South India
-
కేజీఎఫ్ హీరో గొప్ప మనసు.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్..!
కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో ప్రస్తుతం టాక్సిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతూ మోహన్దాస్ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జూన్లో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న రామాయణలోనూ యశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ యశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఒక అభిమాని సునీల్కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతనిలో ధైర్యం నింపారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అభిమాన హీరో మాట్లాడడంతో క్యాన్సర్ బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. యశ్ ఆత్మీయ సంభాషణ అతనిలో కొత్త భరోసాను తీసుకొచ్చింది.క్యాన్సర్తో పోరాడుతున్న సునీల్ శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు కావడం విశేషం. అతనికి చికిత్స సమయంలో అండగా ఉంటానని కూడా యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎంత బిజీగా ఉన్నా తన అభిమానితో వీడియో కాల్ చేసి మాట్లాడటంతో యశ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..!
విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె బర్త్ డే రోజే ఫలితాలు రావడం మరింత కలిసొచ్చింది. విజయ్ గెలుస్తాడన్న ధీమాతో త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ సీఎం అయ్యాక కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్గా శారీలో కనిపించింది. వీరిద్దరిపై ఎన్నికల ముందు నుంచే డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్దిద్దరు జంటగా వెళ్లి అజిత్ కుమార్ను పరామర్శించారు.ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. నా విషయాల్లో నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే అంటూ డాగ్ ఫోటోను షేర్ చేసింది. ఇది చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్ను ఉద్దేశించే అలా పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది.అంతేకాకుండా త్రిష తన మ్యాజికల్ మే అని మే నెల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోల వరుసలో పుట్టినరోజు క్షణాలు, పువ్వులు, సెల్ఫీలు, వ్యక్తిగత స్నాప్షాట్లు, ఆమె పెంపుడు కుక్క చిత్రాలు ఉన్నాయి. "మ్యాజికల్ మే నెల నుంచి మరికొన్ని చిత్రాలు.. వీటిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. -
ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా
ఒకప్పుడు హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన అర్జున్ సర్జా ఇప్పుడు సహాయ పాత్రలే దాదాపుగా చేస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'సీతా పయనం' అనే తెలుగు మూవీతో దర్శకుడిగానూ ఓ ప్రయత్నం చేశాడు గానీ అస్సలు వర్కౌట్ కాలేదు. అలాంటి ఇతడు హీరోగా నటించిన ఓ చిత్రం ఇప్పుడు థియేటర్లలో అదరగొడుతోంది. కలెక్షన్స్ కూడా అలానే వస్తున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు చేసిన తమిళ సినిమా 'బ్లాస్ట్'. తెలుగులో దీన్ని 'బ్లాస్ట్ జోన్' పేరుతో రిలీజ్ చేశారు. లీడ్ రోల్స్ చేసిన ఎవరూ కూడా పెద్ద స్టార్స్ ఏం కాదు. ప్రమోషన్స్ కూడా సాధారణంగా చేసి వదిలేశారు. కానీ మూవీలో కంటెంట్ మాత్రం అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సెకండాఫ్లో అర్జున్తో పాటు అభిరామి, ప్రీతి చేసే ఫైట్ సీక్వెన్స్ సూపర్ అని మెచ్చుకుంటున్నారు.ఇలా మౌత్ టాక్తోనే ఈ సినిమాకు రూ.25.26 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పెద్దగా స్టార్స్ లేని ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే అది హిట్ కిందే లెక్క. ఈ నంబర్స్ చూసిన చాలామంది అర్జున్ మార్కెట్ ఇంకా బతికే ఉందా అని మాట్లాడుకుంటున్నారు. సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.'బ్లాస్ట్' విషయానికొస్తే.. నీల(ప్రీతి ముకుందన్), ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) ఈ ముగ్గురూ కరాటే మాస్టర్లే. వీళ్లకు కరాటే ట్రైనింగ్ సెంటర్తో పాటు ఓ మెడికల్ షాప్ ఉంటుంది. నీల ఓ రోజు షాప్లో ఉన్నప్పుడు కృపాకర్ (పవన్) గ్యాంగ్కి చెందిన ఓ రౌడీ ఆమెను బెదిరించి కొన్ని మందులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే ఆమె చేతిలో చావు దెబ్బలు తిని జైలుపాలవుతాడు. కానీ ఈ అరెస్ట్ తర్వాత కృపాకర్ గ్యాంగ్తో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం).. నీల కుటుంబాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తారు. తర్వాత ఏమైంది? తమని నాశనం చేసేందుకు వచ్చిన శత్రువుల్ని నీల కుటుంబం ఎలా ఎదుర్కొంది? అనేది మిగతా సినిమా.(ఇదీ చదవండి: సుస్మితా సేన్ దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది) -
అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్చరణ్
పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సెలబ్రేషన్స్ చేశాం. ఆర్టిస్ట్గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్గారికి ధన్యవాదాలు. బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అంటూ చరణ్ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్ను యాంకర్ సుమ జాన్వీతో చెప్పించారు. హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ నైట్ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోస్టర్ను ఈవెంట్ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్లో ఆడే జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్కు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్స్టర్ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. -
ధనుశ్ లేటేస్ట్ మూవీ.. ఏకంగా నంబర్వన్గా ట్రెండింగ్..!
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్ఫ్లిక్స్లో నంబర్వన్ ప్లేస్లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కర అసలు కథేంటంటే..ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్ కర(ధనుష్) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్ పెట్టుకోవాలనుకుంటారు.లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ భరతన్ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే!
నటులుగా వెండితెరపై మెరవడం మాత్రమే కాదు, సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్)తో ఆకట్టుకున్నారు. ఆరోగ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఆలోచనతో చాలా మంది ప్రముఖులు సొంతంగా ఫామ్హౌస్లను ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ఒకరు. నటన మాత్రమే కాదు., ఆర్గానిక్ ఫార్మింగ్లోనూ సూపర్స్టార్ అనిపించుకుంటున్న మోహన్లాల్ పచ్చని స్వర్గం గురించి తెలుసుకుందాం.భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా ఉండటమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు చూసిన అత్యంత విజయవంతమైన సూపర్స్టార్లలో మోహన్లాల్ కూడా ఒకరు. అయితే, ఆయన ఆసక్తులు సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు.సినిమాతో పాటు థియేటర్, సంగీతం, వ్యాపారం, మ్యాజిక్ వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న మోహన్లాల్, ఎర్నాకుళం జిల్లా కరూర్ పరిధిలోని ఎలమక్కరలో ఉన్న తన ఇంటి పక్కన గల అర ఎకరం భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రీయ వ్యవసాయం) చేస్తూ ఒక పచ్చని నందనవనాన్ని సృష్టించారు.అయితే సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఆలోచన కోవిడ్ లాక్డౌన్ సమయంలో హఠాత్తుగా ఏమీ ప్రారంభించలేదు. 2010ల మధ్యకాలం కాలంనుంచే ఆయన ఈ పనిలో ఉన్నారు. అయితే, 2020-2021 కోవిడ్ లాక్డౌన్ల సమయంలో సినిమా షూటింగులు, ఇతర వినోద కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయన తన పూర్తి సమయాన్ని ఈ వ్యవసాయంపైనే కేంద్రీకరించారు.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!ఇక ఆయన తోటలో పండని కూరగాయ లేదంటే అతిశయోక్తి లేదు. మోహన్లాల్ గతంలోనే ఒక వీడియోలో వెల్లడించినట్టు కాకరకాయ, బీన్స్, బెండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, మొక్కజొన్న, కర్రపెండలం వంటి కూరగాయలు పండిస్తున్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇక్కడ పండిన సొంత కూరగాయలనే తింటానని ఆయన చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రం ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఉంటారు కూడా. స్థలం లేని వారు గ్రో బ్యాగుల్లో (Grow bags) అయినా తమకు కావలసిన కూరగాయలను పండించుకోవచ్చని ఆయన అందరికీ పిలుపునిచ్చారు. అన్నట్టు మోహన్లాల్కు పెంపుడు జంతువులన్నా కూడా చాలా ప్రేమ.మరోవైపు కెమికల్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు అప్పటి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వి.ఎస్. సునీల్ కుమార్ కూడా మోహన్లాల్ను అభినందించారు. ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!'దృశ్యం 3'తో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులుదృశ్యం 3తో మలయాళ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన మోహన్లాల్ మోహన్ లాల్ కరియర్పరంగా ఆలోచిస్తే దాదాపు 45 ఏళ్లకు పైగా సినీ కెరీర్లో 360 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి, రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు ,ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన 'దృశ్యం 3' (2026) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మే 31, ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 219.75 కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు -
అల్లు అర్జున్ రాకా.. మలయాళ బ్యూటీకి జాక్పాట్...!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. ఇప్పటికే రిలీజైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ నటిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న ఫెమినా.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఆయన నటించిన హ్యాపి నేను చూసిన మొదటి చిత్రమని వెల్లడించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో భాగం కావడం కల నిజమైనట్లుగా ఉందని పేర్కొన్నారు, ఇటీవల డిస్కో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే రాకా టీమ్ నుంచే ఫోన్ వచ్చిందని పంచుకున్నన్నారు. కాగా.. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఫెమినా 2021లో నెట్ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. -
కమెడియన్ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు
దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.ఆయనలా నటించా..ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.చదువు లేదుఅందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్ నేర్చుకుందామని క్లాసెస్కు వెళ్లాను. అక్కడ ఇన్స్ట్రక్టర్ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. అప్పుడే డిసైడయ్యా..ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్ చేశావ్ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.చదవండి: డోలారే సాంగ్ షూటింగ్లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్? -
నా గర్భస్రావానికి సీఎం విజయ్నే కారణం: బుల్లితెర నటి
తమిళనాడులో జల్లికట్టు ఆందోళన ద్వారా పాపులర్ అయిన బుల్లితెర నటి జూలీకి హీరో విజయ్ అంటే గిట్టదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన్ను విమర్శిస్తూ ప్రచారం చేసింది. విజయ్కు వ్యతిరేకంగా చెన్నై మెరీనా బీచ్లో అనుమతి లేకుండా నిరసన తెలిపి వివాదంలో చిక్కుకుంది. అయితే దళపతి అభిమానులు, తమిళ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తల ట్రోలింగ్ వల్ల తాను నరకయాతన అనుభవించానంటోంది జూలీ. ట్రోలింగ్..తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూలీ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేకపోతున్నాను. నన్ను దారుణంగా విమర్శించిన కొందరి పేర్ల వివరాలతో సహా మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పుడు ఎన్నికల సమయం కావడంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు చూస్తే రివర్స్లో నాపైనే రూ.15 లక్షల కిడ్నీ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.గర్భస్రావానికి ఆయనే కారణంమరోవైపు వీళ్ల ట్రోలింగ్ వల్ల నాకు మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కడుపులో బిడ్డను కూడా కోల్పోయాను. నా గర్భస్రావానికి సీఎం విజయ్ అన్నయే కారణం. ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినా పరోక్షంగా ఆయన హస్తం ఉంది. నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నవారిని ఒక్క మాట చెప్పి అదుపు చేసుంటే నేను నా బిడ్డను కోల్పోయేదాన్నే కాదు.ప్రజలపై దృష్టి పెట్టండినన్ను, నా భర్తను అనరాని మాటలంటున్నారు. మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మహిళ జీవితాన్నే నాశనం చేస్తారా? సోషల్ మీడియా వల్లే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని అంటున్నారు కదా.. ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై దాడులు చేయించడానికి బదులుగా ప్రజల కోసం ఏం చేయాలన్నదానిపై దృష్టి పెడితే బాగుంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది అనైతికంజూలీ కామెంట్స్పై నటి అంబిక అసహనం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో నీకు జరిగినదానికి చింతిస్తున్నాను. కానీ నువ్వు చెప్పేది అనైతికంగా ఉంది. నీ గర్భస్రావానికి సీఎం విజయ్ ఎలా కారణమవుతాడు? ముందు నీ మాట తీరు మార్చుకో.. సీఎం, పీఎసం స్థానంలో ఉన్నవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో అని చురకలంటించింది.బుల్లితెరకాగా జూలీ తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొంది. ఆ తర్వాత బిగ్బాస్ అల్టిమేట్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ఒడి విలయదు పాప అనే షోకి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. నాన్ సిరితల్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ ఏడాది జనవరిలో మొహ్మద్ ఇక్రీమ్ను పెళ్లాడింది.చదవండి: హీరోయిన్ కాజల్కు ఎంత కష్టమొచ్చింది? -
నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా: విఘ్నేశ్
వరుస బ్లాక్బస్టర్స్తో స్పీడుమీదున్న ప్రదీప్ రంగనాథన్కు ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) పెద్ద షాకే ఇచ్చింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా అతడి భార్య, హీరోయిన్ నయనతార నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఊహించని ఈ ఫలితానికి విఘ్నేశ్ విస్తుపోయాడు. కనీసం రూ.200-300 కోట్లు వసూలు చేస్తుందనుకున్నానని బాధపడ్డాడు.నెగెటివ్ టాక్థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎల్ఐకేపై ఎందుకు నెగెటివిటీ ప్రచారం చేశారో తెలియడం లేదు కానీ సినిమా అదిరిపోయిందని పలువురు అతడికి మెసేజ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు విక్కీ. 'ఆన్లైన్లో ఎల్ఐకే మూవీపై వచ్చిన నెగెటివిటీ చూసి దీన్ని థియేటర్లలో చూడటం మిస్ అయ్యాం అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు.కలలు నాశనంపెద్ద తలకాయల అండదండలు లేని చిన్న సినిమాలపై కొందరు విశ్లేషకులు తమ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ రివ్యూలతో ప్రేక్షకుల్ని సినిమా చూడనివ్వకుండా నిరాశపరుస్తున్నారు. దర్శకుల కలల్ని ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ బలంగానే ఉన్నప్పటికీ ఈ నెగెటివ్ ప్రచారం సినిమాను దెబ్బకొట్టింది. సినిమా ఫలితాన్ని నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎల్ఐకే అనేది ఒక విభిన్నమైన తమిళ చిత్రం. ఆ కష్టం ఎవరికీ కనపడదుదీనికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ రావాల్సింది. ఇలాంటి సినిమా తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సినిమాను రూపొందించి, రిలీజ్ చేయడం వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి థియేటర్లవరకు తీసుకొచ్చాను. కానీ, దానికి చివరకు ఇలాంటి ముగింపు రావడం కలిచివేసింది. అయినా కొన్ని గొప్ప సినిమాలు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఆదరణకు నోచుకోవు.. కానీ, తర్వాతి కాలంలో అవే క్లాసిక్ చిత్రాలుగా పరిగణించబడతాయి. భవిష్యత్తులో నా సినిమాకు కూడా అలాంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను' అని విఘ్నేశ్ ఎమోషనల్ లేఖను పంచుకున్నాడు.చదవండి: ప్రముఖ సింగర్ ఇక లేరు -
కాజల్కు ఎంత కష్టమొచ్చింది?
ఒక్కసారి డౌన్ అయితే మళ్లీ పైకి లేవడానికి సమయం పడుతుంది. ఒక్కోసారి అది కూడా జరగకపోవచ్చు. నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ లెగసీని కొనసాగిస్తున్నారు. కాజల్ అగర్వాల్ వంటి కొందరు మాత్రం కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కాజల్ ఇంతకుముందు పాన్ ఇండియా హీరోయిన్గా రాణించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిన ఈ ఉత్తరాది భామ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. స్లిమ్ అయిన కాజల్ఆ సమయంలో సినిమాలకు కొంత విరామం ఇచ్చిన కాజల్ ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అవాలని చూస్తోంది. అందుకే అనేక కసరత్తులు చేస్తూ స్లిమ్ అయిపోయింది. అయితే అవకాశాలు అరుదుగా వస్తున్నప్పటికీ గుర్తింపయితే రావట్లేదు. ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లోనే నటిస్తోంది కానీ బిజీగా మాత్రం లేదు. హిందీలో రామాయణం, ద ఇండియా స్టోరి మూవీస్ చేస్తోంది. కమల్ హాసన్ ఇండియన్ 3 ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని పరిస్థితి. అందుకోసమే కసరత్తులుతాజాగా ఈ బ్యూటీ ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇకపోతే పూర్వవైభవాన్ని పొందాలని తహతహలాడుతున్న ఈ బ్యూటీ తనను తాను ప్రచారం చేసుకునే పనిలో పడింది. గతకొద్దిరోజులుగా ప్రతిరోజూ ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అవి నెట్టింట వైరలవుతుండగా అవకాశాల కోసమే ఈ ఫోటో సెషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి తన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో? లేదో? చూడాలి!చదవండి: ప్రముఖ గాయని సుమన్ ఇక లేరు -
అవార్డుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఇళయరాజా
సంగీత రంగంలో రారాజుగా వెలుగుతున్న సంగీతదర్శకుడు ఇళయరాజా. తమిళం, తెలుగు మొదలగు భాషల్లో తన ఖ్యాతిని చాటిన ఈయన సంగీత పయనం 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం, ఆదివారం.. రెండు రోజులపాటు చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సంగీత కచేరి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ‘‘నేను అవార్డుల కోసం వేచి చూసే వ్యక్తిని కాదు. నేను నడిచినా, మాట్లాడినా సాధననే’’ అని ఇళయరాజా పేర్కొన్నారు. సంగీత కచేరిఈ వేదికపై తన ఇద్దరు మనవళ్ల మధ్య కూర్చుని ఇళయరాజా సంతోషంగా కనిపించారు. ముందుగా విదేశీ సంగీత కళాకారులు సింపోనిని వాయించారు. అనంతరం ఇళయరాజా గతంలో సంగీతం అందించిన పాటలను శ్రోతల కోసం వాయించారు. ఇళయరాజా 'పుదియ వార్పుగళ్' చిత్రంలోని 'ఇదయం పోగుదే..' అనే పాటను రూపొందించిన విధానం గురించి, దానికి వాడిన సింపోని గురించి వివరించారు. అతిథులుఈ కార్యక్రమంలో ఇళయరాజా వారసులు యువన్ శంకర్రాజా, కార్తీక్రాజాలతో పాటు దర్శకుడు మిష్కిన్, కార్తీక్ సుబ్బరాజ్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు ఆర్వీ.ఉదయకుమార్, మారి సెల్వరాజ్, విఘ్నేశ్ శివన్, నటుడు సిద్ధార్ధ్, పార్తీబన్, సంతానభారతి, ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది సంగీత ప్రియులు ఆనందంతో తరించారు. -
‘పెద్ది’ ప్రచారం కోసం ఆపరేషన్ వాయిదా
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్ పాత్రలో చరణ్ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్ షూటింగ్లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్కి కంటెంట్ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్
హీరోయిన్ శోభిత.. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం మానేస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. కాకపోతే ఈమె నటించిన 'చీకటిలో' మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. వివాహం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)శోభిత తెలుగమ్మాయి అయినప్పటికీ హిందీ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలోనూ పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ తీస్తున్న 'వెట్టువం' అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రంలో శోభిత లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఫొటో రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్లో పవర్ఫుల్గా కనిపించింది.(ఇదీ చదవండి: చైతూతో పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి శోభిత కామెంట్స్) -
ఎల్సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్కమ్..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ కనగరాజ్.. ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్ డీసీ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. Welcome to the universe @iam_RaviMohan sir 🤗🤗❤️❤️ #Benz @offl_Lawrence @nivinofficial @iamsamyuktha_ @Dir_Lokesh @PassionStudios_ @TheRoute @GSquadOffl @Sudhans2017 @Jagadishbliss @bakkiyaraj_k @SaiAbhyankkar pic.twitter.com/kxF51Vtb9Z— Lokesh Kanagaraj (@Dir_Lokesh) May 31, 2026 -
'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు
'జన నాయగణ్'.. ఐదారు నెలల క్రితమే రావాల్సిన సినిమా కానీ ఇప్పటికీ రిలీజ్ కావట్లేదు. అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడి దీని విషయంలో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్.. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో మూవీ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అంతా అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలేం జరుగుతుంది అని అంతా మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)'జన నాయగణ్' సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్కి మూవీ రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. సినిమా రిలీజ్ నా చేతుల్లో లేదు. ఈ మూవీకి సంబంధించిన నిజాలు మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా దానిని ప్రసారం చేసే ధైర్యం మీకు లేదు' అని అన్నాడు. ఈ మాటలు విని అంతా షాకవుతున్నారు.ఎందుకంటే స్వయంగా డైరెక్టరే.. 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదని మాట్లాడటం కొత్త కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఏంటా నిజాలు? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈనెల 19నే మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ అయితే ఉంది గానీ ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. విజయ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్. (ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)Dir #HVinoth Recent- The release of #JanaNayagan is not in my hands, I don’t have the courage to reveal the reality about JanaNayagan’s release and if I do say it, you won’t have the courage to upload it on YouTube.#CMJosephVijaypic.twitter.com/OoI4nWJcbJ— Movie Tamil (@_MovieTamil) May 30, 2026 -
రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య
సక్సెస్ ఉన్నడినే అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటేనే మార్కెట్ బాగుంటుంది. సినిమాలకు కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అలా చాలా ఏళ్ల తర్వాత 'కరుప్పు' మూవీ బ్లాక్బస్టర్ కావడంతో హీరో సూర్య ఆనందం పట్టలేకపోతున్నాడు. చిత్ర యూనిట్కి కార్లని బహుమతిగా ఇస్తున్నాడు.(ఇదీ చదవండి: అప్పుడు ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా : శివరాజ్కుమార్)సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది గానీ పర్లేదనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది.ఇకపోతే ఈ సినిమాలో తనని అద్భుతంగా చూపించినందుగానూ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకి మహీంద్ర బీ6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని సూర్య బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని విష్ణు తన ఇన్ స్టాలో వెల్లడించాడు. ఈ కారు ఖరీదు రూ.30-40 లక్షల ఉంటుంది. ఇతడితో పాటు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కి కూడా ఇదే మోడల్ కారు ఇచ్చాడు. ఆ విషయాన్ని సాయి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చూస్తుంటే సూర్య.. టీమ్ అందరికీ ఒకేలాంటి కార్లు గిఫ్ట్స్ ఇస్తున్నట్లున్నాడు.(ఇదీ చదవండి: 'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్) -
ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు.జూన్ 5 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. -
అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. వీడియో వైరల్..!
కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్తలో అజిత్ అభిమానులు, కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుబాయ్లో ఉన్న అజిత్ వెంటనే చెన్నై చేరుకున్నారు. ఆమె కడచూపు కోసం అభిమానులు పెద్దఎత్తున అజిత్ ఇంటికి వచ్చారు.తమిళనాడు సీఎం విజయ్ కూడా అజిత్ తల్లి మోహిని పార్ధివదేహానికి నివాళులర్పించారు. దండ చేతిలో పట్టుకుని నేరుగా అజిత్ ఇంటికి వెళ్లిన విజయ్.. అక్కడే ఉన్న అజిత్ను ఓదార్చారు. సీఎంతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు. సీఎం విజయ్తో పాటే త్రిష కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. AK receives CM Vijay & Trisha! pic.twitter.com/AM9UExLtCe— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2026 -
కోలీవుడ్లో మళ్లీ బిజీ అయిపోయిన తెలుగింటి ఆడపడుచు
నటి ఐశ్వర్యరాజేశ్ ఆరణాల తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయితే ఈమెను ముందుగా ఆదరించింది తమిళ సినిమానే. కాక్కా ముట్టై చిత్రానికి ముందు వరకు తనుకంటూ గుర్తింపు కోసం పోరాడిన ఐశ్వర్య రాజేశ్, ఆ చిత్రం తరువాత ఈమెను తమిళ చిత్ర పరిశ్రమ అంతా ప్రశంసలతో ముంచెత్తింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆ మధ్య ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలును అందుకున్నారు. అక్కడ వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అలా తెలుగులో చిత్రాలు చేయడంతో కోలీవుడ్లో చిన్న గ్యాప్ వచ్చింది. కాగా ఇప్పుడు ఇక్కడ మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రను పోషిస్తున్న అండర్–18 అనే క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ నటుడు కిచ్చా సుదీప్, విక్రాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు కార్తీక్ పెరుమాళ్స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ఆర్ ప్రొడక్షన్న్స్ పతాకంపై బి.జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ను ప్రారంభించనున్నట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కోసం చాలా కాలం ఎదురుచూసినందుకు దక్కిన అవకాశం ఈ చిత్రం అని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. -
మహేష్ బాబాయ్ నాకు చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ డెబ్యూ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. సినిమా కంటెంట్, ఎమోషన్ అన్నింటినీ దగ్గరుండి గమనించి, తన ఫీడ్బ్యాక్ ఇచ్చాడని జయకృష్ణ స్వయంగా వెల్లడించాడు. మహేష్ ఇచ్చిన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని జయకృష్ణ చెబుతున్నాడు. శ్రీనివాస మంగాపురం గురించి జయకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లోతైన ఎమోషన్ కలిగిన సినిమా. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన కథ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది. తాతయ్య ఆశీస్సులు నాతో ఉంటాయి‘‘తాతయ్య కృష్ణగారు నాకు దేవుడితో సమానం. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందర్నీ కలవడం హ్యాపీగా ఉంది. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు). అలాగే మా బాబాయ్ మహేశ్బాబుకి నేను డైహార్డ్ ఫ్యాన్ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ను లాంచ్ చేసి, ఫీడ్బ్యాక్ ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న మా బాబాయ్కి థ్యాంక్స్. ఈ సందర్భంగా మా నాన్న రమేశ్బాబుగారిని తలచుకుంటున్నాను. మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేశ్బాబుగారితో ‘రాజకుమారుడు’ చేశారు దత్తుగారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్న ఆయనకు రుణపడి ఉంటాను.కిరణ్, అజయ్ భూపతి, రాషా, రాఘవేంద్ర రావు, జయకృష్ణ, అశ్వినీదత్, ఆదిశేషగిరి రావు ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ‘‘ఈ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు రాషా. ‘‘కృష్ణగారు నిజమైన సూపర్స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆ కృష్ణగారి క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. జయకృష్ణ పెద్ద హీరో అవుతాడని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. ‘‘కృష్ణగారిలాగే జయకృష్ణ కూడా తన ప్రతిభను చూపించాడు’’ అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. ‘‘జయకృష్ణ న్యూయార్క్లో ఫిల్మ్ కోర్సు చదివాడు. ఈ సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు ఆదిశేషగిరి రావు. ‘‘శ్రీనివాస మంగాపురం’ అని పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం’’ అన్నారు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్ర రావు. -
9 రోజుల్లో రూ. 40 కోట్ల కలెక్షన్స్.. మరాఠీ సినిమా ఊచకోత!
