South India
-
'సీతారామం' నటి కారులో భారీ చోరీ
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఏమైంది?ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) -
సినిమాలు, రేసింగ్.. హీరో అజిత్ కీలక నిర్ణయం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith)కి రేసింగ్ అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే. రేజింగ్లో పాల్గొని ఇప్పటికే పలుమార్లు ప్రమాదానికి గురైనా కూడా ఆయన దాన్ని వదలడం లేదు. సినిమాల కంటే రేసింగే ఎక్కువ ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తాను యాక్సిడెంటల్ హీరో అని కూడా చెప్పుకుంటారు. ఒకనొక దశలో సినిమాలకు గుడ్బై చెప్పి పూర్తిస్థాయిలో రేసింగ్పై ఫోకస్ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై అజిత్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు చేస్తూనే రేసింగ్లో పాల్గొంటానని, ఒకటి చేసేటప్పుడు మరోకదానికి బ్రేక్ ఇస్తానని చెప్పుకొచ్చాడు.‘రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలంటే చాలా ఫిట్గా ఉండాలి. సినిమాలు చేస్తూ రేసింగ్లో పాల్గొనడం చాలా కష్టమైన పని. కార్ల రేస్పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలి. అందుకే సైక్లింగ్, స్విమ్మింగ్తో పాటు డైట్ ఫాలో అవుతా. గత ఎనిమిది నెలల్లో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలు చేస్తే దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటా’అని ఆయన అన్నారు. ఇక రేసింగ్ సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి.ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్ సినిమాలు వదిలేయలేం కదా? అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్కు దూరం కాలేను. నా దృష్టిలో రెండు ఒక్కటే’ అన్నారు.ఇక సినిమాల విషయాలకొస్తే.. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.త్వరలోనే తన 64వ సినిమా ప్రారంభం కాబోతుంది. దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ధనుష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. -
కేరళలో 'అల్లు అర్జున్'ను స్టార్గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా?
అల్లు అర్జున్కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్లో ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి. పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్డమ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.అల్లు అర్జున్ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో 'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్ను కలిసి డబ్బింగ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను. అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి. 'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్ వెళ్లి దిల్రాజును కలిశాను. ఆర్య డబ్బింగ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. డబ్బింగ్ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్ను కనీసం కలవలేదు' అని అన్నారు.ఆర్య విజయం కోసం..ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్ అయ్యాం. లోకల్ కేబుల్ టీవీ నెట్వర్క్లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్లను సంప్రదించాం. అల్లు అర్జున్ స్టిక్కర్స్ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్ఆర్య విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్ హసన్ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు. 'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం, అవగాహన వల్లే బన్నీతో వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్ చూస్తాడు' అని ఖాదర్ అన్నారు. -
థగ్ లైఫ్ ట్రైలర్ రెడీ
హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై తెలుగులో విడుదల చేస్తున్నారు.కాగా ఈ సినిమా ప్రమోషనల్ ప్లాన్ను విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 17న ట్రైలర్ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 24న హైదరాబాద్లో గ్రాండ్గా ఆడియో లాంచ్, 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్రీ–రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు ప్రమోషనల్ ఈవెంట్స్కు ముందు చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో ఈ చిత్రం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్తో, ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ ఈవెంట్ జరపనున్నట్లు మేకర్స్ తెలిపారు.అలాగే పాన్ ఇండియా స్థాయిలో ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్స్ను నిర్వహించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే... ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 38 సంవత్సరాల తర్వాత రానున్న ‘థగ్ లైఫ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. -
'పంజరం నుంచి బయటపడ్డా'.., భార్య ఆర్తికి జయం రవి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్టాపిక్గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్లో మరోసారి హాట్టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan) -
రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో
వారసత్వంతో వచ్చి హీరోలు, నటులు అయినవాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొందరు యాక్టర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక్కో సినిమా చేసుకుంటా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు సూరి ఒకడు. ఇప్పుడు తన కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.1998లో తమిళ ఇండస్ట్రీలోకి వచ్చిన సూరి.. దాదాపు ఆరేళ్ల పాటు గుర్తింపు దక్కని చాలా పాత్రలు చేశాడు. 2004 నుంచి ఆడపాదడపా పాత్రలు వచ్చాయి. అలా కమెడియన్ గా స్టార్ హీరోలందరితో చాలా సినిమాలు చేశాడు. 2022 వరకు అంటే దాదాపు 18 ఏళ్ల పాటు కామెడీ పాత్రలు చేశాడు. (ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) అందరూ సూరిలో కమెడియన్ ని చూస్తే తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం అద్భుతమైన నటుడిని చూశాడు. అలా 'విడుదల పార్ట్ 1' మూవీతో సూరిని హీరోగా లాంచ్ చేశాడు. తర్వాత గరుడన్, కొట్టుక్కళి, విడుదల పార్ట్ 2, బడవ సినిమాలతో సూరి ఆకట్టుకున్నాడు. 'మామన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన తొలి పని-జీతం, దాని ద్వారా నేర్చుకున్న జీవిత పాఠాల్ని చెప్పుకొచ్చాడు.'తిరుప్పుర్ లో నేను రోజు కూలీగా రూ.20 జీతానికి పనిచేశాను. వారమంతా కష్టపడితే రూ.140 వచ్చేది. అందులో సగం ఖర్చు పెట్టి, మిగతాది ఇంటికి పంపేవాడిని. జీవిత పాఠాల్ని నేను అప్పుడే నేర్చుకున్నాను' అని సూరి చెప్పుకొచ్చాడు. అప్పుడు రూ.20 జీతానికి పనిచేసిన ఇతడు.. ఇప్పుడు కష్టపడి నటుడిగా ఎదిగి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.(ఇదీ చదవండి: సాహసం చేసిన టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ.. వీడియో వైరల్) "I stated as a daily Wager in Tiruppur & my wages was ₹20 per day. Weekly I get ₹140, I will spend ₹70 & send back ₹70 to my home. I got to learn about the life lessons there🫶"Growth of #Soori🫡♥️pic.twitter.com/2PflFhYz4o— AmuthaBharathi (@CinemaWithAB) May 14, 2025 -
స్టార్ హీరో మరో డీ గ్లామరస్ పాత్ర.. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పటిలా రొటీన్ కమర్షియల్ సినిమాలు అంటే అస్సలు సక్సెస్ కావట్లేదు. ఒకవేళ హిట్ అని డప్పుకొట్టినా సరే ప్రేక్షకులు నమ్మే స్థితిలో లేరు. దీంతో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఓ స్టార్ హీరో వెళ్తున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) పైన ఫొటోలో శరత్ కుమార్ తో ఉన్నది సిద్ధార్థ్. అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సరైన హిట్స్ పడలేదు. తమిళంలోనూ చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ల క్రితం చిన్నా అనే మూవీతో అటు నటుడిగా మంచి పేరు వచ్చింది.ఇప్పుడు మళ్లీ ఆ తరహాలోనే 3 BHK అనే మూవీ చేస్తున్నాడు. గతంలో చిన్నా చిత్రంలో కాస్త డీ గ్లామర్ గా కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అలానే కనిపించబోతున్నాడు. ఇందులో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ క్లాస్ కథతో తెరకెక్కిన ఈ సినిమా జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈసారి కూడా సిద్ధార్థ్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) -
తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో
తమిళ కమెడియన్ కమ్ హీరో సంతానం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డీడీ నెక్స్ట్ లెవల్'. ఈ శుక్రవారం (మే 16)న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడంతో హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్వయంగా హీరోనే స్పందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు. అయితే ఈ గీతాన్ని 'డీడీ నెక్స్ట్ లెవల్' సినిమా కోసం పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడీ చేశారు. దీనిపై తమిళనాడులోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇప్పుడు ఈ వివాదంపై స్వయంగా సంతానం స్పందించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 'తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. వాటిని సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. ఇప్పటికే సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా) -
ఐపీఎల్లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ
పంజాబీ బ్యూటీ మీనాక్షీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఈమె సినిమాలతో పాటు రీసెంట్గా వైద్య విద్యను పూర్తి చేశారు. అదే విధంగా సిమ్మింగ్, బాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. అంత కంటే పలు అందాల పోటీల్లో పాల్గొని రన్నర్గా నిలిచారు. చివరికి నటిగా స్థిరపడింది. తొలుత నటిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. అయితే హిట్ ది సెకండ్ కేస్ చిత్రం ఈ బ్యూటీకి తొలి విజయానందాన్నిచ్చింది. అంతే కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అక్కడ విజయ్ ఆంటోనితో కలిసి కొలై చిత్రంలో నటించారు. అది ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, విజయ్కి జంటగా గోట్ చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు. దుల్కర్ సల్మాన్కు జంటగా లక్కీభాస్కర్ చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకు ముందు స్త్రీ, మిమీ తదితర హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజయ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షీ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇటీవల ఒక భేటీలో ఐపీఎల్ జట్లుల్లో మీకు నచ్చిన జట్టు ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఐపీఎల్ జట్టులో ప్రత్యేకంగా నచ్చిన జట్లు అంటూ ఏమీ లేవన్నారు. అయితే ఎంఎస్.ధోని అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టే తనకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని అంటే ఇష్టం ఏర్పడిన తరువాతనే తాను క్రికెట్ క్రీడను చూడడం మొదలెట్టానని ఈ 33 ఏళ్ల సుందరి చెప్పుకొచ్చారు. -
తెలుగులో నా ఎంట్రీకి సరైన సినిమా ఇదే: డైరెక్టర్ కూతురు
‘‘నేను తమిళంలో చేసిన తొలి చిత్రం ‘విరుమన్’ని విజయ్ కనకమేడలగారు చూశారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి, ‘భైరవం’ (bhairavam)సినిమా గురించి చెప్పారు. కథ నచ్చడంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. తెలుగులో ఇది నా తొలి చిత్రం. టాలీవుడ్లో నా ఎంట్రీకి ‘భైరవం’ సరైన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని అదితీ శంకర్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్పై జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్న అదితీ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా నాన్నగారితో(డైరెక్టర్ శంకర్) కలిసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్కి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం చూస్తే నా కల నిజం అయిందనిపిస్తోంది. నాన్నగారి ఇమేజ్ని ఒక గౌరవంగానే భావిస్తాను తప్ప ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ‘భైరవం’లో బోల్డ్ అండ్ హానెస్ట్తోపాటు బబ్లీగా ఉండే క్యారెక్టర్లో కనిపిస్తాను. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్గార్లకు తమిళ్ మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపించింది.సెట్స్లో షూటింగ్ని చాలా ఎంజాయ్ చేశాను. రాధామోహన్గారు చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు సెట్స్కి వచ్చేవారు. విజయ్ కనకమేడలగారు క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇష్టమైన తెలుగు చిత్రం ‘మగధీర’. నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా అది. అలా రాజమౌళి, రామ్ చరణ్గార్లకు నేను బిగ్ ఫ్యాన్గా మారిపోయాను. నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలతోపాటు సవాల్తో కూడినపాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
అందరివాడు మన సూర్యకుమార్
‘అందనివాడు.. అందరివాడు.. మన సూర్యకుమార్’ అంటున్నారు హీరో రామ్. ఈ సూర్యకుమార్ ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. రామ్ హీరోగా పి. మహేశ్బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ . మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారని వెల్లడించి, ‘అందనివాడు.. అందరివాడు... మన సూర్యకుమార్’ అంటూ ఉపేంద్ర ఫస్ట్లుక్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. కాగా ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ అనుకుంటున్నారని, సూపర్స్టార్ సూర్యకుమార్పాత్రలో ఉపేంద్ర కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు వివేక్– మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కాంతార నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుండె పోటు రావడంతోనే రాకేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడిపిలో జరిగిన ఓ మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది.కాగా.. కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్-3 విన్నర్గా రాకేశ్ నిలిచారు. మరోవైపు రాకేశ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్గా వస్తోన్న కాంతారా చాప్టర్-1లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేశ్ మృతి పట్ల పలువురు కన్నడ సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025 -
'టూరిస్ట్ ఫ్యామిలీ'లో లిటిల్ ఎమర్జింగ్ స్టార్ గురించి తెలుసా..?
కోలీవుడ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ జంటగా నటించారు. అయితే, ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్ జగన్ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ కమలేష్ అంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్ చిత్రబృందాన్ని నేరుగా పిలిపించి అభినందించారు. ప్రత్యేకంగా కమలేష్ను మెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా ఈ చిత్రం సూపర్ అంటూ తెలిపారు.‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో శశికుమార్, సిమ్రన్ల కుమారుడి పాత్రలో కమలేష్ నటించాడు. ఇందులో విజయ్ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. వాస్తవంగా కమలేష్ నటుడు కాదు.. ఒక సింగర్. 'స రే గ మ ప లిల్ చాంప్స్ సీజన్ 2'లో మొదటిసారి తెరపై మెరిశాడు. ఆ రియాలిటీ షోకు అతిథిలుగా త్రిష కృష్ణన్, నయనతార, అమలా పాల్ హాజరయ్యారు. ఆ సమయంలోనే తన టాలెంట్ను చూసి వారు ఫిదా అయ్యారు. అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అలా కమలేష్కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్ దక్కింది.జ్యోతిక నటించిన తమిళ చిత్రం ‘రాచ్చసి’లో కమలేష్ నటించాడు. ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించగా.. కమలేష్ స్టూడెంట్గా కనిపించాడు. ఈ మూవీ తర్వాత నయనతార, సమంత, విజయ్ సేతుపతి నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్ నటిస్తున్నాడు. ఆపై కాంచన 4లో కూడా ఛాన్స్ కొట్టేశాడు.'జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు'రాచ్చసి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి కమలేష్ ఇలా చెప్పాడు. ' నా పుట్టినరోజు నాడు జ్యోతిక మేడమ్ సెట్స్లోని అందరికీ బిర్యానీ తెప్పించారు. తన సొంత కొడుకు మాదిరి ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలోనే ఒకరోజు సూర్య సార్ కూడా సెట్స్కి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. జ్యోతిక మేడమ్ ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు. ఇంతకీ నువ్వు ఏం చేశావ్ అంటూ సరదా పట్టించారు.' అని గుర్తుచేసుకున్నాడు. -
ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. విడుదలపై నయనతార ప్రకటన
ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి( Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం 'ఎల్ఐకే' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) విడుదలపై ప్రకటన వచ్చేసింది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో వరుస హిట్లు అందకున్న ప్రదీప రంగనాథన్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాత నయనతార (Nayanthara) ప్రకటించింది. విఘ్నేష్ శివన్( Vignesh Shivan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ దీనికి స్వరాలు అందిస్తున్నారు.భారీ బడ్జెట్తో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో 'ఎల్ఐకే' చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు నయనతార అధికారికంగా ప్రకటించింది. తమిళ్తో పాటు, తెలుగు, కన్నడ, మలయాలంలో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ప్రేమ కోసం మొబైల్ గాడ్జెట్ను ఉపయోగించి 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించనున్నారు. ఇందులో ఎస్జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో ఐదుగురు కలిసి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. వారిలో నయనతార ఒకరు కావడం విశేషం. జీవితానికి ఇన్సూరెన్స్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ, ప్రేమకి ఉండే ఇన్సూరెన్స్ గురించి ఈ చిత్రంలో తెలుసుకుంటారని గతంలో దర్శకుడు తెలిపాడు. భవిష్యత్తు నేపథ్యంలో రాసుకున్న కథ కాబట్టి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువే పడిందని ఆయన అన్నాడు. -
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్ డైరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.విజయ్ సేతుపతి గురించి అనురాగ్ కశ్యప్ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్ సేతుపతి వల్లే అని' అనురాగ్ కశ్యప్ తెలిపారు.గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించారు. నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్.. రైఫిల్ చిత్రంతో పాటు డకాయిట్ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్గా ఆయన చేతిలో ఐదు సౌత్ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్గా బాలీవుడ్ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు. -
హార్ట్ బీట్ పెంచే వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అయినా హార్ట్బీట్ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.ఈనెల 22 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. The wait ends with a beat.. Save the date May 22 ❤️❤️🩺#HotstarSpecials Heart Beat Season 2 Streaming from May 22 only on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar… pic.twitter.com/cLIci1QpOb— JioHotstar Tamil (@JioHotstartam) May 10, 2025 -
నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్
లోకేశ్ కనగరాజ్ పేరుకే తమిళ దర్శకుడు గానీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో 'కూలీ' చేస్తున్నాడు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్. కానీ లోకేష్ ఇప్పటినుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడిన లోకేశ్ కనగరాజ్.. పలువురు పాన్ ఇండియా హీరోలు, డైరెక్టర్లపై పరోక్షంగా సెటైర్లు వేశాడా అనిపించింది. 'నేనేమి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీయట్లేదుగా మూడేళ్లు పట్టడానికి. 'కూలీ'ని 6-8 నెలల్లో పూర్తి చేశా. అలానే నా సినిమాలో చేసే నటీనటుల్ని ఎవరినీ మీ గెటప్ మార్చొద్దు. వేరే సినిమాలు చేసుకోవద్దు అని చెప్పను. సాధారణంగా నేను అలాంటి రకం కాదు. అవేం చెప్పకపోయినా సరే వాళ్లు నాతో సినిమాలు చేస్తున్నారు' అని లోకేశ్ అన్నాడు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) లోకేశ్ మాటల్ని బట్టి చూస్తే.. ప్రస్తుతం చాలామంది పాన్ ఇండియా హీరోలు ఒక్క సినిమాకే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు. లుక్ అది ఇది అని చాలా హడావుడి చేస్తున్నారు. కానీ లోకేశ్ మాత్రం స్టార్ హీరోలతో కూడా నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. బహుశా తన వర్కింగ్ స్టైల్ ఇది అని చెప్పుకోవడానికే ఈ కామెంట్స్ చేసినట్లు అనిపిస్తుంది.కూలీ విషయానికొస్తే.. రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ లాంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో ఉండటం విశేషం. రీసెంట్ గా రిలీజ్ కి మరో 100 రోజులే ఉందని ఓ వీడియో రిలీజ్ చేశారు. నటీనటుల తలవెనక షాట్స్ చూపించే హైప్ పెంచేశాడు. మరో నెల తర్వాత పూర్తిస్థాయి ప్రమోషన్స్ మొదలుపెడతారేమో?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) “I’m not making a film like #RRR that takes 3 years. 'Coolie' will be shot in 6–8 months.I asked actors not to change getup or do other films. I don’t usually say that… but they still agreed.”— #LokeshKanagaraj | #Cooliepic.twitter.com/XC66jkJUv5— Whynot Cinemas (@whynotcinemass_) May 11, 2025 -
విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. ఈ సినిమాకు అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ సీస్ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఏస్ ట్రైలర్ చూస్తే మలేషియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తే జూదం, స్మగ్లింగ్, దోపిడీ నేపథ్యంలో కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అభిమానులను అలరించనున్నారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్లో విజయ్ సేతుపతి యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
హోంబలే ఫిల్మ్స్ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం 'మహావతార్: నరసింహ'.. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ను గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫ్ఫీ)లో ప్రదర్శించారు.పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జులై 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హిట్ ఇచ్చారు. యానిమేషన్లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు.ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో చూపిస్తున్నట్లు అశ్విన్ చెప్పారు. దీన్ని రూపొందించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింని ఆయన చెప్పారు. మహావతార్ సిరీస్లో రానున్న తొలి సినిమాగా 'మహావతార్: నరసింహ' తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో మరో రెండు సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. -
దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ
సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ కొన్ని చూసినప్పుడు మాత్రం దానిలో ఎమోషన్ మనసుల్ని తాకుతుంది. మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి చిత్రమే 'సత్యం సుందరం'. కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గతేడాది రిలీజైంది. దీనికి '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకుడు.(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..)గతేడాది సినిమా వచ్చింది. కమర్షియల్ గా హిట్ కాలేదు గానీ చాలామంది ప్రేక్షకులకు మాత్రం సినిమా నచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకా అంటారా? దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఇప్పుడు సూర్య-కార్తీ మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. ఎందుకంటే ప్రేమ్ చాన్నాళ్ల నుంచి ఈ కారు కొనుక్కుందామని అనుకుంటుండగా.. ఇప్పుడు సూర్య-కార్తీ ఇతడి కల నెరవేర్చారు. ప్రేమ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే ఇది అర్థమైపోయింది.'మహీంద్ర థార్ నా డ్రీమ్ కారు. కొన్ని కారణాల వల్ల 5 డోర్స్ వెర్షన్ కోసం నేను ఎదురుచూస్తున్నాను. ప్రత్యేకంగా డిజైన్ చేసిన థార్ ఆర్ఓఎక్స్ఎక్స్ ఏఎక్స్ 5ఎల్ 4x4 మోడల్ లో వైట్ కలర్ కారు కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులున్నా సరే కారు రావడానికి చాలారోజులు పట్టేస్తుంది. దీంతో రాజా సర్ సాయం అడిగా''ఒకానొక సందర్భంలో కారు కొనడం కంటే అవసరాలు ఎక్కువైపోయాయి. దీంతో కారు కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుయిపోయాయి. కల చెదిరిపోయింది. ఇదంతా రాజా సార్ కి చెప్తే సైలెంట్ గా ఉండిపోయారు. కానీ నిన్న సూర్య అన్న నుంచి కారు ఫొటో మెసేజ్ వచ్చింది. నేను ఫస్ట్ షాకయ్యాను. వెంటనే రాజా సర్ కి ఫోన్ చేసి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెబితే.. ఆయన నవ్వి, ప్రేమ్ ఇది నీకు సూర్య సర్ ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. దీంతో నాకు మాట రాలేదు. సూర్య సర్ ఇంటికి వెళ్లి కార్తీ అన్న చేతుల మీదుగా కారు అందుకున్నాను''ఇదంతా ఇంకా కలలానే అనిపిస్తుంది. నేను దీన్ని బహుమతిలా చూడటం లేదు. నేను దీన్ని అన్నయ్యలు తమ్ముడికి నెరవేర్చిన కలలా భావిస్తున్నాను. థ్యాంక్స్ సూర్య అన్న, థ్యాంక్స్ కార్తీ బ్రదర్, థ్యాంక్స్ రాజా సర్' అని ప్రేమ్ కుమార్ రాసుకొచ్చాడు. మార్కెట్ లో ప్రస్తుతం ఈ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంది. ఇకపోతే ప్రేమ్ కుమార్ ఇప్పుడు '96' సీక్వెల్ స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య) View this post on Instagram A post shared by Premkumar Chandran (@prem_storytelling) -
సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..
నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం రెట్రో.. నటి పూజా హెగ్డే ఇందులో నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. అయితే, సూర్య, కార్తీక్ సుబ్బరాజుకు చెందిన సొంత నిర్మాణ సంస్థలే రెట్రోను తెరకెక్కించాయి. మే 1న విడుదలైన ఈ మూవీ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్తో ఉంది. అయితే, ఈ మూవీని శక్తి ఫిలిమ్ ఫ్యాక్టరీ సంస్థ అధినేత శక్తి వేలన్ తమిళనాడులో డిస్ట్రిబ్యూషన్ చేశారు. కాగా రెట్రో చిత్రం విజయాన్ని పురస్కరించుకొని ఆయన ఆనందంగా ఆ చిత్ర యూనిట్కు విలువైన బహుమతులను అందించారు.చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు సూర్యకు కానుకగా వజ్రపుటుంగరాన్ని శక్తి వేలన్ అందించారు. అదేవిధంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు, చాయాగ్రహకుడు, సంగీత దర్శకుడు ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరకి వజ్రపుటుంగరాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం రూ.100 కోట్ల వసూళ్లను దాటి పరుగులు తీస్తోందన్నారు. ఈ ఏడాది విడుదల చిత్రాలలోనే అధిక లాభాలు తెచ్చి పెట్టిన చిత్రం ఇదేనన్నారు. ఉచిత డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాన్ని తనకు కల్పించిన నటుడు సూర్య ,రాజశేఖర పాండియన్కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇంతకుముందు సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం(చినబాబు ) చిత్ర సక్సెస్ వేడుక సందర్భంగా బంగారు గొలుసును, అదేవిధంగా విరుమాన్ చిత్ర విజయం సాధించిన సందర్భంగా బంగారు బ్రేస్లెట్ను సూర్యకు కానుకగా అందించగా ఆయన వాటిని మళ్లీ తనకే తిరిగి ఇచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వజ్రపుటుంగరాన్ని తనకే ఇచ్చారని చెప్పారు. -
క్రేజీ సినిమా.. రూ. 600 కోట్ల కలెక్షన్స్.. ఛాన్స్ వదులుకున్న సాయిపల్లవి
ప్రతిభకు అదృష్టం తోడైతే అది నటి సాయి పల్లవి అవుతుంది. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన భామ ఈమె. సినిమాలపై ఆసక్తితో మొదట్లో ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వైద్య విద్యపై పూర్తిగా దృష్టి సారించిన సాయి పల్లవి మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తన కలలబాటలో పయనించిన సాయి పల్లవికి మలయాళ చిత్రం ప్రేమమ్తో విజయం వరించింది. ఆ ఒక్క విజయం ఆమె కెరీర్నే మార్చేసింది వరుసగా అవకాశాలు రావడం, అందులో బలమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించడంతో సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి పాత్రలు తెలుగులోనే ఎక్కువగా రావడం విశేషం. కాగా ఇటీవల తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటన మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈమె బాలీవుడ్ని కూడా టచ్ చేసింది. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఇందులో సాయి పల్లవి నటించిన కొన్ని గ్లింప్స్ విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈమె ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు, ఎంత అంటే ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ తీసుకోనంత అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే ఈమె కథ, తన పాత్ర నచ్చితే కానీ చిత్రాలను అంగీకరించరన్నది తెలిసిందే. ఇంతకు ముందు చిరంజీవితో నటించే అవకాశాన్ని తిరస్కరించింది. అదేవిధంగా తమిళంలో నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారు అయ్యిందని, అయితే అందులో పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో నిరాకరించినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.ఆ తరువాత ఆ పాత్రను నటి త్రిష పోషించింది. -
దేవగా ధనుష్
ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాలో దేవ అనే పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘కుబేర’ సినిమా కొత్తపోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ధనుష్ యాక్టర్గా కెరీర్ని మొదలు పెట్టి, శనివారం (మే 10)కి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘కుబేర’ కొత్తపోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘కుబేర’ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
హీరో భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!
తమిళ హీరో జయం రవి విడాకుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతేడాది భార్య ఆర్తికి విడాకులు ఇచ్చేసినట్లు ప్రకటించిన ఇతడు.. ప్రసుత్తం సింగిల్ గానే ఉంటున్నాడు. కానీ శుక్రవారం ఉదయం చెన్నైలో నిర్మాత ఇషారీ గణేశ్ కూతురు పెళ్లికి మాత్రం సింగర్ కెనీషాతో కలిసి హాజరయ్యాడు. దీంతో భార్య ఆర్తి తట్టుకోలేకపోయింది.నిన్న సాయంత్రం జయం రవి పేరు నేరుగా ప్రస్తావించనప్పటికీ.. చాలా ఆరోపణలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని, పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దీని ప్రతిగా జయం రవితో కలిసి కనిపించిన కెనీషా కౌంటర్ ఇచ్చింది.(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు) తన ఇన్ స్టా స్టోరీలో ఆర్తి పేరు ప్రస్తావించకుండా.. 'మగాడు ఎప్పుడూ ఎమోషన్స్ కి లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. మంచిగా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు. అదే నిజమైన బలం' అనే కొటేషన్ ని కెనీషా షేర్ చేసింది.ప్రస్తుతానికి హీరో జయం రవి భార్య ఆర్తి వర్సెస్ రూమర్ ప్రియురాలు కెనీషా మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ విషయంలో ఎవర ఒప్పు? ఎవరిది తప్పు అనేది తెలియాలంటే సదరు హీరో నోరు విప్పాల్సిందే. కోలీవుడ్ మీడియా ప్రకారం.. జయం రవి అత్త ఇతడి డేట్స్, మూవీస్ విషయంలో చాలా జోక్యం చేసుకుందని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్) -
హీరో ఆఫర్లు వద్దని.. స్టార్గా మారిన శోభన్ బాబు మనవడు ...
