South India
-
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
నెల రోజుల్లోపే ఓటీటీకి పాన్ ఇండియా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ హీరో ఆర్య నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ మిస్టర్ ఎక్స్. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 1965లో భారత్ - చైనా బోర్డర్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే బుల్లితెరపై సందడి చేయనుంది. జియో హాట్స్టార్ వేదికగా ఈనెల 14 నుంచే మిస్టర్ ఎక్స్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ అభిమానులకు సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ ముఖ్యపాత్రల్లో నటించారు.మిస్టర్ ఎక్స్ కథేంటంటే..1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోవడంతో ఎదురైన సమస్యలు ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు. దాదాపు 60 ఏళ్లకు పైగా వాటి గురించి పరిశోధనలు జరిపినప్పటికీ ఎలాంటి ఆచూకీ కనిపించలేదు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్. ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
తమిళనాడు అసెంబ్లీలో 'పుష్ప' గురించి చర్చ
తమిళ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ లేనంతగా గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడం. టీవీకే పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అధికారం దక్కించుకున్నారు. రీసెంట్గానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బుధవారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల బలపరీక్షలోనూ నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి దక్కింది. అయితే అధికారం దక్కించుకునే సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు చేశారు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)ఉదయనిధి.. విజయ్పై విమర్శలు చేసిన సందర్భంలోనే తెలుగు బ్లాక్బస్టర్ హిట్ సినిమా 'పుష్ప' గురించి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యమంత్రి విజయ్పై ఘాటు విమర్శలు చేసిన ఉదయనిధి స్టాలిన్.. సోఫా సెట్ రాజకీయం చేశారంటూ సీఎంపై కౌంటర్లు వేశారు. ఆయన పుష్ప తరహా సోఫా రాజకీయం చేశారని విమర్శించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేకి పంపిన తర్వాతే సీఎం.. పూల బొకేలతో అక్కడికి వెళ్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలని అప్పుగా తీసుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చురకలు వేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్కు పాల్పడిందని ఉదయనిధి ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వాన్ని నడపడానికి రేసు గుర్రాలని కొనే అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.'పుష్ప 2' సినిమాలో హీరో, కేంద్రమంత్రి పాత్రధారిని కలవడానికి ముందే డబ్బుల కట్టలతో నిండిన సోఫాని ఆయనకు పంపిస్తాడు. అలానే రావు రమేశ్ పాత్రని ముఖ్యమంత్రి చేసేందుకుగానూ ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపిస్తాడు. అలా ఈ చిత్రంలోని సన్నివేశాల్ని రిఫరెన్స్గా తీసుకుని తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి) View this post on Instagram A post shared by ETamil News (@etamilnewsig) -
విషాదం.. గుండెపోటుతో 47 ఏళ్ల నటుడు మృతి!
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్(47) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం తన ఇంట్లో దిలీప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను సమీప ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించారని ధ్రువీకరించారు. దిలీప్ మరణవార్త కన్నడ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.2007లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన మిలానా చిత్రంలో దిలీప్కి మంచి గుర్తింపు లభించింది. తర్వాత ‘యు-టర్న్’ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. వెండితెరపైనే కాదు.. హిట్లర్ కళ్యాణ వంటి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు.నటుడిగా కాకుండా నిర్మాతగా రాణించారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్పై టీవీ సీరియళ్లను నిర్మించారు. ఆయన అకాల మృతితో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. -
సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు
సినిమాలకు సంబంధించిన వ్యక్తి.. ప్రభుత్వంలో ఉంటే పలు నిర్ణయాలు ఇండస్ట్రీకి కలిసొచ్చేలా ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కోలీవుడ్కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు తమిళనాడులో ఆ ట్రెండ్ మొదలైంది. ఎన్నాళ్లుగానో లేని స్పెషల్ షోలకు అనుమతి లభించింది. త్రిష హీరోయిన్గా నటించిన మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.(ఇదీ చదవండి: టాలీవుడ్కి బిగ్షాక్.. ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది)తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు తొలిసారి ఊరట లభించింది. సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' మూవీకి మే 14,15 తేదీల్లో ఉదయం 9 గంటల స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు విజయ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో చాన్నాళ్ల నుంచి స్పెషల్ షోలు లేవు. దీంతో ఈ నిర్ణయంపై నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్టర్స్.. సీఎం విజయ్కి థ్యాంక్స్ చెప్పింది. తెలుగులో ఈ చిత్రం 'వీరభద్రుడు' పేరిట రిలీజ్ కానుంది. విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమిళనాడులో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 2 వరకు రెండు రోజుల పాటు మొత్తం 5 షోలు వేయనున్నారు.సూర్య,త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన 'కరుప్పు' సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. కోర్టులో సామాన్యులకు న్యాయం అందకుండా చేసే ఓ అవినీతి లాయర్ భరతం పట్టేందుకు దేవుడే దిగివస్తే ఏం జరిగింది అనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత రెండు మూడు సినిమాలతో బాగా డీలాపడిపోయిన సూర్య.. ఇది హిట్ అవ్వడం చాలా కీలకం. మరి ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో 'అవతార్ 3'.. అధికారిక ప్రకటన.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
పూజా హెగ్డే ‘అందాల’ అస్త్రం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
ఎవరేమనుకున్నా కథానాయికల్లో 99 శాతం మంది గ్లామర్ తోనే గుర్తింపు పొందాలని భావిస్తారు. అవకాశాల వేటకు గ్లామరస్ ఫొటోలనే వాడుతుంటారు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదనే సాహసం ఎవరు చేయలేరు. అందాల పోటీల్లో పాల్గొని ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసిన బ్యూటీ ఈమె. 2012 లో ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం సాధించకపోయినా, ఈ అమ్మడి పేరు వెలుగులోకి వచ్చింది. అలా టాలీవుడ్ లో అవకాశాలు అందుకున్నారు. అక్కడ మొదట్లో యువ హీరోలతో జత కట్టి, ఆ తరువాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి ప్రముఖ హీరోలతో నటించి స్టార్ డమ్ను పొందారు.అయితే ఆ మధ్య పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్కడ డిమాండ్ తగ్గింది. అదే విధంగా హిందీలో నటించిన చిత్రాలేవీ సక్సెస్ కాలేదు. కోలీవుడ్లోనూ ఈ భామకు అదే పరిస్థితి. ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయి. దీంతో అవకాశాల వేటలో పడ్డారు. అందులో భాగంగా తన ఆదిలో తీసుకున్న గ్లామరస్ ఫొటోలను తన ఇన్ స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నెటిజన్ల విమర్శలను గట్టిగానే ఎదుర్కొంటున్నాయి. ఇంతకు రెట్రో వంటి చిత్రాల్లో నటించిన పూజాహెగ్డే నేనా ఈమె అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ‘పూజాహెగ్డే కాస్తయినా సంసార పక్షంగా కనిపించేది ఇక్కడేననీ(సౌత్ సినిమాల్లో), బాలీవుడ్లో అయితే వేరే లెవెల్ అంటూ తన ఎక్స్ఫోజింగ్ ఫొటోల గురించి చాలా బోల్డ్గా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
సీఎంగా విజయ్.. మరి కోలీవుడ్ దళపతి ఎవరు?
ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్ క్రియేట్ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో కోలీవుడ్లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.తదుపరి దళపతి ఎవరు?విజయ్ తర్వాత కోలీవుడ్లో అంతే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్లో మాస్ ఇమేజ్ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు అవుతారో వేచి చూడాల్సిందే. -
ఎక్కువ సినిమాలు చేసింది ఎవరు? బ్రహ్మీ స్థానమెంత?
ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)సుకుమారిమలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.మనోరమగోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.జగతి శ్రీకుమార్మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్లో 1500కి పైగా మూవీస్లో కనిపించారు.బ్రహ్మానందంతెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.శక్తి కపూర్బాలీవుడ్కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్గా చేస్తోంది.అనుపమ్ ఖేర్హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.మమ్ముట్టిమహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్) -
విజయ్ సీఎం.. జన నాయగన్కు ఫుల్ డిమాండ్..!
రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
గతంలో తెలుగు సినిమాలని అవమానించి ఇప్పుడేమో!
తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb— Meher Kilaru (@Kilaruness) May 11, 2026 -
రూ.200-300 కోట్ల కలెక్షన్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి భావననే దర్శకుడు విఘ్నేశ్ శివన్ వ్యక్తం చేశాడు. నయనతార భర్త అయిన ఇతడు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (ఎల్ఐకే). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించారు. ఎస్జే.సూర్య విలన్. నయనతార రౌడీ పిక్చర్స్, సెవన్ స్క్రీన్ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించాడు. కాగా గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ప్రదీప్ రంగనాథన్ చేసిన గత చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. ఇది కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎల్ఐకే ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఈ క్రమంలోనే చిత్ర ఫలితంపై విఘ్నేశ్ తాజాగా స్పందించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)నేను ఓ డ్రీమ్తో వచ్చాను. అది చిన్నది కాదు. ఈ మూవీ స్టోరీ కోట్ల థియేటర్లలో అదిరిపోతుందని నమ్మాను. ప్రేక్షకుల చప్పట్ల ధ్వని మారుమోగుతుందని భావించాను. ఎంటర్టైన్ చేసినప్పటికీ రూ.100 కోట్ల క్లబ్లోకి చేరలేదు. నిజం చెప్పాలంటే అంతకంటే రెండు రెట్లు వసుళ్లూ సాధిస్తుందని భావించాను. అయితే ఏదో సరిగా సెట్ అవ్వలేదు. ఫలితం బాధ కలిగించినా, నేను సంతోషంగా, సంతృప్తిగానే ఉన్నాను. ఎందుకంటే ముందు చెప్పినట్లుగానే ఇది విడుదలవ్వడమే పెద్ద బ్లాక్బ్టస్టర్. ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చినా, నేను ఇంకా నిలబడే ఉన్నాను. ఈ చిత్రం వెనుక ఎవరూ చూడని పలు ఇబ్బందులున్నాయి. అయినా నిజాయితీని, శ్రమను సంపాదించి పెట్టిందీ మూవీ అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
సైలెంట్గా మొదలు పెట్టేసిన కార్తి
ప్రస్తుతం తెలుగు దర్శకనిర్మాతలు తమిళ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. తమిళ హీరోలు కూడా తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో శివకార్తికేయన్, ధనుష్, విజయ్ తదితరులు తెలుగు దర్శకులతో మూవీస్ చేశారు. సూర్య కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాధ్ అండ్ సన్స్'లో నటించారు. ఇది త్వరలోనే థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇకపోతే సూర్య తమ్ముడు కార్తీ ఇంతకు ముందే నాగార్జునతో కలిసి 'ఊపిరి'లో నటించారు. ఆ చిత్రం తమిళంలో తోళా పేరుతో విడుదలయ్యింది. కార్తీ ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. ప్రస్తుతం సర్ధార్ 2 పూర్తి చేసిన ఇతడు.. తమిళ్ దర్శకత్వంలో 'మార్షల్'లో నటిస్తున్నాడు. దీని తరువాత తెలుగు దర్శకుడు కల్యాణ్ శంకర్ తీస్తున్న ద్విభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు.ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయని ఇందులో కార్తీకి జంటగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నట్లు తెలిసింది. యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులు కారణంగా వెల్లడించలేదని తెలిసింది. ఈ సినిమా డీటైల్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
నమ్మకం ఉంటే మ్యాజిక్ జరుగుతుంది: హీరో సూర్య
‘‘వీరభద్రుడు’ సినిమా తొలి భాగం మంచి కోర్టు రూమ్ డ్రామా. సెకండాఫ్ మంచి థియేట్రికల్ మాస్ మూమెంట్స్... ఫన్, హ్యూమర్ కూడా ఉంటుంది. ఈ నెల 14న మీ అందరికీ ‘వీరభద్రుడు’ సినిమాతో ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమాను ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని అతిథుల్లా కాకుండా దత్తపుత్రుల్లా భావిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని సూర్య అన్నారు. సూర్య, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ప్రకాశ్బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఎక్కడైతో నమ్మకం ఉంటుందో ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ మ్యాజిక్ జరుగుతుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. సమస్యలు వచ్చినప్పుడు గుడికి వెళ్తాను. కానీ ఆర్జే బాలాజీ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్ధిస్తుంటాడు. ఆర్జే మంచి యాక్టర్, రైటర్, డైరెక్టర్, గుడ్ ఫాదర్, ఫ్రెండ్... ఇలా మల్టీ టాలెంటెడ్. భావోద్వేగం అయినా, హాస్యం అయినా ఆయన నిజాయితీతో వర్క్ చేస్తారు.సుప్రియగారితో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. ‘వీరభద్రుడు’ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థతో అసోసియేట్ కావడం మాకు గౌరవప్రదం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో త్రిష–నేను కలిసి నటించాం’’ అన్నారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో కార్తీ మాట్లాడుతూ–‘‘వీరభద్రుడు’ మాస్ మసాలా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. అన్నయ్య (సూర్యని ఉద్దేశించి)గారు మాత్రమే చేయగలిగిన సినిమా ఇది. థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ‘వీరభద్రుడు’’ అన్నారు.ఆర్జే బాలాజీ మాట్లాడుతూ– ‘‘వీరభద్రుడు’ సినిమా తమిళ ప్రేక్షకుల కోసమే కాదు... తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని తీశాం. మాకు కరుప్పు స్వామి ఎలాగో మీకు వీరభద్రుడు స్వామి అలా. నేనొక దర్శకుడిగా, సూర్యగారు హీరోగా సినిమా చేస్తానని అనుకోలేదు. సూర్యగారు నన్ను నమ్మడం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్లో సూర్య సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకుడా? అని కొందరు అన్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత నాపై వారికి నమ్మకం కలిగింది’’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి, లిరిక్ రైటర్–సింగర్, యాక్టర్ రాకేందు మౌళి, రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ విక్రమ్ మాట్లాడారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ పాల్గొన్నారు.‘‘ప్రపంచంలో మనల్ని నమ్మేవారు ముందు కొద్ది మందే ఉండొచ్చు. రెండు మూడేళ్ల క్రితం తమిళనాడులోని ఒక వ్యక్తిపై విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరూ నమ్మలేదు. చాలామంది నెగటివ్ ప్రచారం చేశారు. కానీ ఆ వ్యక్తి తనను తాను నమ్మాడు. ఇప్పుడు అతను తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యాడు... గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్గారికి తాను మంచి చేయగలనన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే లక్షలాది తమిళ ప్రజల్లోకి వెళ్లి, వారి చేత ఓట్లు వేయించింది’’ అని ఆర్జే బాలాజీ అన్నారు. -
'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో' డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్గా పాత్రలో కనిపించనున్నారు. -
ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. మరి సీఎంగా నెల జీతమెంత?
సినిమాల్లో సక్సెస్ అయిన హీరో విజయ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించారు. పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం అయ్యారు. తమిళనాడు ఎన్నికల్లో మెజార్టీ మార్క్ రాకపోయినా.. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ చిత్రం సెన్సార్ వివాదాలతో రిలీజ్ కాలేదు. ఈ మూవీకి దళపతి ఏకంగా రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపించింది.కానీ ఇప్పుడు విజయ్ హీరో కాదు.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్క సినిమాకు రూ.200 కోట్లు తీసుకునే విజయ్.. సీఎంగా ఎంత సంపాదిస్తారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రజల సొమ్మును తాను తినని స్పష్టం చేసిన విజయ్.. సీఎంగా తనకొచ్చే నెల జీతంతోనే సర్దుకుపోతారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కి నెలకు రూ.2,05,000 జీతం అందుకోనున్నారు. సినిమాల్లో ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విజయ్.. ఇకపై ఏడాది కేవలం రూ. 34.2 లక్షల జీతం మాత్రమే ఆయనకు దక్కనుంది. అయితే వీటితో పాటు ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన విజయ్.. ఇప్పటికే సినిమాలు చేయనని చెప్పేశారు. తన చివరి మూవీ జన నాయగన్ అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల స్ట్రీమింగ్కు వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.గత నెల 23న థియేటర్లలో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ మధువిదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఈ నెల 22 నుంచే సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. మధువిధు అంటే హనీమూన్ అని అర్థం కాగా.. ఈ సినిమాకు విష్ణు అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షరఫ్, కల్యాణీ పాణిక్కర్ జంటగా నటించారు. The wedding is locked.So is the chaos.Be there to witness it all unfold on May 22nd. 💥💍#Madhuvidhu streaming from May 22 only on Sony LIV#SonyLIV #SonyLIVSouth #SonyLIVMalayalam#Sharafudheen #KalyaniPanicker pic.twitter.com/p3XaU1QHPN— Sony LIV Malayalam (@SonylivMal) May 11, 2026 -
రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా
షకీలా పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలు చేయడం లేదు. 80-90ల్లో చాలా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన ఈమె.. అప్పట్లో స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ కాల క్రమంలో మూవీ ఛాన్సుల రాకపోవడంతో కనుమరుగైపోయింది. మూడేళ్ల క్రితం అంటే తెలుగు బిగ్బాస్ 7వ సీజన్లోనూ పాల్గొంది. కానీ రెండో వారమే ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన షకీలా.. రాధిక 'తాయ్ కిళవి' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు)'నిజంగా చెప్పాలంటే 'తాయ్ కిళవి'లో రాధిక బదులు నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని. ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా నటించాను. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది' అని షకీలా చెప్పుకొచ్చింది.సీనియర్ నటి రాధిక లీడ్ రోల్ చేసిన తమిళ సినిమా 'తాయ్ కిళవి'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రిలీజై హిట్ అయింది. పపుంతాయ్ అనే గడుసు వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించింది. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం, ఆమె కుటుంబం చుట్టూ సాగే కథే ఈ సినిమా. అమ్మాయిలు ఈ సినిమా చూస్తే కచ్చితంగా వాళ్ల ఆలోచన మార్పు వచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రాధిక 'తాయ్ కిళవి' సినిమా తెలుగు రివ్యూ) -
'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు
'లవ్ టుడే' ఫేమ్ ప్రముఖ నటి రవీనా రవి పెళ్లి చేసుకుంది. గతంలో కలిసి పనిచేసిన దర్శకుడు దేవన్ జయకుమార్తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కేరళకు చెందిన రవీన్ రవి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటి. తల్లి శ్రీజ కూడా నటి కావడంతో ఆరేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2012 నుంచి పూర్తిస్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిపోయింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి ఈమెనే డబ్బింగ్ చెప్పింది. ఓకే బంగారం, ప్రేమమ్ (మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.కేరళలో పుట్టినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా బోలెడన్ని మూవీస్ చేసింది. 2017 నుంచి నటిగా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' మూవీలో హీరోకి అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్తో ప్రేమలో పడింది. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లితో ఒక్కటయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దు : శివకార్తికేయన్
సామాజిక మాధ్యమాల వినియోగం పెరుగుతున్న సమయంలో వాటి ద్వారా మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ప్రముఖుల పేర్లతోనో, సంస్థల పేరుతోనో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసమో తాజాగా శివకార్తికేయన్ విషయంలో జరిగింది. ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఈయన 2018లో శివకార్తికేయన్ (ఎస్కే) ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి, పలువురు నూతన దర్శకులకు అవకాశాలు కల్సిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా మంచి కథలతో రూపొందిన చిన్న చిత్రాలను విడుదల చేస్తున్నారు. తాజాగా అమ్మాముత్తు సూర్య దర్శకత్వంలో నిర్మిస్తున్న త్వరలో తెరపైకి రానుంది. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్న విషయం శివకార్తికేయన్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో తమ సంస్థ నిర్మించే చిత్రాల కోసం నటీనటులను ఎంపిక చేయడానికి దర్శకులనో, నిర్వాహకులనో, కాస్టింగ్ ఏజెంట్లనో, మరెవరినో ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ఎస్కే ప్రొడక్షన్స్ పేరుతో విడుదలయ్యే వివరాలతో కూడిన ప్రకటనలను తమ అధికారిక సామాజిక మాధ్యమాలతో ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర ఏ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దని శివకార్తికేయన్ పేర్కొన్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరును మోసపూరితంగా ఉపయోగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ప్రభాస్ vs వివేక్ ఒబెరాయ్.. 'స్పిరిట్'కి సందీప్ వంగా వైలెంట్ ట్రీట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. త్వరలోనే ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, విలన్ పాత్రధారి వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు రెండు నెలల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరగనుందని సమాచారం. సందీప్ వంగా గతంలో 'యానిమల్'లో హీరో-విలన్ పోరాట సన్నివేశాలను ఎంత పవర్ఫుల్గా చూపించాడో అందరికీ తెలిసిందే. అదే తరహాలో 'స్పిరిట్'లో కూడా యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేకంగా రెండు నెలల సమయం కేటాయించారు. దాంతో ఈ సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందో తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. -
దేవుడు-లాయర్గా సూర్య.. కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. గత రెండు చిత్రాలు 'కంగువ', 'రెట్రో' అయితే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో కాస్త భిన్నంగా చేద్దామని ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ కమర్షియల్ రూట్లోకి వచ్చేశాడు. అలా చేసిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం(మే 14) థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)ట్రైలర్లోనే దాదాపు స్టోరీ ఏంటనేది చెప్పేసే ప్రయత్నం చేశారు. ఓ కోర్టు. అందులో విలన్(ఆర్జే బాలాజీ), హీరోయిన్(త్రిష) లాయర్స్గా పనిచేస్తుంటారు. న్యాయం అంటూ ఎవరొచ్చినా సరే తిప్పించుకుంటూ ఉంటారు. దీంతో దేవుడు అయిన హీరో(సూర్య) లాయర్గా వస్తాడు. అటు సామాన్యులకు న్యాయం చేయడంతో పాటు విలన్ బెండు ఎలా తీశాడనేది కథలా అనిపిస్తుంది.సూర్య, త్రిష హీరోహీరోయిన్లు కాగా.. దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్గానూ చేశాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు ట్రైలర్ కూడా వదులుతారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, హీరో విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర విషయాల వల్ల సూర్య సినిమాపై కనీస బజ్ లేకుండా పోయింది. మరి ఇదైనా సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్) -
ఈ చిన్నారిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
చిన్నప్పటి జ్ఞాపకాలే మన జీవితంలో వెలకట్టలేనివి. అలాంటి మధుర జ్ఞాపకాలు ఒక్కటున్నా సరే చూసుకుని తరించిపోతాం. మన చిన్నప్పటి ఫోటోలను చూస్తే అసలు నేనేనా అక్కడ అన్నంతలా ఫీలైపోతాం. మన జీవితంలో ఎప్పుడైనా బాల్యం నాటి ఫోటోలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే షేర్ చేసేస్తుంటాం. తాజాగా స్టార్ హీరోయిన్ ఇవాళ తన చిన్నప్పటి క్యూట్ పిక్ను షేర్ చేసింది. మాతృ దినోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోలు పంచుకుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ చూసేద్దాం పదండి.గతేడాది రిలీజైన కాంతార మూవీతో ఒక్కసారిగా అందిరినీ తనవైపు తిప్పుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్. తన అందం, నటనతో కాంతార చిత్రంలో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఏడాది యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్లో కనిపించనుంది. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డ్రాగన్లో కనిపించనుంది. ఇవాళ మదర్స్ డే కావడంతో అమ్మతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) -
సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్
కోలీవుడ్ హీరో విజయ్కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. విజయ్కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది.విజయ్తో త్రిష రిలేషన్..ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే త్రిష బర్త్ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. -
సీఎంగా విజయ్.. రజనీకాంత్-కమల్ సినిమా ఆగిపోతుందా?
