breaking news
South India
-
35 ఏళ్లు.. ఎన్నో హార్ట్ బ్రేక్స్.. నొప్పితో బాధపడుతుంటే ఆ డైరెక్టర్..
పైలట్ కావాలని కలలు కని, అనుకోకుండా కెమెరా ముందు ల్యాండ్ అయింది! సినిమాల్లో గ్లామర్ కంటే టాలెంట్తో స్క్రీన్పై మెరుస్తోంది హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen). ఆ విషయాలే మీ కోసం...అలా కెరీర్లో..తెలుగు ప్రేక్షకులు కూడా బాగా దగ్గరైన నటి నిత్యా మీనన్. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. ఎన్టీఆర్తో ‘జనతా గ్యారేజ్’, అల్లు అర్జున్తో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, పవన్ కల్యాణ్తో ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు చేసినా, గ్లామరస్ కమర్షియల్ హీరోయిన్గా కాకుండా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఉత్తమ నటిగా జాతీయ అవార్డుమలయాళీ అయినా, పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. పైలట్ కావాలనేది చిన్ననాటి కల. అయితే ఏవియేషన్ ఫీల్డ్ ఆకర్షణీయంగా లేదని భావించి, మనసు సినిమాలవైపు మళ్లింది. పూణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీ కోర్సు చేసింది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి పరిచయంతో హీరోయిన్ అయింది. గత ఏడాది ధనుష్తో నటించిన ‘తిరు’ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించింది.ఐదు భాషలు మాట్లాడగలదునిత్యా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలదు. ‘సినిమా రంగంలో నటీనటుల, యూనిట్ సభ్యుల అనారోగ్యాలపై చాలామంది పట్టించుకోరు, కాల్షీట్స్ ప్రకారం పనిని పూర్తి చేయాలనుకుంటారు. కానీ, నేను మాత్రం సహచర నటులు, సహవాసుల పట్ల కొద్దిగా అయినా మానవత్వం చూపించాలని నమ్ముతాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పీరియడ్స్ టైంలో అలా..మిస్కిన్ దర్శకత్వంలో ‘సైకో’ సినిమాలో నటించేటప్పుడు, షూటింగ్ మొదటి రోజే తాను పీరియడ్స్లో ఉన్నానని, నొప్పితో బాధపడుతూ మిస్కిన్ దగ్గరకు వెళ్లి చెప్పిందట! ‘మిస్కిన్ ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అతను అర్థం చేసుకుని ప్రవర్తించిన తీరు మరచిపోలేను’ అని తెలిపింది. దాదాపు ముఫ్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు. ఎన్నోసార్లు హార్ట్బ్రేక్దీనికి నిత్యా స్పందిస్తూ – ‘చాలాసార్లు హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే నాకు ఇంకా కొంత టైం కావాలి‘ అని చెప్పింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – చిన్నతనంలోనే ‘హనుమాన్’ అనే సినిమాలో బాల నటిగా నటించింది. ఆ సినిమాలో టబు చెల్లెలుగా కనిపిస్తుంది.చదవండి: అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీతో..రమ్యకృష్ణ స్పీచ్ -
అక్కడ సక్సెస్ లేక తెలుగులో సినిమాలు చేశా.. ఆ ఒక్క మూవీ వల్లే..
34 ఏళ్లుగా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ (Captain Prabhakaran Movie). దివంగత నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ కథానాయకుడిగా నటించిన 100వ చిత్రం ఇది. ఆర్కే సెల్వమణి కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించగా రావుత్తర్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. రూపిని, రమ్యకష్ణ (Ramya Krishna), శరత్ కుమార్ ,లివింగ్స్టన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. 1991 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. రీరిలీజ్సుమారు 34 ఏళ్ల తర్వాత కెప్టెన్ ప్రభాకరన్ 4 కే వర్షన్లో ఈనెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. స్పారో సినిమాస్ సంస్థ అధినేత కార్తీక్ వెంకటేషన్ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నె, వడపళనిలోని కమల థియేటర్లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటూ దర్శకుడు ఎస్ ఏ.చంద్రశేఖర్, విక్రమన్, నిర్మాత కలైపులి ఎస్. థాను, టీ.శివ, ఆర్వీ. ఉదయ్ కుమార్, పేరరసు, లింగుస్వామి, లియాకత్ అలీఖాన్ సహా పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. విజయకాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీరంగంలో వాళ్లే తల్లిదండ్రులుఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు ఈ సమాజంపై, రాజకీయాలపై ఉన్న కోపాన్ని సినిమాల ద్వారా చూపించడానికి ఒక నటుడు అవసరం అయ్యారన్నారు. ఆయనే విజయకాంత్ అని పేర్కొన్నారు. విజయ్ కాంత్ హీరోగా తాను 18 చిత్రాలు చేసినట్లు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ.. సినీ రంగంలో తన తల్లిదండ్రులు అంటే విజయకాంత్, నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ మాత్రమేనని తెలిపారు. విజయ కాంత్ నూరు జన్మలకు చేరవలసిన పుణ్యాలను తన వారసుల కోసం సంపాదించి వెళ్లిపోయారన్నారన్నారు. ఇక్కడ సక్సెస్ లేక తెలుగులో..నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. తనకు తమిళంలో సరైన సక్సెస్ రాకపోవడంతో తెలుగు చిత్రాల్లో నటించానని అలాంటి సమయంలో కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, ఆ చిత్ర విజయం తనకు మరో 10 ఏళ్లపాటు వరుసగా అవకాశాలు వచ్చేలా చేసిందని చెప్పారు. విజయ్ కాంత్ వారసుడు విజయ్ ప్రభాకరన్ మాట్లాడుతూ.. తనకు విజయకాంత్ కొడుకు అనే పేరు మాత్రమే చాలు అన్నారు. కాగా ఇకపై తన తండ్రి నటించిన చిత్రాలను ఏడాదికి ఒకటి రీ రిలీజ్ చేస్తామని చెప్పారు.చదవండి: పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే! -
మృణాల్ అయితే బాగుంటుందన్న స్టార్ హీరో!
సాధారణంగా హీరోయిన్లు పలానా హీరో సరసన నటించాలని కోరుకుంటుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోనే తనకు జంటగా పలానా హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పడం విశేషం. ఆ హీరో ఎవరో కాదు శివకార్తికేయన్ (Sivakarthikeyan). వరుస విజయాలతో స్టార్ హీరోగా రాణిస్తున్న ఈయన ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్ట్ చేస్తున్న మదరాశి చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలుసుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. రవి మోహన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో అధర్వ మురళి ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తర్వాత శివకార్తికేయన్ వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.గతంలో మిస్..ఇది టైమ్ ట్రావెలింగ్తో కూడిన సైన్స్ ఫిక్షన్ జానర్లో సాగే కథా చిత్రమని భోగట్టా! ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని శివకార్తికేయన్ వ్యక్తం చేశాడట! దీంతో ఆమెను ఒప్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ఇంతకుముందే మదరాశి చిత్రంలో శివకార్తికేయన్తో జత కట్టాల్సి ఉంది. పలు కారణాల రీత్యా ఆ అవకాశాన్ని మృణాల్ జార విడుచుకుందని ప్రచారం జరిగింది. మరి ఈ సారైనా శివ కార్తికేయన్ సరసన నటిస్తుందో? లేదో? వేచి చూడాలి.చదవండి: ప్రముఖుల ‘బయోపిక్స్’ -
పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే..? పరంతు పో మూవీ చూడాల్సిందే!
టైటిల్: పరంతు పో..నటీనటులు: శివ, గ్రేస్ ఆంటోని,, మిథుల్ అంజలి తదితరులుడైరెక్టర్: రాముఓటీటీ: జియో హాట్స్టార్ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ బాగున్న సినిమాలను ఓటీటీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీకి వచ్చేసరికి దూసుకెళ్తున్నాయి. అలాంటి మరో సందేశాత్మక చిత్రమే పరంతు పో. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..గోకుల్ (శివ), గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) లవ్ మ్యారేజ్ చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. వాడి పేరు అన్బుల్(మిథుల్). అసలే ప్రేమ పెళ్లి కావడంతో వీరికి ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లభించదు. ఫ్యామిలీ నడవాలంటే భార్యాభర్తలిద్దరూ తప్పక పని చేయాల్సిన పరిస్థితి. వీళ్లది మిడిల్ క్లాస్ కావడంతో జీవనం సాగించేందుకు చిన్నపాటి బిజినెస్ చేస్తుంటారు. గ్లోరీ బట్టల షాపు రన్ చేస్తుండగా.. గోకుల్ సైతం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉంటారు. ఇద్దరు కూడా బిజీగా ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్ పిల్లాడిపై పడుతుంది. దీంతో అన్బుల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ టీవీకి పరిమితమైపోతాడు. ఒకసారి సడన్గా గ్లోరీ బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్తుంది. అప్పుడు పిల్లాడి బాధ్యత తండ్రి గోకుల్ మీదే పడుతుంది. ఇంట్లో కొడుకు అల్లరిని తట్టుకోలేక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు గోకుల్. ఇంతకీ వాళ్ల ట్రిప్ సజావుగా సాగిందా? ఇంట్లో ఉన్నప్పుడు టీవీ తప్ప మరో ప్రపంచం తెలియని అన్బుల్ ఆ తర్వాత ఎలా మారిపోయాడన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువ జంటలు చేస్తున్న పొరపాటునే డైరెక్టర్ సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం నగరాలకు వచ్చి చేరుతున్న యువ జంటలు.. పనిలో పడి పిల్లలను పట్టించుకోవడం మానేశారు. నగరాల్లో దాదాపు అందరివీ ఒంటరి జీవితాలే. ఎందుకంటే ఇక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఎవరి పనిలో వాళ్లుండి ఫుల్ బిజీగా లైఫ్ను సాగదీస్తుంటారు. పిల్లలకు టైమ్ కేటాయించడమనేది చాలా అరుదు.స్కూల్కు వెళ్లి వచ్చిన పిల్లాడు.. ఇంట్లో ఎవరు లేకపోతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పాయింట్నే ప్రధానంగా చూపిస్తూ కథ రాసుకున్నారు. ఈ జనరేషన్ పిల్లలపై ఆ ప్రభావం ఏంటనేది పరతు పోలో చక్కగా చూపించారు. ఈ కథ మొత్తం చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ కథ ప్రారంభంలో గ్లోరీ, గోకుల్ బిజినెస్తో బిజీగా ఉండడం చూపించారు. గ్లోరీ తన బట్టల షాప్ బిజినెస్లో పడి పిల్లాడితో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీంతో పిల్లాడి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. స్కూల్కి వెళ్లి రావడం, టీవీకి అతుక్కుపోవడం అదే అతని దినచర్యగా మారుతుంది. అలా ఫస్టాఫ్లో వారి బిజీ లైఫ్, పిల్లాడి చుట్టూ కథ తిరుగుతుంది. గ్లోరీ తన బిజినెస్ పనిమీద కోయంబత్తూరు వెళ్లడంతో ఇంట్లో పిల్లాడిని కంట్రోల్ చేయలేక తండ్రి గోకుల్ రోడ్ ట్రిప్ కోసం బయలుదేరతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కామెడీతో పాటు కొత్త లైఫ్ స్టైల్ను పరిచయం చేసే సన్నివేశాలు అంతా రోటీన్గానే ఉంటాయి. తండ్రీ, కుమారుల మధ్య వచ్చే సంభాషణలు ఫుల్ కామెడీగా అనిపిస్తాయి.అయితే ఈ రోడ్ ట్రిప్ మధ్యలో ఎప్పుడో ఐదో క్లాస్ చదివిన అంజలి.. గోకుల్ను చూసి వెంటనే గుర్తు పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, స్కూల్ లవ్ స్టోరీ చాలా ఫన్నీగా చూపించాడు డైరెక్టర్. ఎప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండే అన్బుల్కు ట్రిప్లో కొత్త దోస్తులు పరిచయమవుతారు. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఫ్రెండ్స్ తోడు కావడంతో అన్బుల్లో ఊహించని మార్పు రావడాన్ని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ట్రిప్ మధ్యలో అన్బుల్ తల్లి గ్లోరీ ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీయడం, భార్య, భర్తల మధ్య సంభాషణలతో కామెడీ పండించారు డైరెక్టర్. ఈ కథలో సందేశం ఇస్తూనే ఎంటర్టైనింగ్తో పాటు పల్లె జీవితాన్ని ఆడియన్స్కు పరిచయం చేశాడు. కథనం నెమ్మదిగా సాగినాప్పటికీ.. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు పరుగులు పెట్టించిన తీరు ఆకట్టుకుంది. ఓవరాల్గా నేటి జనరేషన్ జాబ్, బిజినెస్ అంటూ పిల్లల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని తెరపై కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించాడు. ఈ మూవీ చూసిన తర్వాతనైనా తల్లిదండ్రుల్లో కాస్త మార్పు రావాలని ఆశిద్దాం.నటీనటుల విషయానికొస్తే శివ, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిన్న పిల్లాడు మిథుల్ తన పాత్రలో అదరగొట్టేశాడు. అంజలి పాత్ర కొద్దిసేపే కనిపించినా తన నటనతో ఆకట్టుకుంది. సాంకేతికత పరంగా ఫర్వాలేదనిపించేలా ఉంది. లోకేషన్స్, కొండ ప్రాంతాల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు నేచురల్ ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. -
ప్రముఖుల ‘బయోపిక్స్’
మిస్సైల్ మేన్ అబ్దుల్ కలామ్ జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు చూడాలని ఎవరికి ఉండదు? ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? కొందరు లెజెండ్స్ జీవితాలు అందరికీ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అందుకే వారి జీవితాలకు వెండితెర రూపం ఇస్తే... ఆ బయోపిక్కి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం బాలీవుడ్లో పలువురు లెజెండ్స్ జీవితాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ప్రముఖుల ‘బయోపిక్స్’ గురించి తెలుసుకుందాం.మిస్సైల్ మేన్లా... భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా ‘కలామ్’ చిత్రం రూపొందనుంది. ఈ మిస్సైల్ మేన్ పాత్రను ధనుష్ పోషించనున్నారు. ‘ఆది పురుష్’ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ని ఈ ఏడాది మేలో ఫ్రాన్స్లో జరిగిన కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. ‘ది మిస్సైల్ మేన్ ఆఫ్ ఇండియా’ అనేది ‘కలాం’ సినిమా టైటిల్కి ట్యాగ్లైన్గా నిర్ణయించింది యూనిట్.అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు అబ్దుల్ కలాం చేసిన సేవను ఈ చిత్రంలో చూపించనున్నారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు కలాం స్ఫూర్తిదాయక జీవితాన్ని ప్రపంచానికి చూపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.యువర్ హానర్... లాయర్గా కోర్టులో ఎలా వాదించాలో శిక్షణ తీసుకుంటున్నారు రాజ్కుమార్ రావ్. ఎందుకంటే ‘యువర్ హానర్’ అంటూ అసలు సిసలైన లాయర్గా ఒదిగి పోవడానికి. భారతదేశ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. ఉజ్వల్ నికమ్ కెరీర్లో అత్యంత కీలకమైన ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కసబ్పై జరిగిన విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.అవినాష్ అరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఎంతో పేరు, ప్రతిష్ఠలు ఉన్న ఉజ్వల్ నికమ్ పాత్రలో తన నటన గౌరవప్రదంగా ఉండటానికి రాజ్కుమార్ రావ్ ప్రత్యేకంగా వర్క్షాప్కి హాజౖరై, శిక్షణ తీసుకుంటున్నారట. ఈ చిత్రం షూటింగ్ని అక్టోబరులో ఆరంభించాలనుకుంటున్నారు. ‘‘ఉజ్వల్ నికమ్లాంటి గౌరవప్రదమైన న్యాయవాదికి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. మరాఠా యోధుడు శివాజీ జీవితంతో... డ్రీమ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు రితేష్ దేశ్ముఖ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని, శివాజీ పాత్రను తానే చేయాలనీ రితేష్కి కొంత కాలంగా ఉన్న కల. ఆ కల నెరవేర్చుకుంటున్నారు. ‘రాజా శివాజీ’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో రితేష్ నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మూడు నాలుగు నెలల క్రితం విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన లభించింది. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న విడుదల చేయనున్నారు.మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఛత్రపతి శివాజీకి గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు... లక్షలాది మంది హృదయాలలో నివసించే భావోద్వేగం. ఆయన అసాధారణ జీవిత కథలో ఒక భాగాన్ని చెప్పగలగడం గౌరవం, గొప్ప బాధ్యత’’ అని రితేష్ దేశ్ముఖ్ పేర్కొన్నారు. మేజర్ షైతాన్ సింగ్ పరమ వీర చక్ర పురస్కారగ్రహీత మేజర్ షైతాన్ సింగ్గా ఒదిగి పోవడానికి ఓ నటుడిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు ఫర్హాన్ అక్తర్. ఎందుకంటే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టంతో రూపొందిస్తున్న ‘120 బహదూర్’లో షైతాన్ సింగ్ భాటీ పాత్ర పోషిస్తున్నారు ఫర్మాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య జరిగిన యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.ఈ ఘటన ప్రధానాంశంగా రూపొందుతున్న చిత్రం ‘120 బహదూర్’. ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. ‘‘ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. 62 ఏళ్ల వయస్కురాలిగా యామీ 62 ఏళ్ల వయసులో తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం కోరుకుంటుంది షా బానో. అయితే అతను ససేమిరా అంటాడు. చేసేదేం లేక ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కుతుంది. భరణం కోసం న్యాయ పోరాటం చేస్తుంది. 1985లో జరిగిన ఈ కేసు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 62 ఏళ్ల వృద్ధురాలు షా బానో పాత్రను యామీ గౌతమ్ చేశారు.ఆమె భర్త అహ్మద్ ఖాన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. ఈ పాత్ర యామీకి ఓ సవాల్ లాంటిది. ఎందుకంటే మూడు పదుల వయసులో ఉన్న యామీ అంతకు రెండింతలు వయసు ఉన్న మహిళగా ఒదిగి పోవడం అంటే ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫార్మ్ కావాలి... అలాగే ప్రోస్థెటిక్ మేకప్కి ఎక్కువ సమయం కేటాయించారు. నటనపరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.ఆపరేషన్ ఖుక్రి యునైటెడ్ పీస్ కీపింగ్ మిషన్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్ ఫోర్స్ ట్రాప్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత 75 రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ని రాజ్పాల్ పునియా లీడ్ చేశారు. 2000లో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆపరేషన్ ఖుక్రి’. రాజ్పాల్ పునియా పాత్రను రణ్దీప్ హుడా పోషిస్తున్నారు.‘ఆపరేషన్ ఖుక్రి: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రణ్దీప్ హుడా ఓ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘‘నా హృదయాన్ని చాలా బలంగా తాకిన కథ ఇది’’ అని రణ్దీప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం ఆగిందనే టాక్ వినిపిస్తోంది. చిత్రదర్శకుడు అమిత్ శర్మ ఈ సినిమాని వదిలి, వేరే ప్రాజెక్ట్స్ చేపట్టడమే దీనికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.అగస్త్య నందాకి భలే చాన్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు (అమితాబ్ కుమార్తె శ్వేత కుమారుడు) అగస్త్య నందాకి నటుడిగా రెండో సినిమాకే మంచి అవకాశం దక్కింది. ‘ఆర్చీస్’ (2023) చిత్రంతో నటుడిగా కెరీర్ ఆరంభించారు అగస్త్య. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక రెండో చిత్రంగా ‘ఇక్కీస్’ చిత్రానికి అవకాశం వచ్చింది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుడు అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.ఈ చిత్రంలో అరుణ్ ఖేత్రపాల్ పాత్రను అగస్త్య చేశారు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన పరమ వీర చక్ర పురస్కారగ్రహీత అరుణ్ ఖేత్రపాల్ శౌర్యం, త్యాగాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఇవే కాదు... ఇంకొందరు ప్రముఖుల జీవితాలతో కొన్ని బయోపిక్స్ రూపొందుతున్నాయి. – డి.జి. భవాని -
ఎమోషన్... యాక్షన్
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అయిన తమిళ సినిమా ‘ఫీనిక్స్’. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదలైంది. త్వరలో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్లో సూర్య సేతుపతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటు ట్రైనింగ్ తీసుకున్నాను.యాక్షన్ సీక్వెన్స్ని ముందే ప్రాక్టీస్ చేయించారు. ఈ సినిమాలో యాక్షన్తో పాటు అద్భుతమైన ఎమోషన్ కూడా ఉంది. ఒక మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సూర్య సేతుపతి హార్డ్వర్కర్. ఈ సినిమాలో యాక్షన్తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది’’ అన్నారు అనల్ అరసు. ‘‘ఎమోషనల్ అండ్ హై యాక్షన్ స్టోరీ ఇది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని తెలిపారు ధనుంజయన్. ‘‘ఫీనిక్స్ మంచి సినిమా’’ అన్నారు రాజ్యలక్ష్మి. హీరోయిన్ వర్ష , రైటర్ భాష్యశ్రీ మాట్లాడారు. -
'కాంతార'లో కనకావతి
వరమహాలక్ష్మి పండగ సందర్భంగా కనకావతిగా కనిపించారు రుక్ష్మిణి వసంత్. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో కనకావతి పాత్రలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటించినట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్.హోంబలే ఫిలిమ్స్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానుంది. ఇక రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘కాంతార’ (2022)కు ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ రూపొందిన సంగతి తెలిసిందే. -
రజినీకాంత్ వీరాభిమాని.. హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?
తలైవా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ అవైటేడ్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోతున్నాయి. కేరళ ఫ్యాన్స్ ఏకంగా థియేటర్లకు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే తలైవాకు ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తమిళనాడులో అయితే ఆయనంటే పడిచచ్చేంత అభిమానులు ఉన్నారు. అంతే కాదండోయ్ ఆయనకు ఏకంగా గుడినే కట్టేశారు. 2023లో మధురైకి చెందిన కార్తీక్ ఇంటి పక్కనే రజినీకాంత్కు ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 250 కేజీల బరువైన రజినీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి అరుల్మిగు శ్రీ రజినీ టెంపుల్ అని నామకరణం చేశారు.తాజాగా ఈ వీరాభిమాని రజినీకాంత్ విగ్రహానికి పూజలు చేశారు. ఆయన విగ్రహానికి పాలు, నెయ్యితో అభిషేకం నిర్వహించారు. సూపర్ స్టార్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆలయంలో దాదాపు 5500 పోస్టర్లతో అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానం అంటే కేవలం సినిమాలు చూడడమే కాదు.. ఇలా ఏకంగా గుడి కూడా కట్టించే ఫ్యాన్స్ ఉన్నారంటే విశేషమే.కాగా.. రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ.. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీ 'వార్-2తో పోటీ పడనుంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న థియేటర్లలో రిలీజవుతున్నాయి. కూలీ మూవీకి సంబంధించి కేరళలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.#WATCH | Madurai, Tamil Nadu: A die-hard fan of Rajinikanth, Karthik celebrated 50 years of the superstar by adorning the Arulmigu Sri Rajini Temple, a temple dedicated to Rajinikanth, with over 5,500 photos of the superstar and performing abhishekam. (07.08) pic.twitter.com/bYDN2wZUYS— ANI (@ANI) August 8, 2025 -
ఏఐ మాయ.. సౌత్ స్టార్స్ ఇలా అయిపోయారేంటి?
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీని కాస్తా గట్టిగానే వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేసేందుకు ఏఐని విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఫోటోలు, వీడియోల కంటెంట్ను ఎక్కువగా సృష్టిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్స్ వారి సతీమణులతో ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట హల్చల్ చేశాయి. ఈ వీడియో ఫ్యాన్స్కు తెగ నవ్వులు తెప్పించింది.తాజాగా అలాంటి వీడియోనే దక్షిణాది సూపర్ స్టార్స్తో రూపొందించారు. హీరోలు సూర్య, అజిత్, బన్నీ, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్తో కలిసి ఫన్నీగా రూపొందించారు. ఇందులో హీరోలంతా హీరోయిన్స్కు ఫుడ్ తినిపిస్తూ కనిపించారు. ఏఐ సాయంతో రూపొందించిన ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. తమ స్టార్ హీరోలేంటి ఇలా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.Prabhas annaaaaaa😂🤣😁#Prabhas𓃵 pic.twitter.com/43OVHX8wYQ— G.O.A.T Prabhas (@goatPB1) August 8, 2025 -
ఓటీటీకి క్రైమ్ ఇన్స్టిగేటివ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరించాయి. ఇలాంటి జోనర్లో ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ కావడంతో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సుదేవ్ నాయర్, జిన్స్, జియో బేబీ కీలక పాత్రల్లో ఈ సిరీస్ను రూపొందించారు.కేరళ త్రిస్సూర్లోని అత్యంత వివాదాస్పద కేసు ఆధారంగా కమ్మటం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను తెరకెక్కించారు. ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఈ కేసు చుట్టు జరిగిన పరిణామాలే కమ్మటం వెబ్ సిరీస్. యదార్థ సంఘటనలతో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.ఈ క్రైమ్ ఇన్స్టిగేటివ్ వెబ్ సిరీస్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 29 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు. ఈ సిరీస్లో అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరేఖ, జోర్డీ పొంజా కీలక పాత్రలు పోషించారు. -
పోలీస్ ఆఫీసర్గా సునీల్.. బుల్లెట్టు బండి టీజర్ వచ్చేసింది!
జిగర్తాండ తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'బుల్లెట్టు బండి'. ఈ సినిమాకు ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్పై కతిరేసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాను మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్,, వైశాలి, సింగంపులి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మణిరత్నం దర్శకత్వంలో..?
అందమైన ప్రేమకథలకి చక్కని భావోద్వేగాలు జోడించి తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంటారు దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఓ యూత్ఫుల్ లవ్స్టోరీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.ఈ కథకి ధ్రువ్, రుక్మిణి సరైన జోడీ అనే ఆలోచనతో వారిని ఎంపిక చేశారని టాక్. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారట మణిరత్నం. ఇదిలా ఉంటే... నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (2024) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో నటిస్తున్నారు. -
కరవాలి మూవీ.. మవీర ఆగమనం అంటూ గ్లింప్స్ రలీజ్
స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల సక్సెస్ తర్వాత కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. గురుదత్ గనిగ దర్శకత్వంలో 'కరవాలి' సినిమా చేస్తున్నారు.. విజువల్ వండర్గా రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి. శెట్టి మవీర అనే పాత్రలో కనిపించనున్నారు. “జంతువు vs మానవుడు” అనే ట్యాగ్లైన్. ఇప్పటికే ‘కరవాలి’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ‘కరవాలి’ నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రాజ్ బి శెట్టి ఓ సూపర్ మెన్ తరహా పాత్రను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండు గంభీరమైన గేదెల పక్కన నిలబడి ఉన్న తీరు, చేతిలోని ఆ కాగడ చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయనిపిస్తోంది.దర్శకుడు గురుదత్ గనిగ మాట్లాడుతూ.. ‘మేము సినిమా కథ రాసినప్పుడు, తీస్తున్నప్పుడు కూడా ఈ పాత్రను ఎవరు పోషిస్తారో తెలియదు. మొదటి టీజర్ విడుదల చేసిన తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ను మరింత గొప్పగా తీయాలనుకున్నాం. ఈ పాత్ర కోసం మేం చాలా మంది నటులను ప్రయత్నించాం. వారికి ఆ పాత్ర నచ్చింది, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సినిమా తీర ప్రాంత ఆచారాల నేపథ్యంలో రానుంది. ఈ పాత్ర గొప్పదనాన్ని అర్థం చేసుకునే నటుడే కావాలని మేం కోరుకున్నాం.నేను రాజ్ను కలిసి కథను వివరించాను. కానీ అతను అనేక కమిట్మెంట్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ‘సు ఫ్రమ్ సో’ అనే సినిమా కూడా ఉంది. అయినా సరే నేను ఆయన్ను వదల్లేదు. ఐదు సమావేశాల తర్వాత అతను ‘మీకు అభ్యంతరం లేకపోతే, మీరు చిత్రీకరించిన కొన్ని భాగాలను చూడవచ్చా?' అని అడిగారు. నేను అందుకు అంగీకరించాను. ఆయన ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఒప్పుకున్నారు. చివరకు ఆయన మవీర అనే పాత్రకు ప్రాణం పోశారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు -
'జాతీయ అవార్డులకు విలువ లేదు'.. ది కేరళ స్టోరీకి రావడంపై డైరెక్టర్ అసహనం
ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రముఖ మలయాళ దర్శకుడు జెయో బేబీ స్పందించారు. ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ చిత్రానికి రెండు అవార్డులు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ది కేరళ స్టోరీ చిత్రం వాస్తవాలను తప్పుగా చూపించడమే కాకుండా.. స్క్రిప్ట్, దర్శకత్వం, నటన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆయన ఆరోపించారు. ఇలాంటి సినిమాలకు అవార్డుల ప్రకటించడం వాటి విలువను తగ్గించనట్లే అవుతుందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన నేషనల్ అవార్డ్స్పై కామెంట్స్ చేశారు.జెయో బేబీ మాట్లాడుతూ.. "అధికార పార్టీల ఎజెండాకు మద్దతు ఇచ్చే చిత్రాలకు జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత పదేళ్లుగా మనం ఈ పద్ధతిని చూస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్లను ప్రోత్సహిస్తున్నందున ఈ అవార్డులకు ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోతోంది. సినిమాలను మెరిట్తో పరిగణించలేనప్పుడు ఈ అవార్డులు ఎందుకు?' అని ప్రశ్నించారు.వాస్తవాలను తప్పుగా చిత్రీకరించిన 'ది కేరళ స్టోరీ' చిత్రానికి అవార్డులు ప్రకటించడం తనను తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు. ఈ చిత్రం అంతా అసత్యాలే చూపించారని ఆరోపించారు. ఈ మూవీ స్క్రిప్ట్, దర్శకత్వం, నటన కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదన్నారు. కాగా..71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఆగస్టు 1, 2025న ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా మలయాళ దర్శకుడైన జెయో బేబీ.. ది గ్రేట్ ఇండియన్ కిటెన్, కాతల్ - ది కోర్, ఫ్రీడమ్ ఫైట్. శ్రీధన్య క్యాటరింగ్ సర్వీస్, కుంజు దైవం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మరోవైవు ది కేరళ స్టోరీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకత్వంతో పాటు ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో అవార్డ్స్ సాధించింది. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ది గోట్ లైఫ్' చిత్రాన్ని జ్యూరీ తిరస్కరించడం పట్ల మలయాళ దర్శకుడు బ్లెస్సీ కూడా నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
అమ్మకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నా: కింగ్డమ్ విలన్ వెంకటేశ్
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్లో ఫేమస్ అయిన మలయాళ నటుడు వెంకటేశ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ విలన్గా సినీ ప్రేక్షకులను మెప్పించారు. సినిమా రిలీజ్కు ముందే ఈవెంట్లో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ వెంకీ పేరు మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో తన డ్రీమ్ గురించి పంచుకున్నారు వెంకీ.కొత్త ఇల్లు అనేది తన కల అని నటుడు వెంకటేశ్ అన్నారు. అమ్మా, నాన్నల కోసం కొత్తింటిని కట్టించాలన్నదే తన చిరకాల స్వప్నమని తెలిపారు. వచ్చేనెలలోనే తన కల నెరవేరనుందని వెంకటేశ్ వెల్లడించారు. కింగ్డమ్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ తనకు ఏ సినిమాకు రాలేదన్నారు. ఇంత పెద్దఎత్తున తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇదేనని వెంకీ ఆనందం వ్యక్తం చేశారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ కింగ్డమ్. జూలై 31 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం వంద కోట్లకు చేరువలో ఉంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. -
కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు. మరుగుజ్జుగా నటించడం కష్టంఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.ప్రతీది నిశితంగా గమనించి..కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్ఎక్స్ వాడకుండా రియల్గా కనిపించాడు.కమల్ను కాపీ కొట్టావ్నువ్వు (షారూఖ్) వీఎఫ్ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ -
అరుణాచలం శివున్ని దర్శించుకున్న లోకేశ్ కనగరాజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూలీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.కూలీ రిలీజ్కు ముందు దర్శకుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆలయంలో లోకేశ్ను చూసిన పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ కనగరాజ్ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు.రజినీకాంత్ హీరోగా నటించిన కూలీలో నాగార్జున విలన్గా కనిపిచనున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2తో పోటీ పడనుంది. திருவண்ணாமலை அண்ணாமலையார் கோயிலில் சாமி தரிசனம் செய்த #lokeshkanagaraj #coolie #coolieunleashed #rajinikanth #thiruvannamalai #nagarjuna #aamirkhan #soubinshahir #upendra #anirudhravichander #anirudh #kalanithimaran #sathyaraj #shruthihaasan #powerhouse #monica #disco… pic.twitter.com/Sj9rN7YRIh— Cineulagam (@cineulagam) August 7, 2025 -
విడాకుల బాటలో మరో సీనియర్ హీరోయిన్!