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నట భూషణుడు శోభన్ బాబు(Sobhan Babu).. ఎన్టీయార్, కృష్ణ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా మహిళాదరణలో ఆయనకు సాటిలేదు. తన సమకాలీకులైన మిగిలిన హీరోల్లా కాకుండా సినీరంగానికి దూరమైన తర్వాత ఆయన కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు పబ్లిక్ లైఫ్ నుంచే అదృశ్యం అయిపోయారు. అంతేకాదు ఆయన వారసులను కూడా ఎవరినీ సినీ రంగంలోకి పరిచయం చేయలేదు. దాంతో ఆయన దివంగతులయాక ఆయన వారసులకు సంబంధించిన విశేషాలు కూడా ఎక్కడా పెద్దగా వెలుగు చూడలేదు. ఈ నేపధ్యంలో తాజాగా శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారంటూ వచ్చిన వార్తలు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి రేకెత్తించాయి. అలనాటి అందాల నటుడి రూపాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు... పలు సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన సురక్షిత్...సార్ధక నామధేయుడిగా మారి ఎంచుకున్న రంగంలో స్టార్ అనిపించుకుంటున్నారు.(చదవండి: రీరిలీజ్లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?)తమిళనాడులో స్థిరపడ్డ ఆయన సినిమా రంగంలో కాకుండా వైద్య రంగంలో తాతకు తగ్గ మనవడుగా రాణిస్తుండడం అందర్నీ ఆకర్షిస్తోంది. దాదాపు 4.5 కిలోల గర్భాశయాన్ని అత్యాధునిక సాంకేతికత ద్వారా తొలగించి డాక్టర్ సురక్షిత్ బత్తిన వైద్యరంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళకు గర్భాశయంలో భారీ కణితి ఏర్పడింది. ఇతర ఆస్పత్రులు ఓపెన్ సర్జరీ తప్ప మార్గం లేదని సూచించగా, డాక్టర్ సురక్షిత్ 3డీ ల్యాపరోస్కోపిక్ సాంకేతికతను ఉపయోగించి 8 గంటల పాటు శ్రమించి ఆ గర్భాశయాన్ని విజయవంతంగా తొలగించారు. అంతేకాదు 2019లో డాక్టర్ సురక్షిత్ గురువైన డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని ల్యాపరోస్కోపీ ద్వారా తొలగించి సాధించిన గిన్నిస్ రికార్డును బద్దులు కొట్టి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నారు.సేవాస్టార్..డాక్టర్ సురక్షిత్ చెన్నైలోని అన్నా నగర్లో 2016లో ఇండిగో ఉమెన్స్ సెంటర్ను స్థాపించారు. తన కెరీర్లో ఇప్పటివరకు 10,000కు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 40కి పైగా అవార్డులు అందుకున్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు శోభన్ బాబు పేరుతో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. టెడెక్స్ స్పీకర్, ఫిట్నెస్ ఫ్రీక్ డిజిటల్ విద్యావేత్త అయిన డాక్టర్ సురక్షిత్ బత్తినకు సెలబ్రిటీల స్థాయిలో 1.65లక్షలకు పైగా ఇన్స్ట్రాగామ్ ఫాలోయర్స్ ఉండడం విశేషం. ఆయన శాస్త్రీయ విధానాలను సలహాలను వ్యాప్తి చేస్తున్నారు. ‘భారతదేశ సంతానోత్పత్తి రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఐవీఎఫ్ లాంటి కార్పొరేట్ సంస్కృతికి వ్యతిరేకం అయినప్పటికీ... వంధ్యత్వానికి మూల కారణాలకు చికిత్స చేయడం సహజ గర్భధారణను ప్రోత్సహించడం కోసం ప్రత్యేంగా కృషి చేస్తున్నాను‘ అని డాక్టర్ బత్తిన చెబుతున్నారు. -
ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్
సాధారణంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అబ్బాయి లేదా అమ్మాయి ఎవరు? వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకుని పెళ్లి చేసుకుంటారు. కానీ హీరోయిన్ అమలాపాల్ జీవితంలో మాత్రం వీటికి రివర్స్ లో జరిగింది. ఈమె నటి అనే సంగతే భర్తకు తెలీదు, అలానే ప్రెగ్నెంట్ అయిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు.అవును మీరు విన్నది కరెక్టే. తాజాగా జేఎఫ్ డబ్ల్యూ మూవీ అవార్డ్ వేడుక జరిగింది. ఇందులో ఉత్తమ నటిగా(క్రిటిక్స్) అమలాపాల్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగత్ దేశాయ్ తో తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)'జగత్-నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలో సెటిలయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు చూడడు. దీంతో నేను నటి అనే విషయాన్ని చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలని ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు' అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ తదితర సినిమాలు చేసిన అమలాపాల్.. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతంలోనే ఈమె డైరక్టర్ ఏఎల్ విజయ్ ని 2014లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా మూడేళ్లకే అంటే 2017లో విడిపోయారు. 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ ని అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు పుట్టాడు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!) -
'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
ఆపరేషన్ సిందూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్ట్లు పెట్టారు. అయితే, కేరళకు చెందిన నటి అమీనా నిజమ్.. ఆపరేషన్ సిందూర్ కోసం భారతదేశం 'సిగ్గుపడుతుందని' పోస్ట్ చేసింది.అమీనా తన సోషల్మీడియాలో ఇలా రాసుకొచ్చింది 'ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం ఒక్కటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్దం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోసగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు.' అంటూ ఆమె షేర్ చేసింది.నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తుచేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని ఇది మీ కెరీర్కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు.ఎవరీ అమీనా..?అమీనా నిజమ్ కేరళకు చెందిన నటి, ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 (2018) సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినేట్టం పడి, అంజామ్ పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by KRISHNA | KOCHI BRIDAL MEHNDI ARTIST (@mehndibykrish) -
ఇది వేడుకలకు సమయం కాదు: కమల్హాసన్
కమల్హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధానపాత్రలు పోషించారు. కమల్హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ నెల 16న ‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల వేడుకని ఘనంగా నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు ‘ఆర్ట్ కెన్ వెయిట్–ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ కమల్హాసన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16న నిర్వహించాల్సిన ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం.మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండిపోరాడుతున్న వేళ వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయం అని నమ్ముతున్నాను. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి. ఆడియో రిలీజ్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని కమల్హాసన్ పేర్కొన్నారు. -
కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్
తమిళ హీరో జయం రవి.. భార్య ఆర్తికి గతేడాది విడాకులు ఇచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. కెన్నీషా అనే సింగర్ తో సదరు హీరో డేటింగ్ చేస్తున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇచ్చేశాడనే రూమర్స్ వచ్చాయి. తాజాగా నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి పెళ్లి జరగ్గా.. జయం రవి కెన్నీషాతో కలిసి జంటగా వచ్చాడు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) ఉదయం నుంచి జయం రవి-కెన్నీషా కలిసున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైంలో మాజీ భార్య ఆర్తి చాలా పెద్ద పోస్ట్ పెట్టింది. జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని ఇంటి నుంచి తరిమేశారని, జయం రవికి అసలు పిల్లలు బాధ్యత అనేదే లేదని ఆవేదన వ్యక్తం చేసింది.'ఏడాది పాటు మౌనాన్ని కవచంలా మోస్తున్నాను. నా కొడుకులు ప్రశాంతంగా ఉండాలి కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాను. నాపై లేనిపోని ఆరోపణలు చాలా చేశావ్. అయినా సరే నేను నోరు మెదపలేదు. ఎందుకంటే నా కొడుకులు.. తల్లిదండ్రులు విడిపోయారనే బాధని అనుభవించకూడదు కాబట్టి. అంతే తప్ప నా దగ్గర నిజం లేదని కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఫొటోలు చూస్తోంది. కానీ మా మధ్యలో జరిగింది వేరు. విడాకుల ప్రక్రియ ఇంకా నడుస్తోంది. నాతో పాటు 18 ఏళ్లు సంసారం చేసిన వ్యక్తి.. ప్రేమ, నమ్మకంతో పాటు ప్రామిస్ చేసిన ప్రతి బాధ్యతని పక్కనబెట్టి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నా బాధ్యత అని చెప్పిన ఆ వ్యక్తి.. నాకు ఆర్థికంగా అండగా నిలబడం, మాట సాయం గానీ చేయట్లేదు''ప్రస్తుతం మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. నాతో కలిసి ఇదే ఇంటిని నిర్మించిన సదరు వ్యక్తి.. బ్యాంక్ అధికారులతో కలిసి నేను బయటకు వెళ్లిపోయేలా చేశాడు. నేను డబ్బుల కోసమే ఈ విడాకుల డ్రామా ఆడుతున్నానని అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఎప్పుడో నా స్వార్థం చూసుకునేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ప్రేమని పంచాను. నమ్మకం చూపించాను. ఇప్పుడదే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది''ప్రేమించినందుకు పశ్చాత్తాపపడట్లేదు గానీ దాన్ని ఓ బలహీనతలా ఉపయోగించుకున్నందుకు బాధపడుతున్నాను. నా కొడుకుల వయసు 10, 14 ఏళ్లు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది భద్రత.. షాక్ కాదు, నిశ్బబ్దం కాదు. ఈ చట్టాల గురించి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు వాళ్లు. సమాధానం లేని కాల్స్, రద్దయిన మీటింగ్స్.. ఇవన్నీ నాకు తగిలిన గాయాలు. నేను ఈరోజు మాట్లాడేది భార్యగా కాదు. అలా అని స్త్రీకి అన్యాయం చేసిన దానిలా కూడా కాదు. పిల్లల శ్రేయస్సు కోసం ఆలోచించే తల్లిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే మిగిలిపోతాను''నువ్వు ఏమైనా చేయొచ్చు గానీ నిజాన్ని తిరిగి రాయలేవు కదా. తండ్రి అంటే టైటిల్ కాదు అదో బాధ్యత. మా విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నా పేరు వెనక రవి అని ఉంటుంది. మీడియా వాళ్లకు చెప్పేదేంటంటే నన్ను మాజీ భార్య అని సంభోదించొద్దు. మేం ఇంకా లీగల్ గా విడాకులు తీసుకోలేదు. ప్రతికారమో మరేదో కాదు,పిల్లల్ని కాపాడే తల్లిగా ఇది నా బాధ్యత. నేను ఏడవను. గట్టిగా అరిచి గోలపెట్టను. కానీ బలంగా నిలబడతా. నిన్ను ఇంకా నాన్న అని పిలుస్తున్న ఇద్దరబ్బాయిల కోసం నేను అస్సలు తగ్గను' అని ఆర్తి రవి రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే
తమిళ ప్రముఖ నిర్మాత ఇషారీ గణేష్ తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ శుభకార్యానికి తమిళ ఇండస్ట్రీ మొత్తం దాదాపు హాజరైంది. రజనీకాంత్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: ‘#సింగిల్’ మూవీ రివ్యూ)వెల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ గా అందరికీ తెలిసిన ఇషారీ గణేశ్.. 2016 నుంచి సినిమా నిర్మాతగా మారారు. చిన్నాపెద్దా హీరోలతో మూవీస్ చేశారు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే తన పెద్ద కూతురు ప్రీతా గణేశ్ ని లస్విన్ కుమార్ అనే కుర్రాడికి ఇచ్చి వివాహం చేశారు.గురవారం రాత్రి సంగీత్ జరగ్గా.. హీరో సూర్య హాజరయ్యారు. శుక్రవారం జరిగిన పెళ్లికి మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం-సుహాసిని, ప్రభు, అధిక్ రవిచంద్రన్, దర్శకుడు వాసు, గౌతమ్ మేనన్, హీరో జీవా, జయం రవి, సత్యరాజ్, సుందర్ సి, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
'థగ్ లైఫ్' ఈవెంట్ వాయిదా.. ఇది వేడుకల సమయం కాదు: కమల్
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. మే 16న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో భారత పౌరలకు ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.'ఆర్ట్ కెన్ వెయిట్.. ఇండియా కమ్స్ ఫస్ట్' అనే శీర్షికతో కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మే 16న జరగాల్సిన 'థగ్ లైఫ్' ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నాం. తిరిగి షెడ్యూల్ వివరాలను తెలుపుతాము. మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచలమైన ధైర్యంతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం నిర్ణయం తీసుకున్నాం. వేడుకలకు ఇదీ సరైన సమయం కాదని నేను నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన పంచుకున్నారు.‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు మళ్లీ కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తుంది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. Statement from Kamal Haasan#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR @ikamalhaasan #ManiRatnam @arrahman @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni… pic.twitter.com/jkMiXDBNG0— Raaj Kamal Films International (@RKFI) May 9, 2025 -
నటుడు రవి మోహన్తో జంటగా మళ్లీ కనిపించిన సింగర్
ప్రముఖ నటుడు రవి మోహన్ (జయం రవి) తన భార్యతో విడిపోయిన తర్వాత ప్రముఖ సింగర్తో డేటింగ్లో ఉన్నాడంటూ కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తాము స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరూ చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా వారిద్దరూ ఒక పెళ్లి వేడుకలో జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో వచ్చిన వదంతులు అన్నీ నిజమే కావచ్చని నెటిజన్లు ఇప్పుడు చెప్పుకొస్తున్నారు.వేల్స్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ ఇషారి కె. గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకలలో రవి మోహన్తో పాటుగా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కూడా జంటగా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో తమ మధ్య ఎలాంటి లవ్ లేదు.. కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ఈ జంట ఇప్పుడు జంటగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే రవి మోహన్ తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అవన్నీ పుకార్లు మాత్రమేనని, తాము స్నేహితులమని వారు చెప్పారు. తాము వృత్తిపరంగానే కలిశామని వారిద్దరూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అనవసరంగా తన విడాకుల మధ్య మూడో వ్యక్తిని లాగుతున్నారంటూ జయం రవి అసహనం వ్యక్తం చేశాడు. తన విడాకుల వ్యవహారానికి సింగర్ కెనిషాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయన చెప్పాడు.రవి మోహన్ విడాకులపై గతంలో సింగర్ ఏం చెప్పిందంటే..రవి మోహన్ విడాకుల విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని సింగర్, థెరపిస్ట్ కెనిషా ఫ్రాన్సిస్ గత ఇంటర్వ్యూలో చెప్పింది. జయం రవి మానసిక అనారోగ్యంతో బాధపడతున్నాడని, చికిత్స కోసమే తన వద్దకు వచ్చాడని అప్పట్లో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒక థెరపిస్ట్గా అతనికి చికిత్స అందించానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని వెల్లడించింది. ‘ఆర్తి, ఆమె పెరెంట్స్ పెట్టిన టార్చర్ కారణంగా రవి చాలా మానసికంగా క్రుంగిపోయాడని చెప్పుకొచ్చింది. ఆయన తనకు స్నేహితుడు, క్లయింట్ కూడా.. అంతకు మించి ఏమి లేదని చెప్పింది. గతంలో ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.కాగా, జయం రవి, ఆర్తిగా వివాహం 2009 జూన్లో జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఇల్లలు. 15 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన ఈ జంట.. గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. Yes, It's Keneesha who is sitting behind #RaviMohan !!It's their life, let them live...pic.twitter.com/OeaDDBfZRP— AmuthaBharathi (@CinemaWithAB) May 9, 2025 -
కష్టార్జితం చెదల పాలు... లారెన్స్ పెద్ద సాయం
కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు లారెన్స్. దివ్యాంగులకు ఎప్పటి నుంచో సేవ చేస్తున్న ఇతడు.. అప్పుడప్పుడు ఆపదలో ఉన్నవాళ్లని కూడ ఆదుకుంటూ ఉంటాడు. తాజాగా అలానే తమిళనాడుకి చెందిన ఓ మహిళకు ఆర్థిక సాయం చేసి మనసులు గెలిచేశాడు. విషయానికొస్తే.. శివగంగై జిల్లా తిరుప్పువనానికి చెందిన కుమార్, అతని భార్య ముత్తుకరుప్పి కూలీ పనులు చేసి డబ్బుని పొదుపు చేసుకున్నారు. ఆ మొత్తాన్ని హుండీలో దాచి, దానిని గొయ్యి తవ్వి పాతి పెట్టారు. కొన్నిరోజుల ముందు లెక్కించగా రూ.లక్ష ఉన్నట్లు తెలిసింది. తాజాగా మరోసారి తీసి చూడగా డబ్బులన్నీ చెదలు పట్టేశాయి. రూ.500 నోట్లని కొంతమేర తినేశాయి. దీంతో కన్నీటి పర్యంతమయ్యారు. (ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న కొరియోగ్రాఫర్ లారెన్స్.. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. పోగొట్టుకున్న రూ.లక్షని వారికి అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. లారెన్స్ కి ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ ముత్తుకరుప్పి కుటుంబానికి మాత్రం ఇది చాలా పెద్ద సాయమే.ప్రస్తుతం బెంజ్ అనే సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తనకు తోచిన సాయం చేసిన ఓ కుటుంబానికి అండగా నిలిచాడు.(ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
ప్రముఖ నిర్మాత కూతురి పెళ్లి.. 15 వేలమంది గెస్టులు
తమిళంలో పలు సినిమాలని తీసిన నిర్మాత ఇషారీ గణేశ్.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిపోయారు. ఎందుకంటే తన పెద్ద కుమార్తె ప్రీతికి భారీగా ఖర్చు చేసి పెళ్లి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ పెళ్లెప్పుడు? ఎవరెవరు రాబోతున్నారు?వేల్స్ యూనివర్సిటీ, వేల్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో అటు విద్యా రంగంలో, ఇటు సినిమా నిర్మాణంలో గుర్తింపు తెచ్చుకున్న ఇషారీ గణేశ్.. తన పెద్ద కూతురు ప్రీతికి చెన్నైలో శనివారం (మే 09) వివాహం చేయనున్నారు. ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులైన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ధనుష్, సూర్య, శివకార్తికేయన్ తదితరులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: మంచు మనోజ్.. 'అత్తరు సాయిబు'?) మరోవైపు గణేశ్ తండ్రికి రాజకీయ నేపథ్యం కూడా ఉండటంతో తమిళ రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు. మొత్తంగా 15 వేల మందికి పైగా అతిథులు ఈ పెళ్లికి వెళ్లనున్నారు. పూర్తిగా తమిళ సినిమాలే నిర్మించిన ఇషారీ గణేశ్ కు టాలీవుడ్ హీరోలతో పరిచయం ఉందో లేదో? లేదంటే తెలుగు హీరోలు కూడా ఈ పెళ్లికి హాజరవుతారేమో చూడాలి?తాజాగా గురువారం.. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో సంగీత్ వేడుక జరుగుతోంది. దీనికి హీరో సూర్య హాజరై కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు. పక్కనే రెట్రో సక్సెస్ మీట్ ముగించుకుని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్) -
రూ.10 కోట్లు దానం చేసిన హీరో సూర్య
తమిళ హీరో సూర్య మంచి మనసు చాటుకున్నాడు. గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన హిట్ పడట్లేదు. రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తెలుగులో తేలిపోయింది గానీ తమిళంలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పుడు తన చిత్రానికి వచ్చిన లాభాల నుంచి ఏకంగా రూ.10 కోట్లని సూర్య దానం చేశాడు. (ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2') రెట్రో సినిమాలో సూర్య హీరోగా నటించాడు. ఇతడికి చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా రూ.104 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే లాభాలు రావడంతో హీరో కమ్ నిర్మాత అయిన సూర్య ఫుల్ హ్యాపీ అయిపోయాడు. తనకు చెందిన అగరం ఫౌండేషన్ కి రూ.10 కోట్లు దానం చేశాడు. ఈ మేరకు నిర్వహకులకు చెక్ అందజేశాడు.2006లో అగరం ఫౌండేషన్ ని సూర్యనే స్థాపించాడు. తమిళనాడులో చదివించే స్థోమత లేని చాలామంది పిల్లలని చదివించడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇప్పటికే చాలామంది అగరం ద్వారా చదువుకుని ప్రయోజకులు అయ్యారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత) -
'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?
కొన్నిసార్లు చిన్న సినిమానే కదా ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ అదే భారీ దెబ్బ కొట్టొచ్చు. తమిళ ప్రేక్షకుల్ని ప్రస్తుతం ఎంటర్ టైన్ చేస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజ్ అనేసరికి చాలామంది.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడదే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ కథతో తీసిన ఈ సినిమా మే 01న రిలీజైతే ఇప్పటివరకు రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోటీలో ఉన్న రెట్రో కంటే దీన్ని చూసేందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) అసలు విషయానికొస్తే ఈ సినిమాని త్వరలో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తమిళ ఫ్లేవర్ తో తెరకెక్కిన కథ. దీన్ని తెలుగులో ఆదరిస్తారా అంటే సందేహమే. అదే టైంలో ఓటీటీలో రావడానికి నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.ఈ లెక్కన చూసుకుంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ఓటీటీలోకి మే 31న వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో సిమ్రాన్ తప్పితే మనకు తెలిసిన ముఖం లేదు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) -
'కాంతార' షూటింగ్ లో మరో అపశృతి
'కాంతార' పేరు చెప్పగానే సదరు సినిమాలోని క్లైమాక్సే మీకు గుర్తొస్తుంది కదా? ఎందుకంటే 2022లో రిలీజైన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్లుగా షూటింగ్ చేస్తున్నారు. ఇదివరకే ప్రమాదాలు చోటుచేసుకోగా ఇప్పుడు మరో అపశృతి జరిగింది.కన్నడ హీరో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. ఇదివరకే వచ్చింది రెండో పార్ట్ కాగా.. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్. ఏ క్షణాన షూటింగ్ మొదలైందో గానీ ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఒకటి రెండు కాదు చాలానే ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)తాజాగా జరిగిన సంఘటన గురించి చెప్పుకొంటే.. ఉడుపి జిల్లా కొల్లూరులో దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ గా కేరళకు చెందిన కపిల్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవడంతో దగ్గరలోని సౌపర్ణిక నదిలో ఈతకు దిగాడు. లోతు ఎక్కువుండేసరికి నీట ముగిని చనిపోయాడు. దీంతో విషాదం నెలకొంది.అంతకు ముందు కూడా 'కాంతార' టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిరోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓసారి పెద్ద గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. అలానే కొన్నిరోజుల క్రితం పంజుర్లీ దేవర హీరో,డైరెక్టర్ రిషభ్ శెట్టిని హెచ్చరించింది. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్, నీ చుట్టుపక్క వాళ్ల దగ్గరనుంచి నుంచే ఇది పొంచి ఉందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అసలేం జరుగుతుందా అని సందేహాలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!) -
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్రాజ్
తమిళగ వెట్రి కళగం నేత విజయ్, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను ప్రకాష్ రాజ్ కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్, విజయ్లకు ఇద్దరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తుచేశారు. విజయ్ కూడా తమిళ్లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్కు ఎలాంటి గుర్తింపు లేనప్పుడే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అయితే, పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తే.. విజయ్ మాత్రం ఇప్పుడే సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారన్నారు.విజయ్, పవన్లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు. ఆయనలో ఆవేశం తప్పా ఎలాంటి విజన్ లేదు. కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మార్పు కోసం అంటూ రాజకీయాలలోకి వస్తున్న వారు తమ ఇమేజ్ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు. విజయ్కు ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు. గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయ్కు ఉన్న ఇమేజ్ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. -
ఎట్టకేలకు '100' కొట్టేసిన సూర్య
సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. తెలుగులో రిలీజైన మొదటిరోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్, వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఎలాగోలా వంద మార్క్ దాటేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజైంది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో 'రెట్రో'తో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇది తమిళనాడు వరకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఐదు రోజుల తర్వాత రూ.104 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)ఎలాగైతేనేం సూర్య మూవీకి రూ.100 కోట్లు వచ్చేశాయి. ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు.ప్రస్తుతం సూర్య.. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా.(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత) -
డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
డ్రగ్స్ కేసుల వల్ల మలయాళ చిత్రసీమ హాట్ టాపిక్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ వాడుతున్నాడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కాసేపటికే బెయిల్ పై రిలీజయ్యాడు. వారం క్రితం ఇద్దరు మలయాళ దర్శకుల్ని ఇదే తరహా కేసులో అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ఇప్పుడు ఈ కేసులో మరో అప్డేట్. అరెస్ట్ అయిన సదరు దర్శకులు ఖలీద్ రెహ్మాన్, అష్రఫ్ హమ్జాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ సమీర్ తాహిర్ ని కూడా సోమవారం నాడు ఇదే డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లతో ఇతడికి సంబంధం ఉందనే ఆరోపణలతోపాటు ఇతడు అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో వీళ్లు ఉండటం దీనికి కారణం.అయితే తాను అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తనకు తెలియదని సమీర్ తాహిర్.. పోలీసులతో చెప్పుకొచ్చాడు. అయినా సరే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఇతడిపై కేసు నమోదు చేశారు. కానీ కాసేపటికే ఇతడు కూడా బెయిల్ పై బయటకొచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!) -
కర్ణాటక ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన స్టార్ సింగర్
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ బెంగళూరులో నిర్వహించిన సంగీత కచేరీ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రేక్షకుల ఆగ్రహానికి గురైన సోనూ, తాజాగా క్షమాపణలు చెప్పారు. ‘సారీ కర్ణాటక.. నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ’ అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్గా మారింది.అసలేం జరిగింది?గత నెల 25-26 తేదీల్లో బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సోనూ నిగమ్ ఒక సంగీత కచేరీ నిర్వహించారు. కచేరీ సందర్భంగా, కొంతమంది ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని గట్టిగా కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో సోనూ చిరాకు పడ్డారు. ఈ క్రమంలో ఓ అభిమాని కన్నడ పాటల డిమాండ్ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ డిమాండ్ను జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయని ఆరోపణలు వచ్చాయి.కన్నడ సంఘాల ఆగ్రహంసోనూ నిగమ్ వ్యాఖ్యలు కన్నడ భాష, సంస్కృతిని అవమానించాయని భావించిన కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. KRV బెంగళూరు సిటీ యూనిట్ అధ్యక్షుడు ధర్మరాజ్, సోనూ వ్యాఖ్యలు భాషల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాయని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరు పోలీసులు సోనూ నిగమ్కు నోటీసులు జారీ చేసి, వారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ బ్యాన్ఈ వివాదం నేపథ్యంలో, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోనూ నిగమ్పై బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది. ఈ నిషేధం కారణంగా సోనూ కర్ణాటకలో సంగీత కార్యక్రమాలు నిర్వహించడంపై ఆంక్షలు విధించినట్టు సమాచారం. అయితే, ఈ బ్యాన్కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సోనూ నిగమ్ బెంగళూరు కాన్సర్ట్ వివాదం కన్నడ భాష, సంస్కృతి చుట్టూ సున్నితమైన అంశాలను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, కన్నడిగుల ఆగ్రహం, పోలీసు విచారణ, ఫిల్మ్ ఛాంబర్ బ్యాన్ వంటి పరిణామాలు ఈ ఘటనను మరింత హైలైట్ చేశాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. -
ఆస్పత్రిలో నటుడు ఉపేంద్ర.. ఏమైందంటే?
కన్నడతో పాటు దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర(Upendra). రీసెంట్ టైంలో మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈయన ఆస్పత్రి పాలయ్యారని, అనారోగ్యం(Health Update) అని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ ఈ విషయమై స్వయంగా ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)'అందరికీ నమస్కారం. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సాధారణ చెకప్ కోసమే మాత్రమే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఇలాంటి పుకార్లతో అయోమయానికి గురవ్వొద్దు. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని ఉపేంద్ర ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు.ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎవరు ఆస్పత్రికి వెళ్లినా సరే అనారోగ్య సమస్యలు, పరిస్థితి విషమం తరహా వార్తలు వస్తున్నాయి. దీంతో సదరు నటీనటులు తప్పని పరిస్థితుల్లో ట్వీట్, పోస్ట్ ద్వారా స్పష్టత ఇవ్వాల్సి వస్తోంది. ఉపేంద్ర.. తెలుగులో రామ్(Ram Pothineni) హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన 'వరుణ్ తేజ్, లావణ్య')ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.. ನಾನು ಆರೋಗ್ಯವಾಗಿದ್ದೇನೆ.. ರೆಗ್ಯುಲರ್ ಚೆಕ್ ಅಪ್ ಗಾಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದೆ ಅಷ್ಟೇ.. ಯಾವುದೇ ಊಹಾ ಪೋಹ ಗಳಿಗೆ ಕಿವಿಕೊಟ್ಟು ಗೊಂದಲಕ್ಕಿಡಾಗಬೇಡಿ.. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಕಾಳಜಿಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದಗಳು 🙏— Upendra (@nimmaupendra) May 5, 2025 -
మోహన్ లాల్ సినిమాకు పైరసీ బెడద.. ఏకంగా టూరిస్ట్ బస్సులోనే!
మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్'. ఈ చిత్రంలో శోభన హీరోయిన్గా కనిపించింది. మలయాళంలో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లతో మలయాళ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో అభమానులు క్యూ కడుతున్నారు.సినీ ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టి పీడిస్తోన్న పైరసీ భూతం ఈ సినిమాను వదల్లేదు. గతంలో గేమ్ ఛేంజర్ మూవీలాగే ఈ చిత్రాన్ని కూడా ఓ టూరిస్ట్ బస్సులో ప్రదర్శించారు. కేరళలోని మలప్పురం నుంచి వాగమోన్కు వెళ్తున్న టూరిస్ట్ బస్సులో ఈ మూవీ ప్రదర్శించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ఈ మూవీ నిర్మాత ఎం రంజిత్ లీగల్ చర్యలకు సిద్ధమయ్యారు. ఆయన వెంటనే సైబర్ సెల్ ప్రధాన కార్యాలయంలో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ మంత్రి సాజి చెరియన్.. సరైన ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాగా.. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 10 రోజుల్లోపు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ సక్సెస్గా కొనసాగుతోంది. అంతేకాకుకండా ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతకుముందే మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ రూ. 246 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తుడరుమ్.. ఎల్2: ఎంపురాన్, మంజుమ్మెల్ బాయ్స్, 2018 చిత్రాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ మలయాళ చిత్రంగా నిలిచింది.Piracy .... Thudarum 😐🚶#Thudarum pic.twitter.com/ArCOgwsrT6— Deepu (@deepuva24) May 5, 2025 -
‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో జపనీస్ చిత్రం బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. భాష ఏదైనా సరైన భావం పలికించి చూపించేది సినిమా. అందులో డబ్బింగ్ వల్ల ప్రపంచంలోని ఏ మూల సినిమా అయినా మన భాషలో చూస్తుంటే మన చుట్టూ జరిగిన కథే అన్న భావన కలుగుతుంది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ చిత్రాలు ఇట్టే ఆకట్టుకుం టాయి. ఆ కోవకి చెందినదే ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన జపనీస్ సినిమా ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’(Bullet Train Explosion). ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ పేలుడు అనొచ్చు. ఈ మూవీ వల్ల మనకు రెండు అనుభూతులు కలుగుతాయి. (చదవండి: ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఓ పాకిస్తానీ.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?)ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతోంది. ఆ బుల్లెట్ ట్రైన్ అనుభూతిని ఈ చిత్రం ద్వారా అనుభవించవచ్చు. అలాగే జపాన్ దేశంలోని ట్రైన్ స్టేషన్, ట్రైన్ నంబర్లు కూడా మనం ఈ సినిమా ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్ ఉంటుందో అంతకు రెండింతలు ప్రేక్షకులు ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీలవుతారు. అంతలా ఈ సినిమాలో ఏముందంటే... కథ ప్రకారం ట్రైన్ నెంబర్ 5060బి షిన్ అమోరి నగరం నుండి జపాన్ రాజధాని టోక్యోకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్లో కజుయాతకైచి ఫస్ట్ లైన్ మేనేజర్గా ఉంటాడు. ట్రైన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఓ అగంతకుడు స్టేషన్కు ఫోన్ చేసి, ట్రైన్లో బాంబు పెట్టామని, ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకుండా వెళితేనే బాంబు పేలకుండా ఉంటుందని బెదిరిస్తాడు. ఆ బాంబు తీయాలంటే తనకు 100 బిలియన్ల డబ్బు అప్పజెప్పాలని కండిషన్ పెడతాడు. 2 గంటల 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా దాదాపు ట్రైన్లోనే నడుస్తుంది. మరి... ఆగకుండా వెళుతున్న ట్రైన్ పేలిపోతుందా లేదా మేనేజర్ ఆపగలుగుతాడా అన్నది తెలియాలంటే ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ సినిమా చూడాలి. 1994వ దశకంలో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘స్పీడ్’ని పోలి ఉంటుందీ సినిమా. కానీ ఈ చిత్రం క్లైమాక్స్ సూపర్ హైలైట్. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. – హరికృష్ణ ఇంటూరు -
మరోసారి వచ్చేస్తోన్న హార్ట్ బీట్.. సీజన్-2 ప్రోమో చూశారా?
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అయినా హార్ట్బీట్ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్లో పలు ఆసక్తికరమైన విషయాలకు పరిష్కారం చూపే విధంగా దీనికి సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రోమో ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.హార్ట్ బీట్ సీజన్–2ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో నటి దీపా బాలు, అనుమోన్, యోగలక్షి్మ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. Get ready for a double blast of fun and excitement 🥳❤️❤️#HotstarSpecials Heart Beat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar #HB2onJioHotstar… pic.twitter.com/akIbMEzuJf— JioHotstar Tamil (@JioHotstartam) May 4, 2025 Adhey Heart'u dhan, ana Beat'u vera.. ❤️❤️ Rina 2.0 coming soon 😉😎😍#HotstarSpecials HeartBeat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HeartBeat2Promo #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar… pic.twitter.com/WzxzFblVwj— JioHotstar Tamil (@JioHotstartam) May 1, 2025 -
స్టార్ హీరో తనయుడి యాక్షన్ చిత్రం.. దీపావళి బాక్సాఫీస్ వద్ద పోటీ!
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం'బైసన్ కాలమడాన్'. హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది ధైర్యం, సాహసం కలిగిన ఒక యువ క్రీడాకారుడి అందమైన కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.ఇది ఫుట్బాల్ క్రీడ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ధృవ్ విక్రమ్ వైవిధ్య భరిత కథా పాత్రలో నటించారు. షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నటి అనుపమ పరమేశ్వరన్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు అమీర్, లాల్, పశుపతి నటి రజీషా విజయన్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. అందులో నటుడు ధృవ్ విక్రమ్ చాలా కొత్తగా ఉండి చిత్రంపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బైసన్ కాలమడాన్ చిత్రం అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు తమిళ చిత్ర పరిశ్రమలో మరో మైలు రాయిగా నిలిచిపోతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. విభిన్న కథ, బలమైన కథనం, ఉత్తమ సాంకేతిక కళాకారుల శ్రమ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. -
డబుల్ ధమాకా
చిత్ర పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినప్పటికీ బిజీగా దూసుకెళుతున్నారు త్రిష. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ఫుల్ స్వింగ్లో ఉన్న త్రిష పుట్టినరోజు మే 4న. ఈ సందర్భంగా డబుల్ ధమాకాలా ఆమె నటిస్తున్న ‘విశ్వంభర, థగ్ లైఫ్’ సినిమాల నుంచి లుక్స్ రిలీజ్ చేశారు మేకర్స్. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వంభర’లో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఆదివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె నటించిన అవని పాత్ర లుక్ను రివీల్ చేశారు. అదే విధంగా కమల్హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. ఈ మూవీ నుంచి త్రిషపోస్టర్ని, అలాగే తొలి సింగిల్ ‘జింగుచు...’ పాటను కూడా విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యంగా అందించగా, శ్రీకృష్ణ, మంగ్లీ, ఆశిమా మహాజన్, వైశాలీ సామంత్ ఆలపించారు. ఈ సినిమా జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
హద్దులు చెరిపేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’:కేంద్ర మంత్రి మురుగన్
గడచిన 2024–25లో దేశంలో సెన్సారైన భారతీయ ఫీచర్ఫిల్మ్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 3,445. నలభై ఏళ్ళ పైచిలుకు క్రితం 1983లో మన వద్ద కేవలం 741 చిత్రాలు సెన్సారైతే, అంతకు సుమారు అయిదురెట్లు ఎక్కువగా ఇప్పుడు సెన్సార్ జరుపుకున్నాయి. ఆ స్థాయిలో చిత్ర నిర్మాణం పెరిగింది. సెన్సార్ విధానం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా సెన్సారైన మొత్తం భారతీయ చిత్రాల సంఖ్య – 69,113. ఒకప్పుడు 2001లో ప్రైవేట్ ఎఫ్.ఎంలు కేవలం నాలుగే ఉంటే, గత ఏడాదికి అది 388కి పెరిగింది.ఇక, ఇరవయ్యేళ్ళ క్రితం 2004–05లో దేశంలో ప్రైవేట్ టీవీ ఛానళ్ళ సంఖ్య 130 ఉంటే, ఇప్పుడది 908కి చేరింది. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు సైతం 15 నుంచి 531కి హెచ్చాయి. ఇలాంటి విశేషాలెన్నో ఉన్న హ్యాండ్బుక్ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ విడుదల చేశారు. ముంబైలో ఆదివారంతో ముగిసిన నాలుగు రోజుల ‘వరల్డ్ ఆడియో – విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)–2025లో భాగంగా ఆయన ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన నివేదికల్ని జనం ముందుంచారు. భారత ఆర్థిక వ్యవస్థపై సినిమా, టీవీ, స్ట్రీమింగ్ రంగాల పరిణామశీల ప్రభావాన్ని వివరిస్తూ, అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక ‘మోషన్ పిక్చర్ అసోసియేషన్’ (ఎంపీఏ) రూపొందించిన సమగ్ర నివేదికను సైతం మంత్రి ఆవిష్కరించారు. ‘‘భాషలు,ప్రాంతాల సరిహద్దులకు అతీతంగా భారతీయ కథలు అందరినీ అలరిస్తాయని మన ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి చిత్రాలు నిరూపించాయి. భారతీయ సినిమా ఇవాళ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రభావం చూపుతున్నాయి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంపీఏ ఛైర్మన్ – సీఈఓ అయిన ఛార్లెస్ రివ్కిన్, ‘‘భారత సినీ, టీవీ, ఆన్లైన్ వీడియో సర్వీస్ల (స్ట్రీమింగ్) పరిశ్రమల వల్ల 26.4 లక్షల మందికి ఉద్యోగాలు, 6.12 వేల కోట్ల డాలర్లకు పైగా వార్షిక రాబడి లభిస్తోంది’’ అని వివరించారు.25 శాతం వ్యూస్ ఓవర్సీస్లోనే!నేడు డిజిటల్ క్రియేషన్ వేగంగా పెరుగుతున్న భారత్లో 20 నుంచి 25 లక్షల మంది క్రియాశీలక డిజిటల్ క్రియేటర్స్ ఉన్నారు. వారు 35 వేల కోట్ల డాలర్లకు పైగా వినియోగదారుల వార్షిక వ్యయం జరిగేలా ప్రభావితం చేస్తున్నారు. నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఇతర దేశాలతోపోలిస్తే భారత్లో యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సేవలు 40 నుంచి 60 శాతం చౌక అని నివేదికల్లో పేర్కొన్నారు. తెరపై భారతీయ కథాకథనాలకు ఎంతటి ప్రాచుర్యమంటే, ఇవాళ మన ఓటీటీ కంటెంట్లో దాదాపు 25 శాతం దాకా వ్యూస్ విదేశీ వీక్షకుల నుంచే వస్తున్నాయి. ‘‘అందుకే, సినిమా కేవలం ఆర్థిక వ్యవహారమే కాదు, దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక వారధి కూడా’’ అని మంత్రి అభిప్రాయపడ్డారు.సాధనతోనే సాఫల్యం: ‘‘ఒకప్పుడు అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇవాళ కొత్తవాళ్ళు తమ ప్రతిభను ప్రదర్శించడానికి స్వతంత్ర వేదికలతో పాటు సోషల్ మీడియా ఉంది. అయితే, ఔత్సాహికులకు సాధన అవసరం. ఎప్పటికప్పుడు తమ సంగీతపోర్ట్ఫోలియోను సిద్ధంగా ఉంచుకొని, మెరుగులు దిద్దుకుంటేనే పైకొస్తారు. తమ గాత్రం, సంగీతం రెండూ నాణ్యంగా ఉండేలా చూసుకొంటేనే జనానికి నచ్చుతుంది. పరిశ్రమలో గుర్తింపు దక్కుతుంది.’’ – ‘వేవ్స్’లో ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ కం΄ోజర్ హిమేశ్ రేషమియాడిజిటల్కూ తప్పని తలనొప్పి!: థియేటర్లలోని సినిమాలకే కాదు... డిజిటల్ కంటెంట్ ఆర్థిక వ్యవస్థకు సైతం పెనుభూతంగా మారిన పైరసీ సమస్య పైనా వేవ్స్లో చర్చ సాగింది. అందరూ సమన్వయంతో, బహుముఖంగాపోరాడితేనే దాన్ని అరికట్టవచ్చని మీడియా, లా, సైబర్ సెక్యూరిటీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2025 నుంచి 2029 మధ్య వచ్చే అయిదేళ్ళలో ఆన్లైన్ పైరసీ వల్ల పరిశ్రమ ఆదాయంలో 10 శాతం పైగాపోతుందనీ, అదే సమర్థంగా యాంటీ పైరసీ చర్యలు తీసుకోగలిగితే లీగల్ వీడియో సర్వీస్ యూజర్ల ఆదాయం 25 శాతం పెరుగుతుందనీ నిపుణులు అంచనా వేశారు. పైరసీ నివారణ చర్యలు కీలకమనీ, పైరసీదారులను ప్రాసిక్యూట్ చేయడంలోని ఇబ్బందుల్ని పరిష్కరించాలనీ పేర్కొన్నారు. కాగా, రానున్న జూలైలో సీబీఐ, ఇంటర్΄ోల్ సాయంతో ఐఎస్బీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ సంస్థ ప్రత్యేకంగా ‘డిజిటల్ పైరసీ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఓవైపు బరువు.. మరోవైపు మోకాళ్ల నొప్పి.. అయినా సరే
హీరోయిన్లు తమ గ్లామర్ ఎప్పటికీ కాపాడుకుంటూనే అవకాశాలు వస్తుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్త వహించి, నోటికొచ్చింది తిన్నా, జిమ్ చేయకపోయినా బరువు పెరిగిపోతారు. ఇప్పుడు అలానే బరువు పెరిగిపోయిన ఓ టాలీవుడ్ హీరోయిన్.. తన వెయిట్ లాస్ జర్నీ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.స్వతహాగా కిక్ బాక్సర్ అయిన రితికా సింగ్.. 'సాలా ఖాదుస్' తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఈ మూవీనే తెలుగులో వెంకటేశ్ 'గురు'గా రీమేక్ చేశారు. గత కొన్నాళ్లలో తమిళంలోనే వరస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఈ మధ్యనే ఎందుకో బరువు పెరిగింది. సరిగ్గా మూడు నెలల్లో మళ్లీ తగ్గిచూపించింది. ఈ వీడియోనే ఇప్పుడు పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు) 'గత మూడు నెలల్ని అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పటివరకు లేనంతగా బరువు పెరిగాను. మరోవైపు మోకాళ్ల గాయం పరిస్థితి దారుణంగా తయారైంది. నొప్పి తట్టుకోలేకపోయాను. కదల్లేకపోయాను. డ్యాన్స్ కూడా చేయలేకపోయాను. దీంతో నన్ను నేను ఓసారి అద్దంలో చూసి.. ఇక చాలు అని నాతో నేనే చెప్పుకొన్నా.''ఇక ఫుడ్ తో నా రిలేషన్ షిప్ విషయానికొస్తే ఇప్పుడు చాలా చెడు అలవాట్లని నా కంట్రోల్ లో పెట్టుకున్నాను. దీనికోసం చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను' అని రితికా సింగ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
మరో కాంతార లాంటి సినిమా.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలతో సంగీత దర్శకుడిగా సంచలనం సృష్టించిన రవి బస్రూర్. ఆ తర్వాత వీర చంద్రహాస చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్, ఉదయ్ కడబాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్పై ఎన్ఎస్ రాజ్కుమార్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 18న కన్నడలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది.ఈ నేపథ్యంలోనే వీర చంద్రహాస మూవీ తెలుగు టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. యక్షగానం ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కాగా.. కన్నడలో సూపర్ హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్పై ఎమ్వీ రాధాకృష్ణ విడుదల చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో విజయవంతంగా రిలీజ్ చేశారు. తాజాగా వీర చంద్రహాస మూవీ రైట్స్ను ఆయనే సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయినా ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే. -
విజయ్ సేతుపతి- నిత్యా మీనన్ 'టైటిల్' టీజర్ విడుదల
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. ‘తలైవా తలైవి’ టైటిల్ను మేకర్స్ పిక్స్ చేశారు. దీనిని ప్రకటిస్తూ తాజాగా టైటిల్ టీజర్ను విడుదల చేశారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల కానుంది.ఇకపోతే ఇందులో నటుడు విజయ్ సేతుపతి పరోటా మాస్టర్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. గతంలో ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.నిత్యామీనన్, విజయ్ సేతుపతి కలిసి కిచెన్లో వంటను ప్రిపేర్ చేస్తూనే గొడవపడుతూ ఉంటారు. వారిద్దరూ సరదాగా పోట్లాడుకుంటూ భార్యాభర్తలుగా కనిపిస్తారు. ఒకరిపైమరోకరు పెద్దగా అరవడం మొదలు పెడుతారు. అప్పుడు విజయ్ చేసేదేం లేక తన నోటికి టవల్ని కట్టుకొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండిపోతాడు. ఈ మూవీలో నిత్యామీనన్ డామినేషన్ ఎక్కువగా కనిపించేలా ఉంది. -
'త్రిష' జీవితాన్ని మార్చేసిన రెండు సినిమాలు ఇవే..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నేడు 42వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష తెలుగు, తమిళ్తో పాటు బాలీవుడ్లోనూ నటించింది. ఇటీవల కెరీర్లో లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉంది. అయితే, ప్రతి ఒక్కరికి జీవితాన్ని మార్చేసిన సినిమా అంటూ ఒకటి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ, బాలకృష్ణకు మంగమ్మగారి మనవడు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సినిమా తమ జీవితాన్ని మార్చేసి ఉంటుంది. అలా త్రిష జీవితాన్ని టర్న్ చేసిన రెండు చిత్రాలు ఉన్నాయి.వర్షంతో మార్పు2004లో ప్రభాస్తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్లో త్రిష చేరిపోయారు.'గిల్లీ'తో భారీగా ఆఫర్లు తెలుగులో మహేశ్ బాబు- భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒక్కడు’కు రీమేక్గా ‘గిల్లీ’ చిత్రం తమిళ్లో 2004లో విడుదలైంది. ఇందులో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 రోజులకు పైగా కొనసాగింది. విజయ్ కెరీర్లో ఇది అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిస్తే త్రిషకు తమిళ్లో భారీ ఆఫర్స్ను తెచ్చిపెట్టింది. ఏకంగా ఆమెకు 12 సినిమా ఛాన్సులు దక్కాయి. ఆపై వాణిజ్యం ప్రకారం, ఈ చిత్రం 2004లో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా రజనీకాంత్ నటించిన నరసింహా ఉండేది. దానిని గిల్లీ దాటేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా రాబట్టడమే కాకుండా అనేక రికార్డ్స్ను అందుకుంది. బాలీవుడ్కు దూరంగా ఎందుకు ఉన్నానంటే: త్రిషబాలీవుడ్లో 'కట్టా మిఠా' అనే చిత్రంలో త్రిష నటించారు. అయితే, అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్లో అవకాశాలు రాలేదా..? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ.. తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు.దీంతో బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్లో తన కెరీర్ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ కమలహాసన్కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. -
ఇద్దరమ్మాయిలతో...
వెండితెరపై హీరోలు ప్రేమ కోసం యుద్ధాలు చేస్తారు... త్యాగాలు చేస్తారు. అవçసరమైతేప్రాణాలు తీసుకుంటారు. అలాంటిది ఓ హీరోను ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తే ఏం చేస్తారు? ఏ అమ్మాయి ప్రేమకు ‘యస్’ చెబుతారు? అనేది పెద్ద సమస్య. ఇలాంటి సమస్యతో... ‘ఇద్దరమ్మాయిలతో’ అంటూ ‘డ్యూయెల్ లవ్’ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్న కొందరు హీరోలపై ఓ లుక్ వేయండి.దొరబాబు లవ్వుచిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాలో నలుగురుకిపైగా హీరోయిన్స్ నటిస్తున్నారని తెలిసింది. అయితే ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథన్ మాత్రం మెయిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమాలో ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ, వీరివి చిరంజీవి సిస్టర్స్ పాత్రలుగా ఉంటాయట. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని తెలిసింది. మరి... దొరబాబు ప్రేమను గెలిచేది ఎవరు? దొరబాబు ఇష్టపడేది ఎవర్ని? అనేది చూడాలి. ‘విశ్వంభర’లో సెంటిమెంట్తో పాటుగా ఉన్న లవ్ ట్రాక్ కూడా ఆడియన్స్ను అలరిస్తుందని సమాచారం. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందున్న ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ ఇది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్పై విక్రమ్ రెడ్డి, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.రాజాసాబ్ ఎవరి సొంతం?‘రాజాసాబ్’తో ఇద్దరు హీరోయిన్స్ లవ్లో పడ్డారట. మరి... ‘రాజా సాబ్’ మనసులో ఎవరు ఉన్నారనేది? తెలియాలంటే మరికొంత సమయం వేచి ఉండాలి. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తున్న ఇంటెన్స్ హారర్ అండ్ కామెడీ ఫిల్మ్ ‘రాజా సాబ్’. మూడు తరాలు, ఆత్మలు వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో నటి రిద్ధీ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాలోని హీరోయిన్స్ నిధీ–మాళవికా మోహనన్లతో హీరో ప్రభాస్కు లవ్ ట్రాక్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెలలో టీజర్ రిలీజ్ అవుతుందని, ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలవుతుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ట్రిపుల్ లవ్పన్నెండేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఇద్దరమ్మాయిలుగా అమలాపాల్, కేథరిన్ నటించారు. అయితే ఇప్పుడు ముగ్గుర ు అమ్మాయిలతో సినిమా చేయనున్నారు అల్లు అర్జున్. కానీ... ముగ్గురు అమ్మాయిలతో అనేది సినిమా పేరు కాదు. అల్లు అర్జున్ హీరోగా నటించనున్న నెక్ట్స్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారట. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది.ఈ మూవీలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారని, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకోన్, అనన్యా పాండే, శ్రద్ధా కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ఏ ముగ్గురు హీరోయిన్స్ ఫిక్స్ అవుతారో చూడాలి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదేప్రారంభించి, 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతుందని సమాచారం.బెగ్గర్ లవర్ ఎవరు?హీరో విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బెగ్గర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో టబు నటించనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కాగా ఇదే చిత్రంలో రాధికా ఆప్టే, నివేదా థామస్ కూడా నటించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. మరి... బెగ్గర్ లవర్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జాన్లోప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ను అరవైరోజుల్లోనే పూర్తి చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారనే వార్తలు తెరపైకి వచ్చాయి.రెండు సినిమాలు... నలుగురు హీరోయిన్స్హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటి స్తున్నారు. శర్వానంద్ చేస్తున్న మూడు సినిమాల్లో... రెండు చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే రొమాంటిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లు. ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారని తెలుస్తోంది.అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ‘భోగి’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా చేస్తున్నారు. ‘శతమానం భవతి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శర్వాందన్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మళ్లీ ‘భోగి’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అలాగే ఈ ‘భోగి’ చిత్రంలోనే మరో హీరోయిన్ డింపుల్ హయతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 1960 నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇంకా శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘రేస్ రాజా’ (వర్కింగ్ టైటిల్) ఉన్న సంగతి తెలిసిందే.ట్రయాంగిల్ లవ్స్టోరీఇద్దరు అమ్మాయిల ప్రేమలో ఇరుక్కున్న ఓ అబ్బాయి కథ ఏంటో తెలియాలంటే ఈ నెల 9న విడుదలవుతున్న ‘సింగిల్’ సినిమా చూడాలి. ఈ చిత్రంలో శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ– ఇవానా హీరోయిన్లుగా నటించారు. పూర్వ పాత్రలో కేతికా శర్మ, హరిణి పాత్రలో ఇవానా కనిపిస్తారు. హీరో ఫ్రెండ్ పాత్రను ‘వెన్నెల’ కిశోర్ చేశారు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. కథ రీత్యా... హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు, మరో అమ్మాయి హీరోని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఫైనల్గా హీరో ఏ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుందట.యుద్ధం... ప్రేమ!నిఖిల్ హీరోగా చేస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో సంయుక్త, నభా నటేశ్లు హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ ఇద్దరిలో సంయుక్త పాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉంటాయని తెలిసింది. అలాగే ఈ మూవీలో మంచి లవ్ ఎపిసోడ్స్ ఉన్నాయని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. తొలి భాగం ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.ఇలా ఇద్దరు హీరోయిన్స్ ప్రేమలో పడ్డ మరికొంత మంది హీరోల సినిమాలు ఉన్నాయి. -
టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ'
చిన్న లేదా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలని.. స్టార్ హీరోల చిత్రాలకు పోటీగా రిలీజ్ చేసేందుకు కాస్త ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఇది మైనస్ అయితే మరికొన్నిసార్లు ప్లస్ అవ్వొచ్చు. తాజాగా తమిళంలో సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజైన ఓ చిన్న మూవీకి ఇలానే ప్లస్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సినిమా? దాని సంగతేంటి?(ఇదీ చదవండి: కొత్త రికార్డ్.. మహేశ్ బాబు తర్వాత నానినే) తెలుగులో ఈ వారం హిట్ 3 రిలీజైంది. సక్సెస్ అందుకుంది. తమిళంలో సూర్య రెట్రో విడుదలైంది. కానీ పాజిటివ్ టాక్ రాలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ వీకెండ్ దాటితే రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ చిత్రానికి పోటీగా తమిళంలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా రిలీజైంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంది.ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ తప్పితే ఇందులో తెలుగువాళ్లకు తెలిసిన ముఖాలేం లేవు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' కథ విషయానికొస్తే.. శ్రీలంకకు చెందిన ధర్మదాస్ అనే వ్యక్తి.. కొవిడ్ వల్ల ఆర్థికంగా బాగా నష్టపోతాడు. దీంతో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకుని చెన్నైకి వలస వస్తాడు. ఆ తర్వాత తను ఉంటున్న కాలనీ వాసులతో ఎలా కలిసిపోయాడు? వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చాడనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకుంటా.. అందరికీ సమాధానమిస్తా: జాను లిరి) ఈ సినిమాలో సింపుల్ స్టోరీనీ అద్భుతంగా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అసలు మనిషి జీవితం ఎలా ఉండాలి? ఆ జీవితం మిగతావారితో కలిసి ఎలా జీవించాలి? ప్రతి మనిషి మరో మనిషికి తోడుగా ఉంటూ ఒకరికి ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనే అంశాల్ని ప్రేక్షకుల మనసుకు తాకేలా, చూస్తున్నంతసేపు గుండె బరువెక్కేలా ఈ సినిమాని తీయడం విశేషం.రెట్రో మూవీకి ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఉండొచ్చు గానీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'కి ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ గట్టిగా ఉండొచ్చు. ఈ సినిమాని తీసింది ఓ యూట్యూబర్ కావడం ఇక్కడ కొసమెరుపు. ప్రస్తుతానికైతే ఇది తమిళంలో మాత్రం రిలీజైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ పై దర్శకుడి తెలివితక్కువ వాదన) -
నేను ఒక యాక్సిడెంటల్ నటుడిని.. అప్పుల కోసమే నటించా: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో అభిమానులను అలరించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఇటీవలే పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఏ క్షణంలోనైనా సినిమాలను అర్ధాంతరంగా వదిలేయాల్సి రావొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తాను యాక్సిడెంటల్గా నటనలోకి వచ్చానని వెల్లడించారు. తన జీవితంలో రేసర్ కావాలని కోరుకున్నానని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల కుదరలేదని తెలిపారు. నీకిష్టమైన పనినే చేయాలని తన తండ్రి చెప్పేవారని.. కానీ అప్పులు తీర్చడానికి మోడలింగ్ వైపు అడుగులు వేశానని పేర్కొన్నారు. ఆ తర్వాత పూర్తి నటుడిగా మారి ఉన్న అప్పులన్నీ తీర్చానని వెల్లడించారు. -
అభిమాని కోరికను ‘పహల్గాం’ఘటనతో పోల్చిన సింగర్.. కేసు నమోదు!
