడంతో పాటు అతని ఎగ్జామ్ పేపర్, హాల్ టికెట్ సీజ్ చేశారు. -
‘అణగారిన వర్గాలకు ఆసుపత్రులు కరువు’
బేల: అణగారిన పేద వర్గాలకు కనీసం ఆసుపత్రులు కూడా దిక్కులేవని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ అధ్వానంగా ఉండడంతో తానే స్వయంగా చీపురుతో ఊడ్చారు. అనంతరం శంషాబాద్లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కోడె గోవిందు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పెడచెవిన పెట్టాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొట్టిన కారు
కడెం: మండలంలోని దోస్త్నగర్ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్కు చెందిన దముఖ శివకృష్ణ తన కుమారుడు శ్రీశాంత్తో కలిసి తన కారులో జన్నారం నుంచి కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వెళ్తుండగా మార్గమధ్యలో దోస్త్నగర్ సమీపంలోని ఐ లవ్ కవ్వాల్ లోగో వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకృష్ణకు తీవ్ర గాయాలు కాగా, శ్రీశాంత్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో జన్నారంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పేకాటస్థావరంపై దాడిలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూ రు చౌరస్తా సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సురేశ్ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బు ధవారం పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి నిర్వహించి ఊత్కూరు గ్రామానికి చెందిన తుమ్మల సునీల్, ఏనుగుల తిరుపతి, గౌరువంతుల ప్రశాంత్, కడమండ్ల శేఖర్, ముప్పు శ్రీధర్, సత్యసాయి నగర్కు చెందిన ఎస్కె సనీర్, బుఖ్య రాజు, రాచర్ల రాకేశ్, పేరం పోచం అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3470ల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. స్క్రాప్ పట్టివేతశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఓసీపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఐరన్ స్క్రాప్ను సింగరేణి ఎస్అండ్పీసీ సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం ఓసీపీ ఎంట్రన్స్ సమీపంలో ఆటోలో తరలిస్తున్న బెల్ట్ రోలర్, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. ఓసీపీ రోడ్లపై దుమ్ము లేవకుండా నీటి ట్యాంకర్ను ఉపయోగిస్తున్నారు. ఈ ట్యాంకర్ను ప్రైవేటు కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ క్వారీ లోపల నీటిని నింపుకునే క్రమంలో అక్కడ ఉన్న ఈ స్క్రాప్ను ట్యాంకర్లో వేసుకొని పైకి తీసుకొచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంకర్ నుంచి తీసి స్క్రాప్ను చెట్ల పొదల్లో ఆటోలోకి మార్చుతున్న సమయంలో ఎంటీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి చూసే సరిగా దొంగతనం బయటపడింది. సిబ్బందిని చూసి దొంగలు పోరిపోగా ఆటోను, స్క్రాప్ను స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. రిమ్స్లో చికిత్స పొందుతూ ఒకరి మృతిఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఒకరు మృతిచెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. జైనథ్ మండలంలోని మేడిగూడకు చెందిన గొర్ల గణేశ్ (35) ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్నాడు. పెట్రోల్ బంక్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఫిట్స్తో బాధపడుతుండగా ఉద్యోగం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆయన ఈనెల 19న తన ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య