సినీరంగంలో సెలబ్రిటీస్ పెళ్లి పెద్ద వార్త అయితే విడిపోవడం కూడా పెద్ద వార్తగా మారుతోంది. ఇటీవల ధనుష్, రవిమోహన్ వారి సంసార జీవితం విడాకులకు దారి తీయడం పెద్ద సంచలనానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇలా మరికొన్ని సినీ జంటల్లో విడిపోయిన వారు ఉన్నారు. కాగా తాజాగా మరో సినీ జంట ఈమధ్య ఏర్పడ్డ అభిప్రాయభేదాలు విడాకుల వైపు దారితీస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ జంటే ఫరెవర్ బహుభాషా నటి సంగీత, గాయకుడు, నటుడు క్రిష్. తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా పేరుగాంచిన నటి సంగీత. తెలుగు తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మలయాళ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించిన సంగీత ఆ తర్వాత కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో నటించారు. ముఖ్యంగా తమిళంలో విక్రమ్ సరసన నటించిన పితామగన్ చిత్రం సంగీతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలా కథానాయకిగా నటిస్తున్న సమయంలోనే 2009లో గాయకుడు క్రిష్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. ప్రస్తుతం 46 ఏళ్ల సంగీత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. కాగా పదహారేళ్లు సాఫీగా, సుఖసంతోషాలతో సాగిన వీరి వివాహ జీవితంలో ఇప్పుడు ముసలం పుట్టిందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మనస్పర్థల కారణంగా సంగీత, క్రిష్ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్స్టాలో పేరు మార్పుసంగీత తన ఇన్స్టా ఖాతాలో పేరు మార్చడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లైయింది. గతంలో ఇన్స్టాలో సంగీత క్రిష్ అని ఉండేది. కానీ ఇప్పుడు సంగీత యాక్ట్గా బయో మారింది. దీంతో వీరి మధ్య నిజంగానే మనస్పర్థలు వచ్చాయంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విడాకుల ప్రచారంలో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై సంగీతగానీ, క్రిష్గానీ స్పందిస్తే గాని నిజం బయటపడే అవకాశం ఉంది.సంగీత సినీ కెరీర్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ టాలెంటెడ్ నటి.. మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మహేశ్ బాబుకు అత్త పాత్ర.. రష్మిక మందన్నాకు తల్లిగా సంగీత నవ్వులు పూయించింది. ఆ తర్వాత మసూద తో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. -
రాజన్న నటిపై విచిత్ర ఆరోపణలు.. కేసు నమోదు..!
ప్రముఖ నటి శ్వేతా మీనన్ ఊహించని వివాదంలో చిక్కుఉంది. అశ్లీల కంటెంట్లో నటించిందనే ఆరోపణలతో కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటింటిన శ్వేతా మీనన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచేరి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు. అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది. -
విలన్గా అడిగారు.. ఆ హీరో రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేశా: లోకేశ్
కూలీ సినిమా కోసం విలన్ రోల్ చేజార్చుకున్నానంటున్నాడు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే కూలీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.విలన్గా ఛాన్స్ వస్తే..సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు లోకేశ్. ఈ సందర్భంగా ఓ చిట్చాట్లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి సినిమాలో విలన్గా ఛాన్స్ వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. దర్శకురాలు సుధా కొంగరతో పలుమార్లు సమావేశమయ్యానని తెలిపాడు. కానీ కూలీ చిత్రీకరిస్తున్న సమయంలోనే పరాశక్తి కూడా సెట్స్పైకి వెళ్లిందన్నాడు.రిజెక్ట్ చేశావిలన్గా నటించాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ డేట్స్ క్లాష్ అవుతున్నందున పరాశక్తి మూవీ ఆఫర్ను తిరస్కరించానని పేర్కొన్నాడు. శివకార్తికేయన్ సైతం జోక్యం చేసుకుని తనను విలన్గా చేయమని సూచించారన్నాడు. కానీ కూలీ సినిమాను చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సి ఉన్నందున దాన్ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలోనే హీరోగా..పరాశక్తి సినిమా విషయానికి వస్తే.. శివకార్తికేయన్, రవిమోహన్, శ్రీలీల, అధర్వ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. ఇకపోతే లోకేశ్.. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో ఓ గ్యాంగ్స్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది.చదవండి: భార్యకు వండి పెడ్తా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్ -
నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!
మాతృత్వాన్ని కోరుకోని మహిళ ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ వయసు దాటాక తల్లి కావాలని కోరుకుంటుంది. కన్నడ నటి భావన రామన్న (Bhavana Ramanna) కూడా అదే ఆశించింది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడింది. 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. వివాహానికి దూరంగా ఉన్న ఆమె సింగిల్ మదర్గానే పిల్లలను పెంచేందుకు సిద్ధమవుతోంది. సీమంతంలో అలాంటి ప్రశ్నలుతాజాగా ఆమె సీమంతం జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు ఈ ఫంక్షన్కు హాజరై ఆమెను దీవించారు. అయితే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి కొందరు అదేపనిగా అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారంటోంది భావన. ఆమె మాట్లాడుతూ.. నా సీమంతం వేడుక ఎంతో సంతోషంగా జరిగింది. అయితే కొందరు అనవసరమైన ప్రశ్నలు వేయడమే నన్ను షాక్కు గురి చేసింది. ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకోలేదన్నారు. నా ఇష్టంమరికొందరేమో పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఒకటుంది, మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. నేను నా జీవితంలో సంతోషకర క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? ఇవే ప్రశ్నలు మగవాడిని అడగ్గలరా? నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను. అందుకు మీకేంటి అభ్యంతరం? నా జీవితం నా ఇష్టం. సమాజంలో చాలావాటిలో మార్పొచ్చింది. ఏం చేసినా తప్పే!కానీ, ఇప్పటికీ మహిళ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఏం చేసినా తప్పుపడుతూనే ఉన్నారు. ఈ విషయంలో మార్పు రావాలి. వెనకటి కాలంలో సంతానం లేని మహిళలను పండగలకు, శుభకార్యాలకు దూరంగా ఉంచేవారు. అది చూసి నా మనసు చివుక్కుమనేది. ఐవీఎఫ్ వంటి ఆధునాతన పద్ధతులు.. అలాంటివారిలో ఓ కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. నీచమైన కామెంట్లుదానిపై కూడా విమర్శలా? ప్రతిదాన్నీ తప్పుపట్టడం, నీచమైన కామెంట్లు చేయడం మానండి. ఈ ఆన్లైన్ ట్రోలింగ్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana Ramanna (@bhavanaramannaofficial) చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్ -
'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్
సమాజం నాకెంతో ఇచ్చింది.. మరి సమాజానికి నేనేం ఇచ్చాను? అని ఆలోచించేవారు కొద్దిమందే ఉంటారు. వారిలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ముందు వరుసలో ఉంటాడు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్న సంకల్పంతో సూర్య.. అగరం పేరిట ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేశాడు. తమిళనాడులో పేద, వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.నా జీవితం ఓ సినిమా కథఈ కార్యక్రమంలో ఓ యువతి.. అగరం ఫౌండేషన్ వల్ల తన జీవితమే మారిపోయిందని స్పీచ్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నాపేరు జయప్రియ. ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నాను. నా జీవితం చాలా సంతోషంగా సాగుతోంది. మొదట్లో ఆ సంతోషం అన్న పదమే మా జీవితాల్లో లేదు. అదెందుకో మీకు చెప్తాను. ఇదొక సినిమాకథలా అనిపించొచ్చు. మాది చిన్న ఊరు. ఆ ఊరి పేరు అగరం. ఆ గ్రామంలో ఓ తాగుబోతు తండ్రి ఉండేవాడు. పూరి గుడిసెలో జీవితంఅతడితో తాగుడు మాన్పించలేక భార్య మౌనంగా ఏడుస్తూ ఉండేది. వీరికి ఇద్దరు కూతుర్లు. వాళ్లది మట్టి గోడలతో కట్టిన ఇల్లు (పూరి గుడిసె). తాటాకులే ఇంటి పైకప్పు. వర్షం వచ్చిందంటే నీళ్లన్నీ ఇంట్లోకి వచ్చేవి. ఆ ఇంటికి పాములు చుట్టాల్లా తరచూ వస్తుండేవి. ఇదే నా జీవితం. కరెంటు లేదు. ఇంటికి మంచినీటి కనెక్షన్ లేదు. కానీ చదువుకోవాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉండేది. చదువులోనూ ముందుండేదాన్ని. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.నెక్స్ట్ ఏంటి?కొంతకాలానికి మేమున్న ఇల్లు కూలిపోయింది. అమ్మానాన్న నిరుపేదలు. ఏమీ చేయలేకపోయారు. చూస్తుండగానే 12వ తరగతి పూర్తి చేశాను. కాలేజీ టాపర్గా నిలిచాను. తర్వాతేం చేయాలో తోచలేదు. మా మేడమ్ అగరం ఫౌండేషన్ నెంబర్ ఇచ్చింది. వాళ్లు నాకు సాయం చేస్తారంది. 2014లో అగరం ఫౌండేషన్కు కాల్ చేశాను. అప్పుడే నా జీవితం ఆనందంగా ముందుకుసాగింది.గోల్డ్ మెడల్మంచి కాలేజీలో చేర్పించారు. కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. అన్నా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాను. తర్వాత టీసీఎస్లో చేరాను. కొంతకాలానికి ఇన్ఫోసిస్కు మారాను. నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. అగరం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. పెద్ద ఇల్లు కట్టాను. గర్వంగా చెప్తున్నాఒకటి కాదు ఇప్పుడు నాకు రెండు ఇండ్లున్నాయని గర్వంగా చెప్తున్నాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లలకు చదువెందుకు అని ఇప్పటికీ కొందరు అంటుంటారు. అమ్మాయిలను చదవనివ్వండి. చదివితేనే కదా ఏదో ఒకటి చేయగలం అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు సూర్య కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆమె విజయాన్ని అభినందిస్తూ లేచి చప్పట్లు కొట్టాడు.చదవండి: నీ సినిమాలు ఆడవ్ అని ప్రొడ్యూసర్ మొహం మీదే చెప్పాడు -
వయసు గురించి మాట్లాకండి.. హీరోయిన్ ఫైర్
పాన్ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్న నటి మాళవిక మోహన్. ముఖ్యంగా మలయాళం తమిళం తెలుగు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఏ తరహా పాత్రలోనైనా ఒదిగిపోయి నటించగల సత్తా కలిగిన నటి. ప్రస్తుతం ఈమె తమిళంలో కార్తీ కథానాయకుడుగా నటిస్తున్న సర్ధార్ 2 చిత్రంలోనూ, తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా సోమవారం నటి మాళవిక మోహన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ది రాజాసాబ్ చిత్రం యూనిట్, సర్ధార్ 2 చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టల్ విడుదల చేశారు. కాగా 32 ఏళ్లు టచ్ చేసిన మాళవిక మోహన్ మలయాళంలో మోహన్ లాల్ కు జంటగా హృదయ పూర్వం అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా మోహన్ లాల్ వయసు 64 ఏళ్లు ఆయనకు జంటగా 32 ఏళ్ల మాళవిక మోహన్ నటించడంతో సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. వాటిపై స్పందించిన మాళవిక మోహన్ నటీనటుల వయసు గురించి గానీ, వయసు వ్యత్యాసం గురించి గానీ మాట్లాడకండి అంటూ హెచ్చరించారు. ముందు ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం ఆపేయండి అంటూ సినిమాలో ప్రతిభను చూడాలి గానీ అర్థం లేని విషయాల గురించి ఆరాలు తీయరాదనే అభిప్రాయాన్ని మాళవిక మోహన్ వ్యక్తం చేశారు. -
నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: మహావతార్ నరసింహా డైరెక్టర్
'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యానిమేటేడ్ చిత్రం ఊహించని విధంగా ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సత్తా చాటుతోంది.మహావతార్ నరసింహ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. నా జీవితంలో సంపాదించిదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేశానని వెల్లడించారు. మా తల్లిదండ్రులతో పాటు నా భార్య తరఫున వారి ఆస్తులు కూడా తాకట్టు పెట్టానని అన్నారు. ఆఖరికి నా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ ఈ సినిమా తీశానని అశ్విని కుమార్ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు.కాగా.. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ హైదరాబాద్కు విచ్చేసిన డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఏఏఏ సినిమాస్లో మూవీని వీక్షించారు. ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు.The roaring love from Hyderabad continues… 🦁❤️🔥Director @AshwinKleem visited AAA Cinemas & Mythri Vimal Theatre for #MahavatarNarsimha screening and witnessed a phenomenal response from the audience.#Mahavatar @hombalefilms @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/Ax6BMlbtHs— Hombale Films (@hombalefilms) August 5, 2025ఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ సినిమా తీసా- Director #AshwinKumar #MahavatarNarsimha #TeluguFilmNagar pic.twitter.com/R34q2LsSLD— Telugu FilmNagar (@telugufilmnagar) August 5, 2025 -
అగరం .. పేదలకోసం అహరహం.. విద్యతోనే వికాసం
హీరో అంటే సినిమాల్లో ఒక్క దెబ్బకు పదిమంది రౌడీలను గాల్లోకి ఎగిరేలా కొట్టడమేనా.. హీరో అంటే హీరోయిన్తో రొమాన్స్ చేయడమేనా.. హీరో అంటే ఖర్చులేని కబుర్లు చెప్పడమేనా.. పైసా ఖర్చులేకుండా రక్తదానం.. అవయవదానం.. ట్రాఫిక్ రూల్స్ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడమేనా.. ఆదాయపు పన్నులు ఎగ్గొట్టేసి .. రాజకీయ నాయకులతో అంటకాగుతూ సొంత లాభాలు చూసుకోవడం కాదు.. ఎక్కడికక్కడ చిల్లర పాలిటిక్స్ చేస్తూ తమకు నచ్చనివాళ్లను తొక్కేసి నచ్చేవాళ్లకు మాత్రమే సినిమా ఛాన్సులు వచ్చేలా ఇండస్ట్రీ పాలిటిక్స్ చూడడం కూడా కాదు.. అభిమాన సంఘాలను రెచ్చగొట్టి తమ ఇమేజి కాపాడుకుంటూ హీరోయిజం వెలగబెట్టడం అసలే కాదు.మరి హీరో అంటే ఏమిటి ? తాను సంపాదించిన రూపాయితో పదిపైసలు ఈ సమాజం కోసం తిరిగి ఇచ్చేవాడు హీరో.. ఒక సాధారణమైన తనను హీరోలా నిలబెట్టి గుండెల్లో గుడికట్టి ఆరాధిస్తున్న అభిమానులకు .. సమాజానికి తనవంతుగా తిరిగి ఇస్తున్నవాడు అసలైన హీరో.. అలాంటి హీరో తమిళ సూపర్ స్టార్ సూర్య..వందల్లో డాక్టర్లు... వేలల్లో ఇంజినీర్లుఅగరం ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసిన సూర్య పేదల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ చదువుకోవాలని ఉన్నా ఆ ఆశ తీరని పేద పిల్లలకు తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు.అగరం ఫౌండేషన్ – విద్య ద్వారా జీవన మార్పుచెన్నైలో 2006లో మొగ్గ తొడిగిన ఈ అగరం అగరం ఫౌండేషన్, తమిళనాడులోని పేద, వెనుకబడిన సామాజిక వర్గాల విద్యార్థులకు ఆశాకిరణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను బడివైపు నడిపించే బాధ్యత ఈ సంస్థ చేపట్టింది. దాదాపు పదోహేనేళ్ళుగా ఈ మహాయజ్ఞంలో ఉన్న ఈ సంస్థ ఇప్పటికి దాదాపు ఏడువేల మంది వరకు పేద విద్యార్థులను బడివైపు నడిపించింది. ఈ ఫౌండేషన్ సాయంతో చదువుకున్న వారిలో దాదాపు 1800 మంది ఇంజినీర్లుగా ఎదిగారు .. మరో 51 మంది పేద పిల్లలు ఏకంగా డాక్టర్లు అయ్యారు. గతంలో సంస్థ వార్షికోత్సవంలో సూర్య పాల్గొనగా ఒక విద్యార్ధి మాట్లాడుతూ తన ఆశను కళలను నెరవేర్చింది సూర్య సార్ అని చెబుతూ.. తన కలలకు సూర్య సార్ రెక్కలు తొడిగి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించారని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అదే కార్యక్రమంలో ఉన్న సూర్య కళ్ళలోంచి కూడా కన్నీరు ధారాపాతంగా కారడం .. ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే. ఉంది. ఇంకా వీరే కాకుండా వందలమంది రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఇంకొన్ని వేలమంది వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.ప్రాధమిక విద్య అందించడమే కాకుండా ఉన్నత విద్య.. సాంకేతిక విద్య ఆర్జించాలనుకునే విద్యార్థులకు ఈ సంస్థ చేదోడుగా నిలుస్తోంది. పేదింటి పిల్లల ఆశల సౌధం నిర్మించుకునేందుకు అగరం ఒక్కో ఇటుకనూ పేరుస్తూ వస్తోంది. దీంతోబాటు దాదాపు 400 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది ఈ సంస్థ . కరోనా సమయంలో తంజావూరులో ప్రభుత్వ ఆస్పత్రికి రూ. 25 లక్షల వైద్యపరికరాలు అందించారు. దీంతోబాటు అంతర్యుద్ధం.. ఆకలి పేదరికంతో పోరాడుతూ పొట్టచేతబట్టుకుని శ్రీలంక నుంచి వస్తున్నా శరణార్ధుల పిల్లలకు సైతం స్కాలర్షిప్ అందిస్తున్నారు.మనలో ఒకడిని సమాజం ఉన్నతంగా చూస్తుంటే సహించలేదు ఈ సమాజం.. అయన సేవల్లోని గొప్పతనానికి బదులుగా అందులో లోపాలు వెతికే రోజులివి.. కానీ సూర్య సేవలను కమల్ హాసన్ వంటి నటులు ఇది ఒక మౌనవిప్లవం.. నిశ్శబ్దంగా సమాజాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు అంటూ సూర్య చేపట్టిన ఈ దీక్షను కొనియాడారు. ఇంకో చిత్రం ఏమంటే ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన ఇంజినీర్లు.. డాక్టర్లు తాము కూడా సామాజిక బాధ్యతల్లో తలా ఓ చేయి వేస్తున్నారు. తమ వంతుగా వారు కూడా మరి కొందరు పేద పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. సూర్య, కార్తీల తండ్రి శివ కుమార్ వేసిన ఈ చిన్న మొక్కను ఇప్పుడు సూర్య, కార్తీ మహా వృక్షంగా మలిచారు. ఆ వృక్షం కింద వేలమంది అందండంగా చదువుకుంటూ తమ జీవితాలను వెలుగులవైపు నడిపిస్తున్నారు.Suriya Karthi Kamal #Karthi #Kamal #Suriya #Agaram pic.twitter.com/UvznU8OXPM— 𝙰𝚛𝚓𝚞𝚗 (@GaneshC32674824) August 5, 2025 -
ఇండస్ట్రీలో విషాదం.. 34 ఏళ్లకే చనిపోయిన హీరో
గత కొన్నేళ్లలో మరణాలు ఆశ్చర్యకర రీతిలో ఉంటున్నాయి. చిన్న వయసులోనే చాలామంది తుదిశ్వాస విడుస్తున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరో కూడా జాండీస్తో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ కన్నుమూత)కన్నడ ఇండస్ట్రీలో అనెకల్ బాలరాజు నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వారసుడు సంతోష్ బాలరాజు. 2009లో 'కెంప' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం గణప, బర్కెలీ, సత్య, కరియా 2 తదితర సినిమాలు చేశాడు. గత కొన్నేళ్ల నుంచి మాత్రం సంతోష్.. నటుడిగా కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అసలు విషయానికొస్తే కాలేయం, మూత్రపిండాల్లో సమస్యల కారణంగా గత నెలలో జాండీస్ బారిన పడ్డాడు. దీంతో ఐసీయూలో చికిత్స అందిస్తూ వచ్చారు.తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సంతోష్ కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ప్రయత్నాలు చేసినా సరే ప్రాణాలు కాపాడలేకపోయారు. బెంగళురూలోని కుమారస్వామి లేఔట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు కన్నుమూశారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 2022లో సంతోష్ తండ్రి బాలరాజు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.(ఇదీ చదవండి: ఉదయం లేవగానే మొటిమలపై ఉమ్మి రాసుకుంటా: తమన్నా) -
లవ్... ఎమోషన్కి శ్రీకారం
తెలుగులోనూ వరుస విజయాలతో దూసుకెళుతున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవి నేలకుదిటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాని క్లాప్ కొట్టారు.గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్ను టీమ్కు అందజేశారు. ‘‘చక్కని లవ్స్టోరీతో పాటు అద్భుతమైన హ్యూమన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నాం. తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
ఓటీటీకి అనుపమ కోర్ట్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ రిలీజ్కు ముందే వివాదానికి దారితీసింది. సినిమా టైటిల్లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. ఆ తర్వాత జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పేరును మార్చారు. దీంతో సెన్సార్ బోర్డ్ విడుదలకు ఓకే చెప్పింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.కోర్టు రూమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలోకి రిలీజైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా.. ఆగస్టు 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఆమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకికి న్యాయం దక్కిందా లేదా అనేదే అసలు స్టోరీ. -
33 ఏళ్ల కెరీర్.. ఎన్నో అవమానాలు.. అపజయాలు.. అజిత్ కుమార్ భావోద్వేగ లేఖ
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అలరించారు. ఈ కోలీవుడ్ స్టార్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు దశాబ్దాలకు పైగా రాణిస్తున్నారు. తాజాగా అజిత్ సినీ పరిశ్రమకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్, జర్నీ గురించి ప్రస్తావిస్తూ లేఖ విడుదల చేశారు. తాను పడిక కష్టాలను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు. తన జర్నీ సులభంగా సాగలేదని లేఖలో రాసుకొచ్చారు.అజిత్ తన లేఖలో ప్రస్తావిస్తూ.'సినిమా ఇండస్ట్రీలో 33 ఏళ్లు పూర్తిచేసుకున్నా. ఈసందర్భంగా మీతో చాలా విషయాలు పంచుకోవాలనిపించింది. గడిచిన ప్రతి ఏడాది నాకో మైలురాయితో సమానం. మరిన్ని ఘనతల కోసం ఎదురుచూస్తున్నా. మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. నా ప్రయాణం ఏమంతా సులభంగా సాగలేదు. ఎందుకంటే నాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. నా జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు నాకు పరీక్షపెట్టాయి. అయినా ఎప్పుడూ ఎక్కడా ఆగిపోలేదు. అన్ని భరిస్తూ పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తున్నా. పట్టుదలే నేను నమ్ముకున్న మార్గం. అదే నా బలం' అని లేఖలో ప్రస్తావించారు.'సినీ ఇండస్ట్రీలో ఎన్నోసార్లు ఓటములు చవిచూశా. అయినా ప్రతిసారీ మీ ప్రేమే నన్ను ముందుకు నడిపించింది. నా దగ్గర ఏమీ లేనప్పుడు, వైఫల్యాలు చుట్టుముట్టినప్పుడు మీరంతా నా వెంటే ఉన్నారు. ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టం. ఇక మోటారు రేసింగ్లోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. శారీరకంగా కూడా ఎన్నో గాయాలయ్యాయి. అక్కడ కూడా నన్ను ఎదగకుండా అడ్డుకునేందుకు చాలామంది యత్నించారు. ఎన్నోసార్లు అవమానించినా కానీ నేను పతకాలు సాధించే స్థాయికి ఎదిగా. ధైర్యంగా ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపించా' అని లేఖలో రాసుకొచ్చారు.అంతేకాకుండా నా భార్య షాలిని లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదని తెలిపారు. అభిమానుల ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను.. మీ ప్రేమను నేను ఎప్పుడూ వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించలేదని ప్రస్తావించారు. అందరిలా ఎక్కువ సినిమాలు తీయకపోయినా.. కానీ మీ ప్రేమను ప్రతిక్షణం ఆస్వాదిస్తూనే ఉంటానని రాసుకొచ్చారు. నా కెరీర్లో 33 ఏళ్లుగా నాలో ఉన్న లోపాలన్నీ అంగీకరించారు.. మీతో ఎప్పటికీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తానని.. రేసింగ్లోనూ దేశం గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు. తనను విమర్శించే వారికి కూడా అజిత్ కృతజ్ఞతలు తెలిపారు. విమర్శలు తనలో మరింత కసి, తపనను పెంచాయని అన్నారు.AKs thanks giving note on his 33 rd year in the film industry pic.twitter.com/qy9O91Wkcd— Ajithkumar Racing (@Akracingoffl) August 3, 2025 -
సైలెంట్గా తీసుకునేందుకు ఇదేం పెన్షన్ కాదు.. ఊర్వశి ఫైర్
మలయాళ నటి ఊర్వశి (Urvashi)కి జాతీయ అవార్డు వచ్చింది. ఉళ్లోళుక్కు చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటి పురస్కారం వరించింది. అయితే ఈ అవార్డు గెలిచినందుకు ఊర్వశికి సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఉత్తమ నటి పురస్కారం ఇస్తే బాగుండేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఊర్వశి మాట్లాడుతూ.. యాక్టింగ్ అంటే ఇలా ఉండాలనేమైనా కొలమానాలు రాసిపెట్టారా?పెన్షన్ కాదులేదంటే ఫలానా వయసు దాటిందంటే బెస్ట్ యాక్ట్రెస్కు బదులుగా ఇలాంటి అవార్డులే ఇవ్వాలని ఏమైనా రూల్ పెట్టారా? మరేంటిదంతా? సైలెంట్గా ఇచ్చిందేదో తీసుకునేందుకు ఇదేమీ పెన్షన్ డబ్బు కాదు. మీరు నన్ను సహాయ నటిగా ఏ లెక్కన పరిగణించారు? ఏయే విధానాలు ఫాలో అయ్యారో చెప్పండి. ఉత్తమ నటి/నటుడు పురస్కారానికి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారో వెల్లడించండి. అవార్డు ప్రకటించారంటే గర్వంతో పొంగిపోయేలా ఉండాలే తప్ప మేము తిరిగి ప్రశ్నించేలా ఉండకూడదు అని జ్యూరీ సభ్యులపై అసహనం వ్యక్తం చేసింది. జాతీయ అవార్డులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో పూర్తి విచారణ జరపాలని కేంద్ర మంత్రి సురేశ్ గోపిని కోరింది.రెండుసార్లు జాతీయ అవార్డుఉళ్లోళుక్కు సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇందులో ఊర్వశి లీలమ్మ పాత్ర పోషించింది. ఈ పాత్రకుగానూ ఊర్వశికి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు వరించింది. 2006లో వచ్చిన అచ్చువింటే అమ్మ సినిమాకు సైతం ఊర్వశికి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. ఈ మూవీలో ఆమె హీరోయిన్ అయినప్పటికీ సహాయనటి పురస్కారమే గెలుచుకుంది.చదవండి: కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్? -
పృథ్వీరాజ్కి అందుకే నేషనల్ అవార్డ్ ఇవ్వలేదు: జ్యూరీ మెంబర్
కేంద్ర ప్రభుత్వం.. మూడు రోజుల క్రితం నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రకటించింది. తెలుగు చిత్రసీమకు పలు అవార్డులు దక్కాయి. అయితే ఉత్తమ నటుడిగా 'జవాన్' చిత్రానికిగానూ షారుక్ ఖాన్ ఎంపికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విక్రాంత్ మస్సేతో (12th ఫెయిల్) పాటు షారుక్కి సంయుక్తంగా ఇచ్చారు. చాలామంది మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్కి వస్తుందని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఈ విషయమై విమర్శలు వస్తున్నాయి. దీంతో జ్యూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ స్పందించారు. అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)'పృథ్వీరాజ్ సుకుమారన్(ఆడు జీవితం)కి బెస్ట్ యాక్టర్ ఇవ్వాలని నేను ప్రతిపాదించాను. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లోనూ ఈ సినిమాని కమిటీ ఛైర్ పర్సన్ అశుతోష్ కూడా చూశారు. కానీ ఆయన ఇందులో సామాజిక అంశం లేదని, పృథ్వీరాజ్ నటనలో సహజత్వం లేదని నాతో అన్నారు. అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే ఈ చిత్రానికి జాతీయ సినిమా అవార్డ్ ఇవ్వలేదు' అని జ్యూరీ మెంబర్ ప్రదీప్ నాయర్ చెప్పారు.అలానే 'ద కేరళ స్టోరీ' చిత్రానికి అవార్డ్ రావడంపైనా ప్రదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని కూడా బయటపెట్టారు. 'ప్యానెల్లో ద కేరళ స్టోరీ చిత్రానికి అవార్డ్ ఇవ్వడంపై నేను అభ్యంతరం చెప్పాను. ఓ రాష్ట్రాన్ని కించపరిచేలా తీసిన సినిమాకు జాతీయ అవార్డ్ ఎలా ఇస్తారని ప్రశ్నించాను. జ్యూరీ ఛైర్ పర్సన్కి నా అభిప్రాయం చెప్పాను. కానీ నేను చెప్పిన మాటల్ని వాళ్లు లెక్కలోకి తీసుకోలేదు. ఈ మూవీలో వివాదాస్పద అంశాలున్నాయని, ఓ ఉద్దేశంతో తీశారని నా అభిప్రాయం చెప్పాను. కానీ వాళ్లు దీన్ని ఓ సామాజిక సమస్యగా చూశారు' అని ప్రదీప్ నాయర్ అసహనం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు) -
కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్?