కాన్సర్ట్ మధ్యలో పహల్గాం దాడి గురించి ప్రస్తావించినందుకుగానూ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్(Sonu Nigam) చిక్కుల్లో పడ్డారు. అతని వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగమ్పై కర్ణాటక రక్షణ వేదిక (KRV)బెంగళూరు నగర జిల్లా అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? కన్నడ ప్రజలు అతనిపై ఎందుకు అసహజం వ్యక్తం చేస్తున్నారు?కన్నడ పాటలోనే పాడాలిబాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్కి సంగీత ప్రపంచంలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలోనే ఎక్కువ పాటలు పాడినప్పటికీ..తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ..ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. తుళు, మైథిలీ, నేపాలి భాషల్లోనూ ఆయన పాటలు ఆలపించారు. ఆయన నిర్వహించే సంగీత కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు హాజరవుతుంటారు. తాజాగా ఆయన బెంగళూరులో కాన్సర్ నిర్వహించారు. సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడ భాషలో పాడాలంటూ డిమాండ్ చేశారు. ఆ అభిమాని పదే పదే అదే కోరడం..గట్టిగా అరవడంతో సోనూ నిగమ్ సహనం కోల్పోయాడు. పాటలు పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకుల గురించి మాట్లాడారు. కన్నడ భాష అంటే తనకు కూడా ఇష్టమేనని..కానీ ఆ అభిమాని ఆ భాషలోనే పాడాలని బెదిరించడం తనకు నచ్చలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి ప్రస్తావించారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాం దాడికి ఇలాంటి వ్యాఖ్యలే కారణం. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని ఘాటుగా స్పందించారు.Look at this shameless #SonuNigam Riduculing a fan for requesting him to sing a Kannada song in Bengaluru and Blaming Languages for the Terrorist attack.., off-late its become fashion to blame Kannada for these Hindi jihadis for everything.When u have no seed to question the… pic.twitter.com/pw2w9vjj8h— Prathap ಕಣಗಾಲ್💛❤️ (@Kanagalogy) May 1, 2025 సింగర్పై కన్నడ ప్రజలు అసహనంసోనూ నిగమ్ భాషను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కొంతమంది తమ మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికతో పాటు మరికొంత మంది కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే కాన్సర్ట్లో సోనూ నిగమ్ కన్నడ ప్రేక్షకులపై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. నేను అన్నిభాషల్లో పాటలు పాడాను కానీ.. ఎక్కువగా కన్నడలోనే మంచి పాటలు పాడాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది. నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా అనుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను ఎక్కడ కాన్సర్ట్ నిర్వహించిన అక్కడకి కన్నడ ప్రజలు వస్తారు. వారి కోసం ఆ భాషలో పాటలు పాడుతాను. కానీ ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడాలని బెదిరించడం నా మనసుని నొప్పించింది’ అని సోనూ నిగమ్ అన్నారు. ಸೊನು ನಿಗಮ್ ವಿರುದ್ದBNS 352(1)BNS 352(2)BNS 353 ಅಡಿಯಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದ ವ್ಯಾಪ್ತಿಯ ಆವಲಹಳ್ಲಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ದಾಖಲಿಸಲಾಗಿದೆ. 24 ಗಂಟೆಯ ಒಳಗೆ FIR ದಾಖಲಿಸುವುದಾಗಿ ಪೊಲೀಸರು ಹೇಳಿದ್ದಾರೆ.ನಾಳೆ ಘಟನೆ ನಡೆದ ಈಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಕಾಲೇಜಿನ ವಿರುದ್ದ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆComplaint Filed Against Sonu NigamA… pic.twitter.com/Nx6gb6hqxo— ಅರುಣ್ ಜಾವಗಲ್ | Arun Javgal (@ajavgal) May 2, 2025 -
'విజయ్' ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. నిజమే అంటూ 'రష్మిక' హింట్
వెండితెరపై విజయ్ దేవరకొండ-రష్మికలది (Rashmika) ప్రత్యేకమైన జోడీ అని చెప్పవచ్చు. వారిద్దరు మరో సినిమాలో కలిసి నటించాలని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ‘గీత గోవిందం’తో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్ కామ్రేడ్’తో అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై వారిద్దరూ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. మరోసారి రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ(Vijay devarakonda) స్క్రీన్పై కనిపించనున్నాడని అర్థం అవుతుంది.విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రానుంది. గతంలో ఆయన తెరకెక్కించిన టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విజయ్తో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటించనుంది. అందుకు సంబంధించిన ఒక హింట్ను మొదటగా మైత్రి మూవీస్, రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ ఎక్స్ పేజీలో పోస్ట్ చేస్తూ.. రష్మికను ట్యాగ్ చేశారు. దానికి ఆమె నిజమే గాయ్స్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా విజయ్- రష్మికల సినిమా గురించే అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, HMMLetsee అనే దానికి అర్థమేంటి..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఇప్పుడు మరోసారి విజయ్- రష్మికలతో ఒక పెద్ద ప్రాజెక్ట్కు ప్లాన్ చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన రష్మక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె విజయ్తో ఉన్న స్నేహం వల్ల తేదీలు సర్ధుబాటు చేయనుందట. VD14 అనే వర్కింగ్టైటిల్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఫైనల్ చేశారని టాక్. రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు గతంలో విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ బిగ్ ప్రాజెక్ట్తో ఆయన కోరిక తీరబోతుందని అభిమానులు చెబుతున్నారు. #HmmLetsSee @iamRashmika 😉— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025 -
ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్
‘వేవ్స్’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్ (‘పుష్ప’లో అల్లు అర్జున్), రాఖీ భాయ్ (‘కేజీయఫ్’లో యశ్), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్) లాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్బస్టర్ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ అలాగే, క్రియేట్ ఇండియా ఛాలెంజ్ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది.భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్ పవర్గా సినిమా, డిజిటల్ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్ ఖేర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్ రిచర్డ్ జి. కెర్రీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్ పురీ సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్ వేర్లతో ఆడియోలో సౌండ్ ఎఫెక్ట్ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్ సాధనం... సినిమా. నేను కశ్మీర్లో షూటింగ్ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్ దేవరకొండహీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.‘‘లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’. – నటి ఖుష్బూ‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’. – నటుడు అనుపమ్ ఖేర్‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్ జోహార్‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్ అందుబాటులో ఉంది. మొబైల్తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’. – తమిళ హీరో ‘జయం’ రవి -
బలవంతంగానైనా సినిమాలకు గుడ్బై చెప్తా..: అజిత్
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.రిటైర్ అవొచ్చేమో..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్ను జయించినవాళ్లు కూడా ఉన్నారు. కాలాన్ని వృథాగా పోనివ్వనుజీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి -
హీరోయిన్ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్ ప్యాక్ చేశా: అల్లు అర్జున్
అప్పట్లో ఆరుఫలకల దేహానికి ఉన్న క్రేజే వేరు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు.. చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్లు ట్రై చేసినవారే.. తెలుగుకు ఆ ట్రెండ్ను తీసుకొచ్చింది మాత్రం హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అనే చెప్పాలి. దేశముదురు సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత చాలామంది తెలుగు హీరోలు ఈ ట్రెండ్ను ఫాలో అయ్యారు.20 ఏళ్ల కిందట..గురువారం నాడు వేవ్స్ సదస్సు (Waves Summit 2025)కు హాజరైన అల్లు అర్జున్ ఈ ట్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బన్నీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం దక్షిణాదిన ఏ నటుడూ చేయని పని నేను చేసి చూపించాను. మన వల్ల కాదు అన్న పనిని చేసి చూపిస్తే ఆ కిక్కే వేరు. నిజానికి నేను ఆరు ఫలకల దేహం కోసం ప్రయత్నించడానికి ఓ హీరోయిన్ ముఖ్య కారణం. తను నాతో ఓ సినిమా కూడా చేసింది. సౌత్లో ఎవరూ సిక్స్ ప్యాక్స్ చేయలేరు అని కామెంట్స్ చేసింది. సిక్స్ ప్యాక్ చేసి చూపించా..అది నాకు నచ్చలేదు. ఎందుకు చేయలేరు? అని ప్రశ్నించుకున్నాను. ఛాలెంజ్గా తీసుకున్నాను. సిక్స్ ప్యాక్స్ చేసి చూపించాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. దేశముదురు చిత్రంలో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హన్సిక కథానాయికగా నటించింది. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం 2007 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే? -
చేసిన ప్రతి సినిమా హిట్.. ఎవరీ శ్రీనిధి శెట్టి?
సాధారణంగా హీరోయిన్లు వరసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ హిట్ కొట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్లతో పోలిస్తే కాస్త భిన్నమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. చేసింది తక్కువ సినిమాలే అయినా కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు 'హిట్ 3'తో మరోసారి సక్సెస్ అందుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడిత ఇంతకీ శ్రీనిధి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)ఈమె పూర్తి పేరు శ్రీనిధి రమేశ్ శెట్టి. మంగళూరులో పుట్టి పెరిగిన ఈమె తుళువ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. యాక్సెంచర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇందులో జాబ్ చేస్తూనే మోడల్ గానూ పనిచేసింది. అలా 2016 మిస్ సూపర్ నేషనల్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ అవార్డ్ గెలిచిన రెండో దక్షిణాది అమ్మాయిగా రికార్డ్ కూడా సృష్టించింది.ఇలా మోడల్ గా చాలా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. అనుకోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టిలో పడింది. అలా కేజీఎఫ్ ఫ్రాంచైజీలో ఈమెని హీరోయిన్ గా తీసుకున్నాడు. స్వతహాగా ఇది హీరో సెంట్రిక్ సినిమా అయినప్పటికీ రీనా దేశాయ్ అనే పాత్రలో శ్రీనిధి నటన ఆకట్టుకుంది. అలా ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.కేజీఎఫ్ 2 రిలీజైన కొన్నాళ్లకు తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమా చేసింది. ఇది తెలుగులో ఆడలేదు గానీ తమిళంలో మాత్రం మోస్తరు హిట్ గా నిలిచింది. 2022లో కోబ్రా చేసిన శ్రీనిధి.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి 'హిట్ 3'తో పరిచయమైంది.(ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)హిట్ 3 కూడా హీరో సెంట్రిక్ యాక్షన్ మూవీ కావడంతో శ్రీనిధి శెట్టికి ఏమంత ప్రాధాన్య ఉండదులే అని చాలామంది అనుకున్నారు. స్టోరీకి అవసరమయ్యే పాత్ర ఈమెకు దక్కడం, మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీనిధి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది.లెక్క ప్రకారం హిట్ 3 ఈమెకు మొదటి తెలుగు సినిమా కాదు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కోసం ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని.. శ్రీనిధిని చూసి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో అసలు కంటే ఈ సినిమా ముందొచ్చింది. హిట్ కొట్టేసింది.మరోవైపు హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ్'లోనూ శ్రీనిధినే సీతగా ఎంపిక చేశారు. కానీ రావణుడి పాత్ర కోసం యష్ వచ్చేసరికి.. ఈమెకి దక్కిన అవకాశం చేజారిపోయింది. సీత పాత్రలోకి సాయిపల్లవి వచ్చింది. ఏదేమైనా నిదానంగా సినిమాలు చేస్తున్న శ్రీనిధి శెట్టి.. చేసిన ప్రతి మూవీతోనూ హిట్ అందుకోవడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?) -
అమ్మకు మీ అందరి ఆశీస్సులు కావాలి: రాఘవ లారెన్స్
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గురించి పరిచయం అక్కర్లేదు. కేవలం సినిమాలే కాదు.. సమాజ సేవలోనూ రాఘవ లారెన్స్ ముందుంటారు. తన వంతుసాయంగా రైతులు, పేదలకు ఆర్థికంగా నిలబడేందుకు ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తుంటారు. అలా రీల్ హీరోగా రాణిస్తూనే.. రియల్ లైఫ్లోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇవాళ తన మాతృమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. అమ్మ పుట్టినరోజు శుభవేళ మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ మదర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే రాఘవ లారెన్స్ చివరిసారిగా జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించారు. 2023లో బాక్సాఫీస్ వద్ద రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. Hi Everyone, Today is my mother’s birthday. I need all your wishes and blessings 💐 pic.twitter.com/3QAWRisjvD— Raghava Lawrence (@offl_Lawrence) May 2, 2025 -
సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?
సూర్య పేరుకే తమిళ హీరో. కానీ తెలుగులోనూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే మన దగ్గర కూడా హౌస్ ఫుల్స్ పడతాయి. అలాంటిది గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు. సూర్య కోసమని తెలుగు ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తున్నారు. కానీ అసంతృప్తితో బయటకు వస్తున్నారు. ఇంతకీ సూర్య ఎందుకిలా చేస్తున్నాడు? (ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)ఈ మధ్య కాలంలో సూర్యకు థియేటర్లలో సరైన హిట్ అన్నదే పడట్లేదు. అదేంటి జై భీమ్, ఆకాశమే హద్దురా సినిమాలు హిట్ అయ్యాయి కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇవి రెండూ లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైపోయాయి. కాబట్టి ఇవి థియేటర్ లెక్కలోకి రావు. 2017లో సింగం 3 రిలీజైన తర్వాత సూర్య నుంచి గ్యాంగ్, ఎన్జీకే, బందోబస్త్, ఈటీ, కంగువ.. ఇప్పుడు రెట్రో సినిమా థియేటర్లలోకి వచ్చాయి. రెట్రో గురించి కాసేపు పక్కనబెడితే అంతకు ముందు విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు రెట్రో చిత్రానికి కూడా తమిళంలో టాక్ ఓకే గానీ తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా అయితే లేదు. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి కష్టమైవడం గ్యారంటీ. తమిళంలో ఇలానే ఉండే అవకాశాలు లేకపోలేదు.(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)సూర్య యాక్టింగ్, కష్టపడటం ఏమన్నా తక్కువ చేస్తున్నాడా అంటే అస్సలు లేదు. కానీ అతిగా దర్శకుల్ని నమ్మడమే ఇతడికి మైనస్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది వచ్చిన 'కంగువ'పై సూర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరో బాహుబలి అవుతుందనుకున్నాడు. డైరెక్టర్ శివని చాలా నమ్మాడు. కట్ చేస్తే ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది.ఇప్పుడు రెట్రో విషయంలోనూ చాలామంది ప్రేక్షకులు సూర్యని ఏం అనట్లేదు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అసలు ఎందుకు ఇలాంటి సినిమా తీశాడా? సూర్య.. అసలు ఇలాంటి కథని ఎలా ఒప్పుకొన్నాడా అని మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం సూర్య చేతిలో ఆర్జే బాలాజీ తీస్తున్న '45', సార్-లక్కీ భాస్కర్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో తీయబోయే సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు 'వడివాసల్' చిత్రం కూడా ఉంది. వీటితోనైనా హిట్ కొట్టి సూర్య కమ్ బ్యాక్ ఇస్తే అభిమానులకు అదే హ్యాపీ. లేదంటే మాత్రం సూర్య చిత్రాన్ని చూసేందుకు థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే
మే 1న 'హిట్ 3', 'రెట్రో' (Retro Movie) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో నాని హిట్ 3 చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. సూర్య సినిమాకు మాత్రం తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తొలిరోజు కలెక్షన్ రివీల్ చేయగా.. ఇందులో సూర్యని నాని దాటేయడం విశేషం.మొదట నాని హిట్ 3 విషయానికొస్తే.. మొత్తంగా రూ.43 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు సూర్య(Suriya) రెట్రో చిత్రానికి ఓవరాల్ పోస్టర్ రిలీజ్ చేయలేదు. తమిళనాడులో రూ.17.75 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, కర్ణాటకలో రూ.3.07 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్)తెలుగు, ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రం 'రెట్రో' టీమ్ నుంచి రాలేదు. మొత్తంగా చూసుకుంటే (Day 1 Collection) రూ.30 కోట్లకు మించి అయితే సూర్య సినిమాకు రాలేదని అనిపిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే అటు టాక్ తో పాటు కలెక్షన్స్ విషయంలోనూ సూర్యని నాని దాటేసినట్లే అనిపిస్తుంది.రెట్రో రివ్యూ (Retro Review Telugu) విషయానికొస్తే.. పారివేల్ (సూర్య) చిన్నప్పుడే పుట్టిన ఊరికి దూరమవుతాడు. తిలక్ (జోజూ జార్జ్) అనే గ్యాంగ్ స్టర్ దగ్గర పెరుగుతాడు. పెద్దయ్యాక గ్యాంగ్ స్టర్ అవుతాడు. ఓ సందర్భంలో రుక్మిణి(పూజా హెగ్డే)ని ప్రేమిస్తాడు. పెళ్లి తర్వాత రౌడీ జీవితాన్ని వదిలేస్తానని అంటాడు. మరి పారివేల్ అనుకున్నట్లు జరిగిందా? సవతి తండ్రి తిలక్ తో ఎందుకు వైరం ఏర్పడింది? చివరకు పారివేల్-రుక్మిణి పెళ్లి చేసుకున్నారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) -
చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత
కొచ్చి: మలయాళ నటుడు విష్ణుప్రసాద్ (Vishnu Prasad) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బుల్లితెర, వెండితెరపై అలరించిన విష్ణు ప్రసాద్ కొన్ని నెలల క్రితం అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులను సంప్రదించగాక కాలేయ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచింరు. దీంతో అతడి కూతురు తండ్రికి కాలేయదానం చేయడానికి సిద్ధమైంది. కానీ ఆపరేషన్కు దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, సాయం చేసి ఆదుకోమని అతడి కుటుంబసభ్యులు ఆర్థిక సాయం కోసం అర్థించారు. ఆ డబ్బు సేకరించేలోపే విష్ణుప్రసాద్ కన్నుమూశారు.విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ IAS, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. సీరియల్స్లోనూ కనిపించాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు.చదవండి: నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్ -
ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్కు విజయ్ సూచన
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ రెగ్యూలర్గా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే, తను ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం భారీగా వచ్చేస్తున్నారు. తన వెంట పడ వద్దుని వేడుకుంటున్నా వారు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను సినిమా షూటింగ్కు వెళ్తున్నానని సూచించినా తమ కోసం ఐదు నిమిషాలు అయినా సరే మాట్లాడి వెళ్లాలని రోడ్డుపైనే కూర్చున్నారు. అలా విజయ్కు మదురైలో ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఆవిర్భావంతో తమ ముందుకు వచ్చిన విజయ్ను చూసేందుకు తమిళనాడులో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. తమ అభిమానాన్ని అత్యుత్సాహంతో చూపించే వారెందరో ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని విజయ్ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో చైన్నె నుంచి మదురై మీదుగా కొడైకెనాల్కు జననాగయం సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ వెళ్లారు. ఈ సమాచారంతో మదురై విమానాశ్రయంలో అభిమానులు ఉదయం నుంచే పోటెత్తారు. మదురైలో అనుమతి లేకుండా రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విజయ్ అభిమానులకు కమిషనర్ లోకనాథన్ హెచ్చరికలు చేశారు. అయినా, అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. విజయ్ను చూసి, ఆయనకు ఆహ్వానం పలికే వెళ్తామని భీష్మించుకుని విమానాశ్రయం పరిసరాలలో కూర్చున్నారు. ఈ సమాచారంతో విజయ్ తొలిసారి చైన్నె విమానాశ్రయంలో మీడియా ముందుకు వచ్చారు. మీ అభిమానానికి కోట్లాది దండాలు అని పేర్కొంటూ, తాను సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్నానని, తన పని తనను చేయనివ్వండని వేడుకున్నారు. తన కోసం మదురై విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు సమాచారం వచ్చిందని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించ వద్దని, తన కాన్వాయ్ను అనుసరించ వద్దని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం నుంచి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అయితే, అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. విజయ్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే దూసుకెళ్లారు. విజయ్ను ఆహ్వానిస్తూ నినాదాలు హోరెత్తించారు. అభిమానులను కట్టడిచేయలేక పోలీసులకు తంటాలు పడ్డారు. విజయ్ వాహనం మీదకు దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోక తప్పలేదు. విజయ్ వాహనాన్ని వెంబడిస్తూ పలువురు అభిమానులు దూసుకెళ్లడం గమనార్హం. -
అదిరిపోయే లుక్లో నభా నటేశ్.. వేకేషన్లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..వేకేషన్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైశ్వాల్..హిమాచల్ ప్రదేశ్ స్టైల్లో అరియానా గ్లోరీ..విదేశాల్లో ఆదితి గౌతమ్ చిల్..హీరోయిన్ నభా నటేశ్ అదిరిపోయే లుక్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
అజిత్ కుమార్ బర్త్ డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న అజిత్ ఇవాళ తన 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలిని బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.గతేడాది సెలబ్రేట్ చేసుకున్న బర్త్ డే వేడుక ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇలాంటి రోజులు ఎప్పటికీ గుర్తుంటాయని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఫోటోల్లో అజిత్, షాలిని కుమార్తె అనౌష్క, కుమారుడు ఆద్విక్ థీమ్ కూడా ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. అంతకుముందు విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అజిత్కు చెన్నై ఎయిర్పోర్ట్లో స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేరిన అజిత్.. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి?
సినీ ప్రియులకు నేడు డబుల్ ధమాకా.. అటు నాని హీరోగా నటించిన హిట్ 3 రిలీజవుతుండగా.. ఇటు సూర్య నటించిన రెట్రో (Retro Movie) కూడా సరిగ్గా ఇదే రోజు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా గురించి ఎక్స్ (ట్విటర్)లో ఎటువంటి సందడి కనిపించడం లేదు.కనిపించని సందడిఈ సినిమాకు ప్రీమియర్స్ వేసినట్లు లేరు. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే షోలు పడుతున్నాయి. దీంతో జనాల రెస్పాన్స్ తెలియడానికి మరికాస్త సమయం పట్టేట్లు ఉంది. విదేశాల్లో ప్రీమియర్ షోలు వేయడం వల్ల పని కట్టుకుని కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. దీన్ని అరికట్టేందుకే రెట్రో టీమ్ ఎర్లీ షోలు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల మాత్రం తొలి షో అయిపోయిందని.. సినిమా బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.కంగువా డిజాస్టర్.. ఈసారైనా..అసలే సూర్య (Suriya) చివరి సినిమా కంగువా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఎలాగైనా హిట్టవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అటు పూజా హెగ్డే (Pooja Hegde) సైతం ఈ చిత్ర ప్రమోషన్స్లో తెగ కష్టపడింది. ఎక్కడికి వెళ్లినా 'కనిమా..' అంటూ తన పాటకు స్టెప్పులేసింది. మరి వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో, లేదో చూడాలి! Very worst till now Rohini theater Gate not opened Time 7:30 AM May 01 #RetroFDFS #Retro pic.twitter.com/mg0fn8tN8N— Rolex_07_Rahul (@_Rolex07_) May 1, 2025#RETRO: BLOCKBUSTER 🔥💯🏆— Vinveli Nayagan (@Vinveli_nayaga) May 1, 2025#RETRO negative reviews from overseas 🥺😒— 💙🎊Thala Sudhakar🎊💙 (@Sudhkaar1) May 1, 2025#Retro Premiers leva Reviews levu asalu X Lo— Pavan Prabhas (@Pa1Prabhas_45) May 1, 2025Number of Tickets sold on BookMyShow in last 24 Hours 1. #Thudarum 290.88 🤯2. #HitTheThirdCase 189.96K3. #Retro 138.67K 4. #Raid2 89.82K 5. #KesariChapter2 41.61K6. #Gangers 7.68K7. #UntilDawn 7.42K8. #GroundZero 6.94K9. #Phule 6.91K10. #Sinners 6.50K11. #Jaat 5.58K— Movie Industry Updates (@movies_N_update) May 1, 2025 చదవండి: నాని ‘హిట్ 3’ సినిమాకి ఊహించని టాక్.. అదే మైనస్ అట! -
అభిమానుల అత్యుత్సాహం.. ఆస్పత్రిలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కుమార్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలికి స్వల్ప గాయం కావడంతోనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే అజిత్కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. అదే సమయంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ దూసుకు రావడంతో అజిత్ కాలికి స్వల్ప గాయాలైనట్లు ఆయన టీమ్ వెల్లడించింది.కాగా.. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమానికి హాజరైన అజిత్ కుమార్.. తిరిగి చెన్నై చేరుకున్నారు. అజిత్ రాకపై సమాచారం తెలుసుకున్న అభిమానులు ఆయనకు స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్పోర్ట్కు పెద్దఎత్తున వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా అందరూ అజిత్ వైపు దూసుకు రావడంతో ఆయన పాదానికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.(ఇది చదవండి: బుల్లితెర నటి ఏఐ వీడియోలు.. ఇంత చెత్తగా ఆలోచిస్తారా?)అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సునీల్, అర్జున్ దాస్, సిమ్రాన్ కీలక పాత్రల్లో మెరిశారు. -
నాదేం లేదు.. దీనంతటికీ కారణం నా భార్య: స్టార్ హీరో
తమిళ హీరోల్లో అజిత్ కాస్త డిఫరెంట్. సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించడం తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా తలదూర్చడు. తన పనేదో తాను అన్నట్లు ఉంటాడు. కారే రేసింగ్ లో ఈ మధ్య కాలంలో రఫ్ఫాడిస్తున్నాడనే చెప్పాలి. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ ఇతడిని వరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అజిత్ ఈ పురస్కారం అందుకున్నాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లిన అజిత్.. పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. అయితే తను ఇలా ఉండటానికి భార్యనే కారణం అని చెబుతూ మొత్తం క్రెడిట్ ఆమెకే ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.'ఇప్పటికీ సామాన్యుడిలానే ఆలోచిస్తాను. ఇంత ఎత్తు ఎదిగానా అని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. దీనంతటికీ నా భార్య షాలినినే కారణం. ఎందుకంటే నా కోసం చాలా త్యాగాలు చేసింది. ప్రతిదానిలో నాకు తోడుంది. ఒక్కోసారి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఆ టైంలోనూ షాలిని నాకు అండగా నిలిచింది తప్పితే నిరుత్సాహపరచలేదు'(ఇదీ చదవండి: థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!)'నా జీవితంలో సాధించిన సక్సెస్ క్రెడిట్ అంతా షాలినికే ఇస్తాను. నటిగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ నాకోసం అన్నింటినీ వదులుకుంది. ఆమెకు చాలామంది అభిమానులున్నారు. వాళ్లకు నా థ్యాంక్స్. నేను కేవలం యాక్టర్ నే. సూపర్ స్టార్ అని పిలిపించుకోవడం నచ్చదు. అలాంటి ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు' అని అజిత్ చెప్పుకొచ్చాడు.తమిళ హీరోగా అజిత్ చాలా ఫేమస్. హీరోయిన్ గా కలిసి పనిచేసిన షాలిని.. 2000లో ఇతడిని పెళ్లిచేసుకుంది. అప్పటినుంచి సినిమాలు, నటనకు దూరమైంది. ఈ జంటకు కొడుకు-కూతురు ఉన్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?) -
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. స్వతహాగా తమిళం అయినప్పటికీ.. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగులో ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) షారూఖ్ ఖాన్ జవాన్లో విలన్గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న సేతుపతి.. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్, తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలానే 'కాక్కా ముట్టై' ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సేతుపతి రెడీ అవుతున్నాడు. గత కొన్నాళ్లుగా హీరోగా హిట్ లేక డీలా పడిపోయిన విజయ్ సేతుపతికి హిట్ ఇచ్చిన సినిమా మహారాజ. గతేడాది రిలీజైంది. తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడం విశేషం. ఇదే సినిమా చైనీష్ లోనూ అనువాదం అయ్యి చైనాలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. కాగా మహారాజా చిత్రానికి సీక్వెల్ చేయాలని విజయ్ సేతుపతి ఆలోచిస్తున్నట్లు, దానికి తగ్గ కథను సిద్ధం చేయమని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మహారాజ 2 మొదలు పెడతారా లేదంటే వాటితో పాటే ప్రారంభించి పూర్తి చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) -
పహల్గామ్ దాడి.. నా పోస్ట్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: విజయ్ ఆంటోనీ క్లారిటీ!