ఏదైనా ఒక రంగంలో ఒక ఘటన జరిగితే దాన్ని ఇతర విషయాలకు ఆపాదిస్తూ సందేహాలను వ్యక్తం చేయటం జరుగుతుంటుంది. అలాంటి సందేహాలు ఇప్పుడు ఒక మల్టీ స్టార్ చిత్రం గురించి వ్యక్తం అవుతున్నాయి ఆ చిత్రం ఏమిటన్నది చాలామంది గెస్ చేసే ఉంటారు. కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించిన మల్టీ స్టార్ చిత్రం గురించి ప్రస్తుతం వ్యక్తం అవుతున్న ఆ సందేహాలు. వీరి కాంబినేషన్లో నెల్సన్ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఇన్బన్ ఉదయనిధి భారీ బడ్జెట్లో నిర్మించనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలుపడిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై చివరి వారిలో గానీ ఆగస్టు ప్రథమార్థంలో గానీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా ప్రస్తుత రాజకీయ రాజకీయ పరిస్థితులే ఈ చిత్రంపై సందేహాలు నెలకొనడానికి కారణం అనే భావన వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. మరో విషయం ఏమిటంటే విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలకు పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వారసుడు ఇన్బన్ ఉదయనిధి ఇప్పుడు కమలహాసన్, రజినీకాంత్ హీరోలుగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్కు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రసక్తే లేదని, ఇతరత్రా సహకారాలకు సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంటుందా అన్నదే ప్రశ్న. డీఎంకే పార్టీకి మద్దతు దారుడిగా నటుడు రజనీకాంత్, అదే పార్టీకి సానుకూలపరుడిగా కమల్ వ్యవహరిస్తుండటం ఇందుకు ఒక కారణం. అయితే వీరిద్దరూ టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారన్నది గమనార్హం. అంతేకాకుండా నటుడు, మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ కమలహాసన్ కలిసి నటించిన చిత్రంపై రేకెత్తిస్తున్న సందేహాలు వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
'రష్మిక బాటలో మరో హీరోయిన్.. నాకు తెలుగబ్బాయే కావాలి'
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మూవీ 'ప్రసన్న వదనం'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆ తర్వాత చౌర్యపాఠం అనే చిత్రంలోనూ మెరిసింది. ఇటీవలే పాపం ప్రతాప్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం పాయల్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రెస్మీట్కు హాజరైన పాయల్ రాధాకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను కన్నడకు చెందిన వ్యక్తినే.. కానీ పెళ్లి విషయంలో మాత్రం తెలుగువాడే కావాలని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు గుర్తింపు, గౌరవం, ఉపాధిని ఇచ్చింది టాలీవుడ్ పరిశ్రమనేనని తెలిపింది. తెలుగు ప్రేక్షకులు చూపించే ఆదరణ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. తెలుగు చిత్ర పరిశ్రమ తనకు ఆర్థిక భరోసాను ఇచ్చిందని వెల్లడించింది. అందుకే తన లైఫ్ పార్ట్నర్ కూడా తెలుగు వాడే కావాలని కోరుకుంటున్నట్లు పాయల్ వెల్లడించింది.ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కన్నడ బ్యూటీలంతా తెలుగింటి కోడలైపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే కన్నడ భామ రష్మిక మందన్నా.. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ సైతం అదే బాటలో దూసుకెళ్తోంది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. తెలుగు కోడలిగా స్థిరపడాలన్న పాయల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ...ఎందుకో తెలుసా?
వైవిధ్య భరత పాత్రల్లో నటించాలని తపించే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. ఈయన ఏ చిత్రం చేసిన తన పాత్రలో కచ్చితంగా కొత్త దనాన్ని చూపిస్తుంటారు. అలా నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది ఉండకపోవచ్చు. అయితే సూర్య నటన మాత్రం అందరూ కొనియాడతారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు. నటి త్రిష నటించిన ఈ చిత్రాన్ని నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో సూర్య విభిన్న గెటప్పులతో కనిపించడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. కాగా త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఆయన అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న కరుప్పు చిత్రం ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల అవుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతున్న తరుణంలో నిర్ణయించిన తేదీలోనే చిత్రం విడుదలవుతుందని దర్శకుడు ఆర్జే బాలాజీ స్పష్టంగా పేర్కొన్నారు. ఇకపోతే సూర్య కథానాయకుడిగా నటించిన మరో చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. నటి మమితా బైజు నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించడంతో సూర్య అభిమానులకు డబల్ ధమాకా కావడంతో యమ ఖుషీ అవుతున్నారు. -
మణిరత్నం, సుహాసినిల కొడుకుని చూశారా? ఏం చేస్తాడో తెలుసా?
ప్రఖ్యాత సినీ దర్శకుడు మణిరత్నం, ఇక ఆయన సతీమణి నటి సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బహుభాషా నటిమణి. అయితే వీరి పుత్ర రత్నం గురించి చెప్పే తీరాలి. దర్శకుడు మణిరత్నం, నటి సుహాసినిల వివాహం 1988లో జరిగింది. వీరి ఏకై క పుత్రుడి పేరు నందన్.మణిరత్నం, సుహాసిని దంపతులకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలుసుగానీ అతను ఎలా ఉంటాడో అన్న విషయం ఎవరికీ తెలియదు. ఈయన తల్లిదండ్రులు ప్రముఖ సినీ దంపతులు అయినా, నందన్ మాత్రం ఏ సినీ కార్యక్రమంలో కనిపించాడు. లండన్లోని ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో. మనో శాస్త్రం, రాజకీయం శాస్త్రానికి సంబంధించిన విద్యను అభ్యసించిన నందన్ ఆరంభ కాలం నుంచే రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూస్తూ వచ్చాడని ఆమె తల్లి, నటి సుహాసిని ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఆమె పేర్కొంటూ నందన్ కమ్యూనిస్టు భావాజాలం ఉన్న వ్యక్తి అని చెప్పారు. తను 15 వయసులోనే లెనినిజంతో కూడిన కంటోర్స్ ఆఫ్ లెనినిజం అనే చిరు కథను రాశాడని చెప్పారు. అంతటితో నందన్ రాజకీయ ఆసక్తి ఆగలేదు అన్నారు. ఇతర పిల్లల మాదిరిగా కాకుండా నందన్ పాఠశాల నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్లో జరిగే చర్చలను ఆసక్తిగా వినేవాడు అన్నారు. 12 ఏళ్ల వయసులోనే కార్ల్ మార్క్స్ రాసిన మూలధనం పుస్తకాన్ని చదివేవాడన్నారు. అలాంటి ఒక పుస్తకాన్ని తీసుకొని కేరళలోని సీపీఎం కార్యాలయానికి వెళ్లాడు అన్నారు. అక్కడ తాను కార్లో వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదని, కారును వేరే ప్రాంతంలో నిలిపి పార్టీ కార్యాలయానికి వెళ్లాడన్నారు. అక్కడ నందన్ చూసినవారు ఎవరు నువ్వు ? అని అడక్కుండా బోంచేసావా అని హరి గారు అన్నారు. అదే కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకత అని సుహాసిని పేర్కొన్నారు. భోజనానంతరం సీపీఎం పార్టీ కార్యదర్శిని కలిసి మాట్లాడాడని చెప్పారు. కాగా తన పేరు అడిగినప్పుడు దర్శకుడు మణిరత్నం పేరు వాడితే తానెవరో తెలిసిపోతుంది అని ఆయన అసలు పేరు గోపాల్ రత్నం సుబ్రహ్మణ్యం కొడుకు అ ని చెప్పేది అన్నారు. అయితే తన పేరు మాత్రం సుహాసిని చెప్పడంతో తను తమ కొడుకా అందరికీ తెలిసిందన్నారు. ఆ సంఘటన తర్వాత నందన్ సీపీఎం పార్టీ సభ్యుడిగా మారిపోయాడని నటి సుహాసిని చెప్పారు. -
Avika Gor: ఇండియా వదిలి వెళ్లిపోతున్న మరో హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గోర్. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భర్త మిలింద్ చంద్వానీ వృత్తిపరమైన అవకాశాల కారణంగా ఈ జంట భారతదేశాన్ని విడిచి బ్యాంకాక్లో శాశ్వతంగా స్థిరపడనుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమ తర్వాత 2025 సెప్టెంబర్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమ వైవాహిక జీవితాన్ని మరింత ప్రశాంతంగా, కొత్త వాతావరణంలో గడపాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అవికా గోర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి బ్యాంకాక్కు శాశ్వతంగా మారిన విషయాన్ని వెల్లడించింది. మేము బ్యాంకాక్కు మారిపోయాం. అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాం. దాన్ని నా అభిరుచులకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నానను. ఈ మార్పు వెనుక ప్రధాన కారణం మిలింద్కు అక్కడ లభిస్తున్న మెరుగైన వృత్తి అవకాశాలే. ఇద్దరం పరస్పరం చర్చించి, ఒకరి కెరీర్ను మరొకరు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించింది. మేము చాలా కాలంగా కలిసి ఉన్నాం. ఎప్పుడూ ఒకరి కెరీర్ ఎంపికలకు మరొకరు అండగా నిలుస్తామని అవికా స్పష్టం చేసింది.అయితే దేశం విడిచి వెళ్లినంత మాత్రాన అవికా తన సినీ కెరీర్ను వదులుకోవడం లేదు. షూటింగ్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ నుండి ముంబై లేదా హైదరాబాద్కు రావడం పెద్ద సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. గతంలోనూ తరచూ ప్రయాణాలు చేసిన అనుభవం ఉండటంతో ఈ మార్పు తన కెరీర్పై కూడా ప్రభావం చూపదని అవికా నమ్మకం. హీరోయిన్లు ఇండియా వదిలి వెళ్లిపోవడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు. కొన్నేళ్ల కిందట ఇలియానా కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిలైపోయింది. ఇప్పుడు అవికా గోర్ వంతు. -
'దృశ్యం 3' ట్రైలర్ రిలీజ్.. ఈసారి థ్రిల్తో పాటు
మోహన్ లాల్ని ఇప్పటి జనరేషన్కి బాగా దగ్గర చేసిన సినిమా 'దృశ్యం'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మూడో భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 21నే మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)తొలి రెండు భాగాల్లోనూ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న జార్జ్ కుట్టి & ఫ్యామిలీ.. ఈసారి ఎలాంటి ఝలక్స్ ఇవ్వబోతుందనేది చూడాలి. తొలి రెండు భాగాల్లో థ్రిల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం థ్రిల్తో పాటు డ్రామా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి ఇద్దరు జర్నలిస్టుల వల్ల జార్జ్ కుట్టి కేసుని పోలీసులు మళ్లీ ఓపెన్ చేయడం లాంటి సీన్స్ ట్రైలర్లో చూపించారు. ఈసారైనా వరుణ్ శవం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి సినిమా. జీతూ జోసెఫ్ దర్శకుడు కాగా మోహన్ లాల్ సరసన మీనా చేసింది. తొలి రెండు భాగాల్ని తెలుగులో వెంకటేశ్తో రీమేక్ చేశారు. కానీ మూడో భాగాన్ని చేస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు డబ్బింగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి? హిందీలో మాత్రం అజయ్ దేవగణ్ వేరే కథతో 'దృశ్యం 3' తీస్తున్నాడు. ఈ ఏడాదిలోనే దాని రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ) -
విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి
ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ అన్నట్లు తయారైంది. లేటెస్ట్ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ 107 సీట్లు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో 11 సీట్లు అవసరమున్న నేపథ్యంలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. విజయ్ పలుమార్లు గవర్నర్ని కలుస్తున్నా ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ మాత్రం పోవట్లేదు. మరోవైపు విజయ్-త్రిష బంధం గురించి సోషల్ మీడియాలోనూ రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నటి రాఖీ సావంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్)'నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి త్రిష నాకు తెలుసు. ఎంతో కష్టపడి ఆమె ఈ స్థాయికి వచ్చింది. విజయ్తో కలిసి పనిచేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడితో ఒక్క పాటైనా చేయాలని కలలుకన్నాను. కానీ ఛాన్స్ రాలేదు. కనీసం విజయ్-త్రిష మెహందీ వేడుకలో అయినా డ్యాన్స్ చేస్తాను. పెళ్లి చేసుకుంటే ఇద్దరినీ ఒకేసారి కలిసి ఫొటో దిగుతాను' అని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.ముఖ్యమంత్రి అయ్యే పనిలో విజయ్ కిందామీద పడుతుంటే రాఖీ సావంత్ మాత్రం త్రిషని అతడు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అయ్యే పనిలో ఉంది. ఇప్పుడే కాదు గతంలో బిగ్బాస్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే దానిపై కామెంట్ చేస్తూ ట్రెండ్ అవ్వాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా విజయ్-త్రిషపై అలానే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.(ఇదీ చదవండి: నిశ్చితార్థ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి) -
ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్
రష్మికకు ఆల్రెడీ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లయిపోయింది కదా! ఈ రష్మిక ఎవరు? ఏ దర్శకుడిని పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడొద్దు. గతేడాది 'సు ఫ్రమ్ సో' అనే కన్నడ సినిమా తెలుగులోనూ రిలీజైంది. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతోనే హిట్ కొట్టిన దర్శకుడు జేపీ తుమినాడు.. మూడు రోజుల క్రితం ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన చిరు)కేరళలో పుట్టి పెరిగిన జేపీ తుమినాడు.. గత పదేళ్లుగా కన్నడ సినిమాల్లో నటుడు, రచయిత, దర్శకుడిగా చేస్తున్నాడు. 2017లో వచ్చిన 'ఒండు మొట్టెయ కథే'లో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేశాడు. తర్వాత తులు భాషలో దర్శకుడిగా 'కటపడి కట్టప్ప' అనే మూవీ తీశాడు. అనంతరం గరుడ గమన వృషభ వాహన, స్వాతి ముత్తిన మలే హనియే, సప్త సాగర ఎల్లో దాచే రెండు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు.గతేడాది రిలీజైన 'సు ఫ్రమ్ సో' అనే విలేజ్ కామెడీ మూవీతో తెలుగు, కన్నడలో మంచి స్పందన అందుకున్నాడు. ఇకపోతే నాటక రంగంలో ఉన్నప్పుడే పరిచయమైన రష్మిక అనే అమ్మాయిని జేపీ తుమినాడ్.. 14 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్దల్ని ఒప్పించి ఈ బుధవారం(మే 06) మంగళూరులో వీళ్లిద్దరి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో తోటి సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా) View this post on Instagram A post shared by Onelove Production (@oneloveproductions.in) -
గవర్నర్తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్ని కలిసిన విజయ్.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చూపించారు. అయితే విజయ్తో పాటు టీవీకే నేతలు కనిపించారు. కాకపోతే 'జన నాయగణ్' నిర్మాత వెంకట్.కె.నారాయణ కూడా ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)కెవిఎన్ ప్రొడక్షన్స్ పేరిట 2020లో నిర్మాణ సంస్థని స్థాపించిన వెంకట్ కె నారాయణ.. ప్రస్తుతం 'జన నాయగణ్'తో పాటు చిరంజీవి-బాబీ, టాక్సిక్ తదితర చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈయనకు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్పితే రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే విజయ్తో పాటు తమిళనాడు గవర్నర్ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా టీవీకే పార్టీలో ఏమైనా భాగమయ్యారా? లేదంటే సాధారణంగానే వెళ్లారా అనేది ప్రస్తుతం సస్పెన్స్. 'జన నాయగణ్' సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై బోలెడంత బజ్ నెలకొంది. కానీ సెన్సార్ బోర్డ్.. దీన్ని పలు కారణాలు చెప్పి అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్కి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చనిపిస్తోంది. మరి ఈ నెలలోనే ఈ సినిమాని విడుదల చేస్తారా లేదంటే జూన్లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.తెలుగు సినిమా 'భగవంత్ కేసరి' రీమేకే జన నాయగణ్. హెచ్ వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ సంగీతమందించాడు. అయితే ఇప్పటికే సినిమా పైరసీకి గురైంది. చాలామంది సదరు ప్రింట్ చూసేశారు కూడా. అయినా సరే కాస్తోకూస్తో బజ్ ఉందంటే దానికి కారణం విజయ్. ఇప్పుడు సీఎం కూడా అయ్యాడు కాబట్టి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)#ThalapathyVijay's Latest video with Governor and He stakes claim to form Government in TN..🔥🤩 All is Well..🤝pic.twitter.com/kbYBy4TVMZ— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2026 -
ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?
తమిళనాడు రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అని చిన్నపాటి టెన్షన్. అన్నీ కలిసొస్తే ఇతడే సీఎం కావొచ్చు. అయితే విజయ్తోపాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటి మనోరమ గురించి మీలో ఎంతమందికి తెలుసు. ఇంతకీ ఎవరీ నటి? ఏ సీఎంలతో ఏయే సినిమాలు చేసిందంటే?నాటకాలతో మొదలుపెట్టి తెలుగు, తమిళంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మనోరమ.. 1950 నుంచి 2015 వరకు నటిస్తూనే ఉన్నారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఈమె.. తమిళ ఇండస్ట్రీలో పోషించని పాత్ర లేదనే స్థాయికి ఎదిగారు. అసలు విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రుల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, స్టాలిన్తో పాటు దిగ్గజ హీరో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోనూ నటించారు. విజయ్తోనూ తెరని పంచుకున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయితే ఏడుగురి సీఎంలతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతమవుతుంది.అన్నాదురైద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలని నాటకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో ఈమె, అన్నాదురై కలిసి నటించారు.కరుణానిధినాటకాల్లో మనోరమ ప్రతిభని గుర్తించిన నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్.. ఈమెని చెన్నై తీసుకెళ్లి, కరుణానిధి రచించిన 'మణిమగుడం' నాటకంలో నటించే అవకాశమిచ్చారు. 'ఉదయ సూరియన్' నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.ఎంజీఆర్నాటకాల నుంచి సినిమాలకు వచ్చిన మనోరమ.. ఎమ్జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్తో పలు హిట్ సినిమాల్లో నటించారు. అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో ఈమె కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది.జయలలితజయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటన ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారుస్టాలిన్తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అలా ఈయన విజయ్కాంత్ హీరోగా చేసిన 'మక్కళ్ అనైయిట్టల్' చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు.ఎన్టీఆర్తమిళంలో ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మనోరమ.. తెలుగులో ఎన్టీఆర్తోనూ కలిసి తెర పంచుకున్నారు. నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో కలిసి నటించారు.విజయ్(ఇంకా సీఎం కాలేదు)తమిళనాడులో ప్రస్తుతం విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతడితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.1937 మే 26న మన్నార్గుడిలో పుట్టిన మనోరమ అసలు పేరు గోవిందమ్మాళ్. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కారైకుడి ప్రాంతానికి వలస వెళ్లింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే 'యార్ మగన్' అనే నాటకంతో రంగస్థల నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 1958లో వచ్చిన 'మళయిట్ట మాంగై' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాల్లోకి రాకముందే తన డ్రామా ట్రూప్ మేనేజర్ ఎస్ఎమ్ రామనాథన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. వీళ్లకు భూపతి అనే కొడుకు కూడా పుట్టాడు. తర్వాత కొన్నాళ్లకు ఈమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. 2015 అక్టోబరులో 78 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఈమె కన్నుమూసింది. -
ఆగస్టులో ఆట మొదలు
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్ తివారి, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటించారు. వే ఫారర్ ఫిలిమ్స్ బ్యానర్పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది.కాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, దుల్కర్ సల్మాన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘నా కెరీర్లో చేసిన సినిమాల్లో ‘ఐ యామ్ గేమ్’ అత్యంత స్టైలిష్ ఫిల్మ్. నహాస్ హిదాయత్ ప్రత్యేకంగా నన్ను ఓ కొత్త స్టైలిష్ లుక్లో చూపించడం ఈ ప్రాజెక్ట్కు హైలెట్. ‘లోకా’ వంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత వే ఫారర్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న చిత్రం ‘ఐ యామ్ గేమ్’. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది’’ అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. -
రామ్ చరణ్ 'పెద్ది' గాయాల కథ
పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్తో చరణ్ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలామంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయం జరిగింది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటి పైభాగంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్కి ఇది మాత్రమే కాదు, జిమ్లో వర్కవుట్ చేస్తున్నప్పుడు, 'చికిరి చికిరి' పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రయిలర్ రిలీజ్కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
'విజయ్ గెలుపునకు.. త్రిషకు సంబంధమేంటి?..' నటి ఆగ్రహం
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. ఇక విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా ఓకే కానీ.. విజయ్ గెలిచిన తర్వాత త్రిష పేరు కూడా అదే రేంజ్లో వైరలవుతోంది. ఫలితాల రోజు త్రిష బర్త్ డే కావడంతో.. ఈ గెలుపును ఆమెకు పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా వీరద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా టాక్ వినిపిస్తోంది. విజయ్ విజయం తర్వాత సీఎం టాపిక్ కంటే..వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ నడుస్తోంది.విజయ్- త్రిష పర్సనల్ లైఫ్పై వస్తున్న వార్తలపై నటి గాయత్రి శంకర్ స్పందించారు. విజయ్ గెలవడానికి త్రిషనే కారణమని అభినందిస్తున్న వారిని విమర్శించింది. ఒకవేళ పురుషుడి స్థానంలో మహిళ ఉంటే సమాజం ఇలాగే స్పందిస్తుందా అని ప్రశ్నించారు. ఒక నటి తన సహనటుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినట్లయితే ఏ సమాజం ఇలాంటివీ సహించదని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. త్రిష స్థానంలో పురుషుడు ఉంటే ఈ విషయాన్ని జోక్గా తీసుకునేవారు కాదని.. యావత్తు పురుష సమాజం ఆగ్రహంతో రగిలిపోయేదని అన్నారు. ఆమెను అంతులేకుండా దూషించేవారని గాయత్రి అభిప్రాయపడ్డారు. గెలవడం సంగతి అటుంచితే.. ఆమె తన ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడిపోయేదని గాయత్రి విమర్శించారు. కాగా.. గాయత్రి శంకర్ 'సూపర్ డీలక్స్', 'విక్రమ్' వంటి చిత్రాలతో కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. -
'విజయ్కు అడ్డంకులు.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్'
తమిళ హీరో, దళపతి విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ హీరోగా నిలిచాడు. పాలిటిక్స్లో అడుగుపెట్టి తొలిసారే ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. సీఎం కావడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ద్రవిడ రాజకీయాలను షేక్ చేశాడు. అన్ని స్థానాల్లో సింగిల్గా పోటీ చేసి 108 సీట్లు గెలిచారు. అయితే అధికారం చేపట్టేందుకు మాత్రం ఇంకా సీట్లు కావాలి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలిశారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లిస్ట్ అందజేశారు. ఇంకా ఆరుగురు సభ్యులు అవసరం కావడంతో గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.తమ హీరో, నాయకుడు అత్యధిక సీట్లు గెలిచినా కూడా సీఎం కావడానికి మరింత సమయం పట్టడంపై ఓ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ చెన్నైలోని విజయ్ ఇంటి బయట పూజలు చేస్తూ కనిపించారు. తమ నాయకుడికి అడ్డంకులు రావడంతో అభిమాని ఆవేదనకు గురయ్యారు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. எவ்வளவு கஷ்டம் வந்தாலும் என் தலைவர் முதலமைச்சர் ஆகனும்.. சாமி நீ தான் காப்பாதனும். 🥺🥺🙏pic.twitter.com/7KBbMzgwXN— KERALA VIJAY FANS CLUB (@KVFC_Official) May 7, 2026 -
చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్
ఒక్కసారి నటుడైనా, నటి అయినా సక్సెస్ను అందుకంటే సినిమా వారిని అంత సులభంగా వదులుకోదు. అలా ఏళ్ల తరబడి ఈ రంగంలో కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి తారలలో నటి వేదిక ఒకరు. ఈ మహారాష్ట్ర భామ గత రెండు దశాబ్దాలుగా కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళంలోకి 2005లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని చేరుకున్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు తమిళంలో పరదేశీ, కావ్యతలైవన్, శివలింగ, బానం వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈమె పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లోనూ నటించి మెప్పించారు. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన వేధికకు తమిళంలో చిన్న గ్యాప్ వచ్చింది. అయితే దాన్ని పూర్తి చేసే విధంగా మళ్లీ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మహాల్ అనే తమిళ చిత్రంతో పాటు తమిళం,తెలుగు భాషల్లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఆమె స్థానాన్ని ఇక్కడ సుస్ధిరం పరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆకర్షనీయమైన అవయవ సంపద, అభినయం కలిగిన ఈ 38 ఏళ్ల భామ ఇటీవల వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. అర్కా మీడియా నిర్మించిన యక్షిణి అనే వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రను పోషించారు. అందులో ఈమె బోల్డ్ నటనకు గానూ హిందూస్థాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డును గెలుచుకున్నారు.. కాగా చిన్న గ్యాప్ తరువాత మళ్లీ తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతున్నట్లు సమాచారం. -
రామ్ చరణ్ 'పెద్ది' ట్రయిలర్ రెడీ.. మూడో లుక్పై సస్పెన్స్
రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్లో మూడో లుక్ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. -
నిర్మాత ఆర్బీ చౌదరి మృతి.. విజయ్ నివాళులు
ప్రముఖ నిర్మాత అధినేత ఆర్బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.కాగా... ఆర్బీ చౌదరితో విజయ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. தயாரிப்பாளர் ஆர். பி. சௌத்ரி உடலுக்கு தலைவர் விஜய் நேரில் அஞ்சலி! pic.twitter.com/GmhMrE5ByT— Tamilaga Vettri Kazhagam (@TVKFor_TN) May 6, 2026 -
ఆర్బీ చౌదరి మరణం.. ఆయన చివరి ఈవెంట్ ఇదే..!