లక్ష్మణచాంద: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్రూరల్ మండలంలోని మూటాపూర్ గ్రామానికి చెందిన పులి పెద్దన్న (32)కు నిర్మల్ శాంతినగర్కు చెందిన లక్ష్మితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని రో జులుగా భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య లక్ష్మి తల్లి గారింటికి వెళ్లిపోయింది. ఈనెల 21న పెద్దన్న తన భా ర్యను తీసుకురావడానికి వెళ్లగా భార్య లక్ష్మి, ఆమె బంధువులు కలిసి పెద్దన్నపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దన్న సరస్వతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మండలంలోని రాచాపూర్ సమీపంలోని సరస్వతి కాలువలో మృతదేహం లభ్యమైంది. పెద్దన్న తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలి పారు.ఉరేసుకుని ఒకరు..నర్సాపూర్ (జి): మండల కేంద్రానికి చెందిన తోకల సాయన్న అలియాస్ భోజన్న మద్యం మత్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన తోకల సాయన్న అలియాస్ భోజన్న (55) స్థానిక జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 35 సంవత్సరాలుగా తాత్కాలిక అటెండర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి పనికి వెళ్లడం మానేసి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటి వెనకాల గల రేకుల షెడ్డులో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయన్న కుమారుడు తోకల వంశీరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మలేషియాలో నృత్య ప్రదర్శనకు ఆహ్వానం
● నటరాజ కళాక్షేత్రం విద్యార్థులకు అవకాశం ● ఈనెల 27న ప్రదర్శన జన్నారం: మలేషియాలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు మండల కేంద్రంలోని నటరాజ కళాక్షేత్రానికి చెందిన విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. మండల కేంద్రంలో చిన్నగా ప్రారంభమైన నటరాజ కళాక్షేత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికవడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 27న కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు గురువారం మలేషియకు వెళ్లనున్నారు. 2017లో ప్రారంభం.. 2017లో నటరాజ కళాక్షేత్రాన్ని కూచిపూడి నృత్యం, ఫోక్ డ్యాన్సులు నేర్పించేందుకు ముగ్గురితో ప్రారంభించారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రదర్శనలు ఇచ్చి అనేక బహుమతులు పొందారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. కూచిపూడిలో డాక్టరేట్ పొందిన మాస్టర్ నర్మద గౌడ్ నేతృత్వంలో రెండు బ్యాచ్లలో 20 మంది కూచిపూడి నృత్యంలో డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం 26 మంది నటరాజ కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకుంటున్నారు. కూచిపూడితో పాటుగా ఫోక్ పాటలపై కూడా డ్యాన్సులు నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. 27న మలేషియాలో ప్రదర్శన.. ప్రపంచ డ్యాన్స్ డే సందర్భంగా మలేషియాలో ఉద్యోగరీత్య స్థిరపడిన తమిళనాడుకు చెందిన ఆరుద్ర, నాట్య సమర్పణం ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న మలేషియా ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంతమంది డ్యాన్స్ మాస్టర్లకు ఆహ్వానం అందింది. అందులో తమిళనాడు రాష్ట్రం చైన్నె నుంచి కొందరు డ్యాన్స్ మాస్టర్లు, కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ నుంచి కొందరు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కొందరు ఎంపికయ్యారు. వీరితో పాటుగా జన్నారం మండలకేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రం డ్యాన్స్ మాస్టర్ నర్మదగౌడ్కు ఆహ్వానం అందింది. డ్యాన్స్ మాస్టర్ నర్మద గౌడ్తో పాటు 9 మంది విద్యార్థులు మలేషియాలో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ మేరకు 10 మంది నృత్య కళాకారులతో పాటుగా మరో 15 మంది తల్లిదండ్రులు గురువారం మలేషియాకు బయలు దేరనున్నారు.మంచి పేరు తీసుకొస్తాం.. నటరాజ కళాక్షేత్రం అంతర్జాతీయ నృత్య ప్రదర్శనకు ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. మా విద్యార్థులు మలేషియాలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జన్నారం మండలానికి మంచి పేరు తీసుకొస్తాం. – గాజుల నర్మదగౌడ్, డ్యాన్స్ మాస్టర్ -
‘ఓపెన్’ పరీక్షల్లో డబ్బులు వసూళ్లు!