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు. తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్లో 50 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.తాజాగా తన పోస్ట్పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా 'హిట్లర్లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. pic.twitter.com/YbFIloXPQ9— vijayantony (@vijayantony) April 27, 2025 pic.twitter.com/Gne6EdT6yu— vijayantony (@vijayantony) April 28, 2025 -
అభిమానులకు గుడ్న్యూస్ చెప్పిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీని అత్యంత భారీ బడ్జెట్తో పీరియాడికల్ స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి షూటింగ్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్.. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అభిమానులకు ఎన్టీఆర్ శుభవార్త చెప్పారు. (#NTRNEEL) చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్ వ్యక్తుల కాంబినేషన్తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధకండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. వచ్చే సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద ఫుల్ సందడి వాతావరణం కనిపించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కథ వల్ల వీఎఫ్ఎక్స్ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్గా ప్లాన్ చేయడం వల్లే కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తారక్ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్లో ఓ ప్రత్యేక సెట్ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఎన్టీఆర్తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్తో షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్ను ఫైనల్ చేశారని తెలిసింది. See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c— Jr NTR (@tarak9999) April 29, 2025 -
క్యాన్సర్ తో ప్రమఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) 1952లో పుట్టిన ఈయన.. సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా మారారు. మోహన్ లాల్ తో 'వానప్రస్థం' సినిమా ఈయనకు చాలా పేరు తీసుకొచ్చింది. అలానే పిరవి మూవీతో జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. 2011లో ఈయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది.ఈయన తీసిన సినిమాల్లో పిరవి, స్వాహం, వానప్రస్థం, నిషాద్, కుట్టి శృంఖు, స్వప్నం.. ప్రేక్షకుల నుంచి అద్బుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి ఈయన ఇప్పుడు మృతి చెందడంతో సినీ ప్రముఖులు షాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) -
పద్మ భూషణ్ పురస్కారాల్ని అందుకున్న హీరోలు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ అవార్డులని ప్రకటించింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం.. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు.తెలుగు హీరో బాలకృష్ణ(Nandamuri Balakrishna), తమిళ హీరో అజిత్.. పద్మ భూషణ్ (Padma Bhushan 2025) అవార్డులని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. బాలయ్య.. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించారు. అజిత్(Ajith Kumar).. బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) బాలకృష్ణ ప్రస్థానం చూస్తే.. తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు. రీసెంట్ టైంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్గానూ సేవలందిస్తున్నారు.(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) Nandamuri Balakrishna Receives Prestigious Padma Bhushan from President Droupadi Murmu | TFPC #nandamuribalakrishna #balayya #padmabhushan #padmaawards pic.twitter.com/M63oQSS4Lj— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025Padma Awards 2025: Ajith Kumar's Iconic Moment with President Murmu#ajith #PadmaAwards #PadmabhushanAjithKumar pic.twitter.com/miV0K0x3Px— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025 -
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
కోలీవుడ్ హీరో అజిత్కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్గా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అజిత్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆపై కొద్దిరోజుల క్రితమే అజిత్, అతని భార్య షాలిని తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో నటి హీరా రాజగోపాల్ కూడా తన ప్రేమకథతో పాటు విడిపోవడం గురించి చెబుతూనే తన మాజీ ప్రియుడిపై ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. 1990లో నటి హీరా రాజ్గోపాల్తో అజిత్ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్గా ఉండేది. పలు గొడవల వల్ల బ్రేకప్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అజిత్ పేరును ఆమె ప్రస్తావించకుండానే ఒక నటుడు అంటూ సెన్సేషనల్ కామెంట్లు చేశారు.హీరా రాజగోపాల్ తన బ్లాగులో ఇలా చెప్పుకొచ్చారు.. 'ఒక నటుడు నాకు ద్రోహం చేయడమే కాకుండా తన అభిమానులతో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేశాడు. అతని వల్ల నేను చాలా అవమానంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఒకసారి తన వెన్నెముకకు గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నానని నాకు చెప్పాడు.. ఆ సమయంలో నేను అతనితోనే ఉండి ఎన్నో సపర్యలు చేశాను. కానీ, అతను ఆరోగ్యం విషయంలో కూడా అబద్ధం చెప్పాడని తర్వాత తెలుసుకున్నాను.' అని హీరా రాసుకొచ్చారు. ఆపై వివాహం గురించి కూడా ఆ నటుడు తనతో చెప్పిన మాటలను ఇలా చెప్పంది 'నేను పనిమనిషిలా కనిపించే స్త్రీని వివాహం చేసుకోబోతున్నాను. అప్పుడు ఎవరూ ఆమెను చూడరు. కానీ, నేను మాత్రం నాకు నచ్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొంటాను' అని హీరాతో ఆ నటుడు చెప్పినట్లు తన బ్లాగ్లో పోస్ట్ చేశారు.1990లో నటి హీరా రాజ్గోపాల్తో అజిత్ నడపిన ప్రేమాయణం భారీగా వైరల్ అయింది. కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్ స్టోరికి ఫుల్స్టాప్ పడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కానీ, అజిత్నే తనను వదిలించుకున్నాడని కూడా ప్రచారం జరిగింది. కాగా కొన్నేళ్లకు అజిత్.. నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. Actress #Heera has made serious allegations against #AjithKumar, accusing him of betrayal, character assassination and orchestrating violence through fans. She also claimed he staged medical issues for sympathy and bribed media to control narratives. pic.twitter.com/4WBPVNEPTn— Mʀꜱ.Kᴇᴇʀᴛʜɪ (@MrsKeerthi85) April 28, 2025 -
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయన్
తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్ హీరోయిన్ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి. అదేవిధంగా హిందీలో లస్ట్ స్టోరీస్ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్కు జతగా స్పిరిట్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప– 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్గా కోలీవుడ్లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్ ఠాగూర్ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
కొన్నిసార్లు ఒక్క సినిమాతో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అలా కొన్నిరోజుల క్రితం రిలీజైన 'డ్రాగన్'తో కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. (ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) అసోంకు చెందిన కాయదు లోహర్.. 'అల్లూరి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళంలో ప్రయత్నించగా.. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్'లో అవకాశమొచ్చింది. ఇదే మూవీతో కాయదుకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.ఈ క్రమంలోనే తెలుగులో విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో తీస్తున్న 'ఫంకీ'లో కాయదు హీరోయిన్ గా సెలెక్ట్ కాగా.. ఇప్పుడు తమిళ హీరో శింబు సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీస్ కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో కాయదు లైఫ్ సెట్ అయిపోయినట్లే!(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
సండే వచ్చిందంటే ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. లేదా జాలీగా ఎక్కడికైనా వెళ్లి రావాలనుకుంటారు. కుదిరితే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరో మాత్రం తన ఇల్లు తుడిచే పనిలో పడ్డాడు. తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశాడు. శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఫ్లోర్ తుడుస్తున్నాడు. 'సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని. జయం సినిమాతో హిట్అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. రవి మోహన్.. బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. జయం (తెలుగు జయం రీమక్) అనే తమిళ సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈయన పేరు జయం రవిగా స్థిరపడిపోయింది. తమిళంలో హీరోగా..దాస్, ఇదయ తిరుదన్, దీపావళి, పెరణ్మనై, ఎంగేయుమ్ కాదల్, ఆది భగవాన్, రోమియో జూలియట్, మిరుథన్, బోగన్, టిక్ టిక్ టిక్, భూమి, పొన్నియన్ సెల్వన్, బ్రదర్, భూలోహం, కాదలిక్క నేరమిళ్లై వంటి పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో కరాటే బాబు, పరాశక్తి, జీని, తని ఒరువన్ చిత్రాలున్నాయి.విడాకులు?ఇదిలా ఉంటే రవి.. నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన.. తనను రవి అని మాత్రమే పిలవాలని కోరాడు.చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు -
నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు..
యంగ్ డైరెక్టర్ అబిశన్ జీవింత్ తెరకెక్కించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించగా యోగి బాబు, ఎమ్మెస్ భాస్కర్, మిథున్ జే, రమేశ్ తిలక్ తదితరులు నటించారు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అబిశన్ (Abishan Jeevinth) తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు.నీ వల్లే..ముందుగా స్టేజీ ఎక్కిన అబిశన్.. తన సినిమా గురించి చెప్తూ, అందులో నటించిన యాక్టర్స్కు, సంగీతాన్ని అందించిన షాన్ రోల్డన్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వెంటనే తన స్నేహితురాలు అఖిల ఎలంగోవన్కు సైతం థాంక్స్ చెప్పాడు. అబిశన్ మాట్లాడుతూ.. అఖిల.. నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. పదో తరగతి నుంచి మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా అమ్మతో పాటు నీవల్లే జీవితంలో మంచి వ్యక్తిగా ఎదిగాను. ఐ లవ్యూ సోమచ్ అని ప్రశ్నించాడు. దర్శకుడి మాటలతో కంటతడిఇప్పుడు నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. అక్కడే ఉన్న అఖిల అతడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. అఖిల అతడి ప్రపోజల్కు ఒప్పుకోవమ్మా.. సినిమా ప్రపోజల్ కన్నా ఇదే బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. Beautiful Proposal by The Director of #TouristFamily on Stage ❤️pic.twitter.com/cG3qvN3fF1— Christopher Kanagaraj (@Chrissuccess) April 27, 2025 చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి -
జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న ఈమె.. క్రమంగా సినిమాలతో హిట్ కొడుతూ సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్, లవ్ బ్రేకప్స్ గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) 'నాకు ఎంతో ఇష్టమైన వాళ్లని కొన్నిసార్లు బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేసి ఉండకూడదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.నాకు అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి''బ్రేకప్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. నా లవ్ స్టోరీస్ గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు. ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్? అని అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే. నా వరకు వస్తే నేను అన్నిసార్లు ప్రేమలో విఫలమవుతున్నానని అర్థం. ఇప్పటికీ నాకు సరైన ప్రేమ దొరకలేదు' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్) 'కెరీర్ ప్రారంభంలో తెలుగులో నా రెండు సినిమాలు ఫెయిలయ్యాయి. నన్ను చాలా మాటలు అన్నారు. కానీ హీరో సిద్ధార్థ్ ని మాత్రం ఏం అనలేదు. నాకు గబ్బర్ సింగ్ మూవీతో సక్సెస్ వచ్చింది. ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ నా మనసుకు నచ్చిన మూవీస్ చేస్తున్నానని వాళ్లకు తెలీదు' అని శ్రుతి తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది.మొన్నటివరకు శంతను హజరికా అనే ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న శ్రుతి హాసన్.. అంతకు ముందు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపించింది. కెరీర్ ప్రారంభంలో మాత్రం ఒకరిద్దరు హీరోలతో ఈమె రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈమె ఎవరితోనూ ప్రేమలో లేదు!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్సో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం పౌండేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.హైదరాబాద్లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు సూర్య వివరించారు. మెగాస్టార్ను ఆదర్శంగా తీసుకుని చెన్నైలో అగరం ఫౌండేషన్ను ప్రారంభించినట్లు సూర్య వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ను సందర్శించిన తర్వాత తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.సూర్య మాట్లాడుతూ.. 'ఇదంతా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఒకరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్లాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. " అన్నారు. ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అగరం ఫౌండేషన్ను ప్రారంభించేందుకు మీరు నాకు శక్తిని, ధైర్యాన్ని అందించారు. మీ వల్ల ఎనిమిది వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. తన ఫౌండేషన్ కోసం తెలుగు వారి నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కోసం యుఎస్లో ఉన్నా. అక్కడ ఉన్న తమిళ విద్యార్థుల కోసం తెలుగు మాట్లాడే వారి నుంచే ఎక్కువ నిధులు వచ్చాయి. తెలుగు ప్రజలు చాలా దయగల హృదయం ఉన్న వ్యక్తులు. వారు ఇప్పటికీ తమిళ విద్యార్థుల చదువుకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో మీపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమా నాని నటించిన హిట్-3 మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న అమ్మాయి అనికా సురేంద్రన్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలోనూ వరస చిత్రాలు చేస్తోంది. తాజాగా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించింది.సరే అసలు విషయానికొస్తే ఈమెకు గత రెండు నెలల నుంచి ఓ చిన్న సమస్య ఇబ్బంది పెడుతుందట. ఇన్ స్టాలో తన రీల్స్ కి మ్యూజిక్ జోడిద్దామంటే కుదరట్లేదని చెబుతూ ఫన్నీగా పెట్టిన ఫేస్ ఫొటోని పోస్ట్ చేసింది. తన మిగతా అకౌంట్లకు ఈ ఫీచర్ వర్క్ అవుతుందని కానీ తన అఫీషియల్ అకౌంట్ కి మాత్రం రెండు నెలలుగా అవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు)సరేలే అని బిజినెస్ అకౌంట్ నుంచి క్రియేటర్ అకౌంట్ గా మార్చినప్పటికీ.. మ్యూజిక్ జోడించే ఫీచర్ మాత్రం కావట్లేదని అనికా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు ఎవరైనా కాస్త చేయండని రిక్వెస్ట్ చేసింది. 2010లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన అనిక.. తెలుగులోనూ నాగార్జున 'ద ఘోస్ట్'లో చైల్డ్ ఆర్టిస్టుగా, 'బుట్టబొమ్మ'లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఓ తమిళ మూవీలో నటిస్తోంది.(ఇదీ చదవండి: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్) -
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
మలయాళ సినిమా (Mollywood)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేవలం ఒకటీరెండు చిత్రాలు మాత్రమే నిర్మాతలను గండం గట్టెక్కిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో లాభాల పంటకు బదులుగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మార్చిలోనూ అదే వైఖరిని కొనసాగించాయి.15 సినిమాల్లో ఒక్కటే హిట్టుకేరళ చలనచిత్ర నిర్మాతల మండలి.. మార్చి బాక్సాఫీస్ రిపోర్ట్ (Mollywood: March Box Office Report)ను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మార్చిలో 15 చిత్రాలు విడుదలవగా ఒక్కటి మినహా మిగతావన్నీ ఫ్లాప్స్గా నిలిచాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ రూ.194 కోట్లు కాగా కేవలం రూ.25.88 కోట్ల షేర్ మాత్రమే తిరిగొచ్చింది. పెద్ద, చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2 : ఎంపురాన్ ఒక్కటే సూపర్ హిట్ సాధించింది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఔసెప్పింటె ఓసియతు మూవీ కేవలం రూ.45 లక్షలు రాబట్టడం గమనార్హం.> రూ.2.70 కోట్లతో నిర్మితమైన పరివార్ సినిమాకు రూ.26 లక్షలు వచ్చాయి.> రూ.3.65 కోట్లు పెట్టి తీసిన వడక్కన్ మూవీ కేవలం రూ.20 లక్షలే తిరిగి రాబట్టింది.> రూ.70 లక్షలతో నిర్మితమైన డసెట్టంటె సైకిల్ చిత్రం అతి కష్టమ్మీద రూ.8 లక్షలు వసూలు చేసింది.కాపాడింది ఈ ఒక్కటే..మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ 2: ఎంపురాన్. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. రూ.175 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉంది.చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్..!
ప్రముఖ డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన అల్లప్పుజా జింఖానా మూవీ దర్శకుడైన ఖలీద్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మరో డైరెక్టర్ అష్రఫ్ హంజా కూడా ఉన్నారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్లో వీరిద్దరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఆ ఫ్లాట్ మలయాళ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్కు చెందినదని సమాచారం. వీరి నుంచి 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.డ్రగ్స్ కేసులో మలయాళ సినీ దర్శకులు అరెస్ట్ అలప్పుజ జింఖానా మూవీకి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మలయాళంలో పలు సినిమాలను ఆయన తెరకెక్కించారు. మరో డైరెక్టర్ అష్రఫ్ తమాషా, భీమన్నంటే వాజి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వీరిద్దరు గంజాయి కేసులో అరెస్ట్ కావడంతో మాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు..కొద్ది రోజుల క్రితమే మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అతనిపై మలయాళ ఇప్పటికే సినీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఓ హోటల్లో రైడ్ చేయడం పోలీసుల నుంచి టామ్ చాకో తప్పించుకున్నారు. ఏప్రిల్ 21న చాకోను అరెస్టు చేయగా.. వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. కాగా.. టామ్ చాకో తెలుగులో దసరా మూవీతో ఫేమస్ అయ్యారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. -
హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటుంటారు. అది నిజమే అంటోంది హీరోయిన్ సిమ్రాన్ (Simran). ఈమె ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. సినిమా రిలీజయ్యాక జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నేను ఆంటీ రోల్స్ చేస్తున్నానని ఓ నటి ఎగతాళి చేసిందని తెలిపింది. పనికిమాలిన డబ్బా పాత్రల్లో నటించడం కంటే అమ్మ, ఆంటీ రోల్స్ చేయడం ఎంతో ఉత్తమం అని స్టేజీపైనే నటికి కౌంటర్ ఇచ్చింది.లైలా? జ్యోతిక? ఎవరన్నారు?లైలా గురించే సిమ్రాన్ ఈ కామెంట్స్ చేసిందన్న ప్రచారం జరిగింది. మరికొందరేమో డబ్బా అన్న పదం వాడిందంటే డబ్బా కార్టెల్ సిరీస్లో నటించిన జ్యోతికపై ఈ వ్యాఖ్యలు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మాటల వల్ల నాకు నిజంగా బాధేసింది. అందుకే నా బాధను చెప్పుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచే నేను ఆంటీ పాత్రలు చేస్తున్నాను. ఆంటీ అనే పదం ఇష్టంఆంటీ అనే పదాన్ని అవమానంగా ఫీలవను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా జరిగాక నాకో విషయం అర్థమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లెప్పుడూ ఫ్రెండ్స్ కాలేరని రుజువైంది. ఫ్రెండ్ అనుకున్నవాళ్లే మనపై అలాంటి కామెంట్లు చేస్తే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాతిరోజు క్యాజువల్గానే మాట్లాడింది. కానీ మా స్నేహం మునుపటిలా మాత్రం కొనసాగదు అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ తనపై సెటైర్లు వేసిందెవరన్నది మాత్రం సిమ్రాన్ వెల్లడించలేదు.చదవండి: తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు -
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మోహన్ లాల్ సినిమాలకు టాలీవుడ్లోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ మధ్య ఎల్2: ఎంపురాన్తో మంచి హిట్ అందుకున్న మోహన్ లాల్..ఇప్పుడు ‘తుడరుమ్’(Thudarum Movie Review) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత నటి శోభన మరోసారి మోహన్లాల్కు జోడీగా నటించింది. నిన్న(ఏప్రిల్ 25) మలయాళంలో విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 26) అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఒకప్పుడు తమిళ సినిమాలకు యాక్షన్ డూప్గా నటించేవాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా సినిమాలను వదిలిపెట్టి తన మాస్టర్ (భారతీ రాజా) కొనిచ్చిన కారుతో కేరళలో సెటిల్ అవుతాడు. భార్య లలిత(శోభన), పిల్లలు(కొడుకు, కూతురు)..వీళ్లే అతని ప్రపంచం. టాక్సీ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఓ సారి అనుకోకుండా తను ఎంతో అపురూపంగా చూసుకునే అంబాసిడర్ కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు బెంజ్ చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఇంజనీరింగ్ చదివే తన కొడుకు పవన్ కనిపించకుండాపోతాడు. పవన్కి ఏమైంది? బెంజ్ కారును పోలీసులు ఎందుకు జప్తు చేశారు? పోలీసులు సీజ్ చేసిన కారును తిరిగి తెచ్చుకునే క్రమంలో బెంజ్కి ఎదురైన సమస్యలు ఏంటి? ఎలాంటి తప్ప చేయని బెంజ్ని సీఐ జార్జ్(ప్రకాశ్ వర్మ) హత్య కేసులో ఎందుకు ఇరికించాడు? అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతన్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? తన ఫ్యామిలి అన్యాయం చేసినవారిపై బెంజ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే మిగతా కథ(Thudarum Movie Review). ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. తుడరుమ్ కూడా అలాంటి కథే. కోర్ పాయింట్ అదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. దర్శకుడు తరుణ్ మూర్తి ఈ కథను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రారంభించి.. రివేంజ్ డ్రామాగా ఎండ్ చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న మోహన్లాల్ని సింపుల్గా పరిచయం చేయడమే కాదు.. ఫస్టాఫ్ మొత్తం అంతే సింపుల్గా చూపించారు. హీరోకి భార్య, పిల్లలే ప్రపంచం అని తెలియజేయడం కోసం ప్రతి విషయాన్ని డీటేయిల్డ్గా చెప్పడంతో ఫస్టాఫ్ సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్ సీన్తో క్రైమ్ జానర్లోకి వెళ్తుంది. హిరో అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. అక్కడ ఓ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఇక్కడే కథనం కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. తన ఫ్యామిలీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే హీరో.. పోలీసులు తన కుటుంబం వేసిన నిందను పోగొట్టడానికి ప్రయత్నించకుండా..పగను తీర్చుకోవడానికి వెళ్లడం ఎందుకో పొసగలేదు అనిపిస్తుంది. ‘దృశ్యం’ ఛాయలు కపించకూడదనే దర్శకుడు కథను ఇలా మలిచాడేమో కానీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ చిత్రం గుర్తొస్తూనే ఉంటుంది. అలాగే ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథనం మళ్లీ సాగినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నప్పటికీ దర్శకుడు ఎలివేషన్పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దీంతో ప్రేక్షకుడు ఎమోషనల్ సీన్లకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడు. ముగింపు కూడా రొటీన్గానే ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించలేదు కానీ.. ముగింపు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టాక్సీడ్రైవర్ బెంజ్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. బాత్రూంలో కూర్చొని ఏడిచే సీన్ హైలెట్. ఇక మోహన్ లాల్ తర్వాత బాగా పండిన పాత్ర ప్రకాశ్ వర్మది . మంచితనం ముసుగు వేసుకొని క్రూరంగా ప్రవర్తించే సిఐ జార్జ్ అనే పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా ఏళ్ల తర్వాత మోహన్లాల్తో తెర పంచుకున్న శోభనకు మంచి పాత్రే లభించింది. నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కడా నటించింది. బిను పప్పు, థామస్ మాథ్యూతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జేక్స్బిజోయ్ తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. నైట్ షాట్స్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్
సెలబ్రిటీల మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా సాధారణం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇలాంటి న్యూస్ ఏదో ఒకటి వింటూనే ఉంటాం. విడాకులు తీసుకోవడం ఏమో గానీ వాళ్ల పిల్లలు చాలా బాధని అనుభవిస్తుంటారు. అలాంటి అనుభవాన్ని ఇన్నాళ్లకు హీరోయిన్ శ్రుతి హాసన్ బయటపెట్టింది. తన జీవితాన్ని మార్చేసిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కమల్ తొలి భార్య సారికకు పుట్టిన కూతుళ్లలో శ్రుతి హాసన్ పెద్దది. 1988లో కమల్-సారిక పెళ్లి జరగ్గా.. 2004లో విడిపోయారు. దీంతో తల్లితో పాటు కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ ముంబై వెళ్లిపోయారు. ఆ విషయాల్నే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ పంచుకుంది.'నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా జీవితంలో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం నన్ను చాలా బాధపెట్టింది. వాళ్లిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకు ఉన్న జీవితం ఒక్కసారి మారిపోయింది'(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) 'చెన్నై నుంచి ముంబై వచ్చేశాం. అప్పటివరకు బెంజ్ కార్లలో తిరిగిన నేను లోకల్ ట్రైన్ లో తిరిగాను. అలా రెండు రకాల జీవితాలు చూశాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాన్నతో ఉంటున్నాను. విదేశాల్లో సంగీతం నేర్చుకున్నాను. ప్రస్తుతం నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.మ్యూజిక్ కంపోజర్, సింగర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రుతి హాసన్.. 'అనగఅనగా ఓ ధీరుడు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. హిట్స్, ఫ్లాప్స్ ఈమె చాలానే ఉన్నాయి. రీసెంట్ టైంలో మాత్రం మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ప్రస్తుతం రజనీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలోని 'కూలీ' మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) -
రన్యారావుకు మరిన్ని కష్టాలు .. ఆ చట్టంతో ఇక బెయిల్ కష్టమే!