ప్రముఖ దక్షిణాది నిర్మాత ఆర్బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు.ఆర్బీ చౌదరి మరణం వేళ ఓ వీడియో వైరల్గా మారింది. నిర్మాతగా ఆయన దాదాపు 99 సినిమాలు నిర్మింంచారు. నిర్మాతగా ఆయన హాజరైన చివరి ఈవెంట్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆయన కుమారుడు జీవా హీరోగా నటించిన తలైవాన్ మూవీ ఈవెంట్లో చివరిసారిగా కనిపించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆర్బీ చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవా కుమారుడు సైతం కనిపించారు. తన మనవడితో ఆర్బీ చౌదరి ఈవెంట్లో సందడి చేశారు. தயாரிப்பாளர் ஆர்.பி.சௌத்ரி இறுதியாக கலந்து கொண்ட நிகழ்வு ( மகன் ஜீவா நடித்த தலைவர் தம்பி தலைமையில் பட வெற்றி விழா). மகன் மற்றும் பேரனுடன் மகிழ்ந்திருந்த தருணம்#RBChoudhary | #Jiiva pic.twitter.com/QFr4BOc50P— PttvOnlinenews (@PttvNewsX) May 5, 2026 -
విజయ్ జన నాయగన్.. తొలి హీరోగా రికార్డ్
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి మెజారిటీ రాకపోయినా వందకు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. దీంతో హీరో విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతిన నటించిన చివరి సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.ఇప్పుడు విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో త్వరలోనే జననాయగన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. అభిమానుల కోసం జననాయగన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జననాయగన్ టైటిల్ కార్డ్పై దళపతి విజయ్ బదులు.. సీఎం విజయ్ అని రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు కేకలు వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.టీఎన్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలవడంతో మూవీ టీమ్ అభినందిస్తూ పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ టైటిల్ కార్డు మార్చాలని కోరారు. ఫ్యాన్స్ విజ్ఞప్తితో గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్.. అంటూ జననాయగన్ టైటిల్ కార్డు వేసింది. పోలీసు డ్రెస్లో నడుచుకుంటూ వస్తున్న విజయ్ను లుక్ అదిరిపోయింది. త్వరలో కలుద్దాం అంటూ ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శించారు. ఒక నటుడికి సీఎం టైటిల్ కార్డు వాడడం ఇదే తొలిసారి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది. India's first time CM title card for actor !pic.twitter.com/7xrz4QgbmO— ʲᵈᴀʟᴇxᴀɴᴅᴇʀᵗʷᵉᵉᵗˢ (@JDALEXtweets) May 6, 2026 -
అలా చేశాడంటే.. విజయ్ పతనం ఖాయం..!
సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్తో పాలిటిక్స్లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్టాపిక్గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.త్రిష ఎంట్రీతో విజయ్కి దెబ్బ..రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్ రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరుతిరుచ్చి ఈస్ట్ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం. అక్కడ విజయ్ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది. ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్ లైఫ్ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విజయ్ గెలిచాక అన్ఫాలో చేశాడా?.. అసలు నిజమేంటి?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో జేసన్ తన తండ్రిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేసన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు. ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్ను అన్ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.కాగా విజయ్- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్పై జూన్లో విచారణ జరగనుంది. -
ఆ వార్తల్లో నిజం లేదు: కియారా అద్వానీ
‘‘టాక్సిక్’ సినిమాలో నా పాత్రకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’’ అంటున్నారు హీరోయిన్ కియారా అద్వానీ. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు.కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో కథకి అవసరం మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ చిత్రీకరించారట గీతూ మోహన్దాస్. అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆ సన్నివేశాలను తొలగించాలని కియారా కోరారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు కియారా అద్వానీ.‘‘టాక్సిక్’ మూవీలో నా పాత్రకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నేను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే విధంగా నాపై ఉన్న కొన్ని సీన్స్ తొలగించమని యూనిట్ని కోరాననే వార్తలు కూడా అవాస్తవం. అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే’’ అని స్పష్టం చేశారు కియారా. ఇదిలా ఉంటే.. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ‘టాక్సిక్’ జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ కావడం లేదంటూ యశ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. -
మాస్ వీరభద్రుడు
సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల కానుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తయిందని, సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందనీ మేకర్స్ తెలిపారు.‘‘మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘వీరభద్రుడు’. ఈ మూవీని ఆర్జే బాలాజీ తనదైన శైలిలో తెరకెక్కించారు. తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లో పాపులర్ కంటెంట్ను అందించి, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరు తెచ్చుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘వీరభద్రుడు’ని భారీ స్థాయిలో నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలని సృష్టించాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్, కెమెరా: జీకే విష్ణు. -
ఆర్బీ చౌదరి మృతిపై విశాల్ దిగ్భ్రాంతి
ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్బీ చౌదరి మృతి వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తను షూటింగ్ మధ్యలో విన్న నటుడు విశాల్ తీవ్రంగా కలత చెందారు. విశాల్ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుండి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని విశాల్ తన సంతాపాన్ని ప్రకటించారు.ఆర్బీ చౌదరి స్థాపించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు నిర్మించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతి భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆర్బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆర్బీ చౌదరి ఇవాళ రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. -
ఆర్బీ చౌదరి.. రాజస్థాన్ టూ సౌత్ ఇండస్ట్రీ.. ప్రస్థానం ఇలా..!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. ఆయన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించారు. పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు సంతాపం ప్రకటించారు.ఆర్బీ చౌదరి ప్రస్థానం..రాజస్థానీ కుటుంబానికి ఆర్బీ చౌదరి పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. ఆయన మొదట ఉక్కు, ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మలయాళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టారు. సూపర్ పేరుతో బ్యానర్ ప్రారంభించి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.గుడ్ నైట్తో భాగస్వామ్యం..గుడ్ నైట్ అనే దోమల నివారణ మ్యాట్లను తయారు చేసే ఆర్ మోహన్ను తన భాగస్వామిగా చేర్చుకున్నారు. ఇద్దరు కలిసి సూపర్ బ్యానర్లోనే సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయే సమయంలో గుడ్ నైట్ అనే బ్రాండ్లోని గుడ్ అనే పదాన్ని తీసుకుని సూపర్ గుడ్ ఫిల్మ్స్గా పేరు మార్చేశారు. ఆ తర్వాత ఇదే పేరుతో చిత్రాలు నిర్మించారు ఆర్బీ చౌదరి. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో చివరిసారిగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.స్వతహాగా రాజస్థానీ అయిన ఆర్బీ చౌదరి తమిళ్ అయిన మహజబీన్ను వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు సురేష్ వారి సొంత నిర్మాణ సంస్థ అయిన 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. మరో కుమారుడు జీవన్ ఒక స్టీల్ కంపెనీని నడుపుతున్నారు. మూడో కుమారుడు జితన్ రమేష్ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు జీవా హీరోగా చాలా సినిమాలు చేశారు. జీవా రంగం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. జీవాకు టాలీవుడ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. జీవ తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్ అయ్యారు. -
విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా?
తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది.ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్ టైమ్లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. BREAKING: Pooja Hegde points at Thalapathy Vijay as the election winner and he responds with a shy blush. pic.twitter.com/aUdvjB7Odx— Actor Vijay Team (@ActorVijayTeam) May 5, 2026 -
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించిన ఆయన పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా తెలుగులో నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించారు. తమిళ హీరో విజయ్తో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. విజయ్తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో చివరిసారిగా చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని నిర్మించారు.అర్బీ చౌదరి సినీ ప్రస్థానం..ఆయన పూర్తి పేరు రతన్లాల్ భగత్రామ్ చౌదరి. మొదట మలయాళం సినిమాలతో నిర్మాతగా ప్రవేశం చేశారు. 1989లో తమిళ సినిమాల్లో ప్రవేశించి, "సూపర్" బ్యానర్ కింద సినిమాలు నిర్మించారు. అటు తరువాత "గుడ్ నైట్" బ్రాండ్ నుండి "గుడ్" అనే పదాన్ని తీసుకుని, "సూపర్ గుడ్ ఫిల్మ్స్" అనే పేరుతో స్వతంత్రంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు.ఆయన జన్మించింది తమిళనాడులోని చెన్నై. ఆయనకు నలుగురు కుమారులున్నారు. జీవన్(స్టీల్ కంపెనీ యజమాని), జితన్ రమేష్ (నటుడు, నిర్మాత),సురేష్(నిర్మాత), జీవా(ప్రముఖ నటుడు). సూపర్ గుడ్ ఫిల్మ్స్ దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఆయన కుమారులు, ముఖ్యంగా జీవా మరియు జితన్ రమేష్, సినీ పరిశ్రమలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.ఫిల్మ్ఫేర్ అవార్డ్స్1990 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) –వసంతం1999 – బెస్ట్ ఫిల్మ్ (తెలుగు) – రాజా2001 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) – ఆనందంతమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్:నాటామై (1994), సూర్యవంశం (1997), తుల్లాధ మనముమ్ తుల్లుం (1999) వంటి చిత్రాలకు ఉత్తమ చిత్ర అవార్డులు. -
'గెలిచినందుకు కంగ్రాట్స్.. ఆ మాట తప్పకూడదు'.. విజయ్కు సత్యరాజ్ చురకలు
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. Congratulations #ThalapathyVijay & #TVK on your victory. You’ve cited Periyar & Ambedkar as your ideological leaders—hope you uphold their values and ensure social justice. Saddened by #MKStalin’s defeat, but I’ll continue supporting #DMK.– #Sathyaraj pic.twitter.com/c5Q7ikwpBo— Movies Singapore (@MoviesSingapore) May 5, 2026 -
విజయ్ గెలుపు వెనక.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ముద్ర..!
ప్రస్తుతం ఎక్కడా చూసిన విజయ్ పేరే వినిపిస్తోంది. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఈ అసాధారణ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం దళపతికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, నాని లాంటి స్టార్స్ కూడా విజయ్పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు వెనక ఎవరెవరు కృషి చేశారా అన్న విషయాలంపై చర్చ నడుస్తోంది.ఈ విజయంలో ముఖ్యంగా విజయ్కు ఉన్న క్రేజ్ ఒక కారణం అయినప్పటికీ.. మరెన్నో సానుకూల అంశాలున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంగ్స్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో పాటలు కూడా గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పొలిటికల్ సాంగ్స్కు మ్యూజిక్ కంపోజ్ చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.అయితే విజయ్ అరంగేట్ర ప్రచారంలో వచ్చిన సాంగ్స్ అభిమానులను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్కు టాలీవుడ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. టాలీవుడ్లో బీజీఎం కింగ్ పేరున్న తమన్యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మూడు ప్రచార పాటలను కంపోజ్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. విజయ్ కోసం తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. దీంతో విజయ్ విజయం వెనక తమన్ మ్యూజిక్ పాత్ర కూడా ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
'వాట్ ఏ గిఫ్ట్'.. త్రిషకు రాధికా, ఛార్మి బర్త్ డే విషెస్..!
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్తో రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్ కన్ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు. టీవీకే విజయం సాధించడంతో విజయ్ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. -
తమిళనాడు సీఎంగా విజయ్.. రెండేళ్ల క్రితమే చెప్పేశాడుగా..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ విజయకేతనం ఎగరేశాడు. పోటీ చేసిన తొలిసారే అత్యధిక సీట్లు సాధించిన సినీ గ్లామర్ పర్సన్గా చరిత్ర సృష్టించాడు. సింగిల్గా పోటీ చేసి.. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారిన పార్టీలకు చెక్ పెట్టాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను ఓడించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే వందకు పైగా సీట్లు సాధించి తానేంటో నిరూపించాడు. ఇక మిగిలింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే.అయితే విజయ్ సీఎం అవుతాడాని ముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. గతంలో విజయ్ సహనటుడు ప్రేమ్జీ అమరన్ కూడా విజయ్ సీఎం అవుతాడని చెప్పారు. 2026లో నేను అతనికే ఓటు వేస్తాను.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హామీ ఇస్తున్నానని మాట్లాడారు. అతను అన్నట్లుగానే విజయ్ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కనున్నారు.విజయ్ కూడా ముందే హింట్..టీవీకే అధినేత, హీరో విజయ్ సైతం తాను సీఎం అవుతానని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరలవుతోంది. తాను హీరోగా నటించిన గోట్ మూవీలో TN 07 CM 2026 అనే నంబర్ ఉన్న కారును నడుపుతూ కనిపించారు. టీఎన్ అంటే తమిళనాడు.. 2026లో సీఎం అంటూ కారు నంబర్తోనే ముందే చెప్పేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ఫిక్సయ్యారు. తాజా ఎన్నికల్లో అదే చేసి చూపించాడు. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఆ కారు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే కావాలి. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. తిరుచ్చి (తూర్పు), పెరంబూరులో గెలిచారు. TVK formed in Feb 2024The Greatest of All Time release Sep 2024Look at the Car number.TN 07 CM 2026 ❤️❤️❤️The Election Results came out First in Theatre Screens 🔔Peak Detailing by @vp_offl Venkat Prabhu in Thalapathy Vijay movie GOAT 🔥🔥🔥#FI pic.twitter.com/Uv5M7RZR5A— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) May 4, 2026 -
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026 -
విజయే సీఎం.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్!
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ తమిళ వెట్రి కళగం(టీవీకే)పార్టీ విజయ ఢంకా మోగించింది. విజయ్ ‘విజిల్’ మోతకు రాష్ట్రమే కాదు దేశమంతా షాకయింది. ఒంటరిగానే బరిలోకి దిగి 234 స్థానాలకు గాను 108 చోట్ల విజయం సాధించాడు. పార్టీ ఏర్పాటైన రెండేళ్లలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగి..సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే విజయ్ విక్టరీని ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేకపోయాయి. కానీ ఓ నటుడు ఎన్నికల రోజే విజయ్ విజయాన్ని ఖాయం చేశాడు. తమిళనాడుకు కాబోయే సీఎం విజయే అని ఓటేసిన రోజే చెప్పాడు. అతనెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన తమిళ నటుడు వీటీవీ గణేష్.విజయే సీఎం..ఏప్రిల్ 23న తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న గణేష్.. అనంతరం మీడయాతో మాట్లాడుతూ.. తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్..వీటీవీ గణేష్ చెప్పినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయం సాధించింది. విజయ్ పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించాడు. దీంతో గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయలేదు కానీ.. సినీ నటుడు ముందే చెప్పాడని నెట్జిన్స్ కామెంట్ చేస్తున్నారు. ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్’ అంటూ ఓ సినిమాలో గణేష్ చెప్పిన డైలాగ్స్ని కోట్ చేస్తూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. This Actor Confidence on #Vijay's Victory before result... ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ #TVKVijay #TVKVijayHQ pic.twitter.com/jlueARDA12— Rajesh Manne (@rajeshmanne1) May 4, 2026 -
రూ.20 కోట్ల బడ్జెట్.. 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్
ఏ వ్యాపారం అయినా లాభాల సంపాదనే కీలకం. దానికోసమే ప్రతిఒక్కరూ ఆలోచిస్తారు. కొంతమంది మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సంపాదించాలా అని చూస్తుంటారు. మలయాళ దర్శకనిర్మాతల ఆలోచన ఇప్పుడు అదే. 'పుష్ప' ఫేమ్ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ఇదే విషయాన్ని తెలుగు నిర్మాత 'మైత్రీ' రవిశంకర్తో పంచుకోగా.. ఆ విషయాన్ని ఈయన ఇప్పుడు బయటపెట్టారు.(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మలయాళ సీనియర్ నటుడు)'కేరళ ఇండస్ట్రీలో రూ.20 కోట్లతో సినిమా తీసి 'బాహుబలి' స్థాయి కలెక్షన్స్ ఎలా సాధించాలా అని ఆలోచిస్తున్నామని ఫహద్ ఫాజిల్ నాతో అన్నారు. చాలా ముచ్చటగా అనిపించింది. అలాంటి వందల వేల కోట్ల కలెక్షన్స్ చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనేది వాళ్ల ఆలోచన' అని 'మైత్రీ' నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెప్పుకొచ్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన దాసరి జయంతి వేడుకల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు.ఫహద్ చెప్పింది గమనిస్తే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే గతేడాది మలయాళం వచ్చిన 'లోక' సినిమానే తీసుకుంటే రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. కానీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెలరోజుల క్రితం రిలీజైన 'వాలా 2' సెన్సేషనల్ సక్సెస్ అయింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో మలయాళ మేకర్స్.. తక్కువ బడ్జెట్ పెట్టి 'బాహుబలి' రేంజ్ కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే మలయాళ సినిమాలపై జనాల్లో అభిప్రాయం మారింది. థియేటర్లలో వీలుకానప్పటికీ ఓటీటీల్లోకి వచ్చిన తర్వాత వాటిని ఎగబడి చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులైతే కొన్ని మలయాళ మూవీస్కి ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు!ఫహద్ ఫాజిల్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా టాలీవుడ్లో జరుగుతూ ఉంటుంది. వేల కోట్ల కలెక్షన్స్ కావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఫిక్సయిపోయింది. తీరా చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సినిమాలు రాబట్టుకోలేకపోతున్నాయి. స్టార్ డైరెక్టర్స్ సినిమాలకు వందల కోట్లు బడ్జెట్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కొందరు యువ దర్శకులు సైతం రూ.100 కోట్లకు పైనే నిర్మాతలతో ఖర్చు పెట్టించేస్తున్నారు. ఈ విషయమే చాలామంది నిర్మాతలని భయపెట్టేస్తోంది! ఫహద్ ఆలోచిస్తున్నట్లు మన దర్శకనిర్మాతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది! ఒకవేళ ఆలోచించినా ఇది సాధ్యమవుతుందా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న!(ఇదీ చదవండి: కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం)Shocking Statement by #FahadhFaasil 🚨Actor #FahadhFaasiil told me that in the #Keralafilmindustry, we think about how to make #Baahubali level revenue Film with a 20 crore budget.:- Mythri #RaviShankar pic.twitter.com/X8CbrVJ8vC— Milagro Movies (@MilagroMovies) May 4, 2026 -
నెలరోజుల క్రితం సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం
మలయాళ ఇండస్ట్రీలో విషాదం. ప్రముఖ నటుడు సంతోష్(66).. రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మంగళవారం ఉదయం కేరళలోని పతనంతిట్ట దగ్గర ఈ సంఘటన జరగ్గా.. సంతోష్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యాన్ని ఢీ కొట్టడంతో ఈయన అక్కడిక్కడే ప్రాణాలు వదిలేయగా, ఇతడి భార్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సంతోష్ మరణవార్త తెలుసుకున్న స్టార్ హీరో మోహన్లాల్ బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి)1960లో పుట్టిన సంతోష్ కేశవన్ నాయర్ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. కాలేజీలో మోహన్లాల్కి ఈయన జూనియర్. ఆ టైంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న సంతోష్.. తన అక్కాచెల్లెల్లు వైద్యవృత్తిని ఎంచుకుంటే ఈయన మాత్రం నటుడు అయ్యారు. 1982లో విడుదలైన 'ఇతు నాన్గులడే' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చారు. 100కి పైగా సినిమాల్లో విలనీ, కామెడీ తరహా పాత్రలు చేశారు.గత నెల 10వ తేదీన విడుదలైన 'భరతనాట్యం 2 మోహినీయాట్టం' సినిమాలోనూ నటించారు. ఈ శుక్రవారమే ఇది ఓటీటీలోకి కూడా రానుంది. ఇంతలోనే సంతోష్.. రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడంతో మలయాళ నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి'లో హీరో నేనే.. ఎందుకు వదిలేశానంటే?) -
విజయ్ విక్టరీ.. కొత్త పేరుతో ‘జననాయగన్’ రిలీజ్?