సినిమా బాలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు అస్సలు పట్టించుకోరు. అదే కంటెంట్ నచ్చితే మాత్రం భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. 2022లో వచ్చిన కాంతార (Kantara Movie) అనే కన్నడ సినిమా ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంతార బ్లాక్బస్టర్ హిట్నిర్మాతలు సినిమా హిట్టని ఊహించుంటారు కానీ ఇలా వందల రెట్ల లాభాలు వస్తాయని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో ప్రధాన పాత్రలో నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్లాక్బస్టర్ హిట్ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! కాంతార 3లో తారక్?ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అంటే ఇది ఫస్ట్ పార్ట్ కాగా, ఇప్పటికే రిలీజైంది రెండో పార్ట్ అన్నమాట! తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి కాంతార 3 కూడా తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడని, అందులో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా భాగం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ కనక నిజమైతే అభిమానులకు మాత్రం పండగే! సినిమా..ప్రస్తుతం ఎన్టీఆర్.. వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ పౌరాణిక సినిమా కూడా చేయనున్నాడు. దేవర 2 కూడా లైన్లోనే ఉంది.చదవండి: AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం -
AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం
చాలాపనులను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిటికెలో చేసేస్తుంది. అందుకే ఇప్పుడందరూ దీనిపై పడ్డారు. ఏఐతో సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. వారితో వ్యాపారాలు చేయిస్తున్నారు. ఆఖరికి కొత్త హీరోహీరోయిన్లను సృష్టించి సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ సరేకానీ, ఎప్పుడో రిలీజైన సినిమాను ఏఐను ఉపయోగించి క్లైమాక్స్ మార్చేయడమే చాలామందికి మింగుడుపడలేదు. ఏఐతో క్లైమాక్స్ మార్చేశారుధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన చిత్రం రాంఝనా (Raanjhanaa Movie). ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇప్పుడంతా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఆగస్టు 1న ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేశారు. కాకపోతే అందులో ఒరిజినల్ క్లైమాక్స్ లేదు. ఏఐ సాయంతో రూపొందిన క్లైమాక్స్ జత చేశారు. నిజానికి సినిమా చివర్లో హీరో చనిపోతాడు. కానీ ఏఐ సాయంతో ధనుష్ను చంపకుండా బతికించి కథ సుఖాంతం చేశారు. ఆత్మను చంపేశారుదీనిపై ధనుష్ (Dhanush) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏఐ క్లైమాక్స్తో రీరిలీజ్ అయిన రాంఝన సినిమా చూసి కలత చెందాను. క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆత్మనే కోల్పోయింది. నేను అభ్యంతరం చెప్పినప్పటికీ సంబంధిత పార్టీలు లెక్కచేయకుండా ఏఐ క్లైమాక్స్ ఉపయోగించాయి. ఇది నేను 12 సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా కానే కాదు.ఆందోళన కలిగించే విషయంసినిమాలో కంటెంట్ను మార్చడానికి ఏఐను ఉపయోగించడమనేది కళకు, కళాకారులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానానికి, సినీవారసత్వానికే ప్రమాదకరం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ లేఖ షేర్ చేశాడు. For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM— Dhanush (@dhanushkraja) August 3, 2025చదవండి: విలన్గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్ -
విలన్గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్
రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కూలీ. బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను లోకేష్ కనకరాజ్ నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చెన్నైలో తాజాగా జరిగిన ఈ సినిమా వేదికపై నటుడు నాగార్జున మాట్లాడుతూ.. కూలీ చిత్రాన్ని భాషా సినిమాతో పోల్చారు. ఏకంగా వంద 'బాషా' సినిమాలతో సమానంగా కూలీ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశారు. రజనీకాంత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఓజి అని నాగ్ తెలిపారు. ఆపై రజనీకాంత్ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ ‘అబ్బా ఏం కలర్, ఏం స్కిన్, హాయ్ అని అలాగే చూస్తుండి పోయాను. నాకు జుత్తు అంతా ఊడిపోయింది. మీ సీక్రెట్ ఏమిటని నాగ్ను అడిగాను. అందుకు ఆయన ఏమీ లేదు శారీరిక కసరత్తులే చెప్పారు’ అని తెలిపారు.విలన్గా నాగ్ ఎందుకు చేశారంటే..కూలీ చిత్రంలో విలన్గా నాగార్జున నటించడానికి కారణం ఒక సినిమా డైలాగ్ అంటూ రజనీకాంత్ ( Rajinikanth) ఇలా చెప్పారు.' వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంబ్లర్' చిత్రంలో అజిత్ చెప్పిన ఒక డైలాగ్ 'ఎంతకాలం మంచివాడిగా నటించేది' మాదిరి నాగార్జున కూడా ఈ చిత్రంతో విలన్గా మారారు. కమలహాసనే ఆశ్చర్యపడేలా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. నా విజయం రహస్యం శ్రమ మాత్రమే కాదు. భగవంతుడి ఆశీస్సులు కూడా.. నేను బస్ కండక్టర్గా పని చేస్తున్నప్పుడు మిత్రుడు ఒకరు బంగారు చైన్ ఇచ్చి సినిమాల్లో నటించమని చెప్పారు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ధనం, పేరు ఉన్నా, ఇంట్లో ప్రశాంతత, బయట గౌరవం లేకపోతే ఏది లేదు.' అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర, పలువురు చిత్ర ప్రముఖులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కన్నడలో సూపర్ హిట్.. ఇప్పుడు తెలుగులో రిలీజ్
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో హిట్టయిన సినిమాల్ని మన దగ్గర డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. లేదంటే నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అలానే కన్నడలో ఈ మధ్యనే రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న ఓ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ విషయమై అప్డేట్ ఇచ్చారు.వచ్చే వారం థియేటర్లలో వార్ 2, కూలీ చిత్రాలు రాబోతున్నాయి. కాబట్టి కన్నడ హిట్ మూవీ 'సు ఫ్రమ్ సో'ని ఈ వారమే (ఆగస్టు 08) థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్లో తెలుగు హారర్ సినిమా)'సు ఫ్రమ్ సో' అనేది విలేజ్ బ్యాక్డ్రాప్ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికొస్తే.. తీర ప్రాంతంలో ఉన్న ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతుంటాడు. అతడిని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊరిలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమేంటి? సులోచన దెయ్యం నిజమేనా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. దర్శకత్వం కూడా వహించాడు. స్టోరీ కూడా అతడిదే. ప్రముఖ కన్నడ హీరో కమ్ దర్శకుడు రాజ్ బి శెట్టి.. ఓ నిర్మాతగా వ్యవహరించాడు. కన్నడలో హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) -
రజినీకాంత్ కూలీ.. అమిర్ ఖాన్ మేకోవర్ వీడియో చూశారా?
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమిర్ ఖాన్ దహా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ రోల్ కోసం అమిర్ ఖాన్ మేకోవర్ వీడియోను నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఈ పాత్ర కోసం ఒంటినిండా టాటూతో కనిపించారు అమిర్ ఖాన్. శనివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు సైతం చేతి నిండా పచ్చబొట్టుతో కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025 -
ఆటిట్యూడ్ హీరోలపై 'కూలీ' నిర్మాత సెటైర్లు
ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి నటీనటులు చాలామంది నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. రెమ్యునరేషన్ల దగ్గర నుంచి షూటింగ్ జరిగే సమయంలో సదుపాయాల వరకు నిర్మాతని చాలానే ఇబ్బంది పెడుతున్నారు. కాకపోతే వీటి గురించి చెప్పుకొంటే మళ్లీ ఎక్కడ సినిమా సమస్యల్లో పడుతుందోనని నిర్మాతలు సైలెంట్గా ఊరుకుంటున్నారు. అలాంటిది 'కూలీ' ప్రొడ్యూసర్ కళానిధి మారన్ మాత్రం కుండ బద్దలు కొట్టేశారు. కొందరు హీరోల నిజస్వరూపం గురించి చెప్పి, సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.రజినీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శనివారం సాయంత్రం చెన్నైలోని జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత కళానిధి మారన్.. 'ఈ రోజుల్లో కొందరు సక్సెస్ఫుల్ యాక్టర్స్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. రెండు హిట్స్ పడగానే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. కొందరైతే ప్రైవేట్ జెట్స్ అడుగుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం చాలా సింపుల్గా ఉంటారు. దేశంలోని ఒకే ఒక్క సూపర్స్టార్ ఈయనే' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ‘ఢీ’ కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు, అరెస్ట్!)రజినీకాంత్ గురించి నిర్మాత చెప్పడం, ఆయన ఎలివేషన్లు ఇవ్వడం బాగానే ఉంది. మరి కళానిధి మారన్.. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరి హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈయన వాళ్ల గురించి చెప్పారా? లేదా జనరల్గా ఇండస్ట్రీలో హీరోల తీరు గురించి చెప్పారా అనేది సస్పెన్స్.'కూలీ' విషయానికొస్తే రజినీకాంత్తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. శనివారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాకపోతే పెద్దగా హై అనిపించలేదు. కానీ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంపై హైప్ గట్టిగానే ఉంది. మరి ఆగస్టు 14న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) -
స్టార్స్ రీయూనియన్.. జల్సాకు బదులు సేవ చేయొచ్చుగా.. హీరోయిన్ కౌంటర్
‘అప్పుడెప్పుడో కలిసి నటించాం. ఇక అంతే. పెద్దగా మా మధ్య కమ్యూనికేషన్ లేదు’ అన్నట్లుగా ఉండరు నైంటీస్ టాలీవుడ్, కోలివుడ్ స్టార్స్. ఇప్పటికీ బెస్ట్ఫ్రెండ్స్గానే ఉన్నారు. వీరి రీయూనియన్ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక డ్రెస్కోడ్ పాటిస్తారు. ఈసారి వీరి రీయూనియన్కి గోవా కేంద్రం అయింది. జగపతిబాబు, శ్రీకాంత్, మీనా, సిమ్రాన్, శ్వేత మీనన్, సంగీత, ఊహ, ప్రభుదేవా, దర్శకులు శంకర్, కె.ఎస్.రవికుమార్, లింగుస్వామి. మోహన్రాజాలాంటి వారు ఈ రీయూనియన్ వేడుకలో భాగం అయ్యారు.కబుర్లే కబుర్లు‘మెమోరీస్ మేడ్. నైంటీస్ రీయూనియన్’ క్యాప్షన్తో బోలెడు ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది మీనా (Actress Meena Sagar). ఒకప్పుడు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ చాలాకాలం తరువాత కలుసుకున్నప్పుడు... కబుర్లే, కబుర్లు. నవ్వులే నవ్వులు! ‘ఆ రోజు షూటింగ్లో నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నావో...’ అని ఒకరు అనేలోపే, మరొకరు ‘నువ్వు మాత్రం తక్కువ తిన్నావేమిటీ. నన్ను మించిపోయావు’ అని మరొకరు అనగానే... నవ్వులే నవ్వులు! నైంటీస్ సినీ స్కూల్‘అచ్చం ఆరోజుల్లాగే ఉన్నావు. ఏమిటీ నీ ఫిట్నెస్ మంత్రా’ అని ఒకరు మరొకరిని అడగగానే అందరూ సైలెంటైపోయి అతడు/ఆమె చెప్పే ఫిట్నెస్ రహస్యాలను శ్రద్దగా వింటారు. పిల్లల చదువు, కెరీర్ నుంచి తమ కెరీర్ వరకు ఈ రీయూనియన్లో ఎన్నో విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘నైంటీస్ స్కూల్’లోని సినీ స్నేహితుల సందడి ఇది. వీరంత అన్యోన్యంగా ఇప్పటి తారలు ఎక్కడున్నారు చెప్పండి!నీకేం తెలుసు?అయితే ఇది చూసి ఓర్వలేని ఓ వ్యక్తి.. ఇలా డబ్బులు తగలేసి జల్సాగా తిరగడానికి బదులు ఏదైనా మంచిపని చేయొచ్చుగా! పైగా అందరూ మంచి స్థాయిలోనే ఉన్నారుగా అని కామెంట్ చేశాడు. అది చూసి నటి మహేశ్వరికి చిర్రెత్తిపోయింది. అరె, మేమంతా కలిసేదే ఎప్పుడో ఒకసారి, అది కూడా ఓర్వలేకపోతున్నారని మండిపడింది. 'మాకు తోచిన విధంగా సమాజానికి ఎంతో కొంత సాయం చేయడం లేదని నువ్వెలా అనుకుంటున్నావు? అంటే సాయం చేసి డప్పు కొట్టుకోవాలా?? దాన్ని పబ్లిసిటీ చేయాలా? ఎదుటివారిని తప్పుపట్టడం ఇకనైనా మానుకోండి. మేమేం చేయాలి? ఏం చేయకూడదనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు కూడా సమాజానికి ఎంతోకొంత ఉపయోగపడ్తున్నావనే అనుకుంటున్నాను' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress)చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో -
రొమాన్స్ ఇరుక్కు, ట్విస్ట్ ఇరుక్కు.. ఓటీటీలో లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ నిర్మించిన చిత్రం "ఓహో ఎంతన్ బేబి" (Oho Enthan Baby Movie). రుద్ర, మిథిలా పాల్కర్ జంటగా నటించారు. కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా దాదాపు నెల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.ఓటీటీలో ఎప్పుడంటే?ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix).. ఓహో ఎంతన్ బేబీ చిత్రాన్ని ఆగస్టు 8న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. రొమాన్స్ ఇరుక్కు (ఉంది), ట్విస్ట్ ఇరుక్కు, డ్రామా ఇరుక్కు.. అంతా ఒకే.. హ్యాపీ ఎండింగ్ ఇరుక్కుమా? (ఉంటుందా?) అని ఈ పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. మరి ఈ లవ్స్టోరీ చూడాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే! Open pannaa… oru love story. Romance irukku, twist irukku, drama irukku. Aana, happy ending irukkuma? 👀 pic.twitter.com/YF8H7YtVaG— Netflix India South (@Netflix_INSouth) August 3, 2025 చదవండి: రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో -
రజనీకాంత్ కాళ్లకు నమస్కరించిన బాలీవుడ్ హీరో
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ (Coolie Movie). టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సూపర్స్టార్ ఆమిర్ ఖాన్, శాండల్వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, సత్యరాజ్, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్లో కనిపించనుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.కూలీ సినిమా లుక్లో ఆమిర్శనివారం ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు ఆమిర్ ఖాన్ (Aamir Khan) కూడా హాజరయ్యాడు. కూలీ సినిమాలో చేతి నిండా పచ్చబొట్టుతో ఎలా కనిపించాడో అదే లుక్లో స్టేజీపై దర్శనమిచ్చాడు. భుజంపై జాకెట్ పట్టుకుని దర్జాగా నడుచుకుంటూ వచ్చి అభిమానులను పలకరించాడు. కాళ్లు మొక్కిన హీరోఆ తర్వాత రజనీకాంత్ కాళ్లకు నమస్కరించాడు. దీంతో తలైవా అతడిని వెంటనే పైకి లేపి మనసారా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆమిర్ ఖాన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనని కామెంట్లు చేస్తున్నారు. Can’t keep calm when Mr. Perfectionist Aamir Khan walks in with full swag!😎 #CoolieUnleashed ✨@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan #Coolie #CoolieFromAug14 pic.twitter.com/DFv306PuI9— Sun Pictures (@sunpictures) August 2, 2025For this massive respect, I'll be one of #AmirKhan fan after this .Humble person and knew how to respect legends. pic.twitter.com/swIjQtbbMy— Daemon (@k3_butcher) August 2, 2025చదవండి: 36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ -
నా భక్తి దారి వేరే అంటున్న శ్రుతి హాసన్
‘కమల్ హాసన్ కుమార్తె’ అనే ఓ ప్రత్యేకమైన ట్యాగ్తోనే అందరికీ పరిచయం అయినా, శ్రుతి హాసన్ ఇప్పుడు ఆ పేరుకు మించి తనదైన గుర్తింపును ఏర్పరచుకుంది. త్వరలో రానున్న ‘కూలీ’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది.→ చిన్ననాటి నుంచి మురుగన్ స్వామిని విశ్వసించే శ్రుతి, ఇటీవల వారాహీమాత భక్తురాలిగా మారింది. చెన్నైలోని ఓ చిన్న గుడికి వెళ్లిన తర్వాత తనలో భయాలు తగ్గాయని, జీవితంలో మానసిక ప్రశాంతతను పొందానని చెప్పింది. వారాహిమాతను పూజించడం ప్రారంభించిన తరువాత తన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పింది.→ తనకు వచ్చిన తన తండ్రి కమల్ హాసన్ వాయిస్ కారణంగా కెరీర్ ప్రారంభంలో ఆమె చేసిన డబ్బింగ్, పాటలపై ట్రోల్స్ ఎక్కువైనా, నమ్మకాన్ని కోల్పోలేదట! ఏ ఆర్ రెహమాన్ సంగీతంపై చిరకాల కోరిక. ‘థగ్ లైఫ్’లో ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడుతున్నప్పుడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యిందట!→ జాతకాలను గట్టిగా నమ్ముతుంది. ప్రస్తుతం కుజ మహాదశలో ఉందని చెప్పింది. స్నేహితురాలు సుకన్య జ్యోతిష్య శాస్త్రం మీద రాసిన పుస్తకం ద్వారా, ఆమె సలహాలు తీసుకుంటుందట!→ తండ్రి కమల్ హాసన్లో తనకు నచ్చిన క్వాలిటీ– ఆయన విల్ పవర్. తండ్రి అభిమాన దర్శకుడు అకిరా కురసోవా సినిమాలు చూసి, ఆయన జీవిత చరిత్ర చదివాక జపాన్ మీద ప్రత్యేకమైన అభిమానం పెంచుకుంది.→ తన జీవితంలో రెండు షేడ్స్ ఉన్నాయంటోంది శ్రుతి– ఒకటి ప్రజల కోసం, మరొకటి స్నేహితుల కోసం. మూడున్నరేళ్ల వయసులో పరిచయమైన ఫ్రెండ్తో ఇప్పటికీ స్నేహం కొనసాగుతుందట!→ బాల్యంలో తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక– ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉండేవారు. కమల్ హాసన్ ఏడెనిమిది గంటల పాటు స్క్రీన్ ప్లే రాసుకుంటుంటే, సారిక సినిమా సౌండ్ డిజైనింగ్ లో బిజీగా ఉండేది.→ తల్లిదండ్రులిద్దరూ స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కాదు. కాని, పిల్లల చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. ఇంట్లో పూర్తిగా నాస్తిక వాతావరణం ఉండేది. ఇంట్లో పూజలు చేసేవారు కాదు. అయినా తన భక్తి దారి వేరే అని చెబుతుంది→ వంట అంటే మక్కువ, సౌత్ ఇండియన్ , ఇటాలియన్ వంటకాల్లో ప్రావీణ్యం. సాంబార్ రైస్, మటన్ సూప్, మోచీ ఐస్క్రీమ్– ఆమె ఫేవరెట్డిషెస్. -
36 ఏళ్ల తర్వాత రజనీ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్
చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఆ చిత్రాలను 12 ఏళ్ల లోపు పిల్లలు చూడడానికి థియేటర్లో అనుమతించరాదని అర్థం అనే విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనలను ఇప్పుడు పెద్దగా ఏ సినిమా థియేటర్ నిర్వాహకులు పాటించడం లేదన్నది వేరే విషయం. సాధారణంగా క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ కథా చిత్రాలకు, హింసాత్మక సంఘటనలు అధికంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇస్తుంది. అదే సర్టిఫికెట్ను ఇప్పుడు రజనీకాంత్ తాజాగా కథానాయకుడు నటించిన కూలీ చిత్రానికి ఇవ్వడం గమనార్హం.లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్తో పాటు బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర, ,క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక అదనపు ఆకర్షణగా పూజాహెగ్డే ఐటమ్ సాంగ్ ఉండనే ఉంది. కాగా అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ను ఇవ్వడం చర్చనీయంగా మారింది. కారణం ఈ చిత్రంలో భారీగా హింసాత్మక సన్నివేశాలు చోటు చేసుకోవడమే అని తెలిసింది. రజనీకాంత్ నటించిన అత్యధిక చిత్రాలు యూ /ఏ సర్టిఫికెట్ తోనే విడుదలయ్యాయి. అయితే 1982లో నటించిన పుదుకవితై, రంగా, 1985లో నటించిన ఊరుక్కావాలన్, 1989లో నటించిన శివ చిత్రాలు మాత్రం ఏ సర్టిఫికెట్తో విడుదలయ్యాయి. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత మళ్లీ కూలీ చిత్రం ఏ సర్టిఫికెట్తో తెరపైకి రాబోతుందన్నది గమనార్హం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ,ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నెహ్రూ హిందూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. -
వెండితెరపై హిస్టరీ రిపీట్!
వెండితెరపై హిస్టరీ రిపీట్ అవుతోంది. అవును... వందల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇందుకోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్లతో నిర్మాతలు, సూపర్ టేకింగ్తో దర్శకులు తీస్తున్న ఆ సినిమాల వివరాలు, ఆ చారిత్రక సంఘటనల విశేషాలను తెలుసుకుందాం.మాస్ కాదు... ఫ్యాంటసీ ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా రానుంది. అయితే ఈ సారి ఓ చారిత్రక కథను సిద్ధం చేశారు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని, ఈ హిస్టారికల్ డ్రామాలో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోగా వెంకటేశ్ నటిస్తారని తెలిసింది. అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, ఇది హిస్టారికల్ డ్రామా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.తండ్రీకొడుకుల ఎమోషన్ ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాల సక్సెస్తో ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నారు మలయాళ హీరో మోహన్లాల్. అలాగే మోహన్లాల్ నటించిన మరో రెండు సినిమాలు ‘వృషభ, హృదయపూర్వం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ‘వృషభ’ సినిమా హిస్టారికల్ మూవీ అని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు.సైనికుడి పోరాటం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ సైనికుడి వీరోచిత పోరాటం, త్యాగం, ప్రేమ... వంటి అంశాలతో ఓ హిస్టారికల్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో నటిస్తున్నారని, 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.భాగ్యనగరం, నైజాంలో రజాకార్ల ఆకృత్యాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తయిందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.బెంగాల్లో డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా రానుంది. ఇది హిస్టారికల్ డ్రామా మూవీ అని తెలిసింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రధానంగా ఈ సినిమాలో బెంగాల్, బంగ్లాదేశ్ల నేపథ్యం కనిపిస్తుందట. 1850 టైమ్లైన్లో ఈ సినిమా మేజర్ కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తోంది.అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రుక్ముణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, విలన్గా మలయాళ నటుడు టోవినో థామస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ... ఆ తర్వాత 2026 జూన్ 25కు విడుదలను వాయిదా చేశారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.రాయలసీమ నేపథ్యంలో... రాయలసీమలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలతో హీరో విజయ్ దేవరకొండ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు. 2018లో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ రూపంలో ఓ హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్ను రెడీ చేస్తున్నారు మేకర్స్.1854–1878 మధ్య కాలంలో రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, ఇప్పటివరకు ఎవరూ వెండితెరపై చెప్పని ఓ సరికొత్తపాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే... ‘గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాజుల కథ హీరో నిఖిల్ రెండు హిస్టారికల్ సినిమాలు చేస్తున్నారు. అందులో మొదటిది ‘స్వయంభూ’. ‘బాహుబలి’ తరహా మాదిరి రాజుల కాలం నాటి కల్పిత కథతో ‘స్వయంభూ’ సినిమా కథనం ఉంటుంది. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఆంధ్ర ప్రదేశ్లో ప్రారంభం కానుందని తెలిసింది. ఠాగూర్ మధు సమర్పణలో ఈ భారీ బడ్జెట్ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. అలాగే నిఖిల్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్లో జరిగిన ఓ చిన్న ప్రమాదం కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి. మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 1905లో లండన్లో జరిగిన కొన్ని సంఘటనలు భారతదేశ స్వాతంత్య్రంపై ఏ విధంగా ప్రభావితం చూపాయి అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందట. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సవార్కర్కు చెందిన సంఘటనలు కూడా ఈ సినిమాలో హైలైట్గా ఉంటాయట.గోపీచంద్ శూల ప్రేక్షకులను ఏడో శతాబ్దంలోకి తీసుకుని వెళ్లనున్నారు గోపీచంద్. ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ హిస్టారికల్ వార్ డ్రామా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ వారియర్గా నటిస్తున్నారు. కశ్మీర్లో ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ను ఆ మధ్య పూర్తి చేశారు. ఈ సినిమా ఏడో శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ టచ్ చేయని ఓపాయింట్తో తాము ఈ సినిమా చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. గోపీచంద్ కెరీర్లోని ఈ హిస్టారికల్ సినిమాను భారీ బడ్జెట్తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘శూల’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా 2026 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలా హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.శతాబ్దాల క్రితంనాటి కథలు కాదు... కానీ సెమీ పీరియాడికల్ సినిమాలు (50–60 సంవత్సరాల క్రితం నేపథ్యంలో) మరికొన్ని ఉన్నాయి. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోని ‘దిప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, ఆది సాయికుమార్ ‘శంబాల’, రోషన్ మేకా ‘చాంపియన్’... ఈ కోవకి చెందిన సినిమాలే. కాంతార ప్రీక్వెల్ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు హిస్టారికల్ సినిమాల్లో రిషబ్ శెట్టి నటించడం విశేషం. అది కూడా ఈ సినిమాల వరుసగా చేయడం అంటే చిన్న విషయం కాదు. పీరియాడికల్ కథలపై కన్నడ నటుడు–దర్శక–హీరో రిషబ్ శెట్టి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రిషబ్ వరుసగా శతాబ్దాల క్రితం నాటి కథలతో సినిమాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘కాంతార: చాఫ్టర్ 1’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్గా రానుంది.‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలై 1970లో జరిగే కొన్ని సన్నివేశాలతో కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 1990 బ్యాక్డ్రాప్లో మేజర్ సినిమా కథనం సాగుతుంది. ‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలైంది కనుక ‘కాంతార’ ప్రీక్వెల్ ఇంకా ముందు జరిగిన కథగా ఉంటుంది. ఈ ప్రకారం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. తిరుగుబాటుదారుడి కథ: ‘జై హనుమాన్’ సినిమా తర్వాత రిషబ్ శెట్టి తెలుగులో మరో సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు.18వ శతాబ్దంలో భారత్లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నారు రిషబ్ శెట్టి. ఈ ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన యోధుడు: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామా 1630– 1680 మధ్యకాలంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు మేకర్స్. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రానుందని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏకకాలంలో 2027 జనవరి 21న రిలీజ్ చేస్తామని ఈ చిత్ర సంగీత దర్శకుడు సందీప్ రాజ్ ఆ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇలా.. రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు హిస్టారికల్ డ్రామా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రిషబ్ శెట్టి. – ముసిమి శివాంజనేయులు -
ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ కన్నుమూత
ఇండస్ట్రీలో మర విషాదం. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, ఫిష్ వెంకట్ తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు మరోసారి విషాదం నెలకొంది. తమిళ ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబ్(71) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈయన.. శనివారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)మదన్ బాబ్ అసలు పేరు ఎస్.కృష్ణమూర్తి. ముఖంలో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా టీవీ ఇండస్ట్రీలోకి తొలుత వచ్చారు. విచిత్రమైన హావభావాలు చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న కమెడియన్ పాత్రలు దక్కించుకున్నారు. కొన్నాళ్లకు స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించారు. ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు. తెలుగులో పవన్ కల్యాణ్ 'బంగారం' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్ రిలీజ్) -
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి
హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం జరిగింది. ఇతడి మేనకోడలు ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ వేడుక జరగ్గా.. కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. విశాల్ కూడా వచ్చాడు. ఎనర్జిటిక్గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ పెళ్లి సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం)విశాల్ తెలుగు మూలాలున్న కుర్రాడే. కానీ తండ్రి తమిళనాడులో స్థిరపడటంతో ఆ ఇండస్ట్రీలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ రీసెంట్ టైంలో ఇతడి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏంరాలేదు. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా విశాల్ని బాగా ఇబ్బంది పెట్టాయి. వీటన్నింటి నుంచి ఈ మధ్యే కోలుకున్న విశాల్.. పూర్తి ఆరోగ్యంగా పలుమార్లు కనిపించాడు. అలానే తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న నటి ధన్సికని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్నాళ్ల ముందు విశాల్ బయటపెట్టాడు. అయితే ఈ శుభకార్యం ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సంగతి అలా పక్కనబెడితే ఇప్పుడు తన మేనకోడలు వివాహ వేడుకలో విశాల్ పాల్గొన్నాడు. ఈమె ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే నూతన వధూవరుల్ని విశాల్ ఆశీర్వదించాడు.(ఇదీ చదవండి: 'ఓజీ' సినిమా తొలి పాట రిలీజ్) View this post on Instagram A post shared by Karthikeyan Ravikumar (@karthikeyan_youtuber) -
జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?
జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ హవా కనిపించింది. 71వ జాతీయ సినీ అవార్డుల్లో (National Film Awards 2025) టాలీవుడ్ ఏడు పురస్కారాలను ఎగరేసుకుపోయింది. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా.. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) అవార్డులు కొల్లగొట్టారు. అయితే వీరిద్దరూ రూ.2 లక్షల పురస్కారాన్ని చెరిసగం పంచుకోవాల్సి ఉంది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకుగానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి పురస్కారం వరించింది. అవార్డుతో పాటు రూ.2 లక్షలు అందుకోనుంది. వీళ్లందరికీ ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం! తెలుగు చలనచిత్రసీమకు ఏయే విభాగంలో జాతీయ అవార్డులు వచ్చాయి? వారికి ఎంత ప్రైజ్మనీ అందుతుందనే వివరాలను చూసేద్దాం..వారికి బంగారు పతకం2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో పురస్కారాలు వచ్చాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు, యానిమేటర్ జెట్టి వెంకట్ కుమార్కు బంగారు పతకంతో పాటు రూ.3 లక్షల నగదు చొప్పున అందజేయనున్నారు. జెట్టి వెంకట్ కుమార్.. వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గానూ వ్యవహరించినందున అతడికి మరో వెండి పతకంతో పాటు మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నందు పృథ్వీ వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు తీసుకోనున్నాడు.బేబీ సింగర్కు రూ.2 లక్షలు‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి ఉత్తమ బాలనటి పురస్కారం వరించింది. అయితే ఈ కేటగిరీలో మరో ఇద్దరికి అవార్డులు రావడంతో.. రూ.2 లక్షల ప్రైజ్మనీని ఈ ముగ్గురూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బేబీ మూవీలో ప్రేమిస్తున్నా... పాటకు పీవీఎస్ఎన్ రోహిత్కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు వరించింది. ఇతడికి వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు రానున్నాయి.బేబీ డైరెక్టర్కు రూ.1 లక్ష ప్రైజ్మనీబెస్ట్ స్క్రీన్ప్లే విభాగంలో బేబీ రచయిత సాయి రాజేశ్తో పాటు మరో తమిళ దర్శకుడికి అవార్డు వరించింది. దీంతో అతడితో కలిసి రూ.2 లక్షల బహుమానాన్ని సమంగా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి వెండి పతకాలు బహుకరిస్తారు. బలగం సినిమాలో ‘ఊరు పల్లెటూరు..’ పాట రచయిత కాసర్ల శ్యామ్ బెస్ట్ లిరిక్ రైటర్గా వెండి పతకంతో పాటు రూ.2 లక్షలు అందుకోనున్నాడు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలతో దర్శకుడు అనిల్ రావిపూడి రూ.2 లక్షల ప్రైజ్మనీని సమానంగా పంచుకోనున్నాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట విషాదం.. 'నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది -
అలాంటి సినిమాకు జాతీయ అవార్డా..? ముఖ్యమంత్రి ఫైర్!