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్లో పట్టుబడి కన్నడ నటి రన్యారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న రన్యారావుకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతంలో ఆమె బెయిల్ పిటిషన్ వేయగా.. బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) తిరస్కరించింది. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్ ఆమెకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రన్యా రావుపై విదేశీ మారకద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం-1974((COFEPOSA)) కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB) ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారమైతే దాదాపు ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదు. నిందితుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని తేలితే ఈ చట్టం ప్రయోగిస్తారని సమాచారం. ఈ కేసులో రన్యా రావు పదేపదే బెయిల్ కోసం ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఈ చర్య తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఆమెతో పాటు ఇతర నిందితులు తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్లపై కూడా ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు.కాగా.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యారావును మార్చి 3న అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసును డీఆర్ఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి. డీజీపీ రామచంద్రరావు పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మూడో నిందితుడైన జైన్తో కలిసి నటి హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. -
చెపాక్లో తలా సందడి.. మరో తలా కోసమే వచ్చాడంటున్న నెటిజన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విదాముయార్చి ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.రెండు రోజుల క్రితమే అజిత్ తన భార్య షాలినితో కలిసి వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. వీరిద్దరి బంధానికి దాదాపు 25 ఏళ్లు పూర్తి కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఐపీఎల్ మ్యాచ్లోనూ సందడి చేశారు. తమ కుమారుడు ఆద్వైక్తో కలిసి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే అజిత్.. మరో తలాగా పిలవబడే ఎంఎస్ ధోని ఆటను ఆస్వాదించేందుకు స్డేడియానికి వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని కొడుకు ఆద్వైక్ను తన ఒడిలో కూర్చొబెట్టుకుని మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు.కాగా.. ఈ మ్యాచ్లో మరో హీరో శివకార్తికేయన్ కూడా స్టేడియంలో కనిపించారు.అంతేకాకుండా ఈ మ్యాచ్లో హీరోయిన్ శృతిహాసన్ సైతం సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే సినిమాలతో పాటు రేసింగ్లోనూ అజిత్ కుమార్ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన టీమ్ బెల్జియంలో జరిగిన కారు రేస్లో రెండో స్థానంలో నిలిచింది. Seems like Shalini AjithKumar is a big fan of CSK & the way she explains the team players to AK so heartwarming 🥰AK’s Wedding Anniversary Gift 🎁 pic.twitter.com/2jqVtRU6bc— Kolly Corner (@kollycorner) April 25, 2025 -
మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో (Retro Movie). ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో అతడి తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ చిత్రపరిశ్రమలో సిక్స్ ప్యాక్ ట్రెండ్ను ప్రవేశపెట్టింది నా కొడుకే అని ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా సూర్య కంటే ముందు ఎవరైనా సిక్స్ ప్యాక్తో రావడం చూశారా? అని ఓ ఈవెంట్లో ప్రశ్నించాడు.సిక్స్ ప్యాక్ ట్రెండ్ఇది విన్న సినీప్రియులు.. అదేంటి? కోలీవుడ్లో అంతకుముందే విశాల్ (Vishal) సిక్స్ ప్యాక్తో వచ్చాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. అసలు సిక్స్ప్యాక్ ట్రెండ్కు కోలీవుడ్లో నాంది పలికింది ఎవరన్న ప్రశ్నకు తాజాగా విశాల్ స్పందించాడు. మొదట్టమొదటిసారి ధనుష్ పొల్లాధవన్ మూవీలో సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత నేను సత్యం, మదగజరాజ సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించాను. జనాలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటాను అని చెప్పుకొచ్చాడు.మర్చిపోయారా?వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'పొల్లాధవన్' 2007లో రిలీజైంది. ఇందులో ధనుష్ సిక్స్ ప్యాక్తో కనిపించాడు. తర్వాత విశాల్ 'సత్యం' సినిమాలో ఆరుఫలకల దేహంతో కనిపించాడు. ఈ మూవీ 2008 ఆగస్టులో విడుదలైంది. అనంతరం సూర్య.. 2008 నవంబర్లో వచ్చిన 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్ కృష్ణన్) సినిమాలో తొలిసారి సిక్స్ప్యాక్ ట్రై చేశాడు. ఇక రెట్రో విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 1 న విడుదల కానుంది.చదవండి: అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్కు జంటగా..! -
పహల్గామ్ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. పర్యాటకులపై జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తలచుకుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. కశ్మీర్పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి అత్యంత క్రూరమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ రెండు పేజీల సందేశాన్ని ట్వీట్ చేశారు.ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏప్రిల్ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రాంతమైన పహల్గామ్లో నెత్తురు చిందిన రోజు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. ఈ దారుణమైన చర్యను చెప్పడానికి నకాు మాటలు కూడా రావడం లేదు. అందుకే బాధతో కూడిన హృదయంతోనే రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంంగా కాల్చి చంపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితికి గురయ్యారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి కశ్మీర్పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన దారుణచర్య. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది' అని రాసుకొచ్చారు.ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య.. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ కృరమైన చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన లేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇంత దారుణానికి ఒడిగట్టారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని.. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చిందని ప్రకాశ్ రాజ్ అవేదన వ్యక్తం చేశారు.కశ్మీర్ ఆట స్థలం కాదు.. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు. మీరు ఉపయోగించుకునే ఆయుధం కాదు.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశమే కశ్మీర్ అని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో పాటు మీరు కోల్పోయిన దానికి మేము చింతిస్తున్నామని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు.. కానీ మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్రాజ్ పోస్ట్ చేశారు. Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1— Prakash Raj (@prakashraaj) April 24, 2025 -
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
రామాయణ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కే సీతగా నటించే ఛాన్స్ వచ్చిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన శ్రీనిధి అవి నిజమేనంటోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. రామాయణ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పుడీ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను.స్క్రీన్ టెస్ట్ పూర్తిరామాయణ సినిమా (Ramayana Movie)లో మొదట నన్నే సీతగా అనుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మూడు సన్నివేశాల కోసం నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నా యాక్టింగ్కు మంచి స్పందనే వచ్చింది. అందరూ నా నటనను చూసి మెచ్చుకున్నారు. యష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే కేజీఎఫ్ 2 రిలీజైంది. మా జోడీ జనాలకు బాగా నచ్చేసింది. అలాంటప్పుడు ఈ మూవీలో యష్ రావణుడిగా.. నేను సీతగా నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారని ఆలోచించాను. అవకాశం చేజారిందంటే..కచ్చితంగా వాళ్లు మమ్మల్నిలా చూసి జీర్ణించుకోలేరేమో అనిపించింది. ఈ సినిమా మాకు వర్కవుట్ అవొచ్చు, కాకపోవచ్చు అనుకున్నాను. ఏదేమైనా సీత పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi) పూర్తి న్యాయం చేయగలదు. తనను సీతగా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మనకు ఏదైనా కలిసొచ్చిందంటే (అవకాశం వచ్చిందంటే) సంతోషపడాలి.. అది చేజారిందంటే.. ఇంకోచోట మనకోసం ఏదో అవకాశం వేచి ఉందని అనుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాల్ని అందుకుంది. ఈ బ్యూటీ హిట్: ద థర్డ్ కేస్తో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.చదవండి: బిగ్బాస్ షో హోస్ట్గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే! -
పెళ్లిరోజు.. భార్యకు ఊహించని బహుమతిచ్చిన హీరో విజయ్ తండ్రి
పుట్టినరోజు, పెళ్లి రోజు వచ్చిందంటే చాలు.. భార్యాభర్తలు ఏదో ఒక బహుమతి ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ దర్శకుడు కూడా అదే పని చేశాడు. కాకపోతే 79 ఏళ్ల వయసులోనూ పెళ్లిరోజును గుర్తుపెట్టుకుని మరీ సతీమణికి ప్రేమగా బహుమతివ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్ఏ చంద్రశేఖర్ (S A Chandrasekhar).ప్రముఖ డైరెక్టర్లు ఈయన దగ్గర పనిచేసినవాళ్లేఈ కోలీవుడ్ డైరెక్టర్.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 70 సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దోపడి దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను రూపొందించాడు. డైరెక్టర్గానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన దగ్గర సెంతిల్నాథన్, సి.రంగనాథన్, పవిత్రన్, ఎస్.శంకర్, ఎం. రాజేశ్ సహా పలువురు డైరెక్టర్లు అసిస్టెంట్గా పనిచేశారు.BMW కారు గిఫ్ట్చంద్రశేఖర్.. తన కుమారుడు విజయ్ (Vijay)ను హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడతడు దళపతిగా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే! చంద్రశేఖర్ భార్య పేరు శోభ. తాజాగా వీళ్లు పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు భాగస్వామికి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్గా కారు ఇచ్చానంటూ ఓ వీడియో షేర్ చేశాడు. బీఎమ్డబ్ల్యూ కారు కొన్న చంద్రశేఖర్.. అందులో భార్యను ఎక్కించుకుని డ్రైవ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S A Chandrasekhar (@dir_sac) చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా.. నా భవిష్యత్తును ఆగం చేయొద్దు!
పవిత్ర లక్ష్మి (Pavithralakshmi).. ఈ తమిళమ్మాయి ఓ కాదల్ కణ్మని (2015) సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో అతడి కొలీగ్గా చిన్న పాత్రలో కనిపించింది. అదే ఏడాది ఈమె మిస్ మద్రాస్ కిరీటాన్ని సైతం గెల్చుకుంది. కూకు విత్ కోమలి అనే కుకింగ్ షోలో పాల్గొని ఎక్కువ ఫేమస్ అయింది. దీంతో ఒక్క ఏడాదిలోనే నాయి శేఖర్ (తమిళ చిత్రం), ఉల్లాసం (మలయాళం), అదృశ్యం(తమిళ, మలయాళం) అనే సినిమాలు చేసింది. జిగిరీ దోస్తు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్ చిత్రాల్లోనూ తళుక్కుమని మెరిసింది.ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదుఅయితే ఈ బ్యూటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ఈ మధ్య పుకార్లు వైరల్గా అయ్యాయి. ఈ రూమర్లపై పవిత్ర లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. నా లుక్ మారడం, బరువు పెరగడంతో నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. చాలాసార్లు వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని కామెంట్లు అయితే చెప్పడానికి కూడా వీలు లేనంత దారుణంగా ఉన్నాయి.నా భవిష్యత్తు ఆగం చేయొద్దుఅందుకే మీ అందరికీ మరోసారి చెప్తున్నా.. నేను తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. దయచేసి మీ వినోదం కోసం నా గురించి లేనిపోని వార్తలు రాయొద్దు. నాపై రూమర్లు సృష్టించకండి. నాకంటూ ఓ జీవితం ఉంది.. దయచేసి నా పేరు చెడగొట్టకండి.. నా భవిష్యత్తును ఆగం చేయకండి. కొంత ప్రేమ, మరికొంత గౌరవం.. మీనుంచి ఈ రెండే కోరుకుంటున్నా.. మీరెప్పుడూ నాపై ప్రేమాభిమానాలే చూపించేవారు. దాన్ని అలాగే కొనసాగించండి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని పవిత్ర ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) చదవండి: బిగ్బాస్ షో హోస్ట్గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే! -
దసరా విలన్పై మరో నటి ఆరోపణలు.. సెట్లో చాలా అసభ్యంగా!
దసరా విలన్ షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఇటీవల ఆయనపై నటి విన్సీ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాకో ఉంటున్న హోటల్పై రైడ్ చేశారు. అయితే పోలీసులకు రాకముందే హోటల్ నుంచి తప్పించుకున్నాడు. ఇలా రోజుకో వివాదంతో టామ్ చాకో పేరు మాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. విన్సీ ఆరోపణలపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరో నటి టామ్ చాకోపై విమర్శలు చేసింది. తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మలయాళ నటి అపర్ణా జాన్ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టామ్ చాకో ప్రవర్తించిన తీరుపై మాట్లాడింది. విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలు వందశాతం నిజమేనని మద్దతుగా నిలిచింది. షైన్ టామ్ చాకో సినిమా సెట్స్లో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడని చెప్పుకొచ్చింది. సెట్లో మహిళకు మానసిక క్షోభ కలిగించేలా షైన్ ప్రవర్తించాడని పేర్కొంది. అతను మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి తెల్లటి పొడి రాలుతుండేదని.. అది మాదకద్రవ్యమో? కాదో తనకు తెలియదని అపర్ణ చెప్పింది. అతని మాటలన్నీ డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా ఉంటాయని తెలిపింది.(ఇది చదవండి: దసరా నటుడు అరెస్ట్)కాగా.. ఇటీవల నటి విన్సీ ఆరోపణల తర్వాత చాకోను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. విన్సీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనప్పటికీ, అతనిపై డ్రగ్ ఆరోపణలు రావడంతో చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. టామ్ చాకో చివరిసారిగా అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో దసరా మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. -
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ గురించి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj) పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన కొత్త సినిమా 'రెట్రో' ప్రమోషన్స్లో భాగంగా 'గేమ్ ఛేంజర్' ఫలితం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాకు సుబ్బరాజే కథ అందించారు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్ కూడా పలు వేదికల మీద చెప్పారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పడం విశేషం.'గేమ్ ఛేంజర్' గురించి కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను కేవలం వన్ లైన్ మాత్రమే గేమ్ఛేంజర్ కోసం ఇచ్చాను. గ్రౌండెడ్గా ఉండే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాయింట్తో స్టోరీ ఇస్తే చివరకు అది చాలా మార్పులకు లోనైంది. ఆ కథలో చాలామంది రచయితలు వేలు పెట్టడంతో చివరికి మరో రకంగా అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవరూ ఊహించలేరు. జయాపజయాలు ఎప్పటికీ మనచేతుల్లో ఉండవు.' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే, ఇదే మాట సినిమా విడుదల సమయంలో ఎందుకు చెప్పలేదంటూ కార్తీక్ సుబ్బరాజ్ను మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రిలీజ్కు ముందు మాత్రం కథ మొత్తం నాదే అంటూ చెప్పి.. ఇప్పుడు సినిమా ఫలితం అనుకున్నంతగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అందరూ కలిసి చరణ్ను తీవ్రంగా నష్టపరిచారని వారు చెబుతున్నారు. 'గేమ్ ఛేంజర్' విడుదలకు ముందు సుబ్బరాజ్ ఏమన్నారంటే.. 'గేమ్ ఛేంజర్' స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్ విజన్తో రూపొందించబడుతుందని బహిరంగంగానే సుబ్బరాజ్ చెప్పారు. తన కథను తెరపైకి శంకర్ తీసుకొస్తే ఎలా ఆనందంగా ఉంటుందన్న దానికి గేమ్ ఛేంజర్ సినిమా నిదర్శనం అంటూ చెప్పారు. తన కథతో శంకర్ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అంటూ సుబ్బరాజ్ పేర్కొన్నారు. "I have given only one liner of #GameChanger story to Shankar sir. In my version IAS officer was grounded, was excited to see Shankar sir's version. Many writers came onboard and so story & screenplay has been changed. Yes film didn't work audience🙁"-KSpic.twitter.com/DKNuUPh48G— AmuthaBharathi (@CinemaWithAB) April 24, 2025 -
వాటి కంటే అభిమానులే నాకు ముఖ్యం: సాయిపల్లవి
మాలీవుడ్లో కథానాయకిగా కెరీర్ను ప్రారంభించిన నటి సాయిపల్లవి(Sai Pallavi ). తొలి చిత్రం ప్రేమమ్తోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈమె ఆ తరువాత తెలుగు, తమిళం, తాజాగా హిందీ అంటూ ఇండియన్ సినిమాను చుట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క అవకాశం అంటూ నటీమణులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అవకాశాలే సాయిపల్లవి కోసం ఎదురు చూస్తుంటాయి. అలాగని అల్లాటప్పా పాత్రల్లో నటించడానికి ఈమె ససేమిరా అంటారు. అది ఎంత భారీ చిత్రం అయినా, ఎంత స్టార్ హీరో చిత్రం అయినా సరే. తన పాత్రకు కథలో ప్రాధాన్యత ఉందా, అందులో నటనకు అవకాశం ఉందా అన్నది ఆలోచించి మరీ చిత్రాలు చేసే నటి సాయిపల్లవి. మణిరత్నం లాంటి దర్శకుడే ఈమెతో చిత్రం చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారంటే మామూలు విషయం కాదుగా. ఇటీవల సాయిపల్లవి కథానాయకిగా శివకార్తికేయన్ సరసన నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో పాటూ ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. అదేవిధంగా నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా హిందీలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రామాయణంలో సీతగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఈమె ఓ భేటీలో అవార్డుల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తనకు అవార్డుల కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు తన కథా పాత్రలను చూసి అందులోని ఎమోషన్స్తో లీనమైతేనే చాలని అదే పెద్ద విజయంగా భావిస్తానని పేర్కొన్నారు. పాత్రల ద్వారా యదార్ధతను చెప్పే లాంటి పాత్రలను తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. తాను భావించినట్లు ఆ కథాపాత్రల్లోని ఎమోషన్స్కు ప్రేక్షకులు కనెక్ట్ అయితే అదే పెద్ద విజయంగా భావిస్తానని నటి సాయిపల్లవి పేర్కొన్నారు. అందుకే అవార్డుల కంటే అభిమానుల ప్రేమాభిమానాలే ముఖ్యం అన్నారు. అభిమానుల ఆదరాభిమానాలను పొందడానికే తాను ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు. -
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో?
'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా నా సినిమాలు ఉంటాయి' అంటున్నాడు దర్శకుడు, నటుడు సుందర్.సి. ఈయన ఇటీవలే మదగజరాజ సినిమాతో హిట్టందుకున్నాడు. నిజానికి ఇది 2012లో రావాల్సిన సినిమా. కానీ ఎందుకో విడుదలకు నోచుకోలేదు. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 12న విడుదలై విజయం సాధించింది.డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవ్ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుందర్. సి (Sundar C) మాట్లాడుతూ.. నా సినిమా ప్రతి ఒక్కరూ చూసేలా ఉండాలని కోరుకుంటాను. అందుకే డబుల్ మీనింగ్ డైలాగులు రాయను. ఒకవేళ ఏవైనా ద్వంద్వార్థాలు ఉండే డైలాగ్స్ కనిపించాయంటే అవి కేవలం ప్రేక్షకులు ఊహించుకుంటున్నవే కానీ నేను మాత్రం ఆ ఉద్దేశంతో రాయలేదు.ఐటం సాంగ్స్ ఉండవ్స్క్రిప్టు రాసే దగ్గరి నుంచి షూటింగ్ వరకు ఎక్కడా డబుల్ మీనింగ్స్కు, అసభ్యతకు చోటు లేకుండా జాగ్రత్తపడతాను. అలా అని నా సినిమాల్లో గ్లామర్ లేకుండా ఉండదు. కాకపోతే ఆ గ్లామర్ను ఎలా చూపిస్తున్నానన్నది ముఖ్యం. ఉదాహరణకు చీరకట్టుకున్న అమ్మాయిని రకరకాల యాంగిల్స్లో ఇంకోలా చూపించొచ్చు. నేను మాత్రం అలాంటి పని చేయను. నేను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా విజువల్స్ ఉండాలని భావిస్తాను. అలాగే నా సినిమాల్లో ఐటం సాంగ్స్ ఉండవు.. నా చిత్రాలు ఫ్యామిలీ ఫ్రెండ్లీలా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.మరి ఇదేంటి సార్?ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అతడు రాసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ను, కాస్త ఓవర్డోస్గా ఉన్న సన్నివేశాలను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీస్తే.. అరణ్మనై మూవీ (Aranmanai Movie)లో స్విమ్మింగ్ పూల్ సీన్ దేనికుందో మరి?, అంబాలా మూవీలో మద్రాస్ టు మధురై ఐటం సాంగ్ ఉందిగా.. అరణ్మనైలో తమన్నా, రాశీలతో డ్యాన్స్ చేయిస్తూ క్లోజ్ షాట్స్లో చిత్రీకరించావుగా.. అంటూ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాఇకపోతే సుందర్.. మెట్టుకుడి, అరుణాచలం, అంబే శివం, లండన్, రెండు, అరణ్మనై (నాలుగు భాగాలు), యాక్షన్, కాఫీ విత్ కాదల్, మదగజరాజ వంటి పలు సినిమాలు డైరెక్ట్ చేయడంతో పాటు కొన్నింటిలో నటించాడు కూడా! ఈయన ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా గ్యాంగర్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమెడియన్ వడివేలు, కేథరిన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదల కానుంది. 🤣pic.twitter.com/bOWN7aANH1— Prakash Mahadevan (@PrakashMahadev) April 20, 2025 I love Sundar C glamour but I can't digest the fact he is not accepting. He has the most naughtiest frames in Kollywood but carefully escaping— 𝐒𝐔𝐍𝐈𝐋 𝐓𝐇𝐈𝐋𝐀𝐊 (@sunil_thilak) April 20, 2025చదవండి: RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్ -
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
పలు కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. తన రాష్ట్రానికి చెందిన శరత్ అనే క్రికెటర్ తో కొత్త జీవితం ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.2018 నుంచి ఇండస్ట్రీలో ఉన్న అర్చన.. డియర్ సత్య, యెల్లో గ్యాంగ్స్, విజయానంద్, హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే తదితర సినిమాల్లో నటించింది. ఈమె వయసు ప్రస్తుతం 28 ఏళ్లే. అయితేనేం కర్ణాటక తరఫున క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బీఆర్(Sharath Br)ని పెళ్లి చేసుకుంది. బుధవారం ఉదయం సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి(Heroine Wedding) జరిగింది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)ఇకపోతే మంగళవారం రాత్రి అర్చన-శరత్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. కాంతార హీరోయిన్ సప్తమి గౌడతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలానే శరత్ కోసం కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ, యష్ దయాల్, దేవదత్ పడిక్కల్ తదితరులు హాజరయ్యారు.కర్ణాటక తరఫున అండర్-23 ఆడిన శరత్.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. గతేడాది ఐపీఎల్ లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు. కనీస ధర రూ.20 లక్షలకు ఇతడిని టీమ్ దక్కించుకుంది. కానీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకోవడంతో సినీ, క్రికెట్ సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్) -
'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
అజిత్ (Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్లో చేరింది. ఏకంగా తన కెరీర్లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలోని ఒక మ్యూజిక్ థీమ్తో ఉన్న పాట అజిత్ అభిమానుల్లో పూనకాలను తెప్పించింది. దానిని ఇప్పుడు వీడియో వర్షన్ను మేకర్స్ విడుదల చేశారు. మలేషియాకు చెందిన సింగర్ డార్కీ ప్రత్యేకమైన వాయిస్తో ఈ పాటలో మెప్పించాడు. అతని వాయిస్కు పోటీగా జి. వి. ప్రకాష్ కొట్టిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టకున్న సాంగ్ను మీరూ చూసేయండి. -
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు తన కామెంట్ల వల్ల నెట్టింట నెగటివిటీని తెచ్చుకున్నారు. తాజాగా ‘ప్రేమలు’ మూవీ ఫేమ్ నస్లేన్ కె.గఫూర్ (Naslen K.Gafoor) నటించిన ‘జింఖానా’ (Gymkhana) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ మూవీని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెరకెక్కించారు.దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాలు బాగుంటాయని ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే అతని నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్కు క్రేజ్ ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్మీడియాలో వివాదస్పదంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘జింఖానా’ మూవీ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగా వెళ్లిన హరీశ్ ఏమన్నారంటే.. నేను గతంలో డ్రాగన్ సినిమాను ప్రమోట్ చేశాను. ఆ సమయంలో ఒకమాట అన్నాను.. మన సినిమాలకంటే పక్క భాషల సినిమాలే తెలుగువారు ఎక్కువగా చూస్తారన్నా.. అప్పుడు నన్ను అందరూ విమర్శించారు. ఆ సమయంలో ఆ మాట ఎందుకనాల్సి వచ్చిందంటే.. నా లాస్ట్ సినిమా (మిస్టర్ బచ్చన్)ను ఎవరూ చూడలేదు. కానీ, అదే టైమ్లో వచ్చిన మరో భాష సినిమా (తంగలాన్)ను చూశారు. అందుకే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పడు కూడా అదే చెబుతున్నా.. ఇతర భాషల సినిమాలను చూసేందుకు ఎగేసుకుని వెళ్తాం కదా.. ఇదే విధంగా ఈ సినిమాను (జింఖానా) కూడా చూడండి. దయచేసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. ఎవరెలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నా అభిప్రాయం చెప్పాను.' అని అన్నారు.హరీశ్ శంకర్ కామెంట్లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తే ఎలా అంటూ విమర్శిస్తున్నారు. సినిమా బాగుంటే తమకు భాషతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో మీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే హిట్ చేశారనే విషయం మరచిపోతే ఎలా హరీశ్ అంటూ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తాము ఎలాంటి సినిమాలు చూస్తామో, చూడాలో చెప్పడానికి మీరు ఎవరు..? అంటూ హరీశ్పై ఫైర్ అవుతున్నారు. -
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
హీరోయిన్గా తమన్నా రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లో పలు చిత్రాలు చేసి అగ్ర కథానాయకిగా మెప్పిస్తుంది. మధ్య మధ్యలో ప్రత్యేక పాటల్లో నటిస్తున్నా అవి ఆమె కెరీర్కు ప్లస్ అయ్యాయే కానీ ఎలాంటి నష్టాన్ని తీసుకురాలేదు. మరోవైపు ఇప్పటికీ కథానాయకిగా ఛాన్సులు కూడా దక్కించుకోవడం విశేషం. ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన తర్వాత కాస్త అవకాశాలు తగ్గినా.. ఆమె క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇందుకు కారణం ఆమె ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్కు స్పెషలిస్ట్ అనిపించుకోవడమే. ఈమె హిందీలో ప్రత్యేక పాటలో నటించిన స్త్రీ చిత్రం కానీ, తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో స్పెషల్ సాంగ్తో పాటు గెస్ట్గా నటించిన పాత్ర కానీ ఆ చిత్రాల విజయాలకు కొమ్ము కాశాయని చెప్పక తప్పదు. చాలా కాలం నుంచి ఈమెను అందరూ మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. అందుకు తగిన గ్లామర్ ఆమెలో ఉందని కూడా చెప్పవచ్చు. ఇటీవల ఒక సమావేశంలో తమన్నా మాట్లాడుతూ.. మిల్కీ బ్యూటీ అనే పట్టం తనకు మొదట్లో అభిమానులు ఇచ్చారని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత మీడియా దాన్ని ఎక్కువగా వాడటంతో ఆ పదం చాలామందికి దగ్గరైంది. దానివల్ల తాను ఇబ్బందులు పడ్డానని అనుకున్నారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు. అలా పిలుస్తే ఎవరికి ఇష్టం ఉండదొ చెప్పండి అంటూ నవ్వేసింది. అదేవిధంగా అందంగా ఉండడంతోనే మంచి అవకాశాలు తనకు రాలేదని గుర్తుచేసింది. తాము పనిచేస్తోంది రంగుల ప్రపంచంలో అని, ఇక్కడ అందుకు తగ్గట్టుగా అందంగా ఉండాలని, అందుకోసమే తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని తమన్నా పేర్కొంది. తాజాగా కథానాయకిగా నటించిన తెలుగు ఓదెల–2 ఇటీవల తెరపైకి వచ్చింది. -
మార్పులు... చేర్పులు
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది మార్చి 2న 97వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్లో ఘనంగా జరిగింది. కాగా 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన కీలక తేదీలు, కొన్ని కొత్త నియమ–నిబంధనలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15 (ఆదివారం)న నిర్వహించనున్నట్లు అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16 ఉదయం). ఇంకా ఆస్కార్ గవర్నర్ అవార్డ్స్ ప్రదానోత్సవాన్ని ఈ ఏడాది నవంబరు 16న నిర్వహించనున్నామని, డిసెంబరు 16న షార్ట్ లిస్ట్ జాబితాను వెల్లడిస్తామని, 2026 జనవరి 22న నామినేషన్స్ను ప్రకటిస్తామని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. 2026 ఫిబ్రవరి 26న మొదలయ్యే ఫైనల్ ఓటింగ్ మార్చి 5న ముగుస్తుందని, ‘అచీవ్మెంట్ ఇన్ క్యాస్టింగ్’ అనే కొత్త విభాగాన్ని చేర్చామనీ, ఇంకా పలు విషయాలను అకాడమీ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారు.అన్ని సినిమాలు చూడాల్సిందే! ఆస్కార్ అవార్డ్స్ కోసం ఫైనల్ ఓటింగ్లో పాల్గొనే సభ్యులు ఏ విభాగానికి అయితే ఓటింగ్ చేస్తున్నారో ఆ విభాగంలోని అన్ని చిత్రాలను చూసినట్లుగా అధికారికంగా ధ్రువీకరించేలా ఆస్కార్ కమిటీకి ఆధారాలు చూపాలి. అన్ని విభాగాలకు ఓటింగ్ చేయాలనుకుంటే, అన్ని విభాగాల్లోని చిత్రాలను ఫైనల్ రౌండ్లో పాల్గొనే ఆస్కార్ ఓటర్స్ కచ్చితంగా చూడాలి. ఫైనల్ రౌండ్లో ఓటింగ్ చేసే ఓటర్స్ సినిమాలను చూస్తున్నారో? లేదో ఆస్కార్ అకాడమీ స్క్రీనింగ్ రూమ్ ప్రతినిధులు గమనిస్తారు. ఒకవేళ ఓటర్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లేదా మరేదైనా సందర్భంలో ఆస్కార్ నామినేషన్ చిత్రాలను చూసినట్లయితే ఆ ఆధారాలను కమిటీకి అందజేయాలి. ఆస్కార్ ఓటర్స్ దాదాపు పదివేల మంది ఉన్న విషయం తెలిసిందే. ఏఐ చిత్రాలకూ అవార్డ్స్ ‘ఏఐ’ (కృత్రిమ మేధ), డిజిటల్ సాధనాలతో రూపోందించబడిన చిత్రాలను కూడా ఆస్కార్ అర్హతకు పరిగణిస్తామని, అయితే మానవ నిర్మిత చిత్రాలకుప్రాముఖ్యత ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. 2025లో జనవరి 1 నుంచి డిసెంబరు 30 వరకూ విడుదలైన సినిమాలు ఆస్కార్ అవార్డుల కోసం పరిగణిస్తారు. కాకపోతే మ్యూజిక్ విభాగంలో మాత్రం ఈసారి నామినేషన్ల సమయాన్ని కాస్త తగ్గించారు. ఇక దేశ పౌరుడు ఏ కారాణాల చేతనైనా మరో దేశానికి వలస వెళ్లినా లేదా శరణార్థిగా వెళ్లినా ప్రస్తుతం అతను నివసిస్తున్న దేశం తరఫున ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి అవార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. సినిమాటోగ్రఫీ విభాగంలో గత ఏడాది వరకూ డైరెక్ట్గా నామినేషన్స్ ప్రకటించేవారు. అయితే తొలిసారిగా షార్ట్ లిస్ట్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇంకా యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలోనూ చిన్నపాటి మార్పు జరిగింది. -
15 ఏళ్ల తర్వాత మోహన్లాల్- శోభన సినిమా (ట్రైలర్)
మోహన్లాల్(Mohanlal), శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్’(Thudarum) తెలుగు ట్రైలర్ విడుదలైంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఈ క్రైమ్ డ్రామా మూవీని నిర్మించారు. 1987లో తొలిసారి నాడోడిక్కట్టు చిత్రంలో కనిపించిన వీరిద్దరూ ఆ సినిమాతో సూపర్హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుమారు 56 సినిమాల్లో కలిసి నటించారు. వారిద్దరూ కలిసి అన్ని సినిమాల్లో నటించారంటే ఎవరూ ఊహించలేరని చెప్పవచ్చు.2009లో చివరిగా 'సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్' చిత్రంలో వారు జంటగా కనిపించారు. మలయాళంలో హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు కలిసి మళ్లీ సుమారు 15 ఏళ్ల తర్వాత 'తుడరుమ్' మూవీలో నటించారు. అందుకే మలయాళ అభిమానులు ఈ మూవీ కోసం భారీగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్గా మోహన్లాల్ కనిపిస్తారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. -
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం మామన్ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. కాగా ఆయన శిష్యుడు, సెల్షి చిత్రం ఫేమ్ మణిమారన్ పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ నాయకిగా నటిస్తుంది. అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్ ముఖ్య పాత్రతో కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, ఎస్ఆర్.కదీర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్నే ఇంత బ్రహ్మండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్నే అన్నారు. తాను ఏమీ లేకుండా వచ్చాననీ, ఇప్పుడు శక్తికి మించే సంపాదించినట్లు చెప్పారు. అందువల్ల ఇకపై నచ్చిన చిత్రాలు చేస్తే చాలన్నారు. సర్వైవల్ అవ్వడానికి భగవంతుడి భాగ్యంతో కళామతల్లి చూసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు సంపాదించింది చాలు.. ఇకనుంచి తన విజయానికి కారణమైన అభిమానులకు తనవంతుగా సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని ఆయన అన్నారు. -
ముంబైలో రావణుడు
ముంబైలో ల్యాండ్ అయ్యారు హీరో యశ్. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలోని రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్మణుడిగా రవి దుబే, హనుమంతుడు పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు యశ్. ఈ షెడ్యూల్లో యశ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరుగుతుందని, రణ్బీర్ కపూర్ పాల్గొనరని సమాచారం. ఇక ‘రామాయణ’ తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్బాస్ దివి స్టన్నింగ్ అవుట్ఫిట్!