నటుడు విజయ్ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీడియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించింది. గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్ చేశారు. అందులో మాంభూమికి ముదల్వర్(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్ అయిన సెలబ్రేషన్ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజయ్ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్ అనే పేరుతో పోస్టర్ను కూడా పోస్ట్ చేశారు. నిజమే జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి. Maanbumigu Thamizhaga Mudhalvar Dr. C. Joseph Vijay Nu title card pottu andha #Jananayagan ah release panni vidunga.. Pongalukku miss aana celebration ah indha varsham full ah pannidrom 🔥🔥🔥 #ThalapathyVijay— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) May 4, 2026 -
'యశ్తో ఇంటిమేట్ సీన్స్.. అదంతా నాన్సెన్స్'
కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన యాక్షన్ మూవీ టాక్సిక్. ఈ మూవీ ఊహించని వివాదాలతో వాయిదా పడింది. జూన్ 4న రావాల్సిన ఈ సినిమా పోస్ట్పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా టాక్సిక్ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. కియారా తన ఇంటిమేట్ సీన్స్ కట్ చేయాలని మేకర్స్ కోరినట్లు తెగ హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ కియారా అద్వానీ దీనిపై స్పందించింది. యశ్తో ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని తాను కోరలేదని తెలిపింది. ఇవన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇలాంటివీ ఎవరు కూడా నమ్మవద్దని హితవు సూచించారు. ఈ మూవీ ఫైనల్ కట్ చూసిన కియారా.. కొన్ని బోల్డ్ తొలగించాలని పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో హీరోయిన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. -
విజయ్ విజయం.. పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు..!
విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్లాగే సింగిల్గా బరిలోకి దిగాలన్న డిమాండ్ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
విజయ్ సీఎం.. డిప్యూటీ సీఎంగా త్రిష..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్గా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. ఊహించని విధంగా అధికార డీఎంకేతో పాటు ఏఐడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. ద్రవిడ రాజకీయాల్లో పోటీ చేసిన తొలిసారే సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. హీరోయిన్ త్రిష సైతం ఇంటికి వెళ్లి విజయ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే త్రిష గురించి నెట్టింట చర్చ మొదలైంది. త్రిష సైతం రాజకీయాల్లో అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం కానుందని మరో టాక్ వైరలవుతోంది. విజయ్ పోటీచేసిన రెండు స్థానాల్లో గెలిస్తే.. ఒక్కచోట రాజీనామా చేయాల్సిందే. అదే సమయంలో విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారని లేటేస్ట్ టాక్. అలా ఎన్నికల్లో గెలిచి హీరోయిన్ త్రిష ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. హీరో విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఎన్నికల ముందు త్రిష- విజయ్పై రూమర్స్ పెద్దఎత్తున వైరలయ్యాయి. విజయ్ భార్య విడాకుల పిటిషన్ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. విజయ్- త్రిష ఓ పెళ్లికి హాజరు కావడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఏదేమైనా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుతో ఒక్కసారిగా అందరి దృష్టి త్రిషపై పడింది. తమిళనాట త్రిష ప్రయాణం ఎలా ఉండనుందో మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.ఇక త్రిష సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది. -
హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్పై ట్రోల్స్..!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్గా బరిలోకి దిగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్ విజయంపై అభినందనలు చెబుతున్నారు.అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ట్రోల్స్ మొదలయ్యాయి. విజయ్ విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. విజయ్లా పవన్ కల్యాణ్ తొలిసారి విజయం సాధించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా సీఎం కాబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.అయితే తమిళనాడు, ఏపీ రాజకీయాలను ముడిపెట్టొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లను పేర్లను ప్రస్తావిస్తున్నారు. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
ఎన్నికల ఫలితాల్లో సూపర్ హిట్.. 'జన నాయగన్' సంగతేంటి?
ఎవరూ ఊహించలేదు. తమిళ హీరో విజయ్.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ రేంజ్ ఆధిక్యం సాధిస్తాడని. ఎందుకంటే ఎన్నికల ముందు విజయ్కి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత విషయాలు పక్కనబెడితే ఇతడు నటించిన చివరి సినిమా 'జన నాయగన్'ని కూడా విడుదల కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో విజయ్ అద్భుతం చేయడంతో ఈ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిషలెక్క ప్రకారం 'జన నాయగన్' సినిమా ఈ ఏడాది జనవరి 9న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది వారం వారం ఆలస్యమవుతూ వస్తోంది. అలాంటిది కొన్నాళ్ల క్రితం ఏకంగా పూర్తి మూవీ పైరసీకి గురవడం ఇండస్ట్రీని షాక్కి గురిచేసింది. దీంతో మూవీ త్వరగా రిలీజ్ అయిపోతే బాగుండు అని అభిమానులు అనుకునే పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు తమిళనాడులో విజయ్.. అధికారం చేజిక్కుంచుకుని ముఖ్యమంత్రి అయితే మాత్రం 'జన నాయగన్'కి మార్కెట్లో కచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది. అటు ఆడియెన్స్ కూడా విజయ్ని చివరిసారి వెండితెరపై చూడాలనే ఆసక్తి కనబరచొచ్చు. తద్వారా టాక్తో సంబంధం లేకుండా వంద రెండొందల కోట్ల కలెక్షన్స్ రావొచ్చేమో అనిపిస్తుంది. మరి సమస్యలని దాటి 'జన నాయగన్'.. ఈ నెలలోనే రిలీజ్ అవుతందా? లేదంటే జూన్లో వస్తుందా అనేది చూడాలి?తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేకే 'జన నాయగన్'. విజయ్ లీడ్ రోల్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతదర్శకుడు. ఇప్పటికే రిలీజైన కొన్ని పాటలు శ్రోతల్ని అలరించాయి కూడా.ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా? -
త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?
సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. ఎందుకంటే స్టార్స్గా చెలామణీ అయిన చాలామంది.. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అక్కడాఇక్కడా అని కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ హీరో దళపతి విజయ్ చేరబోతున్నాడు. తమిళనాడులోని అధికారం చేజిక్కుంచుకునే దిశగా విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యం చూపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా బలంగా కనిపిస్తోంది. ఇదే టైంలో త్రిష, రాజకీయ రంగప్రవేశంపై కూడా చర్చ జరుగుతోంది.(ఇదీ చదవండి: దళపతి విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)టీవీకే అధికారం దక్కించుకోవడం దాదాపు ఖాయం! అదే జరిగితే హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతారు! ఇకపోతే ఎన్నికలు జరగడానికి ముందు విజయ్ విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అదే టైంలో త్రిషతో కలిసి జంటగా విజయ్ ఓ పెళ్లికి హాజరవడం వీళ్ల గురించి వినిపించిన రూమర్స్ నిజమేనేమో అనే సందేహాలు కలుగజేసింది. ఒకవేళ విజయ్ అధికారం దక్కించుకుంటే త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా అనిపిస్తుంది.ఎందుకంటే గతంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష.. సరదాగానే అన్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొచ్చింది. మరి సీఎం కాకపోవచ్చు గానీ విజయ్ తలుచుకుంటే ఈమెకు కచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వకపోడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి త్రిష మనసులోనూ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమైనా ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే గెలవడం దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే ఈరోజే త్రిష పుట్టినరోజు కూడా. తిరుమల వెళ్లి ఉదయమే వేంకటేశ్వర స్వామిని ఈమె దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఈమె తిరుమల వెళ్లిందని, ప్రత్యేక పూజలు కూడా చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష)Happy birthday to the Chief Minister of Tamil Nadu. #Trisha 🔥🥶#HBDTrisha ❣#HBDSouthQueenTrisha 💥 pic.twitter.com/SvSkDR7nm1— CricFDFS (@lokiMSD93) May 4, 2026 -
తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్లో త్రిష
తమిళనాడులో ఊహించని అధికార మార్పు దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లోనూ డీఎంకే పార్టీకే మరోసారి అధికారం దక్కొచ్చని చాలామంది అంచనా వేశారు. విజయ్ టీవీకే పార్టీ కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని భావించారు. కానీ ప్రస్తుతం ఊహించనవి జరుగుతున్నాయి. టీవీకే పార్టీ ఈ స్టోరీ రాసే సమయానికి 100 సీట్లకు మించి ఆధిక్యంలో కొనసాగుతోంది. కానీ ట్రెండింగ్లో మాత్రం త్రిష ఉంది.(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)విజయ్, త్రిష కలిసి పలు సినిమాలు చేశారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ విడాకుల వ్యవహారం బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్-త్రిష రిలేషన్లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. సరిగ్గా ఆ టైంలో ఓ పెళ్లికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లడం హాట్ టాపిక్ అయిపోయింది.నేడు(మే 04) ఎన్నికల ఫలితాల లెక్కింపు మాత్రమే కాదు. త్రిష పుట్టినరోజు కూడా. ఈ క్రమంలోనే ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఆమె తిరుపతి వెళ్లిందని మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయించిందని అంటున్నారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. త్రిష గురించి చేసి ట్వీట్ వైరల్ అవుతోంది.'ఆ తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. విజయ్ని ఉద్దేశించే ఇతడు ఈ ట్వీట్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏకంగా సీఎం కావాలని ఉందని చెప్పింది. అప్పుడు సరదాగానే అని ఉండొచ్చు. కానీ వినిపిస్తున్న రూమర్స్, విజయ్ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుండటంతో త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏమైనా ఎంట్రీ ఇస్తుందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!) -
ఇదేం చిత్రం.. ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నాడు!
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఈ సామెతని అన్వయించుకుంటే.. సొంత భాషల్లో హిట్స్ కొట్టిన అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలు ఇప్పుడు పాన్ ఇండియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. కానీ తమిళ హీరో ధనుష్ పరిస్థితి మాత్రం కాస్త చిత్రంగా అనిపిస్తుంది. రీసెంట్ టైంలో వచ్చిన ఇతడి సినిమాలు, వాటి ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)ధనుష్ పేరు చెప్పగానే ఆల్రౌండర్ అనే పదమే గుర్తొస్తుంది. ఎందుకంటే హీరోగా దర్శకుడిగా నిర్మాతగా విభిన్న బాధ్యతల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తాడు. మధ్య పాటల రాసేస్తుంటాడు. కుదిరితే పాడేస్తుంటాడు కూడా. వీటి విషయంలో ఇతడిని వంక పెట్టడానికి ఏం లేదు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఇతడి మూవీస్ చూస్తే మాత్రం పరభాషలో చేసినవన్నీ హిట్ అవుతున్నాయి. సొంత భాషలో చేసినవి మాత్రం అక్కడివరకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తుంది.గత కొన్నేళ్లలో తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ధనుష్.. అణిచివేత గురయ్యే తరహా పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నాడు. దీంతో తమిళ ప్రేక్షకులకే ధనుష్ మూవీస్పై మొనాటనీ వచ్చేసింది. వేరే దర్శకులు తీస్తున్నా ధనుషే సొంత డైరెక్షన్ చేస్తున్నా కాన్సెప్ట్ దాదాపు ఇదే ఉంటోంది. ఈ తరహా చిత్రాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెద్దగా ఆడట్లేదు. గత రెండేళ్లలో రిలీజైన రాయన్, ఇడ్లీ కొట్టు తరహా చిత్రాలతో పాటు గత వీకెండ్ రిలీజైన 'కర' మూవీలో ఇదే తరహా కాన్సెప్ట్స్ ఉండటం మైనస్ అవుతోంది. ఇవన్నీ తమిళంలో ఓ మాదిరిగా ఆడుతుంటే మిగతా చోట్ల మాత్రం దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.మిగతా భాషల్లో మాత్రం ధనుష్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'సర్'లో టీచర్గా ధనుష్ అదరగొట్టేశాడు. శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'లో బిచ్చగాడిగా మెప్పించాడు. గతేడాది చివరలో వచ్చిన హిందీ చిత్రం 'రే ఇష్క్ మై'లోనూ శ్రుతిమించే ఎమోషన్స్ ఉండే ప్రేమికుడిగానూ ఆకట్టుకున్నాడు. చూస్తుంటే ఎప్పుడో ఇంట గెలిచేసినా ధనుష్.. రీసెంట్ టైంలో మాత్రం సొంత భాషా సినిమాలతో హిట్స్ కొట్టలేకపోతున్నాడు. అదే టైంలో తెలుగు, హిందీలో మాత్రం హిట్స్ కొడుతూ అదరగొట్టేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
విజయ్కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడనే విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇతడి చివరి సినిమాకు కష్టాలు మాత్రం తప్పట్లేదు. నాలుగు నెలల క్రితమే రిలీజ్ కావాల్సిన మూవీ.. సెన్సార్ సమస్యలతో అలా ఉండిపోయింది. కొన్నిరోజుల క్రితం లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు 'జన నాయగణ్'కి మరో కష్టం వచ్చిపడింది.(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)లెక్క ప్రకారం జనవరి 9న విజయ్ 'జన నాయగణ్' సినిమాని థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రెండు మూడు వారాలు ఆలస్యంగా తీసుకొస్తారులే అని అంతా భావించారు. కానీ నెలలు గడుస్తున్నా రాకపోవడంతో సగటు ప్రేక్షకుడి ఈ మూవీపై ఆసక్తి సన్నగిల్లుతూ వస్తోంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్కి కూడా ఆసక్తి పోయినట్లు ఉంది. అందుకే రూ.120 కోట్ల డీల్ నుంచి తప్పుకొన్నట్లు వార్తలొస్తున్నాయి.అమెజాన్ సంస్థ తప్పుకోవడంతో రేసులోకి వచ్చిన జీ5 సంస్థ.. రూ.50 కోట్ల ఆఫర్ చేసిందట. ఒకవేళ దీనికి టీమ్ ఒప్పుకొంటే రూ.70 కోట్ల నష్టానికి అమ్ముకున్నట్లే అవుతుంది. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ లీకై, థియేటర్లలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని మూవీ విషయంలో అమెజాన్ రిస్క్ చేయలేకపోతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది.తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రీమేక్ చేసే 'జన నాయగణ్' తీశారు. కాకపోతే విజయ్ రాజకీయ అవసరాలకు తగ్గట్లు పొలిటికల్ డైలాగ్స్, ఎపిసోడ్స్ పెట్టారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రని తమిళంలో మమిత బైజు చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. కెవిఎన్ నిర్మాణ సంస్థపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. ఈ చిత్రం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన.. 'టాక్సిక్' కూడా రిలీజ్ కాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.(ఇదీ చదవండి: తమన్నా మళ్లీ ప్రేమలో పడిందా?) -
జైలర్-2 తెలుగు హక్కులపై భారీ చర్చ
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం. రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్జే సూర్య కొత్త విలన్గా పరిచయం కానున్నారు. -
రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్
కొన్నేళ్ల క్రితం మరణించిన కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తని తలుచుకుని భావోద్వేగానికి గురైంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఈమె, సూపర్స్టార్ రజనీకాంత్తో 'జైలర్ 2' సినిమాలో నటించిన సంగతి బయటపెట్టింది. అలానే భర్త చిరంజీవికి సంబంధించిన జ్ఞాపకాలని పంచుకుంది.(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)'ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు మనద్దరి డ్రీమ్ ఒక్కటైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను ఫీలవుతున్నాను. నువ్వు ఆయనని(రజనీకాంత్) ఆరాధించావు. నీ కోరిక వల్లే ఆయనని నేను కలిశాను. ఇది అసలు నేను కలలో కూడా ఊహించని విషయం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం 'జైలర్ 2'లో లభించింది. మనం సాధించాం. నా భర్తకే ఈ సినిమా అంకితం చేస్తున్నాను. ఈ సక్సెస్ అంతా అతడికే చెందుతుంది' అని మేఘనా సర్జా భావోద్వేంగా రాసుకొచ్చింది.రజనీతో దిగిన ఫొటోలోని పంచుకున్న మేఘనా సర్జా.. తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై స్వయంగా రజనీతో సంతకం కూడా చేయించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లరి నరేశ్ 'బెండు అప్పారావు' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మేఘనా.. తర్వాత కన్నడ, మలయాళ మూవీస్ చేస్తూ వచ్చింది. అలా హీరో చిరంజీవి సర్జాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ భర్త చనిపోయిన తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. మరి 'జైలర్ 2'లో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది? ఏ మేరకు ఈమెకు గుర్తింపు తీసుకొస్తుందనేది చూడాలి?(ఇదీ చదవండి: ఆ కెపాసిటీ నాకు లేదు.. అందుకే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్నా) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
ఆ కెపాసిటీ నాకు లేదు.. అందుకే సినిమా నుంచి తప్పుకున్నా
స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశమొస్తే ఏ దర్శకనిర్మాత వదులుకోడు. దీన్ని ఉపయోగించి స్టార్డమ్ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి మాత్రం కమల్-రజనీ సినిమా నుంచి తప్పుకొన్నాడు. గతేడాది నవంబరులో ఇది జరిగింది. తొలుత ఇతడినే డైరెక్టర్ అని ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే కొన్నిరోజులకే సదరు ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. ఇన్నాళ్లకు అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'టాలీవుడ్లో కుల పిచ్చి ఎక్కువ'.. కమెడియన్ మహేశ్)'నిజం చెప్పాలంటే ఆ సినిమా చేయడానికి సిద్ధమవగానే చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ సినిమాలు చేశాను. కానీ రజనీ సినిమాని డీల్ చేసే కెపాసిటీ నాకు లేదనిపించింది. ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలని ఇతరులకు ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది. నాకు స్టోరీ సరిగా చెప్పడం రాదు. అదే టైంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురుతిరగకుండా ఓకే చెప్పేస్తాను''ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్కడి నిర్ణయమే ఉండదు. సినిమాకు, ఆ ఇద్దరు లెజెండ్స్కి నేను పూర్తిగా న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే ప్రారంభంలోనే సినిమా నుంచి తప్పుకొన్నా. రజనీ-కమల్తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో నాకు కోరిక ఉంది. వారితో గడిపిన కొన్నిరోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ అది నా జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం. ఇలా చేయడానికి ముందే స్వయంగా రజనీకాంత్ని కలిసి విషయం చెప్పాను' అని సుందర్.సి వివరణ ఇచ్చాడు.గతంలో రజనీకాంత్తో 'అరుణాచలం', కమల్ హాసన్తో 'సత్యం శివం' సినిమాలు చేసిన సుందర్.సి.. తర్వాత నుంచి మాత్రం హారర్, మిడ్ రేంజ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గత నెలలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ప్రస్తుతం నయనతార లీడ్ రోల్లో 'ముకుతి అమ్మన్ 2' అనే మూవీ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య) -
భారీ బడ్జెట్తో శివ కార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. డ్రాప్ కాలేదా?
కోలీవుడ్లో ప్రముఖ స్టార్గా రాణిస్తున్న నటుడు శివకార్తికేయన్. ఈయన పరాశక్తి చిత్రం తర్వాత దర్శకుడు వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువబడింది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బడ్జెట్ ఎక్కువ అవుతుందనే కారణంగా ఈ చిత్రాన్ని డ్రాప్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇటీవల తాయ్ కిళవి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకున్న శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. దీనికి సెయోన్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇది పక్కా రూరల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రాన్ని కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించే చిత్రం డ్రాప్ కాలేదని ఆ చిత్రం సమర్పకుడు టీజీ త్యాగరాజన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ చిత్రం డ్రాప్ కాలేదని చెప్పారు. -
ఓటీటీకి సూపర్ హిట్ డార్క్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతన్నాయి. చిన్న సినిమాలైనా సరే వసూళ్లపరంగా రాణిస్తున్నాయి. ఇటీవల వాలా-2 సైతం అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత మరో మలయాళ మూవీ భరతనాట్యం- 2 మోహినియాట్టం సైతం కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి ఓటీటీ సందడి చేయనుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. కాగా.. ఈ డార్క్ కామెడీ మూవీలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు. Recent Malayalam Blockbuster Dark Comedy Movie 😂!!#Bharatanatyam2 : #Mohiniyattam (Malayalam) streaming from May 8 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/74wi4zutEy— OTT Trackers (@OTT_Trackers) May 3, 2026 -
అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది : శ్రీలీల
పెళ్లిసందడి అనే చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చిన శాండిల్వుడ్ బ్యూటీ శ్రీలీల. వైద్య విద్య చదివి కథానాయకిగా మారిన నటీమణుల్లో ఈమె ఒకరు. తొలి చిత్రంతోనే అభిమానులను, సినీ ప్రముఖులను బాగా ఆకట్టుకున్న ఈమె ఎదుగుదల అనూహ్యంగానే జరిగింది. తెలుగులో ప్రముఖ కథానాయకులతో నటించి తన కెరీర్ గ్రాఫ్ను పెంచుకున్న శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్పై దృష్టి సారించారనే చెప్పాలి. ఇటీవల తెలుగులో నటించిన రాబిన్హుడ్, మాస్జాతర, ఉస్తాద్ భగత్సింగ్ వంటి చిత్రాలు వరుసగా నిరాశ పరచడంతో అక్కడ అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ప్రస్తుతం తమిళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. శ్రీలీల తమిళంలో నటించిన తొలి చిత్రం పరాశక్తి. ఇది మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నటుడు ధనుష్ జంటగా ఆయన 55వ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు. డాన్సులో ఇరగదీసే శ్రీలీల ధనుష్కు జంటగా నటించే చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఇలాంటి సందర్భంలో ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ బలమైన సెంటిమెంట్ సన్నివేశాలతో కూడిన మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించాలనే ఆశలు వ్యక్తం చేశారు. అలాంటి చిత్రాలు నటిగా తనలోని నటనను చూపిస్తాయని భావిస్తున్నానన్నారు. అదేవిధంగా వైవిధ్య భరిత కథా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానన్నారు .అలాంటి చిత్రాలు తనను నెక్ట్స్ లెవెల్ తీసుకెళ్తాయని నమ్ముతున్నాను అని శ్రీలీల పేర్కొన్నారు. -
అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్
'కాంతార' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషభ్ శెట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనతో జరిగిన భేటీ.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఒకటని రాసుకొచ్చాడు. ఈ మేరకు తామిద్దరి మధ్య సినిమాల గురించి చర్చ జరిగినట్లు చెబుతూ రెండు ఫొటోలని రిషభ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)'కాంతార, కాంతర ఛాప్టర్ 1 సినిమాల గురించి అమితా షా మాట్లాడుతూ వాటిని ప్రశంసించడం గొప్ప అనుభూతి. నా తర్వాత చిత్రాల విశేషాలని కూడా ఆయనతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మన చరిత్ర, సంస్కృతి, కళలు, సినిమా మేకింగ్ గురించి ఆయన మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.రిషభ్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'జై హనుమాన్' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. అలానే శివాజీ జీవితం ఆధారంగా తీస్తున్న మరో పాన్ ఇండియా మూవీ, సితార సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం కూడా చేయాల్సి ఉంది. 'కాంతార' ఫ్రాంచైజీలో మూడో భాగం అయితే ఇప్పట్లో రాకపోవచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి) View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
నేను, దుషారా గొడవపడ్డాం, కొట్టుకున్నాం : అదితిబాలన్
‘నటి దుషారా విజయన్ నేను గట్టిగానే కొట్టుకున్నాం. నాకు బాగా దెబ్బలు తగిలాయి’ అని నటి అదితిబాలన్ అన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ ఎగ్జామ్. వాల్ వాచర్ పతాకంపై దర్శక నిర్మాతల ద్వయం పుష్కర్ –గాయత్రి నిర్మించిన ఈ వెబ్ సిరీస్కు కథ, దర్శకత్వం బాధ్యతలను సద్గుణం నిర్వహించారు. ఇది ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్ సిరీస్ అన్నది గమనార్హం. అబ్బాస్ ముఖ్యపాత్ర పోషించిన 7 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్ మే 15వ తేదీ నుంచి ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గురువారం మధ్యాహ్నం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దుషారా విజయన్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు నటించిన సార్పట్ట పరంపరై చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తరువాత తాజాగా నటించిన ఎగ్జామ్ వెబ్ సిరీస్ అదే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడం సంతోషంగా ఉంది. ఇందులో నటించడానికి ఎలాంటి ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాను. ఇందులో నేను ఝాన్సీ అనే పోలీస్ అధికారిగా నటించాను. అదితిబాలన్ మాట్లాడుతూ తన పాత్ర మొదట్లో కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. ఇప్పటికి అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఈ సిరీస్లో చాలా ఫైట్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. నేను, దుషారా విజయన్ కొట్టుకున్నాం. చాలా దెబ్బలు కూడా తగిలాయి అని చెప్పారు. మధ్య తరగతి ప్రజల పెద్ద కల ప్రభుత్వ కొలువుల ఎంపిక. అందులో జరిగే అక్రమాలను ఆవిష్కరించే ఇతివృత్తంతో తెరకెక్కించిన సిరీస్ ఇది అని దర్శకుడు సర్గుణం పేర్కొన్నారు. -
ఓటీటీకి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డ్యూడ్, డ్రాగన్ చిత్రాలతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా ఇటీవలే రిలీజైన మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్ఐకే). ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV— prime video IN (@PrimeVideoIN) May 1, 2026 -
న్యాయవాదిగా కీర్తి సురేష్
బలమైన పాత్రల్లో తన సత్తా చాటే నటి కీర్తిసురేశ్. మహానటి చిత్రంలో మహానటి సావిత్రిగా నటించి జాతీయ అవార్డును గెలుచుకున్న ఈమెకు ఇటీవల సరైన కథా పాత్రలు అమరలేదనే చెప్పాలి. కాగా తాజాగా మరోసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె న్యాయవాదిగా పవర్ఫుల్ పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం పేరు సత్యవాన్ సావిత్రి. విఘ్నేష్శివన్ శిష్యుడు ప్రవీణ్ ఎస్.విజయ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు మిష్కిన్ కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో బాలశరవణన్, చారుకేష్, శిల్పామంజునాథ్, మాలా పార్వతి, దీప, ఆర్.సుందరరాజన్, వైజీ.మహేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వెడికారన్పట్టి శక్తివేల్ ఉమేష్ కుమార్ బన్సాల్, వైష్ణవి వివేక్ సుందర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కోర్టులో జరిగే ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కోర్టులో జరిగే సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయని చెప్పారు. దీనికి శ్యామ్.సీఎస్ సంగీతం, అరుళ్ విన్సెంట్ చాయాగ్రహణం మరింత బలం చేకూర్చేవిదంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. -
సత్యవాన్ సావిత్రి
ఓ సామాజిక అంశం కోసం కోర్టులో లాయర్గా వాదనలు వినిపించనున్నారట కీర్తీ సురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘సత్యవాన్ సావిత్రి’. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాలో మరో లీడ్ రోల్ చేశారు. ప్రవీణ్ ఎస్. విజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మిస్కిన్ లాయర్స్గా నటించారని తెలిసింది. మరోవైపు తెలుగులో వెంకటేశ్–కల్యాణ్రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాలోను, విజయ్ దేవరకొండ ‘రౌడీ జానర్ధన’లోనూ కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
'పెద్ది'లో చరణ్ మూడో లుక్..? మెగా అభిమానులకు సర్ ప్రైజ్!
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చరణ్కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫిట్నెస్ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.పెద్ది సినిమా తొలి టీజర్లో చరణ్ పల్లెటూరి క్రికెటర్గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.చరణ్-జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
స్టార్ హీరో సినిమాకు మోక్షం.. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత..!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ సినిమాకు దాదాపు పదేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఆర్థిక వివాదాలతో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్కు మార్గం సుగమమైంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ధృవనక్షత్రం రిలీజ్కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 15 లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్ ఎంటర్టైన్మెంట్ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది. దీని ద్వారానే ఈ సినిమాకి సంబంధించిన లావాదేవీలు జరగాలని కోర్టు ఆదేశించింది.దీంతో 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట 2017లోనే విడుదల చేయాలని డైరెక్టర్ గౌతమ్ మేనన్ యత్నించారు. కానీ ఆర్థిక పరమైన చిక్కులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2023లోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని.. ఆయన ధృవ నక్షత్రం సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును కోరింది. ఈ వివాదంతో ధృవనక్షత్రం మరోసారి వాయిదా వేయాల్సి ఉంది.ఆ తర్వాత కూడా 2024లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం మరోసారి సంకేతాలిచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విడుదల కాలేదు. అలా ఇప్పటికే పలుసార్లు పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్, వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. -
Drishyam 3 Teaser: మోహన్ లాల్ ‘దృశ్యం 3’ టీజర్ వచ్చేసింది
సస్పెన్స్ థ్రిల్లర్లలో డైరెక్టర్ జీతూ జోసెఫ్, మోహల్ లాల్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ చాలా ప్రత్యేకమైనది. ఈ సిరీస్లో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. మలయాళం ఒరిజినల్ గా ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ, భాషలకతీతంగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో కూడా రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్లో మూడో భాగం రాబోతుంది. మే 21 ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ఒక నిమిషం 50 సెకన్ల నిడివి గల ఈ టీజర్, మోహన్లాల్ వాయిస్ఓవర్తో పాటు 2013 నుండి 2021 వరకు వచ్చిన పాత భాగాలలోని సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఈ టీజర్లో మోహన్లాల్ పోషించిన జార్జ్కుట్టి పాత్ర ఒక చర్చిలో కూర్చుని దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లు కూడా చూపించారు. అతను భయపడినట్లుగా, ఆత్మవిశ్వాసం లేనట్లుగా కనిపిస్తాడు. ‘నేను ఒక సాధారణ మనిషిని. నా ప్రపంచం చాలా చిన్నది, నా భార్య, నా పిల్లలు మాత్రమే. ఒక అవాంఛిత అతిథి మా ఏకాంతంలోకి చొరబడ్డాడు. నా కుటుంబాన్ని నాశనం చేయగల శక్తి ఉన్న అతిథి అతను. ఆ అతిథి మళ్లీ మా జీవితాలను నాశనం చేయడానికి తిరిగి రాకుండా ఉండేలా, మేము అతన్ని పంపించేశాం’ అంటూ మోహన్ లాల్ చెప్పే సంభాషణలతో ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్ సాగింది. -
ధనుష్లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?
టాలీవుడ్లో ఇప్పుడో చిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో చాలామంది ఒక్క సినిమా కోసం ఏకంగా ఏళ్లకు ఏళ్లు పనిచేస్తారు. పోనీ ఆ మూవీ సరిగా ఉంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేసిన హీరోలు కూడా ఫెర్ఫెక్షన్ పేరిట టైమ్ అంతా వృథా చేస్తున్నారు. అదే టైంలో తెలుగు హీరోల్లానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మాత్రం ఒంటి చేత్తో మూడు బాధ్యతల్ని అద్భుతంగా పూర్తి చేస్తున్నాడు. ధనుష్ వల్ల అవుతున్న ఆ పని.. మిగతా హీరోల వల్ల ఎందుకు కావట్లేదు?(ఇదీ చదవండి: స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్: తమిళ సింగర్)చాలామందికి ధనుష్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఇతడిలో ఓ డైరెక్టర్, నిర్మాత కూడా ఉన్నాడు. గడిచిన 15 నెలలు తీసుకుంటే.. గతేడాది ప్రారంభంలో తన మేనల్లుడు పవిష్ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీశాడు. దీనికి దర్శకుడు నిర్మాత ధనుషే. ఇది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆకట్టుకుంది. ఇక వేసవిలో 'కుబేర'తో వచ్చాడు. బిచ్చగాడి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేశాడు. దసరా వచ్చేసరికి 'ఇడ్లీ కొట్టు' మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రం కోసం హీరో, డైరెక్టర్, నిర్మాతగా మూడు బాధ్యతల్ని నిర్వర్తించాడు. తెలుగులో ఇది ఫెయిలైనప్పటికీ తమిళంలో సూపర్ హిట్ అయింది.గతేడాద చివరలో 'తేరే ఇష్క్ మై' అనే హిందీ సినిమాలో హీరోగా నటించాడు. రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగు నెలలు తిరిగేసరికల్లా 'కర' మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. దీని ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.అయితే ఏడాదిన్నర కాలంలో ధనుష్.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఐదు సినిమాలు చేశాడు. మరి ఇతడి వల్ల అవుతున్న పని మిగతా హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఫెర్ఫెక్షన్ పేరు చెప్పి ఆలస్యం చేయడమనేది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్గా సినిమాలు చేస్తేనే సినిమా మీద ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అలానే రెగ్యులర్ టచ్లో ఉంటే ఆడియెన్స్ కూడా సదరు హీరోల చిత్రాల్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఈ విషయాన్ని తెలుగు, తమిళ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర) -
స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్
మహిళా గాయని స్వాగత కృష్ణన్.. తమిళ ప్రముఖ సంగీత దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడని, చేసిన పనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడని తన బాధ చెప్పుకొంది. పైగా అప్పుల్లో ఉన్నానని చెప్పి తన దగ్గరే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన వల్లే ఇండస్ట్రీని తాను వదిలేశానని, సదరు మ్యూజిక్ డైరెక్టర్ని 'ఎప్స్టీన్ ఆఫ్ మద్రాస్' అని పేరు పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘స్పిరిట్’ సినిమా కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం)'ఏడేళ్ల క్రితం చెన్నై వదిలిపెట్టి రిషికేష్ వెళ్లిపోవడం వెనక కారణం ఇప్పుడు బయటపెడుతున్నా. బ్రేకప్ అయిపోయి డిప్రెషన్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి ఆ సంగీత దర్శకుడు వచ్చాడు. నా పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. మాయమాటలు చెప్పి తనపై నమ్మకం పెరిగేలా చేసి, గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు అసలు రంగు బయటపెట్టాడు. కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ లాంటివి చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కానీ నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. మళ్లీ అప్పుల్లో ఉన్నానని చెప్పి నా దగ్గరే చాలా డబ్బులు తీసుకున్నాడు. వాటిని తిరిగివ్వలేదు''ఆయన స్టూడియో సౌండ్ప్రూఫ్గా ఉండేది. ఆ గది తలుపులు లాక్ చేసి బలవంతంగా నాపై లైంగిక దాడి చేశాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో ఇదంతా రికార్డ్ చేసి తర్వాత నన్ను బెదిరించాడు. ఈ ఘటన తర్వాత తిరిగి నాపైనే అబద్దాలు చెప్పడం, దొంగతనం లాంటి తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇండస్ట్రీలో నా పేరు చెడగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. చికిత్స కూడా తీసుకున్నా. అందుకే చెన్నై వదిలేసి రిషికేష్ వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటున్నా''ఈ మధ్యే మరో యువతి తనకు ఇలానే జరిగిందని నాతో చెప్పడంతోనే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. నేనే కాదు చాలామంది అమ్మాయిలు అతడి బాధితులే. భయం, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు న్యాయపరంగా ముందుకెళ్తా. అయితే ఇది ఆయనపై ప్రతీకారం కాదు. ఇకపై నాలాగా మరెవరూ మానసిక వేదన అనుభవించకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నాను' అని సింగర్ స్వాగత కృష్ణన్ చెప్పుకొచ్చింది.'యెనో పెన్నే', 'కాదల్ కన్మణి' లాంటి పాటలు పాడిన ఈమె.. సదరు సంగీత దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. ఈమె సోదరి మాయ కృష్ణన్.. విక్రమ్, లియో సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది తమిళ బిగ్బాస్ షోలోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర) -
'టాక్సిక్'.. అనుకున్నదే జరిగింది
మనం ఎలాంటి సినిమా తీశామనేది ముఖ్యం కాదు చెప్పిన టైంకి రిలీజ్ చేశామా లేదా అనేది ప్రేక్షకులు చూస్తారు. ఒకసారి వాయిదా పడింది అంటే సరేలే ఏదో సమస్య ఉండొచ్చు అనుకుంటారు. కానీ మళ్లీ మళ్లీ వాయిదా పడితే లేనిపోని సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నట్లే యష్ 'టాక్సిక్' మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: హీరో విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఐదు ఓటీటీల్లో స్ట్రీమింగ్)ఈ సినిమాని జూన్ 4న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, అది కుదరడం లేదు. మూవీ అయితే సిద్ధంగా ఉందని కానీ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్, భాగస్వామ్యాలు జరుగుతున్న కారణంగా విడుదల తేదీని మారుస్తున్నాం. ప్రపంచవ్యాప్తగా ఒకే తేదీకి రిలీజ్ చేసేలా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. ఆడియెన్స్ అంచనాలు అందుకునేలా కాస్త టైమ్ తీసకుని, అత్యుత్తమ ఔట్పుట్ అందించాలనుకుంటున్నామని హీరో, నిర్మాత యష్ ఓ నోట్ రిలీజ్ చేశాడు.మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో యష్ హీరో కాగా రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కించింది. 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్.. ఈ చిత్రాన్ని కూడా యష్తో కలిసి నిర్మించింది. తొలుత మార్చి 19 అనుకున్నారు కుదర్లేదు. జూన్ 4 అనుకున్నారు కుదర్లేదు. మరి ఈసారైనా ఓ తేదీ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి?ఇకపోతే ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ గ్లింప్స్ వీడియో, పాట రిలీజ్ చేశారు గానీ ఏ మాత్రం హైప్ ఏర్పడలేదు. ఇప్పుడిలా వాయిదాల మీద వాయిదాలు పడితే దీనిపై ఉన్న కాస్తోకూస్తో హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది.(ఇదీ చదవండి: కొత్త అఖిల్ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ) -
#కింగ్ 100.. 'శివ' లుక్తో నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వందో సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగిన ఫార్ములా కథతో సాగనుందని తెలుస్తోంది. ఇందులో నాగ్ ఒక షేడ్లో 25 ఏళ్ల యువకుడిలా కనిపించనున్నారని సమాచారం. దాని కోసం చిరంజీవి ఆచార్యలో, రజనీకాంత్ కూలీలో వాడిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. అంటే దాదాపు శివ సినిమాలో నాగార్జున ఎలా కనిపించారో, అదే వింటేజ్ లుక్ను ఈ పాత్రలో మళ్లీ చూపించనున్నారు.ఆచార్య వచ్చిన సమయంలో ఈ టెక్నాలజీ ఖరీదైనది. కానీ ఇప్పుడు ఏఐ అందుబాటులోకి రావడంతో ఖర్చు తగ్గింది, దాంతో వాడకం చాలా సులభమైంది. ఇక దీంతో నాగార్జున వందో సినిమా మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. కాగా ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగార్జున-టబు జంట 28 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనుంది. గతంలో వీరిద్దరూ నటించిన నిన్నే పెళ్ళాడతా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చివరిగా వీరు ఆవిడా మా ఆవిడే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టబు షూటింగ్లో పాల్గొంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. దసరా తర్వాత విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే టైటిల్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఏదీ ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశం లేదు. సినిమా పూర్తయిన తర్వాతే ప్రచారం మొదలుపెట్టాలని నాగ్ నిర్ణయించారు. ఇలా నాగార్జున తన వందో చిత్రంపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. -
'అర్జున్ రెడ్డి కంటే పెద్ద హిట్టవుతుంది'.. రిషబ్ శెట్టి కొత్త సినిమా ట్రైలర్
గతేడాది కాంతార-2 మూవీతో సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కొత్త ఏడాదిలో సడన్ షాకిచ్చాడు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ఏ ఫిల్మ్ బై గిరి. ఈ మూవీలో ఇందిర హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఏ ఫిల్మ్ బై గిరి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రిషబ్ శెట్టి మూవీ స్క్రిప్ట్ రైటర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుధ్ మహేశ్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజీ మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్.పి తాపేశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ధనుశ్ కర.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. కర ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
మహిళకు లైంగిక వేధింపులు.. బిగ్బాస్ కంటెస్టెంట్పై ఫిర్యాదు
ప్రముఖ మలయాళ నటుడు, బిగ్బాస్ ఫేమ్ షియాస్ కరీంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలోని పాలారివట్టం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తనపై లైంగిక వేధింపులతో పాటు ఆర్థికంగా మోసం చేశాడంటూ విదేశాల్లో నివసిస్తున్న ఓ మహిళ కేరళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన నగ్న చిత్రాలను అశ్లీల వెబ్సైట్లలో పెడతానని బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వద్ద నుంచి రూ.65 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించింది. అందుకు సంబంధించిన సోషల్ మీడియా చాటింగ్స్, వాయిస్ రికార్డింగ్లను పోలీసులకు అందించింది. షియాస్ కరీంకు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల రికార్డులను సైతం పోలీసులకు సమర్పించింది. అతని వల్ల తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదులో ప్రస్తావించింది. వేధింపులు భరించలేకనే పోలీసుల ముందుకు వచ్చానని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.కాగా.. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులతో పాటు ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు షియాస్ను అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చెన్నై విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేశారు. అప్పట్లో ఎర్నాకుళంలో ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్న కాసరగోడ్కు చెందిన మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు.పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడి వేధింపులతో పాటు దాదాపు రూ.11 లక్షలు వసూలు చేశాడని ఆ మహిళ ఆరోపించింది. -
టాక్సిక్ వాయిదా పడే ఛాన్స్.. అంతా యశ్ వల్లేనా?
కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్కు పోస్ట్పోన్ అయింది. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్లో బోల్డ్ సీన్ ఉండడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కూడా ఉన్నట్లు సమాచారం.ఓటీటీ డీల్ ఆలస్యం..!ఈ బిగ్ మూవీ ఓటీటీ డీల్పై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఓటీటీ యాజమాన్యాలు రూ.110 కోట్లకు పైగా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల డిమాండ్ వల్లే టాక్సిక్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.యశ్ వల్లేనా..?ఈ మూవీ ఓటీటీ డీల్ ఆలస్యానికి హీరో యశ్ ఓ కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఓటీటీ డీల్ సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు సినిమా ప్రివ్యూ చూపించాలి. కానీ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడాలని..ముందే చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని యశ్ భావిస్తున్నారట. యశ్ నిర్ణయం వల్ల తీసుకున్న అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓటీటీలు వెనకాడుతున్నాయని లేటేస్ట్ టాక్. అందుకే టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
రజనీకాంత్కు విలన్గా..?
ఇన్ని రోజులు కెమెరా వెనకాల యాక్షన్, కట్ చెప్పిన దర్శకుడు శంకర్ ఇక తెరపై నటుడిగా కనిపించనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్పై విలన్ రోల్లో నటించేందుకు ఆయన రెడీ అవుతున్నారట. రజనీకాంత్ హీరోగా సీబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కమల్హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని విలన్ రోల్లో శంకర్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం దర్శకుడిగా శంకర్ ఓ హిస్టారికల్ మూవీ తీయాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇందుకు సమయం పడుతుందట. ఈలోపు విలన్గా ఈ అవకాశం రావడంతో చేయాలనుకుంటున్నారని టాక్. ఇదిలా ఉంటే... కొంతకాలం క్రితం వచ్చిన ‘సీత, ప్రేమికుడు, కాదల్ వైరస్, శివాజీ’ వంటి చిత్రాల్లో శంకర్ జస్ట్ అలా కనిపించారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో పూర్థి స్థాయి నటుడిగా కనిపిస్తారా? త్వరలోనే క్లారిటీ రావొచ్చు. -
నన్ను ఎగతాళి చేశారు.. నేషనల్ అవార్డ్తో సమాధానం చెప్పా
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్కు ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. -
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది)కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్స్టార్లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' అనే వెబ్ సిరీస్లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.'సిరీస్ కోసం అగ్రిమెంట్పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు''ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.(ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి) View this post on Instagram A post shared by Anugraha S Nambiar (@anugraha_s_nambiar_) -
2026 మిస్
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు, దర్శకులు జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తుంటారు. కుదిరితే ఏడాది రెండు లేదంటే కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో చాలామంది ఒక్కో సినిమా కోసం ఏడాది, రెండేళ్లు కూడా పని చేస్తున్నారు. భారీ బడ్జెట్, విదేశాల్లో షూటింగ్స్, నటీనటుల డేట్స్ క్లాష్,పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్, రిలీజ్ డేట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏవైనా కొందరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రతి ఏడాది ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లు తక్కువగానే ఉంటున్నారు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్కి వెళ్లింది. దీంతో నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా, అనుకున్న ఔట్పుట్ వచ్చేవరకు రాజీ పడటం లేదు. లేట్ అయినా పర్లేదు కానీ ఫైనల్గా ఆడియన్స్కి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చి, వారిని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ కారణంగా షూటింగ్,పోస్ట్ ప్రోడక్షన్కే చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు హీరోలు ప్రతి ఏడాది తమ సినిమాలను విడుదల చేయలేక΄ోతున్నారు. ఇందులో భాగంగా హీరోలు నాగార్జున, బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్... ఇలా పలువురు హీరోలు 2026ని మిస్ అవుతున్నారు. వారి సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.రెండోసారి... తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. గతంలో వరుస సినిమాలతో అటు అక్కినేని అభిమానులను ఇటు ప్రేక్షకులను అలరించిన ఆయన సోలో హీరోగా వరుసగా రెండేళ్లు మిస్ అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘నా సామిరంగ’ 2024లో విడుదలైంది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. ఆ తర్వాత నాగార్జున సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ‘కుబేర, కూలీ’ వంటి తమిళ సినిమాల ద్వారా తెలుగు–తమిళ ప్రేక్షకులను పలకరించారాయన. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో తనదైన నటనతో మెప్పించారు నాగార్జున. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలోనూ ధనుష్తో కలిసి నటించారు. ఈ సినిమా 2025 జూన్ 20న విడుదలైంది. ఇదిలా ఉంటే... తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా కోసం కాస్త సమయం తీసుకుని కథని ఓకే చేశారు నాగార్జున. ఆయన నటిస్తున్న 100వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ అందుకున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో 100వ సినిమా అనేది కీలకమైనది కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు నాగార్జున.ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలీలో శరవేగంగా జరుగుతోంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ కార్తీక్. ఈ మూవీలో మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన లుక్లో కనిపించబోతున్నారు నాగార్జున. ఈ చిత్రంలో ఆయన 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వివిధ దశల్లో, విభిన్న గెటప్స్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆధునిక హాలీవుడ్ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్’ సాంకేతికత సాయంతో నాగార్జునను 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు. సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఒక వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రకథ తండ్రీ–కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందట. ఈ చిత్రంలో టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ వంటి టైటిల్స్ని పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని తొలుత యూనిట్ అనుకుందట. అయితే నాగార్జునకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సందర్భంగా 2027లో విడుదల చేయనున్నారని ఫిల్మ్నగర్ టాక్. ఈ రకంగా చూస్తే సోలో హీరోగా నాగార్జున వరుసగా 2025, 2026... రెండేళ్లను మిస్ అవుతున్నట్లే లెక్క. ఏడాది గ్యాప్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2: తాండవం’ గత ఏడాది విడుదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ మూవీస్ తర్వాత బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా 2025 డిసెంబరు 12న విడుదలైంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నటించనున్న చిత్రం ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.‘వీర సింహారెడ్డి’ (2023) తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఎన్బీకే 111’. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా నయనతార నటిస్తున్నారు. ‘సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా’ వంటి సినిమాల తర్వాత బాలకృష్ణ– నయనతార జోడీగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. పవర్ఫుల్ ఎమోషన్ ్స, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో ముంబై నేపథ్యంలో ఉంటుందట. ఈ మూవీలో బాలకృష్ణ గ్యాంగ్స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని టాక్.దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయాలని చిత్రయూనిట్ తొలుత భావించింది. అయితే రెగ్యులర్ షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో షూటింగ్ ఆలస్యమైనా సరే ఔట్పుట్ విషయంలో రాజీ పడకూడదన్నది మేకర్స్ ఆలోచన అట. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ, పోస్ట్ ప్రోడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావనే ఆలోచనతో డిసెంబరులో విడుదల చేద్దామన్నది మరో ఆలోచన అట. అయితే బాలకృష్ణకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సెంటిమెంట్ని రిపీట్ చేస్తూ 2027 సంక్రాంతికి ‘ఎన్బీకే 111’ని విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ లెక్కన చూస్తే 2026ని బాలకృష్ణ మిస్ అయినట్లే అని భావించవచ్చు. రెండున్నరేళ్లకు పైగా గ్యాప్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ మూవీకి ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’ 2024 లో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెం బరు 27న విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. ఈ మూవీలో ప్రతి నాయకుడిగా నటించారు ఎన్టీఆర్. అంతేకాదు... ఈ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.‘దేవర: పార్ట్ 1’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రపోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు.ఈ రెండు పాత్రల కోసం ఆయన మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ తేదీకి ‘డ్రాగన్’ తప్పకుండా ప్రేక్షకుల ముందుకొస్తుందని అందరూ అనుకున్నారు.మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. అనుకున్నట్లే అప్డేట్ వచ్చింది.. అయితే సినిమాని 2026 జూన్ 25 నుంచి 2027 జూన్ 11కి విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో తమ అభిమాన హీరో సినిమా కోసం మరో ఏడాది పాటు ఫ్యాన్స్ నిరీక్షించక తప్పదు. ఈ విధంగా చూస్తే ‘దేవర: పార్ట్ 1’ విడుదలైన 2024 సెప్టెంబరు 27 నుంచి 2027 జూన్ 11 మధ్య గ్యాప్ రెండున్నరేళ్లకు పైగానే ఉంది. సెకండ్ టైమ్ ‘ఏంట్రోయ్... గ్యాప్ ఇచ్చావ్’ అంటూ నటుడు మురళీ శర్మ అనగానే... ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగులు ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో చూశాం. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూస్తే ఆయన కావాలని గ్యాప్ ఇవ్వకున్నా వస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత అల్లు అర్జున్ నటించనున్న 22వ సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.‘పుష్ప: ది రూల్’ మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తమిళ డైరెక్టర్ అట్లీతో నటించేందుకు అల్లు అర్జున్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ 22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ సాంకేతికతతో హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా ‘రాకా’ అనే టైటిల్ని ఖరారు చేసి, ఫస్ట్ లుక్తో అల్లు అర్జున్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.ఈ సందర్భంగా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. ఈపోస్టర్ చూస్తే.. అల్లు అర్జున్ ఇంత వరకు కనిపించని ఓ సరికొత్త అవతారంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. గుండు, వింత శరీరాకృతి, చూపుల్లో వాడీ వేడి... ఇలా సరికొత్త లుక్లో ఉండటంతో ‘రాకా’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రాకా’ ఒకటి. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కథనాన్ని మేళవించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందేలా ‘రాకా’ని తెరకెక్కిస్తున్నారు అట్లీ.హాలీవుడ్ సినిమాలకు దీటుగా విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఇచ్చారాయన. ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రకంగా చూస్తే వరుసగా 2025, 2026 ఏడాదిలను అల్లు అర్జున్ మిస్ అయ్యారు. సంవత్సరం గ్యాప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాల నటుడిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో సోలో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఆ మూవీ మంచి హిట్గా నిలిచింది. ‘జాంబి రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా–ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘హనుమాన్’. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా హిట్గా నిలిచింది.ఈ మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు తేజ సజ్జా. ‘హనుమాన్’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ ప్రధాన పాత్రపోషించారు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2025 సెప్టెంబరు 12న విడుదలై, హిట్గా నిలిచింది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల తర్వాత తేజ సజ్జా నటించనున్న చిత్రాలపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.అయితే తన హిట్ సినిమాలైన ‘జాంబి రెడ్డి’కి సీక్వెల్గా ‘జాంబీ రెడ్డి 2’, ‘హనుమాన్’ మూవీకి సీక్వెల్గా ‘జై హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రం సీక్వెల్ ‘మిరాయ్: జైత్ర’ లో నటించనున్నట్లు తేజా సజ్జా పేర్కొన్న సంగతి తెలిసిందే. వీటిల్లో ముందుగా ‘జై హనుమాన్ ’ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషబ్ శెటì ్ట హనుమంతుడి పాత్ర చేయనున్నారు. ఈ మూవీలో తేజ సజ్జా తన పాత్రని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లి, 2027లో విడుదల కానుంది. ఈ లెక్కన చూస్తే తేజ సజ్జా 2026ని మిస్ అవుతున్నారు.మూడేళ్లు గ్యాప్... హీరో మహేశ్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చో ప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత ‘వారణాసి’ కోసం మేకోవర్ అయ్యేందుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు మహేశ్బాబు. ఈ మూవీ కోసం ΄÷డవాటి హెయిర్ స్టైల్తో పాటు లైట్గా గెడ్డం కూడా పెంచారాయన. ఫిజికల్ మేకోవర్ కోసం బాగా కృషి చేశారు.ఇందుకోసం దాదాపు ఆరు నెలల పాటు ట్రైన్ అయ్యారట. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకుపైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాతపోస్ట్ ప్రోడక్షన్కి కూడా దాదాపు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు సమయం పడుతుంది. ఈ సినిమాలో మైథాలజీ బ్యాక్డ్రాప్కి అధిక ప్రాధాన్యం ఉంది. రామాయణం ఎపిసోడ్ని తనదైన శైలిలో తెరపై చూపించబోతున్నారు రాజమౌళి.‘గతంలో తాను తీసిన సినిమాలన్నీ రామాయణం నుంచి స్ఫూర్తి పొందినవే అని, మొదటిసారి ఆ రామాయణం ఎపిసోడ్ని ‘వారణాసి’లో చూపిస్తున్నాను’ అంటూ రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉండబోతుందట. ‘వారణాసి’ చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో భాగంగా త్రేతాయుగంలో రాముడి పాత్రలో కనిపించనున్నారు మహేశ్. అదే విధంగా రుద్ర అనే సాహస వీరుడిగా మరో పాత్రలో కనిపిస్తారు. ఈ మూవీ కోసం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో ప్రత్యేకంగా వేసిన వారణాసి సెట్లో తీసిన సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయని టాక్. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.అందులో భాగంగానే హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గని అంతర్జాతీయ ప్రమాణాలతో ‘వారణాసి’ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. మహేశ్బాబు, రాజమౌళి కలిసి చేస్తున్న ఈ ఎపిక్ అడ్వెంచర్పై వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ‘‘వారణాసి’ నా కలల ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం ఇది. ఈ సినిమా విడుదలయినప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అంటూ మహేశ్బాబు చె΄్పారంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని బట్టి చూస్తే 2025, 2026 ఏడాదిలను మహేశ్బాబు కూడా మిస్ అయినట్లే. ‘గుంటూరు కారం’ విడుదల తేదీ నుంచి ‘వారణాసి’ రిలీజ్ డేట్ వరకు చూస్తే మూడేళ్లకు పైగా ఆయన సినిమా కోసం ప్రేక్షకులు నిరీక్షించినట్లే లెక్క. పైన పేర్కొన్న హీరోలే కాదు.. మరికొంత మంది కూడా 2026ని మిస్ అయ్యే అవకాశాలున్నాయి. - డేరంగుల జగన్ మోహన్ -
ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. Behind every “perfect” romance can lie a calculated trap. Witness the moment Divya, Neha, and Surekha’s dreams spiraled into a nightmare.Watch #TheKeralaStory2, streaming from 8th May on ZEE5.#TheKeralaStory2OnZee5#TheKeralaStory2GoesBeyond #ShowYourDaughters… pic.twitter.com/TMdec083gG— ZEE5Official (@ZEE5India) April 24, 2026 -
ఓటేసిన తర్వాత త్రిష చేసిన తొలి పోస్ట్ ఇదే!
తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోనపు పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.దీంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ రావడం.. అవి నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్కి హాజరకావడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్గా వచ్చి ఓటు వేసి వెళ్లింది. విజయ్కి మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు కానీ.. తాను టీవీకే పార్టీకే ఓటు వేశానని పరోక్షంగా చెప్పేసింది.ఇన్స్టాలో తొలి పోస్ట్.. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కలిసి ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగి వెళ్లిపోయారు. కాసేపటికే ఆ ఫోటోని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫోటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు అసలైన రచ్చకు కారణమైంది.పాటతో ఇలా చెప్పేసిందిత్రిష షేర్ చేసిన పోటోకి బ్యాగ్రౌండ్లో ఓ పాటను జోడించింది. అది విజయ్తో కలిసి త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాట. కేవలం పాటను ఎంచుకోవడమే కాదు, అందులో కేవలం 'విజిల్స్'వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్కి జత చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. విజయ్ పార్టీ గుర్తు విజిల్. అందుకే త్రిష ఆ పాటతో షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను వాడారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ అభిమానులు అయితే త్రిషను ఏకంగా ‘వదినమ్మ’అని సంభోదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ -త్రిషలు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రియులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు. #Aadu3 (Malayalam) Streaming from May 1 on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/eJURte08qN— OTT Trackers (@OTT_Trackers) April 23, 2026 -
తమిళనాడు ఎన్నికలు.. హీరోయిన్కు చేదు అనుభవం
ప్రముఖ నటి అక్షయ హరిహరన్కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్కు గురైంది. అడయార్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరినట్లు అక్షయ హరిహరన్ తెలిపింది. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరింది. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన ఓటు వేసేందుకు వచ్చిన సెలబ్రిటీకి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా.. అక్షయ హరిహరన్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. సబా నాయగన్, రంగోలి, బ్లడీ బగ్గర్, హే సినామికా లాంటి సినిమాల్లో మెప్పించింది. నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్ఓటు వేసేందుకు అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లానుకానీ అప్పటికే నా పేరుతో వేరే వ్యక్తి ఓటు వేసినట్లు తెలిసి షాక్ అయ్యానునా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని… pic.twitter.com/SJtyWZkQ8L— ChotaNews App (@ChotaNewsApp) April 23, 2026 -
నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు: వీటీవీ గణేష్
తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. రజనీకాంత్, ధనుష్, త్రిష, మణిరత్నం, అజిత్, శృతీహాజన్తో పాటు పలువురు తమిళ స్టార్స్ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026 -
మెగా కాంపౌండ్ నుంచి మరో బ్యానర్?
మొదట గీతా ఆర్ట్స్, ఆ తరువాత అంజనా ప్రొడక్షన్స్, కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, వి-మెగా పిక్చర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ ఎలిఫెంట్, గీతాఆర్ట్స్-2 అంటూ మెగా కాంపౌండ్లో ఇప్పటికే చాలా బ్యానర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్గా ఉన్నాయి. మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా గీతాఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ఇది చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటి.అయితే తాజాగా ఈ లిస్ట్లోకి అదనంగా మరో బ్యానర్ వచ్చి చేరేలా ఉంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, నటుడు అల్లు శిరీశ్ ఓ కొత్త బ్యానర్ను స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. శిరీశ్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. దాంతో ఇప్పుడు కెరీర్ పరంగా కూడా కొత్త దశలోకి ఎంటరయ్యే ప్లాన్స్లో ఉన్నాడని తెలుస్తోంది.శిరీశ్ ఇప్పటికే ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఓవైపు గీతాఆర్ట్స్, మరోవైపు గీతాఆర్ట్స్-2 వంటి నిర్మాణ సంస్థలున్నప్పటికీ శిరీశ్ ఎందుకీ దిశగా ఆలోచిస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. కాగా 38 ఏళ్ల శిరీశ్కు కెరీర్లో ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు.చివరగా బడ్డీ అనే సినిమాలో కనిపించాడు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. దాంతో అతడు నిర్మాతగా మారే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. -
శారీలో హీరోయిన్ కృతి శెట్టి అందాలు.. ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ లుక్..!
బ్లూ డ్రెస్లో హీరోయిన్ శ్రియా శరణ్..పాలరాతిలా మెరిసిపోతున్న హీరోయిన్ లక్ష్మీ ప్రణీత..శారీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..హ్యాపీ ఎర్త్ డే అంటోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్...ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వాలా-2 కాదు.. కోట్లు కొల్లగొడుతున్న మరో చిన్న సినిమా
టాలీవుడ్లో చిన్న సినిమాలను జనాలు అస్సలు పట్టించుకోరు. వారంలో రెండు, మూడు చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. అదీ మన టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి. కంటెంట్ ఉంటేనే అంతో ఇంతో జనాలు ఆదరిస్తున్నారు. మరి మలయాళ ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మలయాళంలో రిలీజైన చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబడుతున్నాయి. ఇటీవలే వాలా-2 మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో సినిమాగా ఘనత దక్కించుకుంది.మలయాళ ఇండస్ట్రీలో వాలా-2 ప్రభంజనం కొనసాగుతుండగానే మరో సినిమా సైతం దూసుకెళ్తోంది. వారం రోజుల గ్యాప్లో రిలీజైన భరతనాట్యం- 2 మోహినియాట్టం అనే చిన్న మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. వాలా-2 నుంచి పోటీ ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా చిన్న సినిమాలతో కోట్లు గడించడం కేవలం మలయాళ ఇండస్ట్రీకే సాధ్యమవుతోంది.ఈ సినిమా కేవలం కేరళలో మాత్రమే కాదు.. కర్ణాటకలోనూ వసూళ్లు రాబడుతోంది. ఓవర్సీస్లో రిలీజైన ఈ మూలీ యునైటెడ్ కింగ్డమ్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ డార్క్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్ కీలక పాత్రల్లో నటించారు. -
జైలర్ 2 పూర్తి
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ చిత్రం షూటింగ్ పూర్తయింది. నెల్సన్ దిలీప్కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’. రమ్యకృష్ణ, సునీల్, తమన్నా, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’ సినిమా 2023 ఆగస్టు 10న విడుదలై తమిళంతో పాటు తెలుగులోనూ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. రజనీకాంత్–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందింది. ఈ సీక్వెల్లో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, ఎస్జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.‘జైలర్’ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ‘జైలర్ 2’ని కూడా నిర్మించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ చిత్రయూనిట్ కొన్ని ఫొటోలు విడుదల చేసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా రజనీకాంత్–నెల్సన్ దిలీప్కుమార్ కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కూడా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్కుమార్, విజయ్ సేతుపతి వంటి వారు ‘జైలర్ 2’లో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
రాక్షసపురం సిద్ధం
రాజ్ బి. శెట్టి, స్వాదిష్ట, అర్చన కొట్టిగే ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘రాక్కాసపురధోల్’. రవి సారంగ దర్శకత్వంలో కె. రవి వర్మ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న కన్నడలో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా ‘రాక్షసపురం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు మే 1న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.ఈ సందర్భంగా కేఎస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘రాక్షసపురం’. రాజ్ బి. శెట్టి పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉంది. ఐపీఎల్ ప్రభావం, ఓటీటీ పోటీ వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గుతోంది. అయినప్పటికీ ‘రాక్షసపురం’ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయనే నమ్మకం ఉంది’’ అని తెలి పారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు. -
ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్కి వస్తాడు. ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు. -
కెరీర్ పీక్లో సంయుక్త… పెళ్లి వార్తలతో హడావిడి
సినీ ఇండస్ట్రీలో మరోసారి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఆమె పెళ్లి గురించి రూమర్లు గట్టిగా వినిపించాయి. అయితే ఆ సమయంలో సంయుక్త స్వయంగా స్పందించింది. తన పెళ్లి వార్తలను పక్కన పెట్టాలని, నటిగా తన పనిని మాత్రమే గమనించాలని కోరింది. అయితే తాజాగా మళ్లీ సంయుక్తపై పెళ్లి పుకార్లు గుప్పుమంటున్నాయి. 30 ఏళ్ల ఈ మలయాళీ నటి ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. ఇక ఈ సమయంలోనే తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. కానీ కొంతమంది మాత్రం రష్మిక మందన్న తరహాలో సంయుక్త కూడా పెళ్లి చేసుకొని తన కెరీర్ కొనసాగిస్తుందని అంటున్నారు. త్వరలోనే ఆమె నిఖిల్తో కలిసి నటించిన ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు ‘బ్లాక్ గోల్డ్’ అనే మరో ప్రాజెక్ట్లోనూ నటిస్తోంది. కాగా తాజా పెళ్లి పుకార్లపై సంయుక్త మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ధనుశ్తో డేటింగ్ రూమర్స్.. వీరిద్దరు ఆ పని చేయనున్నారా?