‘ది కేరళ స్టోరీ’ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు వచ్చాయి. అయితే ఈ సినిమాకు అవార్డులు రావడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపట్టారు. ‘‘మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు గౌరవాన్ని కల్పించడం అనేది సంఘ్పరివార్ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డు జ్యూరీ కమిటీ సమర్థించినట్లే. అలాగే మత సామరస్యానికి చిరునామా అయిన కేరళను అవమానించినట్లే. ఇది కేవలం మలయాళీలను మాత్రమే కాదు... ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ బాధించే అంశం. రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ స్వరం విప్పాలి’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు విజయన్ .By honouring a film that spreads blatant misinformation with the clear intent of tarnishing Kerala’s image and sowing seeds of communal hatred, the jury of the #NationalFilmAwards has lent legitimacy to a narrative rooted in the divisive ideology of the Sangh Parivar. Kerala, a…— Pinarayi Vijayan (@pinarayivijayan) August 1, 2025 -
రజినీకాంత్ కూలీ అప్డేట్.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ విడుదల చేయనున్నారు.తాజాగా కూలీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రజినీకాంత్ పోస్టర్ను షేర్ చేస్తూ సెన్సార్ తమకు ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.#Coolie censored 🅰️ #Coolie releasing worldwide August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges @philoedit @ArtSathees @iamSandy_Off @Dir_Chandhru… pic.twitter.com/p2z6GEOb6K— Sun Pictures (@sunpictures) August 1, 2025 -
వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి
శాంతి కృష్ణ (Shanthi Krishna).. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మలయాళంలోనే కాదు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. తెలుగులో ప్రియురాలు అనే ఏకైక చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే ఇప్పటికీ తనకు హీరోయిన్గానే నటించాలనుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి కృష్ణ మాట్లాడుతూ.. మోహన్లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు నన్ను హీరోయిన్గా పరిగణించరు. హీరోయిన్గా చేస్తా...ఫహద్ ఫాజిల్, నివిన్ పౌలీ వంటి హీరోలకు తల్లిగా నటించాక నన్నెందుకు కథానాయికగా తీసుకోవాలనుకుంటారు? కానీ, ఇప్పటికిప్పుడు నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా.. మలయాళ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తారు. ఇప్పటికీ వారి మనసుల్లో నాకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చింది. శాంతి కృష్ణకు ఇప్పుడు 60 ఏళ్లు. కొన్నాళ్లపాటు బెంగళూరులో ఉన్న ఆమె ప్రస్తుతం కొచ్చిలో సెటిలైంది. ఇప్పుడు హ్యాపీగా ఉందిదీని గురించి నటి మాట్లాడుతూ.. నేను మళ్లీ కేరళకుట్టిగా మారిపోయాను. కొచ్చిలో ఇల్లు తీసుకున్నాను. దీనికి శ్రీకృష్ణం అనే పేరు పెట్టాను. శ్రీ కృష్ణుని ఆలయం పక్కనే మా ఇల్లు ఉండటంతో అదే పేరు నా నివాసానికి పెట్టుకున్నాను. పిల్లల చదువుల కోసం చాలా ఏళ్లు బెంగళూరులో ఉన్నాను. చివరకు నా మనసుకెంతో దగ్గరైన ప్రదేశంలోనే ఇల్లు తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాను. ఇక్కడికి షిఫ్ట్ అవమని నా స్నేహితులు పదేపదే చెప్పారు. మొత్తానికి ఇక్కడికి వచ్చేశాక మనసుకెంతో తృప్తిగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్బ్యాక్ -
హీరో భార్య 'అనొద్దన్న సెలబ్రిటీ వైఫ్'.. మిగిలిన హీరోల భార్యలు..?
ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఇచ్చిన ఒక సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్ భార్యగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు తన స్వంత కెరీర్లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్2: ఎంపురాన్‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ, నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా వెల్లడించడం హర్షణీయం.ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్ హీరో రామచరణ్ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా.. -
షూటింగ్ పూర్తి.. స్వయంగా భోజనాలు వడ్డించిన స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా వస్తోన్న తాజా చిత్రం సర్దార్-2. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సర్దార్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా సర్దార్–2 రూపొందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. అదిరిపోయే రెస్పాన్ వచ్చింది.ఇటీవలే సర్దార్-2 మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్రయూనిట్ సభ్యులకు మేకర్స్ భోజనాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హీరో కార్తీ స్వయంగా అందరికీ భోజనాలు వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ కార్తీ ది గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ మూవీలో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, మాళవికమోహన్, ఆషికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.Unseen 🚨😍Our man himself served briyani for the completion of the #Sardar2 shoot.@Karthi_Offl #Karthi #MrVersatileKarthi pic.twitter.com/JtxT0y5fPI— Karthi Trends (@Karthi_Trendz) July 31, 2025 -
క్యాస్టింగ్కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi)పై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్మీడియలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా స్పందించారు. తను నటించిన కొత్త సినిమా 'సార్ మేడమ్' విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్(CASTING COUCH) ఆరోపణల గురించి ఆయన్ను ప్రశ్నించగా రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని తెలిపారు. ఆమెపై సైబర్క్రైమ్లో తన టీమ్ పిర్యాదు చేసిందని చెప్పారు.తనపై వచ్చిన క్యాస్టింగ్కౌచ్ ఆరోపణల గురించి విజయ్ ఇలా అన్నాడు.. 'చిత్రపరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవు. కానీ, ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం, సన్నిహితులు చాలా కలత చెందారు. ఇలాంటి మాటలు ఇక్కడ సహజం. వాటిని వదిలేయమని నా కుటుంబాన్ని కోరాను. సోషల్మీడియాలో గుర్తింపు కోసమే ఆమె ఇలా చేస్తోందని అర్థం అవుతుంది. ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతుంది. ఆపై పేరు వస్తుంది. ఆమె దానిని ఆస్వాదించనివ్వండి.' అంటూ విజయ్ చెప్పారు.తనపై ఆరోపణలు చేసిన మహిళపై తన టీమ్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిందన్నారు. తాను ఏడు సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎన్నో ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు అలాంటివి తన లక్ష్యం మీద ప్రభావితం చేయలేదన్నారు. అది ఎప్పటికీ జరగదని బలంగా చెప్పారు.విజయ్పై వచ్చిన ఆరోపణ ఇదేకోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి (జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఇలా ఆరోపించింది. ‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. విజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. మళ్లీ మరో పోస్ట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది. -
బిగ్బాస్ బ్యూటీ ఇనయా గ్లామరస్.. బేబీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా స్టైలిష్ లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా చిల్..బేబీతో ఆడుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..సారా అలీ ఖాన్ బ్యూటీఫుల్ వీడియో..భర్తతో కలిసి లాస్య మంజునాథ్ ఫ్యాషన్ లుక్.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
'పెళ్లికి ముందే హద్దులు దాటితే'.. ఓటీటీకి సూపర్ హిట్ సినిమా
కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'డా..డా'. గణేశ్ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో రూ. 40 కోట్లు వసూలు చేసింది. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని ‘పాపా’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. పెళ్లికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ సందడి చేసేందుకు వస్తోంది. ఈ అర్ధరాత్రి నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పాపా మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో మోనిక చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ్, విటీవి గణేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన డా.. డా సినిమాను మూవీ నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో చూడలేని వారు ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
పృథ్విరాజ్ సుకుమారన్ ‘సర్ జమీన్’ మూవీ రివ్యూ
ఈ రోజుల్లో మంచి కోసం వెతకాలి, అయితే అదే చెడు గురించి ఆలోచిస్తే చాలు చుట్టూ చటుక్కున అల్లుకుపోతుంది. మనవాడు అనేవారు మనకోసం ఎప్పటికీ నిలబడతాడు, అలాగే పగవాడు మన పతనం కోసం ఆరాటపడతాడు. మంచిని దూరం చేసుకోని చెడు మార్గాన వెళుతూ మనవాడు కూడా పగవాడైతే అదే సర్ జమీన్ సినిమా.ఇదో దేశభక్తి స్ఫూర్తిగా అల్లుకున్న కథ. కాయోజీ ఇరానీ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో ముఖ్య పాత్రధారులుగా వర్ధమాన మళయాళ నటుడు పృథ్విరాజ్, బాలీవుడ్ నటి కాజల్ వంటి హేమాహేమీలే కాక ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కొడకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా నటించడం విశేషం.ఈ కథ ఓ ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. నాలుగంటే నాలుగు ముఖ్య పాత్రలు, రెండున్నర గంటల నిడివి తో దేశ సరిహద్దు వివాదాంశంపై సైనిక నేపధ్యంతో కూడిన సినిమా తీయడం అంటే మాటలు కాదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తాడు దర్శకుడు. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో కల్నల్ విజయ్ మీనన్ పోస్టింగ్ జరుగుతుంది. విజయ్ మీనన్ మహా దేశభక్తుడు. దేశమా, ప్రాణమా అంటేనే నిర్మొహమాటంగా దేశం అని ఎంచుకునే రకం. విజయ్ కి హర్మన్ అనే ఓ కొడుకుంటాడు. చిన్నప్పటి నుండి హర్మన్ చాలా భయస్తుడు. ఈ విషయంలోనే తన తండ్రి విజయ్ పై ద్వేషం పెంచుకుంటాడు హర్మన్. ఓ సారి తీవ్రవాదుల ఘర్షణలో హర్మన్ ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. తమ ముఖ్య అనుచరుడిని విడిపించాలని లేదంటే విజయ్ కొడుకుని చంపేస్తామని టెర్రరిస్టులు విజయ్ ని హెచ్చరిస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా తాను బంధించిన టెర్రరిస్టులపై కాల్పులు జరుపుతాడు విజయ్. ఆ తరువాత విజయ్, విజయ్ భార్య మెహర్ తమ బిడ్డ చనిపోయాడని భావిస్తారు. కాని తీవ్రవాదులు హర్మన్ కి తండ్రి మీదున్న ద్వేషాన్ని ఆయుధంగా చేసుకుని హర్మన్ ని తీవ్రవాదిగా తయారు చేసి మళ్ళీ విజయ్ దగ్గరకు పంపుతారు. ఆ తరువాత విజయ్ అతని భార్య తమ కొడుకు టెర్రరిస్ట్ అని కనిపెడతారా లేదా అన్నదే సినిమా. దేశం మీద మమకారం పెంచుకున్న తండ్రి వేదన గెలుస్తుందా... లేక తండ్రి మీద తనయుడు పెంచుకున్న ద్వేషం గెలుస్తుందా అన్నది హాట్ స్టార్ లోనే చూడాలి. ఈ సినిమా ఓ సూపర్ పేట్రియాటిక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ఇస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్.మస్ట్ వాచ్.- హరికృష్ణ, ఇంటూరు -
తెలుగు ట్రాన్స్ లేటర్గా నిత్యామీనన్.. స్టేజీపై నవ్వులే నవ్వులు!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సార్ మేడమ్'. రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్య, భర్తలుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ సేతుపతితో పాటు నిత్యామీనన్, డైరెక్టర్ పాండిరాజ్ కూడా హాజరయ్యారు.(ఇది చదవండి: 'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!)ఈ సందర్భంగా నిత్యామీనన్ తెలుగు ట్రాన్స్లేట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. డైరెక్టర్ పాండిరాజ్ తమిళంలో మాట్లాడగా.. ఆ వ్యాఖ్యలను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసింది. 'సార్ మేడమ్ సినిమా చాలా మంచి లవ్ స్టోరీ.. భార్య, భర్తల మధ్య జరిగే గొడవ.. కానీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ చాలా బాగా నటించారు.. వీళ్ల కన్నా బెటర్గా ఎవరూ చేయలేరు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్' అంటూ డైరెక్టర్ పాండిరాజ్ మాటలకు ట్రాన్స్లేటర్గా నిత్యామీనన్ అందరికీ నవ్వులు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు. -
కూలీ పవర్ఫుల్ సాంగ్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.ఈ నేపథ్యంలోనే పవర్ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. పవర్హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)కాగా.. కూలీ ట్రైలర్ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'కింగ్డమ్ మూవీ.. నా లైఫ్లో ఫస్ట్ క్యారవాన్ సినిమా'
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. రిలీజ్కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో కింగ్డమ్ మూవీ మేకర్స్ హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్కు హాజరైన కింగ్డమ్ నటుడు వెంకటేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్లో నటించడం తన అదృష్టమని అన్నారు. ఎందుకంటే తనకు ఫస్ట్ క్యారవాన్ దొరికిన చిత్రం కింగ్డమ్ మాత్రమేనని వెంకటేశ్ ఆనందం వ్యక్తం చేశారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేశ్ కింగడమ్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వెంకటేశ్ మాట్లాడుతూ..'హలో హైదరాబాద్.. ఇలాంటి పెద్ద క్రౌడ్ను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైమ్. నాది కేరళ.. నాపేరు వెంకటేశ్.. మలయాళ ఇండస్ట్రీలో ఒక సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత చిన్నపాత్రలు, తమిళ సినిమాలో హీరో.. ఈరోజు కింగ్డమ్. ఈ రోజు క్షణాలకు నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈ జర్నీ పట్ల నాకు సంతోషంగా ఉంది. నాగవంశీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా లైఫ్లో క్యారవాన్ డోర్ దొరికిన మొదటి చిత్రం. ఇదే నాకు పెద్ద విషయం. మళ్లీ సితారా ఎంటర్టైన్మెంట్స్లో పనిచేయాలి. భవిష్యత్తులో హీరోగా చేయాలి' అంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఆ పని కోసం రూ. 2 లక్షలు ఆఫర్.. స్టార్ హీరోపై యువతి ఆరోపణలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్ చికిత్స పొందుతోందని సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్ని డిలీట్ చేసింది.అసలేం జరిగింది?కోలీవుడ్లో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్ సేతుపతే అని ఆరోపించింది.‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎక్కువైంది. ఇది జోక్ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్లో ఉంది. క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆఫర్ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్ చేసింది.అందుకే డిలీట్ చేశావిజయ్ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్ చేశావంటూ నెటిజన్స్ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్ చేసింది. కోపంతో ఆ ట్వీట్ పెట్టానని, అది అంత వైరల్ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్ను తొలగించినట్లు ఆ ట్వీట్లో పేర్కొంది.I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025 -
మరో ఓటీటీకి సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ కమెడియన్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం గరుడన్. విడుదలై మూవీతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సూరి లీడ్ రోల్లో నటించారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ రాసిన స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. అక్కడ హిట్ కావడంతో తెలుగులోనూ భైరవం పేరుతో రీమేక్ చేసి ఇటీవలే విడుదల చేశారు. తెలుగు వర్షన్లో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే గరుడన్ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని మరో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సన్ నెక్ట్స్ వేదికగా గరుడన్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో సూరితో పాటు శశి కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆర్ఎస్ దురైసెంథిల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. Power, loyalty, betrayal – when friends turn foes, the fight becomes deadly.Garudan is coming to SunNXT on August 1. Are you ready for the storm?#GarudanOnSunNXT #Garudan #TamilCinema #PowerAndBetrayal #SunNXT #ActionDrama pic.twitter.com/wrcLo57YRF— SUN NXT (@sunnxt) July 28, 2025 -
రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కూలీ'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోనికా సాంగ్తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా.. ఇటీవలే విడుదలైన పవర్ హౌస్ సాంగ్ రజినీకాంత్ ఫ్యాన్స్ను, ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL— Sun Pictures (@sunpictures) July 28, 2025 -
సూపర్ హీరోగా కల్యాణి.. అలరించేలా 'లోకా' టీజర్
ఇప్పటివరకు పలు భాషల్లో సూపర్ హీరో తరహా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ని లీడ్ రోల్లో పెట్టి ఇలాంటి మూవీని మలయాళంలో తీశారు. అదే 'లోకా'. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: దుల్కర్ సల్మాన్ 'కాంత' టీజర్ రిలీజ్)'హలో', 'చిత్రలహరి' లాంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన కల్యాణి ప్రియదర్శన్.. తర్వాత పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది. మిడ్ రేంజ్ మూవీస్లో నటిస్తూ కెరీర్ పరంగా బాగానే ఉంది. అయితే ఈమెని పెట్టి సూపర్ హీరో జానర్ మూవీ తీయడం విశేషం. 'లోకా'ని తెలుగులోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కల్యాణికి జోడిగా 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు) -
'మహావతార్ నరసింహా' కలెక్షన్.. ఆదివారం ఒక్కరోజే ఏకంగా
కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. అలా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్తో పాటు కళ్లు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.10 కోట్లకు పైన వసూళ్లు రావడం విశేషం.ఓవైపు 'హరిహర వీరమల్లు' లాంటి తెలుగు సినిమా పోటీ ఉన్నప్పటికీ.. 'మహావతార్ నరసింహా' స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోతోంది. తొలిరోజు కొన్ని థియేటర్లు దక్కగా.. రెండోరోజు, మూడో రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగింది. అదే రీతిన వసూళ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తొలిరెండు రోజుల్లో కలిపి రూ.5 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. మూడో రోజైన ఆదివారం మాత్రం దేశవ్యాప్తంగా రూ.11.25 కోట్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)ఈ లెక్కన చూసుకుంటే మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.20 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో 'హనుమాన్' తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాబట్టుకోలేకపోయాయి. ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్!) -
నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో..:కల్యాణి ప్రియదర్శన్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Kalyani Priyadarshan) లేకపోయుంటే తాను ఏమైపోయేదాన్నో అంటోంది హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. తనకు ఏ అవసరమొచ్చినా, ఎటువంటి సలహా కావాలన్నా ఎప్పుడూ అతడు అందుబాటులో ఉంటాడని చెప్తోంది. నేడు (జూలై 28) దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కల్యాణి సోషల్ మీడియాలో వేదికగా హీరోకు బర్త్డే విషెస్ తెలిపింది. ప్రియమైన D(దుల్కర్), ప్రతి ఏడాది నీకు సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఓ పెద్ద మెసేజ్ పంపుతాను.నేనెప్పుడూ ఒంటరిదాన్ని కానుకానీ ఈ సారి మన కలల ప్రపంచానికి సంబంధించిన (మూవీ) గ్లింప్స్ అందరితో షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్.. నిజ జీవితంలో, సినీ ప్రపంచంలో నువ్వు కన్న ప్రతి కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఐదేళ్లుగా నాకు ఏ సలహా కావాలన్నా ఫస్ట్ ఫోన్ నీకే చేస్తాను. అంతలా నాకు సపోర్ట్గా నిలబడ్డందుకు థాంక్యూ. నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదు. ఒకరకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాదు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అప్పటినుంచే స్నేహందుల్కర్, కల్యాణి.. 2020లో వచ్చిన మలయాళ చిత్రం 'వరణే అవశ్యముంద్'లో జంటగా నటించారు. అప్పుడే వీరు క్లోజ్ ఫ్రెండ్సయ్యారు. అప్పటినుంచి వీరి స్నేహం అలాగే కొనసాగుతూనే ఉంది. నేడు దుల్కర్ బర్త్డే సందర్భంగా.. అతడు నిర్మాతగా వ్యవహరిస్తున్న లోక, చాప్టర్ 1: చంద్ర సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలు చేసింది. -
10 ఏళ్లుగా డిప్రెషన్.. చనిపోతానని నాన్న ఎప్పుడో చెప్పాడు: జయసుధ కుమారుడు
జయసుధ (Jayasudha) తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు వంటి ప్రముఖులతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లిగా, అత్తగా సహాయక పాత్రలు పోషిస్తోంది. వెండితెరపై తిరుగులేని నటిగా కీర్తి గడించిన ఈమె జీవితాన్ని 2017లో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది. అదే ఆమె భర్త, నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య! ఈ ఘటనతో ఆమె కొంతకాలంపాటు డిప్రెషన్కు వెళ్లిపోయింది.అదే నాన్న బాధనితిన్ అలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాన్ని అతడి తనయుడు, నటుడు నిహార్ కపూర్ (Nihar Kapoor) వెల్లడించాడు. నిహార్ కపూర్ మాట్లాడుతూ.. నాన్నకు చిన్నవయసులోనే డయాబెటిస్ వచ్చింది. అయితే ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. జిమ్కు వెళ్లేవాడు. అయితే నాన్న నిర్మాతగా తీసిన సినిమాలు కొన్ని ఆడాయి. కొన్ని ఫెయిలయ్యాయి. అసలేవి చేసినా సక్సెస్ అవడం లేదు. ఓ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మధ్యలోనే ఆగిపోయింది. నాశనం చేస్తున్నానా?మరో సినిమా బాలీవుడ్ నిర్మాత ఎత్తుకుపోయాడు.. ఇలా చాలా విషయాలు ఆయన్ని ఎంతగానో బాధపెట్టాయి. నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్లో ఉన్నవారికి.. నా వల్ల నా చుట్టూ ఉన్నవాళ్లు బాధపడతారు. వారి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను వంటి ఆలోచనలు వస్తాయి. నాన్న విషయంలో అదే జరిగింది. ఏళ్ల తరబడి డిప్రెషన్లో ఉన్నారు. 10 ఏళ్లుగా అదే మాటచనిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. చచ్చిపోతానని దాదాపు 10 ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు. ఒకరోజు ముంబైలో తన బంగ్లాపై నుంచి దూకాడు. నిజానికి ఇది జరగడానికి ముందే ఓ ఫంక్షన్కు వెళ్లాలని కొత్త బట్టలు కొన్నాడు. అంతలోనే ప్రాణం తీసుకున్నాడు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి అమ్మకు చాలా సమయం పట్టింది అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. నిహార్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాలో నటించాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఏంటమ్మా అన్నావ్, ఇంకోసారి అను.. అనసూయపై మళ్లీ ట్రోలింగ్! -
దుర్గాదేవిగా నటి కస్తూరి.. 32 ఏళ్ల తర్వాత..
దాదాపు 35 ఏళ్ల తర్వాత తమిళంలో తెరకెక్కిన పురాణ కథాచిత్రం రాహుకేతు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రఖ్యాత దివంగత దర్శకుడు ఏపీ నాగరాజన్ రూపొందించిన భక్తిరస చిత్రాల తర్వాత ఇంతవరకు పురాణ గాథలతో రూపొందిన చిత్రాలు రాలేదని.. ఆ లోటును రాహుకేతు తీర్చనుందని చెప్తున్నారు. ఈ మూవీలో సముద్రఖని మహాశివుడిగా, నటి కస్తూరి దుర్గాదేవిగా, విగ్నేష్ శ్రీమహావిష్ణువుగా ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం థియేటర్స్ పతాకంపై శాంతి బాలచందర్ నిర్మించారు. ఎస్ ఆనంద్, వి. ఉమాపతి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ మాటలు పాటలను కలయిమామని కేపీ అరివానందన్ సమకూర్చగా తమిళమణి దురై బాలచందర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న విధులకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు తమిళమణి దురై బాలచందర్ మాట్లాడుతూ.. ఇది రాహు కేతువుల జన్మ వృత్తాంతం.. అలాగే ప్రజలపై వారి ప్రభావం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. దీనికి భరణి కుమార్ నేపథ్య సంగీతాన్ని అందించగా గిటారిస్ట్ సదానందం మూడు పాటలకు సంగీతాన్ని అందించారని చెప్పారు.చదవండి: పెళ్లి-పిల్లలు.. ఈ రెండూ కావాలి: మృణాల్ ఠాకూర్ -
కాంతిలా వచ్చావు...
‘‘ఎన్న సుగమ్ ఎన్న సుగమ్ ఉళ్ల.... ఇత్తనై నాళ్ ఎంగిరుంద పుళ్ల... ఇరుళ తేడుమ్ వెళక్కిల్ల... ఒళియా వంద ఎనక్కుళ్ల...’ (ఎంత సుఖం ఎంత సుఖం లోపల... ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ పోరి... చీకటిని వెతికే దీపం లేదు... కాంతిలా వచ్చావు నాలోపలికి) అంటూ సాగుతుంది ‘ఇడ్లీ కడై’లోనిపాట. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్తో విడుదల కానుంది.ఇందులో ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్గా నటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం అందించారు. ఆదివారం ‘ఎన్న సుగమ్...’పాటను విడుదల చేశారు. ధనుష్, నిత్యామీనన్ కాంబినేషన్లో ఈపాట సాగుతుంది. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. -
డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ!
మదంపట్టి రంగరాజ్ (Madhampatty Rangaraj).. తమిళనాడులో ఫేమస్ చెఫ్. కూకు విత్ కోమలి రియాలిటీ షో జడ్జిగా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఇతడు 'మెహందీ సర్కస్' సినిమాతో వెండితెరపై హీరోగా అడుగుపెట్టాడు. ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మరే సినిమా చేయలేదు. ఇకపోతే రంగరాజ్.. భార్య శృతికి విడాకులిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. భార్యతో విడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై రంగరాజన్ ఇంతవరకు స్పందించలేదు. పైగా అది తన వ్యక్తిగత విషయం అని మౌనంగా ఉన్నాడు.రెండో పెళ్లిమరోవైపు సెలబ్రిటీ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డాతో రంగరాజన్ ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. సదరు డిజైనర్.. ఇతడిని నా మనిషి అని సంబోధించడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. చివరకు అదే నిజమైంది. రంగరాజ్ ఆమెను రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మొదటి భార్యకు విడాకులివ్వకుండానే పెళ్లిపీటలెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.పెళ్లికి ముందే ప్రెగ్నెంట్గుడిలో సింపుల్గా జరిగిన పెళ్లి ఫోటోలను జాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం తను ఆరో నెల గర్భవతిని అని తెలిపింది. ప్రియురాలు గర్భం దాల్చడంతో రంగరాజ్ ఉన్నపళంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడన్నమాట! మరి ఈ వ్యవహారంపై అతడి మొదటి భార్య శృతి ఎలా స్పందిస్తుందో చూడాలి!రెండో భార్య ఎవరు?జాయ్.. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 24 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్గా పని చేసింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా నాలుగు అవార్డులు కూడా అందుకుంది. దాదాపు 12 ఏళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. విజయ్, శివకార్తికేయన్, విష్ణు విశాల్, జయం రవి, విక్రమ్ ప్రభు, ప్రభుదేవా, అనిరుధ్ రవించందర్, రెజీనా, కేథరిన్, జీవీ ప్రకాశ్.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల దగ్గర స్టైలిస్ట్గా పని చేసింది. View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa) View this post on Instagram A post shared by J Joy (@joycrizildaa)చదవండి: భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను: శ్రుతీహాసన్ -
భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించను: శ్రుతీహాసన్
‘‘కూలీ’ చిత్రంలో నేను చేసిన పాత్ర వ్యక్తిగతంగా, ఒక అమ్మాయిగా నాకు బాగా కనెక్ట్ అయింది. నా పాత్రలో మంచి భావోద్వేగం ఉంది. అమ్మాయిలు నా పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్, అద్భుతమైన యాక్షన్, మంచి కథ, భావోద్వేగాలున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని శ్రుతీహాసన్ తెలిపారు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు.కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. డి. సురేష్బాబు, ‘దిల్’ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ పంచుకున్న విశేషాలు. ⇒ నేనో మ్యూజిక్ ఆల్బమ్ కోసం లోకేశ్ కనగరాజ్గారిని కలిశాను. ఆ ఆల్బమ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన సర్ప్రైజింగ్గా ‘కూలీ’లోని నా పాత్ర గురించి చెప్పారు. ఆయన సినిమాలంటే డార్క్, గన్స్, యాక్షన్తో ముడిపడి ఉంటాయి.కానీ, ‘కూలీ’లో ఆయన చెప్పిన స్ట్రాంగ్ ఉమన్ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్గారి అమ్మాయిగా కనిపిస్తాను. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్... ఇలా చాలామంది స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరచి΄ోలేని అనుభూతి. ఇంతమంది సూపర్ స్టార్స్తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం ప్రతి ఆర్టిస్ట్కి దొరకదు... నాకు దొరికింది. అందుకే ‘కూలీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.⇒ నాన్నగారితో (కమల్హాసన్) ఆయనకు ఉన్న స్నేహం గురించి, అప్పటి వర్కింగ్ స్టైల్ గురించి ‘కూలీ’ సెట్స్లో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు రజనీకాంత్గారు. ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. నాగార్జునగారు తొలిసారి విలన్ పాత్ర చేశారు. తెలుగు ప్రేక్షకులందరూ ఆయన పాత్ర చూసి, చాలా సర్ప్రైజ్ అవుతారు. ఆమిర్ ఖాన్గారితో పని చేయడం స్పెషల్ ఎక్స్పీరియన్స్. లోకేశ్ కనగరాజ్ క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ⇒ ‘కూలీ’ సినిమా పూర్తిగా చూడలేదు. నా డబ్బింగ్ వెర్షన్తోపాటు ఇంకొన్నిపోర్షన్స్ చూశాను... చాలా అద్భుతంగా అనిపించింది. చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగడానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదమే అని భావిస్తున్నాను. నేను భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించలేదు... పనిని ఎంజాయ్ చేశాను. నాకు వచ్చిన ప్రాజెక్టుకి ఎంతవరకు న్యాయం చేయాలనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ ఒక మ్యుజిషియన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులోనూ కొన్ని కథలు విన్నాను... త్వరలోనే నా కొత్త సినిమా ప్రకటన ఉంటుంది. -
మేరా భారత్ మహాన్.. దేశభక్తి రగిలిస్తున్న స్టార్ హీరోలు
దేశ సరిహద్దుల్లో సైనికుల్లా, దేశంలో గూఢచారులుగా, ప్రభుత్వ నిఘా సంస్థల ప్రతినిధులుగా... ఇలా దేశం కోసం అహర్నిశలూ కష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో దేశభక్తిని చాటే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాయి. ఇలా ‘మేరా భారత్ మహాన్’ అంటూ దేశభక్తిని చాటి చెప్పేలా కొందరు హీరోలు చేస్తున్న సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ప్రభాస్ ఫౌజి వెండితెరపై ప్రభాస్ తొలిసారిగా సైనికుడిగా కనిపించనున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజి’ అనే టైటిల్ను అనుకుంటున్నారట. ఈ సినిమా మిలటరీ వార్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని తెలిసింది. అలాగే కొంత లవ్స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలోని వార్ సన్నివేశాల్లో ప్రభాస్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్గా ఉంటాయని, ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కొత్తగా మేకోవర్ అయ్యారని సమాచారం. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026 ద్వితీయార్ధంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.డ్రాగన్లో దేశభక్తి హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇది ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం సాగింది. కానీ ఇటీవల జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో వందేమాతరం అంటూ వందలమంది జూనియర్ ఆర్టిస్టులు చెబుతుంటే, ఓ భారీపాటను చిత్రీకరించారట. ‘వందేమాతరం’ అంటూ సాగే ఈపాట స్క్రీన్పై కనిపించే సమయంలో సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారట ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. దీంతో ఈ ‘డ్రాగన్’ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలకు చెందిన సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ విలన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ‘టైగర్ జిందా హై, ఏక్తా టైగర్, టైగర్ 3’ వంటి స్పై యాక్షన్ సినిమాల్లో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఆఫీసర్గా నటించి, మెప్పించారు సల్మాన్ ఖాన్. తాజాగా ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్పాత్రలో నటించనున్నారు. 2020లో గాల్వాన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో చిత్రాంగదా సింగ్ మరో లీడ్ రోల్ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది.ప్రస్తుతం తాను పోషించే ఆర్మీ ఆఫీసర్పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డైలీ కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా కోసం లడఖ్లో ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, గడ్డకట్టే చలిలో అక్కడ ఏడెనిమిది రోజులు లోయలో షూటింగ్ చేస్తామని, ఈ షెడ్యూల్ను తలచుకుంటే తనకు భయంగా ఉందని, కానీ తాను సిద్ధమౌతున్నానని సల్మాన్ ఖాన్ ఇటీవల ఈ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమా ప్రయాణం గురించి చె΄్పారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే వచ్చే రంజాన్కు విడుదల చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. భజరంగీ భాయిజాన్ 2: పది సంవత్సరాల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయిజాన్’ సినిమా మంచి ఎమోషనల్ థ్రిల్లర్గా విజయం సాధించింది. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని దేశభక్తి అంశాలు కూడా ఉన్నాయి. కాగా ‘భజరంగీ భాయిజాన్’ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నామని, వచ్చే ఏడాది ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఓ సందర్భంలో కబీర్ ఖాన్ పేర్కొన్నారు. కరీనా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు.మేజర్ షైతాన్ సింగ్ భారతదేశ సైనికుల వీరత్వాన్ని, ధైర్యాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ దర్శక–నటుడు ఫర్హాన్ అక్తర్. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ‘రెజాంగ్ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు. ఈ ఘటన ప్రధానాంశంగా బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘120 బహాదుర్’.ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రజనీష్ ఘాయ్ ఈ సినిమాకు దర్శకుడు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సినిమాను ప్రకటించారు. ‘‘1962లో జరిగిన ఇండియా–చైనా వార్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన ‘రెజాంగ్ లా’ యుద్ధాన్ని ఈ ‘120 బహాదుర్’ చిత్రంలో ఆడియన్స్ చూడబోతున్నారు. ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే మరో కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్ అక్తర్. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు.సైనికుడి వాగ్దానం సన్నీ డియోల్ హీరోగా నటించిన వార్ డ్రామా ‘బోర్డర్ (1997)’. 1971లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘బోర్డర్ 2’ రానుంది. ‘బోర్డర్’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ డియోల్ ఈ ‘బోర్డర్ 2’లోనూ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ సింగ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ సైనికుల వీరత్వం, ధైర్య సాహసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్ ఇండియాలోని ప్రముఖ లొకేషన్స్తోపాటు కశ్మీర్లోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం 27 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ పెద్ద వార్ ఫిల్మ్ ఇది’’ అని చిత్రయూనిట్ ఈ ‘బోర్డర్ 2’ సినిమా గురించి ఓ సందర్భంలో పేర్కొంది. వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ ప్రకటించింది.ఆపరేషన్ ఖుక్రీ పాతిక సంవత్సరాల క్రితం వెస్ట్ ఆఫ్రికాలోని సియోర్రా లియోన్లో జరిగిన ఆపరేషన్ ఖుక్రీ సంఘటన ఆధారంగా ఓ సినిమా రానుంది. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) పీస్ కీపింగ్ మిషన్స్లో భాగంగా వెస్ట్ ఆఫ్రికాకు వెళ్లిన 233 మంది భారత సైనికులు, అక్కడి రెబల్స్ ట్రాప్లో చిక్కుకుని, 75 రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్ను రాజ్ పాల్ పునియా సక్సెస్ఫుల్గా లీడ్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, రాజ్ పాల్ సాహసోపేతమైన నిర్ణయాలు వంటి అంశాల ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ అనే సినిమా రానుంది.‘ఆపరేషన్ ఖుక్రీ: ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ బ్రేవెస్ట్ పీస్ కీపింగ్ మిషన్ అబ్రాడ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా రానుంది. మేజర్ జనరల్ రాజ్ పాల్ పునియా, దామిని పునియా ఈ పుస్తకాన్ని రాయగా, ఈ బుక్ హక్కులను రాహుల్ మిత్రా ఫిల్మ్స్, రణ్దీప్ హుడా ఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ పుస్తకం ఆధారంగా ‘ఆపరేషన్ ఖుక్రీ’ రానుంది. ఈ సినిమాలో మేజర్ రాజ్ పాల్ పునియాగా రణ్దీప్ హుడా నటిస్తారు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.స్వాతంత్య్రానికి పూర్వం... భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, లండన్లో ఉన్న భారత మేధావులు కొందరు తరచూ సమావేశం అయ్యేవారు. ఈ సమావేశంలో భారతదేశానికి స్వాతంత్య్రం రావాలంటే ఏం చేయాలి? అనే వ్యూహ రచనలు, ప్రణాళికలను సిద్ధం చేసేవారు. ఈ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇటీవల ఈ సినిమా సెట్స్లో చిన్న ప్రమాదం జరగడంతో చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ఊపందుకోనుంది. 2026 చివర్లో ‘ది ఇండియా హౌస్’ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఆపరేషన్ సిందూర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన దేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన ఆధారంగా సినిమాలు తీసేందుకు కొందరు బాలీవుడ్ దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని, కొంతమంది కొన్ని టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఆల్రెడీ ఉత్తమ్ నితిన్ ఓ సినిమాను ప్రకటించారు. కానీ ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన జరుగుతున్నప్పుడే ఆయన సినిమాను ప్రకటించడంతో కాస్త వివాదాస్పదమైంది. మరి... ఉత్తమ్ తాను ప్రకటించిన సినిమాను సెట్స్పైకి తీసుకువెళ్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలా దేశభక్తి నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు ⇒ గూఢచారుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో కియారా అద్వానీ మరో కీలకపాత్రలో నటించారు. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఇక ‘వార్ 2’తోపాటు ‘యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్’లో భాగంగా రూపొందిన మరో చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావైల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆలియా భట్, శర్వారీ ఈ సినిమాలో స్పైపాత్రలు చేశారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. ఇక కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై డ్రామా ‘సర్దార్ 2’. పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తీ ద్వి పాత్రాభినయం చేశారు. ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అలాగే మన తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి 2’. ఎస్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు వామికా, ఇమ్రాన్ హష్మి ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇలా దేశభక్తిని చాటుకునే స్పై బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అవుతా :విజయ్ దేవరకొండ
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు. -
ఆ హీరోయిన్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచినవి కూడా ఉన్నాయి. ఫలితం ఎలా ఉన్నా సరే ఆయన సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘ఏ’ నుంచే ఆయన ప్రయోగాలు ప్రారంభించాడు. అప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ‘ఏ’ సినిమా కథనం సాగుతుంది. అందుకే కన్నడతో పాటు తెలుగులోనూ ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఉపేంద్ర చాలా కష్టపడాల్సి వచ్చిందట. సీనియర్ నటి సరోజా దేవి లేకపోతే ఆ సినిమానే రిలీజ్ అయ్యేది కాదని, ఇప్పుడు మీ కళ్ల ముందు ఇలా హీరోగా నేను ఉండేవాడినే కాదని ఆయన అన్నారు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన దివంగత నటి సరోజా దేవి సంతాప సభలో ఉపేంద్ర మాట్లాడుతూ.. సరోజ వల్లే తాను హీరో అయ్యానని చెప్పాడు. ‘నేను దర్శకత్వం వహించి నటించిన తొలి సినిమా ‘ఏ’కి సెన్సార్ సమస్య వచ్చింది. ఇలాంటి సినిమాని రిలీజ్ చేయకూడదని చాలా మంది అన్నారు. సెన్సార్ తిరస్కరించడంతో రివిజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సరోజా దేవి నాకు తోడుగా నిలిచింది. సినిమా చూసిన తర్వాత నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్లగానే సరోజా దేవి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె కారణంగానే మా సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఆమెను కలిసిన ప్రతిసారి ఈ విషయం గుర్తు చేసేవాడిని. ‘మీరే లేకపోతేను నేను హీరో అయ్యేవాడ్ని కాదు’ అని ఆమెకు చెప్పేవాడిని. రాజ్ కుమార్, విష్ణువర్థన్ మాత్రమే కాదు.. సరోజా దేవి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలి. ఆమె రెండు సార్లు సెంట్రల్ జ్యూరీ మెంబర్గా కూడా పని చేశారు. ఆమె సాధించిన విజయాలు ఏంటో అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు’ అని అని ఉపేంద్ర అన్నారు. -
వరల్డ్ ఫ్రెండ్షిప్ డే.. రష్మికతో ప్రముఖ సంస్థ ఒప్పందం..!