జాన్వీ కపూర్కు స్కూటీ నేర్పిస్తోన్న స్టార్ హీరో..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన మీనాక్షి చౌదరి..స్టన్నింగ్ అవుట్ఫిట్లో బిగ్బాస్ దివి పోజులు..డీసెంట్ లుక్లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్...బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. గూస్బంప్స్ తెప్పించే ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిం. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసింది.తాజాగా ఈ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఓజీ సంభవం పేరిట అజిత్ ఫ్యాన్స్ను ఊపేస్తోన్న పాటను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ వర్షన్ కూడా వచ్చేసింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. The unmatched style and swag ❤️🔥#OGSambavam video song from #GoodBadUgly out now!Tamil - https://t.co/knfimOefHVTelugu - https://t.co/XgRHz7UxHhBook your tickets for #GoodBadUgly now!🎟️ https://t.co/jRftZ6vpJD#BlockbusterGBU pic.twitter.com/h7wmmbZvbH— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025 -
తగ్గేదేలే అంటోన్న అజిత్ టీమ్.. వరుసగా మూడో టైటిల్ కైవసం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో ఘనత సాధించారు. సినిమాలు మాత్రమే కాదు.. వరుస కార్ రేసింగ్లతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు టైటిల్స్ గెలిచిన అజిత్ టీమ్ మరో కప్ కొట్టేసింది. బెల్జియంలో నిర్వహించిన స్పా- ఫ్రాన్కోర్ఛాంప్స్ సర్క్యూట్లో అజిత్ టీమ్ రెండోస్థానంలో నిలిచింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.ఈ ఘనత సాధించడం పట్ల టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సైతం అభినందనలు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్లో అజిత్ టీమ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటలీలో జరిగిన 12హెచ్ రేస్లోనూ మూడో స్థానం దక్కించుకుంది.ఇక సినిమాల పరంగా చూస్తే ఇటీవలే యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ వచ్చింది. దీంతో వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణస సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ నటుడు సునీల్, ప్రభు, సిమ్రాన్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించారు.Congratulations to #AjithKumar sir and his team for the P2 podium finish at the prestigious Spa Francorchamps circuit in Belgium.This is an amazing feat. We are proud of you, sir. pic.twitter.com/KL88S6943L— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2025 -
దసరా విలన్కు ఊరట.. ఆ విషయంలో క్షమాపణలు చెప్పిన నటి
దసరా విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలతో ఆయనపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు తీసుకునేందు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోలీసులు రైడ్ చేయడంతో ఓ హోటల్ నుంచి పారిపోయాడని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.అయితే అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోన్న విన్సీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. టామ్ చాకోపై తానేలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని తెలిపింది. ఈ సమస్యను చిత్ర పరిశ్రమలో కాకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేరళ ఫిల్మ్ ఛాంబర్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి దాఖలు చేసిన ఫిర్యాదును మాత్రం ఉపసంహరించుకోబోనని ఆమె తెలిపారు. ఇప్పటికైనా మలయాళ చిత్ర పరిశ్రమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని విన్సీ తెలిపారు. అందుకే తాను ఫిర్యాదుతో ముందుకు వెళ్లానని విన్సీ అలోషియస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు.కాగా.. ఓ మూవీ షూట్ సమయంలో షైన్ టామ్ చాకో తన దుస్తులను సరిచేయమని పట్టుబట్టాడని ఆరోపిస్తూ విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. వీరిద్దరు కలిసి నటించిన 'సూత్రవాక్యం' సెట్స్లో టామ్ డ్రగ్స్ వాడాడని కూడా ఆమె ఆరోపించింది. తన ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారణకు సహకరిస్తానని నటి తెలిపింది. కాగా.. విన్సీ అంతకుముందు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. షైన్ టామ్ చాకో పేరును కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజీ నంతియట్టు మీడియాకు వెల్లడించారని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అతని పేరును బయటికి చెప్పినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని విన్సీ తెలిపింది. -
సినీ నటిని మోసగించిన 'ప్రేమిస్తే' నటుడు
తమిళ నటుడు కాదల్ సుకుమార్ కోలీవుడ్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. శింబు కాదల్ వావ్తిల్లై (కుర్రాడొచ్చాడు), కమల్ హాసన్ విరుమాండి(పోతురాజు) వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుని ఛాన్సులు అందుకున్నాడు. బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన కాదల్ (ప్రేమిస్తే) చిత్రంలో అతని నటనకు ప్రశంసలు లభించినందున అతన్ని కాదల్ సుకుమార్ అని పిలుస్తారు. ప్రస్తుతం తిరుట్టు విశీల్, షుమ్మవే ఆడువోమ్ అనే 2 చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్లు కూడా ఆర్ధాంతరంగానే ఆగిపోయాయి. ఇప్పుడు సినిమాల్లో నటించే ఛాన్స్లతో పాటు కొత్తగా దర్శకత్వం వహించడానికి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. కాదల్ సుకుమార్ యూట్యూబ్ ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో గత జనవరిలో చైన్నె టీనగర్ ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఒక నటి ఫిర్యాదు చేసింది. ప్రముఖ నటుడు కాదల్ సుకుమార్ తనను పెళ్లి చేసుకుంటానని, 3 సంవత్సరాలు కుటుంబాన్ని పోషిస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 7 లక్షలు డబ్బుతో పాటు నగలు తీసుకుని మోసం చేశాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు సుకుమార్పై కేసు నమోదు చేశారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు హాజరుకావాలని అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కాదల్ (ప్రేమిస్తే) సినిమా తెలుగులో కూడా విడుదలైంది. దీనిని దర్శకుడు శంకర్ తన బ్యానర్పై తక్కవ బడ్జెట్తో నిర్మించారు. భరత్, సంధ్యలకు పెళ్లి జరిపించిన స్టీఫెన్ పాత్రలో సుకుమార్ కనిపిస్తాడు. ఈ పాత్రతో అతనికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా అతను సుపరిచయమేనని చెప్పవచ్చు. -
అట్నే ఉండు
‘ఏ... వన్ డే హీరో నువ్వే ఫ్రెండు... నీ కోసమే డప్పుల్ సౌండు... అస్సల్ తగ్గక్... అట్నే ఉండు... మొక్కూతారు కాళ్లూ రెండు...’ అంటూ ఊర మాస్ పాట పాడారు హీరో ధనుష్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా ముఖ్య తారలుగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ చిత్రంలో ‘పోయిరా మామా...’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు.దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా ధనుష్ పాడారు. శేఖర్ వీజే నృత్య రీతులు సమకూర్చారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 20న హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది. -
పెళ్లి చేసుకున్న 'బిగ్ బాస్' జంట.. మూడేళ్ల ప్రేమ
బిగ్ బాస్ షోతో పరిచయమై.. దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకున్న జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అబ్బాయి ముస్లిం అయినప్పటికీ.. ఆమ్మాయి ఇష్టప్రకారం హిందు సంప్రదాయంలోనే పెళ్లి జరగడం విశేషం.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)2012 నుంచి సినిమాలు చేస్తున్న నటి పావని రెడ్డి.. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 తదితర చిత్రాలు చేసింది. తమిళ, తెలుగులో పలు సీరియల్స్ కూడా చేసి గుర్తింపు తెచ్చుకుంది.పావనికి ఇదివరకే 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది. పావని ఓ తెలుగు సీరియల్ చేస్తున్న టైంలో ఇతడి పరిచయమయ్యాడు. కాకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్ లోకి వెళ్లిన ఈమె.. దాన్నుంచి తేరుకుని షోలు చేయడం మొదలుపెట్టింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?)అలా తమిళంలో బిగ్ బాస్ 5వ సీజన్ లో పావని పాల్గొంది. ఇదే షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెకి విషయం చెబితే తొలుత నో చెప్పింది గానీ కొన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా 2022 నుంచి ఆమిర్-పావని రెడ్డి రిలేషన్ షిప్ లో ఉన్నారు.దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పలు షోల్లోనూ జంటగా పాల్గొని విజేతగానూ నిలిచారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి గురించి పావని బయటపెట్టింది. ఇప్పుడు హిందూ సంప్రదాయంలో ఆమిర్-పావని పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అందరూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్) -
న్యూ ఇయర్ వేళ.. శక్తిపీఠాలు సందర్శించిన సూర్య దంపతులు..!
కోలీవుడ్ స్టార్ జంట జ్యోతిక- సూర్య దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఈ జంట.. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర కొల్లాపూర్లోని మహాలక్ష్మి, కామాఖ్య ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఆలయానికి వెళ్లినట్లు జ్యోతిక పోస్ట్ చేసింది.ఇక సినిమాల విషయానికొస్తే జ్యోతిక ఇటీవలే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది. సూర్య ప్రస్తుతం రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. ఇటీవలే రెట్రో ట్రైలర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కంగువా డిజాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.రెట్రో సెన్సార్ పూర్తి..ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్
కోలీవుడ్ భామ మాళివిక మోహనన్ గతేడాది తంగలాన్ మూవీతో అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన మెప్పించింది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ సరసన ది రాజాసాబ్ చిత్రంలో కనిపించనుంది. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయిలో తాను ఓ భయానక అనుభవం ఎదురైందని పేర్కొంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత గురించి నటి మాళవిక మోహనన్ స్పందించింది.మాళవిక మోహనన్ మాట్లాడుతూ..'ముంబయిలో ఒక రోజు రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్లో ప్రయాణించా. రాత్రి 9 గంటల 30 నిమిషాలు అయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ చాలా ఖాళీగా ఉంది. ఆ కంపార్ట్మెంట్లో మేము తప్ప ఎవరూ లేరు. అదే సమయంలో ఒక వ్యక్తి అందులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడు. అప్పుడు అతడి ప్రవర్తనతో మేమంతా భయానికి గురయ్యాం. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత వేరే స్టేషన్ రాగానే కొంతమంది ప్రయాణికులు మాకు తోడయ్యారు. అప్పుడే మేమంతా ఊపిరి పీల్చుకున్నాం' అని వెల్లడించింది. అయితే అక్కడ ఉన్న మహిళలకు సురక్షితమా కాదా అనే విషయం అదృష్టంపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపింది.మాళవిక మాట్లాడుతూ..'నగరం మహిళలకు ఎంత సురక్షితమైనది అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. ముంబయి మహిళలకు సురక్షితం అని ప్రజలు చెబుతారు. కాని నేను ఆ అభిప్రాయాన్ని సరిదిద్దాలనుకుంటున్నా. ఈ రోజు నాకు సొంత కారు, డ్రైవర్ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నన్ను ముంబై సురక్షితంగా ఉందా అని అడిగితే.. నేను అవును అని చెప్పగలను. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు, బస్సులు మరియు రైళ్లలో ప్రయాణించడం, నేను తరచుగా ప్రయాణించడం అదృష్టంగా భావించలేదు. ఆ సమయంలో చాలా ప్రమాదకరంగా అనిపించేది' అని చెప్పుకొచ్చింది. -
సౌత్లో ఆ పిచ్చి అలాగే ఉంది.. నన్నెంత దారుణంగా తిట్టారో!: రాజాసాబ్ బ్యూటీ
దక్షిణాదిన హీరోయిన్ల నాభి అందాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారంటోంది హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ముంబైలో పెరగడం వల్ల సౌత్లో కొన్ని విషయాలు చూసినప్పుడు ఇదేంటని ఆశ్చర్యపోయేదాన్ని. ఇక్కడ(దక్షిణాదిన) నాభి అందాల్ని ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. హీరోయిన్ల ఫోటోలను జూమ్ చేసి చూస్తుంటారు.అప్పుడు నాకు 21 ఏళ్లే..ఇకపోతే మొదట్లో నేను మరింత సన్నగా ఉండేదాన్ని. తొలి సినిమా చేసేటప్పుడు నా వయసు 21 మాత్రమే. అప్పుడు బక్కగా ఉండటం వల్ల చాలామంది ట్రోల్ చేశారు. కొన్నేళ్లకు నా శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. అప్పుడు కూడా దారుణంగా విమర్శించారు (Social Media Trolling). అస్థిపంజరంలా ఉన్నావ్.. కాస్త లావు అవొచ్చుగా.. ఇలా చాలా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ ఇంత పద్ధతిగా ఏం మాట్లాడలేదు. అవమానకర వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో శరీరం గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసి అవతలి వ్యక్తిని బాధపెట్టడం కరెక్ట్ కాదు. మీరు విమర్శించడమే కాదు మాటలతో భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు కూడా! అని మాళవిక చెప్పుకొచ్చింది.మలయాళ కుట్టిమాళవిక మోహనన్ మలయాళ అమ్మాయి. పట్టం పోలే (Pattam Pole) చిత్రంతో 2013లో కథానాయికగా మలయాళ వెండితెరకు పరిచయమైంది. మలయాళంతోపాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ద రాజా సాబ్ మూవీలో మాళవిక కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అలాగే తమిళంలో కార్తీ సర్దార్ 2 మూవీలోనూ నటిస్తోంది. ఇది సూపర్ హిట్ మూవీ సర్దార్కు సీక్వెల్గా తెరకెక్కుతోంది. అలాగే మలయాళంలో మోహన్లాల్తో కలిసి హృదయపూర్వం సినిమా చేస్తోంది.రాజాసాబ్తో టాలీవుడ్లో ఎంట్రీరాజా సాబ్ (The Raja Saab Movie) విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ మూవీని ఈ నెల 10న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడక తప్పలేదు. అయితే రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు.చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీకి ఆపరేషన్ -
అలాంటి పాత్రల కంటే ఇది చాలా బెటర్.. సిమ్రాన్ కౌంటర్ 'లైలా' గురించేనా..?
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో అతిధి పాత్రతో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ మెప్పించారు. ఆమె నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో, తాజాగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సిమ్రాన్ చెప్పిన ఒక విషయం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇందులో సిమ్రాన్ మరో నటి గురించి ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం నాతో పాటు పనిచేసిన ఒక నటికి నేను మెసేజ్ పంపాను. ఆమె నటించిన సినిమా గురించి చెబుతూ ఆ పాత్రలో మిమ్మల్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానన్నాను. ఆపై మీ పాత్ర చాలా బాగుందని కూడా చెప్పాను. దానికి ఆమె నుంచి వెంటనే నాకు తిరిగి సమాధానం వచ్చింది. ఆంటీ రోల్స్లో నటించడం కంటే ఇదే బెటర్ కదా అంటూ ఆమె నుంచి షాకింగ్ రిప్లై వచ్చింది. నేను మంచి ఉద్దేశంతోనే మెసేజ్ చేశాను. కానీ, ఆమె నుంచి నేను అలాంటి సమాధానం ఎప్పుడూ ఊహించలేదు. నేను పంచుకున్నది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు నాకు అనిపించింది. అందుకే ఆమెకు ఇప్పుడు వేదిక మీదుగా సమాధానం చెబుతున్నాను. పనికిమాలిన డబ్బా రోల్స్లో నటించడం కంటే ఆంటీ , అమ్మ పాత్రలలో నటించడం చాలా ఉత్తమం. దేనిని చులకనగా చూడకూడదు' అని సిమ్రాన్ చెప్పుకొచ్చారు. కానీ, ఆమె పెరు వెళ్లడించలేదు.ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించా: సిమ్రాన్2002లోనే తాను 'కన్నతిల్ ముత్తమిట్టల్' (అమృత) సినిమాలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించానని సిమ్రాన్ గుర్తుచేశారు. అప్పుడు తన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే అని ఆమె చెప్పారు. R. మాధవన్కు భార్యగా సిమ్రాన్ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.లైలా గురించేనా..?ఈ ఏడాదిలో విడుదలైన శబ్ధం సినిమాలో సిమ్రన్, లైలా ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో ఆది పినిశెట్టి హీరో. హారర్ ఎలిమెంట్గా వచ్చిన సినిమాలో డాక్టర్ డయానా పాత్రలో సిమ్రన్ నటించగా.. నాన్సీ డేనియల్గా కీలకమైన పాత్రలో లైలా నటించింది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. సిమ్రాన్ చేసిన కామెంట్లు లైలా గురించే అని కొందరు చెబుతున్నారు.సిమ్రాన్కు సౌత్ ఇండియాలో భారీగానే అభిమానులు ఉన్నారు. 1990, 2000 దశకంలో ఆమె తిరుగులేని హీరోయిన్గా తమిళ, తెలుగు పరిశ్రమలో దుమ్మురేపింది. హీరోల కంటే సిమ్రానే ఫుల్ బిజీగా ఉండేది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ హీరోల సరసన నటించిన సిమ్రాన్.. కోలీవుడ్లో విజయ్, అజిత్, సూర్య, రజనీకాంత్, కమల్ వంటి స్టార్స్తో మెప్పించారు. Laila ? #Sabdhampic.twitter.com/P8QnoWOEgv— Christopher Kanagaraj (@Chrissuccess) April 20, 2025 -
కుబేర నుంచి ఫస్ట్ సాంగ్.. 'పోయిరా మావా' అంటున్న ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush)- దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ ఆలపించగా భాస్కర్ భట్ల లిరిక్స్ అందించారు. ధనుష్కు జోడీగా రష్మిక నటిస్తుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తొలి పాటలోనే ఆయన మార్క్ చూపించారు. -
స్టార్ హీరో సినిమా సెట్లో అగ్నిప్రమాదం
ధనుష్ సినిమా షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం జరిగింది. ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు) సినిమా కోసం వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన అర్దరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. తేని జిల్లా అండిపట్టిలో కొద్దిరోజులుగా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే అక్కడ ధనుష్, నిత్యా మీనన్ మధ్య కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే, సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన కొన్ని పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.సుమారు 15 రోజులుగా ఆ ప్రాంతంలోనే చిత్రీకరణ జరుగుతుంది. ధనుష్ ఇడ్లీ షాప్ సన్నివేశాలకు సంబంధించిన సెట్ను అక్కడ వేశారు. మొదట అందులో నుంచే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. ఇడ్లీ కొట్టు చిత్రాన్ని ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ‘తిరు’ (2022) సినిమా తర్వాత ధనుష్–నిత్యా మీనన్ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, ప్రకాశ్రాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. -
ప్రముఖ నటుడి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు.. 7 వాహనాలు ధ్వంసం
ప్రముఖ తమిళనటుడు బాబిసింహా కారు ఢీకొని ముగ్గురికి గాయాలు కాగా, ఏడు వాహనాలు ధ్వంసం అయిన ఘటన చెన్నై గిండి కత్తిపరా ఫ్లైఓవర్పై కలకలం రేపింది. నటుడు బాబిసింహా వద్ద పెరంబలూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు . శుక్రవారం రాత్రి బాబీ సింహా తండ్రిని ఓ చోట దింపి తిరిగి డ్రైవర్ పుష్పరాజ్ కారులో మనపాక్కంకు వస్తున్నాడు. ఈ క్రమంలో కత్తిపర ఫ్లైఓవర్ నుంచి ఆలందూరు మెట్రో రైల్వే స్టేషన్ వైపు వస్తుండగా లగ్జరీ కారు అదుపు తప్పి వంతెనపై నుంచి మరో రెండు కార్లను, ఆటోను, టూవీలర్ను పిట్టగోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుల్లో ఒకరికి కాలు విరిగగా , మరొకరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ యువతి కూడా గాయాలైనట్లు సమాచారం. అలాగే ప్రమాదానికి గురైన కారు, ఆటో నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఆ ఆప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్నసెయింట్ థామస్ మౌంట్ పోలీసులు క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు . కారు డ్రైవర్ పుష్పరాజ్ను ప్రశ్నించగా మద్యం తాగి వాహనం నడిపినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పుష్పరాజ్ను అరెస్టు చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాబీ సింహా కారులో లేరని వారు వెల్లడించారు.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో బాబీ సింహా విలన్గా నటించిన విషయం తెలిసిందే. కాగా.. ఇండియన్-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్హాసన్ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్గా బాబీ మెప్పించారు. -
చెప్పి మరీ నటిని ఇబ్బంది పెడుతున్నారు
సోషల్ మీడియా ఉపయోగించడం ఏమో గానీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హ్యాకింగ్ బారిన పడుతుంటారు. నటీనటులు ట్విటర్ అకౌంట్స్ ఎప్పటికప్పుడు హ్యాక్ అవుతూనే ఉంటాయి. తాజాగా తమిళ నటి ఖుష్బూని హ్యాకర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ తరచుగా ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఫొటో పోస్ట్ చేయగానే.. సన్నగా మారడానికి ఇంజెక్షన్ తీసుకున్నారా? అని ఓ నెటిజన్ అన్నాడు. దీంతో అతడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.తాజాగా ఖుష్బూ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందో ఏమో గానీ యూకేకి చెందిన కొందరు హ్యాకర్స్.. నీ ట్విటర్ ఖాతాని హ్యాక్ చేస్తున్నాం అని ఖుష్బూ వాట్సాప్ కే మెసేజ్ పంపించారు. ఈమె ట్విటర్ ఖాతా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులని ఖుష్బూ ఆశ్రయించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
కమల్ హాసన్, శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' (Thug Life). మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి జింగుచా పాట రిలీజైంది. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో నటీనటులకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్రిష (Trisha Krishnan) మాట్లాడుతూ.. పెళ్లిపై తనకు నమ్మకం లేదని తెలిపింది. పెళ్లి చేసుకున్నా.. చేసుకోకపోయినా తనకు పర్వాలేదని పేర్కొంది.రెండుసార్లు పెళ్లేంటి?కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం అనుకుంటా.. ఎంపీ బ్రిట్టాస్ నాకు మంచి స్నేహితుడు. చాలామంది కాలేజీ విద్యార్థులు చుట్టూ గుమిగూడినప్పుడు నన్నో ప్రశ్న అడిగాడు. మంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నువ్వు రెండుసార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని ప్రశ్నించాడు. మంచి కుటుంబానికి, పెళ్లికి సంబంధం ఏంటి? అని అడిగాను. రాముడి తండ్రిని ఫాలో అవుతా: కమల్అది కాదు.. నువ్వు రాముడిని పూజిస్తావ్.. మరి ఆయనలాగే జీవించాలి కదా అని ప్రశ్నించాడు. దానికి నా సమాధానం ఏంటంటే.. మొదటగా.. నేను ఏ దేవుడినీ ప్రార్థించను. రాముడి అడుగుజాడల్లో అసలే నడవను. అందుకు బదులుగా రాముడి తండ్రి (దశరథుడికి ముగ్గురు భార్యలు) బాటలో నడుస్తాను అని చెప్పుకొచ్చాడు. థగ్ లైఫ్ సినిమా జూన్ 5న విడుదల కానుంది.కమల్ రెండు పెళ్లిళ్లు- విడాకులుకమల్ హాసన్ 1978లో హీరోయిన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. దశాబ్దకాలం తర్వాత ఆమెకు విడాకులిచ్చి 1988లో సారికను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి ముందే 1986లో శృతి హాసన్ జన్మించింది. పెళ్లి తర్వాత 1991లో అక్షర హాసన్ పుట్టింది. తర్వాతి కాలంలో కమల్-సారిక బంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. 2002లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2004లొ డివోర్స్ మంజూరయ్యాయి. ఆ మరుసటి ఏడాది నటి గౌతమితో కమల్ సహజీవనం చేశాడు. 2016లో ఆమెకు బ్రేకప్ చెప్పాడు.చదవండి: సినిమా బాగోలేదని ప్రచారం చేస్తారా?.. విజయశాంతి వార్నింగ్ -
నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు.. అయినా!
సినీనటుడు విష్ణు ప్రసాద్ (Vishnu Prasad) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడికి వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు పేర్కొన్నారు. దీనికి రూ.30 లక్షల మేర ఖర్చవుతుందని, దయచేసి సాయం చేసి ఆదుకోమని విష్ణు ప్రసాద్ కుటుంబసభ్యులు అర్థిస్తున్నారు. నటుడి పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుండటంతో అతడి కుటుంబసభ్యులే కాలేయదానానికి ముందుకొచ్చారు. అది సరిపోదువిష్ణు కూతురు.. కాలేయం దానం చేసి తండ్రిని బతికించుకోవడానికి సిద్ధమైంది. కానీ ఈ మేరకు ఆపరేషన్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని ఆత్మ సంస్థ (ద అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్) పేర్కొంది. తమది చిన్న సంస్థ అని.. కొంత మొత్తం ఆర్థిక సాయం చేశామని.. చికిత్సకు అది సరిపోదని ఆత్మ వైస్ ప్రెసిడెంట్, నటుడు మోమన్ అయిరూర్ పేర్కొన్నాడు. సంస్థ సభ్యులను తోచినంత సాయం చేయాలని కోరినట్లు తెలిపాడు.ఎవరీ విష్ణు ప్రసాద్?విష్ణు ప్రసాద్.. కాశీ, కై ఎతుం దూరత్, రన్వే, మంగోకాళం, లయన్, లోకనాథన్ ఐఏఎస్, పటాకా, మరాఠా నాడు వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నాడు. ఇతడికి అభిరామి, అనానిక అని ఇద్దరు కూతుర్లున్నారు. View this post on Instagram A post shared by Vishnu Prasad (@vishnu.prasad18) చదవండి: హీరో అజిత్కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్ -
దసరా నటుడు అరెస్ట్
మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణలో పాల్గొన్నాడు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసుల రాకను గుర్తించిన షైన్ టామ్ చాకో అక్కడినుంచి పరారైనట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. మూడో అంతస్తు నుంచి దూకి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ఆ విజువల్స్ ఆధారంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా పోలీసు విచారణకు తన న్యాయవాదితో హాజరయ్యారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్స్టేషన్కు ఆయన వచ్చారు. విచారణ అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటారని గతంలోనే పలుమార్లు వార్తలు వచ్చాయి. రీసెంట్గా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి విన్సీ సోనీ అలోషియన్ కూడా ఆయనపై పదునైన విమర్శలు చేసింది. సినిమా సెట్లోనే ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో తన పట్ల చాలా అభ్యంతరకరంగా ఆయన వ్యవహరించారని ఆమె చెప్పింది. దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు. -
హీరో అజిత్కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కారు రేసింగ్లో అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.కారు రేసింగ్లో అజిత్ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్లో జరిగిన రేసింగ్లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అవడంతో అజిత్ సురక్షితంగా బయటకు వచ్చాడు.సినిమాఅజిత్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly Movie) బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అజిత్ కెరీర్లోనే టాప్ మూవీగా రికార్డు సృష్టించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ప్రియ ప్రకాశ్ వారియర్, సునీల్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார் 🔥#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025 చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్ -
పిట్ట కొంచెం...కలెక్షన్స్ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు రూ.1900కోట్లు
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పరిశ్రమలో కలెక్షన్ కింగ్స్లో ఒకడు, అతని అనేక చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల పంట పండించాయి . అదే విధంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. అయితే వీళ్లెవరూ సాధించని విధంగా ఒక నటుడు నటించిన సినిమాల కలెక్షన్స్ ప్రకారం చూస్తే.. గత మూడు సినిమాల ద్వారా రూ.1900 కోట్లు రాబట్టాడు. అజానుబాహుడైన హీరోలకు భిన్నంగా ఈ నటుడి ఎత్తు కేవలం ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలు మాత్రమే..వయస్సు 27 సంవత్సరాలు అయినప్పటికీ, ఈ దక్షిణ భారత నటుడి గత 3 చిత్రాలు అద్భుతాలు చేశాయి. ఆ నటుడి పేరు జాఫర్ సాదిక్(Jaffer Sadiq).జాఫర్ సాదిక్ 1995 జూలై 4న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులర్ స్టార్ అయిపోయాడు. తన కెరీర్ను 2020 సంవత్సరంలో ‘పావ కాదగల్’ అనే టీవీ సీరియల్తో జాఫర్ సాదిక్ ప్రారంభించాడు. ఈ సీరియల్ తో జాఫర్ స్టార్ అయిపోయాడు. తన మొదటి సీరియల్ తోనే వీక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత, జాఫర్కు 2022లో ‘విక్రమ్’ చిత్రంలో అవకాశం వచ్చింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విక్రమ్’ చిత్రంలో సాదిక్ పాత్ర చాలా బలంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ తమిళ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేసి దాదాపు రూ.500 కోట్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్ సినిమా తర్వాత, సాదిక్ వెందు తనింధతు కాదు అనే చిత్రంలో నటించారు.దీనితో పాటు, సాదిక్ సైతాన్ అనే వెబ్ సిరీస్లో కూడా బలమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దీని తర్వాత, విడుదలైన ‘జైలర్’ చిత్రంలో రజనీకాంత్తో జాఫర్ సాదిక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు... ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చాలా ప్రకంపనలు సృష్టించి రూ. 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రజనీకాంత్తో స్క్రీన్ను పంచుకున్న తర్వాత, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో సాదిక్ కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర భీభత్సం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా చూస్తే జాఫర్ సాదిక్ గత మూడు సినిమాలు 1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. జాఫర్ సాదిక్ ఎత్తు తక్కువే కావచ్చు, కానీ చాలా తక్కువ టైమ్లో, తక్కువ సినిమాలతోనే నటన పరంగా మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇంకా బోలెడంత కెరీర్ ఉన్న జాఫర్...నటనా పరంగా మరిన్ని శిఖరాలు అందుకోవడం తధ్యంగా కనిపిస్తోంది. -
వాళ్లందరూ కేవలం ఫాలోవర్స్ మాత్రమే: పూజా హెగ్డే
సినిమా కళాకారులు సొంత డబ్బా కొట్టుకోవడం మామూలే. అది వారికి చాలా అవసరం కూడా. అయితే శ్రుతిమించితేనే హాస్యాస్పదంగా మారుతుంది. పూజా హెగ్డే(Pooja Hegde) ఇలాంటి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా ఆ మధ్య తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగారు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాప్లు ఎదురవడంతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే తొలి చిత్రంతోనే అపజయాన్ని మూటకట్టుకున్నారు. అదేవిధంగా పదేళ్ల తరువాత విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం నిరాశ పరిచింది. అలాంటిది మరోసారి ఆయనతో జతకట్టే అవకాశాన్ని అందుకోవడం విశేషం. విజయ్తో జత కడుతున్న జననాయకన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్రం మే 1న తెరపైకి రానుంది. లారెన్స్కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా తమిళంలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన పూజాహెగ్డేకు ఈ చిత్రాల విజయాలు చాలా అవసరం. అయితే జననాయకన్, రెట్రో చిత్రాలపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. ఈ పాట తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో ఒక ఇంటర్వ్యూలో పూజాహెగ్డే పేర్కొంటూ తనకు ఇన్స్ట్రాగామ్లో 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని సెల్ఫ్గోల్ కొట్టుకున్నారు. అయితే తన చిత్రాలకు 3 కోట్ల టికెట్లు అమ్ముడు పోతాయన్న నమ్మకం మాత్రం లేదని కూడా చెప్పుకొచ్చింది. కొందరికైతే ఏకంగా 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు.. వారి సినిమాలకు కూడా అంతమంది వెళ్లరని చెప్పింది. వాస్తవంగా పూజాకు కూడా 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కొందరు ప్రముఖులకు 50 లక్షల ఫాలోవర్స్ ఉంటారని, వారి చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందని, సామాజిక మాధ్యమాలు నిజమైన ప్రపంచం కాదని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
చరిత్రలో చెరిగిపోని వీరుడు చావా
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం చావా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అనేది మన జీవిత ప్రతిబింబం. మన జీవితంలో ఎన్నో రకాల భావావేశాలు, వాటికి కారణమైన కథనాలు ఎన్ని ఉంటాయో వాటన్నిటినీ మళ్లీ నాటకీయంగా రూపకల్పన చేసి, నటీనటులను అవే కథనాలలో నటింపజేసి మన జీవితాన్ని మనకే అద్దంలో చూపించే మహా ప్రయత్నమే సినిమా. చిన్నప్పుడు బామ్మ ఒళ్లో చందమామను చూస్తూ చెప్పే కథలు చక్కగా ఎందుకు వింటామో తెలుసా... ఎక్కువగా చరిత్రలోని కథనాలే ఆవిడ మనకి చెప్పారు కాబట్టి. మన చరిత్రలో మన పూర్వీకుల వీరత్వం ఉంది. ఆ వీరత్వం మాటున బోలెడంతపోరాటం ఉంది.ఆపోరాటం వెనక దాగి ఉన్న పట్టుదలతో కూడిన త్యాగం ఉంది. ఆ త్యాగంలో కనబడని బాధ, కనిపించే ఆనందంలాంటివి ఎన్నో ఉన్నాయి. అటువంటిపోరాటాలను అడపా దడపా నేటి దర్శకులు సినిమాల రూపంలో మన ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కోవకు చెందినదే ‘చావా’ చిత్రం. ఛత్రపతి శివాజీ పేరు చాలా మందికి తెలుసు. కానీ శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ గురించి అందరికీ తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా ఆరంభంలోనే నాటి మొఘలు సామ్రాజ్యానికి చెందిన ఔరంగజేబుకు ఓ వార్త అందుతుంది. భారతదేశం మూలమూలలా కబళించిన మొఘలులు మరాఠాల ప్రాంతంలో మాత్రం అడుగు కూడా పెట్టలేక΄ోతారు. దానికి కారణం ఛత్రపతి శివాజీ. ఆయన ఇక లేరన్న వార్త ఔరంగజేబుకు అమృతంలా అందుతుంది.వార్త విన్న ఆనందం ఆస్వాదించేలోపే శివాజీ కొడుకు శంభాలా గురించి కూడా ఔరంగజేబుకు తెలుస్తుంది. దాంతో ఔరంగజేబు తన కిరీటాన్ని తీసేసి, శంభాలాను చంపిన తర్వాతే తాను మళ్లీ కిరీటాన్ని పెట్టుకుంటానని ప్రతిన బూనుతాడు. ఆ తర్వాత శంభాలాని ఔరంగజేబు కుట్రతో ఎంత దారుణంగా చంపుతాడనేదే ఈ సినిమా. లక్ష్మణ్ ఉఠేకర్ ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ వర్ధమాన నటుడు విక్కీ కౌశల్ శంభాలాపాత్రలో ఒదిగి΄ోయారు. ఏసుబాయిపాత్రలో రష్మికా మందన్నా కూడా అద్భుతంగా ఒదిగి΄ోయారు. అలాగే ఔరంగజేబుపాత్రలో అక్షయ్ ఖన్నా జీవించారు. ఇక సినిమా పరంగా ప్రతి క్షణం ప్రేక్షకుడిని ఉద్వేగపరుస్తూ చివర్లో కన్నీటితో సాగనంపుతారు దర్శకుడు. అయితే ఇది కథాపరంగా మాత్రమే సుమా. గడిచిన పదేళ్లలో ‘బాహుబలి’తో ప్రపంచ ఖ్యాతిని మూటగట్టుకున్న మన టాలీవుడ్ గురించే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో ‘చావా’ సినిమా మాత్రం దాదాపుగా అడుగంటిన బాలీవుడ్ ఖ్యాతిని ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ లేపిందనే చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందు తర్వాత కూడా ఎన్నో సంచలనాలకు దారి తీసిందన్న విషయం మనకు తెలుసు. ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమ్ అవుతున్న ఈ ‘చావా’ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా, కాదు కాదు చూసి తెలుసుకోవాల్సిన చరిత్ర. తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. – హరికృష్ణ ఇంటూరు -
వాళ్లు ఐ లవ్ యూ చెప్పలేదు: కమల్హాసన్
‘‘థగ్ లైఫ్’ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్ వంటి నటీనటులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు(త్రిష, అభిరామి) ఉన్నప్పటికీ నాకు ఒక్కసారి కూడా వారు ఐ లవ్ యూ చెప్పలేదు. కానీ, జోజు జార్జ్ మాత్రం రోజూ ఐ లవ్ యూ చెప్పేవారు’’ అని కమల్హాసన్ సరదాగా పేర్కొన్నారు. కమల్హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘థగ్ లైఫ్’.శింబు, త్రిష, జోజు జార్జ్, అభిరామి ఇతర ప్రధానపాత్రలుపోషించారు. మద్రాస్ టాకీస్, రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్స్పై కమల్హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ నుంచి ‘జింగుచ్చా...’ అంటూ సాగే తొలిపాటని రిలీజ్ చేశారు. ఈపాటకి కమల్హాసన్ సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ– ‘‘నాయగన్’ తర్వాత మళ్లీ మణిరత్నంగారి దర్శకత్వంలో నటించడానికి ప్రేక్షకులే కారణం. ఆయనకు, నాకు మధ్య ఇప్పటికీ ఏమీ మారలేదు. ‘థగ్ లైఫ్’ కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు. మణిరత్నం మాట్లాడుతూ–‘‘కమల్హాసన్ సినిమా లవర్. డబ్బింగ్ జరుగుతుంటే నా ఆఫీస్కు వచ్చిన కమల్హాసన్ అమెరికాలో జరుగుతున్న సౌండ్ మిక్సింగ్ గురించి చెప్పారు. ఆయన దర్శకుడికి 50 శాతం భారాన్ని తగ్గిస్తారు’’ అన్నారు.త్రిష మాట్లాడుతూ– ‘‘మణిరత్నంగారి దర్శకత్వంలో నేను నటించిన మూడవ చిత్రం ‘థగ్ లైఫ్’. అదేవిధంగా కమల్హాసన్ గారు, శింబుతోనూ నటించిన మూడో చిత్రం ఇది కావడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘కమల్హాసన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని శింబు తెలిపారు. ఈ వేడుకలో నటీనటులు అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, కెమేరామేన్ రవి కె.చంద్రన్ తదితరులుపాల్గొన్నారు. – ‘సాక్షి’ తమిళ సినిమా, చెన్నై -
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
మలయాళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. కొన్నిరోజుల క్రితం 'ఎల్ 2:ఎంపురాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన గురించి పక్కనబెడితే కొడుకు ప్రణవ్(Pranav Mohanlal) గురించి ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. మోహన్ లాల్ కొడుకు కూడా హీరోనే. కాకపోతే చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. అతడి పేరు ప్రణవ్ మోహన్ లాల్. తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి నచ్చిన మలయాళ మూవీ 'హృదయం'లో హీరో ఇతడే. అయితే ఇదే చిత్రంలో నటించిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శినితో(Kalyani Priyadarshan) ఇతడు ప్రేమలో ఉన్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వినిపించేవి. కానీ అవి నిజం కాదని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మలయాళ డైరెక్టర్ అల్లెప్పీ అష్రఫ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రణవ్ ఓ జర్మన్ అమ్మాయితో డేటింగ్(Pranav Girlfriend)లో ఉన్నాడు. కల్యాణితో కాదు. కల్యాణి ప్రియదర్శన్ తల్లి లిసీతో నేను మాట్లాడాను. ప్రణవ్-కల్యాణి అన్నాచెల్లి లాంటి వారని ఆమె చెప్పింది అని అన్నాడు.హీరోగా కంటే ప్రకృతి ప్రేమికుడిగా ప్రణవ్ ఫేమస్. ఎందుకంటే ఎప్పుడు దేశాలు తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయా ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం స్పెయిన్ టూర్ కి వెళ్లినప్పుడు అక్కడే ఓ పశువుల సాలలోనూ పనిచేశాడు. అయితే సదరు జర్మన్ అమ్మాయి ఎవరు ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం) -
విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ గా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న జనని అయ్యర్ నిశ్చితార్థం(Janani Iyer Engagement) చేసుకుంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు సాయి రోషన్ అనే పైలట్ తో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇంతకీ జనని ఎవరు? ఏయే సినిమాలు చేసింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) తమిళనాడుకు చెందిన జనని అయ్యర్.. విశాల్ 'వాడు వీడు' సినిమాలో(Vaadu Veedu Movie) ఓ హీరోయిన్ గా చేసింది. ఇది తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకు కాస్త పరిచయమే. దీని తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించింది. కాకపోతే అవి తెలుగులో డబ్ కాలేదు.అయితేనేం అడపాదడపా సినిమాలు చేస్తున్న జనని.. ఇప్పుడు పెద్దల కుదిర్చిన పెళ్లికి రెడీ అయింది. ఏప్రిల్ 11న తన ఎంగేజ్ మెంట్ జరగ్గా.. తాజాగా ఆ ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. జంట చూడముచ్చటగా ఉంది. త్వరలోనే పెళ్లి ఎప్పుడు ఉండబోతుంది ఏంటనేది ప్రకటిస్తారు.(ఇదీ చదవండి: ఓర్నీ'పుష్ప 2' మొత్తం గ్రాఫిక్సే.. వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్) -
జ్యోతి పూర్వాజ్ లీడ్ రోల్లో వస్తోన్న కిల్లర్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి వినూత్న చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్. ఆయన తెరకెక్కించిన తాజా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటించగా, జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటించారు. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని థింక్ సినిమా బ్యానర్పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 30న ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. కిల్లర్.. పార్ట్ 1: డ్రీమ్ గర్ల్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సరికొత్త సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవ్, రొమాన్స్, రివెంజ్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి
ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. ఐటం సాంగ్స్తోనే కాదు ఆసక్తికర వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆ మధ్య బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి గురించి మాట్లాడమంటే.. తన వేలికున్న డైమండ్ రింగ్ చూపిస్తూ షోఆఫ్ చేసింది. తన తీరుపై విమర్శలు రావడంతో సారీ చెప్పింది. తర్వాత రామ్చరణ్-కియారాల గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవడం, తను ఐటం సాంగ్తో పాటు చిన్న పాత్ర చేసిన డాకు మహారాజ్ హిట్టవడంతో సంతోషం తట్టుకోలేకపోయింది. నేనే గొప్ప అన్నట్లుగా..చూశారా? నా సినిమా సూపర్ హిట్టయింది. కియారా నటించిన గేమ్ ఛేంజర్ షెడ్డుకు వెళ్లిపోయింది. ఇందులో నా తప్పయితే లేదు సుమీ.. సినిమా బాగోలేకపోతే జాకీలు పెట్టి లేపినా జనాలు లెక్కచేయరు అని కామెంట్లు చేసింది. కొద్ది రోజుల క్రితం హీరో షారూఖ్ ఖాన్ తర్వాత సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేది నేనే.. హాలీవుడ్ వాళ్లు కూడా వారి సినిమా కోసం నన్నే ప్రమోషన్స్ చేయమన్నారు అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది.ఇక్కడో గుడి.. సౌత్లో కూడా ఉంటే..ఇప్పుడేకంగా తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందే అని చెప్తోంది. తాజాగా ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారు. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారు. పనిలో పనిగా దక్షిణాదిన కూడా నాకో గుడి కడితే బాగుంటుంది అని పేర్కొంది. ఊర్వశి.. చివరగా సన్నీడియోల్ 'జాట్' సినిమాలో సారీ బోల్ పాటలో కనిపించింది.చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. -
నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్( Shiva Rajkumar), రియల్ స్టార్ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుమతి ఉమా రమేష్రెడ్డి, ఎం. రమేష్ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర తమిళ్ వెర్షన్ టీజర్ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, నిర్మాత రమేష్ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్ జన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్ ,అమితాబచ్చన్లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు. తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్ సినిమా అని నిర్మాత ఎం. రమేష్ రెడ్డి పేర్కొన్నారు. -
జిమ్లో అనసూయ కసరత్తులు.. కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్బాస్ దివి!
జిమ్లో అనసూయ కసరత్తులు..నేపాల్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్..పొట్టి డ్రెస్లో హీరోయిన్ కృతిశెట్టి హోయలు..బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న సారా అలీ ఖాన్..కళ్లతోనే కవ్విస్తోన్న బిగ్బాస్ బ్యూటీ దివి.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఓటీటీకి రూ.250 కోట్ల సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్కు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేశీయ మార్కెట్లో వందకోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 24 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. అయితే హిందీలో స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. അബ്റാമിൻറെ ലോകം ഇവിടെ തുടങ്ങുന്നു.L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar. @mohanlal @prithviofficial @GopyMurali @antonypbvr @gokulamstudios @aashirvadcine @LycaProductions @ManjuWarrier4 @ttovino @Indrajith_S @SaniyaIyappan_ @sujithvasudev… pic.twitter.com/QL6ELgED9u— JioHotstar Malayalam (@JioHotstarMal) April 17, 2025 -
సూర్య యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్తా ఎక్కువే!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తోన్న తాజా చిత్రం రెట్రో. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తుచన్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్లో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కంగువా తర్వాత సూర్య నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెయిన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయితాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ పొందినట్లు మేకర్స్ వెల్లడించారు. రెట్రో సినిమా నిడివి(రన్టైమ్) దాదాపు రెండు గంటల 48 నిమిషాలుగా ఉండనుంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమాలను అలరించనుంది. ఈ చిత్రంలో కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. #RETRO CBFC REPORT.Duration: 2hrs 48mins 30secsCertified: U/A #RetroFromMay1 pic.twitter.com/s5T1N6uX8i— Karthik Ravivarma (@Karthikravivarm) April 17, 2025 #Retro (UA) - 2 Hours & 48 Mins 🔥 pic.twitter.com/xK96rp5S7I— Kolly Corner (@kollycorner) April 17, 2025 -
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జా (Arjun Sarja) చిన్న కూతురు అంజనా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ప్రియుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అంజనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది.. అవును, మీరనుకునేదే అంటూ ఎంగేజ్మెంట్ జరిగినట్లు హింట్ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఫ్యామిలీ సమక్షంలో..అందులో ప్రియుడు మోకాలిపై కూర్చుని అంజనాకు ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఉంది. మరో ఫోటోలో అతడు అంజనాను ఎత్తుకుంటే వెనకాల అర్జున్ సర్జా దంపతులు.. ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు. మరో పిక్లో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ప్రేమపక్షుల ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇద్దరు కూతుర్లతో అర్జున్ సర్జాసినిమాఅర్జున్ సర్జా అసలు పేరు శ్రీనివాస్ సర్జా. ఈయన కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో త్రిమూర్తులు, హనుమాన్ జంక్షన్, శ్రీ ఆంజనేయం, పుట్టింటికి రా.. చెల్లి, రామరామ కృష్ణ కృష్ణ, నా పేరు సూర్య వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దర్శకుడిగా 10కి పైగా సినిమాలు తెరకెక్కించాడు.ఇద్దరు కూతుర్లుఅర్జున్ 1988లో నటి నివేదితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతుర్లు ఐశ్వర్య, అంజన సంతానం. ఐశ్వర్య హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు అంజన విషయానికి వస్తే.. ఈమె సర్జా వరల్డ్ కంపెనీని స్థాపించడంతో పాటు దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Anjana Arjun (@anj204) చదవండి: రాజ్తరుణ్ పేరెంట్స్ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య.. 'అరియానా ఆడియో లీక్ వైరల్' -
సలార్ హీరోకు అరుదైన గౌరవం.. సీఎం చేతుల మీదుగా అవార్డ్
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఆడుజీవితం (ది గోట్ లైఫ్). గతేడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారి నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు బ్లెస్సీ ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించాడు.అయితే తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్ర అవార్డుల్లో సత్తాచాటింది. ఈ సినిమాలో నటనకు గానూ పృథ్వీరాజ్ సుకుమారన్కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వరించింది. అంతే కాకుండా ఈ చిత్రం ఏకంగా తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా ఆయన అవార్డ్ అందుకున్నారు. తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక గ్రాండ్గా జరిగింది.కాగా.. పృథ్వీరాజ్ తండ్రి, లెజెండరీ సుకుమారన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కావడం మరో విశేషం. ఆ తర్వాత ఈ టైటిల్ను మోహన్లాల్ సొంతం చేసుకున్నారు. అంతకుముందే 2006లో పృథ్వీరాజ్ కేవలం 24 సంవత్సరాల వయసులో వాస్తవమ్ చిత్రంలో నటనకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు ఇరవై సంవత్సరాల మరోసారి ఆయనను అవార్డ్ వరించింది. -
మరోసారి చిక్కుల్లో దసరా విలన్.. నటి ఫిర్యాదుతో పరారైన నటుడు!
దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే. 2015లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ చాకో కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. గతంలో వీరంతా కొకైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే తాజాగా టామ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సెట్లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మలయాళ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది. దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్తో పాటు అమ్మ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసిన విచారణ చేయనున్నట్లు అమ్మ(AMMA) అసోసియేషన్ వెల్లడించింది. షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది. ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: దసరా విలన్కు బిగ్ రిలీఫ్.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటన)మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్కు వెళ్లగా ఆయన హోటల్ నుంచి పారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల బృందం హోటల్కు రావడానికి ముందే తప్పించుకున్నారని సమాచారం. మూడో అంతస్తులో ఉన్న నటుడు.. కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హం. -
డిప్రెషన్.. అందుకే దూరమయ్యా.. క్షమించండి: నజ్రియా
సెలబ్రిటీలన్నాక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే నజ్రియా (Nazriya Nazim) మాత్రం నాలుగు నెలలుగా పత్తా లేకుండా పోయింది. సినిమాలు చేస్తోంది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం సైలెండ్ అయిపోయింది. కనీసం తన సినిమా బాగుందని ఫ్రెండ్స్ కాల్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదట. ఇదంతా చూసి ఈ హీరోయిన్కు ఏమైంది? ఇంట్లో ఏమైనా గొడవలా? అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.అందువల్లే మిస్సింగ్..ఎట్టకేలకు కొత్త పోస్ట్తో అన్ని రూమర్స్కు చెక్ పెట్టేసింది నజ్రియా. అభిమానులకు, ఆప్తులకు సారీ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ లేఖ విడుదల చేసింది. అందులో నజ్రియా ఏమందంటే? నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగానే ఉండేదాన్ని. కానీ కొన్ని నెలలుగా మాత్రం సైలెంట్ అయిపోయాను. కారణం.. వ్యక్తిగత సవాళ్లతో సతమతమవుతున్నా.. మానసికంగాను కుంగుంబాటుకు లోనయ్యాను. దాంతో అన్నింటికీ దూరంగా ఉండాలనుకున్నాను. క్షమించండికొత్త సంవత్సరం వేడుకలను, నా 30వ పుట్టినరోజును, సూక్ష్మదర్శిని సినిమా సక్సెస్.. ఇలా చాలావాటిని మిస్ అయ్యాను. నా స్నేహితుల ఫోన్లు కూడా ఎత్తలేదు. వారి మెసేజ్లకు స్పందించలేదు. అందుకు వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వల్ల ఎవరైనా బాధపడుంటే.. దయచేసి క్షమించండి. అలాగే పనికోసం నన్ను సంప్రదించాలనుకున్న నా సహనటులు కూడా నన్ను మన్నించాలని వేడుకుంటున్నాను. అందరికీ కనిపించకుండా పోయి ఇబ్బందిపెట్టినందుకు సారీ..అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..ఇకపోతే ఉత్తమ నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు థాంక్యూ. ఈ ప్రయాణం కష్టంగా ఉంది. కానీ దీన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను. నా పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకుని అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను. పూర్తి స్థాయిలో కమ్బ్యాక్ ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. లవ్ యూ ఆల్.. అని రాసుకొచ్చింది.సినిమారాజారాణి సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన నజ్రియా.. అంటే సుందరానికి చిత్రంతో తెలుగువారిని మరోసారి ఆకట్టుకుంది. నేరం, ఓం శాంతి ఒషానా, బెంగళూరు డేస్, కూడె, కుంబలంగి నైట్స్, కూడె వంటి పలు చిత్రాలతో తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా స్టేటస్ అందుకుంది. గతేడాది సూక్ష్మదర్శిని అనే మలయాళ చిత్రంతో హిట్ అందుకుంది. View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) చదవండి: నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేవారే లేరు -
నటుడు ప్రభు పిటీషన్ను కొట్టివేసిన హైకోర్టు
కోలీవుడ్ దివంగత ప్రఖ్యాత నటుడు శివాజీగణేశన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా చైన్నె హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ ఆయన రెండో కుమారుడు, నటుడు ప్రభు దాఖలు చేసిన పిటీషన్ను తాజాగా కోర్టు కొట్టివేసింది. శివాజీగణేశన్ పెద్ద కొడుకు రామ్కుమార్ వారసుడు దుష్యంత్ నిర్మాతగా మారి 'జగజాల కిల్లాడి' చిత్రాన్ని నిర్మించాడు. అందుకోసం ధన భాగ్యం ఎంటర్ప్రైజెస్ సంస్థ నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ చైన్నె హైకోర్టును ఆశ్రయించింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా రూ.9.38 కోట్లు చెల్లించాలని నిర్మాత దుష్యంత్కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుష్యంత్ వారి అప్పు చెల్లించలేదు. ఈ కారణంతో శివాజీగణేశన్ ఇంటిని జప్తు చేయాల్సిందిగా కోద్దిరోజుల క్రితం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శివాజీగణేశన్ ఇంటిపై తనకు ఎలాంటి హక్కులు లేవని దుష్యంత్, తన తండ్రి రామ్కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే, ఆ ఇంటి హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని శివాజీగణేశన్ రెండో కుమారుడు, నటుడు ప్రభు కోర్టుకు వెల్లడించారు. ఇంటి జప్తు తీర్పును రద్దు చేయాలని న్యాయస్థానంలో ప్రభు పిటీషన్ దాఖలు చేశారు. అయితే, సరైన ఆధారాలు లేవంటూ నటుడు ప్రభు పిటీషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ధనభాగ్యం ఎంటర్ప్రైజస్ సంస్థ తరఫున వాదించిన న్యాయవాది ఇలా చెప్పుకొచ్చారు. చైన్నె వంటి నగరంలో కోట్లు విలువ చేసే ఇంటి హక్కులు శివాజీగణేశన్ పెద్ద కొడుకుకు లేవంటే నమ్మశక్యంగా లేదన్నారు. అసలు ఆ ఇంటి హక్కులు పూర్తిగా నటుడు ప్రభుకే చెందినవా..? అనేది విచారించాలి. అంత వరకు శివాజీగణేశన్ ఇంటి జప్తు తీర్పును రద్దు చేయరాదని ఆయన వాదించారు. దీంతో ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం నటుడు ప్రభు పిటీషన్ను కొట్టి వేసింది.