బెల్లంపల్లి: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా బెల్లంపల్లిలో ఇంటర్ విద్యార్థుల కోసం బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, టెన్త్ విద్యార్థుల కోసం బెల్లంపల్లి బస్తీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్ష కేంద్రంలో డ్యూటీ చేస్తున్న ఇన్విజిలేటర్లు కొందరు విద్యార్థుల నుంచి బలవంతంగా ఒక్కో పరీక్షకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వని విద్యార్థులను టార్గెట్ చేసి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి చిట్టీలు అందజేసి మాస్ కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి డబ్బుల వసూలును నివారించి మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయమై మంచిర్యాల ఏసీజీ దామోదర్రావును వివరణ కోరగా పరీక్ష రాస్తున్న విద్యార్థుల వద్ద నుంచి ఇన్విజిలేటర్లు డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. పరీక్ష కేంద్రాలకు స్క్వాడ్ను పంపించి కట్టడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా నివారిస్తామని పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారులపై ఎస్పీ కొరడాఆదిలాబాద్టౌన్: జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గల వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం కొరడా ఝులిపించారు. ఆరు మండలాల్లో 30 బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ వన్టౌన్, టూటౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు, చెక్కులు, స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. గురువారం వారి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు ఇచ్చోడ: నియోజకవర్గంలోని వడ్డీ వ్యాపారులతో పాటు ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. సోదాల్లో వ్యాపారుల నుంచి పలు రకాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్, గుడిహత్నూర్లలో విడివిడిగా పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీలో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆయా పోలీస్స్టేషన్లలో అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ పరిధిలోని గోదావరి రోడ్కు చెందిన పందిరి అశ్విత(17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ బైపీసీ చదివిన విద్యార్థిని ఇటీవల వార్షిక పరీక్షలకు హాజరైంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షకు గైర్హాజరు కావడంతో ఫెయిల్ అయింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై బుధవారం ఉదయం ఇంటిలోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నస్పూర్లో ఏసీబీ కార్యాలయం
● ప్రారంభానికి సిద్ధమైన భవనం ● ఇక్కడే ఆసిఫాబాద్, మంచిర్యాల కేసుల పర్యవేక్షణ ● సీసీసీ నస్పూర్ పాత సీఐ కార్యాలయంలో ఏర్పాట్లు ● ప్రస్తుతం ఆదిలాబాద్లో కొనసాగుతున్న వైనంనస్పూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ కార్యాలయానికి అనుబంధంగా త్వరలోనే మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీసీ నస్పూర్లోని సింగరేణి క్వార్టర్లో కొనసాగిన పాతపోలీస్స్టేషన్ పక్కన గల సీఐ కార్యాలయంలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. క్వార్టర్లో మరమ్మతులు పూర్తి చేసి వారం, పది రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. తగ్గనున్న దూరభారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏసీబీ కార్యాలయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. ప్రస్తుతం ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇతర సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల బాధితులు అవినీతి అ ధికారులపై ఏసీబీకి నేరుగా ఫిర్యాదు చేయాలంటే వ్యయప్రయాసలకోర్చి ఆదిలాబాద్కు వెళ్లాల్సిన ప రిస్థితి ఉంది. అధికారులు సైతం ఫిర్యాదులపై వి చారణ జరిపేందుకు ఆదిలాబాద్ నుంచి మంచి ర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు రావాలంటే చాలా క ష్టపడాల్సి వస్తోంది. కాగా నస్పూర్లో కార్యాల యం ఏర్పాటైతే అన్నింటికీ సులభతరంగా ఉండనుంది. పెరుగనున్న ఫిర్యాదులు.. నస్పూర్ పట్టణంలో సమీకృత కార్యాలయం ఉండడం, అధికంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉండడంతో సంబంధిత శాఖల అధికారులు భారీగానే అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నా యి. ఆసిఫాబాద్ జిల్లా వాసులకు సైతం నస్పూర్ రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. నస్పూర్ పట్టణంలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటవుతున్న దృష్ట్యా అవినీతి అధికారులపై ఫిర్యాదులు పెరిగే అవకాశం ఉందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ఓ వైపు సీసీసీ నస్పూర్ పాత పోలీస్స్టేషన్ భవనంలో భరోసా కేంద్రం కొనసాగుతుండగా పక్కనే ఏసీబీ కార్యాలయం ఏర్పాటుపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రెండు జిల్లాల కేసులు పర్యవేక్షణ..నస్పూర్లో ఏర్పాటయ్యే కార్యాలయంలో ఒక సీఐ, ఇతర సిబ్బంది ఉంటారు. వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ పర్యవేక్షణలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించనున్నారు. ఆదిలాబాద్ కార్యాలయం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించనున్నట్లు అధికా రులు పేర్కొన్నారు.ప్రారంభానికి చర్యలు నస్పూర్ ఏసీబీ కార్యాలయం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సింగరేణి అధికారులు భవనాన్ని తమకు అప్పగించిన తర్వాత ఉన్నతాధికారుల సమయం తీసుకుని వారం, పది రోజులలో ప్రారంభిస్తాం. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
కుటుంబానికి జలగండం..!