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయో అందరికి తెలిసిందే. కంటెంట్ సంగతి ఎలా ఉన్న సరే.. రిలీజ్ ముందు వరకు‘ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా’ అంటూ ప్రచారం చేసి మరీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ చిన్న సినిమా మాత్రం ఎలాంటి చడీచప్పుడు లేకుండా వచ్చి.. బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 9 రోజుల్లోనే రూ. 40 కోట్లు వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. అదే మరాఠి చిత్రం ‘దేవూల్ బంద్ 2’.స్నేహల్ తార్డే, మోహన్ జోషిక కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మౌత్ టాక్తోనే మొదటి వీకెండ్లో రూ. 5.90 కోట్లు వసూలు చేసింది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే రూ. 40.80 కోట్లు(గ్రాస్) వసూలు చేసి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మరాఠి చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది.దేవూల్ బంద్ 2 కథేంటంటే.. మహిళ రైతు సంగీత పేగుడే(స్నేహల్)కు వరుస కష్టాలు వస్తుంటాయి. తన బాధలను తీర్చమని నిత్యం దేవుడిని వేడుకుంటుంది. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో ఒకరోజు తీవ్ర అసహనానికి గురై పక్కనే ఉన్న పుట్టపై రాయి విసిరేస్తుంది. వెంటనే అందులో నుంచి శ్రీస్వామి సమర్థ్ దర్శనమిస్తాడు. ఆమెతో కలిసి గ్రామానికి కూడా వెళ్తాడు. దేవుడు రాకతో సంగీత జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకున్నాయి? అనేదే ఈ సినిమా కథ. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు.#DeoolBand2 Movie 9 Days Box-office update :🔹Maharashtra : 39.77 Cr🔹Goa : 45 Lakhs🔹Karnataka : 35 Lakhs🔹Gujarat : 21 Lakhs🔹Rest : 2 LakhsTotal Domestic : 40.80 CroresTotal India Gross — 40.80 CroresTotal India Net — 34.37 CroresDistributor Share… pic.twitter.com/OGnzHdwAhb— Jerin Georgekutty (@jerinGeorgekut2) May 30, 2026 -
బోల్డ్ వీడియో.. డబ్బు కోసం కాదు, క్షమించండి: నటుడి కూతురు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ప్రముఖ నటుడి కూతురు చేస్తున్న పని అలాగే ఉంది. అసలే ఇది డిజిటల్ యుగం. సెలబ్రిటీలు చిన్న పొరపాటు చేస్తే చాలు దాన్ని భూతద్దంలో పెట్టి మరీ ట్రోల్ చేస్తుంటారు. అలాంటిది ఒక వీడియోను కావాలనే సబ్స్క్రిప్షన్స్ మెంబర్స్ కోసం పోస్ట్ చేయడమేంటో, అది వైరల్ అవడంతో తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడమేంటో తనకే తెలియాలి! ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దాం..బోల్డ్ వీడియోమలయాళ నటుడు కృష్ణ కుమార్కు నలుగురు కూతుర్లు సంతానం. వీరిలో అహానా, ఇషాని కృష్ణలు యాక్టర్స్గా చెలామణీ అవుతున్నారు. దియా, హన్సికలు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లుగా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నవారి కోసం ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోలు వదులుతున్నారు. అలా హన్సిక కూడా కాస్త బోల్డ్ వీడియో ఒకటి తన సబ్స్క్రైబర్ల కోసం పోస్ట్ చేసింది. డబ్బు కోసం దిగజారాలా?అది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోకు ముందు తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ధర రూ.299గా ఉంటే ఆ వీడియో తర్వాత రూ.399గా ధర ఫిక్స్ చేసింది. దీంతో డబ్బు కోసం ఇంతకు దిగజారాలా? ఇలాంటి వీడియోలు పెట్టాలా? అని జనం తిట్లదండకం అందుకున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న హన్సిక.. పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ ఓ లేఖ వదిలింది. 'ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ కింద మూడు వారాల క్రితం ఓ వీడియో షేర్ చేశాను. బుద్ధి లేక, నిర్లక్ష్యంగా ఆ పని చేశాను. అందుకు నెల రోజులుగా బాధపడుతున్నాను.ఐదు నిమిషాల్లో డిలీట్.. అయినా!అసలు ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేశానో నాకే అర్థం కావడం లేదు. తప్పు జరిగిపోయింది. కేవలం పోస్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశాను. కానీ, అప్పటికే కొందరు దాన్ని రికార్డు చేసి వైరల్ చేశారు. డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఇలా చేశానని కొందరు దారుణంగా మాట్లాడుతున్నారు. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు. 20 ఏళ్లకే నా బాగోగులు నేను చూసుకునేంత సంపాదించడం మొదలుపెట్టాను. చాలా భయపడ్డా..ఎన్నో ఏళ్లుగా మీరందరూ నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలు కురిపిస్తూనే ఉన్నారు. కాబట్టి కొత్తగా నేను పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే.. నేను, నా సోదరి ఏడాదికాలంగా ఓ మ్యూజిక్ వీడియో కోసం ఎంతగానో కష్టపడ్డాం. అందులో నేను యాక్ట్ చేశాను. ఈ వివాదం చెలరేగిన మూడు రోజులకే ఆ పాట రిలీజైంది. నా వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందేమోనని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు.భరించలేకున్నా..ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయింది నేను, నా కుటుంబం. దీనికితోడు ఆన్లైన్లో వేధింపులు, విద్వేషపూరిత కామెంట్లు మరింత బాధిస్తున్నాయి. విమర్శించకూడదని నేను అనడం లేదు, కానీ ఆ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. వారి కంటెంట్ కోసం నన్ను వాడుకుంటున్నారు. నా బాధ వారికి సంతోషంగా ఉంది. మనుషులు అవతలివారిని ఇట్టే ద్వేషిస్తారని ఈ సంఘటన వల్లే తెలిసొచ్చింది. పూర్తిగా ఎత్తేయాలనుకున్నా..నేను సింపతీ కోసం ఇదంతా చెప్పడం లేదు. నా మనసులో భారాన్ని దించుకోవడానికి చెప్తున్నాను. మరి సబ్స్క్రిప్షన్ ధర ఎందుకు పెంచావని అడుగుతున్నారు. నిజానికి ఈ సబ్స్క్రిప్షన్ను పూర్తిగా ఎత్తేయాలనుకున్నాను. కానీ, దానివల్ల ఈ వివాదం మరింత ముదురుతుందనిపించింది. ఈ సమయంలో కొత్త సబ్స్క్రైబర్లను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ధర పెంచాను.క్షమించండిఈ వివాదం తర్వాత సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని సామాజిక సేవకు వినియోగిస్తాను. అందులో ఒక్క రూపాయి కూడా నేను వాడను. నేను చేసిన పిచ్చి పని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు థాంక్స్' అని హన్సిక రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Hansika Krishna 🐣 (@hansubeeeey) చదవండి: నాన్న కొడతాడేమోనని భయంతో చెప్పలేదు: రామ్చరణ్ -
హీరో అజిత్ తల్లి కన్నుమూత
చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడి తల్లి మోహిణి మణి (84) చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న అజిత్.. తల్లి మరణవార్త తెలియగానే వెంటనే చెన్నై బయల్దేరారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రమణి కూడా వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. అజిత్ తల్లి మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అజిత్ కుమార్ తల్లి మోహిని ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తల్లిని కోల్పోయిన అజిత్కు ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.- కమల్ హాసన్ சகோதரர் திரு. அஜித்குமார் அவர்களின் தாயார் திருமதி. மோகினி மணி அவர்கள் மறைந்த செய்தி அறிந்து வருத்தமடைந்தேன். அன்புத் தாயை இழந்து தவிக்கும் அஜித்குமாருக்கும் அவரது குடும்பத்தாருக்கும் எனது மனமார்ந்த ஆறுதல்களைத் தெரிவித்துக்கொள்கிறேன்.— Kamal Haasan (@ikamalhaasan) May 30, 2026 డియర్ అజిత్.. మీ అమ్మగారు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి విషాదకర సమయంలో మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను- రాధికా శరత్కుమార్Dear #ajith so sorry to hear of the passing of your mother. Condolences to the family and pray for strength in this sad phase of your life.🙏🙏may she be in peace.— Radikaa Sarathkumar (@realradikaa) May 30, 2026 చదవండి: జూన్లో విడుదలయ్యే సినిమాల జాబితా -
'కూతురి పెళ్లికి తప్పక రండి'.. మోదీకి ఖుష్బూ ఆహ్వానం
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆమె కూతురు అవంతిక పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీని ఖుష్బూ కుటుంబం శుక్రవారం ఢిల్లీలో కలిసింది. తమ కూతురు పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ ఖుష్బూ- సుందర్ దంపతులు మోదీకి శుభలేఖ అందించారు. ఖుష్బూ దంపతుల వెంట కూతురు అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ సైతం ఉన్నారు. ఈ ఫోటోను ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.మోదీకి రుణపడి ఉంటాం'నా కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశాను. శ్రవణ్ శ్రీనివాసన్తో జరగబోయే నా కూతురి పెళ్లికి తప్పక హాజరవాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందించాను. కాబోయే దంపతులను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్లోనూ మోదీ మాకు సమయం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ ప్రధానమంత్రిగారు' అని ఖుష్బూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. ఫ్యామిలీఇది చూసిన అభిమానులు ఖుష్బూ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఖుష్బూ- సుందర్ దంపతులకు అవంతిక, ఆనందిత అని ఇద్దరు కూతుర్లు సంతానం. ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అవంతిక యాక్టింగ్పై దృష్టి సారించింది. మలయాళంలో ఆరంభం అనే సినిమాలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
అభిమానిని పట్టించుకోని పూజా.. ఆమె సమాధానమిదే!
సౌత్లోని స్టార్ హీరోయిన్స్లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో జతకట్టిందీ బ్యూటీ. తెలుగులోనే ఆమెకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ నిరాశపర్చినా మంచి గుర్తింపయితే తీసుకొచ్చింది. విజయ్తో రెండోసారి జతకట్టిన జననాయకన్ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా రిలీజవనేలేదు. ఎలాగైనా సరే జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీడియో వైరల్ఇకపోతే పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ఇకపోతే ఇటీవల ఓ యువకుడు పూజాతో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తుంటే ఆమె పట్టించుకోలేదని ఓ వీడియో వైరలయింది. దానిపై తాజా ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు జీవితాన్నిస్తోంది ప్రేక్షకులేనంది. పరిస్థితుల కారణంగా కొన్ని సమయాల్లో అభిమానులను పట్టించుకోకపోవచ్చని, అలాగని తామేదో పొగరు చూపిస్తున్నట్లు అర్థం కాదని తెలిపింది. ఇంకా చెప్పాలంటే అభిమానులే తమ దేవుళ్లు అని పేర్కొంది. View this post on Instagram A post shared by STARGAZE 🧿 (@stargazeoffiical) -
మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్'. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23 నుంచే కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్లో ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రకంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కాస్తా నిరాశపరిచింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది. -
స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సీఎంలు అందరూ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ వచ్చారు. విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి బ్లాక్ కలర్ సూట్లోనే కనిపిస్తున్నారు. అంతలా అలానే దర్శనమిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చి పట్టుపంచెలో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)సీఎం దగ్గర జగదీష్ పళనిసామి చాలా ఏళ్లుగా మేనేజర్గా పనిచేస్తున్నాడు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడు చెన్నైలో ఓ ఇంటిని కట్టుకున్నాడు. దీని గృహప్రవేశం శుక్రవారం ఉదయం జరగ్గా.. ఈ శుభకార్యానికి సీఎం విజయ్ హాజరయ్యారు. గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో విజయ్ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)#CMJosephVijay at #Jagadish's New Home Function ✨️#ThalapathyVijaypic.twitter.com/14gsYE41FA— Movie Verse (@_MovieVerse) May 29, 2026 -
సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్
గత కొన్నాళ్ల నుంచి సనాతన ధర్మం అనే టాపిక్ ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని సంచలన వ్యాఖ్యలు చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతెందుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగానూ ఇదే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలపై నటుడు అర్జున్ సర్జా ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు జీవన విధానం. అది తల్లిదండ్రులని దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. మీరు మీ సొంత తల్లిదండ్రులని తిరస్కరించగలరా? లేదు కదా.. అధే విధంగా సనాతన ధర్మాన్ని కూడా తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు' అని అర్జున్ చెప్పుకొచ్చాడు.ఇతడు హీరోగా నటించిన 'బ్లాస్ట్' మూవీ నిన్న(మే 28) తెలుగు, తమిళంలో రిలీజైంది. దీని సక్సెస్ మీట్ చెన్నైలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ డీఎంకే నేత ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అర్జున్ విషయానికొస్తే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మైసూరుకి చెందిన ఈయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 180కి పైగా సినిమాల్లో నటించారు. హీరో అనే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్గానూ పలు బాధ్యతల్ని నిర్వహించారు. వరస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ పలు విషయాలపై తన అభిప్రాయాల్ని చెబుతుంటారు. ఇప్పుడు అలానే సనాతన ధర్మం గురించి మట్లాడారు.(ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Hero #Arjun Counter To #UdayStalin 👌💥"సనాతన ధర్మం అనేది ఒక మ* త0 కాదు జీవన విధానం, అది తల్లిదండ్రులను దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుందిని. మీరు మీ సొంత తల్లిదండ్రులను తిరస్కరించగలరా?” “లేదు కదా” “అదేవిధంగా, సనాతన ధర్మాన్ని ఎన్నటికీ తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు."💥💥 pic.twitter.com/ke5vYibc9i— Anil U (@UAnil07) May 29, 2026 -
సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు
తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్ కొన్నిరోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితంలోని విడాకుల వ్యవహారంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విజయ్ భార్య సంగీత ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే తన కూతురు, కొడుకుని తీసుకుని లండన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె చెన్నైలో లేరు.(ఇదీ చదవండి: అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్)మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. తండ్రిలా హీరో అవుతాడనుకుంటే ఊహించని విధంగా దర్శకుడిగా మారిపోయాడు. 'సిగ్మా' పేరుతో ఓ మూవీ తీస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ హీరో కాగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడో సర్ప్రైజ్ వచ్చేసింది. జూలై 31వ తేదీన థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తండ్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్' రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇంతలోనే కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా' మాత్రం విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. మరి తండ్రి నుంచి దూరంగా ఉంటున్న జేసన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి విజయ్ అభిమానులు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో చూడాలి? అయిత 'జన నాయగణ్' కూడా వచ్చే నెలలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నెల గ్యాప్లో తండ్రీకొడుకుల సినిమాలు వచ్చినట్లు అవుతుంది.(ఇదీ చదవండి: ఖుష్బూ ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత)A high-stakes heist begins. 💵 #SIGMA storms into theatres on July 31st. 🗓️ Gear up for the ultimate quest. 🔥@LycaProductions #Subaskaran @gkmtamilkumaran @jsjmedia01 @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee… pic.twitter.com/BWMFY3sBwN— Jason Sanjay Official (@official_jsj) May 29, 2026 -
ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, దర్శకుడు సుందర్.సిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీళ్ల కుమార్తెలు గురించి మాత్రం ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. ఇప్పుడు వీళ్లిద్దరినీ ఖుష్బూ.. ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసింది. చిన్న కుమార్తె ఇప్పటికే మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పుడు పెద్ద కూతురు ఆనందిక నిర్మాతగా మారిపోయింది.ఖుష్బూకి చెందిన అవ్నీ మూవీస్ సంస్థ, బెంజ్ మీడియా సంస్థతో కలిసి నిర్మించిన తమిళ మూవీ 'డబుల్ ఆక్యుపెన్సీ'. అశ్విన్ కందసామి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో సంతోష్, సంయుక్త విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇదే సినిమాకు ఖుష్బూ వారసురాలు ఆనందిత నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. చైన్నెలో రెండు రోజుల క్రితం ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోనే ఖుష్బూ మాట్లాడుతూ.. ఇందులో నటించిన సంతోష్, నా కూతురు ఆనందిత.. స్కూల్ నుంచే ఫ్రెండ్స్. మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు. అలాంటిది వారిద్దరే ఈ మూవీ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆనందిత ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పరిచయం అవుతోంది. ఈతరం యువతకు మనం చెప్పాల్సిందేమీ లేదు. వారి నుంచే ఏమి నేర్చుకోవాలనేదే ఈ మూవీ స్టోరీ అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: మీరు గర్వపడేలా చేస్తా.. భాగ్యశ్రీకి కమల్ ఆశీస్సులు) -
మీరు గర్వపడేలా చేస్తా.. భాగ్యశ్రీకి కమల్ ఆశీస్సులు
స్వతహాగా ఉత్తరాదికి చెందిన భామనే అయినప్పటికీ తెలుగులో వరస సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటివరకు ప్రముఖ హీరో, నిర్మాణ సంస్థలతోనే పనిచేసింది. రవితేజ 'మిస్టర్ బచ్చన్' ఈమెకు తొలి తెలుగు చిత్రం కాగా చివరగా రామ్ 'ఆంధ్రా కింగా తాలుకా'లో కనిపించింది. ఇప్పుడు తమిళంలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. శివకార్తికేయన్తో కలిసి 'సెయాన్'లో నటిస్తోంది. దీని షూటింగ్ మొదలైన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న 'సెయాన్' చిత్రానిక 'తాయ్ కిళవి' ఫేమ్ శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్లో పాల్గొన్న భాగ్యశ్రీ.. కమలహాసన్ని నేరుగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంది. అనంతరం సోషల్ మీడియాలో కమలహాసన్తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. ఎంతో అభిమానం కలిగిన కమలహాసన్ సర్, మీ ఎదుగుదలని చూస్తూ పెరిగాను. అలా నా మనసులో ఉన్న మీరు ఇప్పుడు నా భుజంపై చేయి వేసి శుభాకాంక్షలు అందించిన క్షణాన కలిగిన ఆనందంలో తేలియాడుతున్నా. రాజ్కమల్ సంస్థలో నటించడం ఘనతగా భావిస్తున్నాను. మిమ్మల్ని గర్వపరచే విధంగా నేను పని చేస్తాను' అని భాగ్యశ్రీ రాసుకొచ్చింది.ఈమె తెలుగులో అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది. -
Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు
పాన్ ఇండియా స్థాయిలో జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. భోపాల్, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ చిత్ర హీరో మెగాపవర్ స్టార్ రామ్చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్ అనే ఓ ఫుట్బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’ అని చరణ్ వివరించారు.ఇక భోపాల్లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు. గతంలో భోపాల్లో జరిగిన ఈవెంట్లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్ బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్లోనే మాట్లాడాడు. మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్ను అనధికారికంగా అప్లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి. -
దృశ్యం 3లో నర్స్.. నిజ జీవితంలో డాక్టర్
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం! ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండు మారింది. ఓపక్క యాక్టింగ్ చేస్తూనే మరోపక్క మెడిసిన్ పూర్తి చేస్తున్నారు తారలు. కొందరైతే డాక్టరయ్యాక కూడా యాక్టర్ అవొచ్చని నిరూపిస్తున్నారు. అలాంటివారి జాబితాలోకే వస్తుంది నటి శ్రద్ధా గోకుల్. ఈమె మలయాళ దృశ్యం 3 మూవీలో నర్సుగా కనిపించింది. కానీ నిజ జీవితంలో ఈమె మాత్రం నర్సు కాదు, ఏకంగా వైద్యురాలు.. తనగురించే ఈ ప్రత్యేక కథనం..చైల్డ్ ఆర్టిస్ట్గా..మలయాళ నటి శ్రద్ధా గోకుల్కు సినిమాలు కొత్తేం కావు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. 'హలో కుట్టిచేతన్' అనే మలయాళ సీరియల్లో వర్ష పాత్రలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇది కేవలం పిల్లల కోసమే డిజైన్ చేసిన సీరియల్. ఈ సీరియల్ కంటే ముందు సూపర్ డ్యాన్సర్ జూనియర్ అనే డ్యాన్స్ షోలో పాల్గొంది శ్రద్ధా.చదువు నిర్లక్ష్యం చేయొద్దని..సీరియల్స్లో క్లిక్ అవడంతో దుల్కర్ సల్మాన్ 'పట్టం పోలే' మలయాళ మూవీలో నటించే ఛాన్స్ చేజిక్కించుకుంది. తర్వాత సినిమా అవకాశాలు రాలేదని కాదు కానీ చదువును నిర్లక్ష్యం చేయొద్దనుకుంది. నటనకు బ్రేక్ ఇచ్చేసి చదువుపైనే దృష్టి సారించింది. ఫిలిప్పీన్స్లో మెడిసిన్ పూర్తి చేసింది. అనంతరం కేరళ తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్షిప్ పూర్తి చేసింది.రీఎంట్రీతను సినిమాల్లోకి వస్తుందని మళ్లీ ఊహించలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో ఓ ఆడిషన్కు వెళ్లింది. అక్కడ సెలక్ట్ అవడంతో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన 'వళతు వశతె కల్లాన్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్రే అయినా బాగా క్లిక్ అయింది. దాంతో జీతూ జోసెఫ్ ఆమెకు దృశ్యం 3లో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో డాక్టర్ శ్రద్ధా గోకుల్ నర్సుగా కనిపించింది.యాక్టింగ్, మెడిసిన్.. రెండింటినీ వదిలేయాలని లేదు. డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలనుంది. దానికోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాను. అలాగే నాకు డ్యాన్సింగ్, యాక్టింగ్ రెండూ చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.- శ్రద్ధా గోకుల్ View this post on Instagram A post shared by Shraddha Gokul (@shraddhagokul) చదవండి: కుటుంబమంతా చనిపోవాలనుకున్నాం.. ఒంటిపై కిరోసిన్ పోశా..: శివకుమార్ -
'కరుప్పు' రిజెక్ట్ చేసిన విజయ్కు థాంక్స్.. ఎందుకంటే?