సీతారామం ఫేమ మృణాల్ ఠాకూర్ ఇటీవలే డకాయిట్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ గురించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుశ్ డైరెక్షన్లో ఆమె పని చేయనున్నారని లేటేస్ట్ టాక్. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ కోసం మృణాల్ను సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా.. 1960 లేదా 1970ల కాలానికి సంబంధించిన ఒక 'పీరియడ్ డ్రామా'గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.అయితే తాజాగా వీరిద్దరి సినిమా గురించి టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు వీరి రిలేషన్పై చర్చ మొదలైంది. గతంలో మృణాల్- ధనుశ్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. గతేడాది ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్ వేడుకలో ధనుశ్ కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతకుముందు ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' సినిమా ముగింపు వేడుకలో మృణాల్ ఠాకూర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో ధనుష్ కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో అవ్వడంతో వీరిద్దరు రిలేషన్కు మరింత బలం చేకూరింది. అయితే తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఎక్కడా నోరు విప్పలేదు. గతంలో తన మూవీ 'దో దీవానే షహర్ మే' ఈవెంట్లో పెళ్లిపై వస్తున్న రూమర్స్పై మృణాల్ ఠాకూర్ స్పందించారు. తనపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇటువంటి వార్తలు చాలా సందర్భాల్లో నిరాధారంగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ధనుశ్ నటించిన 'కారా' మూవీ విడుదల కానుంది. 1991 గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. -
మొన్న 70 ఏళ్ల హీరో.. ఇప్పుడు 35 ఏళ్ల హీరో
చాలామంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు గానీ నయనతార మాత్రం చాన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఇద్దరు పిల్లలు తల్లిగా మారిన తర్వాత కూడా ఈమె జోరు తగ్గట్లేదు. ఇదే కాదు మరో అంశంలోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?)హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏ తరహా పాత్రలు చేస్తారో చాలావరకు వాటికి తగ్గట్లే అవకాశాలు వస్తుంటాయి. ఉదాహరణకు సీనియర్ హీరోలతో చేస్తే వాళ్ల సినిమాల్లో.. యంగ్ హీరోలతో చేస్తే వాళ్లతోనే అవకాశాలొస్తాయి. కానీ ఇలాంటి వాటికి నయనతార అతీతం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్, జూనియర్ అని తేడా ఉండదు. అందరూ హీరోలతోనూ కలిసి నటించేస్తుంటుంది. విచిత్రం ఏంటంటే అందరితోనూ ఈమె కెమిస్ట్రీ కూడా అలానే వర్కౌట్ అయిపోతుంటుంది.మూడు నెలల క్రితం 70 ఏళ్ల చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్' సినిమాలో చేసింది. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన తమిళ హీరో కవిన్తో జోడీ కట్టింది. 'హాయ్' పేరుతో తీస్తున్న మూవీలోనే వీళ్లు కలిసి నటిస్తున్నారు. అయితే వీళ్ల కాంబో ఎలా ఉంటుందా అనే సందేహాలకు తొలి పాటతో సమాధానమిచ్చారు. కవిన్-నయన్ జంట చూడటానికి బాగానే ఉంది. పాట కూడా బాగుంది.తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోలతో చేసిన నయనతార.. తమిళంలో రజనీకాంత్ జనరేషన్ హీరోలతో చేసింది. విజయ్, అజిత్ తదితరులతోనూ నటించింది. ప్రస్తుత జనరేషన్ హీరోలతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. చూస్తుంటే నయనతారకు మాత్రమే ఇలాంటివి సాధ్యమేమో అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్డేట్ ఇచ్చిన బుచ్చిబాబు) -
ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. Indha love fake ah thaan thodanguchu, but the feelings got all too real ♥️😢 pic.twitter.com/1vg34zTrlb— Netflix India South (@Netflix_INSouth) April 21, 2026 -
అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?
టాలీవుడ్ రేంజు పెరిగిపోయింది. అబ్బో పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నాం అని చాలామంది సంబరపడిపోతున్నారు గానీ గ్రౌండ్ లెవల్ పరిస్థితి అస్సలు బాగోలేదు. మిగతా విషయాల్ని కాసేపు పక్కనబెడితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్పితే తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాపులే. కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి. గత మూడు నెలలుగా టాలీవుడ్లో సరైన హిట్ లేదు. అలాంటిది మలయాళంలో మాత్రం చిన్న చిత్రాలు వరసపెట్టి వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి? ఇంతకీ ఇదెలా సాధ్యం? వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?(ఇదీ చదవండి: ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి)ఒకప్పుడు మలయాళ సినిమా అంటే చిన్నచూపు ఉండేది కానీ గత కొన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీకి రీచ్ బాగా పెరిగింది. లాక్డౌన్ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులు ఈ భాష చిత్రాల్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్లే మలయాళీ దర్శకులు.. అందరరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్లతో సినిమాలు తీస్తున్నారు. గత నెలలో 'ధురంధర్ 2'తో పాటు రిలీజై 'ఆడు 3' అనే చిత్రం సెన్సేషన్ సృష్టించింది. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. తాజాగా 'భరతనాట్యం 2', 'వాలా 2' అనే చాలా చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా వరసగా రూ.100, రూ.200 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాయి.తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో రీసెంట్ టైంలో సక్సెస్ కోసం అందరూ ఇబ్బంది పడుతుంటే మలయాళంలో మాత్రం వరస హిట్స్ కొడుతున్నారు. దీనికి కారణాలు ఏంటా అని చూస్తే చాలా సింపుల్. మలయాళీ దర్శకులు.. అనవసర ఆర్భాటాలు పేరిట గిమ్మిక్కులు చేయరు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఏళ్లకు ఏళ్లు మూవీస్ తీయరు. పరిమిత బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్లో ఎలాంటి చిత్రాన్ని అయినా పూర్తి చేస్తారు. కథను నమ్మి, వైవిధ్యమైన ఐడియాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచాలని చూస్తారు. సహజమైన వాతావరణంలోనే ఎక్కువగా సినిమాలు తీయడం ఇంకో ప్లస్. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయిమరోవైపు టాలీవుడ్ పరిస్థితి చూస్తే.. ఓటీటీ మార్కెట్ దారుణంగా పడిపోతూ వస్తోంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొందరు మిడ్ రేంజ్ హీరోలకు పెద్ద మార్కెట్ లేకపోయినా వీళ్లపై కొందరు నిర్మాతలు.. భారీతనం పేరిట, హంగులు, ఆర్భాటాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. బిజినెస్ మాత్రం దానికి తగ్గట్లు జరగట్లేదు. సరేలే ఎలాగోలా కానిచ్చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. చూసేందుకు ప్రేక్షకులు రావట్లేదు. వీటిలో ప్లానింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.తెలుగు ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కాకుండా పాన్ ఇండియా పేరిట గిమ్మిక్కులు చేద్దామని చాలామంది దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. అలాంటివి పసిగట్టేస్తున్న ఆడియెన్స్.. సదరు సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు. అందుకే తెలుగు దర్శకులు ఇకపై కంటెంట్ని నమ్ముకుని మూవీస్ తీస్తే బెటర్. లేదంటే ముందుముందు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మలయాళం లాంటి పరభాషా చిత్రాలకు ఆదరణ పెరగడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా) -
ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి
సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్ ఇంటర్నేషనల్.. సాయి వ్యాఖ్యలు వైరల్)'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
కర వస్తున్నాడు
ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘కర’. డా.ఇషారి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో ‘కర’ సినిమాను సీహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సూరజ్ వెంజరమూడు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
అద్భుత ప్రయాణం
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్ర పరిశ్రమలో 26 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘బద్రి’ 2000 ఏప్రిల్ 20న విడుదలైంది. 2026 ఏప్రిల్ 20కి 26ఏళ్ల జర్నీ పూర్తయింది. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అన్నది ట్యాగ్లైన్ . విజయ్ సేతుపతి, సంయుక్త జోడీగా నటించారు. టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ మోహన్ పిక్చర్స్పై జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్ 26 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘‘పూరిగారి ప్రయాణం అద్భుతం. సినిమా రంగంలో 26 సంవత్సరాలు అంటే కేవలం మైలురాయి కాదు ధైర్యం, నమ్మకం, భయంలేని ఆలోచనలతో నిర్మించిన ఒక వారసత్వం. ‘స్లమ్ డాగ్’ చిత్రంలో పూరి సర్తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. -
కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండతో క్రేజీ హీరోయిన్
‘తొలి ప్రేమ, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్’ వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దర్శకుడు కరుణాకరన్. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ హీరోగా కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వీవీ వినాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. ‘‘న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా కరుణాకరన్ శైలిలో సున్నితమైన, ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మాటలు రాస్తున్నాడు. కామెడీ సన్నివేశాల్లో కరుణాకరన్కు ప్రత్యేకమైన స్టయిల్ ఉండగా, అనుదీప్కు కూడా హాస్యంలో మంచి పట్టుంది. వీరి కలయికతో వినోదం మరింత పెరిగే అవకాశం ఉంది. సంగీతం అందించబోతున్నది భీమ్స్. ఈ సినిమాలో బెల్లంకొండ గణేశ్ సరసన ఓ క్రేజీ హీరోయిన్ను తీసుకోవాలని యూనిట్ నిర్ణయించింది. హీరోయిన్ ఎంపికతో ఈ ప్రాజెక్ట్కు మరింత వెయిట్ యాడ్ కానుంది. కరుణాకరన్, అనుదీప్ కలయికలో రాబోతున్న ఈ సినిమా వినోదభరితంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ గణేశ్ కెరీర్లో కూడా ఇది కీలక ప్రాజెక్ట్గా మారే అవకాశం ఉంది. -
శ్రీరాముడిపై కామెంట్స్.. ప్రకాశ్ రాజ్పై బ్యాన్..!
దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన శ్రీరాముడిని ఉద్దేశించి తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన కామెంట్స్పై వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మరింత ముదిరేలా కనిపిస్తోంది.ప్రకాశ్ రాజ్ను సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. శ్రీరాముడిపై చేసిన కామెంట్స్తో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీంతో ఆయనపై నిషేధం విధించాలనే డిమాండ్స్ రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. సినీ వర్గాలు సైతం ప్రకాశ్ రాజ్పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.ప్రకాశ్ రాజ్ తన చేసిన కామెంట్స్పై వివరణ ఇచ్చినప్పటికీ వ్యతిరేకత ఏమాత్రం తగ్గడం లేదు. అయితే కొందరు దర్శకులు, నటులు మాత్రం ఈ విషయంపై పునరాలోచన చేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఆయనపై ఇండస్ట్రీలో వివాదాలు ఉన్నాయని.. అప్పట్లో తాత్కాలికంగా బ్యాన్ జరిగిన సంఘటనలు కూడా తాజాగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. -
విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న తమిళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల కేసుని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు.. సోమవారం విచారణ చేపట్టింది. ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా విజయ్ పర్యటిస్తున్నారని, భద్రతా కారణాలు, ఇతర కార్యక్రమాల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వివరించారు. మరోవైపు సంగీత కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలోనే ఇరువర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కేసు విచారణని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)గతంలోనే ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వాలని విజయ్కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కానీ సోమవారం.. ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసి విచారణని వాయిదా వేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఇరుపక్షాల అభ్యర్థన మేరకు ఈ విడాకుల కేసు విచారణని జూన్ 15వ తేదీకి వాయిదా వేశారు.27 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న విజయ్-సంగీత.. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు ఇదివరకే తెలియజేశారు. విడాకులకు సంబంధించిన కీలక అంశాలైన భరణం, ఆస్తుల పంపకంపై ఇప్పటికే ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్, భద్రతకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన ఒప్పందానికి వచ్చారట. అయితే ఆర్థికపరమైన వివరాలు ఏవి కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పొందుపరచలేదు.(ఇదీ చదవండి: నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు: 'రాకా' గురించి ఆర్య) -
18 రోజుల్లో రూ. 205 కోట్ల కలెక్షన్స్.. మలయాళ మూవీ సంచలనం!
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు మాత్రమే కాదు నూతన నటీనటుల మూవీస్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే నిర్మాతలు కూడా పాన్ ఇండియా ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. కేవలం ఒక భాషలోనే కాకుండా..ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. మన తెలుగు నిర్మాతలు..మలయాళ, కన్నడ సినిమాలు చేసి అక్కడ విజయాలు అందుకుంటున్నారు. అలా తెలుగు నిర్మాత సాహు గారపాటి రూ.10 కోట్లతో నిర్మించిన మలయాళ సినిమా ఒకటి అక్కడి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. కేవలం 18 రోజుల్లోనే రూ. 205 కోట్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. అదే ‘వాళా 2’. 2024లో వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాళా’ చిత్రానికి కొనసాగింపు ఇది. కొత్త నటీనటులతో సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విపిన్ దాస్ తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 2 మలయాళంలో విడుదలై.. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా 18 రోజుల్లోనే రూ. 205 కోట్ల వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ సినిమా రూ.300+ కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ఎల్2: ఎంపురాన్’, ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘తుడరుమ్’ చిత్రాలు ఉన్నాయి. వాళా 2 చిత్రాన్ని ఏప్రిల్ 24న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మరి ఇక్కడ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. -
విజయ్-సంగీత విడాకులు.. రూ. 250 కోట్లు అడిగారా?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీవీకే పార్టీనీ స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవ్వగానే.. సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ విడాకుల కేసు నేడు (ఏప్రిల్ 20) చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతానంటూ విజయ్ తన లాయర్తో పిటిషన్ దాఖలు చేయించాడు. దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.ఇదిలా ఉంటే.. విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిట్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట. అయితే ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కోర్టు విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. -
నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం
సినిమా నిర్మాణాన్ని సవాల్ చేస్తున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం) చెందిన అగ్ర సినీ నిర్మాతలు, సంబంధిత ప్రతినిధులు, ప్రోడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు ఏకతాటి పైకి వచ్చారు. సినిమా పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ (ఎస్ఐఎఫ్పీఏ) ఏర్పాటైంది.ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ‘ఎస్ఐఎఫ్పీఏ’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సినిమా నిర్మాణ రంగంలో ఇతర స్టేక్ హోల్డర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. 8 వారాల తర్వాతనే ఓటీటీలో సినిమాను విడుదల చేయాలి, సినిమా రిలీజ్ల విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి (థియేట్రికల్ రెవెన్యూకు సంబంధించి పర్సెంటేజ్ అండ్ రెంటల్ వివాదాన్ని ఉద్దేశించి కావొచ్చు) అంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఈ సమావేశంలో నిర్మాతలు ఖండించారు.వేలాది మంది ఉపాధి ఆధారపడి ఉన్న సినిమా నిర్మాణ వ్యవస్థలో ఆకస్మాత్తు నిర్ణయాలు తీసుకుని, రాత్రికి రాత్రి ఆటంకం కలిగించకూడదని ఈ సమావేశంలోని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన నోట్లోని అంశాలు ఈ విధంగా... ‘‘నిర్మాతల ప్రయోజనాలను దీర్ఘకాలం పాటు కాపాడటానికి ‘ఎస్ఐఎఫ్పీఏ’ను ఏర్పాటు చేయడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. నాలుగు భాషలకు చెందిన దక్షిణాది నిర్మాతల మధ్య సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం సభ్యులైన నిర్మాతలు తమ సినిమాల నిర్మాణం, విక్రయం, విడుదల తేదీ వంటి అంశాల విషయంలో ఏ ఇతర సంఘం నిబంధనలకు కట్టుబడకుండా తమ సొంత నిర్ణయాలతో కొనసాగాలి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాల విడుదల విషయంలో ఎటువంటి హామీ పత్రాలను నిర్మాతలు ఏ అసోసియేషన్కు లేదా రంగానికి ఇవ్వకూడదు. సినిమా పరిశ్రమ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిబంధనలను అందరితో చర్చించి మాత్రమే నిర్ణయించుకోవాలి’’ అంటూ ‘ఎస్ఐఎఫ్పీఏ’ స్టీరింగ్ కమిటీ ఆ నోట్లో పేర్కొంది. -
బ్యాంక్ దొంగగా ధనుష్.. ఆసక్తికరంగా ట్రైలర్
ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది. పెట్రోలు ఉత్పత్తి అయ్యే చోట్ల ఇరాన్ దాడులు చేయడం లాంటివి చూశాం. ఈ అంశాన్ని ఓ పాయింట్గా చూపించి తీసిన సినిమా 'కర'. ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)ట్రైలర్ బట్టి చూస్తే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. బ్యాంకు దొంగతనాలు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో వాటిని ఆపేసి పెళ్లి చేసుకుని సాధారణంగా బతుకుతుంటాడు. అలాంటి ఇతడు మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇతడిని అడ్డుకునేందుకు పోలీస్(సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.గతంలో 'పొర్ తొళిల్' అనే థ్రిల్లర్ తీసి అద్భుతమైన హిట్ కొట్టిన విఘ్నేశ్ రాజా.. ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఇది థియేటర్లలోకి రానుంది. ఆ తేదీకి రావాల్సిన 'పెద్ది' వాయిదా పడింది. మరి ధనుష్ 'కర'తో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి? ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా వదులుతారు.(ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్బాస్' ఫేమ్ ట్రాన్స్జెండర్ తమన్నా) -
లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేర్చగా తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన్ని ఒకప్పటి హీరోయిన్ రాధిక వెళ్లి పరామర్శించింది. భావోద్వేగానికి గురవుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)రాధిక రీసెంట్గా లీడ్ రోల్ చేసిన 'తాయ్ కిళవి' సినిమాని భారతీ రాజా చూశారు. దీని గురించి రాధిక ఆయన మధ్య చర్చ కూడా జరిగింది. సినిమా చూశారా అని రాధిక అడగ్గా.. చూశానని చెప్పిన భారతీరాజా, ఈ చిత్రానికి మీకు జాతీయ అవార్డ్ అందుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రాధిక.. అదే జరిగితే, ఆ అవార్డుని మీ పాదాల దగ్గర అర్పిస్తానని స్పందించింది.ఇన్ స్టాలో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోని పోస్ట్ చేసిన రాధిక.. ఆయన ఆశీర్వాదం, అవార్డు కంటే గొప్పది. ఆయనని ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ సినిమాపై ఉన్న ప్రేమే ఆయనని ముందుకు నడిపిస్తోంది అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది.. ఎలా ఉండే భారతీరాజా ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈయన చివరగా గతేడాది రిలీజైన 'దేశియా తలైవర్' సినిమాలో నటించారు.(ఇదీ చదవండి: బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్: అనన్య నాగళ్ల) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
శృతిహాసన్పై పబ్లిక్లో కామెంట్స్.. నటి ఆగ్రహం..!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న శృతిని రోడ్డుపై ఉన్న కొందరు కామెంట్స్ చేశారు. శృతిని చూసి మమ్మ అంటూ పబ్లిక్లో గట్టిగా అరిచారు. ఇది విన్న శృతి హాసన్ 'కౌన్ హై మమ్మ.. హమ్ నే మమ్మ హై.. ఏ మాట్లాడుతున్నారు మీరు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ బండి ఎక్కడ ఉంది అంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. అడివి శేష్ డెకాయిట్ నుంచి తప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా రజినీకాంత్ కూలీ చిత్రంలో కనిపించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతోందని కోలీవుడ్లో వార్తలొస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే వరుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే శృతి హాసన్కు రెండుసార్లు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. Kamal Haasan's daughter Shruti Haasan was heading to a party when someone called her “mumma.” She got angry and replied brutally 😭 pic.twitter.com/mi8rJfKVGe— Sunita Indian (@NationSpeax4j) April 19, 2026 -
అలాంటి పాత్రలు చేయడమంటే ఇష్టం.. ఛాంపియన్ బ్యూటీ..!
ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందుకు ఫర్ఫెర్ట్ ఎగ్జాంపుల్ అనస్పర రాజన్. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తెలుగు, తమిళం, హిందీ అంటూ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మాతృభాష మలయాళంలో ఉదహరణం సుజాత అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ 9 ఏళ్లలోనే 30కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు.ఇటీవల తమిళంలో హీరోయిన్గా నటించిన విత్లవ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో కళాశాల విద్యార్థినిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఇట్లు అర్జున, తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 7 జీ రెయిన్బో కాలని చిత్రాలతో పాటు మలయాళంలో ఓ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా అనస్పర రాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఛాలెంజింగ్ కథా పాత్రల్లో నటించడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఎలా ఇలాంటి పాత్రల్లో నటించారు అని చర్చించుకునే విధంగా బలమైన పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు. తనకు ఛాలెంజ్లను ఎదుర్కొవడం ఇష్టం అన్నారు. అలాంటి వైవిద్యభరిత కథా పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు ఇప్పటి వరకూ నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేశారు. ఈ 23 ఏళ్ల బ్యూటీ ముందు ముందు ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే. -
ఇద్దరితో బ్రేకప్.. పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ..!
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళంతో పాటు తెలుగులో సినిమాలు చేసింది. చివరిసారిగా రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీలో కనిపించింది. ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. సినిమాలతో కాకపోయినా.. వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం.అయితే గతంలో బాయ్ఫ్రెండ్తో విడిపోయిన ముద్దుగుమ్మ.. సింగిల్గానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ గురించి కోలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. శృతి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన వాడితోనే మూడుముళ్లకు రెడీ అయినట్లు లేటేస్ట్ టాక్. వరుడిని కోసం ఆమె తండ్రి కమల్ హాసన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూడగా.. అవీ వారికి నచ్చలేదని సమాచారం. వీలైనంత త్వరగా శృతి హాసన్కు మ్యారేజ్ చేయాలని కమల్ రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో లండన్కు చెందిన ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో శృతి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ బ్రేకప్ అయింది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. -
ఆట పూర్తి
‘ఐ యామ్ గేమ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.ఈ చిత్రంలో కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు – దర్శకుడు మిస్కిన్, కదిర్, పార్థ్ తివారీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘‘ఈ ఏడాది ఓనమ్ పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
స్టార్ హీరో కుమారుడితో పెళ్లి.. హీరోయిన్ మదర్ రియాక్షన్..!
కొత్త లోకా మూవీతో టాలీవుడ్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్ లాంటి రిలేషన్స్ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్కు తెరపడింది. -
చియాన్ విక్రమ్ కొత్త సినిమా.. టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తంగలాన్ తర్వాత మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లో 63వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ చియాన్ విక్రమ్ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫ్లేమ్ పేరుతో ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. What starts as a FLAME ends in a BLAZE 🔥 #Chiyaan63 FIRST FLAME out now ▶️ https://t.co/2FnD5WetinWishing the one and only #ChiyaanVikram a very happy birthday!#CookingStartsNow #Chiyaan63FirstFlame@SathyaJyothi @chiyaan @anandshank @Music_Santhosh @RDRajasekar @arjun1on… pic.twitter.com/w6UTCR34tP— Sathya Jyothi Films (@SathyaJyothi) April 17, 2026 -
బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి 'రహ్మాన్ డకాయత్' అడుగులు
‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్తో తీస్తున్న సినిమా సెట్స్పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. -
హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్..!
టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. కోటి రూపాయల పరిహారం కోరుతూ హైకోర్ట్ను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్ను కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతోనే తమన్నా పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీకి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. అసలేం జరిగిందంటే..పవర్ సోప్స్ అనే సంస్థతో 2008లో తమన్నా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే తమన్నాతో పవర్ సోప్స్కు అగ్రిమెంట్ కుదిరింది. కానీ గడువు ముగిసినా 2010, 2011లో కూడా ఆ సంస్థ తన ఉత్పత్తులతో పాటు ప్రకటనల్లో మిల్కీ బ్యూటీ ఫోటోలను వినియోగించింది. దీంతో ఒప్పందం అయిపోయినా కూడా తన ఫోటోలను ప్రకటనల్లో వాడారని ఆరోపిస్తూ తమన్నా ఇటీవలే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తమన్నా పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నా పిటిషన్ను హైకోర్ట్ తిరస్కరించింది. -
శానిటరీ నాప్కిన్ యాడ్.. వివాదంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ సంస్థ, ఎస్ ఎస్. లలిత్కుమార్కు చెందిన సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నిర్మించారు.ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్ ఓ శానిటరీ నాప్కిన్ యాడ్లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. -
అందుకే ఆ బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్నా..: ఎస్జే సూర్య
కోలీవుడ్లో బ్లాక్బస్టర్ నిలిచిన చిత్రం 'లబ్బర్ పందు'. 2024లో సెప్టెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్ గోట్ మూవీతో పోటీ పడింది. పెద్దగా ఫేమ్ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని తమిళరాసన్ పంచముత్తు తెరకెక్కించాడు.తాజాగా లబ్బర్ పందు మూవీని వదులుకోవడంపై స్టార్ నటుడు ఎస్జే సూర్య స్పందించారు. తనకు మొదట ఆఫర్ చేసిన పాత్రను తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఎల్ఐకే సక్సెస్ మీట్లో సూర్య మాట్లాడారు. ఓ సారి దర్శకుడు లబ్బర్ పందు స్క్రిప్ట్తో నన్ను సంప్రదించారని తెలిపారు. నా ఇమేజ్కు సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని నేను అతన్ని అడిగా.. ఆయన దానికి పూర్తిగా అంగీకరించారు. కానీ ఆ మార్పులు పెరుగుతూ పోవడంతో.. నేనే మళ్లీ ఆలోచించానని అన్నారు. నా కోసం మీరు మీ మొత్తం కథను మారుస్తూ ఉంటే.. ఒక డైరెక్టర్గా మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతారని అతనితో చెప్పానని వెల్లడించారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని డైరెక్టర్కు వివరించానని అన్నారు. కాగా.. ఈ మూవీలో అట్టకత్తి దినేష్ పోషించిన ఆ పాత్రను మొదట సూర్యకు ఆఫర్ చేశారు డైరెక్టర్ తమిళరాసన్.ఇటీవలే ఎస్జే సూర్య ఎల్ఐకే చిత్రంలో కనిపించారు. ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఎస్జే సూర్య.. ప్రీతి అశ్రాని సరసన నటిస్తున్నారు. 'కిల్లర్' చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో కూడా భాగమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి, అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. 'కిల్లర్'తో పాటు, కార్తితో 'సర్దార్ 2', 'బ్రో కోడ్' చిత్రాలు చేస్తున్నారు. -
పళ్లి చట్టంబి రిలీజ్ వాయిదా.. కారణమదే..!
మలయాళ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం పళ్లి చట్టంబి. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ రోజే సినిమా విడుదల కావాల్సి ఉంది.మలయాళంలో మాత్రం ఈ రోజే విడుదల చేసిన మేకర్స్.. తెలుగు విడుదల వాయిదా వేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రానుంది. సాంకేతిక సమస్యస కారణంగానే ఈ మూవీ తెలుగు రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్ని వాస్ వర్క్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ కీలకపాత్రలు పోషించారు. 1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. -
'పుష్ప' లాంటి సెటప్.. 'మార్కో' స్టైల్ యాక్షన్.. ట్రైలర్ రిలీజ్
రీసెంట్ టైంలో అడవి బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా అనగానే చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తీశారు. ఇప్పుడు ఈ తరహాలోనే ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో మలయాళంలో తీసిన పాన్ ఇండియా మూవీ 'కాటాలన్'. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)ట్రైలర్ చూస్తే ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఇందులో హీరో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్లా అనిపిస్తుంది. అయిత హీరోహీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్.. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో గన్ లేదంటే కత్తి కనిపించాయి. బుల్లెట్ పేల్చడం లేదంటే రక్తపాతం సృష్టించడం లాంటివి కనిపిస్తున్నాయి. అలానే ట్రైలర్కి మూడు డిఫరెంట్ థీమ్ మ్యూజిక్స్ అనే కొత్త ప్రయోగం చేశారు. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. 'మార్కో' లాంటి వయలెంట్ మూవీ తీసిన నిర్మాతలే దీన్ని తెరకెక్కించారు. తెలుగు నటుడు సునీల్.. ఇందులో ఓ విలన్గా చేయడం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు
హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గతవారం థియేటర్లలోకి వచ్చింది. అటు తమిళంలో గానీ ఇటు తెలుగులో గానీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. లాంగ్ రన్ ముగిసేసరికి ఎంత నష్టాలొస్తాయో చూడాలి? అయితే ఈ చిత్ర టైటిల్ వివాదం గురించి విఘ్నేశ్ శివన్ ఇన్నాళ్లకు స్పందించాడు. అసలేం జరిగిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)తొలుత ఈ సినిమాకు 'LIC' అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ఈ మేరకు 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. LIC సంస్థ ఈ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఏడు రోజుల్లోగా పేరు మార్చాలని చెప్పడంతో టీమ్ మెట్టు దిగింది. టైటిల్లోని C బదులు K అనే అక్షరాన్ని జోడించారు. అలానే థియేటర్లలో రిలీజైంది.అయితే LIC అనే పేరు ఉపయోగించుకోవాలంటే తమకు రూ.112 కోట్లు ఇవ్వాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా విఘ్నేశ్ శివన్ బయటపెట్టాడు. ఇన్ని కోట్లు ఇవ్వడం ఎందుకని బదులుగా తను LIP, LIT, LIK, LIF టైటిల్స్ ఆలోచించి పెట్టుకున్నానని.. చివరగా LIK టైటిల్ నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విషయానికొస్తే.. 2040లో జరిగే ఫ్యూచరిస్టిక్ ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఫోన్లోని యాప్ చెబితేనే ప్రేమిస్తాననుకునే అమ్మాయి.. లేదంటే ప్రేమంటే మనసులో నుంచి పుట్టాలనుకునే అబ్బాయి మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగింది? చివరకు వీళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్తో ఈ సినిమాని తీశారు. కానీ జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అలానే హీరో ప్రదీప్ రంగనాథన్.. హ్యాట్రిక్స్ హిట్స్కి కూడా ఈ చిత్రంలోనే బ్రేక్ పడింది.(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)#VigneshShivan about LIK Title- We initially titled #LIK as “LIC” (Love Insurance Company), but LIC demanded ₹112 crores for us to use the name.- Since that wasn’t feasible, I explored alternative options like LIP, LIT, LIK, and LIF.pic.twitter.com/TfjB0D9qlH— Movie Tamil (@_MovieTamil) April 14, 2026 -
రుక్మిణి వసంత్కి మరో సూపర్ ఛాన్స్!
కన్నడ భామ రుక్మిణి వసంత్కి తమిళంలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. నటుడు విజయ్ సేతుపతికి జంటగా 'ఏస్' మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు ఇది హిట్ అవ్వకపోయినా ఛాన్సులు వరిస్తున్నాయి. శివకార్తీకేయన్కి జంటగా గతేడాది 'మదరాసి' చిత్రంలో నటించింది. ఇది కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత సొంత భాషలో చేసిన 'కాంతార' ప్రీక్వెల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ధనుష్కు జంటగా నటించే అవకాశం వరించిందని సమాచారం.ధనుష్ ప్రస్తుతం విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో చేసిన 'కర' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని తర్వాత 'అమరన్' ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తాడు. ఇది ధనుష్ 55వ చిత్రం. దీని తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు. 'లబ్బర్ పందు' ఫేమ్ తమిళరస పద్యముత్తు దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడ. ఇందులోనే ఈయనకు జంటగా రుక్మిణి వసంత్ని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమచారం.రుక్మిణి.. కన్నడ, తమిళంతో పాటు తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్కు జంటగా 'డ్రాగన్' చేస్తున్నారు. కన్నడంలో చేసిన 'టాక్సిక్' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇకపోతే ధనుష్ తో నటి రుక్మిణి తొలిసారిగా జోడీ కట్టబోతోందన్న మాట. ఇందులో విజయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించనున్నారనీ టాక్. త్వరలోనే ఈ విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ఆస్కార్ అవార్డును కూడా తెచ్చింది. విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలుగు సినీ ఇండస్ట్రీపైనే ఉంది. అందుకే పరభాషా హీరోలు టాలీవుడ్ దర్శక–నిర్మాతలతో అసోసియేట్ అయి, సినిమాలు తీస్తున్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా హిట్ చేస్తారు, ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ ఇస్తారు. దీంతో తెలుగులో సినిమాలు చేసే పరభాషల హీరోల సంఖ్య ఎక్కువ అవుతోంది. తెలుగు దర్శక–నిర్మాతలు కూడా ‘మీరొస్తామంటే... మేమొద్దంటామా..!’ అంటూ సినిమాలను ఓకే చేస్తున్నారు. మరి... ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న కొందరు పరభాషా హీరోలపై ఓ లుక్ వేయండి.సల్మాన్ భాయ్ వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో తిరుగు లేని నటుడు. అయితే తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూశారు. కొంతమంది కమర్షియల్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.ఈ నెలాఖరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించనున్నారు. వచ్చే నెలలో ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్రాజా డైరెక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.హిట్ 4 అన్నయ్య సూర్య బాటలోనే కార్తీ నడుస్తున్నారు. సూర్య మాదిరిగానే కార్తీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యను ఓన్ చేసుకున్నట్లే కార్తీని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 2016లో ‘ఊపిరి’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ఇది. తెలుగులో కార్తీ చేసిన స్ట్రయిట్ ఫిల్మ్గా ‘ఊపిరి’ని చెప్పుకోవచ్చు. కార్తీతో సినిమాలు చేసేందుకు కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపించారు.‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ వంటి దర్శకులు కథలు వినిపించారని తెలిసింది. ఈ చర్చలు ఇలా ఉండగానే... నాని నిర్మాతగా ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ‘హిట్ 4’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్కు వెళ్లనుందని తెలిసింది. ఇక కార్తీ నటించిన ‘సర్దార్ 2’ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా, ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.డబుల్ ధమాకా! ‘కాంతార, కాంతార: చాప్టర్ 2’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెలుగులో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ప్రశాంత్ శర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా మరో కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.మరోవైపు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయనున్న ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. 18వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోని బెంగాల్ ప్రావిన్స్ ప్లేస్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇందులో ఓ తిరుగుబాటు దళానికి చెందిన నాయకుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జై హనుమాన్’తో రిషబ్ బిజీగా ఉన్నారు. సో... అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి చేయనున్న సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.నిశ్శబ్దం పెరిగేకొద్దీ... ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ రద్దు అయిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు హల్చల్ చేయడం.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్ షేర్ చేసి, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆయన ఫొటో వైరల్గా మారింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.హీరోగా హాస్యనటుడుచాలాకాలం హాస్య నటుడిగా కొనసాగిన సూరి మెల్లిగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. సూరి హీరోగా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆర్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విధంగా తెలుగులో సూరి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుందని తెలిసింది.తెలుగులో బిజీ బిజీ ‘మహానటి, లక్కీభాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి దర్శకురాలిగా పరిచయం అవుతుండగా ఇందులో శ్రుతీ హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాకు నిర్మాతలు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బలమైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి సాహసం చేసిందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఎమోషనల్గా చూపించనున్నారట దర్శకుడు పవన్. అలాగే రవి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంకా నాని నిర్మాతగా ‘కోర్ట్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన రామ్ జగదీష్ డైరెక్షన్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీ బిజీగా ఉంటున్నారు. అటు మలయాళంలోనూ ఆయన హీరోగా ‘ఐ యామ్ ది గేమ్’ సినిమా రూపొందుతోంది. షూటర్ విశ్వనాథ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన హీరోనే అని ఫీలవుతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో అనువాదం అవుతుంటాయి. ఇదిలా ఉంటే... సూర్య తెలుగులో స్ట్రయిట్గా ‘రక్త చరిత్ర 2’ (2010) అనే సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్తో ‘సార్’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో షూటర్ సంజయ్ విశ్వనాథ్గా సూర్య నటిస్తున్నారు. హీరోయిన్గా మమితా బైజు కనిపిస్తారు.రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ విశ్వనాథ్ కన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంటుంది. ఈ సమస్య నుంచి సంజయ్ ఎలా బయటపడ్డాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది.సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’ మే 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయని, రిలీజ్ డేట్పై కూడా స్పష్టత వస్తుందని ఊహించవచ్చు. ఇంకా... ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి సైతం సూర్యను కలిసి, కథ వినిపించారని తెలిసింది.ఒకేసారి రెండు సినిమాలుఅల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఫాహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఈ చిత్రాలు ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’. ఈ రెండు చిత్రాలు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి తనయుడు) నిర్మిస్తున్నవే. ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. భావోద్వేగాలతో ముడిపడిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది.ఈసారి హీరోగా..! తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఉప్పెన, సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. కొంత కాలంగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ కొండ్రల్ల ఈ సినిమాను నిర్మించారు. త్వరలోను రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్తమిళంలో సూపర్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేసిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, సూపర్ హిట్గా నిలిచాయి. ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో తమిళ సినిమా ఇది. అయితే ఈసారి ఇదే నిర్మాణ సంస్థలో ప్రదీప్ హీరోగా ఓ తెలుగు సినిమా రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. చంద్రశేఖర్ ఏలేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేశారని, ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పుడు చాలా సినిమాలు ఒక భాషలో తెరకెక్కి, ఇతర భాషల్లో అనువాదం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ద్విభాషా చిత్రాలుగా కూడా ఉంటున్నాయి. ఈ రకంగా పరభాషా హీరోలు టాలీవుడ్లో సినిమాలు చేసినప్పుడు, ఈ చిత్రాలు ఆ హీరోల మాతృభాషలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా హీరోలకు రెండు విధాలా కలిసొస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరూ ఒక సినిమాను పూర్తి చేసేందుకు దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. సినిమా భారీతనాన్ని బట్టి ఎక్కువ సమయం పడుతోందని ఊహించవచ్చు. పైగా ఒక సినిమా సెట్స్లో ఉండగా ఇంకో సినిమా చేసే వీలు కొందరు హీరోలకు ఉండటంలేదు. పరభాషల హీరోలతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అసోసియేట్ కావడానికి ఇదొక కారణం అనే ఊహాగానాలు ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు
కోలీవుడ్ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గతనెల తండ్రిగా ప్రమోషన్ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు. తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా కెరీర్.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) -
ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఓటీటీకి మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. Presenting the JioHotstar official trailer of Sambhavam Adhyayam Onnu starring Askar Ali, Vineeth Kumar and Sidharth Bharathan. Streaming exclusively on JioHotstar from April 15.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/BFtGtdlRGb— JioHotstar Tamil (@JioHotstartam) April 11, 2026 -
వాళా-2 సూపర్ హిట్.. పార్ట్-3 అధికారిక ప్రకటన
ఇటీవల విడుదలైన మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు. హిట్ మూవీకి సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. #Vaazha3 - Biopic of a Billion Girls.The #Vaazha franchise continues its journey of introducing fresh talent and new voices to cinema. Production begins next year. pic.twitter.com/YcHanDL3Q6— Shine Screens (@Shine_Screens) April 14, 2026 -
టాక్సిక్ మరోసారి వాయిదా.. మేకర్స్ ఏమన్నారంటే?
కన్నడ హీరో యశ్.. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్గా ఉండడంతో మేకర్స్పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్లో మరో ఆందోళన కలిగిస్తోంది.తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. -
నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర
దగ్గరవాళ్లు చనిపోతే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపు పుట్టిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. సింగర్ చిత్ర కూడా అలాంటి వేదనని గత 15 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది తన కూతురు ఇక లేదనే విషయాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా కుమార్తెని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?)'నువ్వు మాతో పాటు లేవనే నిజం నన్ను బాధపెడుతూనే ఉంది. కానీ మళ్లీ మనం కలుసుకునేంత వరకు నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావ్' అని కుమార్తె నందన ఫొటోని చిత్ర.. బాధతో పోస్ట్ చేశారు.కేరళకు చెందిన చిత్ర.. భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. విజయ్ శంకర్తో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత ఈమెకు 2002లో కూతురు పుట్టింది. ఆమెకు నందన అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి కన్నుకుట్టిందో ఏమో గానీ పాపకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అంటే 2011లో దుబాయిలో జరిగిన ఓ ప్రమాదంలో ఈత కొలనులో పడి నందన చనిపోయింది. అప్పటినుంచి వేదన అనుభవిస్తున్నప్పటికీ.. మరోవైపు గాయనిగానూ చిత్ర కొనసాగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ పెట్టి కూతురిని చిత్ర మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.(ఇదీ చదవండి: మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్) View this post on Instagram A post shared by K S Chithra (@kschithra) -
ది గోట్ లైఫ్ను దాటేేసిన చిన్న సినిమా.. ఏకంగా టాప్-6లో..!
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది. 2024లో వచ్చిన ది గోట్ లైఫ్ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.యూత్ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. కేరళ బయట సైతం ఈ మూవీకి క్రేజ్ వస్తోంది. పాఠశాల జీవితం, ఫ్రెండ్స్ కాన్సెప్ట్తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చూస్తే వసూళ్లపరంగా రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో రూ. 73.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇండియాలో రూ. 77.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.హిట్ మూవీకి సీక్వెల్.. 2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. -
రూ.50 లక్షల సాయం.. ఆ హీరో వల్లే నా కొడుకు ఇలా
ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)#Sivakarthikeyan helped with my son’s education in Netherlands.We didn’t get any loan as I only had my house 🏡. He gave me ₹50 lakhs as collateral in bank. Today, my son is earning ₹4–5 lakhsall because of him.- Actor #Premkumar pic.twitter.com/47KW1hGdwE— Movies Singapore (@MoviesSingapore) April 13, 2026 -
'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో
తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇక్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?(ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు) -
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)#KayaduLohar Recent- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026 -
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళ సినిమా: సినీనటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు వచి్చన ఫోన్ కాల్ అలజడి రేపింది. పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి ఎలాంటి అనుమానిత వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆగంతకుడి నుంచి వచి్చన ఫోన్ కాల్ బెదిరింపేనా.. కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్టు శనివారం ఉదయం చెన్నై కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్బూత్కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో తేనాంపేట పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోయెస్ గార్డెన్లోని నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు చేశారు. వారి ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో అనుమానించదగ్గ వస్తువులు ఏమీ లభించలేదు. బెదిరింపు కాల్ చేసిన అగంతుకుడి గురించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో ఒకేసారి బాంబు బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
సబ్స్క్రిప్షన్ తీసుకుంటే బూతు కంటెంట్.. క్లారిటీ ఇచ్చిన నటి
ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా అకౌంట్లో సబ్స్క్రిప్షన్ మోడల్ను రెండేళ్ల క్రితమే ప్రారంభించాను. దాని ద్వారా మీ అందరితో కనెక్ట్ అయ్యాను. సబ్స్క్రిప్షన్ వల్ల నా రీల్స్, ఫోటోలు మీకు ముందుగానే వస్తాయి. ఏదో ఊహించొద్దుఅలాగే మీరు నాతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవొచ్చు. అంతే తప్ప సబ్స్క్రిప్షన్ అంటే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని కాదు. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఏదో ఊహించి రాకండి. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని మీకు క్లియర్గా చెప్తున్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మంచి పని చేశావని మెచ్చుకుంటున్నారు. సినిమాకొందరు నెటిజన్లు మాత్రం.. నీ రీల్స్, ఫోటోలు ముందుగా చూడటానికి సబ్స్క్రిప్షన్ దేనికో? అని సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి అన్నా రాజన్.. 2017లో 'అంగమలి డైరీస్' మూవీలో మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రంలో పృథ్వీరాజ్ భార్యగా నటించింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈ నటి ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తోంది. తమిళంలో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం! View this post on Instagram A post shared by Anna raajan (@annaspeeks) చదవండి: మైండ్ బ్లాక్ అయ్యే సిరీస్.. ఓటీటీలో ఎప్పుడంటే? -
ఆ బాధ నాకే ఎక్కువ తెలుసు..: విజయ్ దేవరకొండ
ఒక సినిమా రూపుదిద్దుకోవడం వెనక వందలాది మంది కష్టం దాగి ఉంటుంది. ఆ మూవీ రిలీజై ఆదరణ పొందినప్పుడు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కినట్లు లెక్క! కానీ రిలీజ్కు ముందే పైరసీ బారిన పడితే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీ అతిపెద్ద భూతంగా మారింది. తాజాగా విజయ్ చివరి మూవీ జననాయగణ్ సినిమాకు లీకుల బెడద తప్పలేదు.జననాయగణ్ లీక్థియేటర్లలో విడుదలవడానికి ముందే ఈ చిత్రంలో అనేక సన్నివేశాలను ఆన్లైన్లో లీక్ చేశారు. దీనిపై చిత్రనిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఆ పైరసీ వీడియోలు చూసినా, షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు జన నాయగణ్కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.ఆ బాధ అనుభవించా..తాజాగా హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'జననాయగణ్ సినిమా లీక్ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. కెరీర్ తొలినాళ్లలోనే ఆ బాధను, నష్టాన్ని చవిచూశాను. మనల్ని టార్గెట్ చేయడంతో మన ఆశలన్నీ అడియాసలైపోతాయి. నేను కేవలం నా గురించి మాత్రమే చెప్పడం లేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినిమాలో భాగమైన ఎంతోమందికి ఇదే వర్తిస్తుంది.ఎంత దిగజారుతున్నారు?ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అలాగే దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అది గనక చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. అవతలివారికి హాని చేయడానికి మనుషులు ఎంత దిగజారుతున్నారు? అనేదానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జననాయగణ్ మూవీ టీమ్కు నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది' అని ట్వీట్ చేశాడు.టాక్సీవాలాకాగా విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లీక్ అయింది. అది చూసి విజయ్ మానసిక క్షోభ అనుభవించాడు. తన పనైపోయిందని గదిలో కూర్చుని ఏడ్చాడు. ఏదైతే అదైందని, సినిమా రిలీజ్ చేద్దామని పట్టుబట్టాడు. అలా పైరసీ జరిగిన సినిమాను థియేటర్లలో విడుదల చేసి మరీ హిట్టు కొట్టాడు. The #JanaNayagan leak makes me angry.I’ve experienced personally the pain and sense of loss when something like this happens, early in my career. You feel like a target, you feel a loss of hope, it’s not just about me, there are co-actors, directors, producers, and so many who…— Vijay Deverakonda (@TheDeverakonda) April 11, 2026 చదవండి: డెకాయిట్కు ఊహించని కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే?