ప్రపంచవ్యాప్తంగా తొలిసారి స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ స్నాప్చాట్ ప్రత్యేక బహుమతి ప్రకటించింది. ఈ మేరకు హీరోయిన్ రష్మిక మందన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా భారతీయ స్నాప్చాట్ యూజర్లకు ప్రత్యేకమైన స్ట్రీక్ రిస్టోర్ను బహుమతిగా ఇవ్వనుంది. జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు ఇండియన్స్కు ఉచితంగా ఐదు ప్రత్యేక స్ట్రీక్లను పొందేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం స్నాప్చాట్ 'బెస్టీస్ బిట్మోజీ లెన్స్'ను కూడా ప్రారంభిస్తోంది. కాగా.. ఇటీవల ముంబయిలో జరిగిన 'స్నాప్ విత్ స్టార్స్' అనే క్లోజ్డ్ డోర్ ఈవెంట్లో ఇటీవల రష్మిక తన కొత్త పెర్ఫ్యూ మ్ బ్రాండ్ 'డియర్ డైరీ'ని ఆవిష్కరించింది. నా స్నేహితులే నా సర్వస్వం, వారే నా నిజ జీవిత డైరీ అని హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. నా కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'డియర్ డైరీ'తో నేను ఒక మధురమైన జ్ఞాపకం, అనుభూతిని పొందాలనుకున్నట్లు తెలిపారు. స్నేహితుల దినోత్సవానికి సంబంధించి స్నాప్చాట్తో ఈ భాగస్వామ్యం చాలా పరిపూర్ణంగా అనిపిస్తోందని వెల్లడించింది. ఎందుకంటే ఇది మనమందరం రోజులో జరిగే క్షణాలను, కథలను పంచుకునే వేదిక స్నాప్చాట్, 'డియర్ డైరీ' రెండూ మనం ఎప్పటికీ మర్చిపోలేనివని పేర్కొంది.పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక డియర్ డైరీ అనే కొత్త ఫర్ఫ్యూమ్ బ్రాండ్ను ప్రారంభించింది. ఇటీవలే పర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇది ఓ బ్రాండో.. లేదంటే ఫెర్ఫ్యూమో కాదని.. ఇది తనలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధరల విషయానికొస్తే రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి. -
గుండెలు పిండేసే చిత్రం.. హిట్టయితే బాగుండు: శృతి హాసన్
కొండంత ఆశ పెట్టుకున్న సినిమా ఆడకపోతే ఎంతో బాధగా ఉంటుంది. ఓ సినిమా విషయంలో తనూ అలాగే బాధపడ్డానంటోంది శృతి హాసన్ (Shruti Haasan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు నాకెంతో స్పెషల్. వాటికోసం చాలా కష్టపడ్డాను. అవి బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడనప్పుడు గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది.హృదయం ముక్కలైందిచాలామంది ఆ సినిమాను నమ్మి పని చేస్తారు. తీరా అది విజయం సాధించకపోయేసరికి దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. 3 సినిమా కమర్షియల్గా విజయం సాధించుంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ ఉంది. ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడవన్నీ లేవు. 3 సినిమా హిందీలోకి డబ్ చేశాం. కానీ, ఓటీటీలు లేవు. ఆ మూవీ ఇప్పుడు రిలీజయ్యుంటే కొలవెరి సాంగ్ కంటే కూడా 3 చిత్రమే పెద్ద హిట్టయ్యేది. అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేస్తే బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందేవి అని చెప్పుకొచ్చింది.3 మూవీలో ధనుష్, శృతిహాసన్సినిమాకాగా శృతిహాసన్ ప్రస్తుతం కూలీ మూవీ చేస్తోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు. లోకేశ్ కగనరాజ్ దర్శకత్వం వహించగా అనిరుధ్ సంగీతం అందించాడు. 3 సినిమా విషయానికి వస్తే.. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (ధనుష్ మాజీ భార్య) దర్శకత్వం వహించింది. ఈ సినిమా విషాదకరమైన క్లైమాక్స్తో ముగుస్తుంది. గుండెల్ని పిండేసే ఈ చిత్రం 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా రీరిలీజ్ అయినప్పుడు మాత్రం హిట్టుగా నిలవడం విశేషం. చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్ -
సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తా: పుష్ప విలన్
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్నాళ్లూ బాగా సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. అయితే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil).. సినిమాలు మానేశాక కూడా పని చేయాలనుకుంటున్నాడు. అవును, యాక్టింగ్కు గుడ్బై చెప్పిననాడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తానని గతంలో కూడా అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. బోర్ కొట్టాక అదే చేస్తాఫహద్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నన్ను చూసి బోర్ కొట్టినప్పుడు సినిమాలు మానేసి స్పెయిన్లోని బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తాను. జనాలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే సంతృప్తికరమైనది మరోటి లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా డ్రైవర్గా మారిపోతాను. అప్పుడు నేను డ్రైవింగ్ చేయడంతోపాటు చుట్టూ ఉన్న పరిసరాలను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది. వ్యక్తిత్వ వికాసానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నాడు.రిటైర్ అయ్యాక అక్కడే..కాగా ఫహద్.. భార్య నజ్రియాతో కూడా ఎప్పుడూ ఇదే మాట చెప్తుంటాడు. రిటైర్మెంట్ తర్వాత బార్సిలోనాలో సెటిలైపోయి డ్రైవర్గా పని చేస్తానని పలుమార్లు చెప్పాడు. అందుకు నజ్రియా కూడా సంతోషంగా ఒప్పుకుందట! ఫహద్ ఫాజిల్.. ఆర్టిస్ట్, బెంగళూరు డేస్, కుంబలంగి నైట్స్, ట్రాన్స్, ఆవేశం వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో విలన్గా మెప్పించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి.చదవండి: 'మడిసన్నాక కూసంత కలాపోసనుండాల'.. నేటికీ ఈ డైలాగ్స్.. -
తెర వెనుక గాయం.. అయినా తగ్గేదే లే
వెండితెరపై హీరోలు కావొచ్చు లేదా హీరోయిన్లు కావొచ్చు... విలన్లను, రౌడీ మూకలను రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు ఆ కిక్కే వేరు. కొన్ని సన్నివేశాల కోసం ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడం, వాహనాలపై నుంచి జంప్ చేయడంతో పాటు పలు రిస్కీ సన్నివేశాలకు సై అంటుంటారు కథానాయకులు. అయితేపోరాట సన్నివేశాల్లో కొందరు డూప్స్ని వాడుతుంటారు. మరికొందరైతే రియాలిటీ కోసం డూప్లను కాదని స్వయంగా వారే యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటుంటారు.అయితే ఆపోరాట సన్నివేశాల చిత్రీకరణ అన్నది ఆషామాషీ కాదు... ఎలాంటి గాయాల బారిన పడకుండా ఫైట్ సీన్స్ పూర్తి చేయడం అనేది నటీనటులతో పాటు స్టంట్మేన్, ఫైటర్స్తో పాటు ఇతర సాంకేతిక నిపుణులందరికీ ఓ సవాల్ లాంటిదే. షూటింగ్ సమయంలో నటీనటులకు గాయాలు సాధారణమే అయినప్పటికీ, కొన్నిసార్లు అవి తీవ్రంగా కూడా ఉంటాయి. ఈ కారణంగా వైద్యుల సూచనల మేరకు కొన్ని నెలల పాటు షూటింగ్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది యాక్టర్స్కి. చిన్న బ్రేక్ తర్వాత ‘అయినా తగ్గేదే లే’ అంటూ... మళ్లీ లొకేషన్లో ఫైట్స్లో విజృంభిస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి గాయాల బారిన పడిన నటీనటుల గురించి ఓ లుక్కేద్దాం.కాలికి గాయంహీరో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్), ‘స్పిరిట్’ వంటి చిత్రాలున్నాయి. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్లో ప్రభాస్ కాలికి గాయం అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 1945 నాటి బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఈ చిత్రకథలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నారట.దేశభక్తి, త్యాగం ఇతివృత్తాలుగా భారతదేశ స్వాతంత్య్రపోరాటం నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ని తీర్చిదిద్దారట హను. మిలటరీ ఆఫీసర్ రోల్ కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయట. అందులో భాగంగానే డూప్ లేకుండాపోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో గత డిసెంబరులో ప్రభాస్ కాలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఇటలీకి వెళ్లి అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు అక్కడే విశ్రాంతి తీసుకుని, ఇండియా తిరిగొచ్చారని టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే... ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.నో డూప్...బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పఠాన్ ’ (2023) వంటి భారీ హిట్ తర్వాత షారుక్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘కింగ్’. ఈ మూవీలో దీపికా పదుకోన్, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్లతో పాటు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలుపోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్, షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ‘కింగ్’ సినిమా కోసం ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో వేసిన అతి పెద్ద సెట్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.అందులో భాగంగా ఓ యాక్షన్ సీన్ లో షారుక్ ఖాన్ గాయపడ్డారని సమాచారం. రియాలిటీ కోసం ఆ సన్నివేశంలో డూప్ లేకుండా పాల్గొన్నారట షారుఖ్. ఆ సమయంలోనే గాయపడ్డారనే వార్తలు బాలీవుడ్లో హల్చల్ చేశాయి. అంతేకాదు... కండరాల నొప్పికి సంబంధించిన అత్యవసర వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్లారనే వార్తలు కూడా ఆన్ లైన్ వేదికగా చక్కర్లు కొట్టాయి. అయితే షారుక్ ఖాన్ కి గాయాలయ్యాయనే విషయంపై ఇటు ఆయన టీమ్ నుంచి కానీ, అటు ‘కింగ్’ చిత్రయూనిట్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ‘పఠాన్ ’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత షారుక్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘కింగ్’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది.కుడిచేతికి గాయంచేతినిండా వరుస సినిమాలతో దూసుకెళుతుంటారు హీరో రవితేజ. ఆయన నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో కీలకమైన ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గత ఏడాది ఆగస్టులో రవితేజ కుడి చేతికి గాయమైంది.అయితే తన గాయం కారణంగా షూటింగ్కి బ్రేక్ పడకూడదని చిత్రీకరణలో పాల్గొన్నారట రవితేజ. కానీ, నొప్పి తీవ్రం కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వెళ్లారాయన. చిన్నపాటి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చె΄్పారు. ఈ గాయం నుంచి కోలుకున్నాక ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. ‘మాస్ జాతర’ని మే 9న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే వాయిదా వేసి ఆగస్టు 27న రిలీజ్ చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్.వారం విశ్రాంతివైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ‘ఆవారా, యుగానికి ఒక్కడు, ఊపిరి, ఖైదీ, సర్దార్’ వంటి చిత్రాలతో తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. ‘సర్దార్ 2’ చిత్రం షూటింగ్లో ఆయన ఓ ఫైట్ సీన్ చిత్రీకరణలో గాయపడ్డారు. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్ లో రూపొందిన ‘సర్దార్’ చిత్రం 2022లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా వీరి కాంబినేషన్ లోనే ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది.ఈ మూవీలో మాళవికా మోహనన్ , ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా, ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మాతలు. మైసూరులో ‘సర్దార్ 2’ షూటింగ్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో కీలకమైన ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా కార్తీ కాలికి గాయమైంది. దీంతో ఆయన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా... పెద్ద ప్రమాదం ఏమీ లేదని.. జస్ట్ వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ మూవీ షూటింగ్ ఆపేసి చెన్నై వెళ్లి΄ోయారు కార్తీ. విశ్రాంతి తర్వాత ‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి చేశారు.మెడకు గాయం...‘మర్డర్, ఆషిక్ బనాయా ఆప్నే, మర్డర్ 2’ వంటి చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ యూత్లో మంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. హిందీలో వరుస సినిమాలు చేసిన ఆయన పవన్కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్ర చేస్తున్నారు. మరోవైపు అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జీ2’ (గూఢచారి 2’) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రపోషిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం గత ఏడాది అక్టోబరులో హైదరాబాద్ వచ్చారు ఇమ్రాన్ . ఓ యాక్షన్ సీన్ లో భాగంగా పై నుంచి దూకుతున్న క్రమంలో ఆయన మెడకు గాయమైంది. అయితే షూటింగ్ ఆగకూడదని ప్రథమ చికిత్స అనంతరం చిత్రీకరణలో పాల్గొన్నారు ఇమ్రాన్ .ముఖానికి గాయాలుబాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ప్రియాంకా చోప్రా. 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్కి మార్చేశారామె. హాలీవుడ్లో సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ‘ది బ్లఫ్’ అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్లో ఆమె గాయపడ్డారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్రపోషిస్తున్నారు. ఈ సినిమా కోసం గత ఏడాది జూన్ లో ఆస్ట్రేలియాలో ప్రియాంకా చోప్రాపై ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది.ముఖ్యంగా ముఖంపై గాయాలు అయ్యాయి. ఆమె పెదవి, ముక్కు, మెడకు దెబ్బలు తగిలాయి. ఆ ఫొటోలను ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసి, ప్రోఫెషనల్ లైఫ్లో జరిగే ప్రమాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ప్రియాంక గాయపడటంతో వెంటనే చిత్రయూనిట్ షూటింగ్ ఆపేసి.. ఆమెను సిడ్నీలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ‘ది బ్లఫ్’ షూటింగ్లో పాల్గొన్నారు ప్రియాంక. ఇదిలా ఉంటే.. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ సినిమాలో ప్రియాంక ఓ కీలక పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే.చేతులకు, కాళ్లకు గాయాలు... అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రపోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుందట. ఈ ఘటనలో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రమాదవశాత్తు కింద పడటంతో చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయట.అయితే చిత్రీకరణకు ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో సెట్స్లోనే ప్రథమ చికిత్స అనంతరం వారిద్దరూ షూటింగ్ను కొనసాగించి తమ సన్నివేశాలను పూర్తి చేశారని టాక్. అయితే ఈ ప్రమాదంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే... ఈ సినిమా కోసం మదనపల్లె యాసలో డైలాగులు చెబుతున్నారు అడివి శేష్. ‘డెకాయిట్’ క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుంది. గాయాలను లెక్క చేయకూడదు ‘ఊహలు గుసగుసలాడే, బెంగాల్ టైగర్, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే, తొలి ప్రేమ’ వంటి పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రాశీ ఖన్నా. ఆమె నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ఫర్జీ 2’. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఫర్జీ 2’ షూటింగ్లో భాగంగా ఈ ఏడాది మేలో రాశీ ఖన్నా గాయపడ్డారు. కథ డిమాండ్ మేరకు రిస్కీ యాక్షన్ సీన్స్లో ఆమె పాల్గొనగా ప్రమాదవశాత్తు స్వల్పంగా గాయపడ్డారు.అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘‘కథ డిమాండ్ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదు. మన గాయాలు కూడా ఒక్కోసారి మన శరీరం, శ్వాస మీద ప్రభావం చూపవచ్చు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు’’ అంటూపోస్ట్ చేశారు రాశీ ఖన్నా. ‘ఫర్జీ’ తొలి సిరీస్కి మంచి స్పందన రావడంతో ‘ఫర్జీ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్తో ‘ఉస్తాద్ భగత్సింగ్’, సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. -
అబ్బాస్ రీ ఎంట్రీ
‘ప్రేమదేశం’ (1996) ఫేమ్ అబ్బాస్ గుర్తుండే ఉంటారు. 1990–2015 మధ్య కాలంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్న అబ్బాస్ వెండితెరపై కనిపించి దాదాపు పదేళ్లయింది. 2015లో వచ్చిన ‘పచ్చకాలం’ అనే మలయాళ సినిమా తర్వాత అబ్బాస్ మరో సినిమాలో నటించలేదు. కాగా అబ్బాస్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. నటుడు– సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తమిళంలో ఓ సినిమా రానుంది. నూతన దర్శకుడు మరియరాజా ఇళంచెళియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అబ్బాస్ ఓ లీడ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. శ్రీ గౌరి ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుండగా, జయవర్ధనన్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పదేళ్ల తర్వాత అబ్బాస్ యాక్టర్గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే 2014లో వచ్చిన ‘అలా జరిగింది ఒక రోజు’ సినిమా తర్వాత అబ్బాస్ మరో తెలుగు సినిమా చేయని సంగతి తెలిసిందే. -
రజనీకాంత్గారిని విలన్గా చూపించాలనుకున్నా!: దర్శకుడు లోకేశ్ కనగరాజ్
రజనీకాంత్ను ఓ పవర్ఫుల్ విలన్గా చూపించే ప్రయత్నం మిస్ అయ్యిందని అంటున్నారు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. నాగార్జున, శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ‘కూలీ’ సినిమా ప్రయాణం గురించి లోకేశ్ కనగరాజ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘‘కూలీ’ సినిమా కంటే ముందు రజనీకాంత్గారికి ఓ పెద్ద కథ చెప్పాలనుకున్నాను. అందులో రజనీకాంత్గారిది విలన్ పాత్ర. మిగతా లీడ్ రోల్స్ హీరో పాత్రల మాదిరిగా ఉంటాయి. అయితే ఈ సినిమా నేను చేయడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. రజనీకాంత్గారు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో నా సినిమా కోసం ఆయన రెండు సంవత్సరాల కాలాన్ని వృథా చేయడం నాకు ఇష్టం లేదు.అదే సమయంలో నాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ సినిమాను వద్దనుకుని, ‘కూలీ’ సినిమా కథ చెప్పగా, రజనీకాంత్ గారు ఓకే చేశారు. అలా ఆయనతో ‘కూలీ’ సినిమా చేయడం జరిగింది. అయితే నా ‘ఎల్సీయూ’ (లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ‘కూలీ’ భాగం కాదు. అలాగే ‘కూలీ’ సినిమాలో ఓ మంచి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఈ సినిమా ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఇక ‘కూలీ’ సినిమా తర్వాత లోకేశ్ డైరెక్షన్లో ‘ఖైదీ 2’ సినిమా సెట్స్పైకి వెళ్తుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్తో ఓ సూపర్ హీరో మూవీ చేస్తారు లోకేశ్. ఇంకా కమల్హాసన్తో ‘విక్రమ్ 2’, సూర్యతో ‘రోలెక్స్’ వంటి సినిమాలు లైనప్లో ఉన్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు లోకేశ్. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ శుక్రవారం 14 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారాంతంలో మిమ్మల్ని అలరించేందుకు బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమైపోయాయి. ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సందడి చేస్తోంది. ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వారాంతంలో తెలుగు సినిమా షో టైమ్తో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్, హిందీలో సర్జామీన్ మూవీ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.అమెజాన్ ప్రైమ్నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25మార్గన్(తమిళ సినిమా)- జూలై 25సన్ నెక్స్ట్షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25నెట్ఫ్లిక్స్మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25ది విన్నింగ్ ట్రై- (కొరియన్ మూవీ)- జూలై 25ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25హ్యాపీ గిల్మోర్-2- (హాలీవుడ్ కామెడీ చిత్రం) - జూలై 25ఆంటిక్ డాన్-(హాలీవుడ్ హారర్ మూవీ)- జూలై 25జీ5సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25 -
ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. కోట్లు పెట్టి కొన్న సినీతారలు వీళ్లే..!
బుర్జ్ ఖలీఫా.. ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దుబాయ్లోని ఆకాశసౌధం ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. దుబాయ్ ట్రిప్ వెళ్లినవారు అక్కడ తప్పకుండా ఫోటోలు తీసుకోకుండా ఉండలేరు. అంతలా పర్యాటకంగా బుర్జ్ ఖలీఫా ఫేమస్ అయింది. అయితే ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంత ఎత్తైన శిఖరంలా కనిపించే ఈ ఆకాశం సౌధంలో నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్కు చిరునామాగా మారిన ఈ బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.ఈ ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనంలో నివసించాలని ఎవరు కోరుకోరు. ఎన్ని కోట్లైనా సరే పెట్టేందుకు బడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు క్యూ కడతారు. అలా ఈ ఆకాశ సౌధంలో మన సినీతారలు సైతం అపార్ట్మెంట్స్ కొనేశారు. ఇందులో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఖరీదైన ఫ్లాట్లను తమ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి ఈ ఫ్లాట్ బహుమతిగా లభించింది. ఆమె భర్త, నటుడు రాజ్ కుంద్రా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్ను తన సతీమణికి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమె విలాసవంతమైన నివాసం 19వ అంతస్తులో ఉంది. దీని విలువ దాదాపు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.మోహన్ లాల్ స్వర్గధామం..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఆయన 29వ అంతస్తులో లగ్జరీ ఫ్లాట్ను కొన్నారు. దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 3.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ ఫ్లాట్ను మోహన్ లాల్ తన భార్య సుచిత్ర మోహన్లాల్ పేరు మీద రిజిస్టర్ చేశారు. వీరితో పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్కు ఈ భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు అని ముద్దుగా పిలుస్తారట. -
నటుడు జయం రవి పిటిషన్ కొట్టివేత
ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న నటుడు రవిమోహన్ (జయం రవి). ఈయన భార్యతో వివాహ రద్దు కేసు కోర్టులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయని కనిష్కతో ప్రేమాయణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిని నిజం చేసే విధంగా నటుడు రవిమోహన్ గాయనీ కనిష్కతో ఆలయాలకు, ఇతర కార్యక్రమాలకు కలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈయన గాయని కనిష్కతో కలిసి సంగీత కచేరిలో భాగంగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ మంత్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే రవిమోహన్ తన సంస్థకు రెండు చిత్రాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని, అందుకు గానూ ఆయనకు రూ.6 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు, అయితే ఆయన తమ సంస్థకు చిత్రాలు చేయకుండా వేరే సంస్థలకు చేస్తున్నారని, అడ్వాన్స్ తిరిగి చెల్లించమని కోరినా , ఇవ్వడం లేదని బాబీ టచ్ గోల్ల్ యూనివర్సల్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నటుడు రవిమోహన్ కూడా తాను కేటాయించిన కాల్షీట్స్ను వాడుకోకుండా వృథా చేసినందుకు గానూ ఆ సంస్థే తనకు నష్ట పరిహారంగా రూ.9 కోట్లు చెల్లించాలని కోరుతూ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిగింది. కాగా తాజాగా న్యాయస్ధానంలో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసు పరిష్కారం కోసం ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ, నటుడు రవిమోహన్ పిటిషన్ను కొట్టి వేసింది. అంతే కాకుండా నటుడు రవిమోహన్ రూ.5.9 కోట్లకు సంబంధించిన పత్రాలను 4 వారాలలోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. -
నిద్రలేని రాత్రులు.. అయినా గర్వంగానే ఉంది: విజిల్ నటి
ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కూతురు, హాస్య నటి ఇంద్రజ (Indraja Shankar) ఈ ఏడాది ప్రారంభంలో తల్లిగా ప్రమోషన్ పొందింది. 2024 మార్చిలో తన స్నేహితుడు, డైరెక్టర్ కార్తీక్తో ఇంద్రజ ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే! అదే ఏడాది ఆగస్టులో గర్భం దాల్చానంటూ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు ఏడో నెలలో అడుగుపెట్టడంతో నటి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వంగా భావిస్తున్నా..నా సంబరాల మూటకు ఆరు నెలలు నిండాయి. ఇప్పుడు ఏడో నెలలోకి వచ్చాడు. ఏడు నెలల క్రితం నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్నే మార్చేశావు. నీ చిరునవ్వులకు, నీ కౌగిలింతలకు.. ఆఖరికి నాకు అందించిన నిద్రలేని రాత్రులను కూడా నేనెంతో గర్వంగా భావిస్తున్నాను నక్షత్రన్ అని రాసుకొచ్చింది. ఈ మేరకు తన ప్రెగ్నెన్సీ జర్నీ నుంచి బాబును ఎత్తుకునే క్షణాల వరకు సంబంధించిన ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్ను జత చేసింది.సినిమాకాగా ఇంద్రజ తండ్రి.. రోబో డ్యాన్స్తో ఫేమస్ అవడంతో రోబో శంకర్గా పాపులర్ అయిపోయాడు. ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రం అతడికి బాగా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదికి 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. దాదపు తమిళ స్టార్ హీరోలందరితోనూ పని చేశాడు. ఇంద్రజ విషయానికి వస్తే దళపతి విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్), విశ్వక్సేన్ పాగల్, కార్తీ విరుమాన్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. పలు టీవీ షోలలోనూ కనిపిస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) చదవండి: నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్ -
శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్ డ్యాన్స్కు హీరో ఫిదా!
ఇటీవల సినీ ప్రియులను ఓ రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఈ మాస్ సాంగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్తో అదరగొట్టేసింది.అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈ పాటకు కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే ఆ బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్ విద్యార్థిని టాలెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari. Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra— Kireeti (@KireetiOfficial) July 23, 2025 -
ఇదెక్కడి విడ్డూరం.. బిర్యానీ కట్ చేసి.. ఇలా కూడా చేస్తారా?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవలే మార్గన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. మరో మూవీతో వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న భద్రకాళి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది విజయ్ ఆంటోనీ కెరీర్లో 25వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా భద్రకాళి మూవీ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ ఈవెంట్కు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో విజయ్ ఆంటోని బర్త్ డే వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈవెంట్లో కేక్కు బదులు బిర్యానీని కట్ చేసి రోటీన్కు భిన్నంగా బర్త్ డే జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు కేక్ ప్లేస్లో బిర్యానీ ఏంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో 'భద్రకాళి' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
సూర్య అంటే చేయూత!