స్టార్ హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరిట విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం తొలుత హీరో విజయ్ను అనుకున్నానని డైరెక్టర్ గతంలోనే చెప్పాడు. 2021లోనే విజయ్ను కలిసి కథ చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వీలైతే వెంటనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం అన్నారు. వర్కవుట్ కాలేకానీ, అంత హడావుడిగా సినిమా స్టార్ట్ చేయలేనని బాలాజీ వెనకడుగు వేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. పైగా విజయ్ తననుంచి ఫ్యామిలీ స్టోరీ ఆశించాడని, అయినప్పటికీ కరుప్పు కథ నచ్చడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. తాజాగా మరోసారి ఈ విషయం గురించి బాలాజీ ఓపెనయ్యాడు. రాజకీయాల్లోకి వెళ్లడంతో..నిజానికి ఈ మూవీనే విజయ్ చివరి సినిమా అయ్యుండేది. మేము రెండుమూడుసార్లు చర్చలు కూడా జరిపాం. ఏది తన చివరి చిత్రం అయితే బాగుంటుందని మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన చెప్పిన కారణాలు సమంజసంగా అనిపించాయి. సార్, మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. థాంక్యూ సో మచ్ అని చెప్పాను. ఆయన నాతో సినిమా చేయాలనుకోవడమే నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది చాలు!అందుకే థాంక్స్తర్వాత నిర్మాతలు సూర్యను కలవమని అడిగారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ ఎంతగానో నచ్చింది. సూర్య ఇచ్చిన చిన్నపాటి సలహాలతో కథలో కొంత మార్పులు చేసి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇకపోతే ఈ సినిమా కథ చెప్పినప్పుడు విజయ్ నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. దానివల్లే కథను మరింత మెరుగుపర్చుకున్నాను. అందుకే విజయ్ సినిమా చేయకపోయినప్పటికీ అతడికి థాంక్స్ చెప్పాను అని తెలిపాడు. మే 15న విడుదలైన కరుప్పు రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: ఏజ్ బార్ అంటూ కామెంట్స్.. నటి కౌంటర్ -
‘కాటాలన్’ కథ విని ఆశ్చర్యపోయా.. ఆ సీన్స్ మెస్మరైజ్ చేస్తాయి: సునీల్
‘‘పుష్ప’ సినిమా తర్వాత నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్లో పడింది. ఏ భాష నుంచి ఎప్పుడు, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో తెలియడం లేదు (నవ్వుతూ). ‘కాటాలన్’ సినిమాలో నేను మారి అనే కీలక పాత్ర చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు సునీల్ తెలిపారు. ఆంటోనీ వర్గీస్, దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, సునీల్, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిక్, హనన్ షా, రాపర్ బేబీ జీన్ కీలక పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘కాటాలన్’. పాల్ జార్జ్ దర్శకత్వంలో షరీఫ్ మొహమ్మద్ నిర్మించిన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేడు విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సునీల్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ పాల్గారు ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి’’ అన్నారు కబీర్ దుహాన్ సింగ్. ‘‘మార్కో’ తర్వాత ‘కాటాలన్’ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఆజాద్ పేర్కొన్నారు. -
డ్యూడ్ హీరోయిన్తో ప్రదీప్ మూవీ.. కాకపోతే ఓ ట్విస్ట్!
ఇప్పుడు దర్శకులు, నటులు నిర్మాతలుగా మారుతున్న తరుణం. విజయాలకు దూరమవుతున్న నటులు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శకులుగా ఉన్నత స్థాయికి చేరుకున్న వారు కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి తమ శిష్యులకు, ఇతర నూతన దర్శకులకు అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 2019లో దర్శకుడిగా పరిచయమై రవిమోహన్ హీరోగా కోమాలి అనే చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టారు.హీరోగానూ సక్సెస్ఆ తరువాత హీరోగా రంగప్రవేశం చేసి స్వీయ దర్శకత్వంలో లవ్టుడే పేరుతో మూవీ చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా ఈయన కథానాయకుడిగా నటించిన డ్యూడ్ ఘన విజయాన్ని సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించిన ఎల్ఐకే చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతగా..ఇకపోతే మళ్లీ మెగాఫోన్ పట్టుకొనేందుకు రెడీ అయిన ప్రదీప్ రంగనాథన్ తానే హీరోగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలో చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన సడెన్గా సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్ర షూటింగ్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి దర్శకుడు ఎవరు? కథానాయకుడు ఎవరు? అన్న వివరాలు వెలువడలేదుగానీ హీరోయిన్గా మమితాబైజు నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రదీప్ డ్యూడ్ మూవీలో మమిత హీరోయిన్ అన్న విషయం తెలిసిందే! -
త్వరలోనే హీరో అర్జున్ దాస్ పెళ్లి?
సౌత్లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్తో విలన్గా, హీరోగా పలు కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అక్కగా సీఎం విజయ్ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యల పరిష్కారానికి సీఎం హామీముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.విజయ్ నా తమ్ముడు.. ముఖ్యమంత్రి విజయ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు. -
త్రిష నలుపు దుస్తులు ధరిస్తే హిట్ పక్కా..ఇదిగో సాక్ష్యం!
గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారిన నటి త్రిష. ఒక పక్క ఈ బ్యూటీ తమిళంలో అజిత్ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థక్ లైఫ్ చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ అపజయం పాలవడం, ఆ తరువాత నటుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్తో కలిసి ట్రోలింగ్లకు గురవడం వంటి విషయాలతో చాలా తలనొప్పికి గురైన త్రిష, ఎప్పుడైతే విజయ్ ఎన్నికల్లో గెలవడంతో పాటు పార్టీని ఒంటి చేతితో గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి త్రిష ఆనందంతో తుళ్లి పడుతున్నారనే చెప్పాలి. అదేవిధంగా నటి మంచి విజయాన్ని చూసి చాలా కాలం కావడంతో విచారంలో ఉన్న త్రిషకు కరుప్పు చిత్రం రూపంలో మంచి విజయం వరించింది. దీంతో ఈ బ్యూటీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఆమె తన అభిమాని వల్ల ఇంకా సంతోషానికి లోనవుతున్నారప్పుడు. సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రం గత 15వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం గురించి పక్కన పెడితే త్రిష అభిమానులు తెగ సంబర పడుతున్నాయి. ఆమె అభిమాని ఒకరు త్రిషతో విజయ్ నటించిన ఢిల్లీ, అజిత్ నటించిన మంగాత్తా, సూర్య నటించిన ఆరు చిత్రాలు ఈ ముగ్గురు హీరోలకు చాలా మైలు రాయిగా నిలిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించారని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయన్నారు. అందువల్ల త్రిషను కరుప్పు స్టార్ ( బ్లాక్ స్టార్) అని పిలవవచ్చు అని ఆ అభిమాని చేసి పోస్ట్ త్రిష వరకు చేరింది. ఆయన పోస్ట్ను చూసి న త్రిష ఎంతగానో సంతోషపడి ఇది చాలా అందంగా ఉంటుంది. ధన్యవాదా లు అని పేర్కొని చిరునవ్వుతో కూడిన పలు ఎమోజీలను ఎక్స్ మీడి యాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఆడపులులం మేము
ఆడపిల్ల కదా... సిల్వర్ స్క్రీన్పై ఆడుతూపాడుతూ గ్లామరస్గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్ని పక్కన పెట్టి, సిల్వర్ స్క్రీన్పై డిష్యుం డిష్యుంకి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయికలు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్లోకి ఎంటరవుతున్నారు. దీపికా పదుకోన్ వంటి సీనియర్ హీరోయిన్ మాత్రమే కాదు... రష్మికా మందన్నా, సంయుక్త, ఆలియా భట్, కృతీ సనన్... ఇలా పలువురు యంగ్ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కోసం గుర్రపు స్వారీ, కత్తి సాము, గన్ షూట్ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఈ హీరోయిన్లు ఏయే చిత్రాల్లో పవర్ఫుల్గా కనిపించనున్నారో తెలుసుకుందాం...‘మైసా’ కోసం మార్షల్ ఆర్ట్స్ఒకపాత్ర ఒప్పుకుంటే ఆపాత్రలానే మారిపోవాలనుకుంటారు రష్మికా మందన్నా. ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ‘మైసా’ సినిమాలోని మైసాపాత్ర కోసం ఈ బ్యూటీ తీసుకున్న ఓ రిస్క్ 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం. నిజానికి ఈ సన్నివేశాన్ని డూప్తో చేయిద్దామని యూనిట్ అన్నప్పటికీ ‘నో నో’ అంటూ, తానే చేశారు. ఇంకా ఈ సినిమా కోసం బోలెడన్ని రిస్కీ ఫైట్స్ చేస్తున్నారామె. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం రష్మిక థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ప్రత్యేకంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్లో కఠోర శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు 8 గంటలపాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగింది. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, అధునాతన స్టంట్ టెక్నిక్స్ వంటివి నేర్చుకున్నారు. ఆ ట్రైనింగ్ పూర్తయ్యాక కేరళలో తీసిన యాక్షన్ సీక్వెన్స్లో భాగంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైసా అనే గిరిజన గోండు యువతిపాత్రలో కనిపించనున్నారు రష్మిక. ఈ షెడ్యూల్ కోసమే రష్మిక బ్యాంకాక్లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ ఏడాదే విడుదల కానుంది.కత్తి సాముకి సైక్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు సంయుక్త. అనడమే కాదు... ఆ పని చేశారు కూడా. ‘స్వయంభు’ సినిమాలో చేసిన యోధురాలిపాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి సాములో శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ పర్యవేక్షణలో ఆమె ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతే కాదు... ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించే రోజు షూటింగ్కు దాదాపు నాలుగైదు గంటల ముందు ప్రాక్టీస్ సెషన్స్లోపాల్గొన్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దట్టమైన అడవుల నేపథ్యంలో చిత్రీకరించారు. అందువల్ల శిక్షణను కూడా అదే తరహా వాతావరణంలో, కొండలు గుట్టలు వంటి కఠినమైన భూభాగాలకు అలవాటు పడేలా నిర్వహించారు. ఇక ఈ భారీపాన్ ఇండియన్ మూవీలోనిపాత్ర కోసం హీరో నిఖిల్ సిద్ధార్థ్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ఇరవై ఏళ్లయింది దీపికా పదుకోన్ సినిమాల్లోకి వచ్చి. ఇన్నేళ్లల్లో గ్లామరస్ క్యారెక్టర్స్తోపాటు పూర్తిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. అలాగే ‘పఠాన్, జవాన్, ఫైటర్’ వంటి సినిమాల్లో యాక్షన్ రోల్స్ చేశారు. ‘ఫైటర్’ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. తాజాగా చేస్తున్న ‘కింగ్’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు కానీ... స్టంట్ రిహార్శల్స్ చేశారట. ఈ చిత్రంలో ఒకేసారి ఎనిమిది మంది ఫైటర్స్తో దీపిక ఫైట్ చేసే యాక్షన్ సీన్ ఉందని సమాచారం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ని సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారని టాక్. ఈ భారీ ఫైట్లో షారుక్, దీపిక, సుహానాపాల్గొన్నారట. ఒక నటి 20 ఏళ్ల తర్వాత కూడా ఉత్సాహంగా యాక్షన్ రోల్స్ ఒప్పుకోవడం, రిహార్సల్స్ చేసి మరీ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాలోనూ దీపికా పదుకోన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ‘కింగ్’ సినిమాకి ముందే ట్రైనింగ్ తీసుకుని, యాక్షన్ సీన్స్ చేశారు దీపికా పదుకోన్. అయితే గర్భవతి కావడంతో ‘రాకా’లోని యాక్షన్ సీన్స్ని ఆమెకు బదులు డూప్తో చేయించాలనుకుంటున్నారట. కాగా ‘కింగ్’ సినిమా కోసం యువ నటి సుహానా కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...సుహానా... షూట్కి రెడీ‘రెడీ టు షూట్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి రావడం రావడమే సుహానా ఖాన్ ‘కింగ్’ చిత్రంతో తుపాకీతో ఎంట్రీ ఇస్తున్నారు. మామూలుగా ‘స్టార్ కిడ్స్’పై ఎన్ని అంచనాలు ఉంటాయో షారుక్ ఖాన్ తనయగా సుహానా మీద అన్నీ ఉన్నాయి. 2023లో చేసిన ‘ది ఆర్చీస్’ సుహానాకి తొలి సినిమా. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. సో... ‘కింగ్’ వంటి భారీ యాక్షన్ సినిమాతో సుహానా వెండితెరపైకి వస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఒక క్రూరమైన, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని హంతకుడిపాత్రలో కనిపిస్తారట. ఆయనపాత్ర రెండు టైమ్లైన్స్లో ఉంటుందని సమాచారం.ఒకటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అని టాక్. ఈ చిత్రంలో షారుక్ శిష్యురాలిపాత్రను సుహానా చేస్తున్నారు. షారుక్ దగ్గర యాక్షన్ ట్రైనింగ్ తీసుకునేలా ఈపాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఇది పూర్తిగా యాక్షన్ క్యారెక్టర్ కావడంతో ‘కింగ్’ షూటింగ్ ఆరంభించే ముందు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ శిక్షకుల వద్ద మార్షల్ ఆర్ట్స్, గన్ షూట్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు సుహానా. ఈ షూటింగ్ లొకేషన్లో కుమార్తెకు షారుక్ కూడా కొన్ని యాక్షన్ మెళకువలు నేర్పిస్తున్నారట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘కింగ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఫైట్కే కాదు... పాటకూ ట్రైనింగ్స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు... బ్రెయిన్తో ఆలోచించి, ప్రత్యర్థిని ట్రాప్ చేయాలి, బాడీ పవర్ని ఉపయోగించి రఫ్ఫాడించాలి. సిల్వర్ స్క్రీన్పై మెరుపు తీగల్లా కనిపించే ఆలియా భట్, శార్వరి ఈ స్పై క్యారెక్టర్ చేశారు. ఆ సినిమానే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ఆల్ఫా’. బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలింస్ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ హీరో ఓరియంటెడ్ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్ఫుల్ స్పై ఏజెంట్లుగా ఒదిగిపోవడానికి ఆలియా, శార్వరి ఫిట్నెస్తోపాటు మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.జిమ్లో ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తూ, పూర్తిగా యాక్షన్ మోడ్లో ఉన్న వీడియోలను ఆలియా షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. విశేషం ఏంటంటే... ఫైట్స్కి మాత్రమే కాదు... ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం కూడా ఆలియా, శార్వరి కఠినమైన వర్కౌట్స్ చేశారట. ఈపాట డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కువ స్టామినాని డిమాండ్ చేయడంతో ఈ వర్కౌట్స్ చేశారని తెలిసింది. ఇద్దరూపాల్గొన్న ఫైట్స్, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్గా ఉంటాయని బాలీవుడ్ టాక్. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏజెంట్గా ఫైట్ఆలియా, శార్వరిలానే వామికా గబ్బి కూడా స్పై క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై తుపాకీ ఎక్కు పెట్టి, ఏజెంట్గా సిల్వర్ స్క్రీన్పై విజృంభించడానికి వామికా శిక్షణ తీసుకున్నారు. ‘జీ 2’ సినిమా కోçసమే వామికా గబ్బి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్లోకి ఎంటరయ్యారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’కి (2018) సీక్వెల్గా ‘జీ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ గోపి 116పాత్ర చేశారు శేష్. సీక్వెల్లోనూ ఈపాత్ర చేస్తున్నారు. ఏజెంట్ మహాలక్ష్మి నాగిన్గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులోని యాక్షన్ సీన్స్, స్పై మిషన్స్, ఫిట్నెస్కి సంబంధించి వామికా గబ్బి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం యూరప్లో చిత్రీకరించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా ఉంటుందని తెలిసింది. ఇక 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా వామికా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పంజాబీ, హిందీ మలయాళం వంటి భాషల్లో నటించిన వామికా ‘జీ 2’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’లో ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపించిన వామిక ‘జీ 2’లో పూర్తి భిన్నంగా చాలా పవర్ఫుల్గా కనిపించనున్నారు. ఈపాన్ ఇండియన్ స్పై యాక్షన్ మూవీ పలు భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.ఇంటర్పోల్ ఆఫీసర్గా ట్రైనింగ్గ్లామరస్, డీ గ్లామరస్, ట్రెడిషనల్... ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అంటారు కృతీ సనన్. ‘ఆది పురుష్’లో సీతగా కనిపించిన ఈ బ్యూటీ ‘మిమీ’లో సరోగేట్ మదర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘కాక్టెయిల్ 2’లో గ్లామరస్గా కనిపించనున్నారు. ఇప్పుడు తనలోని పూర్తి స్థాయి యాక్షన్ నటిని ఆవిష్కరించుకోవడానికి కృతి కసరత్తులు చేస్తున్నారట. మరి... ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్ అలాంటిది. బాలీవుడ్ భారీ మాస్ సినిమాల్లో ఒకటైన ‘డాన్’ సిరీస్లో నటించే చాన్స్ కృతీకి దక్కిందని సమాచారం. ‘డాన్, డాన్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చేయనున్న విషయం తెలిసిందే.రెండు భాగాల్లో డాన్గా షారుక్ ఖాన్, ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాగా ప్రియాంకా చోప్రా నటించారు. అయితే మూడో భాగంలో రణ్వీర్ సింగ్ని డాన్పాత్రకు తీసుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ, ఈ సినిమా నుంచి రణ్వీర్ తప్పుకున్నారు. ఇక షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అనే తరుణంలో సరిగ్గా మూడు వారాల ముందు రణ్వీర్ తప్పుకున్నారట. ఈ విషయంలో రణ్వీర్–ఫర్హాన్ మధ్య వివాదం నెలకొంది. ముందు నటిస్తానని చెప్పి, తర్వాత తప్పుకోవడంతో రణ్వీర్కి సహాయ సహకారాలు అందించకూడదని ముంబైకి చెందిన ‘ఫిల్మ్ బాడీ’ నిర్ణయించుకుంది.అలాగే నష్టపరిహారం కింద రణ్వీర్ తనకు రూ. 45 కోట్లు ఇవ్వాలని ఫర్హాన్ డిమాండ్ చేస్తున్నారు. మరి... ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది కాలమే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ రోమాపాత్రకు కృతీ సనన్ని ఎంపిక చేశారని భోగట్టా. ‘డాన్’ సిరీస్లో ఈపాత్రకు యాక్షన్ సీన్స్ ఉన్నట్లే మూడో భాగంలోనూ ఉంటాయి. దాంతో కృతీ సనన్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్త వినిపిస్తోంది.అయితే కృతీ సనన్ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఫర్హాన్ అక్తర్ ఆఫీస్ వద్ద కృతి పలుమార్లు కనిపించడంతో ‘డాన్ 3’ చర్చల్లోపాల్గొనడానికే అని ప్రచారంలో ఉన్న వార్తకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ సినిమాని 2023లోనే ప్రకటించారు ఫర్హాన్. అయితే ఇప్పటివరకూ షూటింగ్ ఆరంభించలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ తారలే కాదు... మరికొంత మంది కూడా క్యారెక్టర్ డిమాండ్ మేరకు కసరత్తులు చేసి, సెట్స్లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండాపాత్రల్లో ఒదిగిపోతున్న ఈ కథానాయికలను అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం) -
పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో.. డాక్టర్తో నిశ్చితార్థం
ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినవాడే అయినప్పటికీ తెలుగులోనూ బోలెడంతమంది ఫ్యాన్స్ ఉన్నాడు. గతంలో ఈయన చేసిన చిత్రాలు కల్ట్ స్టేటస్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఇంట్లో శుభకార్యం జరిగింది. ఈయన అన్న కొడుకు, హీరో నిరంజన్ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) ఉపేంద్ర అన్న కొడుకు అయిన నిరంజన్ సుధీంద్ర.. 2018లో వచ్చిన 'సెకండాఫ్' మూవీతో నటుడిగా పరిచయమయ్యాడు. 2022లో రిలీజైన 'నమ్మ హుడుగురు' మూవీలోనూ నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన 'సీతా పయనం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీనికి ప్రముఖ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహించగా ఇతడి కూతురు ఐశ్వర్య హీరోయిన్గా చేసింది. భాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.నటుడు నిరంజన్ సుధీంద్ర.. డాక్టర్ సంజనా రాజ్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరైన ఉపేంద్ర.. కాబోయే వధూవరులని మనసారా దీవించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఉపేంద్ర సతీమణి తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవడం కంటే కుక్కని పెంచుకోవడం చాలా బెటర్: టాలీవుడ్ హీరోయిన్) -
నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది: శివ రాజ్కుమార్
‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేయడం ఇష్టం. ‘పెద్ది’ సినిమాలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే’’ అని చెప్పారు కన్నడ స్టార్ శివ రాజ్కుమార్. హీరో రామ్చరణ్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్వేందు, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.ఈ సందర్భంగా శివ రాజ్కుమార్ మాట్లాడుతూ– ‘‘పెద్ది’ కథ విన్న తర్వాత, ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించి, ఈ సినిమా చేశాను. ఇందులో ఓ కోచ్ తరహా పాత్రలో నటించాను. కథలో గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటాయి. ఈ పాత్రను బుచ్చిబాబు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. పెద్ది–గౌర్నాయుడు పాత్రల మధ్య అనుభందం ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రల మధ్య నెలకొన్న ఎమోషన్కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం ‘గుమ్మడి నర్సయ్య’, ‘జైలర్ 2’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్లో సమంత
సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్ఫెక్ట్' అని ప్రశంసించింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్లో సమంత తన స్టంట్స్తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. -
దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..!
టాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.ఈవెంట్కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. -
స్టార్ హీరోలకు అచ్చొచ్చిన త్రిష.. వాళ్లందరికీ లక్కీ ఛార్మ్!
హీరోయిన్ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.లక్కీ చార్మ్ఇటీవల విజయ్ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్, అజిత్, సూర్యల కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తిరిగి పంచుకుంది.విజయ్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.అజిత్: హీరో అజిత్ 'గుడ్బ్యాడ్ అగ్లీ' ద్వారా తన కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్బస్టర్ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్ అని కొనియాడుతున్నారు.చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్ రీఎంట్రీ -
సీఎం విజయ్కు స్టార్ హీరో విజ్ఞప్తి.. అదేంటంటే?
కోలీవుడ్ హీరో విజయ్ సీఎం అయ్యాక సినీ పరిశ్రమ ఆయనపై గంపెడాశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి సీఎంకు విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ ఫ్లాట్ఫామ్ ప్రారంభించాలని విజయ్ను కోరారు. ఓటీటీ ప్లాట్ఫారాన్ని ప్రారంభిస్తే అది తమకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.విజయ్ సీఎం అయ్యాక విశాల్ సైతం ఇండస్ట్రీ ఇబ్బందులను వివరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని నియమించడాన్ని తప్పుబట్టారు. సినిమా శాఖను సీఎం వద్దే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితేనే న్యాయం చేయగలడని అన్నారు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కోలీవుడ్ సినీతారలు సంబురాలు చేసుకున్నారు. -
హీరోయిన్ ఇంట పెళ్లి సంబరాలు..
మలయాళ హీరోయిన్ రజిషా విజయన్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే! రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో రజిషా కథానాయికగా నటించింది. తెలుగులో డబ్ అయిన కర్ణన్, జై భీమ్, సర్దార్, బైసన్ వంటి చిత్రాలతోనూ ఇక్కడ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సర్దార్ 2లో నటిస్తోంది. తాజాగా తను ఓ శుభవార్త చెప్పింది. హీరోయిన్ ఇంట పెళ్లి వేడుకతన సోదరి అంజూష పెళ్లిపీటలెక్కినట్లు వెల్లడించింది. అచ్యుతన్ సురేశ్ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లికూతురితో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కళ్లు మూసి తెరిచేలోపే నా చిన్నపాప పెళ్లికూతురైపోయింది. నువ్వెప్పటికీ నా కుందనపుబొమ్మవే.. అని క్యాప్షన్ ఇచ్చింది.కెరీర్కేరళకు చెందిన విజయన్- షీల దంపతుల కూతుర్లే రజీషా, అంజుషా. రజీషా విజయన్ టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించింది. అనురాగ కరిక్కిన్ వేళ్లం చిత్రంతో మలయాళ వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీకిగానూ ఉత్తమనటిగా కేరళ ఫిలిం అవార్డు గెలుచుకుంది. జూన్, కళంకావల్, మస్కిష్క మరణం.. ఇలా మలయాళంలో అనేక సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Sajith & Sujith (@sajithandsujith) చదవండి: ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా నాతోపాటు విజయ్ ప్రాణాలు పోయేవి: విలన్ -
ఆరోజు ఏమాత్రం తేడా వచ్చినా విజయ్, నేను చనిపోయేవాళ్లం!
సినిమాల్లో కామెడీ, డ్యాన్సులే కాదు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ ఫైట్ సీన్ల కోసం హీరో, విలన్లు కొన్నిసార్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి షూట్ చేస్తుంటారు. అలాంటి ఓ సంఘటనను విలన్ అభిమన్యు సింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈయన తెలుగులో రక్తచరిత్ర, గబ్బర్సింగ్, పండగ చేస్కో, అమర్ అక్బర్ ఆంటోని, ఓజీ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు.కేరళలో ఫైట్ సీన్తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళంలో నా మొదటి సినిమా విజయ్ హీరోగా నటించిన వేలాయుధం (2011). ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం మేము ఆరు గంటలపాటు ప్రయాణించి కేరళలోని కోయంబత్తూరు వెళ్లాం. అక్కడ చిన్న హోటల్లో బస చేశాం. అక్కడినుంచి సుమారు గంటన్నరపాటు ప్రయాణిస్తే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడే మా షూటింగ్.. అప్పటికే ఒక రైలును రెడీ చేసి పెట్టారు. కదిలే రైలుపై..ఆరు రోజులపాటు ఫైట్ సీన్ షూట్ జరిగింది. ఏడో రోజు రైలుపై ఎక్కి పోట్లాడుకునే సీన్ చిత్రీకరించాలి. రైలు పట్టాలపై ఆగి ఉన్నప్పుడు దానిపై ఎక్కి విజయ్, నేను రిహార్సల్స్ చేశాం. కెమెరా ఆన్ చేయగానే రైలు కదులుతుందన్నారు. నాకు భయమేసింది. కదిలే ట్రైన్పై మనమెలా ఫైట్ చేయగలమని అడిగాను. అందుకతడు.. మనం పోట్లాడుకోం, ఒకరినొకరు కాపాడుకుంటాం అని బదులిచ్చాడు. చూస్తుండగానే రైలు వేగం పుంజుకుంది.గుండె ఆగిపోయినంత పని!70-80 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. మా ఇద్దరితోపాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఇంతలో ఎదురుగా బ్రిడ్జి కనిపించింది. అప్పుడు నా గుండె అరచేతిలోకి వచ్చింది. పొరపాటున కాలు జారితే 2500 అడుగుల లోయలో పడి చనిపోవడం ఖాయం. కాలు జారి పడేటప్పుడు మరో మనిషి చేయి పట్టుకుని లాగుతాం.. అప్పుడు విజయ్ ప్రాణాలకు కూడా ప్రమాదమే.. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగలేదు. విజయవంతంగా షూట్ పూర్తి చేశాం. ఆయన భయం లేకుండా..కానీ, నాకు వారం రోజులపాటు సరిగా నిద్రపట్టలేదు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అన్న ఊహే నా వెన్నులో వణుకు పుట్టించింది. అదే సమయంలో విజయ్ వంటి స్టార్ హీరో ఏమాత్రం భయం లేకుండా, సేఫ్టీ చర్యలు తీసుకోకుండా ధైర్యంగా ఉంటే నేనెందుకు ఇంతలా వణికిపోతున్నాను అనిపించింది. ఏదేమైనా ఆరోజు చావు అంచుల నుంచి మేమిద్దరం తప్పించుకున్నాం అని అభిమన్యు సింగ్ చెప్పుకొచ్చాడు.చదవండి: నన్ను చెప్పుతో కొట్టాడు.. ఆ అవమానం వల్లే..: బండ్ల గణేశ్ -
కన్నడలోకి బ్రహ్మానందం బయోగ్రఫీ
వెయ్యికి పైగా సినిమాల్లో కనిపించిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇకపోతే ఈయన బయోగ్రఫీ 'నేను మీ బ్రహ్మానందం' మూడేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఇప్పుడు దీన్ని కన్నడలోకి కూడా అనువదించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే తొలి ప్రతిని రచయిత అందజేశారు.(ఇదీ చదవండి: మళ్లీ సినిమాల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి)తెలుగు భాష మాట్లాడలేకపోయినా, దాన్ని బాగా అర్థం చేసుకునే అనువాదకుడిగా బ్రహ్మానందంపై ఉన్న అభిమానంతోనే ఈ ప్రయత్నం చేశారు. ఆయన నటించిన వందలాది సినిమాలు కేవలం ఆయన కోసమే చూశాను. సాధారణ స్కూల్ టీచర్గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం.. సినీ రంగంలో ఎదిగిన తీరు ఈ బయోగ్రఫీలో అద్భుతంగా రాశారు. ఈ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈయన జీవితం కేవలం నటుడి విజయగాథ మాత్రమే కాదు. ఉపాధ్యాయుడు, కళాకారుడు, తత్వవేత్తగా సాగిన తీరు అద్భుతం. కన్నడ అనువాద తొలి ప్రతిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేయడం తనకు చాలా ఆనందంగా అనిపించిందని రచయిత విశ్వేశ్వర భట్ చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
మళ్లీ సినిమాల్లోకి ఉదయనిధి స్టాలిన్!
ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలను విడుదల చేసిన ఉదయనిధి స్టాలిన్ ఆ తర్వాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన నటించిన తొలి చిత్రం ఒరుకల్ ఒరు కన్నాడి (2012) మంచి విజయాన్ని సాధించింది. అదే చివరి సినిమాఆ తర్వాత వరుసగా చిత్రాలను చేస్తూ వచ్చిన ఈయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంతో సినిమాలకు స్వస్తి చెప్పారు. ఉదయనిది స్టాలిన్ చివరిగా నటించిన చిత్రం మామన్నన్. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఉదయనిధి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. రీఎంట్రీ?ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయనిధి స్టాలిన్ మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. రాజకీయ నేపథ్యంలో సాగే కథాచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్ జెయింట్ మూవీస్ మూవీస్ సంస్థ నిర్వహణ బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బనిధి స్టాలిన్ చేపట్టిన విషయం తెలిసిందే. -
మంచులో ప్రేమ
హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ ప్రదేశాలకు వెళితే ఆ హాయే వేరు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేకి ఆ చాన్స్ దక్కింది. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఓ చల్లని ప్రదేశంలో జరిగింది. మంచు, చిరు జల్లుల మధ్య ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ని పూర్తి చేసింది యూనిట్. ఆ ఫొటోలను విడుదల చేశారు. చిరు జల్లుల నుంచి తప్పించుకోవడానికి గొడుగు, చలి తట్టుకోవడానికి వింటర్ అవుట్ఫిట్స్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు దుల్కర్, పూజ. అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రవి నెలకుడితి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
90% మార్కులతో పాసైనా పొడిచేదేం లేదు: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్లోకి నెడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలి. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు కంటే సంస్కారం ముఖ్యం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్టైనర్ వస్తుందో చూడాలి. -
హీరో పక్కన నీ ఏడుపేంటి?.. దృశ్యం నటిపై ట్రోలింగ్
ఎస్తర్ అనిల్.. మలయాళంలో అనేక సినిమాలు చేసినప్పటికీ దృశ్యం నటిగానే ఎక్కువ ఫేమస్. దృశ్యం మూడు భాగాల్లోనూ హీరో చిన్న కూతురిగా నటించింది. మలయాళంతో పాటు తెలుగు దృశ్యం మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇకపోతే మోహన్లాల్ దృశ్యం 3 ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఏడ్చేసిన దృశ్యం నటిఇక సినిమా రిలీజైనరోజు చిత్రయూనిట్ థియేటర్కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్ కళ్లారా చూసింది. ఈ సమయంలో మోహన్లాల్ పక్కనే కూర్చున్న ఎస్తర్ సంతోషంతో ఏడ్చేసింది. తనకు తెలియకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియో కింద ఓ నెటిజన్ ఎస్తర్కు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. నటి కౌంటర్డియర్.. ఆయన కెరీర్లో ఇలాంటివి చాలా చూశాడు.. ఇంతకంటే పెద్ద విజయాలు కూడా అందుకున్నాడు. కానీ, నువ్వేంటి? ఆయన పక్కన ఇలా ఏడుస్తూ కూర్చున్నావ్? అని సెటైర్ వేశాడు. ఈ కామెంట్ ఎస్తర్ కంట పడింది. దాన్ని అలాగే చూసి వదిలేయలేదు. మధ్యలో నీకేంటి సమస్య? అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అతడికి బాగా బుద్ధి చెప్పావ్ అని నటికి సపోర్ట్ చేస్తున్నారు.చదవండి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎవరూ గుర్తుపట్టట్లే.. ఇంకెందుకు బతకడం?: నటి -
ఇలాంటి టాక్తో రూ.100 కోట్ల కలెక్షన్.. ఎలా సాధ్యం?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నా వాటిని జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు డబ్బింగులని మాత్రం ఆదరిస్తున్నారు. అలా ఈ వీకెండ్ రిలీజైన 'దృశ్యం 3' మంచి ఆక్యుపెన్సీ నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులైన కాకముందే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇంతకీ ఎలా సాధ్యమైంది?(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)మోహన్ లాల్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'దృశ్యం' ఫ్రాంచైజీ ఈయనకు మరింతలా ఫేమ్ తీసుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాల్ని వెంకటేశ్తో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అయితే మూడో భాగాన్ని రీమేక్ చేయకుండా మలయాళ వెర్షన్నే డబ్బింగ్ రూపంలో ఈ గురవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇందులో సాగదీత తప్పితే ఏం లేదని రివ్యూలు వచ్చాయి. కానీ ఆడియెన్స్ మాత్రం ఈసారి జార్జ్ కుట్టి అండ్ ఫ్యామిలీ ఎలాంటి ఎత్తులు వేశారా అని థియేటర్లకు వెళ్తున్నారు.అలా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మోహన్ లాల్-జీతూ జోసెఫ్ 'దృశ్యం 3'కి మూడు రోజులైనా గడవక ముందు అంటే 58 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే పోస్టర్ రిలీజ్ చేసి మరీ ధ్రువీకరించారు. టాక్ బాగోలేకపోయినా ఈ రేంజ్ కలెక్షన్స్కి కారణం..ఫ్రాంచైజీపై ఉన్న హైప్, మోహన్ లాల్ లాంటి స్టార్ పవర్ కూడా కారణమని చెప్పొచ్చు. ఎలాంటి ప్రచారం చేయకుండా తెలుగులోనూ రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ల్లో మంచి నంబర్లే నమోదవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)Thank you for carrying this journey with us for 13 years. ❤️Your love, support, and belief in this story continue to humble us every day.#Drishyam3 running successfully in theatres near you.@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk… pic.twitter.com/eIo0vLtKdE— Mohanlal (@Mohanlal) May 23, 2026 -
రెండేళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్.. సూర్య కెరీర్లోనే అత్యధికం!
సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడిగా విడుదలైంది). త్రిష హీరోయిన్గా నటించిన ఇందులో ఆర్జే.బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. న్యాయస్థానం, అవినీతికి పాల్పడే న్యాయవాదులు, న్యాయం కోసం బాధితులు పడే అవస్థలు, గ్రామ దేవతలు ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంది. అంతేకాదు ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీ రిలీజయ్యాక ఫస్ట్ షో నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది.సూర్య కెరీర్లోనే అత్యధికంమే 15న తెరపైకి వచ్చిన కరుప్పు చిత్రం వారం దాటినా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మైలురాయిని చేరుకుంది. అలాగే సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. సూర్య శనివారం ఈ చిత్ర విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం అరగంట, ముప్పావు గంటలో తీసుకున్న నిర్ణయం ఈ చిత్రం. దర్శకుడు ఆర్జే.బాలాజీ విజన్యే ఈ సినిమా. ఇటీవలి కాలంలో జనం నుంచి ఇంత స్పందన చూడలేదు. రాజీ పడలేదుప్రతి చిత్రానికి ఏదో ఒక విమర్శ వస్తుంటుంది. అయితే ఈ చిత్రానికి అంతటా ప్రేమ మాత్రమే లభించడంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిర్మాతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. పిల్లల నుంచి పెద్దలు వరకూ చూసి ఆనందించడంతో థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు పడుతుండటం ఆనందంగా ఉంది అన్నారు. #Karuppu MEGA BLOCKBUSTER 🔥🔥🔥🔥 @Suriya_offl ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/CeTOaOdawY— RJ Balaji (@RJ_Balaji) May 21, 2026 చదవండి: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్చరణ్ -
క్షమాపణలు చెప్పిన రామ్చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా, తాజాగా భోపాల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రామ్చరణ్ నోరు జారడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డాడు. దీంతో వెంటనే తన తప్పు సరిదిద్దుకుంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా క్షమాపణలు చెప్పాడు.ఏం జరిగింది?'పెద్ది కీ ఆవాజ్' పేరుతో భోపాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రామ్చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న హోస్ట్ రామ్చరణ్తో ర్యాపిడ్ ఫైర్ ఆడించాడు. కొంతమంది క్రికెటర్ల పేర్లను ప్రస్తావిస్తూ వారి గురించి ఒక్కమాటలో చెప్పాలన్నాడు. అలా సచిన్, ధోని, కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్స్ గురించి ఒక్క లైన్లోనే పొగడ్తలు కురిపించాడు. చివరగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావించాడు యాంకర్.వీడియో క్లిప్ వైరల్ఇక్కడే చరణ్ తప్పులో కాలేశాడు. 'నేను బుమ్రాకు పెద్ద అభిమానిని. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆయన మనదేశంలో ఫుట్బాల్ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు' అని బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది. క్రికెటర్ను ఫుట్బాల్ ఆటగాడిగా పేర్కొనడంతో చరణ్ను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అటు హోస్ట్ కూడా ఈ తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.క్షమించండిదీంతో చరణ్ ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ క్షమాపణలు చెప్పాడు. 'కొన్నిసార్లు నేను పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాను. అంతమంది జనం, హడావుడి మధ్యలో అనుకోకుండా పొరపాటు దొర్లింది. అందుకు బుమ్రా గారిని క్షమించమని కోరుతున్నాను. నేను నిజంగా ఆయన ఆటకు వీరాభిమానిని. ఆయనపై నాకెంతో గౌరవం ఉంది. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వించదగ్గవి' అని ట్వీట్ చేశాడు. Uff… I’m genuinely so forgetful with names sometimes.Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026Context - pic.twitter.com/yK0YIH6V7d— Film Culture (@CinemasHive) May 23, 2026 చదవండి: ఈ సినిమా రిలీజ్లు ఎప్పుడు? -
అల్లు అర్జున్ కుమారుడికి స్టార్ క్రికెటర్ సర్ప్రైజ్ గిఫ్ట్
ఓ సినీమా స్టార్తో ఓ క్రికెట్ స్టార్ కలిసిన అరుదైన క్షణం అభిమానులను ఉత్సాహపరిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ను కలిశారు. ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న అయ్యర్ను బన్నీ అభినందించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ బన్నీ కుమారుడు అల్లు అయాన్కు ఓ ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తన సంతకంతో కూడిన క్రికెట్ జెర్సీని అయాన్కు బహుమతిగా అందించారు. ఇక ఈ గిఫ్ట్పై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వెంకటేశ్ అయ్యర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 'ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ని ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ బన్నీ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)ఈ భేటీతో అల్లు అర్జున్ అభిమానులు, క్రికెట్ లవర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్స్తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
చరణ్ డాన్స్తో వాటి అందం రెట్టింపు అయింది: ఏఆర్ రెహమాన్
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. మొదట విడుదలైన “చికిరి.. చికిరి” పాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించంది. “రయ్.. రయ్.. రారా” పాట కూడా భారీ హిట్ అయింది. తాజాగా విడుదలైన స్పెషల్ మాస్ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటల్లో ఏదీ తన ఫేవరెట్ సాంగ్ కాదని ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన అభిప్రాయం ప్రకారం, తనకు అత్యంత ఇష్టమైనవి ఈ చిత్రంలోని ఇంకా విడుదల కాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని సాంగ్స్ అని తెలిపారు. ఈ సినిమాలో కీలకమైన రెండు మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయట. వాటిలో ఒకటి అత్యంత ఎమోషనల్గా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు కూడా ఓ ఇంటర్వూలో ధృవీకరించారు.రామ్చరణ్ గురించి రెహమాన్ మాట్లాడుతూ.. నేను పాటలు కంపోజ్ చేసినప్పుడు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ పాటలకు చరణ్ డాన్స్ చేసిన తర్వాత వాటి అందం రెట్టింపు అయింది. రీ-రికార్డింగ్ సమయంలో చరణ్ పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. సినిమాలో బెస్ట్ పార్ట్ చరణ్ యాక్టింగ్ అని అన్నారు. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంచి. -
పెళ్లయ్యాక సినిమాలకు దూరం.. విడాకుల తర్వాత రీఎంట్రీ
బుల్లితెర నుంచి వెండితెరకు ప్రయాణం సాగించినవారిలో హీరోయిన్ భామ ఒకరు. ఈమె అసలు పేరు రేఖిత ఆర్.కురుప్. నేడు (మే 23న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..టీవీ నుంచి వెండితెరపైకి..కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగింది భామ. డిగ్రీ వరకు చదువుకున్న ఈ బ్యూటీ మొదట బుల్లితెరపై మెరిసింది. సూర్య టీవీ ఛానల్లో తాళి అనే ప్రోగ్రామ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. తర్వాత ఓ ఆల్బమ్లోనూ యాక్ట్ చేసింది. సరిగ్గా అదే సమయంలో మలయాళ దర్శకుడు లోహితదాస్ ఆమెను చూశాడు. నివేద్యం సినిమాతో భామను కథానాయికగా పరిచయం చేశాడు. తెలుగులోనూ..ఫస్ట్ సినిమా క్లిక్ అవడంతో భామకు ఆఫర్లు క్యూ కట్టాయి. మలయాళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. అదే సమయంలో ఎల్లం అవన్ సేయల్ ద్వారా తమిళంలో, మొదలశాలతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మంచివాడు (2011) అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. తనలో మంచి సింగర్ కూడా దాగుంది.సింగిల్ మదర్గా..2020లో వ్యాపారవేత్త అరుణ్ జగదీశ్ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలు పక్కనపెట్టేసింది. ఇంతలోనే ఈ జంటకు కూతురు గౌరి పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. ప్రస్తుతం భామ సింగిల్ పేరెంట్గా కూతురిని పోషిస్తోంది. గతేడాది (2025) సుమతి వలవు చిత్రంతో సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది.చదవండి: భర్తతో కలిసి ట్రోఫీ గెలిచిన వాసంతి -
బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి
కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ పేరు చెప్పగానే సంప్రదాయ పాత్రలే గుర్తొస్తాయి. అలాంటిది ఈమె స్విమ్మింగ్ పూల్లో బికినీ ధరించి ఫొటోషూట్ చేసిందని చెప్పి ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. నిజంగానే రుక్మిణి ఇలా చేసిందా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు సదరు బికినీ పిక్స్పై స్వయంగా రుక్మిణినే క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్.. సినిమాల వల్ల చాలా కోల్పోయా: టాలీవుడ్ హీరోయిన్)'ఏఐ సాయంతో సృష్టించిన నా ఫొటోలు ఆన్లైన్లో వైరల్ కావడం నేను, నా టీమ్ గుర్తించాం. అవన్నీ ఫేక్. ఏఐతో తయారు చేశారని క్లారిటీ ఇస్తున్నాను. ఇలాంటివి క్రియేట్ చేయడం నిజంగా బాధ్యతారాహిత్యమే. అలానే మా వ్యక్తిగత గోప్యతని ఉల్లంఘించడమే అవుతుంది. దీన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఫొటోలని సృష్టించిన వాళ్లతో పాటు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు మొదలుపెట్టాం. ఇలాంటి వాటిని పోస్ట్ చేయడం, షేర్ చేయడం లాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని రుక్మిణి చెప్పుకొచ్చింది.రీసెంట్ టైంలో ఇలా జరగడం మరీ ఎక్కువైపోయింది. గతంలో పలువురు ఫొటోగ్రాఫర్లు.. వెనక వైపు నుంచి, అసభ్యకర యాంగిల్స్లో ఫొటోలు తీస్తున్నారని రుక్మిణితో పాటు పలువురు కన్నడ హీరోయిన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడిలా జరిగింది. యాంకర్ అనసూయకి కూడా ఇలానే జరగడంతో కేసు పెట్టింది.రుక్మిణి సినిమాల విషయానికొస్తే.. కన్నడలో చేసిన 'సప్త సాగర ఎల్లో దాచే' రెండు భాగాలతో పాటు 'కాంతార' సీక్వెల్ ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్తో 'డ్రాగన్'లో నటిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన) -
త్రిష రాజకీయాల్లోకి రావాలి.. తనకు ఆ అర్హత ఉంది: నటి
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే గెలుపు రుచి చూశారు దళపతి విజయ్. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవడంతో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంచలనం సృష్టించారు. అయితే విజయ్ సీఎం అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓపక్క భార్యకు విడాకులు ఇస్తూనే.. మరోపక్క హీరోయిన్ త్రిషతో సన్నిహితంగా మెదులుతున్నారు.తప్పేముంది?ఈ క్రమంలో త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై నటి వనితా విజయకుమార్ స్పందించింది. త్రిష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని ప్రశ్నించింది. పాలిటిక్స్లో అడుగుపెట్టేందుకు కావాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని త్రిషను వెనకేసుకొచ్చింది. పైగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత చదివిన స్కూల్లోనే త్రిష కూడా చదువుకుందని గుర్తు చేసింది. రాజకీయాల్లోకి రావాలితను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుందని, జనంతో ఎలా మమేకం అవాలి? ఎదుటివారితో ఎంత గౌరవంగా మెదలాలనే విషయాలు తనకు బాగా తెలుసని పేర్కొంది. త్రిష లాంటి వారు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడింది. మరి నిజంగా త్రిష పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తుందా? కేవలం సినిమాలకే పరిమితమవుతుందా? అన్నది రానున్న రోజుల్లో చూడాలి!చదవండి: అందుకే 20 ఏళ్లుగా ఆయనతో నటించలేదు: ఊర్వశి -
ఆ కారణం వల్లే ఆయనతో 20 ఏళ్లుగా నటించలేదు!
తలైవా తలైవి (తెలుగులో సార్ మేడమ్) వంటి హిట్ చిత్రం తర్వాత పాండిరాజ్ కథ, కథనం, దర్శకత్వం వహించిన సినిమా పరిమళ అండ్ కో. జయరాం, ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించారు. డ్యాన్స్ మాస్టర్ శాండి, దర్శకుడు మిస్కిన్, యోగిబాబు, సంతోష్ శోభన్, సంజనా కృష్ణమూర్తి, అనంతిక, జీకేఎం తమిళ్ కమరన్ ముఖ్యపాత్రలు పోషించారు. సంతోషించా..తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఊర్వశి మాట్లాడుతూ.. చాలా చిత్రాల్లో కథే హీరో అనే నమ్మకం కలుగుతుందన్నారు. పరిమళ అండ్ కో సినిమా కథ మొదట వినగానే అలాంటి భావనే కలిగిందన్నారు. ఇందులో జయరాం నటిస్తున్నారని తెలియగానే సంతోషంగా అనిపించిందని పేర్కొన్నారు. తామిద్దరం ఇంతకుముందు 20కి పైగా చిత్రాల్లో కలిసి నటించామన్నారు. కానీ తర్వాత ఇద్దరి ఆసక్తులు వేరవడంతో చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.అదే కారణం..పలు అవకాశాలు వచ్చినప్పటికీ తనకు నచ్చిన కథ జయరాంకు నచ్చకపోవడం, ఆయనకు నచ్చింది తనకు నచ్చకపోవడం జరిగిందన్నారు. దాంతో తామిద్దరం కలిసి నటించి దాదాపు 20 సంవత్సరాలు అయిందన్నారు. ఈ సినిమాను పాండిరాజ్ చాలా వేగంగా పూర్తి చేశారని ఊర్వశి తెలిపారు. -
ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి.. అతనే ఫిక్సా?
గతేడాది నుంచి ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి వీరిద్దరు న్యూయార్క్లో జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కూడా వీరిద్దరి గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకీ ఎవరా ఇద్దరని అనుకుంటున్నారా? గతేడాది నుంచి వైరలవుతోన్న ఆ జంట మరెవరో కాదు.. ఒకరు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. మరొకరు ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్.గతంలో కావ్య మారన్- అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అనిరుధ్ అదేం లేదంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి టాపిక్ వైరల్గా మారింది. ఈ సారి ఏకంగా వేదికలను కూడా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్ నడుస్తోంది.తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్లో వీరి వివాహం జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి సంబంధించి అనిరుధ్ కానీ.. కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గతంలో చాలాసార్లు రూమర్స్ రావడంతో ఇది కూడా అలాంటిదేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజులు ఆగితే ఈ జంట రిలేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక ఇద్దరి కెరీర్ పరంగా చూస్తే అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్గా బిజీగా ఉన్నారు. కావ్య సైతం ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లతో ఫుల్ బిజీగా ఉంది. -
మోహన్ లాల్ దృశ్యం-3.. ఇండస్ట్రీలోనే రెండో సినిమాగా రికార్డ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3. సూపర్ హిట్ సిరీస్లో వచ్చిన మూడో చిత్రం ఈ నెల 21 థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్గా ఘనత సాధించింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ మొదటి రోజే మంచి వసూళ్లు సాధించింది. రిలీజైన తొలి రోజే రూ. 15.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 18.37 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ. 25 కోట్లు వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 43.37 కోట్లకు పైగా కలెక్షన్స్తో రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ ఓపెనింగ్ డే వసూళ్లతో మలయాళ సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దృశ్యం-3 రెండోస్థానంలో నిలిచింది. ఈనెల 1వ తేదీన విడుదలై మొదటి రోజు రూ. 28.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన స్పై థ్రిల్లర్ పేట్రియాట్ను అధిగమించింది. ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్లాల్ నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించారు. మలయాళ సినిమాలో అత్యధిక ఓపెనింగ్-డే రికార్డు వసూళ్లతో 'ఎల్2: ఎంపురాన్' చిత్రం కొనసాగుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 67 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. ఇక దృశ్యం సినిమాల విషయానికొస్తే.. 2013లో 'దృశ్యం' రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, తెలుగు, తమిళంతో సహా పలు భాషలతో పాటు సింహళ, చైనీస్ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఆ తర్వాత 2021లో 'దృశ్యం 2' నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీని సైతం కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ దృశ్యం సిరీస్ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రల్లో నటించారు. -
సూర్య కరుప్పు.. విమర్శలకు జ్యోతిక కౌంటర్..!
కోలీవుడ్ హీరో సూర్య లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కరుప్పు. గత వారంలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాదనిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ దాటేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై కొంత మిశ్రమ స్పందన వస్తోంది. ఈ మూవీ కమల్హాసన్ విక్రమ్తో పోలుస్తున్నారు. కరుప్పు మూవీకి వస్తున్న మిక్స్డ్ రెస్పాన్స్పై సూర్య సతీమణి జ్యోతిక స్పందించింది. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కాదని.. సృజనాత్మక కోణంలోనే చూడాలని సూచించింది. ఈ సినిమాకంటూ ఒక ఆత్మ ఉందని అన్నారు. సూర్య కెరీర్లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం కాకపోయినా.. ప్రేక్షకులు ఎదురుచూస్తున్న దాన్ని ఈ సినిమా అందించిందని తెలిపింది.జ్యోతిక మాట్లాడుతూ.." కరుప్పు చూసి మేము చాలా ఉద్వేగానికి లోనయ్యాము. సూర్య మంచి కథలనే ఇష్టపడతాడు. అతను ప్రతి సినిమాలో ఒక కథ ఉండేలా చూసుకుంటాడు. కానీ హీరోలకు బాక్సాఫీస్ వసూళ్లు కూడా అవసరమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఎవరూ నష్టపోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మంచి వసూళ్లు సాధించడం చాలా ముఖ్యం. ఇది కేవలం కమర్షియల్ లాభాల కోసం తీసినది కాదు. దానికంటూ ఒక ఆత్మ ఉంది. సామాన్య ప్రజలు చూసేలా విభిన్నంగా రూపొందించారు. కానీ సినిమా చివరి పది నిమిషాల్లో సూర్య అద్భుతంగా నటించారు' అని అన్నారు. -
సూర్య కరుప్పు.. వారం రోజుల్లోనే అరుదైన మార్క్..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ తొలి మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఫీట్ సాధించింది. రిలీజైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్క్ అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా ఏడో రోజు రూ. 8.30 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో మనదేశంలో రూ. 114.05 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ వసూళ్లను చూస్తే దేశవ్యాప్తంగా రూ. 132.05 కోట్లు.. ఓవర్సీస్లో రూ. 57 కోట్లు కలెక్ట్ చేసింది.ఓవరాల్గా చూస్తే ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 207 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా తమిళ వర్షన్లో అత్యధిక వసూళ్లు రాబడుతోంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ఏడో రోజు రూ. 7 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, శివాడ, యోగి బాబు, స్వాసిక కీలక పాత్రల్లో నటించారు. -
కోలీవుడ్ కాలింగ్?
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను అను కుంటున్నారట.మరి... ఈ సినిమాతోనే జాన్వీ కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందా? ధ్రువ్–జాన్వీల జోడీ కన్ఫార్మ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తొలుత రుక్మిణీ వసంత్ని అనుకున్నారట. కాల్షీట్స్ సర్దుబాటు చేయడంలో రుక్మిణీకి ఇబ్బందులు తలెత్తడంతో జాన్వీని తీసుకుంటున్నారని చెన్నై టాక్. -
ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణ వృథా
జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్ప్రైజ్ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్ హ్యాండిల్లో మాత్రం ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు. ఈ పరిణామంతో తారక్ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్మీడియా హ్యాండిల్ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు. -
ఒకే ఒక్క ఫ్లాప్.. జ్యోతిక ముఖంపైనే తలుపేసిన బాలీవుడ్
జ్యోతిక సౌత్లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందు బాలీవుడ్లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా రాణించింది.ప్రేమ- పెళ్లిఅయితే కెరీర్ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.ఆదరించని బాలీవుడ్పెళ్లయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!అదే ప్లస్, మైనస్అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్ సినిమా మే 22న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.చదవండి: డ్రాగన్ గ్లింప్స్ ఆల్టైమ్ రికార్డ్ -
‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లోని సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు భాగాలు (దృశ్యం, దృశ్యం 2) రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో భాగం దృశ్యం 3 ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయిగే గత రెండు భాగాలను తెలుగులో హీరో వెంకటేష్ రీమేక్ చేయగా.. పార్ట్ 3 మాత్రం మలయాళ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్ చేసి నేడు(మే 21) రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దృశ్యం 2 ముగింపు సీన్తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్కుట్టి(మోహన్లాల్) వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్. అది రిలీజై..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి. కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్, ప్రభాకర్ మళ్లీ జార్జ్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ సహదేవన్ చేసిన కుట్ర ఏంటి? వరుణ్ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్ వేసిన ప్లాన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. అనుకోకుండా జరిగిన హత్య కేసు నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు పెద్దగా చదువులేని మధ్యతరగతి వ్యక్తి ఏం చేశాడు? అనేది ‘దృశ్యం’ కథ. ఈ ఒక్క లైన్తోనే ఇప్పటికే రెండు పార్టులు తీసి హిట్ కొట్టాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అందుకే పార్ట్ 3పై ముందుగానే భారీ అంచనాలు పెరిగాయి. ఈ సారి ఎలాంటి ట్విస్టులు ఉంటాయి? కేసు నుంచి తన ఫ్యామిలీని జార్జ్ ఎలా బయటపడేస్తాడు? అనే క్యూరియాసిటీతో థియేటర్స్కి వెళ్లిన ప్రేక్షకులను జీతూ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ట్విస్టులు, సస్పెన్స్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. వాటిలో కొత్తదనం కొరవడింది. చివరి అరగంట తప్ప మిగతా కథనం అంతా రొటీన్గానే ఉంటుంది. ఫస్టాఫ్ కథనం స్లోగా సాగుతూ.. సహనానికి పరీక్షగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కూడా కథనం నెమ్మదిగానే సాగినప్పటికీ.. ఒక్కో పాత్ర ఎంట్రీతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక కూతురు పెళ్లి ఆపేదెవరని జార్జ్కి తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. అంజు అరెస్ట్ కోసం జరిగే కుట్రలు.. వాటిని తిప్పికొట్టేందుకు జార్జ్ వేసే ప్లాన్స్ అన్నీ అదిరిపోతాయి. చివరి అరగంట అయితే మళ్లీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ తరహాలో కథనం సీరియస్గా సాగుతూ.. తర్వాత ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. అక్కడ వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే మోహన్ లాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్కుట్టి పాత్రలో జీవించేశాడు. అతని భార్య రాణిగా మీనా చక్కగా నటించింది. ఇక కూతుళ్లుగా నటించిన ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సహదేవన్, ప్రభాకర్ పాత్ర ధారులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్ బాగుంది. తెలుగు డబ్బింగ్ అస్సలు బాగోలేదు. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
రికార్డు సృష్టించిన జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం డ్రాగన్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ బర్త్డే సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి డ్రాగన్ గ్లింప్స్ వదిలారు. సాధారణంగా గ్లింప్స్ అనగానే చాలా తక్కువ నిడివితో ఉన్న వీడియోను వదులుతారు. కానీ డ్రాగన్ యూనిట్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో కథ గురించి, హీరో ఉన్న సామ్రాజ్యం గురించి చూపించారు. అలాగే విలన్స్ను హైలైట్ చేశారు.గ్లింప్స్ రికార్డుఎన్టీఆర్ను క్రూరమైన పాత్రలో చూపించారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఈ గ్లింప్స్ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్ రాలేదంటూ పోస్టర్ వదిలింది. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సినిమాడ్రాగన్ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ కథానాయికగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అషుతోష్ రానా, అన్షుమాన్ పుష్కర్, సిద్దాంత్ గుప్తా, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ 2027 జూన్ 11న విడుదల కానుంది. Records were never safe from #DRAGON 🐉🔥#DragonGlimpse pic.twitter.com/6omRXL8JCb— Dragon (@DragonMovieOffl) May 20, 2026 చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లకు పొగరు: డ్యాన్సర్ -
ధనుష్ కంటే అతడు 100 రెట్లు నయం: దర్శకుడు
సౌత్లోని స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. యాక్షన్, ఎమోషన్స్.. అన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలడు. తక్కువకాలంలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. అయితే అలాంటి ధనుష్ కంటే కూడా ఆయన తండ్రి, దర్శకుడు కస్తూరి రాజా గొప్ప నటుడు అంటున్నాడు తమిళ దర్శకుడు మిస్కిన్. ధనుష్ కంటే అతడు వంద రెట్లు నయమని పేర్కొన్నాడు. కస్తూరి రాజా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం హబిబి. మీరా కతిరవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ను మే 17న చెన్నైలో రిలీజ్ చేశారు. ఎవరో కూడా తెలీదుఈ కార్యక్రమానికి మిస్కిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. కస్తూరి రాజా చాలా బాగా నటిస్తాడు. మొదటిసారి ఓ సినిమాలో అతడిని చూసినప్పుడు ఆయన ఎవరనేది కూడా నాకు తెలీదు. కానీ, ఎక్కడో చూసినట్లుగా అనిపించేది. ఈయన ధనుష్ కంటే అద్భుతంగా నటిస్తాడు. అలా అని నాకు ధనుష్ అంటే ఇష్టం లేదనుకోకండి!నచ్చేవి కావుమొదట్లో కస్తూరి రాజా (దర్శకుడిగా) చేసిన సినిమాలు నాకస్సలు నచ్చేవి కావు. అన్నీ పనికిరాని సినిమాలే చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను తన సినిమాలకు ఎంచుకునేవాడు. నెమ్మదిగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నాడు. బాగానే డబ్బు సంపాదించాడు. కొన్నిసార్లు నేను నా ఆత్మసంతృప్తి కోసం ఏదైనా సినిమా చేసినప్పుడు నష్టాలు వచ్చేవి. అలాంటప్పుడు వెంటనే నా అప్పు తీర్చుకునేందుకు, జేబు నింపుకునేందుకు కమర్షియల్ మూవీ చేసి ఆ లోటు భర్తీ చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా కస్తూరి రాజా, ఈషా, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలు పోషించిన హబిబి చిత్రం మే 28న విడుదల కానుంది.చదవండి: సినీ ఇండస్ట్రీలో ఖుష్బూ చిన్న కూతురు -
కేన్స్ చిత్రోత్సవాల్లో హారర్ సినిమా టీజర్
నటుడు ఆదవ్ కన్నదాసన్, నటి వాణి భోజన్ జంటగా నటించిన చిత్రం తాళ్ తిరవా. బర్మన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్. కేఆర్ సహ నిర్మాత. భరణి శేఖర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.. సురేష్ మీనన్, సుబ్బుపంజా ముఖ్య పాత్రలు పోషించిన ఇందులో బాల తారలు లిసా, లలిత నటించారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇది ఒక గ్రామంలో గుర్తించిన పురాతన రాతి పలకంపై రాసిన అక్షరాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, అనర్థాల ఇతివృత్తంతో రూపొందిస్తున్న మూవీ అని చెప్పారు.ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి అయిందన్నారు. మూవీ టీజర్ను మంగళవారం (మే 19) నాడు కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రపంచ సినీ ప్రముఖులను అలరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే తాళ్ తిరవా ఫస్ట్లుక్ పోస్టర్ను బుధవారం విడుదల చేశామని, దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈచిత్రానికి ఓషో. వెంకట్ సంగీతాన్ని సమకూర్చగా, సాల్మన్బోస్ చాయాగ్రహణం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by தாழ் திறவா (@thazhthiravaa) -
సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు
సినీ రంగంలో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఆ వరుసలో ఇప్పుడు దర్శకుడు సుందర్ సి- నటి ఖుష్బూ దంపతుల కూతురు చేరింది. ఖుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవంతిక ఇటీవలే కథానాయికగా పరిచయమైంది. తాజాగా ఆనందిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిర్మాతగా..అవ్నీ మూవీస్ అధినేత కుష్బూ సుందర్, బెంజ్ మీడియా అధినేత సీసీఎస్ అరుణ్కుమార్ కలిసి నిర్మిస్తున్న డబుల్ ఆక్యుపెన్సీ చిత్రానికి ఆనందిత సుందర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్ కందస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్, రేష్మా వెంకటేష్, సంయుక్తా విశ్వనాథ్, వీనోద్ కిషన్, వీటీవీ.గణేశ్, భగవత పేరుమాళ్, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. రెండు సినిమాలు..చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక వ్యక్తిలో రెండు ఆత్మలు చోటు చేసుకుంటాయని, అవి మరో ఇద్దరితో చేసే ప్రేమాయణం అనే ఫాంటసీ కథాంశంతో రూపొందించిన చిత్రం డబుల్ ఆక్యుపెన్సీ అని చెప్పారు. వినోదాన్ని జోడించి యూత్ ఫుల్ ఎంటర్టెయినర్గా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్కుమార్ చక్రవర్తి చాయాగ్రహణం, శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు. ఆనందిత సుందర్.. మీసయ్య మురుక్కు సీక్వెల్ సినిమాకు సైతం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది. గతంలో ఎంతో బొద్దుగా ఉన్న ఆనందిత.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది. View this post on Instagram A post shared by anandita (@anisundar_) -
మంచు మనోజ్కి మరో కీలక పాత్ర.. ఆ సీనియర్ హీరోతో ఢీ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో విలన్ పాత్రలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రంలో నటించబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో ఆయనను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే భైరవం, మిరాయి వంటి చిత్రాల్లో విలన్గా కనిపించి మెప్పించిన మనోజ్, ఈసారి బాలయ్యతో కలిసి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో నటించారు.ఈ చిత్రంలో విలన్ పాత్రలో మనోజ్ కనిపించనున్నాడని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో అధికారికంగా మనోజ్ ఎంట్రీని ప్రకటిస్తూ..'మీ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది'అని పేర్కొన్నారు. ఇది ఆయనకు మనోజ్తో మొదటి కాంబినేషన్. గోపీచంద్ గతంలో బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. ఇక ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారని సమాచారం. -
జైల్లోనే పెళ్లిరోజు.. ఎప్పటికీ నీ చేయి వదలను: దర్శన్ భార్య
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్కు కాస్త ఊరట కలిగింది. దర్శన్ను కలిసేందుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్కు జైలు, పోలీసు అధికారులు అనుమతిచ్చారు. కుటుంబంతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే దర్శన్ అధికారులను కోరాడు. 30 నిమిషాలుమామూలుగా ఖైదీలను కుటుంబసభ్యులు కలవాలంటే ఇనుప కడ్డీలు, అద్దం అడ్డుగా ఉంటాయి, అలాగే మాట్లాడుకోవాలి. కానీ, దర్శన్కు ముఖాముఖి సంభాషణకు వీలు కల్పించారు. ఈ క్రమంలో తమ పెళ్లిరోజు(మే 19)నాడు భర్తను కలిసింది విజయలక్ష్మి. దాదాపు 30 నిమిషాలపాటు అతడితో సంభాషించింది. అనంతరం సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.నీ చేయి వదలనుప్రతి తుఫానులో, ప్రతి నిశ్శబ్ధంలో నీ చేయి నేను విడవను. పరిస్థితులు మనల్ని విడదీయాలని చూసినా నా గుండెచప్పుడు మాత్రం ఎల్లప్పుడూ నిన్నే కోరుకుంటుంది. ఈ ప్రపంచమంతా నీకు ఎదురు తిరిగినా సరే నేను మాత్రం నీవైపే ఉంటాను. నీకోసమే నిలబడతాను అని రాసుకొచ్చింది. కాగా దర్శన్- విజయలక్ష్మి 2003 మే 19న పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు వినీశ్ సంతానం. పెళ్లయిన కొంతకాలానికి దర్శన్- విజయలక్ష్మిల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జైలు జీవితంఅదే సమయంలో నటి పవిత్రగౌడతో ప్రేమలో పడ్డాడు దర్శన్. 2014 నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇంతలోనే వీరి జీవితాల్లో పెద్ద కుదుపు ఏర్పడింది. 2024లో అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్టయ్యాడు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కారణంతో అనుచరులతో కలిసి దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan) చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఫ్యాన్స్ కోలాహలం -
రామ్కు నో చెప్పిన పుష్ప విలన్!
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న మూవీ వచ్చే నెలలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.హీరోయిన్ సరే, విలన్ ఎవరు?అలాగే నటీనటుల ఎంపికపైనా రామ్ దృష్టి సారించాడట! ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, తమిళ నటుడు, దర్శకనిర్మాత ఎస్జే సూర్యలను అనుకుంటున్నారట. కాకపోతే పుష్ప తర్వాత ఫహద్ ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాలు చేస్తున్న అతడు రామ్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి రామ్కు జోడీగా శ్రీనిధి, విలన్గా ఎస్జే సూర్య నటిస్తారేమో చూడాలి! -
అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్ హీరోయిన్
మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది హీరోయిన్ మమితా బైజు. మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఇటీవల డ్యూడ్ మూవీతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె విజయ్తో కలిసి నటించిన జననాయకన్ (తెలుగులో జన నాయకుడు) చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదే నా లక్ష్యంఅలాగే సూర్యకు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే అశోక్ సెల్వన్కు జంటగా నటించిన ఇరండు విధానం చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత మమితా బైజు క్రేజ్ వేరేగా ఉంటుందని భావించవచ్చు. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా అభిమానుల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చేయాలన్నదే నా లక్ష్యం. అలా ఒక ప్రేమైక కుటుంబాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఏదో ఒక రోజున నా జరిగిన కాలం గుర్తుకు వస్తే ఆనందం కలగాలి. అందుకోసమే నా ఈ ప్రయాణం' అని మమిత పేర్కొంది. -
స్పెషల్ ఎట్రాక్షన్
కమర్షియల్ సినిమాలో హీరో ఉంటారు. ఫైట్స్, పాటలు ఉంటాయి. అయినా అదనపు ఆకర్షణ కావాలి. ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక గీతం థియేటర్స్లో ప్లే అవ్వాలి. అందుకే కొందరు హీరోలు స్టోరీలో స్పెషల్ సాంగ్ చేసే స్కోప్ ఉంటే, సై అంటున్నారు. ఆ పాటలు చేయడానికి హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచే స్టెప్పులు వేస్తున్నారు. మరి... ఏ సినిమాలో ఏ నటి స్పెషల్గా కనిపించనున్నారో ఓసారి లుక్ వేయండి.జైలర్తో స్టెప్పుల్ మంచి కమర్షియల్ మోడ్లో కనిపిస్తున్నారు రజనీకాంత్. ఈ సీనియర్ హీరో నటించిన గత రెండు చిత్రాలు ‘జైలర్, కూలీ’ కమర్షియల్ ఎంటర్టైనర్స్గా ఆడియన్స్ను అలరించాయి. అలాగే ఈ రెండు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటలో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేస్తే, ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా..’ పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ను ఇరగదీశారు. కాగా రజనీకాంత్ పూర్తి చేసిన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ను బాలీవుడ్ నటి నోరా ఫతేహీ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.‘జైలర్’ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్గా రానున్న ‘జైలర్ 2’ మూవీకి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారని తెలిసింది.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ చిత్రం జూన్లో విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్ స్వరకర్త. అన్నట్లు... నోరా ఫతేహీ గురించి మన తెలుగు ఆడియన్స్కు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే..‘బాహుబలి: ది బిగినింగ్’లో ‘మనోహరి’, ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’ ఇలా పలు స్పెషల్ సాంగ్స్లో నోరా నర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది.స్పెషల్ ఎంట్రీ టాలీవుడ్కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి మౌనీ రాయ్. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ చిత్రంలో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. దాదాపు వందమంది డ్యాన్సర్స్తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి, మౌనీ రాయ్ డ్యాన్స్ చేశారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ‘విశ్వంభర’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మాస్ డ్యాన్స్ రామ్చరణ్ టైటిల్ రోల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో హీరో రామ్ చరణ్తో కలిసి శ్రుతీహాసన్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు. ఈ స్పెషల్ సాంగ్కు కుస్తీతో కూడిన ఓ కాన్సెప్ట్ కూడా ఉందట. అంతేకాదు... ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాలు కదిపారని సమాచారం. ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్లో చరణ్, జాన్వీ శ్రుతీహాసన్లను చూడటం మాస్ ఆడియన్స్కు థియేటర్స్లో విజిల్ వర్తీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970–1980 మధ్య కాలంలో సాగుతుంది. ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్గా రామ్చరణ్ నటించారు. అంటే... ఈ చిత్రంలో రామ్చరణ్ క్రికెట్, కుస్తీ ఆడతారు. మరొక గేమ్ కూడా ఉంది. ఈ గేమ్పై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమాలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్వేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. మరోవైపు మహేశ్బాబు ‘ఆగడు’, అర్జున్ కపూర్ ‘తేవర్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఆలియా ఆటా పాటా! ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటకు స్కోప్ ఉంది.ఈ పాటలో నటిస్తారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ పాటలో ఆలియా భట్ కనిపిస్తారనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే, ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. నందమూరి కల్యాణ్రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ది ప్యారడైజ్లో తమన్నా! స్పెషల్ సాంగ్స్కు ఓ కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు హీరోయిన్ తమన్నా. అంతేకాదు... ఈ బ్యూటీ ఫలానా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమా హిట్టవుతుందనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా..’, కావొచ్చు, హిందీ చిత్రం ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ కావొచ్చు, మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘డాంగ్ డాంగ్..’ పాట కావొచ్చు... తమన్నా స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమాకు అది తప్పుకుండా ప్లస్ అవుతుంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.‘దసరా’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ యువకుడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కు స్కోప్ ఉందట. దీంతో ఈ సాంగ్కు తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఆ దిశగా సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. అయితే ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్న అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంలో మోహన్బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ తేదీకి విడుదల కుదరకపోవడంతో, ఈ ఏడాది ఆగస్టు 21కి వాయిదా వేశారు. అయితే ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని, అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ సాగడం లేదని, రీ షూట్స్ చేయాల్సి వస్తోందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, అనుకున్న ప్రకారమే ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోందని, ఆగస్టు 21న ఈ సినిమా విడుదల అవుతుందని టీమ్ మరోసారి స్పష్టత ఇచ్చింది.నేను రెడీ టాలీవుడ్కు వచ్చేందుకు నేను రెడీ అన్నారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. స్పెషల్ సాంగ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. హిందీలో ‘హౌస్ఫుల్ 3, హౌస్ఫుల్ 5, 5 వెడ్డింగ్స్’ వంటి చిత్రాల్లో నటించారు నర్గీస్. అలానే సల్మాన్ ఖాన్ ‘కిక్’లో ‘యార్ నా మిలే’, తమిళ హీరో ప్రశాంత్ ‘సాగసం’లో స్పెషల్ సాంగ్స్ చేశారు నర్గీస్. ఇప్పుడు తెలుగు సినిమాకు వచ్చారు. హవీష్, కావ్యాథాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నేను రెడీ’.ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ చేశారు నర్గీస్. టాలీవుడ్లో నర్గీస్ చేసిన తొలి సినిమా ఇదే. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ పతాకంపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదల కానుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘నేను రెడీ’ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ‘నేను రెడీ’ సినిమా విడుదల కాకముందే, తెలుగులో ఇంకో సినిమాలో మరో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నర్గీస్. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్లో నర్గీస్ ఫక్రీ డ్యాన్స్ చేశారని తెలిసింది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావొచ్చు.బ్లాక్ గోల్డ్లో సీరత్ ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో అరుదుగా ప్రత్యేక పాటలు చూస్తుంటాం. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది బ్లాక్గోల్డ్’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేఎమ్సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్డ్రాప్లో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రంలో హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ సంగతి ఇలా ఉంచితే.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీకమల్, తన్వీ లీడ్ రోల్స్లో నటించిన ‘ఉషా పరిణయం’ (2024) చిత్రంలో సీరత్ కపూర్ ప్రత్యేక పాటలో మెరిశారు. ఇక శర్వానంద్ ‘రన్ రాజా రన్’లో హీరోయిన్గా నటించిన సీరత్ కపూర్ నాగార్జున ‘రాజుగారి గది 2’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో కీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు తారలు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. -