● సరస్వతి కెనాల్లో కొట్టుకుపోయిన యువకుడు ● గతంలో ఇద్దరు సోదరులు చెరువులో పడి మృతినిర్మల్టౌన్: ఆ కుటుంబాన్ని జలగండం వెంటాడుతోంది. గతంలో ఇద్దరు కొడుకులు చెరువులో పడి మృతి చెందగా, బుధవారం మూడో కుమారుడు సరస్వతి కెనాల్లో గల్లంతు కావడం ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇబ్రహీం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతంలో దిలావర్పుర్లో ఉండగానే ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఇబ్రహీం తన కుటుంబాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని సర్ద్మహల్కాలనీకి మార్చాడు. ఈతకు వెళ్లి.. ఇబ్రహీం మూడో కుమారుడు హనీఫ్ (17) ఇద్దరు స్నేహితులతో కలిసి బుధవారం స్థానిక సిద్దాపూర్ సమీపంలోని సరస్వతి కెనాల్లో ఈతకు వెళ్లాడు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముందుగా దిగిన హనీఫ్ అందులో కొట్టుకుపోయాడు. మిత్రులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కాలువలో హనీఫ్ కోసం గాలిస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్ మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్లో ఇంటర్ చదువుతున్న హనీఫ్ పరీక్ష ఫలితాలు మంగళవారమే వచ్చాయి. ఇందులో ఆయన పాసయ్యాడు. ఫలితాలు వచ్చిన తెల్లారే ఇలా గల్లంతు కావడంతో విషాదం నెలకొంది. -
‘రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం’
లక్సెట్టిపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు వెర్రబెల్లి రఘునాఽథరావు అన్నారు. బుధవారం కొత్తూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టింగ్ పేరుతో బస్తాకు రెండు కిలోలు దోచుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదన్నారు. ఎలాంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్రెడ్డి, పురుషోత్తం, రమణారావు, ప్రభాకర్, గంగన్న, హరిగోపాల్, రాజగురువయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు. బీజేపీలో పట్టభద్రుల చేరిక చెన్నూర్రూరల్: మండలంలోని దుగ్నెపల్లి, ఎర్ర గుంటపల్లి, ఆస్నాదకు చెందిన పట్టభద్రులు బుధవారం బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునాధరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పార్టీ చెన్నూర్ పట్టణ ఇన్చార్జి రత్న లక్ష్మీనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్గౌడ్, భీమారం మండల ఇన్చార్జి ఆలం బాపు, నాయకులు కొటారి వెంకటేశ్, సత్యం, దుర్గం రాజు పాల్గొన్నారు. -
గ్యారంటీ గండం..!
● ఇప్పటికీ 9మిల్లులకే ‘సీఎంఆర్’కు అనుమతి ● గత సీజన్ నుంచే తగ్గుతున్న మిల్లులకు ట్యాగింగ్ ● ఈ యాసంగిలో పొరుగు జిల్లాలకు పంపే యోచన ● జిల్లా మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని వేడుకోలుధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ పరిశీలిస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బ్యాంకు గ్యారంటీ మెలిక మిల్లర్లకు గండంలా మారింది. రా మిల్లర్లు, కొత్తగా పరిశ్రమలో చేరిన వారికి మరింత ఇబ్బందిగా మారింది. కొనుగోళ్లు మొదలైనా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మిల్లర్లు రూ.కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ట్యాగింగ్ కావడం లేదు. నిబంధన ప్రకారం పది శాతం గ్యారంటీ ఇస్తేనే ధాన్యం అప్పగించాలి. పాత బకాయి ఉంటే మరో 20 శాతం అదనం. గత సీజన్ నుంచే సర్కారు కఠినంగా ఈ నియమం అమలు చేస్తోంది. దీంతో గత వానాకాలం నుంచే జిల్లాలో అనేక మంది మిల్లర్లు సీఎంఆర్కు దూరమయ్యారు. ఇక 2022–23 యాక్షన్ ధాన్యంకు సంబంఽధించి రూ.87 కోట్ల బకాయి ఉంది. మరోవైపు సీఎంఆర్ జాప్యం చేసిన 20 మిల్లులపై ఆర్ఆర్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విలువ రూ.133.78 కోట్లు ఉంటుందని పౌరసరఫరాల శాఖ లెక్కగట్టింది. ఆ డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి. బాయిల్డ్తో పోలిస్తే రా రైస్ మిల్లర్లు గత సీజన్ నుంచి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సేకరణకు ఇబ్బంది లేకుండా అధికారులు మిల్లర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 56 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 9 మిల్లులకే ట్యాగింగ్ ఇచ్చారు. మరో రెండు మిల్లులకు ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో ధాన్యం పెద్దఎత్తున కేంద్రాలకు రానుంది. దీంతో ఆలస్యమైతే రైతులు ఇబ్బంది పడనున్నారు. పొరుగు జిల్లాకు ధాన్యం ఈ యాసంగిలో జిల్లాలో 1.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 3.41లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉంది. మొత్తం 321 కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుండగా ఇప్పటికే 4వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. గత వానాకాలంలోనే గ్యారంటీలు ఇవ్వకపోవడంతో కరీంనగర్ జిల్లా మిల్లులకు ఇక్కడి ధాన్యాన్ని తరలించారు. ఈ నెల నుంచే రేషన్ షాపులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తరుణంలో రాష్ట్రస్థాయిలో బఫర్ స్టాక్తో చేసుకోవాల్సి ఉంది. వారంలో ధాన్యం రాక ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో పొరుగున ఉన్న పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ధాన్యం పంపేందుకు రాష్ట్ర ఉన్నతాధికారుల అనుమతి కోరారు. స్థానిక గోదాముల్లో నిల్వ సామర్థ్యం సైతం పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత ఇతర జిల్లాలకు పంపే యోచన చేస్తున్నారు. మిల్లర్ల వేడుకోలు బకాయిలు చెల్లించేందుకు ‘అండర్ టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే మూడు నెలలపాటు సమయం ఇవ్వగా జిల్లా మిల్లర్లకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు పొరుగు జిల్లాలకు ధాన్యం పంపితే అక్కడ తరుగు కటింగ్ చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ధాన్యం రవాణా ఖర్చు పెరుగుతుందని, ఇబ్బందులు వస్తాయంటున్నారు. కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖ నుంచి కమీషన్ నిలిచిపోయిందని, రూ.కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న రైస్మిల్లర్లకు, ఉపాధికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు గ్యారంటీ, బకాయిలు తీర్చిన వాటికే ధాన్యం అప్పగిస్తున్నామని, ఆ మేరకు తమ బకాయిలు కట్టాలని అధికారులు సూచిస్తున్నారు. -
వేసవి సెలవులు వచ్చేశాయ్..
మంచిర్యాలఅర్బన్: ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 24 నుంచి సమ్మర్ హాలీడేస్ (వేసవి సెలవులు) ప్రకటించడంతో చివరి రోజు బుధవారం విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు సందడిగా మారాయి. చాలారోజుల తర్వాత ఇంటికి వెళ్తుండడంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కబుర్లు చెప్పుకుంటూ సెల్ఫీ దిగారు. సెలవులతో విద్యార్థులు ఇంటిబాట పట్టడంతో మంచిర్యాల బస్స్టేషన్ రద్దీగా మారింది. బస్సుల్లో సీట్ల కోసం పాట్లు పడ్డారు. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
మందమర్రిరూరల్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శంకర్పల్లి జీపీ పరిధిలోని సండ్రోన్పల్లి రైతువేదికలో మంగళవారం తహసీల్దార్ సతీశ్కుమార్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం సారంగపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాస్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అనిత, ఎంపీడీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వ్యవసాయధికారులు బానోత్ప్రసాద్, కిరణ్మయి, తిరుపతి, రైతులు పాల్గొన్నారు. రైతులకు ప్రయోజనంకాసిపేట: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ముత్యంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగహన కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన మండలంలో జూన్ 2వరకు సమస్యలు పరిష్కరించి మిగతా మండలాల్లోని సమస్యను గుర్తించి ఆగస్టు 15లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ భోజన్న, తదితరులు పాల్గొన్నారు. పార్టీ సమావేశమా.. అధికారిక కార్యక్రమమా? సమావేశంలో అధికారుల తీరుపై బీజేపీ మండలాధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది అధికారిక కార్యక్రమమా లేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా ఫ్రోటోకాల్ ఏంటీ.. వేదిక పై కాంగ్రెస్ నాయకులే ఉంటారా.. అని అధికారులతో వాదనకు దిగారు. ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వరా అని నిలదీశారు. కలెక్టర్ నచ్చచెప్పి గొడవ సద్దుమణిగించారు. అర్హులకు రాజీవ్ యువ వికాసం వర్తింపజేయాలి మంచిర్యాలఅగ్రికల్చర్: రాజీవ్ యువ వికాసం పథకం అర్హులైన లబ్ధిదారులకు వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్లోని సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం వై.సురేష్, టీజీబీ ఆర్ఎం మురళీమోహన్రావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 30లోగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ -
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వీరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 15న జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన బోయ శ్రీనివాసులు నారాయణపేట్కు బదిలీకాగా ఆయన స్థానంలో సికింద్రాబాద్లోని సిటీ సివిల్ కోర్ట్లో పని చేసిన వీరయ్యను నియమిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించారు. జిల్లా జడ్జిని కలిసిన డీసీపీ మంచిర్యాలక్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఏ. వీరయ్యను బుధవారం డీసీపీ ఎగ్గడి భాస్కర్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో జరుగుతున్న నేరాలపై సమీక్షించారు. -
జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలు
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం జిల్లా మహిళా సమాఖ్య ఎన్నికలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎన్నికల ప్రత్యేకాధికారి నర్సింహస్వామి, డీపీఎం స్వర్ణలత ఆధ్వర్యంలో ఏడుగురు ప్రతినిధులను, తొమ్మిది మందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా దండేపల్లి మండలానికి చెందిన ఏ.అనిత, కార్యదర్శిగా లక్సెట్టిపేట మండలానికి చెందిన బి.శ్రీలత, కోశాధికారిగా జైపూర్ మండలానికి చెందిన ఎం.మాలతీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న సభ్యులను అధికారులు శాలువాలతో సత్కరించారు. -
అమరులకు కొవ్వొత్తులతో నివాళి
ఐఎంఏ సభ్యుల కొవ్వొత్తుల ర్యాలీ మంచిర్యాలటౌన్/మంచిర్యాలక్రైం: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో బీజేపీ, ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ సామాన్య ప్రజలపై ఉగ్రవాదుల దాడులు సరికాదన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్, వైద్యులు పి.రమణ, ఏ.వెంకటేశ్వరరావు, ఏ.స్వరూపరాణి, విద్యార్థులు పాల్గొన్నారు.