సాక్షి, చెన్నై: సేవా గుణం కలిగిన అతి తక్కువ మంది తమిళ నటుల్లో సూర్య ముందుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఈ నటుడిలో ఎంత పెద్ద కథానాయకుడు ఉన్నాడో అంత మంచి విద్యాదాత ఉన్నారు. విద్యాదానంలో తన తండ్రి నటుడు శివకుమార్ను స్ఫూర్తిగా తీసుకొని సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక మందిని చదివిస్తూ వారి ఉన్నత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిభ ఉండి చదువుకునే స్థోమత లేని పేద విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థికసాయం, ప్రశంసా పత్రాలతో ప్రోత్సహిస్తున్నారు. ఈయన సేవా దాతృత్వం గురించి ఇటీవల స్టంట్ మాస్టర్ సెల్వ చెబుతూ గత పదేళ్లుగా సూర్య తమిళ సినిమాకు సంబంధించిన స్టంట్ మాస్టర్లకు ఏడాదికి అందరికి కలిపి రూ.10లక్షలు ఇన్సూరెన్స్ కడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఎవరితోనూ చెప్పలేదని పేర్కొన్నారు. అంతటి మానవత్వం కలిగిన సూర్య బుధవారం 50 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో నాలుగు రోజుల నుంచే ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడం మొదలుపెట్టారు. అలా సూర్య సేవా సంఘం తరఫున ఉత్తర చెన్నై ప్రాంతంలో రూ.2లక్షల విలువైన సేవా కార్యక్రమాలను నిర్వహించారు. కుట్టుమిషన్లు, 150 మంది మహిళలకు చీరలు, 50 మంది పురుషులకు పంచెలు, 150 మంది విద్యార్థులకు చదువు ఉపకరణాలు, 150 మంచి నీటి బిందెలు, పదిమంది వృద్ధులకు ఆర్థికసాయం అందించారు. ఈసేవా కార్యక్రమంలో 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ నిర్మాత రాజశేఖర్ పాండియన్ పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న 45వ చిత్రం కడుప్పు. ఈ చిత్రం దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన 46 వ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నారు. -
ఎంటర్టైనింగ్గా 'సూ ఫ్రమ్ సో' ట్రైలర్
ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా సరే ప్రస్తుతం విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులోనూ రీసెంట్ టైంలో అలా పలు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు విలేజ్ స్టోరీ హారర్ కామెడీ మిస్ చేసి తీసిన కన్నడ చిత్రం 'సూ ఫ్రమ్ సో'. ఈ నెల 25న అంటే శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ సంగతేంటి? ట్రైలర్ ఉందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్)'కాంతార' సినిమాలో హీరో రిషభ్ శెట్టి ఫ్రెండ్ పాత్రలు చేసిన నటులు ఈ మూవీలోనూ నటించారు. రిషభ్ శెట్టి ఫ్రెండ్ రాజ్ బి శెట్టి దీన్ని నిర్మించారు. 'సూ ఫ్రమ్ సో' విషయానికొస్తే.. కర్ణాటకలోని తీరప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరిలో అందరూ సంతోషంగా బతుకుతుంటారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో ఓ దెయ్యం ఆ ఊరికి వస్తుంది. అందరినీ భయపెడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చిందనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.మంగళవారం రాత్రి ఈ సినిమాకు ప్రీమియర్లు పడగా.. పాజిటివ్ టాక్ వచ్చింది. చూస్తుంటే ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా కనిపించింది. థియేటర్లలో తెలుగు రిలీజ్ లేదు గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీపై లుక్కేయొచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ)) -
విడాకుల బాటలో హన్సిక.. కారణం ఇదేనా?
అందానికి మారు పేరు హన్సిక(Hansika Motwani). ఈ ముంబై బ్యూటీ హిందీ, తెలుగు, తమిళం పలు భాషల్లో కథానాయకిగా నటించి పైస్థాయికి చేరుకుంది. అలా అర్ధ సెంచరీకి పైగా చిత్రాలు చేసిన హన్సిక ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శివకార్తికేయన్, సిద్ధార్థ్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. కాగా కథానాయకిగా బిజీగా ఉన్న సమయంలోనే 2022లో సోహల్ కత్తూరియా అనే వ్యాపార వేత్తని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఆడంబరంగా జరిగింది. కాగా సోహల్కు ఇది రెండో పెళ్లి. హన్సిక స్నేహితురాలితో ఆయనకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం గమనార్హం. కాగా పెళ్లయిన రెండేళ్లకే హన్సికకు, భర్తకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. సోహల్ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈవ్యవహారంపై ముంబైలోని మీడియా హన్సిక వర్గాన్ని సంప్రదించగా వారు అవునని కానీ కాదని కానీ స్పందించలేదని సమాచారం. అయితే సోహెల్ మాత్రం స్పందిస్తూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. అయితే ఆయన హన్సిక కలిసి ఉంటున్నారా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏదేమైనా పెళ్లికి ముందు నటించడానికి అంగీకరించిన కొన్ని చిత్రాలను పూర్తి చేయడానికి హన్సిక సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఆమె టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా, పాల్గొంటూ, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగానే ఉన్నారు. -
యాక్షన్ ఎంటర్టైనర్
‘మార్కో’ మూవీ ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. దర్శకుడు జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్ (యుఎమ్ఎఫ్)– ఐన్స్టీన్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది. దర్శకుడు జోషి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్. ‘‘హై యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది.జోషి డైరెక్షన్ లో వచ్చిన పలు చిత్రాలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆ అనుభవంతో ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్తో ఒక భారీ యాక్షన్ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారాయన. తన కెరీర్లో ఎప్పుడూ చూడని లుక్లో, మాస్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నారు ముకుందన్. యుఎమ్ఎఫ్– ఐన్స్టీన్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా బిగ్ పాన్ ఇండియా ఎంటర్టైనర్గా నిలవబోతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. -
రజినీకాంత్ కూలీ.. పవర్ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.తాజాగా కూలీ మూవీ ప్రమోషన్లలో భాగంగా థర్డ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. పవర్ హౌస్ అంటూ సాగే పవర్ఫుల్ లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పవర్ఫుల్ సాంగ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. వచ్చేనెల ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోగా గాలి జనార్ధన్ తనయుడు.. షూట్లో కారు రియల్ స్టంట్ చూశారా?
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘జూనియర్’. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా కనిపించగా.. జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూలై 18న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.ఈ నేపథ్యంలోనే హీరో కిరిటీ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ చిత్రంలోని ఓ సీన్కు సంబంధించిన ఒరిజినల్ షూట్ వీడియోను పంచుకున్నారు. కారుపై నుంచి కిరిటీ జంప్ చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించాడో ఈ వీడియోలో చూపించారు. ఈ షూటింగ్ స్టంట్ కోసం కష్టపడిన పీటర్ హెయిన్ మాస్టర్తో పాటు సిబ్బందికి హీరో ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్గా రిజల్ట్ ఇలా వచ్చిందంటూ వీడియోలో మూవీ సీన్ చూపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Behind the making of my stunt in #Junior Thanks to Peter Hein Master and all the stunt crew for ensuring my safety. pic.twitter.com/ua7eDQ08Eh— Kireeti (@KireetiOfficial) July 22, 2025 -
మహేశ్బాబుకు అతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది: ప్రముఖ ఎయిర్లైన్స్ పోస్ట్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. తొలిసారి దర్శకధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీని ఒడిశాలోని అందమైన లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీని ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్ అవుతున్నారు. మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్లకు వెళ్తుంటారు. ఇటీవల మహేశ్ బాబు శ్రీలంక ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్లైన్స్ తమ ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత సినీ స్టార్ హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు, మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేశ్బాబుతో సెల్పీ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది. మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేశ్బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో దట్ ఈజ్ ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.We had the pleasure of welcoming South Indian cinema icon Mahesh Babu on his journey from Hyderabad to Colombo with SriLankan Airlines!Our crew was delighted to host such a celebrated guest onboard.Thank you for flying with us.@urstrulyMahesh #SriLankanAirlines… pic.twitter.com/44euwfcfCB— SriLankan Airlines (@flysrilankan) July 21, 2025 -
షాపింగ్మాల్లో ఈ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తోందంటే?
అంగడి తెరు (Angadi Theru).. 2010లో వచ్చిన హిట్ మూవీ. ఇది తెలుగులో షాపింగ్ మాల్ (Shopping Mall Movie) పేరిట డబ్ అయి ఇక్కడా విజయం సాధించింది. ఈ సినిమాకుగానూ తెలుగమ్మాయి అంజలి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకుంది. అలాగే సౌత్ ఫిలింఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది. చెన్నైలోని టీ నగర్లో బట్టల దుకాణంలో పని చేసే ఉద్యోగుల సమస్యలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. సినిమాతో గుర్తింపు, పెళ్లిమహేశ్, అంజలి (Anjali) హీరోహీరోయిన్లుగా నటించారు. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి విజయ్ ఆంటోని, జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఈ మూవీలో అంజలి స్నేహితురాలిగా నటి సుగుణ యాక్ట్ చేసింది. అంజలితో పాటు తను కూడా బట్టల షాప్లో దుస్తులు అమ్ముతూ ఉంటుంది. ఈ మూవీకి అసోసియేట్ దర్శకుడిగా పని చేసిన నాగరాజన్ను పెళ్లి చేసుకుంది. నల్లగా ఉన్నా, నన్నెవరు ఇష్టపడతారు?అయితే షాపింగ్ మాల్ తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి సుగుణ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు, అందుకే వెండితెరపై మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకుని నడుపుతున్నాను. నేను నల్లగా ఉండటం వల్ల అందంగా లేనని బాధపడేదాన్ని. ఎవరూ నన్ను ప్రేమించరని అనుకునేదాన్ని. కానీ పెళ్లి తర్వాత ఆ ఆలోచనే పోయింది. బాధ తట్టుకోలేకపోయా..నన్ను ప్రేమించే భర్త దొరికాడు. అతడు వచ్చాక నా జీవితమే మారిపోయింది. అయితే పెళ్లయిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలవలేదు. ఎనిమిదో నెలలో కడుపులోనే బిడ్డ చనిపోయింది. ఆ బాధ తట్టుకోలేకపోయాను. కానీ, అప్పుడు నా భర్త సపోర్ట్గా నిలబడ్డాడు. తర్వాత మాకు ఓ కొడుకు పుట్టాడు అని సుగుణ చెప్పుకొచ్చింది.చదవండి: ఏయ్ బాబూ, ఫోన్ తీయ్.. హీరో వార్నింగ్.. వీడియో వైరల్ -
అజిత్ కుమార్ కారుకు డ్యామేజ్.. సిబ్బందికి సాయంగా నిలిచిన హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం కార్ రేసింగ్తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు టైటిల్స్ గెలిచిన ఆయన టీమ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న కార్ రేసింగ్లో పాల్గొంటోంది. అయితే ఈ రేస్లో అజిత్ కారు డ్యామేజ్కు గురైంది. దీంతో అతని టీమ్ రేసు నుంచి నిష్క్రమించింది. ట్రాక్ పక్కనే తన కారును ఆపేసిన అజిత్ కుమార్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి.ఇటలీలో జరుగుతున్న జీటీ4 యూరోపియన్ సిరీస్లో తన కారు ప్రమాదానికి గురి కావడంతో అజిత్ ట్రాక్ నిల్చుని ఉన్నారు. అక్కడే ఉన్న సిబ్బంది కారు డ్యామేజ్ కావడంతో విరిగినపడిన శిథిలాలను తొలగించేందుకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న అజిత్ కుమార్ వారికి సాయం చేశారు. కారు నుంచి ఊడిపోయి చెల్లాచెదురుగా పడిపోయిన వాటిని సిబ్బందికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అజిత్ కుమార్పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటన రెండవ రౌండ్ సమయంలో జరిగింది.ఇక సినిమాల విషయానికొస్తే ఈ ఏడాదిలో విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ కీలక పాత్రలో కనిపించారు. సునీల్, ప్రభు, ప్రసన్న, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.Out of the race with damage, but still happy to help with the clean-up.Full respect, Ajith Kumar 🫡📺 https://t.co/kWgHvjxvb7#gt4europe I #gt4 pic.twitter.com/yi7JnuWbI6— GT4 European Series (@gt4series) July 20, 2025 -
రైలు కింద పడేందుకు ట్రై చేసిన హీరోయిన్.. కాపాడిందెవరంటే?
సినిమా కోసం నటీనటులు కొన్నిసార్లు డేంజరస్ స్టంట్లు చేస్తుంటారు. అయితే మంజు వారియర్ రెండో సినిమాకే అలాంటి సాహస సన్నివేశంలో నటించిందట! ఆ సమయంలో తాను లేకపోతే సినీ ఇండస్ట్రీ గొప్ప నటి మంజు వారియర్ (Manju Warrier)ను కోల్పోయేదంటున్నాడు నటుడు మనోజ్ కె జయన్. మనోజ్, మంజు వారియర్ సల్లపం (1996) అనే మలయాళ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రాధగా మంజు నటనకు విశేష గుర్తింపు వచ్చింది. సల్లపం మూవీరైలు కింద పడేదిఅయితే సల్లపం షూటింగ్లో జరిగిన ఓ అనుభవాన్ని తనెప్పటికీ మర్చిపోలేనంటున్నాడు మనోజ్ (Manoj K Jayan). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మంజు వారియర్కు హీరోయిన్గా సల్లపం తొలి చిత్రం. క్లైమాక్స్లో హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నించాల్సి ఉంటుంది. వేగంగా వెళ్తున్న రైలు చక్రాల కిందపడేందుకు ప్రయత్నిస్తే నేను వెళ్లి ఆపాలి. మంజు తన పాత్రలో పూర్తిగా లీనమైపోయి నిజంగానే పట్టాలపై దూకేందుకు ట్రై చేసింది. శక్తినంతా కూడదీసుకున్నా..ఎటువంటి ఘోరం జరగకూడదని మనసులో ధృడంగా నిశ్చయించుకున్నాను. నా శక్తినంతా కూడదీసుకుని తనను గట్టిగా పట్టుకుని వెనక్కు లాగాను. ఏమాత్రం పట్టుతప్పినా తను రైలు కింద పడిపోయేది. షూట్ అయిపోగానే నాకు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తనను తిట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ షాట్ పర్ఫెక్ట్గా వచ్చిందని చిత్రయూనిట్ మెచ్చుకున్నారు. నేను ఆరోజు అక్కడ లేకపోయుంటే మలయాళ ఇండస్ట్రీ ఓ గొప్ప నటిని కోల్పోయేది అని చెప్పుకొచ్చాడు.సినిమాసల్లపం సినిమా (Sallapam Movie)లో దిలీప్తో ప్రేమలో పడ్డ మంజు వారియర్ రియల్ లైఫ్లోనూ అతడినే ప్రేమించింది. 1998లో దిలీప్ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పి ఫ్యామిలీకే సమయం కేటాయించింది. అయితే దిలీప్- మంజు వారియర్ 2015లో విడాకులు తీసుకున్నారు. అప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మంజు ప్రస్తుతం తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఇటీవల ఎల్2: ఎంపురాన్ అనే బ్లాక్బస్టర్ చిత్రంలో కనిపించింది.చదవండి: బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప -
జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్
2022లో వచ్చిన కన్నడ సినిమా 'కాంతార'.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించారు. అలా దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ సాగుతూనే ఉంది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయింది. ఈ క్రమంలోనే కొత్త అప్డేట్ వచ్చేసింది. 'వరల్డ్ ఆఫ్ కాంతార' పేరిట ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)'కాంతార-1' మూవీ ఎలా ఉండబోతుంది? సెట్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో చూచాయిగా చూపించారు. తొలి భాగంతో పోలిస్తే ఈసారి సెట్స్, గ్రాండియర్ కాస్త ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నా ఉరు, అక్కడి సంప్రదాయాలని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తీశానని, దీనికోసం మూడేళ్లపాటు కష్టపడ్డామని దాదాపు 250 రోజుల పాటు షూటింగ్ జరిపామని హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 2న మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్) -
మన చరిత్ర ఈ తరానికి తెలియాలి: దర్శకుడు అశ్విన్ కుమార్
‘‘మహావతార్ నరసింహ’ సినిమా మన చరిత్ర. ప్రతి తరానికి మన చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ తరం యువతకి మన చరిత్ర తెలియాలి. ఈ ఉద్దేశ్యంతోనే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను ఆరంభించాం. లైవ్ యాక్షన్ సినిమా కూడా చేయొచ్చు. కానీ ఎవరైనా హీరోగా నటిస్తే, ఆ హీరో ఇమేజ్ ఈ క్యారెక్టర్పై పడే అవకాశం ఉంది. అందుకే శ్రీ మహావిష్ణువు కథని చెప్పాలంటే యూనిమేషన్ అనేది ఒక ఉత్తమ మాధ్యమంగా మేం భావించాం. అందుకే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను యానిమేషన్లో చేస్తున్నాం’’ అని దర్శకుడు అశ్విన్ కుమార్ అన్నారు.శ్రీ విష్ణువు దశావతారాల ఆధారంగా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ రూపొందుతోంది. ఈ యూనివర్స్ నుంచి తొలి భాగంగా ‘మహావతార్ నరసింహ’ రానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ ఈ నెల 25న థియేటర్స్లో రిలీజ్ కానుంది. తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల అవుతోంది.ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో అశ్విన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘శ్రీ మహావిష్ణువు దశావతారాలను బిగ్ కాన్వాస్లో ప్రజెంట్ చేయాలనే ఆలోచనతో ‘మహావతార్ యూనివర్స్’ను మొదలు పెట్టాం. ఈ కథని మేము శాస్త్రాల నుంచే తీసుకున్నాం. ఈ సినిమా చేసేప్పుడు సృజనాత్మకంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కోవిడ్ పరిస్థితులను ఫేస్ చేశాం. స్వామివారి ఆశీర్వాదం ఈ సినిమాపై ఉంది. వినోదంతో పాటు చరిత్ర, మన సంస్కృతి, ధర్మం... వంటి అంశాలు కూడా ఉన్నాయి. మా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘మహావతార్ పరశురాం’ ప్రీ ప్రోడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ‘‘మా యూనివర్స్ నుంచి ప్రతి రెండేళ్లకో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు నిర్మాత శిల్ప. -
కూలీ అనేది ఓ సవాల్
చేతిలో పార... తీక్షణమైన చూపులతో ‘కూలీ’లో శ్రుతీహాసన్ పోషించిన ప్రీతి పాత్ర లుక్ని విడుదల చేసినప్పుడే చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో ఆమెది నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అని, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయనే ఊహాగానాలు నెలకొన్నాయి. అయితే తన పాత్ర గురించిన వివరాలేమీ బయటపెట్టకుండా శ్రుతీహాసన్ ‘కూలీ’ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘‘కెమెరా ముందు నటీనటులకే కాదు... కెమెరా వెనక డైరెక్టర్కి కూడా ఈ సినిమా ఓ సవాల్. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అలాంటి కాన్సెప్ట్తో ఈ సినిమా తీశారు.లొకేషన్లో ప్రతి ఒక్కరూ వర్క్ మీదే ఫోకస్ పెట్టాం. సీన్స్ అన్నీ కూడా ఆ ఫోకస్ని డిమాండ్ చేశాయి. పైగా ఎక్కువగా నైట్ షూట్స్ చేశాం. నాకు నైట్ షూట్స్ అంటే చాలా ఇష్టం. సీన్ పర్ఫెక్ట్గా వచ్చేవరకూ లొకేషన్లో ఎవరూ నిద్రపోలేదు. ఇలా సెట్లో అందరూ చాలా ఉత్సాహంగా పని చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇలా అందరూ లీనమైపోతాం. ‘కూలీ’ అనేది నాకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చిన చిత్రం’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, అమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటించారు. ఆగస్ట్ 14న ‘కూలీ’ విడుదల కానుంది. -
రాముడిగా సూర్య, రావణుడిగా మోహన్బాబు, నేనేమో..: విష్ణు మంచు
మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) అని అందరికీ తెలుసు. ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా తీశాడు. అందులో తనే కన్నప్ప పాత్రను పోషించాడు. మహాభారత్ సీరియల్ డైరెక్ట్ చేసిన ముకేశ్ కుమార్ ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించాడు. జూన్ 27న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇటీవల రాష్ట్రపతి భవన్లోనూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.2009లోనే..అయితే విష్ణు.. కన్నప్ప కంటే ముందు రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని ప్రయత్నించాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మంచు మాట్లాడుతూ.. రావణుడి పుట్టుక నుంచి చావు వరకు ఏమేం జరిగిందనే కథంతా నా దగ్గరుంది. దీనిపై సినిమా తీయాలని నేను గతంలోనే అనుకున్నాను. ఈ ప్రాజెక్టులో సూర్య రాముడిగా నటిస్తే బాగుంటుందనుకున్నాను. ఇదే విషయం గురించి మాట్లాడేందుకు 2009లో సూర్యను కూడా సంప్రదించాను.హనుమంతుడిగా చేయాలనుకున్నా..రాఘవేంద్రరావును డైరెక్టర్గా అనుకున్నాను. అయితే రాఘవేంద్రరావుకు నేను హనుమంతుడి రోల్ చేయడం ఇష్టం లేదు. ఇంద్రజిత్తుడి పాత్ర చేస్తే బాగుంటుందన్నారు. రావణుడి పాత్ర మా నాన్న పోషించాల్సింది. స్క్రిప్టు.. డైలాగులు అన్నీ పూర్తయ్యాయి, కానీ బడ్జెట్ సమస్య వల్ల సినిమా పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో రామాయణ మూవీ చేస్తానో, లేదో కూడా తెలీదు! సీతగా ఎవరంటే?ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం రాముడిగా మళ్లీ సూర్యనే ఎంపిక చేసుకుంటాను. సీతగా ఆలియాభట్ను సెలక్ట్ చేస్తాను. రావణుడిగా మా నాన్నను కాకుండా ఎవరినీ ఊహించుకోలేను. హనుమంతుడి పాత్ర నేనే చేస్తాను. ఇంద్రజిత్తుగా సూర్య సోదరుడు కార్తీ, లక్ష్మణుడిగా కళ్యాణ్ రామ్, జటాయువుగా సత్యరాజ్ చేస్తే బాగుంటుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు.భారీ బడ్జెట్తో బాలీవుడ్లో రామాయణప్రస్తుతం బాలీవుడ్లో రామాయణ సినిమా తెరకెక్కుతోంది. నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణ నిలిచింది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్డే విషెస్ -
హీరోయిన్తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్
అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే విశాల్ (Vishal) పెళ్లిపీటలెక్కేవాడు, కానీ దానికి మరికొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. హీరో విశాల్.. హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhanshika)ను ఇదివరకే ప్రేయసిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే! ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ ఓ ఈవెంట్లో బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది.అదెప్పుడు పూర్తయితే అప్పుడే!దీనిపై విశాల్ స్పందిస్తూ.. మా పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. నడిగర్ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశాను. ఇంకో రెండు నెలలు ఆగలేనా? నడిగర్ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఆరోజు రెండు ప్రకటనలుఅయితే విశాల్ పుట్టినరోజయిన ఆగస్టు 29న రెండు గుడ్న్యూస్లు చెప్పనున్నాడట! ఒకటి నడిగర్ సంఘం భవంతి ప్రారంభోత్సవం గురించి, రెండోది తమ కొత్త పెళ్లి డేట్ గురించి! దీంతో ఆ రోజు కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం) భవన నిర్మాణం చాలామంది కల. ఈ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టారు. ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. సినిమాదీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు విశాల్. మొత్తానికి ఈ కల అతి త్వరలోనే పూర్తి కానుంది. సినిమాల విషయానికి వస్తే.. విశాల్ చివరగా మదగజరాజ మూవీతో అలరించాడు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా విశాల్కు గతంలో నటి అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లిపీటలెక్కడానికి ముందే ఎవరి దారి వారు చూసుకున్నారు.చదవండి: సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత -
సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత
చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్మెయిల్. తేజు అశ్విని, బిందు మాధవి కథానాయికలుగా నటించారు. మిస్సెస్ జేడీఎస్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై అమల్ రాజ్ నిర్మించిన మొదటి చిత్రం ఇది. ఎం.మారం కథా, దర్శకత్వం వహించగా శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చివర్లో..ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్, వసంత బాలన్, అధిక్ రవిచంద్రన్, నిర్మాత కదిరేసన్, ధనుంజయన్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమల్ రాజ్.. జీవీ ప్రకాశ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చివర్లో 8 రోజుల షూటింగ్ను పూర్తి చేయలేని సమయంలో జీవీ ప్రకాష్ తనకు అండగా నిలబడ్డారన్నారు. రుణపడి ఉంటాఏమీ ఆశించకుండా సగం పారితోషికం మాత్రమే తీసుకొన్నారని పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేయడంతో పాటు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసే వరకు హీరోనే కారకుడయ్యారన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నటుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. మారం ప్రతిభావంతుడైన దర్శకుడని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్న అమల్ రాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. నటి తేజుతో ఇంతకుముందు ఒక వీడియో సాంగ్ కోసం నటించానని అది బాగా వైరల్ అయిందని, ఆ విధంగా ఆమె ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యారని జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొన్నారు.చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే.. -
‘మిస్టర్ కార్తీక్’ మళ్లీ వస్తున్నాడు
ధనుష్ హీరోగా రిచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం ‘మయక్కమ్ ఎన్న’ (2016). శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్స్టోరీకి మంచి ఆదరణ దక్కింది. జీవీ ప్రకాశ్కుమార్ అందించిన పాటలకూ మంచి స్పందన లభించడంతో మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలిచింది. ధనుష్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న ‘మిస్టర్ కార్తీక్’ టైటిల్తో రీ రిలీజ్ చేస్తున్నారు.ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో హీరో–హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల తమిళంలో మళ్లీ విడుదల చేయగా, మంచి విజయం దక్కింది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని కాడబోయిన బాబురావు పేర్కొన్నారు. -
ఫన్నీగా మోహన్ లాల్ 'హృదయపూర్వం' టీజర్
ఈ ఏడాది ఇప్పటికే ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ సినిమాలతో వచ్చిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు మరో చిత్రాన్ని రెడీ చేశాడు. 'హృదయపూర్వం' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ఓనం పండగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)యాక్షన్, థ్రిల్లర్ అంటూ గత రెండు చిత్రాలతో వచ్చిన మోహన్ లాల్ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్తో నవ్వించబోతున్నాడు. టీజర్తో ఆ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మోహన్లాల్కి జోడీగా మాళవిక మోహనన్ నటించింది. అలానే 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్ర పోషించాడు. సత్యన్ అంతికాడ్ దర్శకుడు. టీజర్ చూస్తుంటే మోహన్లాల్కి మరో హిట్ గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు) -
హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!
నీకై నేను, నాకై నువ్వు ఉంటే చాలు కదా... అని పాటలు పాడుకునేవారు హన్సిక (Hansika Motwani)-సోహైల్ (Sohael Khaturiya). ఈ జోడీకి ఎవరి దిష్టి తగలకూడదు అనేలా ఒకరినొకరు అపురూపంగా చూసుకునేవారు. అలాంటిది.. వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం మొదలైంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హన్సిక, సోహైల్ రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారట! హన్సిక తన తల్లితో.. సోహైల్ అతడి పేరెంట్స్తో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. విడివిడిగా..అయితే విడాకుల రూమర్స్ గురించి సోహైల్ స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. కానీ, వేర్వేరుగా జీవిస్తున్నారన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా హన్సిక- సోహైల్ 2022లో పెళ్లి చేసుకున్నారు. ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుందీ హీరోయిన్. గతేడాది డిసెంబర్లో కూడా సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది హన్సిక. దీన్ని బట్టి చూస్తే వీరు కలిసే ఉన్నారని తెలుస్తోంది. మరి తర్వాతేమైనా జరిగిందా? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.సోహైల్కు రెండో పెళ్లిఇదిలా ఉంటే సోహైల్.. గతంలో హన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్తో కనెక్ట్ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. అందులో హన్సిక.. సోహైల్ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది.చదవండి: గర్భంతో ఉన్నా యాక్షన్ సీన్స్.. మొదటిసారే మిస్క్యారేజ్ -
ఓటీటీలో కోర్ట్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చట్టం, పోలీస్ వ్యవస్థ ఈ రెండూ శక్తివంతమైనవే. అయితే ఒక్కోసారి ఈ రెండూ డబ్బుకు అమ్ముడుపోతుంటాయి. అలాంటప్పడు సామాన్యుడికి న్యాయం లభించడమనేది గగనంగా మారుతుంది. అయితే న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడే న్యాయవాదులు ఉంటారు. న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఓడిపోయినా.. డబ్బు ఎక్కువై విర్రవీగేవారితో, అవినీతిపరులైన డిపాంర్ట్మెంట్ అధికారులతో అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. చట్టముమ్ నీతియుమ్అందులో అవమానాలు, అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. అలాంటి ఒక న్యాయవాది ఇతి వృత్తంతో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ చట్టముమ్ నీతియుమ్ (Sattamum Needhiyum). నటుడు పరుత్తివీరన్ శరవణన్ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి నమ్రిత, అరుళ్ డీ.శంకర్, షణ్ముగం, తిరుసెల్వమ్, విజయశ్రీ, ఇనియరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. 18 క్రియేటర్స్ పతాకంపై శశికళ ప్రభాకరన్ నిర్మించారు. న్యాయాన్ని గెలిపించలేక..డబ్బుకు లోకం దాసోహం అవుతున్న తరుణంలో సామాన్యులకు న్యాయం అనేది అందని ద్రాక్షలాగే మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అమాయకుడికి న్యాయస్థానంలో న్యాయాన్ని అందించలేకపోయిన ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది అదే కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కాలం గడుపుకుంటాడు. దీంతో ఆయనకు ఇంటా బయట కనీస మర్యాద కూడా లేని పరిస్థితి. ఏ ఓటీటీలో అంటే?అలాంటి వ్యక్తి ఆవేశంతో, సమాజంపై కోపంతో.. తన కళ్ల ముందు జరిగిన దుర్ఘటనపై ప్రజావ్యాజ్యం వేస్తాడు. అప్పుడూ పరిహాసానికి గురవుతాడు. అతడు న్యాయం కోసం చేసే నిరంతర పోరాటమే చట్టముమ్ నీతియుమ్. పలు ఆసక్తికరమైన అంశాలతో సహజత్వానికి దగ్గరగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్లో పరుత్తివీరన్ శరవణన్ న్యాయవాదిగా ప్రధానపాత్ర పోషించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (జూలై 18) నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: హీరోయిన్ ఫామ్హౌస్లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం! -
గుడి ముందు భిక్షాటన చేసిన ప్రముఖ నటి నళిని
సీనియర్ నటి నళిని (Actress Nalini) వార్తల్లో నిలిచింది. మొదట్లో హీరోయిన్గా అలరించి, ఆ తర్వాత విలన్గా గడగడలాడిస్తూనే, కామెడీతో నవ్వించిన ఆమె చెన్నైలో భిక్షాటన చేసింది. తిరువేర్కడులో దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట శుక్రవారం కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేసింది. ఆమె చేసిన పనిని చూసి చాలామంది భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.కలలో కనిపించి..ఈ విషయం గురించి నళిని మాట్లాడుతూ.. అమ్మవారు కలలో కనిపించి తనకోసం ఏం చేస్తావని అడిగిందని చెప్పింది. తనకోసం ఏం చేయాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నానంది. వచ్చిన కానుకలను, డబ్బును ఆ తల్లికే కానుకగా సమర్పించాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.నళిని కెరీర్రజనీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ రణువ వీరన్ (1981) సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభమైంది. తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తర్వాత సహాయనటిగా, విలన్గా, కమెడియన్గానూ యాక్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇంటిగుట్టు, వీడే, సీతయ్య, పున్నమినాగు, నువ్వెకుండటే నేనక్కడుంటా, ఒక్క అమ్మాయి తప్ప వంటి చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం సీరియల్స్ చేస్తోంది. వ్యక్తిగత విషయానికి వస్తే.. నళిని 1988లో నటుడు రామరాజన్ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని కవలలు సంతానం. పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ అతడిని ప్రేమగా ఆరాధిస్తూనే ఉంటుంది నళిని.చదవండి: కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్? -
కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్?