‘డ్రాగన్’ గ్లింప్స్ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పవర్ఫుల్ ట్రీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.ఇక తారక్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి 11.30 గంటల తర్వాత డ్రాగన్ సినిమా గ్లింప్స్ వచ్చింది. 4.28 నిమిషాల నిడివి గల ఈ గ్లింప్స్లో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ ఆకట్టుకుంది. సింపుల్గా సినిమా కథ, ఆ ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్లో తారక్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను అలరించేలా ఉన్నాయి. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. పవర్ఫుల్గా సాగిన ఈ గ్లింప్స్ సినిమా మీద భారీ అంచనాలను రేపుతోంది.కాగా డ్రాగన్ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ షెడ్యూల్లు వరుసగా వాయిదాలు పడటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్టు డ్రాగన్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఓ కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. కథను మలుపు తిప్పే మరో లీడ్ రోల్లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్ పేరు తెరపైకి వచ్చింది. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ను మీరు కూడా చూసేయండి. -
ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ టీమ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్ర బృందం క్షమాపణలు చెప్పింది. ఆయనను అగౌరపరచడం తమ ఉద్దేశం కాదని.. సినిమాలో ఉన్న డైలాగలను వెంటనే తొలగిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.అసలేం జరిగింది?సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్.జే. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఇళయారాజాపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కొన్ని డైలాగులు ఉన్నాయి. కొన్ని చోట్ల అసందర్భంగానూ ఇళయరాజాపై డైలాగులు పెట్టారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇళయరాజా కూడా ఆ డైలాగులపై అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది ఇళయరాజా అభిమానులు సినిమాను ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదం పెద్దది కాకముందే ముగింపు పలికారు చిత్రబృందం. ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.ఈ రోజు నుంచే మార్పు..ఇళయరాజా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. సినీ రంగం కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నోతరాల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. కరుప్పులో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగు వల్ల ఆయన బాధ పడ్డారని మా దృష్టికి వచ్చింది. ఇళయరాజాను మేము క్షమాపణలు కోరుతున్నాం. ఆయన మనోభావాలను దెబ్బతీయడం, అగౌరవపర్చడం మా ఉద్దేశం కాదు. ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న డైలాగులను తొలగిస్తున్నాం. ఈరోజు నుంచి ఈ మార్పు చేస్తున్నాం. ఆయన గౌరవమే మాకు ప్రధానం’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. -
ఆ సినిమాలో నా పాత్రే చాలా కీలకం: భాగ్యశ్రీ బోర్సే
లక్కీ హీరోయిన్లలో నటి భాగ్యశ్రీ బోర్సే ఒకరనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో ఈమె తొలి నుంచి స్టార్ హీరోలతోనే జత కడుతున్నారు. తెలుగులో మొదటగా రవితేజతో మిస్టర్ బచ్చన్ చిత్రంలో జత కట్టారు. ఆ తరువాత విజయ్దేవరకొండ సరసన కింగ్డమ్ చిత్రంలో నటించారు. ఆ తరువాత తమిళంలో దుల్కర్సల్మాన్, రానాలతో కలిసి కాంతా చిత్రంలో నటించారు. తాజాగా తమిళంలో నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో శివకార్తికేయన్కు జంటగా నటించే లక్కీఛాన్స్ను కొట్టేశారు. ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది ఇంతకు ముందు కమలహాసన్ నటించిన విరుమాండి చిత్రం తరహాలో కరుమాత్తూర్ దైవాల ఇతి వృత్తంతో సాగుతుందని సమాచారం. మదురై నేపధ్యంలో యాక్షన్, కామెడీ అంశాలతో గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా సెయోన్ ఉంటుందని తెలిసింది. కాగా ఈ చిత్రంలో తన పాత్ర గురించి నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల ఓ భేటీలో తెలుపుతూ కమలహహాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్కు జంటగా నటించే ఈ చిత్రం గురించి ఇప్పుడే ఎక్కువ చెప్పలేనన్నారు. అయితే ఈ చిత్రానికి తన పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. తనను ఉత్తమ నటిగా ప్రేక్షకులకు చూపుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రేక్షకులకు నిజాయితీగా ఉండాలంటే తాము నటించే చిత్రాల భాషను తెలుసుకోవాలన్నారు. అందుకే తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కింగ్డమ్ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్రానికి తానే డబ్బింగ్ చెప్పానని అన్నారు. అదే విధంగా ఇప్పుడు సెయోన్ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు భాగ్యశ్రీ బోర్సే చెప్పారు. -
సెయాన్ ఆరంభం
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న రూరల్–కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ‘సెయాన్’. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా పతాకాలపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్గా ‘సెయాన్’ చిత్రం రూపొందుతోంది.’’ అని యూనిట్ పేర్కొంది.వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: ఎస్. డిస్నీ. ఎకానమీ క్లాస్లో కమల్ హాసన్ ప్రయాణం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కల్కి 2’. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు కమల్æహాసన్.ఈ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణించారాయన. ‘‘సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులకు ఎదుర్కొంటున్న తరుణం ఇది. ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్స్, విలాసవంతమైన ప్రయాణాలను కాదని, ఫ్లైట్లో సాధారణ ఎకానమీ క్లాస్లో ప్రయాణించి షూటింగ్కు వెళ్లాలని కమల్హాసన్గారు నిర్ణయించుకోవడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. సినిమా రంగంలో జరగబోయే మార్పులకు ఇది తొలి అడుగు’’ అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది. ‘కల్కి 2’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలిసింది. మరోవైపు సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇటీవల కమల్హాసన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. తన భార్య ఆర్తి తనను వేధింపులకు గురి చేసిందని మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నారు. విడాకులు మంజూరు అయ్యాకే తాను సినిమాల్లో నటిస్తానని తేల్చి చెప్పారు. మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు.తాజాగా ఈ వివాదంలో అనూహ్యంగా నటి ఖుష్బు సుందర్ పేరు తెరపైకి వచ్చింది. మూడు అక్షరాల పేరుతో ఉన్న నటి వల్లే తన జీవితం నాశనమైందని జయం రవి ఆరోపించాడు. రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అని పిలుస్తారు. అందుకే ఆమె తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయింది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నటి ఖుష్బు సుందర్ స్పందించింది. జయం రవి పేరు నేరుగా ప్రస్తావించకుండానే పోస్ట్ చేసింది. కొందరు తమ డీఎన్ఏను నిరూపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని విమర్శించింది. నేను చెప్పింది నిజమని నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఖుష్బు సుందర్. జయం రవి విడాకుల కేసు కాస్తా ఖుష్బు వర్సెస్ జయం రవిగా మారిపోయింది. -
సూర్య కరుప్పు.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం కరుప్పు. ఈ మూవీని తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. మొదటి రోజే ఆర్థిక సమస్యలు రావడంతో ఒక్క రోజు ఆలస్యంగా థియేటర్లో రిలీజైంది. గురువారమే విడుదల కావాల్సి ఉండగా.. శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసింది.ఈ చిత్రం రిలీజైన మూడు రోజుల్లోనే సెంచరీ మార్క్ కొట్టేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా చూస్తే రూ. 68 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్గా వసూళ్లు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రూ. 78.75 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ. 42 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఆదివారం ఒక్కరోజే రూ. 28.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.కాగా.. ఈ చిత్రంలో, సూర్య.. శరవణన్ అనే లాయర్ పాత్రను పోషించారు. దోపిడీకి గురై, అవినీతిమయమైన న్యాయ వ్యవస్థలో చిక్కుకున్న తండ్రీకూతుళ్ల కథగా ఈ మూవీని తెరకెక్కించారు. -
హీరోగా పుష్ప విలన్.. డైరెక్టర్ ఎవరంటే?
మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ తమిళం, తెలుగు భాషల్లోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. ఈయన హీరోగా, విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. అలాంటి ఫాహద్ ఫాజిల్ తాజాగా తమిళంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా నిర్మిస్తున్న చిత్రానికి సి.ప్రేమ్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయ న ఇంతకుముందు 96, మెయ్యళగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సరైన సమయాన్ని తీసుకుని పక్కా, స్క్రిప్ట్తో షూటింగ్కు రెడీ అవడం ఈయన విధానం. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు ప్రేమ్కుమార్ల రేర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని యూనిట్ సభ్యు లు పేర్కొన్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం చెన్నైలో నిర్వహించారు. ఇందులో నటించే హీరోయిన్, నటీనటులు ,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
సీఎం విజయ్ నిర్ణయంపై విశాల్ తీవ్ర అభ్యంతరం..!
విజయ్ సీఎం అయ్యాక అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సీఎంవోలో ఓ జ్యోతిష్యుడిని నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే అతన్ని తొలగించారు. తాజాగా విజయ్ మరో నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫీ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజ్మోహన్కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం విజయ్కు సూచించారు.సీఎం విజయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నన్ను తీవ్రంగా నిరాశపర్చిందని విశాల్ అన్నారు. సినిమాతో విజయ్కు దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా.. ఈ శాఖకు న్యాయం చేయగలిగిన వ్యక్తి మీరేనని గుర్తు చేశారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని.. సినీరంగ అభివృద్ధికి తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు.చిత్ర పరిశ్రమ, సంఘాలు, నిర్మాణ సంస్థలకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి పరిశ్రమలో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తి అవసరమని విశాల్ అన్నారు. ఈ విషయంలో తాను రాజ్మోహన్ను అవమానించే ఉద్దేశం తనకు లేదని.. సినిమా రంగంలో విజయ్కు ఉన్న అనుభవమే సరైన ఎంపిక అవుతుందని విశాల్ పేర్కొన్నారు. పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సమస్యలు పరిష్కరించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.విజయ్ ముందు డిమాండ్లు..విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సినిమా టికెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇది ప్రేక్షకులపై భారాన్ని తగ్గించి, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని అన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను అనే సూత్రం ఉన్నప్పటికీ ద్వంద్వ పన్ను విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమేనని.. స్థానిక సంస్థల పన్నును తొలగించాలని కూడా ఆయన కోరారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఈ డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలను పెంచాలని విశాల్ అభ్యర్థించారు. Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it's disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…— Vishal (@VishalKOfficial) May 17, 2026 -
నిజ జీవిత స్ఫూర్తితో పుట్టిన ‘పెద్ది’
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు. అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్ చరణ్ తన గురువు సుకుమార్ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. -
85 ఏళ్ల నిర్మాత.. బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య
తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు కె.రాజన్(85) చనిపోయారు. చెన్నైలో అడయార్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)తమిళ సినిమాల్లో కె.రాజన్.. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడిగా విశేష సేవలు అందించారు. 1983లో విడుదలైన 'బ్రహ్మచారిగళ్' మూవీతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత డబుల్స్, అవళ్ పావమ్, నినైకథ నాళిళ్లయ్ తదితర సినిమాలు నిర్మించారు. 1991లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ'తో దర్శకుడిగా మారారు. అనంతరం 'ఉనర్కిగళ్' తీశారు. దీంతో పాటు పలు చిత్రాలకు కథలు కూడా అందించారు.నటుడిగానూ తునివు, బకాసురన్ లాంటి సినిమాలతో పాటు పలు వాటిలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం దర్శకుడిగా ఉన్నారు. ఇకపోతే రాజన్.. బహిరంగ వేదికలపై చేసే సంచలన వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆడియో లాంచ్లు, మూవీ ఈవెంట్స్లో నటుల భారీ పారితోషికాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలోని అక్రమాల గురించి ఘాటుగా స్పందించేవారు. అలాంటి ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా) -
పేరెంట్స్ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..!
సినీ రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్కుమార్ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..పేరెంట్స్ విడాకులుశరత్కుమార్, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్కుమార్ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది. ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పుఅయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.మళ్లీ పెళ్లి చేయాలని..అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎవరినీ దగ్గరకు రానివ్వనుఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్మెంట్ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది. శరత్కుమార్ రెండో పెళ్లివరలక్ష్మీ శరత్ కుమార్ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్రౌండర్గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్కుమార్, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్ సంతానం.చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి -
అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది ప్రారంభంలో గుడ్న్యూస్ చెప్పాడు. భార్య ప్రియ రెండోసారి గర్భం దాల్చిందని వెల్లడించాడు. కుమారుడు మీర్తో ఆడుకునేందుకు ఓ బుజ్జి బేబీ ఇంట్లోకి రాబోతుందని శుభవార్త చెప్పాడు. అంతలోనే ఏప్రిల్ 20న పాప పుట్టిందని ప్రకటించాడు. తాజాగా పాప పేరును వెల్లడించాడు.కూతురి నామకరణంమీర్, ప్రియ.. ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ (MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి అభిమానులు అట్లీ జంటకు కంగ్రాట్స్ చెప్తూ పాప పేరు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు.టాప్ డైరెక్టర్గా..అట్లీ విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఫేమస్ అయ్యాడు. విజయ్కు తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో సూపర్ హిట్లు అందించాడు. షారూఖ్ ఖాన్కు జవాన్తో బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్తో రాకా మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. Our art of love now has a name 💕🧿MIYOU — beauty, gentleness & loveWith luv , MEER , PRIYA & ATLEE 💕🧿 pic.twitter.com/hoUi9D5Fw9— atlee (@Atlee_dir) May 17, 2026చదవండి: చేయి కోసుకుని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదా? ఆర్తి రవి తల్లి ఫైర్ -
చేయి కోసుకుని బ్లాక్మెయిల్ చేసింది నువ్వు కాదా? హీరోపై అత్త ఫైర్
కట్టుకున్న భార్య ఆర్తిని కాదనుకున్నాడు. సింగర్ కెనీషాతో ప్రేమలో పడ్డాడు. విడాకులు మంజూరవకముందే ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసరికి జనం ఛీకొట్టారు. విపరీతమైన ఆన్లైన్ ట్రోలింగ్ తట్టుకోలేక ప్రేయసి వదిలేసింది. దీంతో ఒంటరివాడైపోయాడు తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి.పెళ్లి తర్వాత నరకంఆ బాధ తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చాడు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు. నటి వల్ల జీవితం నాశనంశారీరకంగా, మానసికంగా హింసించి చంపేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితాన్ని నాశనం చేసిందన్నాడు. ఈ ఆరోపణలపై ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయకుమార్ స్పందించింది. అతడికి పిల్లల్ని దూరం చేస్తున్నారన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదంది. పైగా 2009లో రవి- ఆర్తిల పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించింది. బ్లాక్మెయిల్ చేసింది అతడే..ఆమె మాట్లాడుతూ.. '2008లో వికటన్ మ్యాగజైన్లో ఓ ఇంటర్వ్యూ వచ్చింది. దానికోసం నేను వెతుకుతున్నాను. అందులో ఆర్తిని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టిందెవరు? చేతి మణికట్టు కోసుకుని బ్లాక్మెయిల్ చేసిందెవరు? అన్నది స్పష్టంగా ఉంది. తన డబ్బు వాడుకోనిస్తున్నామా? లేదా? అన్నది కోర్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చింది' అని తెలిపింది.ఆ నటి హస్తం లేదురవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు సుజాత ఇలా స్పందించింది. 'తమిళనాడులో ఏ మహిళకు అన్యాయం జరిగినా అందరూ మాట్లాడతారు. లక్షలాది మంది ఆర్తి పోస్టులకు కామెంట్లు పెట్టారు. కేవలం ఫలానా వ్యక్తులే ఆర్తి వెంట ఉండి ఇదంతా చేస్తున్నారనడం పూర్తిగా అబద్ధం. పెళ్లిప్రస్తుతం ఈ విడాకుల కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అంది. కాగా రవి మోహన్- ఆర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. కాగా రవిమోహన్ దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు.చదవండి: త్రిష కోసం ఆ పని చేశా.. చెప్పాలంటే భయంగా ఉంది: చిన్మయి శ్రీపాద -
'అందుకే స్టాలిన్ను కలిశా.. విజయ్పై ద్వేషం లేదు'.. రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై ఆయన మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. స్టాలిన్ నాకు మంచి స్నేహితుడని.. ఎన్నికల్లో ఓటమి తర్వాత అందుకే వెళ్లి కలిశానని అన్నారు.కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే స్టాలిన్ను కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. హీరో విజయ్ సీఎం కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాకు ఎవరిపైనా ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్ను గెలిపించాలని రజినీకాంత్ స్పష్టం చేశారు.ఎన్నికల ఫలితం తర్వాత స్టాలిన్ను కలవడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో తాను స్టాలిన్ను కలవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సీఎం అయినందుకు నాకేలాంటి అసూయ లేదన్నారు. కమల్హాసన్ సీఎం అయితే అసూయపడేవాడిని.. కానీ విజయ్ సీఎం అయ్యాడని తెలిసి మొదట షాక్కు గురైనట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడని నమ్మారని రజినీకాంత్ తెలిపారు. సింగిల్గా పోటీచేసి రెండు పెద్ద పార్టీలపై గెలిచాడని ప్రశంసించారు. నన్ను విజయ్తో పోల్చడం కరెక్ట్ కాదని.. నాకు, అతనికి 28 ఏళ్ల వ్యత్యాసముందని రజినీ స్పష్టం చేశారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
త్రిష కోసం ఆ పనిచేశా.. చెప్పాలంటే భయంగా ఉంది!
చిన్మయి శ్రీపాద.. పాటలు పాడటమే కాదు, ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తూ ఉంటుంది. అలా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో త్రిషకు కూడా తనే గొంతు అరువిచ్చింది. కానీ, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి భయమేసిందంటోంది చిన్మయి. ఈమేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.నిజంగా భయపడ్డా..'మీకు ఈ విషయం ఎలా చెప్పాలా? అని నన్ను నేను సిద్ధం చేసుకోవడం కాస్త విచిత్రంగా ఉంది. కరుప్పు సినిమాలో త్రిషకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ మాట చెప్పేందుకు నేను నిజంగా భయపడ్డాను. ఆర్జే బాలాజీ నాకు చాలాకాలంగా తెలుసు. అతడు, అతడి భార్య ఎంతో మంచివాళ్లు. బాలాజీ ఎంతో పట్టుదల, ధృడ సంకల్పంతో ముందుకు సాగే వ్యక్తి. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తాడు. నాకు అతడి గురించి, అతడి కుటుంబం గురించి బాగా తెలుసు. అందుకే అతడి గురించి భయపడ్డాను. వెక్కివెక్కి ఏడ్చా..గతంలో లియో సినిమా(త్రిష కోసం డబ్బింగ్ చెప్పినందుకు) విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి అతడికి ఎలాంటి వ్యతిరేకతలు ఎదురవుతాయోనని ఆందోళన చెందాను. ఆ మూవీలో కొన్ని సీన్స్కు డబ్బింగ్ చెప్పేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చిన విషయం నాకు బాగా గుర్తుంది. నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. గతంలో జరిగిందంతా మళ్లీ నా కళ్లముందు కదులుతున్నట్లే అనిపించింది.థాంక్యూ బాలాజీఏదేమైనా ఈ సినిమాలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్నిచ్చినందుకు థాంక్యూ బాలాజీ. నా సొంతగడ్డపై ఎటువంటి బెరుకు లేకుండా, తర్వాత ఏం జరుగుతోందనన్న భయం లేకుండా నా పని నేను ధైర్యంగా చేసుకునే శక్తిని ఆ కరుప్పు సామి ఇస్తాడని ఆశిస్తున్నాను. ఏళ్ల తరబడి పని చేసుకోకుండా నిషేధించబడ్డ నాకు, నాలాంటి బాధితులను దేవుడు అనుగ్రహించుగాక!' అంటూ #KaruppuBlockbuster అనే ట్యాగ్ జత చేసింది చిన్మయి.చిన్మయిపై బ్యాన్2018లో మీటూ ఉద్యమ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధా రవిపై చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తమిళనాడులోని 'సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్' (SICTADAU) చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేసి నిషేధం విధించింది. ఆమెపై బ్యాన్ ఉన్నప్పటికీ లోకేశ్ కగనరాజ్ లియో (2023) మూవీలో త్రిషకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని చిన్మయికి ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి కరుప్పులో త్రిషకు తనే డబ్బింగ్ చెప్పింది. Strange I am readying myself saying this... I was genuinely afraid this time, of sharing that I dubbed in Karuppu. I have known R J Balaji a long time - he and his wife, are such lovely people and RJB himself, is someone whose entire life is such a story of grit,…— Chinmayi Sripaada (@Chinmayi) May 16, 2026 చదవండి: విజయ్- త్రిషలపై చీప్ ప్రశ్న.. రాజాసాబ్ బ్యూటీ ఆగ్రహం -
విజయ్-త్రిషలపై చీప్ ప్రశ్న.. మండిపడ్డ రాజాసాబ్ బ్యూటీ
నువ్వు తలుచుకుంటే అవుద్ది సామీ... ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, విజయ్ జీవితంలో జరిగిన అద్భుతం. రాజకీయాల కోసం సినిమాలు వదిలేసిన ఆయన.. సీఎం అవాలన్న కసితో పని చేశాడు. మొదటి ప్రయత్నంలోనే తిరుగులేనివాడిలా గెలుపు పతాకం ఎగరవేశాడు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయన ప్రయాణాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అనుచిత ప్రశ్నఇదే సమయంలో సీఎం విజయ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొందరు హీరోయిన్ త్రిష పేరును కూడా లాగుతున్నారు. తాజాగా ఓ ఈవెంట్కు వెళ్లిన హీరోయిన్ మాళవిక మోహనన్ను సైతం అటువంటి ఇబ్బందికర ప్రశ్నలడిగారు. ఈమధ్య త్రిష ఎక్కడికి వెళ్తే విజయ్ అక్కడికి వెళ్తున్నారు. ఆయనతో కలిసి ప్రయాణించడం ఎలాగో మీకేమైనా ఐడియా ఉందా? అని అడిగారు. ఈ ప్రశ్న విని చిర్రెత్తిపోయిన మాళవిక.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అంటూ మండిపడింది. సంచలనం కోసం..ఈ విషయంలో పలువురు నెటిజన్లు మాళవికకు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా ఈ వివాదంపై మాళవిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'నేను ఒక ఈవెంట్కు వెళ్లాను. నాకు తమిళనాడు మీడియా, జర్నలిస్టులపై అపారమైన గౌరవం ఉంది. కానీ, వారిలో కొందరు సంచలనం కోసం పదేపదే ఇబ్బందికర, అసహ్యమైన ప్రశ్నలడిగారు. విజయ్ నాకు ఏడేళ్లుగా పరిచయం. అద్భుతంఆయనపై నాకెంతో గౌరవం ఉంది. తనను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నటుడి నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి. ఇక చెప్పొచ్చేదేంటంటే.. భవిష్యత్తులో జరిగే మీడియా సమావేశాల్లో అయినా అందరి గౌరవమర్యాదలు కాపాడుతూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేసింది.సినిమామాళవిక మోహనన్ 2013లో తన సినీకెరీర్ ప్రారంభించింది. సొంత భాష అయిన మలయాళంలో పట్టం పోలే చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. విజయ్తో కలిసి మాస్టర్ సినిమాలో నటించింది. ది రాజాసాబ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2, పాకెట్ నోవెల్ అని రెండు సినిమాలు చేస్తోంది. I went for an event yesterday, and while I have the utmost regard for all the journalists and members of the Tamil Nadu media, a couple of them persistently asked some very distasteful questions that were completely unnecessary and sensational.Thalapathy Vijay is someone I’ve…— Malavika Mohanan (@MalavikaM_) May 16, 2026 చదవండి: టాలీవుడ్లో స్పెషల్ ఎంట్రీ -
భక్తి పాట రాసిన హీరో శివకార్తికేయన్
తమిళ స్టార్ శివకార్తికేయన్కు ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోందని చెప్పవచ్చు. ఈయన కథానాయకుడిగా నటిస్తూనే నిర్మాతగా ఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై పలు వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మిస్తూ, ఇతరులు నిర్మించిన మంచి కంటెంట్తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. అలా ఈయన ఇటీవల నిర్మించిన తాయ్కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా, నిర్మాతగా విజయాలను అందుకుంటున్న ఈయనలో మంచి గాయకుడు, గీత రచయిత కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీయన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ రంగంలోకి అడుగు పెట్టారు. వేలుమ్ మయిలుమ్ అంటూ సాగే భక్తిరస పాటకు లిరిక్స్ అందించారు. ఈ ప్రైవేట్ మ్యూజికల్కు నివాస్ కే. ప్రసన్న సంగీతాన్ని అందించి, పాడారు. దీన్ని తాయ్ కిళవి ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేశాడు. ఇలాంటి ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్లు ఈ సంస్థ నుంచి మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే శివకార్తికేయన్.. మురుగేశన్ దర్శకత్వంలో 'సెయోన్' చిత్రంలో నటిస్తున్నారు. -
నువ్వు హీరోయిన్వా లేదా.. : నటికి అసభ్యకర మెసేజ్, ట్విస్ట్ ఏంటంటే?
ఈ మధ్య సోషల్ మీడియాలో సీటీ నటులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు షేర్ చేసే ఫోటోలపై బూతు కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది తారలు వీటిని పట్టించుకోవడం లేదు. వారి కామెంట్స్పై స్పందిస్తే..మరింత ట్రోల్ చేస్తారని.. లైట్ తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు కొంతమంది ఆకతాయిలకు బలంగా మారింది. ఎలాంటి కామెంట్స్ పెట్టినా.. పట్టించుకోరని ఇష్టం వచ్చినట్లుగా, పచ్చి బూతులతో కామెంట్స్ పెట్టి శునకానందం పొందుతున్నారు. అయితే అలాంటి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది కన్నడ నటి చైత్ర. తనపై వల్గర్ కామెంట్ చేసిన ఓ నెటిజన్కు గట్టి బుద్ది చెప్పింది.పోలీసు డ్రెస్ డీపీతో..సప్తసాగరాలు దాటి, 3బీహెచ్కే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర జే ఆచార్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోపై పోలీస్ డ్రెస్లో ఉన్న ఫోటోని ప్రొఫైల్ పిక్చర్, ‘@hosamani53’ అనే హ్యాండిల్తో ఉన్న ఆ అకౌంట్ నుంచి ‘అసలు నువ్వు హీరోయిన్వా లేక సె** వర్కర్వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో’ అంటూ కన్నడ భాషలో అసభ్య పదజాలంతో కామెంట్ చేశారు. ఈ కామెంట్ని చైత్ర స్క్రీన్షాట్ తీసి.. సోషల్ మీడియా వేదికగా బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీసులు.. ఈ అకౌంట్ మీ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తిదే అనుకుంటా. దయచేసి ఇతనికి మీరే సమాధానం చెప్పగలరా?’ అని సింగర్ చైత్ర ప్రశ్నించారు.భయపడి క్షమాపణలుచైత్ర చేసిన పోస్ట్తో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. సదరు ప్రొఫైల్ పిక్చర్లో ఉన్న వ్యక్తి నిజంగానే పోలీస్ శాఖలో పనిచేస్తున్నాడా? లేక ఖాకీ యూనిఫామ్ ఫోటో పెట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడా? అనే కోణంలో అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఈ విషయం తెలిసి సదరు నెటిజన్ వెంటనే తాను పెట్టిన కామెంట్ని డిలీట్ చేశాడు. అంతేకాదు కామెంట్ సెక్షన్లోనే నటి చైత్రకు క్షమాపణలు చెబుతూ మెసేజ్ పెట్టాడు. ఈ విషయమై ఒక సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇలాంటి అసభ్య కామెంట్లు పెట్టడం నేరమే. అయితే సదరు వ్యక్తి మా డిపార్ట్మెంట్కు చెందినవాడు కాదు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదు, కానీ సదరు వ్యక్తి తన తప్పు తెలుసుకుని నటికి క్షమాపణలు చెప్పాడు’అని స్పష్టం చేశారు. -
రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక సింగర్ బ్రేకప్!
తమిళ హీరో రవి మోహన్.. భార్య ఆర్తితో తెగదెంపులు చేసుకుని సింగర్ కెనీషా ఫ్రాన్సిస్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. విడాకులు మంజూరు కాకముందే సింగర్తో షికార్లు చేస్తుండటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ కెనీషా ఫ్రాన్సిస్యే.. రవిమోహన్ దంపతుల విడాకులకు కారణమని ఆమెను నెటిజన్లు దుయ్యబట్టారు.వదిలేస్తున్నా..ఇటీవల మీన్కులతి భగవతి ఆలయ ఉత్సవాల్లో రవితో కలిసి కెనీషా స్టేజ్ షేర్ చేసుకోవడంపై తీవ్రంగా విమర్శించారు. ఈ ఆన్లైన్ ట్రోలింగ్తో కలత చెందిన కెనీషా సంచలన నిర్ణయం తీసుకుంది. రవిని వదిలేస్తున్నా.. అతడిని కాపాలనుకోవడం నా మూర్ఖత్వం అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. రవి- ఆర్తిల 15 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి తాను కారణం కాదని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాకు, మ్యూజిక్కు గుడ్బై చెబుతూ.. చెన్నై వదిలి వెళ్లిపోతున్నట్లు ప్రకటించింది.నావల్ల కావట్లేదుఈ పోస్ట్తో వీరి ప్రేమ ముగిసినట్లేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై రవి మోహన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! దీనికంటే ముందు కూడా కెనీషా తన గతాన్ని గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో వేధింపులకు గురయ్యానంది. 18 ఏళ్లకే పెళ్లి చేయగా భర్త కూడా టార్చర్ పెట్టాడంది. వివాహమైన నాలుగు నెలలకే గర్భం దాల్చినప్పటికీ అతడి చిత్రహింసల వల్ల బిడ్డను కోల్పోయానంది. తర్వాత అమ్మను కోల్పోవడం.. అనంతరం అల్జీమర్స్ (మతిమరుపు)తో బాధపడుతున్న నాన్నను కోల్పోవడం తనను కుంగతీశాయంది.స్నేహం మాత్రమే..ఆ సమయంలో బార్కు వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టానంది. ఒక ఆడియోలాంచ్లో రవిమోహన్ కలిశాడని, అక్కడే తమకు పరిచయం ఏర్పడగా స్నేహానికి దారి తీసిందని తెలిపింది. అయితే అతడి కుటుంబాన్ని విడగొట్టాలన్న ఉద్దేశం తనకెప్పుడూ లేదని పేర్కొంది. ఇంతలోనే ఈ ట్రోలింగ్ తన వల్ల కావడం లేదని.. తన ప్రేమను ఎవరూ నమ్మడం లేదంటూ అతడిని వదిలేస్తున్నానని కెనీషా పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Keneeshaa (@keneeshaa1) చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీనస్థితిలో పావలా శ్యామల -
సూర్యకు భారీ పారితోషికం.. త్రిషకు మాత్రం ఇదే చివరిసారి!
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "కరుప్పు". తెలుగులో ఈ మూవీ 'వీరభద్రుడు' పేరిట విడుదలైంది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. దీన్ని ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. సినిమా పాజిటివ్ టాక్ అందుకుంటున్న నేపథ్యంలో ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారో చూసేద్దాం...పారితోషికంకోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం హీరో సూర్య రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట! త్రిష రూ.5 కోట్లు, ఆర్జే బాలాజీ రూ.4 కోట్లు పుచ్చుకోగా కమెడియన్ యోగిబాబు రూ.2 కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. నటుడు ఇంద్రన్స్ రూ.80 లక్షలు అందుకున్నాడని సమాచారం. స్వసికకు రూ.40 లక్షలు, జార్జ్ మరియన్కు రూ.30 లక్షలు ముట్టజెప్పారని భోగట్టా!తర్వాతి నుంచి..ప్రస్తుతం రూ.5 కోట్లతో సరిపెట్టుకున్న త్రిష తన తర్వాతి సినిమాకు మాత్రం పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్- రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేసేందుకుగానూ ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేసినట్లు వినికిడి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ బ్యూటీని సినిమాలో పెట్టుకునేందుకు అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సైతం రెడీ అంటున్నారట! ఈ లెక్కన త్రిష తక్కువ పారితోషికం తీసుకున్న చివరి తమిళ సినిమాగా 'వీరభద్రుడు' మిగిలిపోనుందన్నమాట!చదవండి: వీరభద్రుడు మూవీ రివ్యూ -
హీరోగా స్టార్ డైరెక్టర్.. ట్రైలర్ రిలీజ్
ఖైదీ, విక్రమ్ చిత్రాలతో టాలీవుడ్లోనూ క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ప్రస్తుతం దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ డీసీ. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీ హీరోయిన్గా కనిపించనుంది.ఈ సినిమాకు అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో చంద్ర (వామికా గబ్బీ) అనే యువతికి సపోర్ట్గా నిలిచే దేవదాస్గా లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
కొత్త సీఎంకు ఫోన్ చేసిన మెగాస్టార్.. ఏ సలహా ఇచ్చారంటే?
తమిళనాడు సీఎం విజయ్కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ను అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రజాకేంద్రీకృత పాలనతో తమిళనాడు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మెగాస్టార్ సూచించారు. దివంగత మహానేత ఎంజీఆర్లా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు.చిరంజీవి మాటలకు సీఎం విజయ్ కూడా స్పందించారు. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు చిత్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. మిమ్మల్ని తెరపై చూడటం ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. జననాయగన్ పైరసీ విషయంలో సపోర్ట్ చేసినందుకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిరంజీవి రాబోయే చిత్రానికి విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
'విజయ్ని అడిగామని చెప్పండి..' త్రిష రియాక్షన్ చూశారా?
కోలీవుడ్ హీరోయిన్ త్రిష తాజాగా కరుప్పు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ విడుదలైంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా త్రిష చెన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. మూవీ వీక్షించిన అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో అక్కడే ఫ్యాన్స్.. ఆమె కారును చుట్టుముట్టారు. దీంతో ఒకరు విజయ్ని అడిగామని చెప్పండని త్రిషను అడిగారు. ఇది విన్న త్రిష చిరు నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. "Thalapathy ah kettenu sollunga"Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn— Deepu (@deepu_drops) May 15, 2026 -
షూటింగ్ సెట్లో విషాదం.. జైలర్-2 సిబ్బంది మృతి
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న జైలర్-2 సెట్లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో సిబ్బంది మృతి చెందారు. చెన్నైలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో ఈ ఘటన జరిగింది. మృతున్ని చిత్రబృందంలో పనిచేస్తోన్న కార్తికేయన్గా గుర్తించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం కార్తికేయన్ ఆర్ట్ డైరెక్షన్ యూనిట్లో పనిచేస్తున్నారు. తన పనిలో భాగంగా షూటింగ్ కోసం ఇంటి సెట్ను నిర్మించడంలో సహాయం చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పనైయూర్లోని స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ లీక్కు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.కాగా.. ఇటీవలే 'జైలర్ 2' షూటింగ్ పూర్తయిందని సన్ పిక్చర్స్ ప్రకటించిన కొన్ని వారాల తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో వచ్చిన జైలర్కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూన్ 12న విడుదల అవుతుందని మొదట ప్రకటించినప్పటికీ... సన్ పిక్చర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని కృష్ణాష్టమి కానుకగా సెప్టెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా కీలక పాత్రల్లో నటించారు. -
సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు: కరూర్ బాధితురాలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు ఏకంగా సీఎం పీఠం ఎక్కారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. ఫుల్ మెజారిటీ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో తీవ్ర విషాదం జరిగిన సంగతి తెలిసిందే.విజయ్ సభకు వచ్చిన తొక్కిసలాటలో దాదాపు 41 మంది మరణించారు. ఈ తీవ్ర విషాదం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. ఆ సమయంలో విజయ్పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. కరూర్ సభలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తాజాగా విజయ్ సీఎం కావడంతో కరూర్ తొక్కిసలాట బాధితులతో ప్రముఖ మీడియా మాట్లాడింది.ఈ ఘటనలో బిడ్డను కోల్పోయిన తమను విజయ్ పరామర్శించారని తల్లిదండ్రులు తెలిపారు. ఆ సమయంలో విజయ్ మా ఇంటికి వచ్చి నా కాళ్లపై పడ్డారని బాలిక తల్లి చెప్పారు. ఈ ఘటన తర్వాత మాకు అండగా నిలిచారని వెల్లడించారు. మార్పు కోసమే ఆయనకు ఓటేశామని అన్నారు. గత సెప్టెంబరులో విజయ్ కరూర్ సభలో తొక్కిసలాట జరిగింది. మరి ప్రస్తుతం విజయ్ సీఎం కావడంతో కరూర్ ఘటన బాధితులను ఆదుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. -
దేశవ్యాప్తంగా రయ్ రయ్మంటూ ‘పెద్ది’ ప్రచారం!
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్ రయ్ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్ చేసినట్లు యూనిట్ ప్రకటించింది. ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్ ఉప్పల్లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ చేశారు. దీనికి కూడా చరణ్ హాజరవుతాడు. ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్లో స్పెషల్ సాంగ్ రిలీజ్ జరగనుంది. మొదట భోపాల్లోనే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్, చరణ్పై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ను భోపాల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్కు చరణ్ హాజరవ్వడం లేదట. శృతిహాసన్ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. అలాగే జూన్ 2న హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్స్తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది. ప్రస్తుతానికి యూనిట్ అనుకుంటున్న ప్రమోషనల్ ప్లాన్ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్ రయ్మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కరుప్పు మూవీ వాయిదా.. ఆందోళనకు దిగిన ఫ్యాన్స్
తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by MUBARAK🇮🇳 (@mubaraksvlog) -
'ఇది అంతం కాదు.. ఆరంభం'.. ఫుల్ వయొలెంట్గా కేడీ ట్రైలర్
కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తోన్న చిత్రం కేడీ ది డెవిల్. ఈ మూవీకి ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేడీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలోనే ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో శిల్పా శెట్టి, సంజయ్ దత్ పాత్రలు హైలెట్గా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్లో ఇది అంతం కాదు.. ఆరంభం అనే డైలాగ్ ఆడియన్స్ను మరింత ఆకట్టుకుంటోంది.ఇటీవల ఈ మూవీలో ఓ సాంగ్ హిందీ వర్షన్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. లిరిక్స్ విషయంలో బూతుపదాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలొచ్చాయి. దీంతో ఈ సినిమాలోని ఆ పాటను అన్ని సోషల్ మీడియా వేదికల్లోనూ తొలగించారు. మరి ఈ సాంగ్ తెలుగు వర్షన్ ఉంటుందో.. లేదో సినిమా రిలీజ్ అయితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. కాగా.. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు. -
చిక్కుల్లో సూర్య సినిమా.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) నేడు(మే 14) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా... అనూహ్యంగా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అంతేకాదు ఆమెరికా షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. మార్నింగ్ షోలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి అనుమతి వచ్చినా కూడా ఎందుకు రిలీజ్ కాలేదు? అసలు సమస్య ఏంటి? వివరాల్లోకి వెళితే..సూర్య,త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రానికి ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. మార్నింగ్ షోల కోసం సీఎం విజయ్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. విజయ్ సీఎం అయ్యే ముందు వరకు తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు. పదకొండున్నర గంటలు దాటిన తర్వాత థియేటర్లలో బొమ్మ పడేది. విజయ్ వచ్చాక ఉదయం తొమ్మిది గంటలకు షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశారు. అయినా కూడా మార్నింగ్ షోలు పడలేదు. కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. రూ. 10 కోట్ల బకాయిలు.. ఏ సినిమా అయినా సరే.. విడుదలకు ముందే ఫైనాన్స్ క్లియర్ చేయాలి. లేదంటే షోలను నిలిపివేస్తారు.లీగల్ సమస్యలు కూడా వస్తాయి. కరుప్పు విషయంలో ఇప్పుడిదే జరిగింది. సినిమాకు సంబంధించిన ఫైనాన్స్ని పూర్తిగా క్లియర్ చేయకుండానే రిలీజ్కి వచ్చారట. రూ. 10 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదట. దీనిపై బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు జరిపిన చర్చలన్నీ విఫలం అవ్వడంతోనే మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇవి పరిష్కారమైతేనే తదుపరి షోలు ప్రదర్శించే అవకాశం ఉంది.నా దగ్గర సమాధానం లేదు : ఆర్జే బాలాజీమార్నింగ్ షో రద్దుపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఎక్స్వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ‘సూర్య అభిమానులకు నేను క్షమాపణలు కోరుతున్నా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. సినిమా విడుదలకు ముందు ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల షోలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా కచ్చితంగా విడుదలవుతుంది. మీరందరూ పడుతున్న ఇబ్బందికి నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి సాయంత్రం షో అయినా పడుతుందా లేదా రిలీజ్ వాయిదా పడుతుందో చూడాలి. #RjBalaji's Very Emotional video..🥲"I'm really sorry.. It shouldn't have happened.. I didn't expect this too.. I hope all the issues will get resolved and the film will be released this evening at 6PM..❣️ Sorry for making you all go through this..🫂"pic.twitter.com/cCkOyFXfE0— Laxmi Kanth (@iammoviebuff007) May 14, 2026 -
‘కాంచనా -4’: ఈసారి పూజా హెగ్డే, నోరా ఫతేహిలతో రచ్చ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు శాఖల్లో విజయవంతంగా రాణిస్తున్న నటుడు రాఘవ లారెన్స్. ఈయన పలు చిత్రాలు రూపొందించినా కాంచన చిత్రం మైలు రాయిగా నిలిచిపోతుంది. హర్రర్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో ఈయన రూపొందించిన కాంచన, కాంచన స్వీకెల్స్ అనూహ్య విజయాన్ని సాధించాయి. సాధారణంగా ఒక చిత్రానికి సీక్వెల్ రూపొందితే అది సక్సెస్ కావడమే అరుదుగా మారింది. అలాంటిది రాఘవ అదే జానర్లో వరుసగా మూడు సీక్వెల్స్ రూపొందించి విజయం సాధించారు. తాజాగా నాలుగో సీక్వెల్తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. కాంచన–4గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తన రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తూ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో క్రేజీ నటీమణులు పూజాహెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరాఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని తమిళనాడులో సన్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుండడం విశేషం. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. అందులో కండలు తిరిగిన సిక్స్ప్యాక్ బాడీతో రాఘవ లారెన్న్స్ నిలబడి ఉండగా వెనుక ఆయన మరో రూపం, చుట్టూ భూతాల ముఖాలు ఉన్నాయి. అలా బీభత్సంగా ఉన్న ఆ పోస్టర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. -
శర్వానంద్–శ్రీను వైట్ల క్రేజీ కాంబో.. హీరోయిన్గా మానస!
శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పుడు కామెడీ కింగ్ శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్ను ఖరారు చేశారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో కూడిన ఈ సినిమా వినోదానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించబోతున్నట్లు సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో జులై 2026 నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నటించబోయే హీరోయిన్గా మొదట పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా తాజా సమాచారం ప్రకారం ‘మిస్ ఇండియా’ రన్నరప్ మానస వారణాసి ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాలో తన నటనతో మానస మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో మానస, శర్వాతో జోడీ కట్టడం ఫ్రెష్ ఫీల్ను తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. త్వరలోనే హీరోయిన్తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 1960ల నాటి పీరియడ్ డ్రామా ‘భోగి’ షూటింగ్లో శర్వానంద్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ స్టోరీని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. ఇందులో రోహిత్ పాఠక్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. 'భోగి' చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. -
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ మిస్టర్ ఎక్స్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ అభిమానులకు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ ముఖ్యపాత్రల్లో నటించారు.మిస్టర్ ఎక్స్ కథేంటంటే..1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)ఉదయనిధి.. విజయ్పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి) View this post on Instagram A post shared by ETamil News (@etamilnewsig) -
విషాదం.. గుండెపోటుతో 47 ఏళ్ల నటుడు మృతి!
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్(47) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం తన ఇంట్లో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించారని ధ్రువీకరించారు. దిలీప్ మరణవార్త కన్నడ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.2007లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన మిలానా చిత్రంలో దిలీప్కి మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘యు-టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. వెండితెరపైనే కాదు.. హిట్లర్ కళ్యాణ వంటి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు.నటుడిగా కాకుండా నిర్మాతగా రాణించారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్పై టీవీ సీరియళ్లను నిర్మించారు. ఆయన అకాల మృతితో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. -
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్కి బిగ్షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
పూజా హెగ్డే ‘అందాల’ అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ఎవరేమనుకున్నా కథానాయికల్లో 99 శాతం మంది గ్లామర్ తోనే గుర్తింపు పొందాలని భావిస్తారు. అవకాశాల వేటకు గ్లామరస్ ఫొటోలనే వాడుతుంటారు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదనే సాహసం ఎవరు చేయలేరు. అందాల పోటీల్లో పాల్గొని ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసిన బ్యూటీ ఈమె. 2012 లో ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా, ఈ అమ్మడి పేరు వెలుగులోకి వచ్చింది. అలా టాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నారు. అక్కడ మొదట్లో యువ హీరోలతో జత కట్టి, ఆ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖ హీరోలతో నటించి స్టార్ డమ్ను పొందారు.అయితే ఆ మధ్య పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్కడ డిమాండ్ తగ్గింది. అదే విధంగా హిందీలో నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. కోలీవుడ్లోనూ ఈ భామకు అదే పరిస్థితి. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారు. అందులో భాగంగా తన ఆదిలో తీసుకున్న గ్లామరస్ ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నెటిజన్ల విమర్శలను గట్టిగానే ఎదుర్కొంటున్నాయి. ఇంతకు రెట్రో వంటి చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే నేనా ఈమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘పూజాహెగ్డే కాస్తయినా సంసార పక్షంగా కనిపించేది ఇక్కడేననీ(సౌత్ సినిమాల్లో), బాలీవుడ్లో అయితే వేరే లెవెల్ అంటూ తన ఎక్స్ఫోజింగ్ ఫొటోల గురించి చాలా బోల్డ్గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్ క్రియేట్ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో కోలీవుడ్లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.తదుపరి దళపతి ఎవరు?విజయ్ తర్వాత కోలీవుడ్లో అంతే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్లో మాస్ ఇమేజ్ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. -
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
విజయ్ సీఎం.. జన నాయగన్కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
గతంలో తెలుగు సినిమాలని అవమానించి ఇప్పుడేమో!
తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb— Meher Kilaru (@Kilaruness) May 11, 2026 -
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి భావననే దర్శకుడు విఘ్నేశ్ శివన్ వ్యక్తం చేశాడు. నయనతార భర్త అయిన ఇతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించారు. ఎస్జే.సూర్య విలన్. నయనతార రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించాడు. కాగా గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రదీప్ రంగనాథన్ చేసిన గత చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎల్ఐకే ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఈ క్రమంలోనే చిత్ర ఫలితంపై విఘ్నేశ్ తాజాగా స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)నేను ఓ డ్రీమ్తో వచ్చాను. అది చిన్నది కాదు. ఈ మూవీ స్టోరీ కోట్ల థియేటర్లలో అదిరిపోతుందని నమ్మాను. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. ఎంటర్టైన్ చేసినప్పటికీ రూ.100 కోట్ల క్లబ్లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా సెట్ అవ్వలేదు. ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఇది విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బ్టస్టర్. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు ఇబ్బందులున్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టిందీ మూవీ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
సైలెంట్గా మొదలు పెట్టేసిన కార్తి
ప్రస్తుతం తెలుగు దర్శకనిర్మాతలు తమిళ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. తమిళ హీరోలు కూడా తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో శివకార్తికేయన్, ధనుష్, విజయ్ తదితరులు తెలుగు దర్శకులతో మూవీస్ చేశారు. సూర్య కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాధ్ అండ్ సన్స్'లో నటించారు. ఇది త్వరలోనే థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇకపోతే సూర్య తమ్ముడు కార్తీ ఇంతకు ముందే నాగార్జునతో కలిసి 'ఊపిరి'లో నటించారు. ఆ చిత్రం తమిళంలో తోళా పేరుతో విడుదలయ్యింది. కార్తీ ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. ప్రస్తుతం సర్ధార్ 2 పూర్తి చేసిన ఇతడు.. తమిళ్ దర్శకత్వంలో 'మార్షల్'లో నటిస్తున్నాడు. దీని తరువాత తెలుగు దర్శకుడు కల్యాణ్ శంకర్ తీస్తున్న ద్విభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు.ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయని ఇందులో కార్తీకి జంటగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నట్లు తెలిసింది. యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులు కారణంగా వెల్లడించలేదని తెలిసింది. ఈ సినిమా డీటైల్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
నమ్మకం ఉంటే మ్యాజిక్ జరుగుతుంది: హీరో సూర్య
‘‘వీరభద్రుడు’ సినిమా తొలి భాగం మంచి కోర్టు రూమ్ డ్రామా. సెకండాఫ్ మంచి థియేట్రికల్ మాస్ మూమెంట్స్... ఫన్, హ్యూమర్ కూడా ఉంటుంది. ఈ నెల 14న మీ అందరికీ ‘వీరభద్రుడు’ సినిమాతో ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమాను ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని అతిథుల్లా కాకుండా దత్తపుత్రుల్లా భావిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని సూర్య అన్నారు. సూర్య, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఎక్కడైతో నమ్మకం ఉంటుందో ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. సమస్యలు వచ్చినప్పుడు గుడికి వెళ్తాను. కానీ ఆర్జే బాలాజీ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్ధిస్తుంటాడు. ఆర్జే మంచి యాక్టర్, రైటర్, డైరెక్టర్, గుడ్ ఫాదర్, ఫ్రెండ్... ఇలా మల్టీ టాలెంటెడ్. భావోద్వేగం అయినా, హాస్యం అయినా ఆయన నిజాయితీతో వర్క్ చేస్తారు.సుప్రియగారితో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. ‘వీరభద్రుడు’ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థతో అసోసియేట్ కావడం మాకు గౌరవప్రదం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో త్రిష–నేను కలిసి నటించాం’’ అన్నారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో కార్తీ మాట్లాడుతూ–‘‘వీరభద్రుడు’ మాస్ మసాలా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అన్నయ్య (సూర్యని ఉద్దేశించి)గారు మాత్రమే చేయగలిగిన సినిమా ఇది. థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ‘వీరభద్రుడు’’ అన్నారు.ఆర్జే బాలాజీ మాట్లాడుతూ– ‘‘వీరభద్రుడు’ సినిమా తమిళ ప్రేక్షకుల కోసమే కాదు... తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని తీశాం. మాకు కరుప్పు స్వామి ఎలాగో మీకు వీరభద్రుడు స్వామి అలా. నేనొక దర్శకుడిగా, సూర్యగారు హీరోగా సినిమా చేస్తానని అనుకోలేదు. సూర్యగారు నన్ను నమ్మడం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్లో సూర్య సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకుడా? అని కొందరు అన్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత నాపై వారికి నమ్మకం కలిగింది’’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి, లిరిక్ రైటర్–సింగర్, యాక్టర్ రాకేందు మౌళి, రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ విక్రమ్ మాట్లాడారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ పాల్గొన్నారు.‘‘ప్రపంచంలో మనల్ని నమ్మేవారు ముందు కొద్ది మందే ఉండొచ్చు. రెండు మూడేళ్ల క్రితం తమిళనాడులోని ఒక వ్యక్తిపై విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరూ నమ్మలేదు. చాలామంది నెగటివ్ ప్రచారం చేశారు. కానీ ఆ వ్యక్తి తనను తాను నమ్మాడు. ఇప్పుడు అతను తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యాడు... గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్గారికి తాను మంచి చేయగలనన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే లక్షలాది తమిళ ప్రజల్లోకి వెళ్లి, వారి చేత ఓట్లు వేయించింది’’ అని ఆర్జే బాలాజీ అన్నారు. -
'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో' డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్గా పాత్రలో కనిపించనున్నారు. -
ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా నెల జీతమెంత?