ఓ పెద్ద హీరో సినిమా ఫ్లాప్ని మరో పెద్ద హీరో మందుపార్టీతో సెలబ్రేట్ చేసుకున్నాడు అంటూ ఆ మధ్య టాలీవుడ్ కేంద్రంగా ఒక వార్త గుప్పుమంది. అంతేకాదు తెలుగు హీరోల్లో సఖ్యత మేడిపండు చందమేననేది అనేక సార్లు బహిరంగంగానే రుజువైంది. తెలుగు సినిమా వజ్రోత్సవాలు మాత్రమే కాదు మరికొన్ని బహిరంగ కార్యక్రమాలు ప్రకటనలు కూడా టాలీవుడ్ హీరోలు ముఖ్యంగా సీనియర్స్ మధ్య స్నేహం ప్రొఫెషనల్ జెలసీలను దాటలేకపోయిందనేది వెల్లడించాయి. ఈ నేపధ్యంలో తాజాగా దక్షిణాదిన అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ల స్నేహ బంధంలోని గాఢత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో మిత్రుడు రజనీని ఇటీవలే కమల్ కలవడం శుభాకాంక్షలు స్వీకరించడం మనకు తెలిసిందే. ఇదే సమయంలో కమల్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కాపాడే బాధ్యతను రజనీ భుజాలకెత్తుకున్నాడనే మరో వార్త కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని చాటుతోంది.భారతీయుడు 3ని రక్షించడమే రజనీ తలకెత్తుకున్న ఆ బాధ్యత. తొలి భారతీయుడు’ ఓ బ్లాక్ బస్టర్ కాగా, ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘భారతీయుడు 2’(Bharateeyudu 3) రిలీజ్ టైంలోనే ‘భారతీయుడు 3’ షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయిపోయింది అని నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు అసలు కథ మొత్తం ‘3వ భాగం’ లోనే ఉంటుందని దర్శకుడు శంకర్ చెప్పడం కూబి జరిగింది. సాధారణంగా పార్ట్ 2 ప్లాప్ అయితే పార్ట్ 3 ని దక్షిణాదిలో దర్శక నిర్మాతలు అటకెక్కించేస్తారు. హాలీవుడ్, బాలీవుడ్లో మాత్రం హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సీక్వెల్స్ కొనసాగిస్తారు. కానీ సౌత్ లో ఇప్పటి వరకు .ఒక్క భారతీయుడు మాత్రమే ఆ ఘనతను స్వంతం చేసుకోనుంది. కాకపోతే ఇప్పుడు భారతీయుడు 3 చుట్టూ రకరకాల సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా ‘2వ భాగం’ ప్లాప్ అయ్యింది కాబట్టి.. ‘3వ భాగం’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అంతేకాక గేమ్ ఛేంజర్ తర్వాత దర్శకుడు శంకర్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ నేపధ్యంలో భారతీయుడు 3’ కంప్లీట్ అవ్వాలంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా’ ముందుకు వచ్చి ధైర్యం చేసి మరి కొంత బడ్జెట్ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాక మరోపక్క ‘లైకా’ సంస్థ నిర్వాహకులకూ హీరో కమల్ హాసన్ కి కూడా మనస్పర్థలు ఉన్నాయని సమాచారం. కాబట్టి.. ఇది అంత సులభంగా తెగే వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో రజినీకాంత్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కమల్, మరోవైపు లైకా వారితో రజినీకాంత్ కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్ ఇద్దరితో మాట్లాడి.. ‘భారతీయుడు 3 మిగిలిన భాగం పూర్తయేలా చొరవ తీసుకోనున్నట్టు సమాచారం. అదే జరిగితే దర్శకుడు శంకర్ కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఏదేమైనా... తన సమకాలీకుడైన పోటీ హీరో చిత్రం సమస్యల్లో ఇరుక్కుంటే సంతోషించడం కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగడం రజనీకాంత్ గొప్పతనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ తరహా అసూయా ద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని అలవరచుకోవడమే తెరబయట కూడా చూపే నిజమైన హీరోయిజం అనేది నిర్వివాదం. -
రేయ్.. ఒక్కసారి కలువురా.. రష్మికను తల్చుకుని ప్రేరణ ఎమోషనల్
బుల్లితెర నటి, బిగ్బాస్ బ్యూటీ ప్రేరణ కంభం (Prana Kambam).. టీవీ షోలలోనే ఎక్కువగా కనిపిస్తోంది. భర్త శ్రీపాదతో కలిసి ఆ మధ్య ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ కప్పు కొట్టేసింది. ప్రస్తుతం కన్నడలో క్వాల్టీ కిచెన్ అనే కామెడీ షోలో పాల్గొంటోంది. హీరోయిన్ రష్మిక మందన్నా ఈమెకు క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే! తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది ప్రేరణ. బద్ధకం ఎక్కువేప్రేరణ మాట్లాడుతూ.. నాకు బద్ధకం ఎక్కువ. ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా బద్ధకమనిపిస్తుంది. నా భర్త శ్రీపాద్తో నేను సంతోషంగా ఉన్నాను. అయితే మా లవ్స్టోరీలో ఏ గొడవలు లేవని చెప్పను. మేము కూడా బ్రేకప్ చెప్పుకున్నాం. నటిగా నా మొదటి ప్రాజెక్టులో హీరో చెంపపై ముద్దుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బందిపడ్డాను. ఇకపోతే శ్రీపాద్తో గొడవలైనప్పుడు ఇదంతా నేను తట్టుకోలేను అని బ్రేకప్ చెప్పాను. కానీ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లం.రష్మికతో మల్టీస్టారర్రష్మిక మందన్నా నాకు క్లోజ్ ఫ్రెండ్. 'నేను తెలుగులో స్టార్ అవుతా.. రష్మిక కన్నడలో స్టార్ అవుతుంది.. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలి' అని రష్మిక కుటుంబసభ్యులు నాతో అనేవారు. నేను కూడా చాలా అనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. ఒకప్పుడైతే తనకు నేను గుర్తున్నాను, మరి ఇప్పుడు గుర్తున్నానో, లేదో నాకు తెలియదు. (రష్మికను ఉద్దేశిస్తూ) రేయ్, ఒకసారి నన్ను కలవరా.. అని ప్రేరణ ఎమోషనల్గా మాట్లాడింది. ఇది చూసిన అభిమానులు.. ప్రేరణ, రష్మిక కలిస్తే చూడాలనుందని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఛావాను దాటేసిన చిన్న మూవీ.. ఏకంగా 1200 % లాభాలు! -
దక్షిణాది సినీ అవార్డుల సంబురం.. తేదీ, వేదిక ఫిక్స్!
దక్షిణాదిలో ప్రతిష్టాత్మక సినీ పండుగ తేదీలు ఖరారు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో అందించే ప్రముఖ సైమా అవార్డుల వేడుక జరిగే వేదికను కూడా నిర్ణయించారు. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ అవార్డుల వేడుకను దుబాయ్లోనే నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు నిర్వాహకలు వెల్లడించారు.దక్షిణాది సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందజేయనున్నారు. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరిట 12 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన నామినేషన్స్ జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. గత రెండేళ్లుగా ఈ వేడుకను దుబాయ్లోనే నిర్వహిస్తున్నారు. ఈసారి అక్కడే సినీ అవార్డుల వేడుక సైమా జరగనుంది.The biggest celebration of South Indian Cinema is back!Dubai 5th & 6th SeptemberGet ready for SIIMA's 13th edition, where stars shine the brightest!@BrindaPrasad1 @vishinduri#SIIMA2025 #NEXASIIMA #SouthIndianCinema #dubai pic.twitter.com/AC2iihRNib— SIIMA (@siima) July 18, 2025 -
ఛావాను దాటేసిన చిన్న మూవీ.. ఏకంగా 1200% లాభాలు!
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. కంటెంట్ నచ్చితేనే థియేటర్కు వస్తామని ప్రేక్షకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కథ బాలేదంటే భారీ బడ్జెట్ మూవీ అయినా సరే మాకు అక్కర్లేదంటూ ముఖం చాటేస్తున్నారు. అలా కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. ఇలా ఎన్నో సినిమాలు బోల్తా కొట్టాయి.1200% లాభాలుఅయితే ఓ చిన్న చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా 1200% లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మూవీయే టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family Movie). ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక లాభాలు గడించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.7 కోట్లతో నిర్మించిన ఈ తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఐదు వారాల్లోనే..టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మొదటివారం కేవలం రూ.23 కోట్లు మాత్రమే రాగా.. మౌత్ టాక్ వల్ల రెండో వారం రూ.29 కోట్లు వచ్చాయి. ఐదు వారాలు తిరిగేసరికి ఏకంగా రూ.90 కోట్లు వసూలు చేసింది.ఛావాను వెనక్కు నెట్టిఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో విక్కీ కౌశల్ 'ఛావా' ముందు వరుసలో ఉంది. రూ.90 కోట్లతో రూపొందిన ఈ మూవీ 800 % లాభాలతో రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే పర్సంటేజీ లెక్కన చూస్తే.. టూరిస్ట్ ఫ్యామిలీ ఛావాను వెనక్కు నెట్టి 1200% లాభాలను గడించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉండగా.. ఛావా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్ -
పబ్లిక్ రివ్యూలను అనుమతించొద్దు: విశాల్ విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం రెడ్ ఫ్లవర్. నటుడు విగ్నేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషా జాహ్నవి నాయకిగా నటించారు. వైజీ.మహేంద్రన్, జాన్విజయ్, తలైవాసల్ విజయ్, అజయ్రత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆండ్రూపాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కె.దేవసూర్య చాయాగ్రహణం, సంతోష్రామ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 8న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఇందులో విశాల్, పి.వాసు, స్వరాజ్, ఫైవ్ స్టార్ కదిరేశన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత మాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రేమ కథ చిత్రం మాత్రమే కాదని మన దేశ ఉన్నతిని చాటే చిత్రంగా ఉంటుందని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ 2025లో జరిగే కథలను చిత్రాలుగా తీయడానికే పలువురు దర్శకులు తడబడుతున్నారని అలాంటిది ఈచిత్ర దర్శకుడు ఆండ్రు 2047లో ఏం జరగనుంది అనే విషయాన్ని తెరపై ఆవిష్కరించారని అన్నారు. నేతాజీకి ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యానికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, థియేటర్లో చిత్రాలు విడుదలైన మూడు రోజుల వరకు పబ్లిక్ రివ్యూలను అనుమతించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మాతల సంఘం చిత్రాల రిలీజ్ను కట్టడి చేయాలని తెలిపారు. -
'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?
కూలీ సినిమా (Coolie Movie)కు బాగా హైప్ తెచ్చిన సాంగ్ మోనికా. పూజా హెగ్డే (Pooja Hegde) వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవుతోంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అని అందరూ ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది. అయితే శివరాత్రిరోజే ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట! అందులోనూ ఆరోజు పూజాకు ఉపవాసం. అయినా సరే ఖాళీ కడుపుతోనే సెట్లోకి అడుగుపెట్టి ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసింది. తన కష్టానికి ప్రతిఫలంగా మోనికా సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.ఫస్ట్ ఆయన్నే అనుకున్నా..అయితే ఈ సాంగ్లో పూజాతోనే పోటీపడుతూ స్టెప్పులేశాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. తొలిసారి ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో సౌబిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ నోరెళ్లబెట్టారు. నిజానికి సౌబిన్ స్థానంలో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఉండాల్సిందట! ఈ విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా వెల్లడించాడు. ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్.. ఫహద్ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాసినట్లు తెలిపాడు. బిజీగా ఉండటంతో..తీరా ఫహద్ను సంప్రదించగా.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాడు. అందువల్లే సౌబిన్ను ఎంపిక చేశామని వెల్లడించాడు. లోకేశ్ డైరెక్ట్ చేసిన కూలీ మూవీలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించాడు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత -
ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత
తమిళ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ (68) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నటుడి మృతిపై పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వేలు ప్రభాకరన్.. 1980లో వచ్చిన `ఇవర్గళ్ విత్యసామానవర్గళ్` చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్గా పరిచయమయ్యారు. `నాలయ మనిదన్` మూవీతో దర్శకుడిగా మారారు.దర్శకుడిగా, నటుడిగా..ఈ చిత్రం సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్గా `అతిశయ మనిదన్` మూవీ తెరకెక్కించారు. తన సినిమాల్లో సున్నితమైన విషయాలను నిస్సందేహంగా చర్చించేవారు. అలా అసురన్, రాజాలి, కడవుళ్, పురాచ్చిక్కారన్, కాదల్ కాదై, ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. వేలు ప్రభాకరన్ (Velu Prabhakaran) దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించారు. పదినారు, గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, కడవర్, పిజ్జా 3, రైడ్, వెపన్ చిత్రాల్లో నటించారు. చివరగా ఈ ఏడాది రిలీజైన గజన మూవీలో కనిపించారు. వేలు గతంలో దర్శకనటి పి.జయాదేవిని పెళ్లి చేసుకున్నారు. కాదల్ కాదై సినిమాలో తనతో కలిసి నటించిన షిర్లే దాస్ను 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ -
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్ల సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారంలో శ్రీలీల- కిరీటి జంటగా నటించిన జూనియర్పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ధనుశ్- నాగార్జున నటించిన కుబేర డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన భైరవం సైతం ఓటీటీలో అలరించనుంది. బాలీవుడ్ నుంచి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ద భూత్ని చిత్రం ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ శుక్రవారమే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుందా? అయితే ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.అమెజాన్ ప్రైమ్కుబేర (తెలుగు మూవీ) - జూలై 18నెట్ఫ్లిక్స్వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18వాల్ టూ వాల్ - (కొరియన్ సినిమా)- జూలై 18డెరిలియమ్ - (వెబ్ సిరీస్)- జూలై 18ఆల్మోస్ట్ ఫ్యామిలీ(బ్రెజిలియన్ కామెడీ చిత్రం)- జూలై 18డిలైట్ఫుల్లీ డిసీట్ఫుల్(హాలీవుడ్ మూవీ)- జూలై 18జియో హాట్స్టార్స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18జీ5భైరవం (తెలుగు సినిమా) - జూలై 18ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18ఆపిల్ ప్లస్ టీవీసమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18మనోరమ మ్యాక్స్అస్త్ర(మలయాళ థ్రిల్లర్)- జూలై 18 -
'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవసే ఏస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరోసారి.. డిఫరెంట్ రోల్తో అలరించనున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం సార్ మేడమ్. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈనెల 25 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా సార్ మేడమ్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్యభర్తలుగా నటించారు. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా తెరపై చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్గా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు. -
థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు
భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలెన్నో.. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనను నానామాటలు అన్నారని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal).ఎందుకీ సినిమా చేశావ్?తాజాగా అలీ ఫజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie) నేనింతవరకు చూడలేదు. కానీ చాలామంది ఈ మూవీ ఎందుకు చేశావని తిట్టారు. దానికి ఒకే ఒక్క కారణం మణిరత్నం సర్. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మూవీలో నటించాను. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దాంతో నా స్నేహితులు, అభిమానులు ఎందుకీ సినిమా చేశావ్? అవసరమా నీకిది? అని కోప్పడ్డారు. వారందరికీ మరేం పర్వాలేదని బదులిచ్చాను.అది ముగిసిన చాప్టర్మణిరత్నం సర్ విజన్ను ప్రశ్నించేంత పెద్దవాడిని కాదు. వారు సినిమా కోసం కష్టపడ్డారు. కానీ షూటింగ్ జరిగేకొద్దీ కథలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయినా థగ్ లైఫ్ చాప్టర్ ముగిసిపోయింది. భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా మణిరత్నం డైరెక్షన్లో నటిస్తాను అని అలీ ఫజల్ చెప్పుకొచ్చాడు.థగ్ లైఫ్మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం థగ్ లైఫ్. గతంలో వీరి కాంబినేషన్లో నాయకుడు మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తరహాలోనే థగ్ లైఫ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో! -
పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?
సినీ తారలు ధరించే దుస్తులు మొదలు..వాళ్లు వాడే వస్తువుల వరకు.. ప్రతిదీ చాలా ఖరీదైనవి ఉంటాయి. ట్రెండ్కు తగ్గట్లుగా వాళ్ల వస్తువులు మారుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు, మొబైల్ ఫోన్ల విషయంలో స్టార్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ మోడల్ని తీసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ 17 ఏళ్ల క్రితం కొన్న ఫోన్నే వాడుతున్నాడు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కీప్యాడ్ ఫోన్నే ఉపయోగిస్తున్నాడు. ఆ స్టార్ ఎవరో కాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ఆయన వాడుతున్న ఫోన్పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇటీవల మలయాళ దర్శకుడు అభినవ్ సుందర్ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో ఫహద్ పాల్గొన్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా ఆ విజువల్స్ని అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరూ ఆయన వాడుతున్న ఫోన్ గురించే చర్చించడం మొదలు పెట్టాడు. స్మార్ట్ ఫోన్ కాదని ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నాడా? అని ఆరా తీస్తున్నారు. ఇక ఆ ఫోన్ విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దాని ధర రూ. 5-54 లక్షల వరకు ఉండేదట. ఇది ఒక అల్ట్రా-లగ్జరీ నాన్-స్మార్ట్ఫోన్. 2007లో అనౌన్స్ చేసి.. 2008లో ఆ ఫోన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ ఫోన్ టైటానియంతో తయారు చేశారట. నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్తో పైభాగం కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో మార్కెట్లో లేదు కానీ ప్రీ-ఓన్డ్ వెబ్సైట్లలో రూ.1–1.5 లక్షలకు దొరుకుతుంది. ఈ ఫోన్లో స్మార్ట్ఫోన్ లాంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ దాని బ్రాండ్ విలువ, అరుదైన డిజైన్ కారణంగా ఆ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. ఫహద్ లాంటి స్టార్ నటుడు ఇంత పాత ఫోన్ను ఉపయోగించడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటుంటే..మరికొందరు పాత వస్తువుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.సినిమాల విషయానికొస్తే.. కుంభసారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియం’, ‘మాలిక్’ వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసు అధికారి షేకావత్ పాత్రలో ఫహద్ అద్భుతంగా నటించాడు. ఆయన తాజా చిత్రం మారేసన్ మూవీ జులై 25న విడదల కాబోతుంది. -
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
తాను బతికుండగానే కొడుకు/కూతురు చనిపోవాలని ఏ తల్లీ, తండ్రీ కోరుకోడు. కానీ దురదృష్టం కొద్దీ తనకు అలా కోరుకోక తప్పలేదంటున్నాడు సీనియర్ నటుడు ప్రసాద్ బాబు (Prasad Babu). ఈయన వెండితెరపై హీరో, విలన్, కమెడియన్, సహాయ నటుడు.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించాడు. దర్శకుడిగానూ సినిమాలు తీశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొడుకును కోల్పోవడం గురించి మాట్లాడాడు.సాహసబాలలు కథకు ప్రేరణ..ప్రసాద్బాబు మాట్లాడుతూ.. నేను సాహస బాలలు సినిమా తీయడానికి నా కుమారుడే కారణం. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడిని మాలాగే ఒక కళాకారుడిని చేయాలని ఆశ ఉండేది. తనకు మాటలు రావు, ఏమీ రావు. ఒకసారేమైందంటే.. స్కూల్లో ఇతర విద్యార్థులతో పాటు నా కొడుకుని ఓ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. తనకు మాటలు రాకపోయినా సరే ఢిల్లీ తీసుకెళ్తున్నారు.. మరి తండ్రిగా ఇక్కడ నేనేం చేస్తున్నాను? అన్న ప్రశ్న మొదలైంది. అప్పటికప్పుడు ఒక కథ అనుకున్నాను. అదే సాహసబాలలు. ఈ చిత్రంలో మురళీ మోహన్, నాగబాబు, సోమయాజులు.. ఇలా చాలామంది యాక్ట్ చేశారు.30 ఏళ్లకే..కసితో ఈ సినిమా చేసి బంగారు నంది గెల్చుకున్నాను. కానీ నా కొడుకు నాకు దూరంగా వెళ్లిపోయాడు. వేసవికాలంలో క్రికెట్ ఆడించాను. మే నెలలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది, దాంతోపాటు గుండెపోటు వచ్చింది. గ్రౌండ్లోనే చనిపోయాడు. అప్పుడు వాడి వయసు 30 ఏళ్లు. నేను బతికుండగానే వీడు చనిపోవాలని మనసులో కోరుకున్న కోరిక ఆరోజు నెరవేరింది. ఎందుకంటే నేను చనిపోయాక వాడిని ఎవరైనా చూస్తారో, లేదోనని భయం ఉండేది. అందుకే.. తన పేరుమీద స్థలం రాసిపెట్టాను. దేవుడికి కృతజ్ఞతలుకానీ, వాడే ముందుగా చనిపోయాడు. నేనుండగానే వాడు పోయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాను. నేను మేనరికం పెళ్లి చేసుకున్నాను. దానివల్లే నా కొడుకు మానసికంగా ఎదగలేదు. తనకు మానసిక వైకల్యం ఉందని ఫీల్ కాకూడదని ప్రతి సినిమాకు తీసుకెళ్లేవాడిని. ఒకసారి బ్రహ్మంగారి మఠానికి వెళ్లినప్పుడు సిద్ధయ్య సమాధిని పట్టుకుని బోరున ఏడ్చాడు. ఏ జన్మలో ఏ సంబంధం ఉందో, అందుకే ఇలా కన్నీళ్లు పెట్టుకున్నాడనుకున్నాం.. అని ప్రసాద్ బాబు చెప్పుకొచ్చాడు.ప్రసాద్ కెరీర్..ప్రసాద్ బాబు అసలు పేరు కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్. పునాదిరాళ్లు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. రుద్రవీణ, ఆపద్భాందవుడు, అంతులేని కథ, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, మురారి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 1500 సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ కూడా చేశాడు.చదవండి: రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ.. -
తిరుమలలో హీరోయిన్ ప్రణీత.. మొదటిసారి అంటూ పోస్ట్!
అత్తారింటికి దారేది మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త, కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రణీత తన ఇన్స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది. Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025 View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ..
బుల్లితెరపై, వెండితెరపై వెలుగు వెలిగిన నటి సడన్గా రోడ్డుపై ప్రత్యక్షమైంది. తనలో తనే మాట్లాడుకుంటూ, చిత్తు కాగితంపై ఏదో రాస్తూ కనిపించింది. ఆమెను గుర్తుపట్టని జనాలు ఎవరు నువ్వు? అని ఆరా తీయగా తాను నటినని, తన పేరు సుమి హర్ చౌదరి అని వెల్లడించింది. నడిరోడ్డుపై ఒంటరిగా..సుమి హర్ చౌదరి (Sumi Har Chowdhury).. బెంగాలీ నటి. పలు సీరియల్స్తో పాటు సినిమాలు కూడా చేసింది. ద్వితియో పురుష్, కాశీ కథ: ఎ గోట్ సాగా వంటి చిత్రాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఆమె మంగళవారం నాడు రోడ్లపై తిరుగుతూ కనిపించింది. పశ్చిమ బెంగాల్లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్లోని దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. హైవేపై నడుచుకుంటూ కొంతదూరం వెళ్లిన ఆమె ఒకచోట ఆగి పక్కన కూర్చుని చిత్తుకాగితంపై ఏదో రాసుకుంటూ ఉందట! నమ్మలేకపోయిన జనాలుతనలో తనే సగం బెంగాలీ, సగం ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుకుంటూ ఉండటాన్ని అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. ఎవరు నువ్వు? అని వారు పలకరించగా.. తన పేరు సుమి హర్ చౌదరి అని, తాను నటిని అని చెప్పింది. మొదట నమ్మలేకపోయిన స్థానికులు గూగుల్లో వెతికి చూడగా తను చెప్పింది నిజమేనని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని నటిని షెల్టర్కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే? -
జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్
సినిమా అంటే ఇష్టం లేదంటుంది. కానీ సినిమా కోసం ఏదైనా చేస్తుంది. సినిమాలు మానేయాలని ఆలోచిస్తుంది. కానీ తను అడుగుపెట్టిన ప్రతి ప్రాజెక్టులో అద్భుతంగా నటిస్తుంది. అలా తరుచిత్రంబళం (తెలుగులో తిరు) సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నిత్యామీనన్ (Nithya Menen). ప్రస్తుతం ఈ బ్యూటీ ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) (Idly Kadai Movie) సినిమా చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య.. పల్లెటూరి యువతిగా కనిపించనుంది. పిడకలు చేశా..ఈ సినిమా షూటింగ్లో ఉండగానే తిరు సినిమాకు వచ్చిన జాతీయ అవార్డును అందుకోవడానికి వెళ్లింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ కడై సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను. పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని అడగ్గానే ఎందుకు చేయను? అని రంగంలోకి దిగాను. నా జీవితంలో తొలిసారి పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు చేశాను. పిడకలు చేసిన మరునాడే జాతీయ అవార్డు తీసుకునేందుకు వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది.ఇంత మంచి అనుభూతి..అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేదే కాదు అని చెప్పుకొచ్చింది. ఇడ్లీ కడై విషయానికి వస్తే తిరుచిత్రంబలం సినిమా తర్వాత ధనుష్- నిత్య కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ ఇది! ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, పార్తీబన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.చదవండి: చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య -
జీవితంలో విజయ్ సేతుపతితో కలిసి పని చేయకూడదనుకున్నా : పాండిరాజ్
వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఒకరు. ఆయన నటన గురించి చర్చ జరుగుతుంది కానీ.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎక్కడా చర్చ జరగదు. ఇండస్ట్రీలో అందరూ ఆయనను అజాత శత్రువు అంటారు. కానీ విజయ్ అంటే గిట్టని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహిత, డైరెక్టర్ పాండిరాజ్(Pandiraj). గతంలో వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఓ సినిమా విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. దీంతో జీవితంలో ఇక విజయ్తో సినిమా చేయొద్దని పాండిరాజ్ భావించారట. కానీ స్వయంగా విజయ్ సేతుపతే వచ్చి అడగడంతో సినిమా చేశానని చెప్పారు.పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం తలైవన్ తలైవి. జులై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్లో పాండిరాజ్ మాట్లాడుతూ.. గతంలో విజయ్తో జరిగిన గొడవ గురించి చెప్పారు. ‘విజయ్కి, నాకు గతంలో బేదాభిప్రాయాలు వచ్చిన విషయం నిజమే. జీవితంలో ఆయనతో సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నాను. ఓసారి దర్శకుడు మిష్కిన్ బర్త్డే ఈవెంట్లో మళ్లీ మేమిద్దరం కలిశాం. అప్పుడు విజయే స్వయంగా వచ్చి ‘మనం ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దామా’ అని అడిగాడు. దాంతో అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోయి..కొత్త ప్రయాణానికి బీజం పడింది. మిష్కిన్ బర్త్డే పార్టీ తర్వాత ‘తలైవన్ తలైవి’ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. కథ పూర్తయిన తర్వాత విజయ్కి 20 నిమిషాల పాటు స్టోరీ నెరేట్ చేయగానే.. ఆయన ఒప్పుకున్నారు’ అని పాండిరాజ్ చెప్పారు. -
చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య
నటుడు బాలా (Actor Bala) పర్సనల్ విషయాలతో ఎప్పుడూ వివాదాల్లో నానుతూనే ఉంటాడు. చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. తర్వాత నటి అమృతా సురేశ్ను వివాహం చేసుకోగా కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. అయితే డివోర్స్ తర్వాత తనతోపాటు, తన కూతుర్ని కూడా వేధించారని అమృత పోలీసులను ఆశ్రయించడం, వారు బాలను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలోనే డాక్టర్ ఎలిజబెత్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. నాకేదైనా జరిగితే తనదే బాధ్యతఆమెను కూడా వదిలేసి గతేడాది కోకిలను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇలా నాలుగు పెళ్లిళ్లతో బాలా సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ అయ్యాడు. తాజాగా డాక్టర్ ఎలిజబెత్ (Elizabeth Udayan) షేర్ చేసిన వీడియోతో మరోసారి బాలా పేరు తెరపైకి వచ్చింది. అందులో ఆమె ఆస్పత్రి బెడ్పై ఉంది. ఎలిజబెత్ ఏమందంటే.. నాకేదైనా జరిగితే నా మాజీ భర్త, అతడి కుటుంబానిదే పూర్తి బాధ్యత. అతడి గురించి ఏళ్లతరబడి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చనిపోయేలోపు న్యాయం?సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకున్నా, సీఎంను కలిసినా, కోర్టు మెట్లెక్కినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పైగా నన్నే బెదిరిస్తున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. అదే చాలా బాధగా ఉంది. నాకేదైనా జరిగితే అతడి(బాలా)తోపాటు అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొంది. ఈ వీడియోకు 'నేను చనిపోయేలోపు నాకు న్యాయం జరుగుతుందా?' అని క్యాప్షన్ జోడించింది.నీ ఉసురు ఊరికే పోదుఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడదాని కన్నీళ్ల ఉసురు ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. వీలైతే జరిగినదాన్ని మర్చిపో, కౌన్సెలింగ్ తీసుకో.. అతడి చెర నుంచి తప్పించుకోవడమే ఒక వరంలా భావించు, నువ్వు అతడిని చాలా ప్రేమించావు. కానీ, ఈరోజు కాకపోయినా రేపయినా అతడికి తగిన శాస్తి జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.డాక్టర్వి అయ్యుండి ఇలా..మరికొందరేమో.. నువ్వు ఒక డాక్టర్వి.. గతాన్ని మర్చిపోయి నీ వృత్తికి పూర్తి స్థాయి సమయం కేటాయించు, వైద్యురాలివయ్యుండి చనిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించు. అది వీలుకాకపోతే మీ జీవితంలోనే పెద్ద సమస్య అయిన వ్యక్తి మీకు దూరంగా వెళ్లిపోయాడని మీకు మీరు భరోసా ఇచ్చుకోండి అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు తీసుకుంటున్నా -
నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు రెమ్యునరేషన్!
స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే బాక్సాఫీస్ వద్ద యుద్ధం మొదలు కానుంది. ఆగస్టు 14న రజనీకాంత్ 'కూలీ' (Coolie Movie), హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ల 'వార్ 2'చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వార్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ విషయానికి వస్తే ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ.350 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఆయన పారితోషికం గురించి చెప్పలేనుహీరో రజనీకాంత్ రూ.150 కోట్లు, దర్శకుడు లోకేశ్ రూ.50 కోట్లు రెమ్యునరేషన్ (Lokesh Kanagaraj Salary) తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ.. రజనీకాంత్ సర్ పారితోషికం గురించి నేనేం చెప్పలేను. అయితే మీరు అంటున్నట్లుగా నేను రూ.50 కోట్లు తీసుకుంటున్నాను. నా గత సినిమా లియోకు తీసుకున్నదానికంటే ఇది రెట్టింపు రెమ్యునరేషన్. అందుకే డబుల్ తీసుకుంటున్నా..లియో సినిమా రూ.600 కోట్లకు పైగానే వసూలు చేసింది. కాబట్టి నేను గత సినిమాకంటే డబుల్ పారితోషికం తీసుకుంటున్నాను. ఇది నా రెండేళ్ల జీవితం. అన్నింటినీ త్యాగం చేసి రెండేళ్లుగా కూలీకే అంకితమయ్యాను, అది నా బాధ్యత కూడా అని పేర్కొన్నాడు. కూలీ మూవీ విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌంబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందించాడు.చదవండి: ‘బాహుబలి’ రీరిలీజ్: రన్టైమ్పై పుకార్లు.. రానా ఏమన్నారంటే..? -
మూవీ సెట్లో స్టంట్మ్యాన్ మృతి.. డైరెక్టర్పై కేసు నమోదు!