సినిమాల్లో సక్సెస్ అయిన హీరో విజయ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో మెజార్టీ మార్క్ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రం సెన్సార్ వివాదాలతో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది.కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాకు రూ.200 కోట్లు తీసుకునే విజయ్.. సీఎంగా ఎంత సంపాదిస్తారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తినని స్పష్టం చేసిన విజయ్.. సీఎంగా తనకొచ్చే నెల జీతంతోనే సర్దుకుపోతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కి నెలకు రూ.2,05,000 జీతం అందుకోనున్నారు. సినిమాల్లో ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విజయ్.. ఇకపై ఏడాది కేవలం రూ. 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. తన చివరి మూవీ జన నాయగన్ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల స్ట్రీమింగ్కు వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గత నెల 23న థియేటర్లలో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ మధువిదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఈ నెల 22 నుంచే సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. మధువిధు అంటే హనీమూన్ అని అర్థం కాగా.. ఈ సినిమాకు విష్ణు అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షరఫ్, కల్యాణీ పాణిక్కర్ జంటగా నటించారు. The wedding is locked.So is the chaos.Be there to witness it all unfold on May 22nd. 💥💍#Madhuvidhu streaming from May 22 only on Sony LIV#SonyLIV #SonyLIVSouth #SonyLIVMalayalam#Sharafudheen #KalyaniPanicker pic.twitter.com/p3XaU1QHPN— Sony LIV Malayalam (@SonylivMal) May 11, 2026 -
రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా
షకీలా పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు. 80-90ల్లో చాలా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఈమె.. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కాల క్రమంలో మూవీ ఛాన్సుల రాకపోవడంతో కనుమరుగైపోయింది. మూడేళ్ల క్రితం అంటే తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లోనూ పాల్గొంది. కానీ రెండో వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన షకీలా.. రాధిక 'తాయ్ కిళవి' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నిజంగా చెప్పాలంటే 'తాయ్ కిళవి'లో రాధిక బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది' అని షకీలా చెప్పుకొచ్చింది.సీనియర్ నటి రాధిక లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా 'తాయ్ కిళవి'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రిలీజై హిట్ అయింది. పపుంతాయ్ అనే గడుసు వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ల ఆలోచన మార్పు వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రాధిక 'తాయ్ కిళవి' సినిమా తెలుగు రివ్యూ) -
'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు
'లవ్ టుడే' ఫేమ్ ప్రముఖ నటి రవీనా రవి పెళ్లి చేసుకుంది. గతంలో కలిసి పనిచేసిన దర్శకుడు దేవన్ జయకుమార్తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కేరళకు చెందిన రవీన్ రవి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటి. తల్లి శ్రీజ కూడా నటి కావడంతో ఆరేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2012 నుంచి పూర్తిస్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిపోయింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి ఈమెనే డబ్బింగ్ చెప్పింది. ఓకే బంగారం, ప్రేమమ్ (మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.కేరళలో పుట్టినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా బోలెడన్ని మూవీస్ చేసింది. 2017 నుంచి నటిగా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' మూవీలో హీరోకి అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్తో ప్రేమలో పడింది. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లితో ఒక్కటయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దు : శివకార్తికేయన్
సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతున్న సమయంలో వాటి ద్వారా మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ప్రముఖుల పేర్లతోనో, సంస్థల పేరుతోనో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసమో తాజాగా శివకార్తికేయన్ విషయంలో జరిగింది. ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఈయన 2018లో శివకార్తికేయన్ (ఎస్కే) ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, పలువురు నూతన దర్శకులకు అవకాశాలు కల్సిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా మంచి కథలతో రూపొందిన చిన్న చిత్రాలను విడుదల చేస్తున్నారు. తాజాగా అమ్మాముత్తు సూర్య దర్శకత్వంలో నిర్మిస్తున్న త్వరలో తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్న విషయం శివకార్తికేయన్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో తమ సంస్థ నిర్మించే చిత్రాల కోసం నటీనటులను ఎంపిక చేయడానికి దర్శకులనో, నిర్వాహకులనో, కాస్టింగ్ ఏజెంట్లనో, మరెవరినో ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ఎస్కే ప్రొడక్షన్స్ పేరుతో విడుదలయ్యే వివరాలతో కూడిన ప్రకటనలను తమ అధికారిక సామాజిక మాధ్యమాలతో ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర ఏ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని శివకార్తికేయన్ పేర్కొన్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరును మోసపూరితంగా ఉపయోగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం. సందీప్ వంగా గతంలో 'యానిమల్'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్ఫుల్గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. -
దేవుడు-లాయర్గా సూర్య.. కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. గత రెండు చిత్రాలు 'కంగువ', 'రెట్రో' అయితే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో కాస్త భిన్నంగా చేద్దామని ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ కమర్షియల్ రూట్లోకి వచ్చేశాడు. అలా చేసిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం(మే 14) థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ట్రైలర్లోనే దాదాపు స్టోరీ ఏంటనేది చెప్పేసే ప్రయత్నం చేశారు. ఓ కోర్టు. అందులో విలన్(ఆర్జే బాలాజీ), హీరోయిన్(త్రిష) లాయర్స్గా పనిచేస్తుంటారు. న్యాయం అంటూ ఎవరొచ్చినా సరే తిప్పించుకుంటూ ఉంటారు. దీంతో దేవుడు అయిన హీరో(సూర్య) లాయర్గా వస్తాడు. అటు సామాన్యులకు న్యాయం చేయడంతో పాటు విలన్ బెండు ఎలా తీశాడనేది కథలా అనిపిస్తుంది.సూర్య, త్రిష హీరోహీరోయిన్లు కాగా.. దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్గానూ చేశాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు ట్రైలర్ కూడా వదులుతారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, హీరో విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర విషయాల వల్ల సూర్య సినిమాపై కనీస బజ్ లేకుండా పోయింది. మరి ఇదైనా సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
ఈ చిన్నారిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
చిన్నప్పటి జ్ఞాపకాలే మన జీవితంలో వెలకట్టలేనివి. అలాంటి మధుర జ్ఞాపకాలు ఒక్కటున్నా సరే చూసుకుని తరించిపోతాం. మన చిన్నప్పటి ఫోటోలను చూస్తే అసలు నేనేనా అక్కడ అన్నంతలా ఫీలైపోతాం. మన జీవితంలో ఎప్పుడైనా బాల్యం నాటి ఫోటోలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే షేర్ చేసేస్తుంటాం. తాజాగా స్టార్ హీరోయిన్ ఇవాళ తన చిన్నప్పటి క్యూట్ పిక్ను షేర్ చేసింది. మాతృ దినోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోలు పంచుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ చూసేద్దాం పదండి.గతేడాది రిలీజైన కాంతార మూవీతో ఒక్కసారిగా అందిరినీ తనవైపు తిప్పుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. తన అందం, నటనతో కాంతార చిత్రంలో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఏడాది యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్లో కనిపించనుంది. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్లో కనిపించనుంది. ఇవాళ మదర్స్ డే కావడంతో అమ్మతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్
కోలీవుడ్ హీరో విజయ్కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది.విజయ్తో త్రిష రిలేషన్..ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే త్రిష బర్త్ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. -
సీఎంగా విజయ్.. రజనీకాంత్-కమల్ సినిమా ఆగిపోతుందా?
ఏదైనా ఒక రంగంలో ఒక ఘటన జరిగితే దాన్ని ఇతర విషయాలకు ఆపాదిస్తూ సందేహాలను వ్యక్తం చేయటం జరుగుతుంటుంది. అలాంటి సందేహాలు ఇప్పుడు ఒక మల్టీ స్టార్ చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి ఆ చిత్రం ఏమిటన్నది చాలామంది గెస్ చేసే ఉంటారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మల్టీ స్టార్ చిత్రం గురించి ప్రస్తుతం వ్యక్తం అవుతున్న ఆ సందేహాలు. వీరి కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇన్బన్ ఉదయనిధి భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై చివరి వారిలో గానీ ఆగస్టు ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులే ఈ చిత్రంపై సందేహాలు నెలకొనడానికి కారణం అనే భావన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. మరో విషయం ఏమిటంటే విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలకు పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బన్ ఉదయనిధి ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్కు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, ఇతరత్రా సహకారాలకు సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందా అన్నదే ప్రశ్న. డీఎంకే పార్టీకి మద్దతు దారుడిగా నటుడు రజనీకాంత్, అదే పార్టీకి సానుకూలపరుడిగా కమల్ వ్యవహరిస్తుండటం ఇందుకు ఒక కారణం. అయితే వీరిద్దరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారన్నది గమనార్హం. అంతేకాకుండా నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ కమలహాసన్ కలిసి నటించిన చిత్రంపై రేకెత్తిస్తున్న సందేహాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి'
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మూవీ 'ప్రసన్న వదనం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆ తర్వాత చౌర్యపాఠం అనే చిత్రంలోనూ మెరిసింది. ఇటీవలే పాపం ప్రతాప్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం పాయల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రెస్మీట్కు హాజరైన పాయల్ రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను కన్నడకు చెందిన వ్యక్తినే.. కానీ పెళ్లి విషయంలో మాత్రం తెలుగువాడే కావాలని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు గుర్తింపు, గౌరవం, ఉపాధిని ఇచ్చింది టాలీవుడ్ పరిశ్రమనేనని తెలిపింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఆర్థిక భరోసాను ఇచ్చిందని వెల్లడించింది. అందుకే తన లైఫ్ పార్ట్నర్ కూడా తెలుగు వాడే కావాలని కోరుకుంటున్నట్లు పాయల్ వెల్లడించింది.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడలైపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే కన్నడ భామ రష్మిక మందన్నా.. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ సైతం అదే బాటలో దూసుకెళ్తోంది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. తెలుగు కోడలిగా స్థిరపడాలన్న పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ...ఎందుకో తెలుసా?
వైవిధ్య భరత పాత్రల్లో నటించాలని తపించే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. ఈయన ఏ చిత్రం చేసిన తన పాత్రలో కచ్చితంగా కొత్త దనాన్ని చూపిస్తుంటారు. అలా నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది ఉండకపోవచ్చు. అయితే సూర్య నటన మాత్రం అందరూ కొనియాడతారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు. నటి త్రిష నటించిన ఈ చిత్రాన్ని నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో సూర్య విభిన్న గెటప్పులతో కనిపించడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. కాగా త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఆయన అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న కరుప్పు చిత్రం ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల అవుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతున్న తరుణంలో నిర్ణయించిన తేదీలోనే చిత్రం విడుదలవుతుందని దర్శకుడు ఆర్జే బాలాజీ స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపోతే సూర్య కథానాయకుడిగా నటించిన మరో చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమితా బైజు నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించడంతో సూర్య అభిమానులకు డబల్ ధమాకా కావడంతో యమ ఖుషీ అవుతున్నారు. -
మణిరత్నం, సుహాసినిల కొడుకుని చూశారా? ఏం చేస్తాడో తెలుసా?
ప్రఖ్యాత సినీ దర్శకుడు మణిరత్నం, ఇక ఆయన సతీమణి నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిమణి. అయితే వీరి పుత్ర రత్నం గురించి చెప్పే తీరాలి. దర్శకుడు మణిరత్నం, నటి సుహాసినిల వివాహం 1988లో జరిగింది. వీరి ఏకై క పుత్రుడి పేరు నందన్.మణిరత్నం, సుహాసిని దంపతులకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలుసుగానీ అతను ఎలా ఉంటాడో అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈయన తల్లిదండ్రులు ప్రముఖ సినీ దంపతులు అయినా, నందన్ మాత్రం ఏ సినీ కార్యక్రమంలో కనిపించాడు. లండన్లోని ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో. మనో శాస్త్రం, రాజకీయం శాస్త్రానికి సంబంధించిన విద్యను అభ్యసించిన నందన్ ఆరంభ కాలం నుంచే రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూస్తూ వచ్చాడని ఆమె తల్లి, నటి సుహాసిని ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఆమె పేర్కొంటూ నందన్ కమ్యూనిస్టు భావాజాలం ఉన్న వ్యక్తి అని చెప్పారు. తను 15 వయసులోనే లెనినిజంతో కూడిన కంటోర్స్ ఆఫ్ లెనినిజం అనే చిరు కథను రాశాడని చెప్పారు. అంతటితో నందన్ రాజకీయ ఆసక్తి ఆగలేదు అన్నారు. ఇతర పిల్లల మాదిరిగా కాకుండా నందన్ పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్లో జరిగే చర్చలను ఆసక్తిగా వినేవాడు అన్నారు. 12 ఏళ్ల వయసులోనే కార్ల్ మార్క్స్ రాసిన మూలధనం పుస్తకాన్ని చదివేవాడన్నారు. అలాంటి ఒక పుస్తకాన్ని తీసుకొని కేరళలోని సీపీఎం కార్యాలయానికి వెళ్లాడు అన్నారు. అక్కడ తాను కార్లో వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదని, కారును వేరే ప్రాంతంలో నిలిపి పార్టీ కార్యాలయానికి వెళ్లాడన్నారు. అక్కడ నందన్ చూసినవారు ఎవరు నువ్వు ? అని అడక్కుండా బోంచేసావా అని హరి గారు అన్నారు. అదే కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకత అని సుహాసిని పేర్కొన్నారు. భోజనానంతరం సీపీఎం పార్టీ కార్యదర్శిని కలిసి మాట్లాడాడని చెప్పారు. కాగా తన పేరు అడిగినప్పుడు దర్శకుడు మణిరత్నం పేరు వాడితే తానెవరో తెలిసిపోతుంది అని ఆయన అసలు పేరు గోపాల్ రత్నం సుబ్రహ్మణ్యం కొడుకు అ ని చెప్పేది అన్నారు. అయితే తన పేరు మాత్రం సుహాసిని చెప్పడంతో తను తమ కొడుకా అందరికీ తెలిసిందన్నారు. ఆ సంఘటన తర్వాత నందన్ సీపీఎం పార్టీ సభ్యుడిగా మారిపోయాడని నటి సుహాసిని చెప్పారు. -
Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు. -
'దృశ్యం 3' ట్రైలర్ రిలీజ్.. ఈసారి థ్రిల్తో పాటు
మోహన్ లాల్ని ఇప్పటి జనరేషన్కి బాగా దగ్గర చేసిన సినిమా 'దృశ్యం'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మూడో భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 21నే మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)తొలి రెండు భాగాల్లోనూ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న జార్జ్ కుట్టి & ఫ్యామిలీ.. ఈసారి ఎలాంటి ఝలక్స్ ఇవ్వబోతుందనేది చూడాలి. తొలి రెండు భాగాల్లో థ్రిల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం థ్రిల్తో పాటు డ్రామా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి ఇద్దరు జర్నలిస్టుల వల్ల జార్జ్ కుట్టి కేసుని పోలీసులు మళ్లీ ఓపెన్ చేయడం లాంటి సీన్స్ ట్రైలర్లో చూపించారు. ఈసారైనా వరుణ్ శవం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి సినిమా. జీతూ జోసెఫ్ దర్శకుడు కాగా మోహన్ లాల్ సరసన మీనా చేసింది. తొలి రెండు భాగాల్ని తెలుగులో వెంకటేశ్తో రీమేక్ చేశారు. కానీ మూడో భాగాన్ని చేస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు డబ్బింగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి? హిందీలో మాత్రం అజయ్ దేవగణ్ వేరే కథతో 'దృశ్యం 3' తీస్తున్నాడు. ఈ ఏడాదిలోనే దాని రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్
రష్మికకు ఆల్రెడీ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లయిపోయింది కదా! ఈ రష్మిక ఎవరు? ఏ దర్శకుడిని పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడొద్దు. గతేడాది 'సు ఫ్రమ్ సో' అనే కన్నడ సినిమా తెలుగులోనూ రిలీజైంది. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతోనే హిట్ కొట్టిన దర్శకుడు జేపీ తుమినాడు.. మూడు రోజుల క్రితం ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన చిరు)కేరళలో పుట్టి పెరిగిన జేపీ తుమినాడు.. గత పదేళ్లుగా కన్నడ సినిమాల్లో నటుడు, రచయిత, దర్శకుడిగా చేస్తున్నాడు. 2017లో వచ్చిన 'ఒండు మొట్టెయ కథే'లో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేశాడు. తర్వాత తులు భాషలో దర్శకుడిగా 'కటపడి కట్టప్ప' అనే మూవీ తీశాడు. అనంతరం గరుడ గమన వృషభ వాహన, స్వాతి ముత్తిన మలే హనియే, సప్త సాగర ఎల్లో దాచే రెండు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు.గతేడాది రిలీజైన 'సు ఫ్రమ్ సో' అనే విలేజ్ కామెడీ మూవీతో తెలుగు, కన్నడలో మంచి స్పందన అందుకున్నాడు. ఇకపోతే నాటక రంగంలో ఉన్నప్పుడే పరిచయమైన రష్మిక అనే అమ్మాయిని జేపీ తుమినాడ్.. 14 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్దల్ని ఒప్పించి ఈ బుధవారం(మే 06) మంగళూరులో వీళ్లిద్దరి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో తోటి సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా) View this post on Instagram A post shared by Onelove Production (@oneloveproductions.in) -
గవర్నర్తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్ని కలిసిన విజయ్.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చూపించారు. అయితే విజయ్తో పాటు టీవీకే నేతలు కనిపించారు. కాకపోతే 'జన నాయగణ్' నిర్మాత వెంకట్.కె.నారాయణ కూడా ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)కెవిఎన్ ప్రొడక్షన్స్ పేరిట 2020లో నిర్మాణ సంస్థని స్థాపించిన వెంకట్ కె నారాయణ.. ప్రస్తుతం 'జన నాయగణ్'తో పాటు చిరంజీవి-బాబీ, టాక్సిక్ తదితర చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈయనకు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్పితే రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే విజయ్తో పాటు తమిళనాడు గవర్నర్ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా టీవీకే పార్టీలో ఏమైనా భాగమయ్యారా? లేదంటే సాధారణంగానే వెళ్లారా అనేది ప్రస్తుతం సస్పెన్స్. 'జన నాయగణ్' సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై బోలెడంత బజ్ నెలకొంది. కానీ సెన్సార్ బోర్డ్.. దీన్ని పలు కారణాలు చెప్పి అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్కి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చనిపిస్తోంది. మరి ఈ నెలలోనే ఈ సినిమాని విడుదల చేస్తారా లేదంటే జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి' రీమేకే జన నాయగణ్. హెచ్ వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ సంగీతమందించాడు. అయితే ఇప్పటికే సినిమా పైరసీకి గురైంది. చాలామంది సదరు ప్రింట్ చూసేశారు కూడా. అయినా సరే కాస్తోకూస్తో బజ్ ఉందంటే దానికి కారణం విజయ్. ఇప్పుడు సీఎం కూడా అయ్యాడు కాబట్టి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)#ThalapathyVijay's Latest video with Governor and He stakes claim to form Government in TN..🔥🤩 All is Well..🤝pic.twitter.com/kbYBy4TVMZ— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2026 -
ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చిన్నపాటి టెన్షన్. అన్నీ కలిసొస్తే ఇతడే సీఎం కావొచ్చు. అయితే విజయ్తోపాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటి మనోరమ గురించి మీలో ఎంతమందికి తెలుసు. ఇంతకీ ఎవరీ నటి? ఏ సీఎంలతో ఏయే సినిమాలు చేసిందంటే?నాటకాలతో మొదలుపెట్టి తెలుగు, తమిళంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ.. 1950 నుంచి 2015 వరకు నటిస్తూనే ఉన్నారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఈమె.. తమిళ ఇండస్ట్రీలో పోషించని పాత్ర లేదనే స్థాయికి ఎదిగారు. అసలు విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రుల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్తో పాటు దిగ్గజ హీరో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోనూ నటించారు. విజయ్తోనూ తెరని పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏడుగురి సీఎంలతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతమవుతుంది.అన్నాదురైద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో ఈమె, అన్నాదురై కలిసి నటించారు.కరుణానిధినాటకాల్లో మనోరమ ప్రతిభని గుర్తించిన నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్.. ఈమెని చెన్నై తీసుకెళ్లి, కరుణానిధి రచించిన 'మణిమగుడం' నాటకంలో నటించే అవకాశమిచ్చారు. 'ఉదయ సూరియన్' నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.ఎంజీఆర్నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన మనోరమ.. ఎమ్జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్తో పలు హిట్ సినిమాల్లో నటించారు. అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.జయలలితజయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారుస్టాలిన్తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఈయన విజయ్కాంత్ హీరోగా చేసిన 'మక్కళ్ అనైయిట్టల్' చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు.ఎన్టీఆర్తమిళంలో ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మనోరమ.. తెలుగులో ఎన్టీఆర్తోనూ కలిసి తెర పంచుకున్నారు. నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.విజయ్(ఇంకా సీఎం కాలేదు)తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతడితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.1937 మే 26న మన్నార్గుడిలో పుట్టిన మనోరమ అసలు పేరు గోవిందమ్మాళ్. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కారైకుడి ప్రాంతానికి వలస వెళ్లింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే 'యార్ మగన్' అనే నాటకంతో రంగస్థల నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 1958లో వచ్చిన 'మళయిట్ట మాంగై' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందే తన డ్రామా ట్రూప్ మేనేజర్ ఎస్ఎమ్ రామనాథన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్లకు భూపతి అనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. 2015 అక్టోబరులో 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఈమె కన్నుమూసింది. -
ఆగస్టులో ఆట మొదలు
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది.కాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, దుల్కర్ సల్మాన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘నా కెరీర్లో చేసిన సినిమాల్లో ‘ఐ యామ్ గేమ్’ అత్యంత స్టైలిష్ ఫిల్మ్. నహాస్ హిదాయత్ ప్రత్యేకంగా నన్ను ఓ కొత్త స్టైలిష్ లుక్లో చూపించడం ఈ ప్రాజెక్ట్కు హైలెట్. ‘లోకా’ వంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత వే ఫారర్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న చిత్రం ‘ఐ యామ్ గేమ్’. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది’’ అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. -
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్కి ఇది మాత్రమే కాదు, జిమ్లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
'విజయ్ గెలుపునకు.. త్రిషకు సంబంధమేంటి?..' నటి ఆగ్రహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.విజయ్- త్రిష పర్సనల్ లైఫ్పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు. ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు.