కోలీవుడ్ మూవీ 'వెట్టువం' సెట్లో స్టంట్మ్యాన్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ రాజ్ మృతి పలువురు సినీతారలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాల్, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు.అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ పా రంజిత్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడితో పాటు స్టంట్ నటుడు వినోద్, నీలం ప్రొడక్షన్స్కు చెందిన రాజ్కమల్, కారు యజమాని ప్రభాకరన్పై కేసు నమోదైంది. ఈ సంఘటన సమయంలో సినిమా సెట్లో భద్రతపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. స్టంట్మ్యాన్ రాజు సినిమా సెట్లో కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృతిచెందారు. కాగా.. జూలై 13న ఈ ప్రమాదం జరిగింది. -
లెజెంజరీ నటి సరోజా దేవి చివరి కోరిక అదే.. నెరవేర్చిన కుటుంబ సభ్యులు
వెండితెరపై దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అలనాటి నటి బి. సరోజా దేవి (87) అనారోగ్యంతో మరణించారు. వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని మల్లేశ్వరంలో తన స్వగృహంలో సోమవారం ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో సినీ ప్రపంచం ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఆమె నటించిన సినిమాలు, పాత్రలను గుర్తు చేసుకున్నారు.అయితే ఆమె చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నేరవేర్చారు. ఆమె కోరిక మేరకు కళ్లను దానం చేశారు. ఆమె కోరుకున్న విధంగా నారాయణ నేత్రాలయకు అందజేశారు. గతంలో నారాయణ నేత్రాలయను సందర్శించినప్పుడు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని ఐ బ్యాంక్ అధికారి డాక్టర్ రాజ్కుమార్ తెలిపారు. ఆమె నేత్రదానానికి నమోదు చేసుకుని దాదాపు ఐదేళ్లు పూర్తయిందని వెల్లడించారు.అంత్యక్రియలుసరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.తెలుగులో పాతిక వరకూ...తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. -
సెన్సార్ తేలింది.. టైటిల్ మారింది.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ 'జానకి వర్సెస్ కేరళ'. లెక్క ప్రకారం జూన్ చివరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ టైటిల్పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం పెట్టింది. సీతాదేవి మరోపేరు జానకి అని, దీని వల్ల రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ ఉండొచ్చని, అందుకే కచ్చితంగా పేరు మార్చాల్సిందే అని పట్టుబట్టింది. మూవీ టీమ్ తొలుత దీనికి అంగీకారం తెలపలేదు. ఎట్టకేలకు ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)జానకి వర్సెస్ కేరళ అని అనుకున్న టైటిల్ని సెన్సార్ బోర్ట్.. 'జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.ట్రైలర్ బట్టి చూస్తే.. సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఈమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకకి న్యాయం దక్కిందా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి ఈ కోర్ట్ రూమ్ డ్రామా, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఫహాద్ ఫాజిల్ పేరు చెప్పగానే క్రేజీ సినిమాలు, డిఫరెంట్ పాత్రలు గుర్తొస్తాయి. 'పుష్ప 2' సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇతడు.. ప్రస్తుతం తమిళంలో 'మారీషన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సీనియర్ కమెడియన్ వడివేలు కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. ఇంతకీ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)ఇదో తమిళ సినిమా. దొంగతనాలు చేసిన ఒకడు(ఫహాద్).. డబ్బులతో ఉన్న మతిమరుపు వ్యక్తిని(వడివేలు) చూస్తాడు. అతడి దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బు కొట్టేయాలని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి తిరువణ్ణామలైకి బైక్పై వెళ్తారు. మరోవైపు మతిమరుపు వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుంటారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తోంది.జూలై 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చూస్తుంటే ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ చిత్రం చేశాడని అర్థమైంది. ప్రస్తుతానికైతే తమిళ వెర్షన్ మాత్రమే బిగ్ స్క్రీన్పైకి రానుంది. తెలుగు డబ్బింగ్ కోసం ఓటీటీలోకి వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. గతంలో ఫహాద్-వడివేలు కలిసి 'మామన్నన్' మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో?(ఇదీ చదవండి: తెలుగు సినిమాలో వేశ్య పాత్రలో కాయదు?) -
సింగిల్ షెడ్యూల్లో...
విశాల్ హీరోగా 35వ సినిమా షూటింగ్ షురూ అయింది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై రూపొందుతోన్న 99వ చిత్రమిది. ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో జరిగాయి. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (ఎన్హెచ్ 4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, కెమెరామేన్ ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.‘‘మద గజ రాజా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రమిది. విశాల్, దర్శకుడు రవి అరసు కాంబినేషన్లో మొదటి సినిమా ఇది. ‘మద గజ రాజా’ తర్వాత విశాల్, సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం.నాథన్ ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అలాగే ‘మార్క్ ఆంటోనీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ మరోసారి ఈ సినిమా కోసం విశాల్తో కలిశారు. 45 రోజుల సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ను పూర్తి చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చిన్నప్పుడే పెళ్లి-విడాకులు, రెండో పెళ్లి చేసుకుంటే చివరి రోజుల్లో..
డ్యాన్సర్ నుంచి హీరోయిన్గా మారినవారిలో రాజసులోచన (Rajasulochana) ఒకరు. 1953లో గుణసోదరి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 325కి పైగా సినిమాలు చేశారు. ప్రతి భాషలో తనకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాజసులోచన గురించి ఆమె కూతురు శ్రీ గురుస్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.చిన్న వయసులో మొదటి పెళ్లిఅమ్మ నటి, డ్యాన్సర్, సామాజిక కార్యకర్త. నాన్న (చిత్తజల్లు శ్రీనివాసరావు) గొప్ప దర్శకుడు. అమ్మది విజయవాడ, నాన్నది కాకినాడ. సినిమా ఇండస్ట్రీకి వచ్చాకే వీరు కలుసుకున్నారు. అమ్మకు చిన్న వయసులోనే పెళ్లయింది. చెన్నైలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు సంతానం. తర్వాత కష్టాలు మొదలవడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం అమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయింది. ఇక్కడే నాన్నగారు తనకు పరిచయమయ్యాడు. చివరి రోజుల్లో విడివిడిగా..1964లో నాన్నను రెండో పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే మేము(కవలలు) పుట్టాం. అమ్మానాన్న ఫుల్ బిజీ కావడంతో మేము అమ్మమ్మ దగ్గరే పెరిగాం. తర్వాత నా సోదరి ఇండియాలో సెటిలైతే నేను అమెరికాలో సెటిలయ్యాను. ప్రతి ఏడాది అమ్మ నా దగ్గరకు వస్తూ ఉండేది. అయితే చివరి రోజుల్లో అమ్మ.. నాన్నకు దూరంగా ఉంది. నాన్నకు ఉన్న చెడు అలవాట్లు అమ్మకు నచ్చక విడిగా ఉండేది. ఆ బాధకు తోడు హైబీపీ వల్ల కిడ్నీ ఫెయిలైంది. అయితే చాలామంది సినిమాలు తీసి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. కానీ, అమ్మానాన్న ఇల్లు, ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేశారు అని చెప్పుకొచ్చింది. రాజసులోచన.. వాల్మీకి, శాంతినివాసం, బాలనాగమ్మ, పాండవ వనవాసం, పెంకి పెళ్లాం.. ఇలా అనేక సినిమాలు చేశారు. 2013లో కన్నుమూశారు.చదవండి: లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనంటూనే..' -
వైరల్ వయ్యారి పాటకు స్టేజీపై స్టెప్పులేసిన శివన్న
ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి నేనే.. పాటే వినిపిస్తోంది. ఇందులో శ్రీలీల, కిరీటి జంటగా డ్యాన్స్ చేశారు. శ్రీలీల గ్రేస్, డ్యాన్స్ గురించి తెలియంది కాదు! ఎప్పటిలాగే అల్లాడించేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కిరీటి గురించే! జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన ఈ యంగ్ హారో.. ఆయనలాగే పపర్ఫుల్గా స్టెప్పులేశాడు. నిన్ను చూస్తుంటే తారక్ను చూస్తున్నట్లే ఉందని చాలామంది కిరీటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు. జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.వయ్యారి సాంగ్కు స్టేజీపై స్టెప్పులుఈ మూవీ జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కిరీటి శివన్నతో స్టేజీపై స్టెప్పులేయించాడు. వైరల్ వయ్యారి పాటకు స్టెప్పు ఇది.. అని ఒకసారి చూపించగనే శివన్న ఇట్టే నేర్చేసుకున్నారు. పాట ప్లే అవుతుంటే ఫుల్ జోష్లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.జూనియర్ సినిమా విశేషాలుప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం జూనియర్. జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. A true viral moment 💥💥Karunada Chakravarthy @NimmaShivanna Garu dances to the #ViralVayyari song with the lead pair at the Junior Grand Pre Release Event ❤🔥#Junior grand release on July 18th ✨A Rockstar @ThisIsDSP Musical 🎸🔥 pic.twitter.com/lpAxfYmnSa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 13, 2025 చదవండి: ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే సిట్టింగా? -
ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత
ప్రముఖ నటి, అభినయ సరస్వతి బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం (జూలై 14న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి (1959), జగదేక వీరుని కథ, సీతారామ కల్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, శకుంతల, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం, దాన వీర శూర కర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.200కి పైగా సినిమాలుబీ సరోజాదేవి (B.Saroja Devi) 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. "అభినయ సరస్వతి" అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం (1957) ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్గా నిలిపింది. హిందీలో పైఘామ్ (1959), ససురాల్ (1961) వంటి చిత్రాల్లో నటించారు.1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్లో.. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజా దేవికి కలైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.కుటుంబ నేపథ్యంసరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.చదవండి: ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, ఇంతలోనే సిట్టింగా? -
షూటింగ్లో ఆర్టిస్ట్ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్
ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కిళైయూర్ కావల్ సరగమ్ సమీపంలో విళుందమావడి గ్రామంలో గత మూడు రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం షూటింగ్లో పాల్గొన్న మోహన్ రాజు అనే స్టంట్ కళాకారుడు కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.స్టంట్ కళాకారుడు మృతివెంటనే అతన్ని నాగపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాజు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన స్టంట్ కళాకారుడు మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. ఈయన మృతి వెట్టువన్ చిత్ర యూనిట్నే కాకుండా సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్ కళాకారుడు మోహన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ (Vishal) సంతాపం ప్రకటించారు.ప్రమాదకర స్టంట్లుసినిమా షూటింగ్లో కారులో నుంచి దూకుతూ స్టంట్ కళాకారుడు రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎంతో ధైర్యశాలి. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కేవలం ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.ఫైట్ మాస్టర్ ట్వీట్ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్.. రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్ను కోల్పోయాం. స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. అతడిని మిస్ అవుతున్నాం అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 One of our great car jumping stunt Artist S M Raju Died today while doing car stunts 😭😭RIPOur stunt union and Indian film industry ll be missing Him😭😭 pic.twitter.com/9Qr7Zg8Dbb— silva stunt (@silvastunt) July 13, 2025చదవండి: సకల సినీ పాత్రలకు పెట్టని కోట -
పది కేజీలు తగ్గిన థగ్ లైఫ్ నటుడు.. ఆ సినిమా కోసమేనట!
ఇటీవలే థగ్ లైఫ్ మూవీలో కనిపించిన కోలీవుడ్ హీరో శింబు మరో కొత్త ప్రాజెక్ట్కు సిద్ధమయ్యాడు. వెట్రి మారన్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మరింత యవ్వనంగా కనిపించేందుకు శింబు బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన పది రోజుల్లోనే 10 కేజీల బరువు తగ్గారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.మరోవైపు అయితే ఈ సినిమా గతంలో వెట్రి మారన్, ధనుశ్ కాంబోలో వచ్చిన చిత్రం వడ చెన్నై మూవీకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేం లేదని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో కవిన్, మణికందన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ధనుశ్ చిత్రం 'వడ చెన్నై'లో నటించిన ఆండ్రియా జెరెమా, సముద్రఖని, కిషోర్ కూడా ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. భారీ తారాగణం ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. -
తంగలాన్ డైరెక్టర్ షూటింగ్లో ప్రమాదం.. డేరింగ్ స్టంట్ మ్యాన్ మృతి..!
కోలీవుడ్లో విషాదం నెలకొంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్టంట్ మ్యాన్ రాజు మరణించారు. కారుతో స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనపై కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అతని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' డైరెక్టర్ పా రంజిత్ సినిమా షూట్లో ఈ రోజు ఉదయం జరిగిన విషాదం గురించి విన్నా. కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను నా సినిమాల్లో చాలా రిస్క్ స్టంట్లు చేశాడు. ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. అతనికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాజు ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాద సమయంలో ఆ దేవుడు వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాదు.. అతని కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాం. కోలీవుడ్ పరిశ్రమలో చాలా చిత్రాలకు ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది. ఇది నా కర్తవ్యంగా వారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తా' అని పోస్ట్ చేశారు. రాజు మృతి పట్ల ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా తన సంతాపం ప్రకటించారు.కాగా..స్టంట్ మ్యాన్ రాజు తన సాహసోపేతమైన స్టంట్లతో కోలీవుడ్ పరిశ్రమలో ఫేమస్ అయ్యారు. తన కెరీర్లో చాలా ఏళ్లుగా కోలీవుడ్లో అనేక చిత్రాలకు పనిచేశారు. రాజుకు చాలా ధైర్యవంతుడిగా, నైపుణ్యం కలిగిన స్టంట్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం అతను పనిచేసిన చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని 2021లో వచ్చిన 'సర్పట్ట పరంబరై'కి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 -
యువ నటి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆషాడమాసం సీజన్ నడుస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం శుభకార్యాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళ నటుడు అర్జున్ చిదంబరం పెళ్లి చేసుకోగా.. మరో తమిళ నటి కూడా కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. వీడియోని కూడా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?)చెన్నైకి చెందిన రిత్విక.. 2013లో వచ్చిన పరదేశి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తర్వాత మద్రాస్, కబాలి, టార్చ్ లైట్, 800 చిత్రాలతో పాటు రీసెంట్గా వచ్చిన ఎలెవన్, డీఎన్ఏ మూవీస్ కూడా చేసింది. ఇప్పుడు ఈమె.. వినోద్ లక్ష్మణ్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి డేట్ సహా ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు.సినిమాలతో పాటు రిత్విక.. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. తమిళ బిగ్బాస్ 2వ సీజన్ లో పాల్గొంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ విజేతగా నిలిచింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే నటిగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది.(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by RIYTHVIKA KP (@riythvika_official) -
ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?
రజినీకాంత్ 'కూలీ' సినిమా నుంచి రీసెంట్గా 'మోనికా' అనే సాంగ్ రిలీజైంది. ఇందులో పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. పాట కొందరికి నచ్చింది, కొందరికి ఓకే అనిపించింది. ఆ సంగతి పక్కనబెడితే లెక్క ప్రకారం పూజా స్టెప్పులు ఫేమస్ కావాలి. కానీ ఇదే పాటలో ఆమెతో కలిసి డ్యాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే అంతలా ఫేమస్ అయిపోయాడు. ఇంతకీ ఎవరతడు?ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ నటుడి గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇతడి పేరు సౌబిన్ షాహిర్. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన ఇతడు.. ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్గానూ పనిచేశాడు. సహాయ దర్శకుడిగా చేస్తున్న టైంలోనే చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. అయితే 2018లో 'సుదాని ఫ్రమ్ నైజీరియా' మూవీతో మంచి గుర్తింపు దక్కింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూవీ సౌబిన్ జీవితాన్ని మలుపు తిప్పింది.(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) ఈ సినిమాలో సౌబిన్ నటనకుగాను కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం దక్కింది. దీని తర్వాత కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచమ్ ఇలా పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలకించగల ఇతడు.. గతేడాది 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రంతో నిర్మాతగా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'కూలీ'తో అదృష్టం పరీక్షించుకునేందుకు రాబోతున్నాడు.లోకేశ్ కనగరాజ్ తీసిన 'కూలీ'లో నటించిన టైంలోనే సౌబిన్కి మిగతా చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ దీనికోసం దాదాపు 7-8 మూవీస్ని వదులుకున్నాడు. ఇప్పుడేమో మోనికా పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పూజా హెగ్డే కంటే ఇతడి డ్యాన్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. మరి మూవీ రిలీజ్ తర్వాత సౌబిన్కి ఇంకెంత ఫేమ్ తెచ్చుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ) -
రాజాసాబ్ బ్యూటీ.. విజయ్ దేవరకొండ మూవీతో డెబ్యూ ఇవ్వాల్సిందట!
తన ప్రత్యేకమైన స్టయిల్, స్వతంత్ర భావనతో ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించే మాళవిక మోహనన్ త్వరలోనే టాలీవుడ్లో స్టార్గా వెలుగొందనుంది. ఆ విషయాలే మీకోసం.. రాజాసాబ్ బ్యూటీ..మాళవిక మోహనన్ (Malavika Mohanan) కొన్ని తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తాజాగా ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో నాయికగా నటించడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. మాళవిక తండ్రి కె.యు. మోహనన్ కూడా సినీరంగానికే చెందినవాడు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి ఎన్నో సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించారు.తండ్రితో లొకేషన్కి..మాళవిక.. కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగింది, చదువుకుంది కూడా అక్కడే. కేవలం చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కాని, అసలు ఆసక్తి సినిమాలవైపే! ఒకసారి తండ్రి మోహనన్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుండగా, ఆమె లొకేషన్కు వెళ్లింది. ఆ యాడ్లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఫ్యాషన్ డిజైనింగ్పై ఆసక్తిఆమె నటనపై చూపిన ఆసక్తిని గమనించిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా మాళవిక కెరీర్ మొదలైంది. ‘పట్టమ్ పొలే’ అనే మలయాళ చిత్రం ఆమె మొదటి సినిమా. ఆ సినిమా సమయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మాళవిక తన దుస్తులను తానే డిజైన్ చేసుకుంది. అక్కడి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి, ‘ది స్కార్లెట్ విండో’ అనే పేరుతో తన బ్రాండ్ ప్రారంభించింది.ధైర్యం ఎక్కువే!మాళవిక చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పెడుతుంటే, కొందరు నెటిజన్లు తప్పుడు కామెంట్లు పెట్టారు. మర్యాదగా, పద్ధతిగా ఉండాలని సూచనలు ఇచ్చారు. దానికి స్పందనగా పద్ధతిగా చీర వేసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కూడా షార్ట్, చిన్న చొక్కా ఉండడంతో మరింత సెన్సేషన్ అయింది. ‘ఒక ఆడపిల్ల ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే బెటర్’ అని కౌంటరిచ్చింది.విజయ్ దేవరకొండతో మూవీభవిష్యత్తులో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్గా మారాలనేది ఆమె ఆశ. రింగులు అంటే మాళవికకి చాలా ఇష్టం. వందల సంఖ్యలో రింగులు కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – తెలుగులో ఆమెకి వచ్చిన మొదటి అవకాశం ‘రాజా సాబ్’ సినిమా కాదు. మొదట విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు ‘హీరో’.తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంసూపర్ స్టార్ రజనీకాంత్ అంటే మాళవికకి విపరీతమైన అభిమానం. ఆయనతో ‘పేట’ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎంతో థ్రిల్ అయ్యిందట! అలాగే విజయ్తో ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకమని మాళవిక చెప్పింది. ‘ఒక్క సినిమాలో కనిపించినా చాలు – తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా అభిమానించే ప్రేక్షకులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది’ అని చెప్పింది. ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ప్రభాస్తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ – ‘షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ప్రభాస్ ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వచ్చేది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది తినగలిగేంత పెద్ద పరిమాణంలో వంటలు వచ్చేవి. భోజనం బాగా నచ్చినా, అంత తినలేకపోయా’ అని తెలిపింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ – మాళవిక చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బిల్డింగ్లో పెరిగారు. అందుకే తనకి అత్యంత సన్నిహితుడిగా విక్కీని భావిస్తానని చెబుతుంది. మలయాళ అమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండే చేపల కూర అంటే విపరీతమైన ఇష్టం. డైటింగ్ను పక్కనపెట్టి, షూటింగ్ లేనప్పుడు తల్లి బీనా చేత వండించుకుని, ఆ చేపల కూర తింటూ ఆనందపడుతూ ఉంటుంది.చదవండి: ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా -
'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో ప్రముఖ నటుడు పెళ్లి చేసుకున్నాడు. తమిళంలో 'పొన్నియిన్ సెల్వన్', 'థగ్ లైఫ్' తదితర చిత్రాల్లో నటించిన ఇతడు.. ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. ఆర్కిటెక్ట్ జయశ్రీ చంద్రశేఖరన్తో ఏడడుగులు వేశాడు. ఆదివారం ఉదయం ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ చిదంబరం.. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2015లో వచ్చిన 'మూణే మూణు వార్తై' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత రమ్, నేర్కొండ పార్వై, తీవిరమ్, పొన్నియిన్ సెల్వన్, అనీతి, కొలాయి, రత్తం, థగ్ లైఫ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెరికా మాప్పిలై, ఆటో శంకర్, బిహైండ్ కోజ్డ్ డోర్, అద్ధం, ద విలేజ్ వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశాడు. ఇక పెళ్లి కూతురు జయశ్రీ చంద్రశేఖర్ విషయానికొస్తే ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ప్రస్తుతం ఆర్కిటెక్ట్గా పనిచేస్తోంది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దల కుదిర్చిన పెళ్లి? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి) -
మోనికా సాంగ్.. డ్యాన్స్తో డామినేట్ చేసిన నటుడు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా (Coolie Movie)పై భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు భాగం కావడంతో కూలీ మూవీ గురించి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించిన మోనికా అనే ఐటం సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే అందంతో, డ్యాన్స్తో అదరగొట్టింది. అప్పుడు జిగేలు రాణి.. ఇప్పుడు మోనికాఇలా స్పెషల్ సాంగ్స్ చేయడం పూజకు కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం మూవీలో జిగేలురాణి పాటకు సూపర్గా డ్యాన్స్ చేసింది. ఎఫ్ 3 మూవీలోనూ లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె కనిపించిన చివరి సినిమా అదే! ఇటీవల తమిళ రెట్రో మూవీలో కథానాయికగా అలరించింది. కన్నిమా పాటకు ఎక్స్ప్రెషన్, గ్రేస్తో అదరగొట్టేసింది. ఇప్పుడు కూలీలో మోనికాగా సెన్సేషన్ సృష్టిస్తోంది. దడదడలాడించిన సౌబిన్అయితే ఈ పాటలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) పూజానే డామినేట్ చేస్తున్నాడు. హీరోయిన్తో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు. మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్లో యాక్ట్ చేశాడు. ఇప్పుడు మోనికా పాటలో సింపుల్ లుక్లోనే సూపర్ స్టెప్పులేస్తూ ఫుల్ హైలైట్ అవుతున్నాడు. స్పెషల్ సాంగ్లో సౌబిన్తో స్టెప్పులేయించాలన్న ఆలోచన రావడమే గ్రేట్ అంటూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ను నెటిజన్లు పొగుడుతున్నారు. చదవండి: 'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆమె కూడా! -
వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకా అని ఆశ్చర్యపోయా
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'(ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్)''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది.(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) He is 75 now Best orator when comes to stage speeches . The way he kept audience engaging 🔥🔥🔥Ultimate hilarious fun mode 😂😂Mr . Rajinikanth 😂Kamalhaasan elevation 🔥Sivakumar ayya elevation 🔥Dmk function 😂😂Cooling glass slow motion 😂Why I’m chief for this… pic.twitter.com/plbtMjBLQO— Suresh balaji (@surbalutwt) July 11, 2025 -
మోహన్ లాల్ దే మెగా విజయం, మళయాళ చిత్రసీమ 2025 తేల్చిందిదే..
తొలి అర్ధ సంవత్సరంలో మలయాళ సినిమా రంగం ఊహించని మలుపులు తిరిగింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ సినిమాల మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీనూ భారీగా విస్తరించినా, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కొన్ని సినిమాలు జయాపజయాల అంచనాల్ని తలకిందులుగా చేసి, సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.టాప్ స్టార్ల నుంచి మిశ్రమ ఫలితాలుమళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈసారి డబుల్ హిట్తో బాక్సాఫీస్లో సందడి సృష్టించాడు. విలక్షణ నటుడు, హీరో పృథ్విరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంపురాన్’ (ఎల్2) రాజకీయ థ్రిల్లర్గా రూ.265 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆయన నటించిన ‘తుదరుం’ కూడా రూ.230 కోట్ల కలెక్షన్స్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరోవైపు మళయాళ మెగాస్టార్గా పేర్కొనే మమ్ముట్టి మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆయన ఈ అర్ధభాగంలో తక్కువ ప్రభావం చూపించాడు. ఆయన నటించిన ‘డొమినిక్’, ‘లేడీస్ పర్స్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందలేకపోయాయి.చిన్న సినిమాలకు పెద్ద ఆదరణవినూత్న కధాంశాలు, వైవిధ్య భరిత చిత్రాలకు పెద్ద పీట వేసే తమ మనస్తత్వాన్ని మరోసారి మళయాళీలు చాటుకున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అసిఫ్ అలీ – అనస్వర రాజన్ జంటగా నటించిన ‘రేఖాచిత్రం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, టోవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ వంటి థ్రిల్లర్ చిత్రాలు కూడా తమ సత్తా చాటాయి.గుర్తింపుకు నోచుకోలేకపోయిన ఐడెంటిటీ...భారీ అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ మాత్రం సరైన గుర్తింపునకు నోచుకోలేక చతికిలపడింది. టోవినో థామస్, త్రిష లాంటి అగ్రతారలు ఉన్నా కథలో లోపాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం విడుదలైన ‘కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా’, ‘ఐడి: ది ఫేక్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.ఈ అర్ధ సంవత్సరం మళయాళ పరిశ్రమలో స్పష్టంగా కనిపించిన విషయం అదీ ఇదీ అని తేడా లేకుండా భిన్న రకాల కధలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కధలో కొత్తదనం, ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్. థ్రిల్లర్, రాజకీయ నాటకాలు ఆదరణ పొందగా, కుటుంబ భావోద్వేగాలు చిత్ర జయాపజయాల్లో తమ పాత్రను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయని కూడా వెల్లడైంది.మోహన్లాల్ సినిమాల ఘనవిజయాలు మళయాళ సినీ పరిశ్రమకు ఉన్న బాక్సాఫీస్ సత్తాను చాటగా, చిన్న సినిమాల విజయం కొత్త ఆశల్ని అందించింది. ఇక రెండో అర్ధ సంవత్సరంలో పరిశ్రమ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.. -
గదాధారి...
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు. -
సార్... మేడమ్ వస్తున్నారు
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’.పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు.పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో సాగుతుంది. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్లో కనిపించారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్, నిత్యల నటన హైలెట్గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆ తెలుగు సినిమా నా జీవితాన్ని మార్చేసింది: శృతిహాసన్
కోలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మోనికా అంటూ సాంగే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ పూజా హేగ్డే తన డ్యాన్స్త అదరగొట్టేసింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న కూలీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటించారు.అయితే ఇటీవల సోషల్ మీడియాకు గుడ్బై చెప్పిన శృతిహాసన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తనకు లైఫ్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీనే అని తెలిపింది.తెలుగులో గబ్బర్ సింగ్ సినిమా తన జీవితాన్నే మార్చిందని చెప్పుకొచ్చింది. కోలీవుడ్ తర్వాత నాకు సక్సెస్ ఇచ్చిందంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమేనని వెల్లడించింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ సార్ పట్టుబట్టి మరి ఆ రోల్ ఇచ్చారని గుర్తు చేసుకుంది. మా నాన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చానని శృతిహాసన్ తెలిపింది. -
'కూలీ' నుంచి మోనికా.. స్పెషల్ సాంగ్ రిలీజ్
సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్ఫుల్గానే ఉంది.(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం.. నన్ను వేస్ట్ చేశాడు: సంజయ్ దత్)ఈ పాటని వైజాగ్ పోర్ట్లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న 'కూలీ'లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ) -
నన్ను వేస్ట్ చేశాడు.. లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజినీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేశ్పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేశ్ కనగరాజ్.. 'మా నగరం' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ఖైదీ'తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్తో 'లియో' సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో సంజయ్ దత్ మాట్లాడాడు.'కేడీ ద డెవిల్' అనే సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్.. 'రజినీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజినీ సర్తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్తోనూ 'లియో' చేశా. అయితే లోకేశ్పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు(నవ్వుతూ)' అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)"I worked with #VijayThalapthy & I loved it. I'm angry with #LokeshKanagaraj, because he didn't give me a big role in #LEO. He wasted me.- #SanjayDutt pic.twitter.com/zzPaeqfEub— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2025 -
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేం. కొన్నిసార్లు దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తమిళ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) విషయంలో ఇదే జరిగింది. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయన ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమాను కన్నడిగులు అడ్డుకున్నారు. కోర్టు జోక్యం చేసుకుని విడుదలకు అనుమతిచ్చినప్పటికీ థగ్ లైఫ్ రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.చెన్నైలో కేడీ టీమ్దీంతో కన్నడ థియేటర్లలో థగ్ లైఫ్ బొమ్మ పడకుండానే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై కన్నడ హీరో ధ్రువ సర్జా (Dhruva Sarja)కు ప్రశ్న ఎదురైంది. ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేడీ: ద డెవిల్. త్వరలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా తమిళ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ జర్నలిస్ట్ నుంచి హీరోకు ఊహించని ప్రశ్న ఎదురైంది.నేను పుట్టకముందు నుంచే..కన్నడ సినిమాలు తమిళంలో సులువుగా రిలీజైపోతున్నాయి. కానీ, ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని (Thug Life Movie) మాత్రం కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు తమిళ ప్రజలు.. కన్నడ చిత్రాలు కూడా కోలీవుడ్లో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటున్నారు. మరి మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని అడిగారు. అందుకు ధ్రువ సర్జా.. నేను పుట్టకముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ చిత్రాలు రిలీజయ్యాయి. ఏ ఒక్క సినిమానూ ఎవరూ ఆపలేదు. కమల్ హాసన్ సర్ చేసిన కామెంట్స్ వల్ల ఆయన సినిమాపై వ్యతిరేకత వచ్చిందంతే! మా భాషను అగౌరవపరిస్తే..ఎవరికైనా మాతృభాష అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందరిలాగే మేమూ మా భాషను ప్రేమిస్తాం. మా భాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా! థగ్ లైఫ్ మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బందీ లేకుండా రిలీజయ్యాయి. వాటిని కన్నడిగులు ఆదరించారు కూడా! మాతృభాష జోలికొస్తే, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు అని ధృవ సర్జా ఘాటుగా ఆన్సరిచ్చాడు.చదవండి: మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం' -
మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం'
నటి చైత్ర రాయ్ (Chaitra Rai) గుడ్న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. 'ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.సీరియల్స్ నుంచి సినిమాల్లోకి..మీ ప్రేమాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు కూతురు నిష్క శెట్టి సంతానం. ఇప్పుడా పాపతో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి రానుందన్నమాట! కాగా కన్నడ బ్యూటీ చైత్ర.. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను