breaking news
South India
-
హీరోయిన్తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్
అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలోనే విశాల్ (Vishal) పెళ్లిపీటలెక్కేవాడు, కానీ దానికి మరికొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. హీరో విశాల్.. హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhanshika)ను ఇదివరకే ప్రేయసిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే! ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ ఓ ఈవెంట్లో బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది.అదెప్పుడు పూర్తయితే అప్పుడే!దీనిపై విశాల్ స్పందిస్తూ.. మా పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. నడిగర్ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశాను. ఇంకో రెండు నెలలు ఆగలేనా? నడిగర్ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ఆరోజు రెండు ప్రకటనలుఅయితే విశాల్ పుట్టినరోజయిన ఆగస్టు 29న రెండు గుడ్న్యూస్లు చెప్పనున్నాడట! ఒకటి నడిగర్ సంఘం భవంతి ప్రారంభోత్సవం గురించి, రెండోది తమ కొత్త పెళ్లి డేట్ గురించి! దీంతో ఆ రోజు కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం) భవన నిర్మాణం చాలామంది కల. ఈ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టారు. ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. సినిమాదీన్ని ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు విశాల్. మొత్తానికి ఈ కల అతి త్వరలోనే పూర్తి కానుంది. సినిమాల విషయానికి వస్తే.. విశాల్ చివరగా మదగజరాజ మూవీతో అలరించాడు. ప్రస్తుతం తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా విశాల్కు గతంలో నటి అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లిపీటలెక్కడానికి ముందే ఎవరి దారి వారు చూసుకున్నారు.చదవండి: సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత -
సగం పారితోషికమే తీసుకున్న హీరో.. రుణపడి ఉంటానన్న నిర్మాత
చెన్నై: నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లాక్మెయిల్. తేజు అశ్విని, బిందు మాధవి కథానాయికలుగా నటించారు. మిస్సెస్ జేడీఎస్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై అమల్ రాజ్ నిర్మించిన మొదటి చిత్రం ఇది. ఎం.మారం కథా, దర్శకత్వం వహించగా శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. చివర్లో..ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్, వసంత బాలన్, అధిక్ రవిచంద్రన్, నిర్మాత కదిరేసన్, ధనుంజయన్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అమల్ రాజ్.. జీవీ ప్రకాశ్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చివర్లో 8 రోజుల షూటింగ్ను పూర్తి చేయలేని సమయంలో జీవీ ప్రకాష్ తనకు అండగా నిలబడ్డారన్నారు. రుణపడి ఉంటాఏమీ ఆశించకుండా సగం పారితోషికం మాత్రమే తీసుకొన్నారని పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేయడంతో పాటు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసే వరకు హీరోనే కారకుడయ్యారన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నటుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. మారం ప్రతిభావంతుడైన దర్శకుడని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్న అమల్ రాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. నటి తేజుతో ఇంతకుముందు ఒక వీడియో సాంగ్ కోసం నటించానని అది బాగా వైరల్ అయిందని, ఆ విధంగా ఆమె ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యారని జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొన్నారు.చదవండి: పారితోషికం భారీగా పెంచేసిన జాన్వీ.. ‘పెద్ది’కి ఎంతంటే.. -
‘మిస్టర్ కార్తీక్’ మళ్లీ వస్తున్నాడు
ధనుష్ హీరోగా రిచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం ‘మయక్కమ్ ఎన్న’ (2016). శ్రీ రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ లవ్స్టోరీకి మంచి ఆదరణ దక్కింది. జీవీ ప్రకాశ్కుమార్ అందించిన పాటలకూ మంచి స్పందన లభించడంతో మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలిచింది. ధనుష్ పుట్టినరోజు (జూలై 28) సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల 27న ‘మిస్టర్ కార్తీక్’ టైటిల్తో రీ రిలీజ్ చేస్తున్నారు.ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో హీరో–హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల తమిళంలో మళ్లీ విడుదల చేయగా, మంచి విజయం దక్కింది. తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని కాడబోయిన బాబురావు పేర్కొన్నారు. -
ఫన్నీగా మోహన్ లాల్ 'హృదయపూర్వం' టీజర్
ఈ ఏడాది ఇప్పటికే ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ సినిమాలతో వచ్చిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు మరో చిత్రాన్ని రెడీ చేశాడు. 'హృదయపూర్వం' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ఓనం పండగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)యాక్షన్, థ్రిల్లర్ అంటూ గత రెండు చిత్రాలతో వచ్చిన మోహన్ లాల్ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్తో నవ్వించబోతున్నాడు. టీజర్తో ఆ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మోహన్లాల్కి జోడీగా మాళవిక మోహనన్ నటించింది. అలానే 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్ర పోషించాడు. సత్యన్ అంతికాడ్ దర్శకుడు. టీజర్ చూస్తుంటే మోహన్లాల్కి మరో హిట్ గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు) -
హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!
నీకై నేను, నాకై నువ్వు ఉంటే చాలు కదా... అని పాటలు పాడుకునేవారు హన్సిక (Hansika Motwani)-సోహైల్ (Sohael Khaturiya). ఈ జోడీకి ఎవరి దిష్టి తగలకూడదు అనేలా ఒకరినొకరు అపురూపంగా చూసుకునేవారు. అలాంటిది.. వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం మొదలైంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హన్సిక, సోహైల్ రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారట! హన్సిక తన తల్లితో.. సోహైల్ అతడి పేరెంట్స్తో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. విడివిడిగా..అయితే విడాకుల రూమర్స్ గురించి సోహైల్ స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. కానీ, వేర్వేరుగా జీవిస్తున్నారన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా హన్సిక- సోహైల్ 2022లో పెళ్లి చేసుకున్నారు. ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుందీ హీరోయిన్. గతేడాది డిసెంబర్లో కూడా సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది హన్సిక. దీన్ని బట్టి చూస్తే వీరు కలిసే ఉన్నారని తెలుస్తోంది. మరి తర్వాతేమైనా జరిగిందా? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.సోహైల్కు రెండో పెళ్లిఇదిలా ఉంటే సోహైల్.. గతంలో హన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్తో కనెక్ట్ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. అందులో హన్సిక.. సోహైల్ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది.చదవండి: గర్భంతో ఉన్నా యాక్షన్ సీన్స్.. మొదటిసారే మిస్క్యారేజ్ -
ఓటీటీలో కోర్ట్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చట్టం, పోలీస్ వ్యవస్థ ఈ రెండూ శక్తివంతమైనవే. అయితే ఒక్కోసారి ఈ రెండూ డబ్బుకు అమ్ముడుపోతుంటాయి. అలాంటప్పడు సామాన్యుడికి న్యాయం లభించడమనేది గగనంగా మారుతుంది. అయితే న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడే న్యాయవాదులు ఉంటారు. న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఓడిపోయినా.. డబ్బు ఎక్కువై విర్రవీగేవారితో, అవినీతిపరులైన డిపాంర్ట్మెంట్ అధికారులతో అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. చట్టముమ్ నీతియుమ్అందులో అవమానాలు, అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. అలాంటి ఒక న్యాయవాది ఇతి వృత్తంతో రూపొందిన తమిళ వెబ్ సిరీస్ చట్టముమ్ నీతియుమ్ (Sattamum Needhiyum). నటుడు పరుత్తివీరన్ శరవణన్ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి నమ్రిత, అరుళ్ డీ.శంకర్, షణ్ముగం, తిరుసెల్వమ్, విజయశ్రీ, ఇనియరామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బాలాజీ సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు. 18 క్రియేటర్స్ పతాకంపై శశికళ ప్రభాకరన్ నిర్మించారు. న్యాయాన్ని గెలిపించలేక..డబ్బుకు లోకం దాసోహం అవుతున్న తరుణంలో సామాన్యులకు న్యాయం అనేది అందని ద్రాక్షలాగే మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అమాయకుడికి న్యాయస్థానంలో న్యాయాన్ని అందించలేకపోయిన ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది అదే కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కాలం గడుపుకుంటాడు. దీంతో ఆయనకు ఇంటా బయట కనీస మర్యాద కూడా లేని పరిస్థితి. ఏ ఓటీటీలో అంటే?అలాంటి వ్యక్తి ఆవేశంతో, సమాజంపై కోపంతో.. తన కళ్ల ముందు జరిగిన దుర్ఘటనపై ప్రజావ్యాజ్యం వేస్తాడు. అప్పుడూ పరిహాసానికి గురవుతాడు. అతడు న్యాయం కోసం చేసే నిరంతర పోరాటమే చట్టముమ్ నీతియుమ్. పలు ఆసక్తికరమైన అంశాలతో సహజత్వానికి దగ్గరగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్లో పరుత్తివీరన్ శరవణన్ న్యాయవాదిగా ప్రధానపాత్ర పోషించారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (జూలై 18) నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: హీరోయిన్ ఫామ్హౌస్లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం! -
గుడి ముందు భిక్షాటన చేసిన ప్రముఖ నటి నళిని
సీనియర్ నటి నళిని (Actress Nalini) వార్తల్లో నిలిచింది. మొదట్లో హీరోయిన్గా అలరించి, ఆ తర్వాత విలన్గా గడగడలాడిస్తూనే, కామెడీతో నవ్వించిన ఆమె చెన్నైలో భిక్షాటన చేసింది. తిరువేర్కడులో దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట శుక్రవారం కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేసింది. ఆమె చేసిన పనిని చూసి చాలామంది భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.కలలో కనిపించి..ఈ విషయం గురించి నళిని మాట్లాడుతూ.. అమ్మవారు కలలో కనిపించి తనకోసం ఏం చేస్తావని అడిగిందని చెప్పింది. తనకోసం ఏం చేయాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నానంది. వచ్చిన కానుకలను, డబ్బును ఆ తల్లికే కానుకగా సమర్పించాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి.నళిని కెరీర్రజనీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ రణువ వీరన్ (1981) సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభమైంది. తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తర్వాత సహాయనటిగా, విలన్గా, కమెడియన్గానూ యాక్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇంటిగుట్టు, వీడే, సీతయ్య, పున్నమినాగు, నువ్వెకుండటే నేనక్కడుంటా, ఒక్క అమ్మాయి తప్ప వంటి చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం సీరియల్స్ చేస్తోంది. వ్యక్తిగత విషయానికి వస్తే.. నళిని 1988లో నటుడు రామరాజన్ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని కవలలు సంతానం. పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ అతడిని ప్రేమగా ఆరాధిస్తూనే ఉంటుంది నళిని.చదవండి: కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్? -
కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్?
ఓ పెద్ద హీరో సినిమా ఫ్లాప్ని మరో పెద్ద హీరో మందుపార్టీతో సెలబ్రేట్ చేసుకున్నాడు అంటూ ఆ మధ్య టాలీవుడ్ కేంద్రంగా ఒక వార్త గుప్పుమంది. అంతేకాదు తెలుగు హీరోల్లో సఖ్యత మేడిపండు చందమేననేది అనేక సార్లు బహిరంగంగానే రుజువైంది. తెలుగు సినిమా వజ్రోత్సవాలు మాత్రమే కాదు మరికొన్ని బహిరంగ కార్యక్రమాలు ప్రకటనలు కూడా టాలీవుడ్ హీరోలు ముఖ్యంగా సీనియర్స్ మధ్య స్నేహం ప్రొఫెషనల్ జెలసీలను దాటలేకపోయిందనేది వెల్లడించాయి. ఈ నేపధ్యంలో తాజాగా దక్షిణాదిన అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ల స్నేహ బంధంలోని గాఢత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో మిత్రుడు రజనీని ఇటీవలే కమల్ కలవడం శుభాకాంక్షలు స్వీకరించడం మనకు తెలిసిందే. ఇదే సమయంలో కమల్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కాపాడే బాధ్యతను రజనీ భుజాలకెత్తుకున్నాడనే మరో వార్త కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని చాటుతోంది.భారతీయుడు 3ని రక్షించడమే రజనీ తలకెత్తుకున్న ఆ బాధ్యత. తొలి భారతీయుడు’ ఓ బ్లాక్ బస్టర్ కాగా, ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘భారతీయుడు 2’(Bharateeyudu 3) రిలీజ్ టైంలోనే ‘భారతీయుడు 3’ షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయిపోయింది అని నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు అసలు కథ మొత్తం ‘3వ భాగం’ లోనే ఉంటుందని దర్శకుడు శంకర్ చెప్పడం కూబి జరిగింది. సాధారణంగా పార్ట్ 2 ప్లాప్ అయితే పార్ట్ 3 ని దక్షిణాదిలో దర్శక నిర్మాతలు అటకెక్కించేస్తారు. హాలీవుడ్, బాలీవుడ్లో మాత్రం హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సీక్వెల్స్ కొనసాగిస్తారు. కానీ సౌత్ లో ఇప్పటి వరకు .ఒక్క భారతీయుడు మాత్రమే ఆ ఘనతను స్వంతం చేసుకోనుంది. కాకపోతే ఇప్పుడు భారతీయుడు 3 చుట్టూ రకరకాల సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా ‘2వ భాగం’ ప్లాప్ అయ్యింది కాబట్టి.. ‘3వ భాగం’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అంతేకాక గేమ్ ఛేంజర్ తర్వాత దర్శకుడు శంకర్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ నేపధ్యంలో భారతీయుడు 3’ కంప్లీట్ అవ్వాలంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా’ ముందుకు వచ్చి ధైర్యం చేసి మరి కొంత బడ్జెట్ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాక మరోపక్క ‘లైకా’ సంస్థ నిర్వాహకులకూ హీరో కమల్ హాసన్ కి కూడా మనస్పర్థలు ఉన్నాయని సమాచారం. కాబట్టి.. ఇది అంత సులభంగా తెగే వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో రజినీకాంత్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కమల్, మరోవైపు లైకా వారితో రజినీకాంత్ కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్ ఇద్దరితో మాట్లాడి.. ‘భారతీయుడు 3 మిగిలిన భాగం పూర్తయేలా చొరవ తీసుకోనున్నట్టు సమాచారం. అదే జరిగితే దర్శకుడు శంకర్ కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఏదేమైనా... తన సమకాలీకుడైన పోటీ హీరో చిత్రం సమస్యల్లో ఇరుక్కుంటే సంతోషించడం కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగడం రజనీకాంత్ గొప్పతనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ తరహా అసూయా ద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని అలవరచుకోవడమే తెరబయట కూడా చూపే నిజమైన హీరోయిజం అనేది నిర్వివాదం. -
రేయ్.. ఒక్కసారి కలువురా.. రష్మికను తల్చుకుని ప్రేరణ ఎమోషనల్
బుల్లితెర నటి, బిగ్బాస్ బ్యూటీ ప్రేరణ కంభం (Prana Kambam).. టీవీ షోలలోనే ఎక్కువగా కనిపిస్తోంది. భర్త శ్రీపాదతో కలిసి ఆ మధ్య ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ కప్పు కొట్టేసింది. ప్రస్తుతం కన్నడలో క్వాల్టీ కిచెన్ అనే కామెడీ షోలో పాల్గొంటోంది. హీరోయిన్ రష్మిక మందన్నా ఈమెకు క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే! తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది ప్రేరణ. బద్ధకం ఎక్కువేప్రేరణ మాట్లాడుతూ.. నాకు బద్ధకం ఎక్కువ. ఒక్కోసారి స్నానం చేయడానికి కూడా బద్ధకమనిపిస్తుంది. నా భర్త శ్రీపాద్తో నేను సంతోషంగా ఉన్నాను. అయితే మా లవ్స్టోరీలో ఏ గొడవలు లేవని చెప్పను. మేము కూడా బ్రేకప్ చెప్పుకున్నాం. నటిగా నా మొదటి ప్రాజెక్టులో హీరో చెంపపై ముద్దుపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బందిపడ్డాను. ఇకపోతే శ్రీపాద్తో గొడవలైనప్పుడు ఇదంతా నేను తట్టుకోలేను అని బ్రేకప్ చెప్పాను. కానీ తర్వాత వెంటనే కలిసిపోయేవాళ్లం.రష్మికతో మల్టీస్టారర్రష్మిక మందన్నా నాకు క్లోజ్ ఫ్రెండ్. 'నేను తెలుగులో స్టార్ అవుతా.. రష్మిక కన్నడలో స్టార్ అవుతుంది.. ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ మూవీ చేయాలి' అని రష్మిక కుటుంబసభ్యులు నాతో అనేవారు. నేను కూడా చాలా అనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. ఒకప్పుడైతే తనకు నేను గుర్తున్నాను, మరి ఇప్పుడు గుర్తున్నానో, లేదో నాకు తెలియదు. (రష్మికను ఉద్దేశిస్తూ) రేయ్, ఒకసారి నన్ను కలవరా.. అని ప్రేరణ ఎమోషనల్గా మాట్లాడింది. ఇది చూసిన అభిమానులు.. ప్రేరణ, రష్మిక కలిస్తే చూడాలనుందని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఛావాను దాటేసిన చిన్న మూవీ.. ఏకంగా 1200 % లాభాలు! -
దక్షిణాది సినీ అవార్డుల సంబురం.. తేదీ, వేదిక ఫిక్స్!
దక్షిణాదిలో ప్రతిష్టాత్మక సినీ పండుగ తేదీలు ఖరారు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో అందించే ప్రముఖ సైమా అవార్డుల వేడుక జరిగే వేదికను కూడా నిర్ణయించారు. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ అవార్డుల వేడుకను దుబాయ్లోనే నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు నిర్వాహకలు వెల్లడించారు.దక్షిణాది సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందజేయనున్నారు. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరిట 12 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన నామినేషన్స్ జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. గత రెండేళ్లుగా ఈ వేడుకను దుబాయ్లోనే నిర్వహిస్తున్నారు. ఈసారి అక్కడే సినీ అవార్డుల వేడుక సైమా జరగనుంది.The biggest celebration of South Indian Cinema is back!Dubai 5th & 6th SeptemberGet ready for SIIMA's 13th edition, where stars shine the brightest!@BrindaPrasad1 @vishinduri#SIIMA2025 #NEXASIIMA #SouthIndianCinema #dubai pic.twitter.com/AC2iihRNib— SIIMA (@siima) July 18, 2025 -
ఛావాను దాటేసిన చిన్న మూవీ.. ఏకంగా 1200% లాభాలు!
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. కంటెంట్ నచ్చితేనే థియేటర్కు వస్తామని ప్రేక్షకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కథ బాలేదంటే భారీ బడ్జెట్ మూవీ అయినా సరే మాకు అక్కర్లేదంటూ ముఖం చాటేస్తున్నారు. అలా కంగువా, థగ్ లైఫ్, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. ఇలా ఎన్నో సినిమాలు బోల్తా కొట్టాయి.1200% లాభాలుఅయితే ఓ చిన్న చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా 1200% లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మూవీయే టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family Movie). ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక లాభాలు గడించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.7 కోట్లతో నిర్మించిన ఈ తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఐదు వారాల్లోనే..టూరిస్ట్ ఫ్యామిలీ మూవీలో శశికుమార్, సిమ్రాన్, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 29న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మొదటివారం కేవలం రూ.23 కోట్లు మాత్రమే రాగా.. మౌత్ టాక్ వల్ల రెండో వారం రూ.29 కోట్లు వచ్చాయి. ఐదు వారాలు తిరిగేసరికి ఏకంగా రూ.90 కోట్లు వసూలు చేసింది.ఛావాను వెనక్కు నెట్టిఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో విక్కీ కౌశల్ 'ఛావా' ముందు వరుసలో ఉంది. రూ.90 కోట్లతో రూపొందిన ఈ మూవీ 800 % లాభాలతో రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే పర్సంటేజీ లెక్కన చూస్తే.. టూరిస్ట్ ఫ్యామిలీ ఛావాను వెనక్కు నెట్టి 1200% లాభాలను గడించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ప్రస్తుతం హాట్స్టార్లో అందుబాటులో ఉండగా.. ఛావా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతోంది.చదవండి: పుట్టెడు దుఃఖం, డిప్రెషన్.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్ -
పబ్లిక్ రివ్యూలను అనుమతించొద్దు: విశాల్ విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం రెడ్ ఫ్లవర్. నటుడు విగ్నేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషా జాహ్నవి నాయకిగా నటించారు. వైజీ.మహేంద్రన్, జాన్విజయ్, తలైవాసల్ విజయ్, అజయ్రత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆండ్రూపాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కె.దేవసూర్య చాయాగ్రహణం, సంతోష్రామ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 8న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఇందులో విశాల్, పి.వాసు, స్వరాజ్, ఫైవ్ స్టార్ కదిరేశన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత మాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రేమ కథ చిత్రం మాత్రమే కాదని మన దేశ ఉన్నతిని చాటే చిత్రంగా ఉంటుందని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ 2025లో జరిగే కథలను చిత్రాలుగా తీయడానికే పలువురు దర్శకులు తడబడుతున్నారని అలాంటిది ఈచిత్ర దర్శకుడు ఆండ్రు 2047లో ఏం జరగనుంది అనే విషయాన్ని తెరపై ఆవిష్కరించారని అన్నారు. నేతాజీకి ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యానికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, థియేటర్లో చిత్రాలు విడుదలైన మూడు రోజుల వరకు పబ్లిక్ రివ్యూలను అనుమతించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మాతల సంఘం చిత్రాల రిలీజ్ను కట్టడి చేయాలని తెలిపారు. -
'కూలీ'ని రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ఎందుకంటే?
కూలీ సినిమా (Coolie Movie)కు బాగా హైప్ తెచ్చిన సాంగ్ మోనికా. పూజా హెగ్డే (Pooja Hegde) వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అవుతోంది. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అని అందరూ ఆశ్చర్యపోయేలా డ్యాన్స్ చేసింది. అయితే శివరాత్రిరోజే ఈ సాంగ్ షూటింగ్ జరిగిందట! అందులోనూ ఆరోజు పూజాకు ఉపవాసం. అయినా సరే ఖాళీ కడుపుతోనే సెట్లోకి అడుగుపెట్టి ఫుల్ జోష్తో డ్యాన్స్ చేసింది. తన కష్టానికి ప్రతిఫలంగా మోనికా సాంగ్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.ఫస్ట్ ఆయన్నే అనుకున్నా..అయితే ఈ సాంగ్లో పూజాతోనే పోటీపడుతూ స్టెప్పులేశాడు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. తొలిసారి ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడంతో సౌబిన్లో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ నోరెళ్లబెట్టారు. నిజానికి సౌబిన్ స్థానంలో పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఉండాల్సిందట! ఈ విషయాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా వెల్లడించాడు. ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్.. ఫహద్ను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర రాసినట్లు తెలిపాడు. బిజీగా ఉండటంతో..తీరా ఫహద్ను సంప్రదించగా.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నాడు. అందువల్లే సౌబిన్ను ఎంపిక చేశామని వెల్లడించాడు. లోకేశ్ డైరెక్ట్ చేసిన కూలీ మూవీలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించాడు. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత -
ప్రముఖ దర్శకనటుడు కన్నుమూత
తమిళ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ (68) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆదివారం నాడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. నటుడి మృతిపై పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వేలు ప్రభాకరన్.. 1980లో వచ్చిన `ఇవర్గళ్ విత్యసామానవర్గళ్` చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్గా పరిచయమయ్యారు. `నాలయ మనిదన్` మూవీతో దర్శకుడిగా మారారు.దర్శకుడిగా, నటుడిగా..ఈ చిత్రం సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్గా `అతిశయ మనిదన్` మూవీ తెరకెక్కించారు. తన సినిమాల్లో సున్నితమైన విషయాలను నిస్సందేహంగా చర్చించేవారు. అలా అసురన్, రాజాలి, కడవుళ్, పురాచ్చిక్కారన్, కాదల్ కాదై, ఒరు ఇయక్కునరిన్ కాదల్ డైరీ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. వేలు ప్రభాకరన్ (Velu Prabhakaran) దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించారు. పదినారు, గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, కడవర్, పిజ్జా 3, రైడ్, వెపన్ చిత్రాల్లో నటించారు. చివరగా ఈ ఏడాది రిలీజైన గజన మూవీలో కనిపించారు. వేలు గతంలో దర్శకనటి పి.జయాదేవిని పెళ్లి చేసుకున్నారు. కాదల్ కాదై సినిమాలో తనతో కలిసి నటించిన షిర్లే దాస్ను 2017లో రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ -
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు థియేటర్ల సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారంలో శ్రీలీల- కిరీటి జంటగా నటించిన జూనియర్పై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు రానా సమర్పణలో వస్తోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.ఇక ఓటీటీల విషయానికొస్తే ధనుశ్- నాగార్జున నటించిన కుబేర డిజిటల్ ఫ్లాట్ఫామ్లో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన భైరవం సైతం ఓటీటీలో అలరించనుంది. బాలీవుడ్ నుంచి స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ద భూత్ని చిత్రం ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ శుక్రవారమే స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుందా? అయితే ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.అమెజాన్ ప్రైమ్కుబేర (తెలుగు మూవీ) - జూలై 18నెట్ఫ్లిక్స్వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18వాల్ టూ వాల్ - (కొరియన్ సినిమా)- జూలై 18డెరిలియమ్ - (వెబ్ సిరీస్)- జూలై 18ఆల్మోస్ట్ ఫ్యామిలీ(బ్రెజిలియన్ కామెడీ చిత్రం)- జూలై 18డిలైట్ఫుల్లీ డిసీట్ఫుల్(హాలీవుడ్ మూవీ)- జూలై 18జియో హాట్స్టార్స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 18స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18జీ5భైరవం (తెలుగు సినిమా) - జూలై 18ద భూత్ని (హిందీ మూవీ) - జూలై 18సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) - జూలై 18లయన్స్ గేట్ ప్లేజానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 18రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 18టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) - జూలై 18ఆపిల్ ప్లస్ టీవీసమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 18మనోరమ మ్యాక్స్అస్త్ర(మలయాళ థ్రిల్లర్)- జూలై 18 -
'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవసే ఏస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరోసారి.. డిఫరెంట్ రోల్తో అలరించనున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం సార్ మేడమ్. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈనెల 25 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా సార్ మేడమ్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్యభర్తలుగా నటించారు. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా తెరపై చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్గా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు. -
థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు
భారీ అంచనాల మధ్య వచ్చి బోల్తా కొట్టిన సినిమాలెన్నో.. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ కూడా అదే కోవలోకి వస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు తనను నానామాటలు అన్నారని చెప్తున్నాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ (Ali Fazal).ఎందుకీ సినిమా చేశావ్?తాజాగా అలీ ఫజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie) నేనింతవరకు చూడలేదు. కానీ చాలామంది ఈ మూవీ ఎందుకు చేశావని తిట్టారు. దానికి ఒకే ఒక్క కారణం మణిరత్నం సర్. ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ మూవీలో నటించాను. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దాంతో నా స్నేహితులు, అభిమానులు ఎందుకీ సినిమా చేశావ్? అవసరమా నీకిది? అని కోప్పడ్డారు. వారందరికీ మరేం పర్వాలేదని బదులిచ్చాను.అది ముగిసిన చాప్టర్మణిరత్నం సర్ విజన్ను ప్రశ్నించేంత పెద్దవాడిని కాదు. వారు సినిమా కోసం కష్టపడ్డారు. కానీ షూటింగ్ జరిగేకొద్దీ కథలో చాలా మార్పులు జరిగాయని తెలుస్తోంది. అయినా థగ్ లైఫ్ చాప్టర్ ముగిసిపోయింది. భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్లీ తప్పకుండా మణిరత్నం డైరెక్షన్లో నటిస్తాను అని అలీ ఫజల్ చెప్పుకొచ్చాడు.థగ్ లైఫ్మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం థగ్ లైఫ్. గతంలో వీరి కాంబినేషన్లో నాయకుడు మూవీ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తరహాలోనే థగ్ లైఫ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ మూవీ విజయాన్ని అందుకోలేకపోయింది. జూన్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది.చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో! -
పుష్ప విలన్ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్.. స్పెషల్ ఏంటి?
సినీ తారలు ధరించే దుస్తులు మొదలు..వాళ్లు వాడే వస్తువుల వరకు.. ప్రతిదీ చాలా ఖరీదైనవి ఉంటాయి. ట్రెండ్కు తగ్గట్లుగా వాళ్ల వస్తువులు మారుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు, మొబైల్ ఫోన్ల విషయంలో స్టార్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ మోడల్ని తీసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ 17 ఏళ్ల క్రితం కొన్న ఫోన్నే వాడుతున్నాడు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కీప్యాడ్ ఫోన్నే ఉపయోగిస్తున్నాడు. ఆ స్టార్ ఎవరో కాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ఆయన వాడుతున్న ఫోన్పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇటీవల మలయాళ దర్శకుడు అభినవ్ సుందర్ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో ఫహద్ పాల్గొన్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా ఆ విజువల్స్ని అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరూ ఆయన వాడుతున్న ఫోన్ గురించే చర్చించడం మొదలు పెట్టాడు. స్మార్ట్ ఫోన్ కాదని ఈ ఫోన్ ఎందుకు వాడుతున్నాడా? అని ఆరా తీస్తున్నారు. ఇక ఆ ఫోన్ విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దాని ధర రూ. 5-54 లక్షల వరకు ఉండేదట. ఇది ఒక అల్ట్రా-లగ్జరీ నాన్-స్మార్ట్ఫోన్. 2007లో అనౌన్స్ చేసి.. 2008లో ఆ ఫోన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ ఫోన్ టైటానియంతో తయారు చేశారట. నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్తో పైభాగం కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో మార్కెట్లో లేదు కానీ ప్రీ-ఓన్డ్ వెబ్సైట్లలో రూ.1–1.5 లక్షలకు దొరుకుతుంది. ఈ ఫోన్లో స్మార్ట్ఫోన్ లాంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ దాని బ్రాండ్ విలువ, అరుదైన డిజైన్ కారణంగా ఆ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. ఫహద్ లాంటి స్టార్ నటుడు ఇంత పాత ఫోన్ను ఉపయోగించడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటుంటే..మరికొందరు పాత వస్తువుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.సినిమాల విషయానికొస్తే.. కుంభసారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియం’, ‘మాలిక్’ వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసు అధికారి షేకావత్ పాత్రలో ఫహద్ అద్భుతంగా నటించాడు. ఆయన తాజా చిత్రం మారేసన్ మూవీ జులై 25న విడదల కాబోతుంది. -
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
తాను బతికుండగానే కొడుకు/కూతురు చనిపోవాలని ఏ తల్లీ, తండ్రీ కోరుకోడు. కానీ దురదృష్టం కొద్దీ తనకు అలా కోరుకోక తప్పలేదంటున్నాడు సీనియర్ నటుడు ప్రసాద్ బాబు (Prasad Babu). ఈయన వెండితెరపై హీరో, విలన్, కమెడియన్, సహాయ నటుడు.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించాడు. దర్శకుడిగానూ సినిమాలు తీశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కొడుకును కోల్పోవడం గురించి మాట్లాడాడు.సాహసబాలలు కథకు ప్రేరణ..ప్రసాద్బాబు మాట్లాడుతూ.. నేను సాహస బాలలు సినిమా తీయడానికి నా కుమారుడే కారణం. నా పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. వాడిని మాలాగే ఒక కళాకారుడిని చేయాలని ఆశ ఉండేది. తనకు మాటలు రావు, ఏమీ రావు. ఒకసారేమైందంటే.. స్కూల్లో ఇతర విద్యార్థులతో పాటు నా కొడుకుని ఓ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. తనకు మాటలు రాకపోయినా సరే ఢిల్లీ తీసుకెళ్తున్నారు.. మరి తండ్రిగా ఇక్కడ నేనేం చేస్తున్నాను? అన్న ప్రశ్న మొదలైంది. అప్పటికప్పుడు ఒక కథ అనుకున్నాను. అదే సాహసబాలలు. ఈ చిత్రంలో మురళీ మోహన్, నాగబాబు, సోమయాజులు.. ఇలా చాలామంది యాక్ట్ చేశారు.30 ఏళ్లకే..కసితో ఈ సినిమా చేసి బంగారు నంది గెల్చుకున్నాను. కానీ నా కొడుకు నాకు దూరంగా వెళ్లిపోయాడు. వేసవికాలంలో క్రికెట్ ఆడించాను. మే నెలలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది, దాంతోపాటు గుండెపోటు వచ్చింది. గ్రౌండ్లోనే చనిపోయాడు. అప్పుడు వాడి వయసు 30 ఏళ్లు. నేను బతికుండగానే వీడు చనిపోవాలని మనసులో కోరుకున్న కోరిక ఆరోజు నెరవేరింది. ఎందుకంటే నేను చనిపోయాక వాడిని ఎవరైనా చూస్తారో, లేదోనని భయం ఉండేది. అందుకే.. తన పేరుమీద స్థలం రాసిపెట్టాను. దేవుడికి కృతజ్ఞతలుకానీ, వాడే ముందుగా చనిపోయాడు. నేనుండగానే వాడు పోయినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాను. నేను మేనరికం పెళ్లి చేసుకున్నాను. దానివల్లే నా కొడుకు మానసికంగా ఎదగలేదు. తనకు మానసిక వైకల్యం ఉందని ఫీల్ కాకూడదని ప్రతి సినిమాకు తీసుకెళ్లేవాడిని. ఒకసారి బ్రహ్మంగారి మఠానికి వెళ్లినప్పుడు సిద్ధయ్య సమాధిని పట్టుకుని బోరున ఏడ్చాడు. ఏ జన్మలో ఏ సంబంధం ఉందో, అందుకే ఇలా కన్నీళ్లు పెట్టుకున్నాడనుకున్నాం.. అని ప్రసాద్ బాబు చెప్పుకొచ్చాడు.ప్రసాద్ కెరీర్..ప్రసాద్ బాబు అసలు పేరు కరణం లీల వెంకట శ్రీహరి నాగ వరప్రసాద్. పునాదిరాళ్లు చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. రుద్రవీణ, ఆపద్భాందవుడు, అంతులేని కథ, బొబ్బిలిపులి, మేజర్ చంద్రకాంత్, మురారి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 1500 సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ కూడా చేశాడు.చదవండి: రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ.. -
తిరుమలలో హీరోయిన్ ప్రణీత.. మొదటిసారి అంటూ పోస్ట్!
అత్తారింటికి దారేది మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త, కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ప్రణీత తన ఇన్స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది. Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025 View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
రోడ్డుపై చిత్తు కాగితాలతో నటి.. తనలో తనే మాట్లాడుకుంటూ..
బుల్లితెరపై, వెండితెరపై వెలుగు వెలిగిన నటి సడన్గా రోడ్డుపై ప్రత్యక్షమైంది. తనలో తనే మాట్లాడుకుంటూ, చిత్తు కాగితంపై ఏదో రాస్తూ కనిపించింది. ఆమెను గుర్తుపట్టని జనాలు ఎవరు నువ్వు? అని ఆరా తీయగా తాను నటినని, తన పేరు సుమి హర్ చౌదరి అని వెల్లడించింది. నడిరోడ్డుపై ఒంటరిగా..సుమి హర్ చౌదరి (Sumi Har Chowdhury).. బెంగాలీ నటి. పలు సీరియల్స్తో పాటు సినిమాలు కూడా చేసింది. ద్వితియో పురుష్, కాశీ కథ: ఎ గోట్ సాగా వంటి చిత్రాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉంటున్న ఆమె మంగళవారం నాడు రోడ్లపై తిరుగుతూ కనిపించింది. పశ్చిమ బెంగాల్లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్లోని దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. హైవేపై నడుచుకుంటూ కొంతదూరం వెళ్లిన ఆమె ఒకచోట ఆగి పక్కన కూర్చుని చిత్తుకాగితంపై ఏదో రాసుకుంటూ ఉందట! నమ్మలేకపోయిన జనాలుతనలో తనే సగం బెంగాలీ, సగం ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుకుంటూ ఉండటాన్ని అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. ఎవరు నువ్వు? అని వారు పలకరించగా.. తన పేరు సుమి హర్ చౌదరి అని, తాను నటిని అని చెప్పింది. మొదట నమ్మలేకపోయిన స్థానికులు గూగుల్లో వెతికి చూడగా తను చెప్పింది నిజమేనని గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని నటిని షెల్టర్కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా 10th క్లాస్ అమ్మాయి.. ఆమె ఎవరంటే? -
జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్
సినిమా అంటే ఇష్టం లేదంటుంది. కానీ సినిమా కోసం ఏదైనా చేస్తుంది. సినిమాలు మానేయాలని ఆలోచిస్తుంది. కానీ తను అడుగుపెట్టిన ప్రతి ప్రాజెక్టులో అద్భుతంగా నటిస్తుంది. అలా తరుచిత్రంబళం (తెలుగులో తిరు) సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నిత్యామీనన్ (Nithya Menen). ప్రస్తుతం ఈ బ్యూటీ ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) (Idly Kadai Movie) సినిమా చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య.. పల్లెటూరి యువతిగా కనిపించనుంది. పిడకలు చేశా..ఈ సినిమా షూటింగ్లో ఉండగానే తిరు సినిమాకు వచ్చిన జాతీయ అవార్డును అందుకోవడానికి వెళ్లింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ కడై సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను. పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని అడగ్గానే ఎందుకు చేయను? అని రంగంలోకి దిగాను. నా జీవితంలో తొలిసారి పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు చేశాను. పిడకలు చేసిన మరునాడే జాతీయ అవార్డు తీసుకునేందుకు వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది.ఇంత మంచి అనుభూతి..అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేదే కాదు అని చెప్పుకొచ్చింది. ఇడ్లీ కడై విషయానికి వస్తే తిరుచిత్రంబలం సినిమా తర్వాత ధనుష్- నిత్య కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ ఇది! ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, పార్తీబన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.చదవండి: చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య -
జీవితంలో విజయ్ సేతుపతితో కలిసి పని చేయకూడదనుకున్నా : పాండిరాజ్
వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఒకరు. ఆయన నటన గురించి చర్చ జరుగుతుంది కానీ.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎక్కడా చర్చ జరగదు. ఇండస్ట్రీలో అందరూ ఆయనను అజాత శత్రువు అంటారు. కానీ విజయ్ అంటే గిట్టని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహిత, డైరెక్టర్ పాండిరాజ్(Pandiraj). గతంలో వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఓ సినిమా విషయంలో ఇద్దరు గొడవపడ్డారు. దీంతో జీవితంలో ఇక విజయ్తో సినిమా చేయొద్దని పాండిరాజ్ భావించారట. కానీ స్వయంగా విజయ్ సేతుపతే వచ్చి అడగడంతో సినిమా చేశానని చెప్పారు.పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం తలైవన్ తలైవి. జులై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్లో పాండిరాజ్ మాట్లాడుతూ.. గతంలో విజయ్తో జరిగిన గొడవ గురించి చెప్పారు. ‘విజయ్కి, నాకు గతంలో బేదాభిప్రాయాలు వచ్చిన విషయం నిజమే. జీవితంలో ఆయనతో సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నాను. ఓసారి దర్శకుడు మిష్కిన్ బర్త్డే ఈవెంట్లో మళ్లీ మేమిద్దరం కలిశాం. అప్పుడు విజయే స్వయంగా వచ్చి ‘మనం ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దామా’ అని అడిగాడు. దాంతో అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోయి..కొత్త ప్రయాణానికి బీజం పడింది. మిష్కిన్ బర్త్డే పార్టీ తర్వాత ‘తలైవన్ తలైవి’ స్క్రిప్ట్ సిద్ధం చేశాను. కథ పూర్తయిన తర్వాత విజయ్కి 20 నిమిషాల పాటు స్టోరీ నెరేట్ చేయగానే.. ఆయన ఒప్పుకున్నారు’ అని పాండిరాజ్ చెప్పారు. -
చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య
నటుడు బాలా (Actor Bala) పర్సనల్ విషయాలతో ఎప్పుడూ వివాదాల్లో నానుతూనే ఉంటాడు. చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. తర్వాత నటి అమృతా సురేశ్ను వివాహం చేసుకోగా కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. అయితే డివోర్స్ తర్వాత తనతోపాటు, తన కూతుర్ని కూడా వేధించారని అమృత పోలీసులను ఆశ్రయించడం, వారు బాలను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలోనే డాక్టర్ ఎలిజబెత్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. నాకేదైనా జరిగితే తనదే బాధ్యతఆమెను కూడా వదిలేసి గతేడాది కోకిలను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇలా నాలుగు పెళ్లిళ్లతో బాలా సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ అయ్యాడు. తాజాగా డాక్టర్ ఎలిజబెత్ (Elizabeth Udayan) షేర్ చేసిన వీడియోతో మరోసారి బాలా పేరు తెరపైకి వచ్చింది. అందులో ఆమె ఆస్పత్రి బెడ్పై ఉంది. ఎలిజబెత్ ఏమందంటే.. నాకేదైనా జరిగితే నా మాజీ భర్త, అతడి కుటుంబానిదే పూర్తి బాధ్యత. అతడి గురించి ఏళ్లతరబడి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చనిపోయేలోపు న్యాయం?సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకున్నా, సీఎంను కలిసినా, కోర్టు మెట్లెక్కినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పైగా నన్నే బెదిరిస్తున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. అదే చాలా బాధగా ఉంది. నాకేదైనా జరిగితే అతడి(బాలా)తోపాటు అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొంది. ఈ వీడియోకు 'నేను చనిపోయేలోపు నాకు న్యాయం జరుగుతుందా?' అని క్యాప్షన్ జోడించింది.నీ ఉసురు ఊరికే పోదుఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడదాని కన్నీళ్ల ఉసురు ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. వీలైతే జరిగినదాన్ని మర్చిపో, కౌన్సెలింగ్ తీసుకో.. అతడి చెర నుంచి తప్పించుకోవడమే ఒక వరంలా భావించు, నువ్వు అతడిని చాలా ప్రేమించావు. కానీ, ఈరోజు కాకపోయినా రేపయినా అతడికి తగిన శాస్తి జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.డాక్టర్వి అయ్యుండి ఇలా..మరికొందరేమో.. నువ్వు ఒక డాక్టర్వి.. గతాన్ని మర్చిపోయి నీ వృత్తికి పూర్తి స్థాయి సమయం కేటాయించు, వైద్యురాలివయ్యుండి చనిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించు. అది వీలుకాకపోతే మీ జీవితంలోనే పెద్ద సమస్య అయిన వ్యక్తి మీకు దూరంగా వెళ్లిపోయాడని మీకు మీరు భరోసా ఇచ్చుకోండి అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు తీసుకుంటున్నా -
నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు రెమ్యునరేషన్!
స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే బాక్సాఫీస్ వద్ద యుద్ధం మొదలు కానుంది. ఆగస్టు 14న రజనీకాంత్ 'కూలీ' (Coolie Movie), హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ల 'వార్ 2'చిత్రాలు రిలీజ్ కానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వార్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలని సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ విషయానికి వస్తే ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు రూ.350 కోట్లతో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఆయన పారితోషికం గురించి చెప్పలేనుహీరో రజనీకాంత్ రూ.150 కోట్లు, దర్శకుడు లోకేశ్ రూ.50 కోట్లు రెమ్యునరేషన్ (Lokesh Kanagaraj Salary) తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ.. రజనీకాంత్ సర్ పారితోషికం గురించి నేనేం చెప్పలేను. అయితే మీరు అంటున్నట్లుగా నేను రూ.50 కోట్లు తీసుకుంటున్నాను. నా గత సినిమా లియోకు తీసుకున్నదానికంటే ఇది రెట్టింపు రెమ్యునరేషన్. అందుకే డబుల్ తీసుకుంటున్నా..లియో సినిమా రూ.600 కోట్లకు పైగానే వసూలు చేసింది. కాబట్టి నేను గత సినిమాకంటే డబుల్ పారితోషికం తీసుకుంటున్నాను. ఇది నా రెండేళ్ల జీవితం. అన్నింటినీ త్యాగం చేసి రెండేళ్లుగా కూలీకే అంకితమయ్యాను, అది నా బాధ్యత కూడా అని పేర్కొన్నాడు. కూలీ మూవీ విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సౌంబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందించాడు.చదవండి: ‘బాహుబలి’ రీరిలీజ్: రన్టైమ్పై పుకార్లు.. రానా ఏమన్నారంటే..? -
మూవీ సెట్లో స్టంట్మ్యాన్ మృతి.. డైరెక్టర్పై కేసు నమోదు!
కోలీవుడ్ మూవీ 'వెట్టువం' సెట్లో స్టంట్మ్యాన్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది. మోహన్ రాజ్ మృతి పలువురు సినీతారలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాల్, మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు.అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్టర్ పా రంజిత్తో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్శకుడితో పాటు స్టంట్ నటుడు వినోద్, నీలం ప్రొడక్షన్స్కు చెందిన రాజ్కమల్, కారు యజమాని ప్రభాకరన్పై కేసు నమోదైంది. ఈ సంఘటన సమయంలో సినిమా సెట్లో భద్రతపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా.. స్టంట్మ్యాన్ రాజు సినిమా సెట్లో కారుతో స్టంట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మృతిచెందారు. కాగా.. జూలై 13న ఈ ప్రమాదం జరిగింది. -
లెజెంజరీ నటి సరోజా దేవి చివరి కోరిక అదే.. నెరవేర్చిన కుటుంబ సభ్యులు
వెండితెరపై దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అలనాటి నటి బి. సరోజా దేవి (87) అనారోగ్యంతో మరణించారు. వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని మల్లేశ్వరంలో తన స్వగృహంలో సోమవారం ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో సినీ ప్రపంచం ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఆమె నటించిన సినిమాలు, పాత్రలను గుర్తు చేసుకున్నారు.అయితే ఆమె చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నేరవేర్చారు. ఆమె కోరిక మేరకు కళ్లను దానం చేశారు. ఆమె కోరుకున్న విధంగా నారాయణ నేత్రాలయకు అందజేశారు. గతంలో నారాయణ నేత్రాలయను సందర్శించినప్పుడు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని ఐ బ్యాంక్ అధికారి డాక్టర్ రాజ్కుమార్ తెలిపారు. ఆమె నేత్రదానానికి నమోదు చేసుకుని దాదాపు ఐదేళ్లు పూర్తయిందని వెల్లడించారు.అంత్యక్రియలుసరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.తెలుగులో పాతిక వరకూ...తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. -
సెన్సార్ తేలింది.. టైటిల్ మారింది.. ట్రైలర్ రిలీజ్
తెలుగులో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ 'జానకి వర్సెస్ కేరళ'. లెక్క ప్రకారం జూన్ చివరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ టైటిల్పై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం పెట్టింది. సీతాదేవి మరోపేరు జానకి అని, దీని వల్ల రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ ఉండొచ్చని, అందుకే కచ్చితంగా పేరు మార్చాల్సిందే అని పట్టుబట్టింది. మూవీ టీమ్ తొలుత దీనికి అంగీకారం తెలపలేదు. ఎట్టకేలకు ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)జానకి వర్సెస్ కేరళ అని అనుకున్న టైటిల్ని సెన్సార్ బోర్ట్.. 'జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.ట్రైలర్ బట్టి చూస్తే.. సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఈమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకకి న్యాయం దక్కిందా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. మరి ఈ కోర్ట్ రూమ్ డ్రామా, ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఫహాద్ ఫాజిల్ పేరు చెప్పగానే క్రేజీ సినిమాలు, డిఫరెంట్ పాత్రలు గుర్తొస్తాయి. 'పుష్ప 2' సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇతడు.. ప్రస్తుతం తమిళంలో 'మారీషన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సీనియర్ కమెడియన్ వడివేలు కూడా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. ఇంతకీ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్ని భయపెడుతున్న మెహర్ రమేష్)ఇదో తమిళ సినిమా. దొంగతనాలు చేసిన ఒకడు(ఫహాద్).. డబ్బులతో ఉన్న మతిమరుపు వ్యక్తిని(వడివేలు) చూస్తాడు. అతడి దగ్గర నుంచి ఎలాగైనా సరే డబ్బు కొట్టేయాలని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి తిరువణ్ణామలైకి బైక్పై వెళ్తారు. మరోవైపు మతిమరుపు వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుంటారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తోంది.జూలై 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చూస్తుంటే ఫహాద్ ఫాజిల్ మరో డిఫరెంట్ చిత్రం చేశాడని అర్థమైంది. ప్రస్తుతానికైతే తమిళ వెర్షన్ మాత్రమే బిగ్ స్క్రీన్పైకి రానుంది. తెలుగు డబ్బింగ్ కోసం ఓటీటీలోకి వచ్చేంతవరకు వెయిట్ చేయక తప్పదు. గతంలో ఫహాద్-వడివేలు కలిసి 'మామన్నన్' మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో?(ఇదీ చదవండి: తెలుగు సినిమాలో వేశ్య పాత్రలో కాయదు?) -
సింగిల్ షెడ్యూల్లో...
విశాల్ హీరోగా 35వ సినిమా షూటింగ్ షురూ అయింది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్పై రూపొందుతోన్న 99వ చిత్రమిది. ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం చెన్నైలో జరిగాయి. దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (ఎన్హెచ్ 4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం), నటులు కార్తీ, జీవా, కెమెరామేన్ ఆర్థర్ ఎ విల్సన్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.‘‘మద గజ రాజా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రమిది. విశాల్, దర్శకుడు రవి అరసు కాంబినేషన్లో మొదటి సినిమా ఇది. ‘మద గజ రాజా’ తర్వాత విశాల్, సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం.నాథన్ ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అలాగే ‘మార్క్ ఆంటోనీ’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్ మరోసారి ఈ సినిమా కోసం విశాల్తో కలిశారు. 45 రోజుల సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ను పూర్తి చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చిన్నప్పుడే పెళ్లి-విడాకులు, రెండో పెళ్లి చేసుకుంటే చివరి రోజుల్లో..
డ్యాన్సర్ నుంచి హీరోయిన్గా మారినవారిలో రాజసులోచన (Rajasulochana) ఒకరు. 1953లో గుణసోదరి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 325కి పైగా సినిమాలు చేశారు. ప్రతి భాషలో తనకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాజసులోచన గురించి ఆమె కూతురు శ్రీ గురుస్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.చిన్న వయసులో మొదటి పెళ్లిఅమ్మ నటి, డ్యాన్సర్, సామాజిక కార్యకర్త. నాన్న (చిత్తజల్లు శ్రీనివాసరావు) గొప్ప దర్శకుడు. అమ్మది విజయవాడ, నాన్నది కాకినాడ. సినిమా ఇండస్ట్రీకి వచ్చాకే వీరు కలుసుకున్నారు. అమ్మకు చిన్న వయసులోనే పెళ్లయింది. చెన్నైలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అమ్మను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు సంతానం. తర్వాత కష్టాలు మొదలవడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం అమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయింది. ఇక్కడే నాన్నగారు తనకు పరిచయమయ్యాడు. చివరి రోజుల్లో విడివిడిగా..1964లో నాన్నను రెండో పెళ్లి చేసుకుంది. రెండేళ్లకే మేము(కవలలు) పుట్టాం. అమ్మానాన్న ఫుల్ బిజీ కావడంతో మేము అమ్మమ్మ దగ్గరే పెరిగాం. తర్వాత నా సోదరి ఇండియాలో సెటిలైతే నేను అమెరికాలో సెటిలయ్యాను. ప్రతి ఏడాది అమ్మ నా దగ్గరకు వస్తూ ఉండేది. అయితే చివరి రోజుల్లో అమ్మ.. నాన్నకు దూరంగా ఉంది. నాన్నకు ఉన్న చెడు అలవాట్లు అమ్మకు నచ్చక విడిగా ఉండేది. ఆ బాధకు తోడు హైబీపీ వల్ల కిడ్నీ ఫెయిలైంది. అయితే చాలామంది సినిమాలు తీసి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. కానీ, అమ్మానాన్న ఇల్లు, ప్లాట్స్పై ఇన్వెస్ట్ చేశారు అని చెప్పుకొచ్చింది. రాజసులోచన.. వాల్మీకి, శాంతినివాసం, బాలనాగమ్మ, పాండవ వనవాసం, పెంకి పెళ్లాం.. ఇలా అనేక సినిమాలు చేశారు. 2013లో కన్నుమూశారు.చదవండి: లారెన్స్ను కలిసిన చైల్డ్ ఆర్టిస్ట్.. 'తాగుబోతులకు సాయం చేయనంటూనే..' -
వైరల్ వయ్యారి పాటకు స్టేజీపై స్టెప్పులేసిన శివన్న
ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి నేనే.. పాటే వినిపిస్తోంది. ఇందులో శ్రీలీల, కిరీటి జంటగా డ్యాన్స్ చేశారు. శ్రీలీల గ్రేస్, డ్యాన్స్ గురించి తెలియంది కాదు! ఎప్పటిలాగే అల్లాడించేసింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కిరీటి గురించే! జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన ఈ యంగ్ హారో.. ఆయనలాగే పపర్ఫుల్గా స్టెప్పులేశాడు. నిన్ను చూస్తుంటే తారక్ను చూస్తున్నట్లే ఉందని చాలామంది కిరీటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇతడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు. జూనియర్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు.వయ్యారి సాంగ్కు స్టేజీపై స్టెప్పులుఈ మూవీ జూలై 18న విడుదల కానుంది. ఈ క్రమంలో బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో కిరీటి శివన్నతో స్టేజీపై స్టెప్పులేయించాడు. వైరల్ వయ్యారి పాటకు స్టెప్పు ఇది.. అని ఒకసారి చూపించగనే శివన్న ఇట్టే నేర్చేసుకున్నారు. పాట ప్లే అవుతుంటే ఫుల్ జోష్లో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.జూనియర్ సినిమా విశేషాలుప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం జూనియర్. జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్ర పోషిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్ కుమార్ జూనియర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. A true viral moment 💥💥Karunada Chakravarthy @NimmaShivanna Garu dances to the #ViralVayyari song with the lead pair at the Junior Grand Pre Release Event ❤🔥#Junior grand release on July 18th ✨A Rockstar @ThisIsDSP Musical 🎸🔥 pic.twitter.com/lpAxfYmnSa— Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) July 13, 2025 చదవండి: ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే సిట్టింగా? -
ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత
ప్రముఖ నటి, అభినయ సరస్వతి బి.సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం (జూలై 14న) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో అనేక చిత్రాలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. తెలుగులో భూకైలాస్, పెళ్లి సందడి (1959), జగదేక వీరుని కథ, సీతారామ కల్యాణం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, శకుంతల, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, పండంటి కాపురం, సీతారామ వనవాసం, దాన వీర శూర కర్ణ వంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.200కి పైగా సినిమాలుబీ సరోజాదేవి (B.Saroja Devi) 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. "అభినయ సరస్వతి" అనే బిరుదుతో ప్రసిద్ధి పొందిన ఆమె, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో ఆమె సినీ రంగ ప్రయాణం ప్రారంభమైంది. పాండురంగ మహత్యం (1957) ద్వారా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. నాడోడి మన్నన్ (1958) ఆమెను తమిళ చిత్రసీమలో స్టార్గా నిలిపింది. హిందీలో పైఘామ్ (1959), ససురాల్ (1961) వంటి చిత్రాల్లో నటించారు.1955 నుండి 1984 వరకు 161 సినిమాల్లో ప్రధాన పాత్రధారిగా నటించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆమె కెరీర్లో.. కిట్టూరు రాణి చెన్నమ్మ (1961) దేశభక్తి భావనను ప్రతిబింబించే చిత్రంగా గుర్తింపు పొందింది. సినీ రంగంలో ఆమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ (1969), పద్మభూషణ్ (1992) పురస్కారాలతో సత్కరించింది. అలాగే సరోజా దేవికి కలైమామణి పురస్కారం దక్కింది. అంతేకాకుండా బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.కుటుంబ నేపథ్యంసరోజా దేవి తండ్రి భైరప్ప పోలీసు శాఖలో ఉద్యోగి, తల్లి రుద్రమ్మ గృహిణి. 1967లో శ్రీ హర్ష అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన 1986లో మరణించారు. సరోజాదేవి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారికి రామచంద్రన్, ఇందిరా అని పేర్లు పెట్టి పోషించారు.చదవండి: ఫ్రెండ్స్తో బండ్ల గణేశ్.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, ఇంతలోనే సిట్టింగా? -
షూటింగ్లో ఆర్టిస్ట్ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్
ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కిళైయూర్ కావల్ సరగమ్ సమీపంలో విళుందమావడి గ్రామంలో గత మూడు రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం షూటింగ్లో పాల్గొన్న మోహన్ రాజు అనే స్టంట్ కళాకారుడు కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.స్టంట్ కళాకారుడు మృతివెంటనే అతన్ని నాగపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాజు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన స్టంట్ కళాకారుడు మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. ఈయన మృతి వెట్టువన్ చిత్ర యూనిట్నే కాకుండా సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్ కళాకారుడు మోహన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ (Vishal) సంతాపం ప్రకటించారు.ప్రమాదకర స్టంట్లుసినిమా షూటింగ్లో కారులో నుంచి దూకుతూ స్టంట్ కళాకారుడు రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎంతో ధైర్యశాలి. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కేవలం ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.ఫైట్ మాస్టర్ ట్వీట్ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్.. రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్ను కోల్పోయాం. స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. అతడిని మిస్ అవుతున్నాం అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 One of our great car jumping stunt Artist S M Raju Died today while doing car stunts 😭😭RIPOur stunt union and Indian film industry ll be missing Him😭😭 pic.twitter.com/9Qr7Zg8Dbb— silva stunt (@silvastunt) July 13, 2025చదవండి: సకల సినీ పాత్రలకు పెట్టని కోట -
పది కేజీలు తగ్గిన థగ్ లైఫ్ నటుడు.. ఆ సినిమా కోసమేనట!
ఇటీవలే థగ్ లైఫ్ మూవీలో కనిపించిన కోలీవుడ్ హీరో శింబు మరో కొత్త ప్రాజెక్ట్కు సిద్ధమయ్యాడు. వెట్రి మారన్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మరింత యవ్వనంగా కనిపించేందుకు శింబు బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన పది రోజుల్లోనే 10 కేజీల బరువు తగ్గారని కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.మరోవైపు అయితే ఈ సినిమా గతంలో వెట్రి మారన్, ధనుశ్ కాంబోలో వచ్చిన చిత్రం వడ చెన్నై మూవీకి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేం లేదని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో కవిన్, మణికందన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ధనుశ్ చిత్రం 'వడ చెన్నై'లో నటించిన ఆండ్రియా జెరెమా, సముద్రఖని, కిషోర్ కూడా ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. భారీ తారాగణం ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. -
తంగలాన్ డైరెక్టర్ షూటింగ్లో ప్రమాదం.. డేరింగ్ స్టంట్ మ్యాన్ మృతి..!
కోలీవుడ్లో విషాదం నెలకొంది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్టంట్ మ్యాన్ రాజు మరణించారు. కారుతో స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనపై కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అతని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.విశాల్ తన ట్వీట్లో రాస్తూ..' డైరెక్టర్ పా రంజిత్ సినిమా షూట్లో ఈ రోజు ఉదయం జరిగిన విషాదం గురించి విన్నా. కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను నా సినిమాల్లో చాలా రిస్క్ స్టంట్లు చేశాడు. ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. అతనికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాజు ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాద సమయంలో ఆ దేవుడు వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాదు.. అతని కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాం. కోలీవుడ్ పరిశ్రమలో చాలా చిత్రాలకు ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది. ఇది నా కర్తవ్యంగా వారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తా' అని పోస్ట్ చేశారు. రాజు మృతి పట్ల ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా తన సంతాపం ప్రకటించారు.కాగా..స్టంట్ మ్యాన్ రాజు తన సాహసోపేతమైన స్టంట్లతో కోలీవుడ్ పరిశ్రమలో ఫేమస్ అయ్యారు. తన కెరీర్లో చాలా ఏళ్లుగా కోలీవుడ్లో అనేక చిత్రాలకు పనిచేశారు. రాజుకు చాలా ధైర్యవంతుడిగా, నైపుణ్యం కలిగిన స్టంట్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం అతను పనిచేసిన చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని 2021లో వచ్చిన 'సర్పట్ట పరంబరై'కి సీక్వెల్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2026లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 -
యువ నటి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆషాడమాసం సీజన్ నడుస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల్లో మాత్రం శుభకార్యాలు జరుగుతున్నాయి. తాజాగా తమిళ నటుడు అర్జున్ చిదంబరం పెళ్లి చేసుకోగా.. మరో తమిళ నటి కూడా కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. వీడియోని కూడా పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?)చెన్నైకి చెందిన రిత్విక.. 2013లో వచ్చిన పరదేశి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తర్వాత మద్రాస్, కబాలి, టార్చ్ లైట్, 800 చిత్రాలతో పాటు రీసెంట్గా వచ్చిన ఎలెవన్, డీఎన్ఏ మూవీస్ కూడా చేసింది. ఇప్పుడు ఈమె.. వినోద్ లక్ష్మణ్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి డేట్ సహా ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తారు.సినిమాలతో పాటు రిత్విక.. పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. తమిళ బిగ్బాస్ 2వ సీజన్ లో పాల్గొంది. పెద్దగా అంచనాల్లేనప్పటికీ విజేతగా నిలిచింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే నటిగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది.(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by RIYTHVIKA KP (@riythvika_official) -
ఒక్క పాటతో పూజా హెగ్డే కంటే ఫేమస్.. ఎవరీ నటుడు?
రజినీకాంత్ 'కూలీ' సినిమా నుంచి రీసెంట్గా 'మోనికా' అనే సాంగ్ రిలీజైంది. ఇందులో పూజా హెగ్డే డ్యాన్స్ చేసింది. పాట కొందరికి నచ్చింది, కొందరికి ఓకే అనిపించింది. ఆ సంగతి పక్కనబెడితే లెక్క ప్రకారం పూజా స్టెప్పులు ఫేమస్ కావాలి. కానీ ఇదే పాటలో ఆమెతో కలిసి డ్యాన్స్ చేసిన నటుడి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే అంతలా ఫేమస్ అయిపోయాడు. ఇంతకీ ఎవరతడు?ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ నటుడి గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇతడి పేరు సౌబిన్ షాహిర్. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన ఇతడు.. ప్రొడక్షన్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్గానూ పనిచేశాడు. సహాయ దర్శకుడిగా చేస్తున్న టైంలోనే చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలుపెట్టాడు. అయితే 2018లో 'సుదాని ఫ్రమ్ నైజీరియా' మూవీతో మంచి గుర్తింపు దక్కింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూవీ సౌబిన్ జీవితాన్ని మలుపు తిప్పింది.(ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) ఈ సినిమాలో సౌబిన్ నటనకుగాను కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం దక్కింది. దీని తర్వాత కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచమ్ ఇలా పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలకించగల ఇతడు.. గతేడాది 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రంతో నిర్మాతగా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'కూలీ'తో అదృష్టం పరీక్షించుకునేందుకు రాబోతున్నాడు.లోకేశ్ కనగరాజ్ తీసిన 'కూలీ'లో నటించిన టైంలోనే సౌబిన్కి మిగతా చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ దీనికోసం దాదాపు 7-8 మూవీస్ని వదులుకున్నాడు. ఇప్పుడేమో మోనికా పాటలో సౌబిన్ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పూజా హెగ్డే కంటే ఇతడి డ్యాన్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. మరి మూవీ రిలీజ్ తర్వాత సౌబిన్కి ఇంకెంత ఫేమ్ తెచ్చుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ) -
రాజాసాబ్ బ్యూటీ.. విజయ్ దేవరకొండ మూవీతో డెబ్యూ ఇవ్వాల్సిందట!
తన ప్రత్యేకమైన స్టయిల్, స్వతంత్ర భావనతో ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించే మాళవిక మోహనన్ త్వరలోనే టాలీవుడ్లో స్టార్గా వెలుగొందనుంది. ఆ విషయాలే మీకోసం.. రాజాసాబ్ బ్యూటీ..మాళవిక మోహనన్ (Malavika Mohanan) కొన్ని తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తాజాగా ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో నాయికగా నటించడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. మాళవిక తండ్రి కె.యు. మోహనన్ కూడా సినీరంగానికే చెందినవాడు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి ఎన్నో సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించారు.తండ్రితో లొకేషన్కి..మాళవిక.. కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగింది, చదువుకుంది కూడా అక్కడే. కేవలం చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కాని, అసలు ఆసక్తి సినిమాలవైపే! ఒకసారి తండ్రి మోహనన్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుండగా, ఆమె లొకేషన్కు వెళ్లింది. ఆ యాడ్లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఫ్యాషన్ డిజైనింగ్పై ఆసక్తిఆమె నటనపై చూపిన ఆసక్తిని గమనించిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా మాళవిక కెరీర్ మొదలైంది. ‘పట్టమ్ పొలే’ అనే మలయాళ చిత్రం ఆమె మొదటి సినిమా. ఆ సినిమా సమయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మాళవిక తన దుస్తులను తానే డిజైన్ చేసుకుంది. అక్కడి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి, ‘ది స్కార్లెట్ విండో’ అనే పేరుతో తన బ్రాండ్ ప్రారంభించింది.ధైర్యం ఎక్కువే!మాళవిక చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పెడుతుంటే, కొందరు నెటిజన్లు తప్పుడు కామెంట్లు పెట్టారు. మర్యాదగా, పద్ధతిగా ఉండాలని సూచనలు ఇచ్చారు. దానికి స్పందనగా పద్ధతిగా చీర వేసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కూడా షార్ట్, చిన్న చొక్కా ఉండడంతో మరింత సెన్సేషన్ అయింది. ‘ఒక ఆడపిల్ల ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే బెటర్’ అని కౌంటరిచ్చింది.విజయ్ దేవరకొండతో మూవీభవిష్యత్తులో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్గా మారాలనేది ఆమె ఆశ. రింగులు అంటే మాళవికకి చాలా ఇష్టం. వందల సంఖ్యలో రింగులు కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – తెలుగులో ఆమెకి వచ్చిన మొదటి అవకాశం ‘రాజా సాబ్’ సినిమా కాదు. మొదట విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు ‘హీరో’.తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంసూపర్ స్టార్ రజనీకాంత్ అంటే మాళవికకి విపరీతమైన అభిమానం. ఆయనతో ‘పేట’ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎంతో థ్రిల్ అయ్యిందట! అలాగే విజయ్తో ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకమని మాళవిక చెప్పింది. ‘ఒక్క సినిమాలో కనిపించినా చాలు – తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా అభిమానించే ప్రేక్షకులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది’ అని చెప్పింది. ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ప్రభాస్తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ – ‘షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ప్రభాస్ ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వచ్చేది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది తినగలిగేంత పెద్ద పరిమాణంలో వంటలు వచ్చేవి. భోజనం బాగా నచ్చినా, అంత తినలేకపోయా’ అని తెలిపింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ – మాళవిక చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బిల్డింగ్లో పెరిగారు. అందుకే తనకి అత్యంత సన్నిహితుడిగా విక్కీని భావిస్తానని చెబుతుంది. మలయాళ అమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండే చేపల కూర అంటే విపరీతమైన ఇష్టం. డైటింగ్ను పక్కనపెట్టి, షూటింగ్ లేనప్పుడు తల్లి బీనా చేత వండించుకుని, ఆ చేపల కూర తింటూ ఆనందపడుతూ ఉంటుంది.చదవండి: ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా -
'పొన్నియిన్ సెల్వన్' నటుడి పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
మరో ప్రముఖ నటుడు పెళ్లి చేసుకున్నాడు. తమిళంలో 'పొన్నియిన్ సెల్వన్', 'థగ్ లైఫ్' తదితర చిత్రాల్లో నటించిన ఇతడు.. ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. ఆర్కిటెక్ట్ జయశ్రీ చంద్రశేఖరన్తో ఏడడుగులు వేశాడు. ఆదివారం ఉదయం ఈ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు. పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఆన్లైన్లో మోసపోయిన యాంకర్ అనసూయ)చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ చిదంబరం.. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా 2015లో వచ్చిన 'మూణే మూణు వార్తై' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత రమ్, నేర్కొండ పార్వై, తీవిరమ్, పొన్నియిన్ సెల్వన్, అనీతి, కొలాయి, రత్తం, థగ్ లైఫ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అమెరికా మాప్పిలై, ఆటో శంకర్, బిహైండ్ కోజ్డ్ డోర్, అద్ధం, ద విలేజ్ వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశాడు. ఇక పెళ్లి కూతురు జయశ్రీ చంద్రశేఖర్ విషయానికొస్తే ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ప్రస్తుతం ఆర్కిటెక్ట్గా పనిచేస్తోంది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహమా? పెద్దల కుదిర్చిన పెళ్లి? అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అమ్మ మీద ప్రేమ.. ఆ హీరోపై అభిమానం ఎప్పటికీ తగ్గదు: కిరీటి) -
మోనికా సాంగ్.. డ్యాన్స్తో డామినేట్ చేసిన నటుడు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా (Coolie Movie)పై భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు భాగం కావడంతో కూలీ మూవీ గురించి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించిన మోనికా అనే ఐటం సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే అందంతో, డ్యాన్స్తో అదరగొట్టింది. అప్పుడు జిగేలు రాణి.. ఇప్పుడు మోనికాఇలా స్పెషల్ సాంగ్స్ చేయడం పూజకు కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం మూవీలో జిగేలురాణి పాటకు సూపర్గా డ్యాన్స్ చేసింది. ఎఫ్ 3 మూవీలోనూ లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె కనిపించిన చివరి సినిమా అదే! ఇటీవల తమిళ రెట్రో మూవీలో కథానాయికగా అలరించింది. కన్నిమా పాటకు ఎక్స్ప్రెషన్, గ్రేస్తో అదరగొట్టేసింది. ఇప్పుడు కూలీలో మోనికాగా సెన్సేషన్ సృష్టిస్తోంది. దడదడలాడించిన సౌబిన్అయితే ఈ పాటలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) పూజానే డామినేట్ చేస్తున్నాడు. హీరోయిన్తో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు. మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్లో యాక్ట్ చేశాడు. ఇప్పుడు మోనికా పాటలో సింపుల్ లుక్లోనే సూపర్ స్టెప్పులేస్తూ ఫుల్ హైలైట్ అవుతున్నాడు. స్పెషల్ సాంగ్లో సౌబిన్తో స్టెప్పులేయించాలన్న ఆలోచన రావడమే గ్రేట్ అంటూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ను నెటిజన్లు పొగుడుతున్నారు. చదవండి: 'బిగ్బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆమె కూడా! -
వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకా అని ఆశ్చర్యపోయా
ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'(ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్తో నటి డేటింగ్)''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది.(ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?) He is 75 now Best orator when comes to stage speeches . The way he kept audience engaging 🔥🔥🔥Ultimate hilarious fun mode 😂😂Mr . Rajinikanth 😂Kamalhaasan elevation 🔥Sivakumar ayya elevation 🔥Dmk function 😂😂Cooling glass slow motion 😂Why I’m chief for this… pic.twitter.com/plbtMjBLQO— Suresh balaji (@surbalutwt) July 11, 2025 -
మోహన్ లాల్ దే మెగా విజయం, మళయాళ చిత్రసీమ 2025 తేల్చిందిదే..
తొలి అర్ధ సంవత్సరంలో మలయాళ సినిమా రంగం ఊహించని మలుపులు తిరిగింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ సినిమాల మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీనూ భారీగా విస్తరించినా, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కొన్ని సినిమాలు జయాపజయాల అంచనాల్ని తలకిందులుగా చేసి, సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.టాప్ స్టార్ల నుంచి మిశ్రమ ఫలితాలుమళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈసారి డబుల్ హిట్తో బాక్సాఫీస్లో సందడి సృష్టించాడు. విలక్షణ నటుడు, హీరో పృథ్విరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంపురాన్’ (ఎల్2) రాజకీయ థ్రిల్లర్గా రూ.265 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆయన నటించిన ‘తుదరుం’ కూడా రూ.230 కోట్ల కలెక్షన్స్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరోవైపు మళయాళ మెగాస్టార్గా పేర్కొనే మమ్ముట్టి మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆయన ఈ అర్ధభాగంలో తక్కువ ప్రభావం చూపించాడు. ఆయన నటించిన ‘డొమినిక్’, ‘లేడీస్ పర్స్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందలేకపోయాయి.చిన్న సినిమాలకు పెద్ద ఆదరణవినూత్న కధాంశాలు, వైవిధ్య భరిత చిత్రాలకు పెద్ద పీట వేసే తమ మనస్తత్వాన్ని మరోసారి మళయాళీలు చాటుకున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అసిఫ్ అలీ – అనస్వర రాజన్ జంటగా నటించిన ‘రేఖాచిత్రం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, టోవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ వంటి థ్రిల్లర్ చిత్రాలు కూడా తమ సత్తా చాటాయి.గుర్తింపుకు నోచుకోలేకపోయిన ఐడెంటిటీ...భారీ అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ మాత్రం సరైన గుర్తింపునకు నోచుకోలేక చతికిలపడింది. టోవినో థామస్, త్రిష లాంటి అగ్రతారలు ఉన్నా కథలో లోపాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం విడుదలైన ‘కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా’, ‘ఐడి: ది ఫేక్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.ఈ అర్ధ సంవత్సరం మళయాళ పరిశ్రమలో స్పష్టంగా కనిపించిన విషయం అదీ ఇదీ అని తేడా లేకుండా భిన్న రకాల కధలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కధలో కొత్తదనం, ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్. థ్రిల్లర్, రాజకీయ నాటకాలు ఆదరణ పొందగా, కుటుంబ భావోద్వేగాలు చిత్ర జయాపజయాల్లో తమ పాత్రను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయని కూడా వెల్లడైంది.మోహన్లాల్ సినిమాల ఘనవిజయాలు మళయాళ సినీ పరిశ్రమకు ఉన్న బాక్సాఫీస్ సత్తాను చాటగా, చిన్న సినిమాల విజయం కొత్త ఆశల్ని అందించింది. ఇక రెండో అర్ధ సంవత్సరంలో పరిశ్రమ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.. -
గదాధారి...
‘‘గదాధారి హనుమాన్’ సినిమా కథ చాలా బలమైనది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా ఆకట్టుకుంటుంది’’ అని రవికిరణ్ తెలిపారు. ఆయన హీరోగా రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి నిర్మించారు.హైదరాబాద్లో నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి నిర్మాతలు సి. కల్యాణ్, రాజ్ కందుకూరి, దర్శకుడు సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. రోహిత్ కొల్లి మాట్లాడుతూ– ‘‘గదాధారి హనుమాన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. గద ఎంత పవర్ఫుల్ అనేదానిపై మా చిత్రంలో ఓ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘మా దర్శకుడు రోహిత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు రేణుకా ప్రసాద్. ‘‘కుటుంబ కథా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని బసవరాజ్ హురకడ్లి చెప్పారు. -
సార్... మేడమ్ వస్తున్నారు
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’.పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు.పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో సాగుతుంది. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్లో కనిపించారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్, నిత్యల నటన హైలెట్గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆ తెలుగు సినిమా నా జీవితాన్ని మార్చేసింది: శృతిహాసన్
కోలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మోనికా అంటూ సాంగే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ పూజా హేగ్డే తన డ్యాన్స్త అదరగొట్టేసింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న కూలీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటించారు.అయితే ఇటీవల సోషల్ మీడియాకు గుడ్బై చెప్పిన శృతిహాసన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తనకు లైఫ్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీనే అని తెలిపింది.తెలుగులో గబ్బర్ సింగ్ సినిమా తన జీవితాన్నే మార్చిందని చెప్పుకొచ్చింది. కోలీవుడ్ తర్వాత నాకు సక్సెస్ ఇచ్చిందంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమేనని వెల్లడించింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ సార్ పట్టుబట్టి మరి ఆ రోల్ ఇచ్చారని గుర్తు చేసుకుంది. మా నాన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చానని శృతిహాసన్ తెలిపింది. -
'కూలీ' నుంచి మోనికా.. స్పెషల్ సాంగ్ రిలీజ్
సూపర్స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఇదివరకే చికిటు అనే పాట రిలీజ్ కాగా.. ఇప్పుడు మోనికా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పాట ఇది. రెడ్ కలర్ డ్రస్సుల్లో గ్లామర్ చూపిస్తూ పూజ డ్యాన్స్ బాగానే చేసింది. కాకపోతే అనిరుధ్ గతంలో కంపోజ్ చేసిన సాంగ్స్లా ఇదేం ప్రత్యేకంగా అనిపించలేదు. కాకపోతే కలర్ఫుల్గానే ఉంది.(ఇదీ చదవండి: లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం.. నన్ను వేస్ట్ చేశాడు: సంజయ్ దత్)ఈ పాటని వైజాగ్ పోర్ట్లో తీసినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్సులు వేస్తూ కనిపించాడు. ఇదే గీతంలో విలన్ పాత్ర చేస్తున్న నాగార్జున కూడా స్టెప్పులేశాడు. కాకపోతే ఆ విజువల్స్.. లిరికల్ వీడియోలో పెట్టలేదు. థియేటర్లలో అవి ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న 'కూలీ'లో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్.. ఇలా స్టార్స్ బోలెడంత మంది ఉన్నారు. హైప్ కూడా గట్టిగానే ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ) -
నన్ను వేస్ట్ చేశాడు.. లోకేశ్ కనగరాజ్పై చాలా కోపం
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే ఖైదీ, విక్రమ్ లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే స్టార్ దర్శకుల్లో ఇతడు ఒకడు. ప్రస్తుతం రజినీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఈ మూవీపై హైప్ మామూలుగా లేదు. సరే ఇదంతా పక్కనబెడితే లోకేశ్పై తాను చాలా కోపంగా ఉన్నానని, తనని వేస్ట్ చేశాడని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కరాటే సినిమా.. తెలుగులోనూ)స్వతహాగా బ్యాంక్ ఉద్యోగి అయిన లోకేశ్ కనగరాజ్.. 'మా నగరం' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ఖైదీ'తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023లో దళపతి విజయ్తో 'లియో' సినిమా తీశాడు. కాకపోతే ఇది సరిగా వర్కౌట్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటించాడు. ఇప్పుడు దాని గురించే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో సంజయ్ దత్ మాట్లాడాడు.'కేడీ ద డెవిల్' అనే సినిమా టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో సంజయ్ కీలక పాత్ర చేశాడు. దీని ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ అంతా తాజాగా చెన్నైలో ల్యాండ్ అయింది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సంజయ్ దత్.. 'రజినీకాంత్, కమల్, అజిత్ సినిమాలు నేను చూస్తుంటాను. రజినీ సర్తో కలిసి అప్పట్లో హిందీ చిత్రాలు కూడా చేశాను. దళపతి విజయ్తోనూ 'లియో' చేశా. అయితే లోకేశ్పై నాకు చాలా కోపం. ఎందుకంటే చిన్న రోల్ ఇచ్చి నన్ను వేస్ట్ చేశాడు(నవ్వుతూ)' అని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: బాలీవుడ్ పరువు తీసిన సంజయ్ దత్!)"I worked with #VijayThalapthy & I loved it. I'm angry with #LokeshKanagaraj, because he didn't give me a big role in #LEO. He wasted me.- #SanjayDutt pic.twitter.com/zzPaeqfEub— Movies4u Official (@Movies4u_Officl) July 11, 2025 -
శ్రీలీల లేటేస్ట్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి
కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘జూనియర్’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషించారు. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ రాజమౌళితో.. కన్నడ వర్షన్ ట్రైలర్ను కిచ్చా సుదీప్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన వైరల్ వయ్యారి అనే ఐటమ్ సాంగ్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.Happy to release the trailer of @KireetiOfficial’s #Junior… Wishing him all the best on his debut and best wishes to the entire team for the release on July 18th!#JuniorTrailer https://t.co/qDwK35QvR2— rajamouli ss (@ssrajamouli) July 11, 2025 -
మా కన్నడ భాష జోలికొస్తే ఊరుకోం: హీరో ధృవ సర్జా
ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేం. కొన్నిసార్లు దానివల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదు. తమిళ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) విషయంలో ఇదే జరిగింది. తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని ఆయన చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయన ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమాను కన్నడిగులు అడ్డుకున్నారు. కోర్టు జోక్యం చేసుకుని విడుదలకు అనుమతిచ్చినప్పటికీ థగ్ లైఫ్ రిలీజ్ చేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదు.చెన్నైలో కేడీ టీమ్దీంతో కన్నడ థియేటర్లలో థగ్ లైఫ్ బొమ్మ పడకుండానే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై కన్నడ హీరో ధ్రువ సర్జా (Dhruva Sarja)కు ప్రశ్న ఎదురైంది. ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కేడీ: ద డెవిల్. త్వరలోనే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా తమిళ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా ఓ తమిళ జర్నలిస్ట్ నుంచి హీరోకు ఊహించని ప్రశ్న ఎదురైంది.నేను పుట్టకముందు నుంచే..కన్నడ సినిమాలు తమిళంలో సులువుగా రిలీజైపోతున్నాయి. కానీ, ఇటీవల ఓ తమిళ చిత్రాన్ని (Thug Life Movie) మాత్రం కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో కొందరు తమిళ ప్రజలు.. కన్నడ చిత్రాలు కూడా కోలీవుడ్లో రిలీజ్ చేసేందుకు వీల్లేదంటున్నారు. మరి మీ సినిమాను ఎలా రిలీజ్ చేస్తున్నారు? అని అడిగారు. అందుకు ధ్రువ సర్జా.. నేను పుట్టకముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ చిత్రాలు రిలీజయ్యాయి. ఏ ఒక్క సినిమానూ ఎవరూ ఆపలేదు. కమల్ హాసన్ సర్ చేసిన కామెంట్స్ వల్ల ఆయన సినిమాపై వ్యతిరేకత వచ్చిందంతే! మా భాషను అగౌరవపరిస్తే..ఎవరికైనా మాతృభాష అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందరిలాగే మేమూ మా భాషను ప్రేమిస్తాం. మా భాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా! థగ్ లైఫ్ మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బందీ లేకుండా రిలీజయ్యాయి. వాటిని కన్నడిగులు ఆదరించారు కూడా! మాతృభాష జోలికొస్తే, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు అని ధృవ సర్జా ఘాటుగా ఆన్సరిచ్చాడు.చదవండి: మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం' -
మరోసారి తల్లి కాబోతున్న దేవర నటి.. 'ఇన్నాళ్లు సీక్రెట్గా ఉంచాం'
నటి చైత్ర రాయ్ (Chaitra Rai) గుడ్న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. 'ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాం. ఇప్పుడు ఆ సీక్రెట్ను మీ అందరితో పంచుకోవాలనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి.సీరియల్స్ నుంచి సినిమాల్లోకి..మీ ప్రేమాభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి' అని క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు కూతురు నిష్క శెట్టి సంతానం. ఇప్పుడా పాపతో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి రానుందన్నమాట! కాగా కన్నడ బ్యూటీ చైత్ర.. అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ఒకరికి ఒకరు, దటీజ్ మహాలక్ష్మి, రాధకు నీవేరా ప్రాణం సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలోనూ యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను -
పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తోంది.. నేనైతే మ్యారేజ్ చేసుకోను
పెళ్లంటేనే భయమేస్తోందంటోంది హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan). వివాహ సాంప్రదాయాన్ని గౌరవిస్తానని, కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానని చెప్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ.. పెళ్లి పేరు ఎత్తితేనే నాకు భయం వేస్తోంది. వివాహ పద్ధతిని నేను గౌరవిస్తాను. కానీ, నాకు మాత్రం అది అవసరం లేదనిపిస్తోంది. గతంలో ఒకసారి నేను రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేవరకు వెళ్లాను. కానీ పెళ్లి కాకుండానే ఆ ప్రేమ బంధం ముక్కలైంది. దత్తత తీసుకుంటాపెళ్లంటే ఇద్దరు మనుషులు ఏకమవడమే కాదు. భవిష్యత్తును పంచుకోవడం, జీవితాంతం ఒకరి బాధ్యతను మరొకరు తీసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం.. ఇలా చాలా ఉంటాయి. పెళ్లంటే ఇష్టం లేదని నేను ఒంటరిగానే మిగిలిపోను. ఎప్పటికైనా తల్లి స్థానాన్ని పొందాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. భవిష్యత్తులో పిల్లల్ని దత్తత తీసుకుంటానేమో.. చెప్పలేం! అప్పుడు నేను సింగిల్ పేరెంట్గా మాత్రం వారిని పెంచను. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం.సింగిల్అలా అని సింగిల్ పేరెంట్స్ను నేను తక్కువ చేయడం లేదు. వారిపై నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ప్రస్తుతానికైతే నేను నన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అంటూ శృతి హాసన్ తను సింగిల్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది.. కాగా శృతి హాసన్ కొన్నేళ్లుగా ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయణం నడిపింది. గతేడాది వీరిద్దరూ విడిపోయారు. సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.చదవండి: 9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వడ్డే నవీన్.. ఇప్పుడేం చేస్తున్నాడు? -
జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ
మత్తుపదార్థాల కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ నటులు శ్రీరామ్, కృష్ణ విడుదలయ్యారు. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్ (తమిళంలో శ్రీకాంత్) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చెన్నై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు.తప్పు చేశాను.. నా కుమారుడిని చూసుకోవాలిడ్రగ్స్ ఉపయోగించి తప్పు చేశానని కోర్టులోనే శ్రీరామ్ ఒప్పుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తుపదార్థాలను అలవాటు చేసినట్లు పోలీసుల విచారణలో శ్రీరామ్ తెలిపారు. ఆయన నిర్మాణంలో ‘తీంగిరై’ అనే సినిమాలో నటించానని, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి తనకు రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో డబ్బు అడిగినప్పుడల్లా ఆయన కొకైన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. రెండుసార్లు వాడిన తర్వాత మూడోసారి తానే అడిగే పరిస్థితి ఏర్పడిందని పోలీసులకు శ్రీరామ్ వెల్లడించారు. అయితే, తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడిని చూసుకోవాల్సి ఉందని అందుకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీరామ్ కోరారు. దీంతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. -
ఒకరు ఊహూ అంటే ఇంకొకరు ఊ అన్నారు
కథ కుదిరింది... క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఆల్ సెట్ అనుకునే టైమ్లో అప్పటికే సెట్ అయిన హీరోయిన్ ‘ఊహూ’ అనేశారు. ఒకవేళ హీరోయిన్కి ఓకే అయినా... వేరేప్రాబ్లమ్ వల్ల దర్శక–నిర్మాతలు ‘ఊహూ’ అన్నా ఆమె ఆప్రాజెక్ట్లో కొనసాగలేని పరిస్థితి. ఇలా హీరోయిన్–డైరెక్టర్- ప్రోడ్యూసర్ ఎవరు ‘ఊహూ’ అన్నా ‘ఊ’ అనడానికి ఇంకో హీరోయిన్ ఉంటారు కదా... అలా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో ఏయే కథానాయికలను వేరే కథానాయికలు రీప్లేస్ చేశారో తెలుసుకుందాం.శ్రుతీ ఔట్ మృణాల్ ఇన్ ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా కలిసి ఓ క్రైమ్ను చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మాజీ ప్రేమికులుగా అడివి శేష్, శ్రుతీహాసన్ని ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత ఈ చిత్రానికే శ్రుతి మాజీ అయిపోయారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దాంతో శ్రుతి స్థానంలో మృణాల్ ఠాకూర్ని తీసుకున్నారు.షానిల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ లవ్స్టోరీకి ‘ఏక్ ప్రేమ్ కథ’ అనేది ట్యాగ్లైన్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. కాగా ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. అడివి శేష్ క్యారెక్టర్ మదనపల్లె యాస మాట్లాడుతుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. శ్రీలీల నో... మీనాక్షీ చౌదరి.... భాగ్యశ్రీ ఎస్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల చేతిలో నుంచి ఈ మధ్య ఒకటి కాదు రెండు సినిమాలు జారిపోయాయి. ఆ చిత్రాలు మీనాక్షీ చౌదరి, భాగ్యశ్రీ భోర్సేలకి చిక్కాయి. శ్రీలీల ఈ మధ్య తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలకు ‘యస్’ చెప్పడంవల్ల రెండు తెలుగు సినిమాలకు ‘నో’ చె΄్పాల్సి వచ్చింది. ఆ ఆఫర్స్ మీనాక్షీ, భాగ్యశ్రీకి వెళ్లగానే ‘ఎస్’ అనేశారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.... ⇒ అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి ఒక రాణి ఫిక్స్ అయింది. కానీ ఆ తర్వాత రాజుగారిని రాణి వదులుకుంది. ఇదంతా నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం గురించే. ఈ చిత్రంలో రాజు ఎవరో కాదు... నవీన్ అని ఊహించే ఉంటారు. ఆయన్ను పెళ్లాడే రాణిగా ముందు శ్రీలీలను తీసుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ వల్ల ఈ చిత్రం నుంచి శ్రీలీల ఔట్. ఆమె స్థానంలోకి మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసింది చిత్రబృందం.కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ అని యూనిట్ భావించడంవల్లే పండగకి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాని విడుదల చేయాలనుకుని ఉంటారు. ⇒ ఓ వారం రోజులు షూటింగ్లో పాల్గొని, ఆ తర్వాత ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు సమాచారం. కారణం ఇంతకుముందు చెప్పినట్లు వేరే చిత్రాల డేట్స్ ఈ సినిమాతో క్లాష్ కావడమే. అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత తప్పుకున్న విషయాన్ని వెల్లడించలేదు. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ భోర్సేని నాయికగా తీసుకున్నారట. మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దీపికా ఔట్ త్రిప్తి ఇన్ ‘కల్కి 2898ఏడీ’లో ప్రభాస్–దీపికా పదుకోన్ జంటగా నటించలేదు కానీ... ఈ ఇద్దరూ ‘స్పిరిట్’లో జోడీగా నటించనున్నారని వార్త వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ చిత్రం ప్రకటన ఎప్పుడో వచ్చింది. దీపికా పదుకోన్ని ఎంపిక చేశారనే టాక్ కూడా ఆ మధ్య ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ జోడీ సెట్ కాలేదు. తక్కువ పని గంటలు, ఎక్కువ పారితోషికం వంటి కారణాలతో దీపికా పదుకోన్ ఈప్రాజెక్ట్కి దూరమయ్యారనే వార్త వచ్చింది.మరి... ఈ భామను రీప్లేస్ చేసే తార ఎవరు? అనే చర్చ జరిగిన నేపథ్యంలో ‘నా సినిమాలో ఫిమేల్ లీడ్ చేయబోయేది తనే’ అంటూ త్రిప్తీ దిమ్రీ పేరుని ప్రకటించారు సందీప్ రెడ్డి. రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యానిమల్’లో చేసిన కీ రోల్ త్రిప్తీ దిమ్రీని బాగా పాపులర్ చేసింది. ఇప్పుడు మరోసారి సందీప్ దర్శకత్వంలో సినిమా అవకాశం రావడం పట్ల... అది కూడా హీరోయిన్ పాత్ర కావడంతో త్రిప్తీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.పూజ ఔట్ శ్రీలీల.... మమితా ఇన్ సౌత్లో స్టార్ హీరోయిన్ రేంజ్కి... ముఖ్యంగా తెలుగులో మంచి స్థాయికి ఎదిగిన పూజా హెగ్డేకి ఇప్పుడు టాలీవుడ్లో పరిస్థితులు అనుకూలిస్తున్నట్లుగా లేదు. పూజా కథానాయికగా నటిస్తారనుకున్న రెండు చిత్రాల అవకాశం వేరే నాయికలకు వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళితే... ⇒ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ చిత్రంలో ముందు పూజా హెగ్డేని కథానాయికగా అనుకున్నారట. ఆ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చారు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ΄్లాన్ చేసిన ప్రకారం జరగలేదు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావడంవల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ డేట్స్ క్లాష్ వల్లే పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి ఔట్ అయ్యారని సమాచారం. ⇒ 2017 నుంచీ సినిమాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ 2024లో విడుదలైన ‘ప్రేమలు’తో మమితా బైజు క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత ఈ మలయాళ బ్యూటీకి అవకాశాలు పెరిగాయి. తాజాగా ధనుష్ సరసన నటించే అవకాశం మమితాకి దక్కింది. అది కూడా ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని కథానాయికగా తీసుకున్నారనే వార్త వచ్చింది. కారణాలు బయటకు రాలేదు కానీ పూజా హెగ్డేని మమితా రీప్లేస్ చేశారు. ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు పూజా హెగ్డే విషయానికొస్తే... తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. ఒకర్ని అనుకున్నప్రాజెక్ట్లోకి మరొకరు రావడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. ఒకవేళ ఆప్రాజెక్ట్ హిట్ అయితే, ‘ఔట్’ అయినవారికి కాస్త బాధ ఉంటుంది. అదే... ఫట్ అయితే ‘ఇన్’ అయినవాళ్లు ఫీలైపోతారు. రీప్లేస్ చేయడం ఎలా సాధారణమో హిట్టూ... ఫట్టూ కూడా సాధారణమే కాబట్టి.... కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగడమే.లేడీ డాన్ ఎవరు?డాన్ అంటే షారుక్ ఖాన్ అన్నట్లుగా ‘డాన్, డాన్ 2’ చిత్రాలు ఫిక్స్ చేసేశాయి. ఆ చిత్రాల దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చిత్రంలో డాన్ని మార్చారు. ఆ కొత్త డాన్ ఎవరంటే... రణ్వీర్ సింగ్. అలాగే ఆ ‘డాన్’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా లేడీ డాన్గా చేశారు. ‘డాన్ 3’లో లేడీ డాన్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఈ పాత్రకు కియారా అద్వానీని ఎంపిక చేశారు. అయితే కియారా ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమె స్థానంలో వేరే నాయికను తీసుకోవాలనుకుంటున్నారట. మెరుపు తీగలా కనిపించే కృతీ సనన్ అయితే లేడీ డాన్గా పర్ఫెక్ట్గా ఉంటారని ఆమెను దాదాపు ఖరారు చేశారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ చిత్రం షూటింగ్ని జనవరిలో ఆరంభించాలనుకుంటున్నారట. ఈలోపు కియారా డెలివరీ కూడా అయిపోతుంది. సో... ముందు అనుకున్నట్లుగా ఆమెనే కథానాయికగా ప్రోసీడ్ అయితే అనే ఆలోచన కూడా చేస్తోందట యూనిట్. మరి... ఫైనల్గా కియారా... కృతీ.... ఈ ఇద్దరిలో లేడీ డాన్ ఎవరు? అనేది కొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది. -
కార్తీ మార్షల్
హీరో కార్తీ ‘మార్షల్’ ప్రయాణం మొదలైంది. కార్తీ హీరోగా ‘తానాక్కారన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘మార్షల్’ టైటిల్ ఖరారైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చుతున్నారు. ‘‘అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో ‘మార్షల్’ సినిమాను నిర్మించనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రధానంగా తీరప్రాంతం, సముద్రం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. -
నయనతార దంపతులపై విడాకుల రూమర్స్.. గట్టిగానే ఇచ్చిపడేసిందిగా!
కోలీవుడ్ స్టార్ జంట నయనతార- విఘ్నేశ్ శివన్పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు త్వరలోనే తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పనున్నారని టాక్ వినిపించింది. ఈ స్టార్ కపుల్ గురించి పలు వెబ్సైట్స్లో కథనాలొచ్చాయి. దీంతో నయనతార తమపై వస్తున్న రూమర్స్కు గట్టి రిప్లై ఇచ్చింది. తన భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. 'మాపై సిల్లీ న్యూస్ వచ్చినప్పుడల్లా మా రియాక్షన్ ఇలానే ఉంటుంది' అని ఘాటుగానే బదులిచ్చింది.కాగా.. పెళ్లి బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఈ రూమర్స్కు కారణమైంది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు.. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే నెట్టింట స్క్రీన్షాట్స్ దర్శనమిచ్చాయి. ఆ పోస్ట్ వల్లే నయన్- విఘ్నేశ్ దంపతులు విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో కోలీవుడ్లో వీరిద్దరి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇక నయనతార సినిమాలపరంగా చూస్తే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 157లో కనిపించనుంది. అంతేకాకుండా యశ్ హీరోగా వస్తోన్న టాక్సిక్ మూవీలోనూ కనిపించనుంది. కాగా.. నయనతార సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టుకున్నారు. -
ఒక రోజు ముందుగానే ఓటీటీకి వచ్చిన సూపర్ హిట్ మూవీ
మలయాళీ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'నరివెట్ట'. ఈ చిత్రానికి అనురాగ్ మనోహర్ దర్శకత్వం వహించారు. తెలుగులో మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. 2003లో జరిగిన ముతంగ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఐడెంటిటీ హిట్ తర్వాత టోవినో థామస్ మరో మూవీని సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేసింది. సోనీ లివ్ వేదికగా నరివెట్ట మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంకేందుకు ఆలస్యం ఈ బ్లాక్బస్టర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రంలో వెంజరమూడు, చేరన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్గా నటించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Digital Premiere:Kannada Version Of Malayalam Film #Narivetta(2025) Now Streaming On @SonyLIVLink:https://t.co/l80BCRNHnNIMDb: 7/10Also Available In Telugu, Tamil & Hindi #KannadaDubbed pic.twitter.com/DnojlPyUrr— Shrikrishna (@Shrikrishna_13) July 10, 2025 -
కాలిపోతున్న పత్తి పంట.. తల దించుకున్న ధనుష్.. మరో ప్రయోగం!
కోలీవుడ్ హీరో ధనుష్ వెండితెరపై మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుబేర సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్ నటుడు.. తన తర్వాత సినిమా కోసం పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నాడు. సెన్సిటివ్ చిత్రాల ఫేమ్ విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ధనుష్ 54వ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో కాలిపోతున్న పత్తి చేనులో ధనుష్ తల దించుకొని ఉన్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ.. రైతు కష్టాలను ప్రస్తావించనుందని అనిపిస్తుంది.ఇప్పటికే వేరు వేరు జానర్స్లో నటించి అలరించిన ధనుష్..ఇప్పుడు పూర్తిస్థాయి ఎమోషనల్ కథతో రాబోతున్నాడు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
హోంబలే ఫిల్మ్స్ యానిమేషన్ మూవీ.. ట్రైలర్ చూశారా?
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ Hombale Films భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ సమర్పణలో యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) చిత్రం జూలై 25 థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాను 3డీలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించగా.. హోంబాలే ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు.ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ నిర్మాతలు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్ను ప్రకటించారు. వారు విడుదల చేసిన క్యాలెండర్లో 2025లో 'మహావతార్ నరసింహ', ఆ తర్వాత 'మహావతార్ పరశురామ్' (2027), 'మహావతార్ రఘునందన్' (2029), 'మహావతార్ ధావకధేష్' (2031), 'మహావతార్ గోకులానంద' (2033), 'మహావతార్ కల్కి పార్ట్ 1' (2035), 'మహావతార్ కల్కి పార్ట్ 2' (2037) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టారా?
పైన కనిపిస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా? ఆయన వెండితెరపై కాసేపు కనిపించినా సరే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అందుకు జైలర్ సినిమానే నిదర్శనం. ప్రస్తుతం జైలర్ మూవీ సీక్వెల్లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే తెలుగులో రామ్చరణ్ పెద్ది సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈపాటికే ఆయనెవరో అర్థమైపోయుంటుంది. తనే కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ (Shiva Rajkumar). ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్.సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శివన్న ధనంజయగా కనిపించనున్నారు. పోస్టర్లో ఆయన లుక్ గుర్తుపట్టలేకుండా ఉంది. సూటూబూటూ వేసుకుని, టై కట్టుకుని ఓ చేతిలో రివాల్వర్ పట్టుకుని సీరియస్గా కనిపిస్తున్నారు శివన్న. పుష్ప విలన్ డాలి ధనంజయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైశాక్ జె ఫిలింస్ బ్యానర్పై డాక్టర్ వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. Presenting My Look from #666OperationDreamTheatre @Dhananjayaka @hemanthrao11 @Vaishak_J_Films @charanrajmr2701 @AdvaithaAmbara #VishwasKashyap @The_BigLittle @PROharisarasu#666ODT pic.twitter.com/noeA0cwrFh— DrShivaRajkumar (@NimmaShivanna) July 9, 2025 చదవండి: 2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ -
2025లో టాప్ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.ఫస్టాఫ్లో టాప్ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్ 5లో ఏమున్నాయ్?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్ నుంచి 3 సినిమాలుబాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్లో పని చేశా.. 10th ఫెయిలైనా.. -
దసరా విలన్ కొత్త మూవీ.. పోలీస్ స్టేషన్లో పిల్లలకు పాఠాలు చెప్తే!
కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్. మలయాళం నుంచి వస్తున్న తాజా హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం". దసరా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా నటిస్తున్నాడు. విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. "పోలీస్ స్టేషన్కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే ఒక గొప్ప విప్లవాత్మకమైన ఆలోచనకు.. కాస్త వినోదం జోడించి రూపొందినన చిత్రం "సూత్రవాక్యం". ఇంత గొప్ప కంటెంట్ కలిగిన "సూత్రవాక్యం" చిత్రాన్ని నిర్మించే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది" అంటున్నారు "సినిమా బండి" ఫేమ్ కాండ్రేగుల లావణ్యాదేవి - కాండ్రేగుల శ్రీకాంత్!!ఈ మూవీ మలయాళ వర్షన్ ఈనెల 11న విడుదలవుతోంది. "జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్" సంస్థ "సూత్రవాక్యం" పేరుతోనే తెలుగులో ఈ నెలాఖరున విడుదల చేయనుంది. రెజిన్ ఎస్.బాబు స్క్రీన్ ప్లే సమకూర్చగా శ్రీరామ్ చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ, జీన్ పి.జాన్సన్ సంగీతం, నితిన్ కె.టి.ఆర్ ఎడిటింగ్ చేశారు. కోవిడ్ సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్లో... యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో "సూత్రవాక్యం" తెరకెక్కడం గమనార్హం. భారతదేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో "సూత్రవాక్యం" విడుదల కానుంది. చదవండి: నేను చాలా సెల్ఫిష్.. ప్రజల కోసం జీవితం త్యాగం చేయలేను: కంగనా -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. ఆ పార్టీలో చేరనుందా?
సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్ నటుడు విజయ్కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
హీరోయిన్తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్
‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు, కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్ కార్డు పడింది.సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు. ‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది. విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు. -
జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్ డాగ్తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది. కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
'హృదయ విదారకం.. నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది'.. కమల్ హాసన్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కడలూరు ప్రమాదంపై స్పందించారు. ఇవాళ తమిళనాడులో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ ఘటనకు కారణం ఎవరైనా ఇది క్షమించరానిది అని ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ కోరారు.కమల్ హాసన్ తన ట్వీట్లో రాస్తూ..' ఇది చాలా హృదయ విదారక వార్త. కడలూరు-సెమ్మంగుప్పం రైల్వే లైన్లో పాఠశాలకు వెళ్తున్న పిల్లల బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి. తమ పిల్లలను కోల్పోయినందుకు బాధపడుతున్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా' అంటూ సంతాపం తెలియజేశారు.కాగా.. ఇవాళ ఉదయం తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్ వ్యాన్ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే.. గేట్మేన్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్మేన్ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్మేన్ పంకజ్శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. இதயத்தைப் பதைக்க வைக்கும் செய்தி. கடலூர் செம்மங்குப்பம் ரயில் பாதையில் பள்ளிக்குச் சென்ற ஒன்றுமறியா இளங்குருத்துகள் ரயில் மோதி இறந்ததை ஒப்பவே மனம் மறுக்கிறது. எவரின் அலட்சியமாக இருந்தாலும் இது மன்னிக்கத் தகுந்ததே அல்ல.ஏற்றுக்கொள்ளவே முடியாத துக்கம் நிகழ்ந்திருக்கிறது. இனியும்…— Kamal Haasan (@ikamalhaasan) July 8, 2025 -
కొత్త ఏడాదిలో రెండు హిట్స్.. మరో సినిమా ప్రకటించిన మోహన్ లాల్
ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మలయాళ స్టార్ మోహన్ లాల్. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తుడురుమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభన కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సైతం ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇటీవలే విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు.తాజాగా మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నా నెక్ట్స్ మూవీని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ ఆసక్తికర కొత్త అధ్యాయంలో భాగమైనందుకు గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ఎల్365 అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు.With immense joy, I announce my next film.Directed by Austin Dan Thomas,Written by Retheesh Ravi,And produced by Ashiq Usman under the banner of Ashiq Usman Productions.Grateful to be part of this exciting new chapter.#L365#AustinDanThomas#RetheeshRavi#AashiqUsman… pic.twitter.com/F3MGb1xeRG— Mohanlal (@Mohanlal) July 8, 2025 -
శ్రుతీహాసన్ షాకింగ్ నిర్ణయం.. ఇన్స్టా పోస్ట్ వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్(Shruti Haasan) ఒకరు. సినిమా అప్డేట్స్తో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచు ఫోటోషూట్ చేసి వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ని అలరిస్తుంది. ఇన్స్టాలో ఆమెకు 24 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె నెట్టింట ఎంత యాక్టివ్గా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని తన ఫాలోవర్స్కి తెలియజేస్తూ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఈ అమ్మడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే. తన అకౌంట్ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. శ్రుతీహాసన్ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
మొన్న శృతిహాసన్.. నేడు మార్కో హీరో.. సోషల్ మీడియా హ్యాక్!
ఇటీవల ఎక్కువగా సినీతారల సోషల్ మీడియా ఖాతాలే టార్గెట్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శృతిహాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్ గురైంది. ఆమె ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంభందించిన లింక్స్ దర్శనమిచ్చాయి. అయితే తాజాగా మరో హీరో సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ గురైంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని అభిమానులను హెచ్చరించారు. ఏదైనా సందేశాలు వస్తే వాటికి రెస్పాండ్ కావొద్దని ఫ్యాన్స్కు సూచించారు. ప్రస్తుతం దీనిపై తన టీమ్ సభ్యులు పని చేస్తున్నారని.. అకౌంట్ రికవరీ అయ్యాక తానే అప్డేట్ ఇస్తానని అభిమానులకు అలర్ట్ చేశారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలియజేశారు.మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్ వయొలెంట్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉందని కొందరు విమర్శలు కూడా చేశారు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్గా కూడా ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ అలాంటిదేం లేదని ఇటీవలే కొట్టపారేశారు. -
ఆమె సినిమాల్లోకి ఎంట్రీ.. అప్పటికీ నువ్వింక పుట్టనేలేదు.. రష్మికపై నెటిజన్స్ ట్రోల్స్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ వారికి కోపం తెప్పిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మికపై మండిపడుతున్నారు. మీ అజ్ఞానాన్ని అందరిపై రుద్దొద్దని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అసలు రష్మిక చేసిన కామెంట్స్ ఏంటి? ఎందుకింతలా వ్యతిరేకత వస్తుందో? మీరు కూడా చూసేయండి.నేను ఫస్ట్ అంటూ కామెంట్స్..ఇటీవల రష్మిక మందన్నా.. కూర్గ్ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలే రష్మికను టార్గెట్ చేసేలే చేశాయి. ఆమె కామెంట్స్పై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. ఎందుకంటే ఆమె కంటే ముందు పలువురు నటీనటులు కూర్గ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. మీ కంటే ముందుగానే 1990ల్లోనే నెరవంద ప్రేమ కూర్గ్ నుంచి వచ్చారని చురకలంటించారు. అంతేకాకుండా నీ కంటే ముందు నుంచే గుల్షన్ దేవయ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారని గుర్తు చేశారు.రష్మిక చేసిన కామెంట్స్పై నటి ప్రేమ కూడా స్పందించింది. ఈ విషయంలో నేను ఏమి చెప్పగలను? కొడవ సమాజానికి నిజమేంటో తెలుసు.. ఆమె వర్షన్ గురించి తననే అడగాలని సూచించింది. కొడవ నటులు రష్మిక మందన్నకు మార్గం సుగమం చేశారని ప్రేమ వెల్లడించారు.ప్రేమ మాట్లాడుతూ..' రష్మిక సినిమాల్లోకి రాకముందే ఇతరులు ఆమెకు మార్గం సుగమం చేశారు. నా కంటే ముందు కూర్గ్కు చెందిన శశికళ అనే నటి సహాయక పాత్రలు పోషించింది. అప్పుడే నేను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించా. ఆ తరువాత చాలా మంది కొడవ వాళ్లు బాగా రాణించారు.' అని అన్నారు. కాగా.. ప్రేమ 1990ల్లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. తన నటనకు గానూ కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.రష్మికపై నెటిజన్ల ట్రోల్స్..రష్మిక కామెంట్స్పై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రోల్స్ వచ్చాయి. ఆమె కంటే ముందే ప్రేమ, నిధి సుబ్బాయ్య, హరిషిక పూనాచా, తనీషా కుప్పందా లాంటి వాళ్లు సినిమాల్లో నటించారని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కూర్గ్ నుంచి వచ్చిన మొదటి నటినని చెప్పడం వందశాతం తప్పు.. ఎందుకంటే రష్మిక రాకముందే 5 నుంచి 6 మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ప్రేమ మేడమ్ ఓం అనే కన్నడ సినిమాలో నటించినప్పుడు రష్మిక అస్సలు పుట్టలేదని మరో నెటిజన్ రాశారు. రష్మిక బహుశా నీకు నువ్వే గొప్ప అనుకోవచ్చు.. కానీ గుల్షన్ దేవయ్య కూడా గొప్పగా నటించాడనే విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు అంటూ ప్రశ్నించాడు. -
నాలుగో భార్య వచ్చిన వేళావిశేషం.. లాటరీ గెలిచిన నటుడు
తమిళ నటుడు బాల (బాలకుమార్).. గతేడాది నాలుగో పెళ్లి చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడుముళ్లు వేశాడు. వీరిద్దరి మధ్య 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా.. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ఈ దంపతులు గుడ్న్యూస్ చెప్పారు. మొట్టమొదటిసారి ఓ లాటరీ గెలిచినట్లు వెల్లడించారు.మా అదృష్టం.. మొదటిసారి లాటరీ గెలిచాం. ఇదంతా ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. లాటరీ ద్వారా రూ.25 వేల ప్రైజ్మనీ లభించింది అని బాలా (Actor Bala) సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ డబ్బును ఏదైనా మంచిపని కోసం ఉపయోగించమని చెప్తూ భార్య చేతికి ఆ డబ్బు అందించాడు.వైవాహిక జీవితంతమిళ నటుడు బాలా మలయాళంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో టూమచ్, చాప్టర్ 6 సినిమాలు చేశాడు. బాలా వైవాహిక జీవితం విషయానికి వస్తే.. ఇతడు 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్ అమృతా సురేశ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. ఈ జంట కూడా ఎంతోకాలసం కలిసుండలేదు. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్ ఎలిజబెత్ ఉదయన్ను పెళ్లాడగా ఆమెతోనూ విడిపోయాడు. గతేడాది అక్టోబర్లో కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Filmactor Bala (@actorbala) చదవండి: ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజేంటి?! -
ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఎక్కడ?
ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు అపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు ఏడాదికి ఆరేడు సినిమాలు ఈజీగా చేసేవారు. తర్వాతి తరం హీరోలు కూడా మొదట్లో అదే ఫాలో అయ్యారు. నెమ్మదిగా ఇప్పుడా సంఖ్య ఒకటీరెండుకు వచ్చేసింది. ఈ తరం హీరోలైతే ఏకంగా ఏడాదికో, లేక రెండుమూడేళ్లకో ఒక సినిమా చేస్తున్నారు.ఒక్క హీరోయిన్తో 130 చిత్రాలుఅప్పట్లో మలయాళ స్టార్ హీరో ప్రేమ్ నజీర్ (Prem Nazir) ఏడాదికి ఒకటీరెండు కాదు ఏకంగా 30 సినిమాలు చేసేవారు. ఆ లెక్కన ఆయన ఏడువందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు. తన కెరీర్లో దాదాపు 80 మంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. అందులోనూ ఓ హీరోయిన్(షీల)తో ఏకంగా 130 సినిమాలు చేయడం విశేషం! ఈయన తెలుగులో ఆకలి, తండ్రి చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలిగిన నజీర్ 1989లో కన్నుమూశారు. సినిమా ఛాన్స్ కోసం కన్నీళ్లుఅయితే నజీర్ చివరి రోజుల్లో అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్నారని నటుడు టిని టామ్ వ్యాఖ్యానించాడు. ఛాన్సులిప్పించమని అడూర్ భసి, బహదూర్ వంటి నటుల ఇళ్లకు వెళ్లి కన్నీళ్లతో వేడుకునేవారని ఆయన పేర్కొన్నాడు. ఈ కామెంట్స్పై సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి మండిపడింది. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. 1985 వరకు మేమందరం నజీర్తో కలిసి పని చేసినవాళ్లమే! ఆయన జీవితాన్ని దగ్గరి నుంచి చూసిన మా అందరికీ టినీ కామెంట్స్ బాధ కలిగించాయి. చివరి రోజుల్లో..ప్రేమ్ నజీర్ చనిపోవడానికి ముందు కూడా ఆయన్ను కలిశాను. తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రశాంత జీవనం గడిపాడు. తనకు సినిమా అవకాశాలు వచ్చినా సరే.. వేరొకరికి ఇవ్వమని సూచించేవాడు. అలాంటిది చివరి రోజుల్లో అవకాశాల్లేక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పడం కరెక్ట్ కాదు. నజీర్ బతికున్నప్పుడు టిని ఇంకా సినిమాల్లోకే రాలేదు. వాళ్లూవీళ్లు అనుకునే మాటలను నిజమని నమ్మి ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదు. ఎవరినీ అడుక్కోలేదుయూట్యూబ్లో వ్యూస్ కోసం దివంగత నటుల గురించి లేనిపోని కథలు అల్లేస్తున్నారు. కనీసం ఇండస్ట్రీలో ఉన్నవారైనా వారి గురించి నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రేమ్ నజీర్ సినిమా ఛాన్సుల కోసం ఎప్పుడూ ఏడవలేదు. ఎవరినీ అడుక్కోలేదు. అలాంటి గొప్ప మనిషి గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి అని ఘాటుగానే స్పందించింది.క్షమించండిదీంతో నజీర్ గురించి అలా మాట్లాడినందుకు టిని టామ్ ఫేస్బుక్ వేదికగా క్షమాపణలు తెలిపాడు. నజీర్ సర్ను అభిమానించేవారిలో నేనొకరిని. ఆయన స్థానమెక్కడ? నేనెక్కడ? తనను ఒక్కసారి కూడా కలవనేలేదు. ఆయన గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తిని కాదు. తన ఇమేజ్ను చెడగొట్టాలన్న దురుద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తి చెప్పినదాన్ని మీతో పంచుకున్నానంతే.. అయినప్పటికీ నావల్ల పొరపాటు జరిగింది కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నాడు.చదవండి: 11 ఏళ్ల వయసులో స్కూల్ నుంచి పారిపోయిన కాజోల్ -
క్లబ్లో పెంపుడు శునకం బర్త్డే సెలబ్రేట్ చేసిన హీరోయిన్
సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) తన పెంపుడు శునకం బర్త్డేను సెలబ్రేట్ చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న జాన్ స్నో నేడు (జూలై 6న) ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దీంతో స్నో పుట్టినరోజును పెట్ క్లబ్లో జరిపింది. కుక్కను ముద్దుగా ముస్తాబు చేసి దానికి బదులుగా తనే కేక్ కట్ చేసింది. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బర్త్డే వేడుకలకు వచ్చిన అతిథులు కూడా శునకాలే కావడం విశేషం.సినిమాతడాఖా, చంద్రకళ (అరణ్మనై), అంతఃపురం (అరణ్మనై 3), డిటెక్టివ్, మాస్టర్, సైంధవ్, వడ చెన్నై, తుపాకి, యుగానికి ఒక్కడు వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, మాస్క్, మానుషి సినిమాలు చేస్తోంది. తాప్సీ, అమీ జాక్సన్, రెజీనా కసాండ్రా వంటి పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. గిలిగిలిగా (దేశముదురు), జరజర.. (రాఖీ), దీవాళీ దీపానీ (దడ), ఓయ్ ఓయ్ ఓయ్ (ఎవడు) వంటి పలు సాంగ్స్ ఆలపించింది. View this post on Instagram A post shared by The name’s Snow. Jon Snow 🐶 (@jonsnow.bichon) చదవండి: బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో.. -
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్ (Dhurandhar Movie). సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్వీర్ బర్త్డే సందర్భంగా దురంధర్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాస్ అవతార్లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా..ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురే సారా. సౌత్లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో మెరిసింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్చైల్డ్ ఆర్టిస్ట్గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్వీర్తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి -
'మరాఠీ మాట్లాడను, దమ్ముంటే మహారాష్ట్ర నుంచి నన్ను వెళ్లగొట్టండి'
మరాఠీలో మాట్లాడనందుకు ఓ స్వీట్ షాప్ యజమానిని కొట్టిన ఘటన కలకలం రేపింది. అయితే తాను కూడా మరాఠీ మాట్లాడనని, దమ్ముంటే తనను మహారాష్ట్ర నుంచి తరిమేయండి అని సవాల్ విసిరారు భోజ్పురి నటుడు, బీజేపీ ఎంపీ దినేశ్ లాల్ యాదవ్ (Dinesh Lal Yadav). ఈయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హమర్ నామ్ బా కన్హయ్య.చెత్త రాజకీయాలుఈ సినిమా ప్రమోషన్స్లో దినేశ్ యాదవ్ మాట్లాడుతూ.. మరాఠీ మాట్లాడలేదని దాడి చేస్తారా? ఇవన్నీ చెత్త రాజకీయాలు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసేవారు అలాంటివాటికి దూరంగా ఉంటే బాగుంటుంది. మీకంత దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టండి చూద్దాం.. నేను మరాఠీ మాట్లాడను. రాజకీయ నాయకులందరికీ నేను సవాల్ విసురుతున్నా.. నేను ఇక్కడే ఉంటాను. దమ్ముంటే నన్ను మహారాష్ట్ర నుంచి తరిమేయండి.నేర్చుకోకపోతే తప్పేం కాదునేను కూడా రాజకీయ నాయకుడినే.. పాలిటిక్స్ అనేవి.. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప వారిని దగా చేయడానికి కాదు. ఎవరికైనా పలు భాషలు నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకుంటారు. మరాఠీ అందమైన భాష.. భోజ్పురి, తెలుగు, తమిళం, గుజరాతీ.. ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవచ్చు. అలాగే ఎవరూ నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు. అంతేకానీ, ఫలానా భాష ఎందుకు నేర్చుకోలేదని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. దినేశ్ లాల్ యాదవ్ను నిరాహువా అని కూడా పిలుస్తుంటారు. భోజ్పురిలో అనేక సినిమాలు చేసిన ఈయన హిందీ బిగ్బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొన్నారు.చదవండి: కలిసిపోయిన తెలుగు హీరోల ఫ్యాన్స్.. ఆ కన్నడ హీరోపై ట్రోలింగ్ -
కలిసిపోయిన తెలుగు హీరోల ఫ్యాన్స్.. ఆ కన్నడ హీరోపై ట్రోలింగ్
టాలీవుడ్ (Tollywood)లో ఫ్యాన్ వార్స్ ఎప్పుడూ ఉండేవే! మా హీరో తోపు, తురుము అని కొందరు.. మా హీరో గ్రేటెహె.. ఆయన కొట్టిన రికార్డులు మీ హీరోకెక్కడివి? అని మరికొందరు ఆయా కథానాయకులను వెక్కిరించడం, హేళన చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తీసుకుని ఎన్నో ఏళ్ల నుంచి వైరం ఉన్నట్లు దూషించుకుంటూనే ఉంటారు. అయితే ఆశ్చర్యంగా తెలుగు హీరోల అభిమానులంతా ఒక్కటయ్యారు.ఒక్క ఘటనతో దర్శన్పై నెగెటివిటీఎప్పుడూ గొడవపడే వీళ్లు ఈసారి వార్ ఆపేసి కలిసిపోయారు. అంతా కలిసి వేరే ఇండస్ట్రీకి చెందిన హీరో అభిమానులతో గొడవకు దిగారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు? శాండల్వుడ్ స్టార్ దర్శన్ (Darshan). ప్రియురాలిపై నీచమైన కామెంట్లు చేశాడని అభిమానినే హత్య చేసి జైలుకు వెళ్లొచ్చాడు కన్నడ హీరో దర్శన్. ఈ హత్య కేసు వల్ల దర్శన్పై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. కానీ, అతడి అభిమానులు మాత్రం అప్పటికీ, ఇప్పటికీ దర్శన్ను వెనకేసుకొస్తూనే ఉన్నారు.ఈ ఎలివేషన్స్ అవసరమా?తనేం చేసినా ఒప్పని చెప్తున్నారు. దర్శన్ మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండటంతో కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది చూసిన తెలుగువారు.. మర్డర్ చేసిన వ్యక్తికి ఎందుకీ ఎలివేషన్స్? ఇంకా ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నారు? అంటూ విమర్శించారు. అది దర్శన్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. అంతే, తెలుగు హీరోలను టార్గెట్ చేస్తూ ఇక్కడి అభిమానులపై బూతులతో చెలరేగిపోయారు.ఏకమైన టాలీవుడ్మనవాళ్లు ఊరుకుంటారా? నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం.. అన్నట్లుగా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాసేపు టాలీవుడ్ ఫ్యాన్ వార్స్ పక్కనపెట్టి అంతా ఏకమై దర్శన్ను, అతడి అభిమానులను ఏకిపారేస్తున్నారు. #KFIcriminalDarshan అంటూ రకరకాల హ్యాష్ట్యాగ్లతో నేషనల్ లెవల్లో ఈ గొడవను హైలైట్ చేస్తున్నారు. Picha kottudu kodutunnaru ga 👌🔥#KFIcriminalDarshan pic.twitter.com/6ZTtw4XXHf— Saha Devudu 🪐 (@SahaDevudu_) July 6, 2025Just repost #KFIcriminalDarshan 7k tweets speed penchandi pic.twitter.com/lxcg6Eyhy2— KALION⚰️🧡❤️🔥🛐 (@Rushinaidu11) July 6, 2025Can I get 500 Retweets and 200 comments with #KFIcriminalDarshan tag 😎 TFI yuvatha possible aah ???? #KFIcriminalDarshanpic.twitter.com/dCQ1mIbivE— Rebal Relangi (@RebalRelang) July 6, 2025 చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి -
కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)ను చూసి మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju). విజయ్ను ఇక్కడి హీరోలు ఫాలో అయిపోతే నిర్మాతలకు చాలా ఖర్చు తగ్గుతుందని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్గారు చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్. తను పక్కాగా కొన్ని డేట్స్ ఇచ్చి.. అందులోనే సినిమా పూర్తి చేయాలని చెప్తాడు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? ఎప్పటివరకు పూర్తి చేస్తారు? అని ముందే అడిగి తెలుసుకుంటాడు.ప్రతి హీరో పాటిస్తే..నెలలో 20 రోజులు షూటింగ్కు కేటాయించేవాడు. అలా ఆరు నెలలపాటు డేట్స్ ఇచ్చాడు. వారసుడు సినిమాకుగానూ నాకు 120 రోజులు డేట్స్ ఇచ్చాడు. అందులోనే సినిమా కంప్లీట్ చేశాం. ఈ రూల్ ప్రతి హీరో పాటిస్తే నిర్మాతకు అది సువర్ణావకాశం అవుతుంది. ప్రతి హీరో ఆరునెలల్లో ఎన్ని రోజులు డేట్స్ ఇస్తారో ముందే నిర్ణయించుకుని, అందులోనే మూవీ పూర్తి చేసుకోవాలని చెప్పేస్తే అందరిపై ఒత్తిడి ఉంటుంది. సమయానికి సినిమా అయిపోవాలని నిర్మాత, టెక్నీషియన్స్, దర్శకుడు.. ఇలా అందరూ ఎక్కువ కష్టపడతారు. ప్రీ ప్రొడక్షన్కు ఎక్కువ సమయం తీసుకుని ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, ఈ విధానం మన దగ్గర పూర్తిగా కనుమరుగైపోయింది.ఖర్చులు తడిసిమోపెడుఆ సిస్టమ్ను మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. నాతో కలిసి వర్క్ చేయబోయే హీరోలను కూర్చోబెట్టుకుని డేట్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోమంటున్నాను. ప్రతి నెలలో 20 రోజులు నాకు ఇచ్చేయమని చెప్తున్నాను. విజయ్, నితిన్లకు అదే చెప్పాను. లేదంటే ఏడాదిలో తీయాల్సిన మూవీ రెండేళ్లలో పూర్తయ్యేసరికి ఖర్చులు రెట్టింపవుతున్నాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు, ప్రొడక్షన్ టీమ్కు ఇచ్చే జీతాలు.. ఇలా అన్నీ తడిసిమోపెడవుతున్నాయి. ఈ పద్ధతి మారాలంటే అది హీరోల చేతిలోనే ఉంది. వారు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగువాళ్లు అస్సలు తగ్గేదేలే.. పుష్ప డైలాగ్స్తో అదరగొట్టిన బన్నీ -
వెండితెరపై ఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సురేష్ రైనా క్రికెట్ నేపథ్యంలో రానున్న ఈ తమిళ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేయనున్నారు. డ్రీమ్ నైట్ స్టోరీస్ బ్యానర్పై శ్రవణ కుమార్ ఈ సినిమా నిర్మించనున్నారు. చెన్నైలో జరిగిన వేడుకలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. క్రికెటర్ శివమ్ దూబే నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సురేష్ రైనా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘‘క్రికెట్ మైదానం నుంచి కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న సురేష్ రైనా వర్చ్యువల్గా ఈ ఈవెంట్లోపాల్గొని, తన సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కుప్రాతినిధ్యం వహించిన రైనా చిన్న తల (చిన్న నాయకుడు)గా తమిళనాడులో విశేష అభిమానులను సంపాదించుకున్నారు. -
పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) బాక్సాఫీస్ క్వీన్గా మారిపోయింది. తను ఏ సినిమా పట్టుకున్నా అది బ్లాక్బస్టరే అవుతోంది. ఇటీవల వచ్చిన కుబేర మూవీ కూడా ఈజీగా వంద కోట్లు దాటేసింది. కర్ణాటకలోని కూర్గ్లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె నేడు దేశంలోనే టాప్ హీరోయిన్స్లో ఒకరిగా పేరు సంపాదించింది.నేనే మొదటి నటి..అయితే అప్పుడప్పుడూ ఆమె నోరు జారి విమర్శలపాలవుతూ ఉంటుంది. ఆ మధ్య రష్మిక.. కూర్గ్ జిల్లాలోని కొడవ జాతి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఏకైక నటిని అని తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎందుకంటే తనకన్నా ముందు పలువురు నటీనటులు కూర్గ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చారు.నోరు జారింది.. వదిలేయండికొడవ జాతికి చెందిన హర్షిక పూనాచ (Harshika Poonacha) వారిలో ఒకరు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రష్మిక పొరపాటున నోరు జారి ఉంటుంది. తనను క్షమించేయండి. కానీ బాలీవుడ్లో అడుగుపెట్టిన మొదటి కొడవ నటి తనే అన్నది మాత్రం నిజం కాదు. కొడవ జాతికి చెందిన గుల్షన్ దేవయ్య చాలా ఏళ్లుగా బాలీవుడ్లో నటుడిగా పని చేస్తున్నాడు. అయితే టాలీవుడ్లో, బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న రష్మికను చూసి మా కొడవ జాతి అంతా సంతోషిస్తున్నాం. కిందకు లాగకండితన సక్సెస్, ఫేమ్ చూస్తుంటే సంతోషంగా ఉంది. స్త్రీలు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మా తెగలో చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రస్తుతం రష్మిక మంచి స్థానంలో ఉంది. తనను కిందకు లాగకండి. వీలైతే మరింత ప్రోత్సహించండి అని పేర్కొంది. హర్షిక పూనాచ.. తెలుగులో ఏడుకొండలవాడా వెంకటరమణా అందరూ బాగుండాలి, అప్పుడలా ఇప్పుడిలా సినిమాలు చేసింది. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో నటిగా రాణిస్తోంది.చదవండి: సుడిగాలి సుధీర్పై కోపం? అనిల్ రావిపూడి ఏమన్నారంటే? -
సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సురేశ్ రైనా.. ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. సినిమా నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రైనా స్వయంగా వెల్లడించాడు. తాను కోలీవుడ్లో నటించనున్నట్లు తెలిపాడు.ఇందుకు సంబంధించి తమిళ సినిమా నిర్మాణ సంస్థ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో రైనాకు స్వాగతం పలుకుతున్న వీడియోను క్రికెటర్ శివం దూబే చేతుల మీదుగా విడుదల చేశారు.క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా..ఈ నేపథ్యంలో సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘‘క్రికెట్ మైదానం నుంచి.. కోలీవుడ్ ఫ్రేమ్స్ దాకా.. చెన్నై నాలో నిండి నన్ను ముందుకు నడిపిస్తోంది. నా ఈ కొత్త ప్రయాణంలో డీకేఎస్ సంస్థతో జట్టుకట్టడం ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన సురేశ్ రైనా.. 2005 నుంచి 2018 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అంతర్జాతీయ స్థాయిలో 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఆడిన రైనా.. ఆయా ఫార్మాట్లలో 5615, 1604, 768 పరుగులు సాధించాడు. ఇక ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్లో మొత్తంగా 205 మ్యాచ్లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించి మిస్టర్ ఐపీఎల్గా గుర్తింపు పొందాడు.చిన్న తలాగా అభిమానుల హృదయాల్లో చోటుఇక ఐపీఎల్ కెరీర్లో చాలా ఏళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సురేశ్ రైనా.. చిన్న తలాగా గుర్తింపు పొందాడు. మహేంద్ర సింగ్ ధోని తర్వాత అంతటి స్థాయిలో చెన్నై అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడి నుంచే తన సినీ ప్రయాణం కూడా మొదలుపెట్టనున్నాడు.సంతోషంగా ఉందితాను తమిళ సినిమా ద్వారా అరంగేట్రం చేయడం గురించి సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినపుడు అది నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపించింది. క్రికెట్కు సంబంధించిన ఈ సినిమాలో నటించడం గర్వకారణం.అది కూడా ఎన్నో ఏళ్లుగా సీఎస్కేకు ఆడి.. తమిళనాడు నుంచి నా సినిమా ప్రయాణం మొదలుపెట్టడం మరింత సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను కురిపించారు’’ అని పేర్కొన్నాడు. కాగా సురేశ్ రైనా నటిస్తున్న తమిళ చిత్రానికి లోగాన్ దర్శకుడు కాగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా మరో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కోలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా.. కేరళకు చెందిన మాజీ పేసర్ శ్రీశాంత్ కూడా తమిళ సినీ రంగంలో నటుడిగా అడుగుపెట్టాడు. నయనతార, సమంతలతో కలిసి విజయ్ సేతుపతి నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమాలో శ్రీశాంత్ మోబీ అనే పాత్రలో నటించాడు.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ శాంసన్ -
పుష్ప-2 రేంజ్లో మాస్ సాంగ్.. మరోసారి వైరల్ అవుతోన్న శ్రీలీల!
గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా నటిస్తోన్న చిత్రం జూనియర్. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల కనిపించనుంది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో వరుస అప్డేట్స్తో మేకర్స్ అలరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జూనియర్ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. వైరల్ వయ్యారి అంటూ సాగే మాస్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటలో శ్రీలీల మరోసారి తనదైన డ్యాన్స్తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. పుష్ప-2లో ఐటమ్ సాంగ్ రేంజ్లో శ్రీలీల అలరించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన పాట మాస్ ఆడియన్స్ను ఊపేస్తోంది. కాగా.. ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాయగా.. హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. -
ఓటీటీకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ.. ఓకేసారి నాలుగింటిలో స్ట్రీమింగ్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మద్రాస్ మ్యాట్నీ. ఈ సినిమాకు కార్తికేయన్ మణి దర్శకత్వం వహించారు. జూన్ 6న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ సమర్పణలో మెడ్రాస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.ఎలాంటి ప్రకటన లేకుండానే ఏకంగా నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జూలై 4 తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్తో పాటు సన్ నెక్స్ట్, టెంట్కొట్టా, సింప్లీ సౌత్ ఫ్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది ఈ సినిమా. మద్రాస్ మ్యాట్నీ చిత్రంలో మిడిల్ క్లాస్ లైఫ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ కథను యథార్థంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రానికి బాలా సారంగన్ సంగీతం అందించారు. Recent Tamil Feel Good Movie ❤️✨ #MadrasMatinee streaming from Tonight on PrimeVideo, Tentkotta, Sunnxt & SimplySouth 🍿!!@kaaliactor @keyanmk@Roshni_offl @gk_anand@cinemapayyan#OTT_Trackers pic.twitter.com/TlyWKLW4Xv— OTT Trackers (@OTT_Trackers) July 3, 2025 -
‘జాలిరెడ్డి’ కొత్త సినిమా.. లుక్ అదిరిందిగా..
సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్ రావు, తాజాగా "666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్" అనే టైటిల్తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో జాలిరెడ్డి పాత్రలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ హీరోగా నటిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2 చిత్రాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ లో నటించారు.విజే ఫిలిమ్స్ బ్యానర్ పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ 2, పెద్ది చిత్రాల్లో నటిస్తోన్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ''666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'' చిత్రం కన్నడ తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది. -
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
కుమారుడితో హీరోయిన్ అమలాపాల్ పోజులు..కలర్ఫుల్ శారీలో అనసూయ అదిరిపోయే లుక్స్..మొబైల్తో బిజీ బిజీగా సురేఖవాణి కూతురు సుప్రీత..బ్లాక్ బ్యూటీలా బిగ్బాస్ ముద్దుగుమ్మ విష్ణు ప్రియ.. View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
వైరల్ ఎలా అవ్వాలంటోన్న శ్రీలీల.. అసలు విషయం ఏంటంటే?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఏడాది నితిన్ సరసన రాబిన్హుడ్లో మెప్పించిన భామ.. ప్రస్తుతం మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం జూనియర్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈనెల 4న వైరల్ వయ్యారి అంటూ సాగే పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలీల, దేవీశ్రీ ప్రసాద్ చేసిన ప్రమోషన్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియో మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీకి కాల్ చేసిన శ్రీలీల.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మీ రీల్సే కనిపిస్తున్నాయి.. మీలా వైరల్ ఎలా అవ్వాలో నేర్పిస్తారా అని అడిగింది. ఏంటీ వైరల్ ఎలా అవ్వాలో మీకు నేర్పాలా?కామెడీ వద్దమ్మా? మీరే నాకు నేర్పాలని దేవీశ్రీ అన్నారు. నిజమే కదా.. మీరు వయ్యారంగా ఓ మాస్ స్టెప్ వేస్తే అదే వైరలైపోద్ది అని చెప్పాడు. అదేదో మీరే ఇవ్వండి సార్ అని శ్రీలీల ముద్దుగా అడగడంతో.. వైరల్ వయ్యారి అంటే ఎలా ఉంది సాంగ్ అంటూ దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ఇదంతా వైరల్ వయ్యారి పాట కోసమే వీరిలా వైరైటీ ప్రమోషన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. వారాహి చిత్రం బ్యానర్పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.#Junior second single #ViralVayyari out on July 4thIn cinemas July 18th. @sreeleela14 @ThisIsDSP pic.twitter.com/TDAbv8w5Rz— ScreenTimeGuru (@ScreenTimeGuru) July 1, 2025 -
రజినీకాంత్ కూలీ చిత్రం.. అమిర్ ఖాన్ పాత్రపై అఫీషియల్ ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు.అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు అమిర్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో దహా అనే పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలైన అమిర్ ఖాన్ లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కూలీ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe— Sun Pictures (@sunpictures) July 3, 2025 -
మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్ల్యాండ్లో ఫిట్నెస్ క్యాంప్నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఓటీటీలో థగ్లైఫ్ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్గా నెట్ఫ్లిక్స్లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.వివాదాలుథగ్ లైఫ్ రిలీజ్కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.కానీ అప్పటికే థగ్లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్ఫ్లిక్స్లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్లైఫ్ నిర్మాత కమల్ హాసన్పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది. Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025 చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
ఓటీటీకి వచ్చేస్తోన్న హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో మలయాళ చిత్రాలకు పుల్ డిమాండ్ ఉంటోంది. గతంలో వచ్చిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో ఆడియన్స్ను ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో నుంచి వచ్చే చిత్రాల్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కావడంతో ఓటీటీల్లో సత్తా చాటుతున్నాయి. తాజాగా మరో మలయాళ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.టొవినో థామస్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ నరివెట్ట స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 11 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్రైలర్ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ సినిమాలో టొవినో థామస్ పోలీస్ కానిస్టేబుల్గా నటించగా.. సూరజ్ వెంజరమూడు, చేరన్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ మూవీకి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మే 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా.. తెలుగులోనూ మే 30న రిలీజైంది.Echoes of truth, shadows of injustice!Watch Narivetta from July 11 only on SonyLIV#NarivettaOnSonyLIV@ttovino #SurajVenjaramoodu #Cheran #AnurajManohar #AryaSalim #JakesBijoy pic.twitter.com/lon0ikr836— Sony LIV (@SonyLIV) July 2, 2025 -
నటుడితో సంబంధం అంటగట్టారు.. సెట్లో ఏడ్చేశా.. హీరో విజయ్..: వనిత
చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు వనిత (Vanitha Vijayakumar). తల్లిదండ్రులు మంజుల- విజయ్ కుమార్ల నుంచి నటనను పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసింది. తెలుగులో దేవి చిత్రంలో నటించారు. ఆ మధ్య వచ్చిన మళ్లీ పెళ్లి మూవీలోనూ యాక్ట్ చేశారు. ప్రస్తుతం మిసెస్ అండ్ మిస్టర్ మూవీ చేస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకురాలిగానూ బాధ్యతలు చేపట్టింది.సెట్లో ఏడ్చేశా..ఈ మూవీతో వనిత కూతురు జోవిక నిర్మాతగా పరిచయం కానుంది. జూలై 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో వనితా విజయ్కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. చంద్రలేఖ సినిమాతో హీరోయిన్గా నా ప్రయాణం మొదలైంది. ఇందులో విజయ్ (Vijay) హీరో. ఆ సినిమా చేస్తున్నప్పుడు నా వయసు దాదాపు 15 ఏళ్లుంటాయనుకుంటా.. 40 ఏళ్ల వయసున్న రాజ్కిరణ్తో నాకు ముడిపెట్టి చేసి వార్తలు రాశారు. అవి చూసి తట్టుకోలేకపోయాను. సెట్లోనే ఏడ్చేశాను.మొదట పలకరించలేదుఅప్పుడు విజయ్ నన్ను చూసి పలకరించకుండానే వెళ్లిపోయాడు. తర్వాత కొంతసేపటికి వచ్చి అసలేమైందని అడిగాడు. నేనుం ఏం కాలేదని చెప్పాను. పర్వాలేదు, ఏం జరిగిందో చెప్పు అనేసరికి నా బాధనంతా వెళ్లగక్కాను. ఓ నటుడితో నాకు రిలేషన్ అంటగడుతున్నారని, అందుకు బాధగా ఉందని చెప్పాను. అప్పుడు విజయ్.. నీ గురించి వాళ్లు ఏదీ రాయకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నా లేనట్లే! నీ గురించి ఏదో ఒకటి రాస్తున్నారంటే నువ్వు ఫేమస్ అయ్యావని అర్థం. ఓదార్చాడుఈ విమర్శలు, పుకార్ల గురించి బాధపడకు. నీ నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టు అని సలహా ఇచ్చాడు. విజయ్ ఎప్పుడూ అంతే.. మొదట నేను ఏడుస్తున్నా నా దగ్గరకు కూడా రాలేదు. అసలేమైందని కనుక్కున్న తర్వాతే నా దగ్గరకు వచ్చి పలకరించాడు, నా సమస్యను పరిష్కరించాడు. ఇకపోతే రాజ్కిరణ్ సర్ చాలా మంచివాడు. అలాంటి మనిషి వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. నాతో సంబంధం అంటగట్టారు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను అని వనిత విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
మీ చేతిలో కీలుబొమ్మలం కాదు.. స్నేహితురాలిని పెళ్లాడిన నటి!?
క్రూరమైన మగాళ్ల కన్నా నా బెస్ట్ ఫ్రెండ్ (మోడల్ అన్సియా) చాలా బెటర్. అందుకే తనను పెళ్లి చేసుకున్నా అని ఓ వీడియో రిలీజ్ చేసింది మలయాళ బుల్లితెర నటి ప్రార్థన కృష్ణ నాయర్ (Prarthana Krishna N Nair). ఆ వీడియోలో నటి, తన స్నేహితురాలితో గుడికి వెళ్లింది. అక్కడ వీరిద్దరూ దండలు మార్చుకున్నారు. ఒకరి మెడలో మరొకరు పసుపు తాడు కట్టారు. మీ చేతిలో కీలుబొమ్మలం కాదునుదుటన కుంకుమ దిద్ది జంటగా అడుగులు వేశారు. ఈ ఇద్దరమ్మాయిల పెళ్లి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఆడవాళ్లందరూ మీ చేతిలో కీలుబొమ్మలు కాదు. రియల్ లైఫ్లో నటించేవా మగవాళ్లకు మా జీవితాల్లో చోటు లేదు అని నటి క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన కొందరు వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అని ఆశ్చర్యపోయారు.అసలు విషయమిదే!తాజాగా ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చింది ప్రార్థన. మేము చాలా వైరల్ అయిపోయాం. మా పెళ్లి నిజం కాదు, అది కేవలం షూటింగ్ మాత్రమే! వేరే ఇండస్ట్రీకి చెందిన నటులు ఇలాగే చేశారు. అది చూసి మేము కూడా ట్రై చేశామంతే! తను నా బెస్ట్ ఫ్రెండ్. తనకిదివరకే పెళ్లయింది, ఓ బాబు కూడా ఉన్నాడు అంటూ అసలు విషయం బయటపెట్టింది. View this post on Instagram A post shared by Prarthana KriShna N Nair (@_actress_prarthanakrishnanair_) View this post on Instagram A post shared by Prarthana KriShna N Nair (@_actress_prarthanakrishnanair_) చదవండి: ప్రియాంక బర్త్డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?' -
సైడ్ యాక్టర్గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్తో తీశారు. టాలీవుడ్లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు. బాలీవుడ్లో ఛాన్స్మరి హీరోగా బాలీవుడ్లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.చిన్న రోల్.. నచ్చలేదుఉదాహరణకు స్టార్ హీరో అజిత్ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్స్టార్స్లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్గా ఉండిపోయారు.సెల్ఫిష్గా ఆలోచించలేనుకాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్లాల్, శరత్కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
సహజత్వానికి చిరునామా సాయి పల్లవి
మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి అన్నది నానుడి. అలా నటి అన్న తరువాత కాస్త గ్లామర్ అవసరం అన్నది సినిమా వాళ్ల మాట. అందుకే అందాలారబోతకు దూరంగా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు అందుకు సిద్ధం అంటున్నారు. అయితే ఎలాంటి గ్లామర్ అవసరం లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయిన కథానాయకి ఎవరైనా ఉన్నారంటే అది నటి సాయిపల్లవినే అవుతారు. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన అరుదైన తారలలో ఈమె ఒకరు. సాయిపల్లవి మంచి డాన్సర్. తద్వారా కలిగిన ఆసక్తినే సినిమా. తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సాయిపల్లవి ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఏ ముహూర్తాన విడుదలై సంచలన విజయం సాధించిందో గానీ, ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి.అయితే తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్న సాయిపల్లవికి అక్కడ ప్లాప్ల సంఖ్చ చాలా తక్కువే. అదే విధంగా ప్లాప్ అయిన చిత్రాలలోనూ తన నటనకు మంచి మార్కులు పడటం అనేది అరుదైన విషయమే. అందుకు కారణం పాత్రల విషయంలో సాయిపల్లవి చూపే ప్రత్యేక శ్రద్దనే అని చెప్పవచ్చు. తనకు నచ్చిన బాటలో పయనిస్తున్న ఈమె అందంపై కాకుండా అభినయనానికి ప్రాముఖ్యనిస్తున్నారు. అలా సహజ నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రల్లో నటించిందే లేదు.అలా ఆమె సహజత్వానికి చిరునామాగా ముద్ర వేసుకున్నారు. ఇటీవల తమిళంలో అమరన్ చిత్రంలో నటించి అందరి అభినందనలను అందుకున్న సాయిపల్లవి, తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్ చిత్రంలోనూ నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామన్నదే ముఖ్యం అని భావించే సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రామాయణం అనే రెండు భాగాలుగా తెరకెక్కుతున్న భారతీయ ఇతిహాస గాథలో సీతగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుంటుందోన్న ఆసక్తి ఇప్పుడు సినీ ప్రేమికుల్లో నెలకొంది. -
హీరోయిన్గా స్టార్ హీరో కుమార్తె ఎంట్రీ.. ఇంతకీ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్గా వినిపించే పదమే. చాలామంది అగ్రతారల పిల్లలు కూడా సినిమానే కెరీర్గా ఎంచుకోవడం మనం ఎక్కువగా చూస్తుంటాం. వారి బాటలోనే నడుస్తూ ఇండస్ట్రీలో తమ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా మరో స్టార్ హీరో కుటుంబం నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూతురు విస్మయ అరంగేట్రానికి సిద్ధమైంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తుడక్కం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి జూడే ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడే ఆంథోని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. విస్మయ మోహన్ లాల్ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఆశీర్వాద్ సినిమాస్కు ఎంతో గర్వంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది. ఈ సంతోషకరమైన వార్తను మోహన్ లాల్ సైతం ట్వీట్ ద్వారా పంచుకున్నారు. తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ రాసుకొచ్చారు.కాగా..విస్మయ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ.. రచయితగా రాణిస్తోంది. రచయితగా ఆమె తన తొలి పుస్తకం 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్'ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల చేసింది. అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్ పట్ల కూడా నైపుణ్యం సాధించింది. థాయ్లాండ్లో మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ తీసుకున్నారు.మరోవైపు విస్మయ సోదరుడు ప్రణవ్ మోహన్లాల్ సైతం జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'ఆది'మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రణవ్ ప్రస్తుతం డైస్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎంపురాన్'-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తుడురుమ్ అనే మూవీతో అలరించారు. Dear Mayakutty, may your "Thudakkam" be just the first step in a lifelong love affair with cinema.#ThudakkamWritten and Directed by Jude Anthany Joseph and Produced by Antony Perumbavoor, Aashirvad Cinemas#VismayaMohanlal@antonyperumbavoor @aashirvadcine… pic.twitter.com/YZPf4zhSue— Mohanlal (@Mohanlal) July 1, 2025 -
అనుపమ పరమేశ్వరన్ మూవీ.. సెన్సార్ బోర్డ్పై సినీ సంఘాల ఆగ్రహం!
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ చిత్రంలో మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది. జానకి అనే పేరు సీతాదేవికి మరో పేరు అని.. అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు.అయితే సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పడంపై మలయాళ చిత్ర సంస్థలు మండపడుతున్నాయి. సెన్సార్ బోర్డ్ వైఖరిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించాయి. అసోసియేషన్ ఫర్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA), నిర్మాతల సంఘం, ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ప్రాంతీయ కార్యాలయం ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఎఫ్సీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.(ఇది చదవండి: పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు)అయితే 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాలో ఎటువంటి మతపరమైన అంశాలు లేవని దర్శకుడు స్పష్టం చేశారు. అయినా కూడా ఈ నిర్ణయం తమను నిరాశకు గురి చేస్తోందని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ జనరల్ సెక్రటరీ ఉన్నికృష్ణన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సినిమాకు తిరువనంతపురంలోని సీబీఎఫ్సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ముంబయి ప్రధాన కార్యాలయంలో ఈ మూవీ సెన్సార్కు అడ్డంకులు ఎదురయ్యాయి. దీనిపై నిర్మాతలు ఇప్పటికే కేరళ హైకోర్టు ఆశ్రయించారు. -
పాన్ ఇండియా చిత్రం ఆరంభం
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వస్తున్న పాన్ ఇండియా చిత్రం శనివారం ఆరంభమైంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటించనున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ‘‘ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో పూరి చాలా కేర్ తీసుకుంటున్నారు.దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్ని సిద్ధం చేయడంతో పాటు నటీనటులను కూడా ఎంపిక చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా చిత్రం విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సీఈఓ: విషు రెడ్డి. -
రూ.67 లక్షల కారు.. నాన్న కొనివ్వలేదు, నేనే లోన్ పెట్టి..: సురేశ్ గోపి కుమారుడు
'తండ్రి ఎంత సంపాదించాడన్నది నాకు ముఖ్యం కాదు. నా కష్టార్జితంతోనే నేను ముందుకు సాగుతాను' అంటున్నాడు మలయాళ నటుడు మాధవ్ సురేశ్. కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి కుమారుడే మాధవ్. ఇటీవల ఇతడు లగ్జరీ బ్రాండ్ గోల్ఫ్ జీటీఐ కారు కొనుగోలు చేశాడు. తండ్రి సంపాదనతోనే ఇంత పెద్ద కారు కొన్నాడని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా ఈ కామెంట్లపై మాధవ్ స్పందించాడు. నాన్న కొనివ్వలేదు..ఓ ఇంటర్వ్యూలో మాధవ్ సురేశ్ (Madhav Suresh) మాట్లాడుతూ.. ఇటీవల నేను గోల్ఫ్ జీటీఐ కారు కొన్నాను. కేరళలో దీని ధర రూ.67 లక్షలు. మిగతా రాష్ట్రాల్లో అయితే దీని ఖరీదు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే కారు తెచ్చుకోగానే చాలామంది మా నాన్నే కొనిచ్చాడని నన్ను తీసిపడేశారు. మీ అందరికీ ఓవిషయం చెప్తున్నా.. అది లోన్ తీసుకుని కొన్నాను. ప్రతి నెల కారు ఈఎమ్ఐ నేనే కట్టుకుంటాను. నా సంపాదనతోనే లోన్ చెల్లిస్తాను. మా నాన్న సంపాదించిందంతా ఆయన రిటైర్ అయ్యాక విశ్రాంత జీవితం గడిపేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే నా సోదరీమణుల పెళ్లికి ఖర్చు చేస్తాడు. ఆయన డబ్బు వాటికోసం మాత్రమే ఉపయోగించాలి.ట్రోల్స్.. లైట్ తీసుకుంటాఒకవేళ నేను సంపాదించలేకపోతే అప్పుడు ఆయన సాయం తీసుకుంటాను. కానీ నేను కొన్న కారు మా నాన్న ఇచ్చిందైతే కాదు. నేను నా కోసం, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. ఇక నన్ను తిట్టేవాళ్లపై నాకేమాత్రం కోపం లేదు. ఎందుకంటే నాకోసం వారు సమయం కేటాయిస్తున్నారు. అలా అని వారి ట్రోలింగ్కు స్పందిస్తూ కూర్చోను. నాకు గౌరవం ఇచ్చేవారినే తిరిగి గౌరవిస్తాను. నాన్న బీజేపీ మంత్రి అవడం వల్ల చాలామంది ఆయన్ని, మా కుటుంబం మొత్తాన్ని ద్వేషిస్తూ ఉంటారు. వాటిని నేను లెక్క చేయను అని మాధవ్ సురేశ్ చెప్పుకొచ్చాడు.సినిమా..మాధవ్ ప్రస్తుతం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ చేశాడు. ఇందులో సురేశ్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరైన జానకిని.. సినిమాలో దాడికి గురైన మహిళకు పెట్టడం సమంసజం కాదని అభిప్రాయపడింది. ఈ విషయంపై నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 27న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
వెకేషన్లో సూర్య దంపతులు.. వీడియో షేర్ చేసిన జ్యోతిక!
రెట్రో మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరితో కలిపి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో సూర్య తన కూతురితో కలిసి పాల్గొన్నారు. ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ మమతా బైజు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం రావడంతో విదేశాల్లో వాలిపోయారు సూర్య. తన భార్య జ్యోతికతో కలిసి ఫారిన్లో చిల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇవీ చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
ఏం చేయాలో అర్థం కాలేదు.. నడిరోడ్డుపై ఏడ్చేశాను : ‘దసరా’ విలన్
కోలీవుడ్ నటుడు, ‘దసరా’ ఫేం షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 6న తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అతని తండ్రి సీపీ చాకో మృతి చెందగా, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ విషాద ఘటనపై చాకో స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగిందని, తండ్రి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు.(చదవండి: రోజంతా కూర్చోబెట్టి.. అమ్మాయితో గుడి గంట కొట్టించారు : దిల్ రాజు)‘ప్రమాదం జరిగిన సమయంలో నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నాను. మధ్యలో రెండు, మూడు సార్లు మెళకువ వచ్చింది. నాన్నని బిస్కెట్లు అడిగి తిని మళ్లీ నిద్రపోయాను. కాసేపటి తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చిద్రలేచా. చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో తెలియదు. మేమంతా రోడ్డు మీద ఉన్నాం.అమ్మ షాక్కి గురైంది. ‘మనం ఎందుకు రోడ్డు మీద ఉన్నాం?’ , ఎక్కడికి వెళ్తున్నాం’ అని ప్రశ్నించింది. మా నాన్నను ఎన్నిసార్లు పిలిచిన పలకలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ నడిరోడ్డుపైనే ఏడ్చేశాను. నా జీవితంలో తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నాను’ అని చాకో చెప్పారు. ఈ ప్రమాదం తనకు 30 కుట్లు పడ్డాయని, తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. -
నేను చేసిన ఐదు సినిమాలు ముందు నాగచైతన్యకే చెప్పా: వెంకీ అట్లూరి
సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri). ప్రస్తుతం హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా అక్కినేని నాగచైతన్యకు వినిపించాడట! తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పాను.వర్కవుట్ కాలేఈరోజు వరకు నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది చైతన్య (Naga Chaitanya)కే చెప్పాను. కానీ, డేట్స్ కుదరక.. లేదా ఏదో ఒక కారణం వల్ల మా కాంబినేషన్లో సినిమా వర్కవుట్ కావడం లేదు. నెక్స్ట్ టైం అయినా కలిసి మూవీ చేద్దామని జోక్ చేసుకుంటూ ఉంటాం. అఖిల్కు మంచి హిట్టు ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది. తనతో భవిష్యత్తులో కచ్చితంగా ఓ మంచి మూవీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. సినిమావెంకీ అట్లూరి.. అఖిల్తో మిస్టర్ మజ్ను మూవీ చేశాడు. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు.చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం -
నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం
రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ను చదివించాలనుకున్న లారెన్స్తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.గుండె తరుక్కుపోతోందిలారెన్స్ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.ఒక్కసారి చూడాలనుందిఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్ (ట్విటర్)లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్, అధిగరం, కాల భైరవ, బుల్లెట్, హంటర్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు.చదవండి: దిల్రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని -
తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్
ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ పైన కనిపిస్తున్న కథానాయిక మాత్రం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనెవరో మీరీపాటికే గుర్తుపట్టేసి ఉంటారు. గుడ్నైట్ హీరోయిన్ మీథా రఘునాథన్ (Meetha Raghunath). 3 BHK సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడింది. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ స్పీచ్ మొదలుపెట్టింది.రెండోసారి..మీరు నన్ను గుడ్నైట్ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కోసం తొలిసారి హైదరాబాద్కు వచ్చాను. ఇప్పుడు 3 BHK మూవీ కోసం రెండోసారి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK.. కలలను సాకారం చేసుకునే కథ. ఇది మా కథ మాత్రమే కాదు, మీ కథ.. మనందరి కథ. ఈ సినిమాను ప్రేమతో, హృదయపూర్వకంగా చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..ఈ మూవీ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సినిమా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగం విని సిద్దార్థ్ నోరెళ్లబెట్టాడు. చాలా బాగా మాట్లాడావని మెచ్చుకున్నాడు. నెక్స్ట్ తెలుగు మూవీ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతానని మీథా మాటిచ్చింది. ఇకపోతే మీథా రఘునాథ్ తెలుగులో డైరెక్ట్గా ఇంతవరకు సినిమా చేయలేదు. గుడ్నైట్ అనే తమిళ సినిమా తెలుగు వర్షన్తోనే ఇక్కడివారికి సుపరిచితురాలైంది. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ స్ట్రయిట్ ఫిలిం చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.తెలంగాణ అల్లుడిని కదా..3 BHK మూవీలో శరత్కుమార్, సిద్దార్థ్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. 25 ఏళ్లయింది.. నేను ఇంతవరకు భూమి, ఇల్లు ఏవీ కొనలేదు. 3 బీహెచ్కే సినిమా చేస్తున్నప్పుడు తొలిసారి ఇల్లు కొనుక్కున్నాను. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగాయి కదా.. అసలే తెలంగాణ అల్లుడిని కదా! అందుకే నా భార్యతో కలిసి కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్ అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. 98వ ఆస్కార్ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్ ఏంజెల్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్ విభాగంలో ఇండియన్ స్టార్స్ కమల్హాసన్, ఆయుష్మాన్ ఖురానాలకు, దర్శకురాలుపాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.ఆస్కార్ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు. -
హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ నిర్మించారు. ఫీనిక్స్ మూవీలో అభినక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా... వరలక్ష్మి శరత్కుమార్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని ఇందా వాంగికో...(ఇదిగో తీసుకో అని అర్థం) అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. గతంలో నానుమ్ రౌడీదాన్, సిందుబాద్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, చక్కని ఎమోషన్తో రూపొందించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
'అద్దె ఇంట్లో ఉంటున్నా'.. ప్రియురాలు కావాలంటే తప్పదుగా!
3 BHK.. అద్దె ఇంట్లో ఉంటున్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే 3BHK. హీరో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ ఈవెంట్కు తమిళ స్టార్ హీరో రవి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.అద్దె ఇంట్లో ఉంటున్నా..రవి మోహన్ (Ravi Mohan) మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ అద్దె ఇంట్లో ఉండలేదు. నేను పుట్టినప్పటి నుంచి నాకు చెందిన ఇళ్లల్లోనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మాత్రం అద్దె ఇంట్లో బతుకుతున్నాను. ఈ సినిమా నా జీవితానికి దగ్గరగా ఉంది. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఈ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇది జనాలకు అస్సలు మింగుడుపడలేదు. ప్రియురాలితో ఉండాలంటే..'అద్దె ఇంట్లో ఉండటమంటే లక్షలు రెంటు కట్టడం కాదు.. సొంతిల్లు లేక అగచాట్లు పడటం!', 'అయినా ఎందుకీ చెత్తంతా వాగుతున్నావు.. నువ్వు హీరోవి, కోట్లల్లో సంపాదిస్తున్నావు.. అద్దె ఇంట్లో కష్టాలు పడే కూలీలా మాట్లాడకు..', 'నీకు పెళ్లయి భార్య ఉంది, కానీ ఆమెను పక్కనపెట్టి ప్రియురాలు కావాలనుకున్నావ్, అలాంటప్పుడు అద్దె ఇంట్లోనే కదా ఉండాల్సింది! సింపతీ కార్డు వాడకు', 'అద్దింట్లో ఉంటున్నావ్.. కానీ సినిమాలు నిర్మిస్తున్నావ్' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాకాగా రవి మోహన్- ఆర్తి దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సింగర్ కెనీషాతో ప్రేమాయణమే దంపతుల మధ్య చిచ్చు పెట్టిందన్న రూమర్లున్నాయి. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులోనే ఉండగా భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. 3 BHK సినిమా విషయానికి వస్తే.. ఆర్ శరత్కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా అనుకోలే: మనోజ్ -
మాది కూడా 3 BHK.. అమ్మానాన్న కష్టపడి..: సిద్ధార్థ్ భావోద్వేగం
సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటించిన 40వ సినిమా 3 BHK. హైదరాబాద్లో గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సిద్దార్థ్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కూడా 3 BHKలోనే ఉండేవారు. నటుడిగా నాకిది 40వ సినిమా. 3BHK మూవీ చేస్తున్నానని చెప్పగానే నాన్న (సూర్యనారాయణన్) ముఖంలో సంతోషం కనిపించింది. ఒకరకమైన తృప్తి, ఒకింత గర్వం కనబడింది.నాకోసం సంపాదనంతా..ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీ చేసినందుకు సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నా జీవితం బాగుండాలని వారు సంపాదించినదంతా ఖర్చుపెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్కు థాంక్యూ అంటూ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు.సినిమాసొంతిల్లు అనేది ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ కల నెరవేర్చుకుందా? లేదా? దానికోసం ఏ చేశారన్నదే 3 BHK కథ. శరత్కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?
స్టార్ సింగర్ కేఎస్ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్ సింగర్ (10వ సీజన్) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.కింద పడిపోయా..హైదరాబాద్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను.విశ్రాంతిఅప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్ అని పిలుస్తారు. View this post on Instagram A post shared by Asianet (@asianet) చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
చిటుకు... చిటుకు
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, ‘దిల్’ రాజు యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిటు..’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని అనిరు«ధ్, అరివు పాడారు. ‘‘కూలీ’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన ‘చికిటు..’ పాటకి మంచి స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: గిరీష్ గంగాధరన్. -
థగ్లైఫ్కి మరో ఎదురు దెబ్బ.. రూ.25 లక్షలు జరిమానా?
థగ్లైఫ్(Thug Life ) చిత్రం ఏ ముహూర్తాన మొదలైయిందో గానీ, విడుదల నుంచి వరుసగా అవరోదాలను, అవమానాలను, నష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష , నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడైతే కర్ణాటకలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన నటుడు కమలహాసన్ తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచే ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. థగ్లైఫ్ చిత్ర విడుదలను కన్నడిగులు అడ్డుకున్నారు.కర్ణాటక హైకోర్టు కూడా నటుడు కమలహాసన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఆయన్ని క్షమాపణ చెప్పాలని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు చిత్ర విడుదలను అడ్డుకోరాదని, పోలీసులు రక్షణ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చిత్రానికి భద్రత కల్పించనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియేసింది. అయితే థగ్లైఫ్ చిత్రం ఇప్పటి వరకూ కర్ణాటకలో విడుదల కాలేదు. అదేవిధంగా విడుదలయిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, తమ డబ్బును వాపస్ చేయాల్సిందిగా డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే థగ్లైఫ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం క్షమాపణ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే చిత్రం ప్లాప్ అవడంతో ఇప్పుడు రూ. 90 కోట్లే ఇస్తాయని మడత పేచీ పెట్టిందని, చివరికి చర్చలనంతరం రూ. 110 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. అదే విధంగా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లు రూ. 25 లక్షలు జరిమానా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం నటుడు కమలహాసన్ థగ్లైప్ చిత్రం విడుదలై 8 వారాల తరువానతనే ఓటీటీలో ప్రసారం చేస్తామని చెప్పారనీ, అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో మల్టీఫ్లెక్స్ థియేటర్లు రూ.25 లక్షలు అపరాధం వేసినట్లు సమాచారం. ఇలా ఈ చిత్రం దెబ్బ మీద దెబ్బను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. -
భార్యకు విడాకులు.. దుబాయ్కు వెళ్లిందంటే అమ్మాయి చెడిపోయినట్లేనా?
సినీ నటుడు రఫీ- మహిన మున్నా విడిపోయారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు మహిన ప్రకటించింది. దయచేసి అందుకు గల కారణాలు అడగవద్దని కోరింది. అలాగే తనపై వస్తున్న ఆరోపణలపైనా స్పందించింది. మహిన మాట్లాడుతూ.. నేను, రఫీ కలిసున్నామా? లేదా? అన్నది చాలామంది ప్రశ్న. లేదు, మేమిద్దరం విడిపోయాం. ఎందుకు? ఏమిటి? అనేది ఎవరూ అడగకండి. మా గురించి పేరెంట్స్ను, బంధువులను అడిగి వారిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను.దుబాయ్కు వెళ్తే అంతేనా?నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పాలనుకోవడం లేదు. మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. దుబాయ్కు వెళ్లాకే మహినా మారిపోయింది, రఫీని వదిలించుకుంది అని చెత్త కామెంట్లు చేస్తున్నారు. అవి నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దుబాయ్కు వెళ్తున్న అమ్మాయిలందరూ చెడ్డవారేనా? నేను నా కెరీర్ కోసం ఇక్కడికి వచ్చాను. నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. నా పేరెంట్స్ బాగోగులు నేనే చూసుకోవాలనుకున్నాను. దుబాయ్కు రాగానే అమ్మాయిలు మారిపోతారు, చెడిపోతారనే మాటల్లో ఏమాత్రం నిజం లేదు.నేనేంటో మీకేం తెలుసు?నేనే కాదు, 95% మంది ఇక్కడికి పనికోసమే వస్తారు. ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యంగా పని చేస్తారు. నేను కూడా అలా స్వశక్తితో ఎదగాలని వచ్చాను. నా గురించి పనికిరాని కామెంట్లు చేసేవారికి నేనేంటో తెలీదు. నా గురించి తెలిస్తే అలా ఏది పడితే అది వాగరు. రఫీని మోసం చేశానని అనేవాళ్లూ ఉన్నారు. అమ్మాయిలే మోసం చేస్తారా? అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. 100% మంచివాళ్లంటూ ఎవరూ ఉండరు.విడిపోవడమే మంచిదని..మేము కలిసుండటానికి ఎంతగానో ప్రయత్నించాం. అదిక జరగదని అర్థమయ్యాకే విడిపోయాం. దీని గురించి పదేపదే అడిగి అతడి పేరెంట్స్ను కూడా ఇబ్బంది పెట్టకండి. కలిసికట్టుగా ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని నాకూ తెలుసు. కానీ సఖ్యత చెడిపోయినప్పుడు ఆ బంధాన్ని అలాగే కొనసాగించేబదులు విడిపోవడమే మంచిది. మేము చేసిందదే! మా కారణాలు మాకున్నాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మేము కలిసున్నప్పుడు సంతోషాన్నే మీకు చూపించాం. కొందరు వారి కష్టాలు, బాధలు, పోట్లాటలు అన్నీ కూడా వీడియోలు చేసి చెప్తుంటారు. అలా చేయడం నాకిష్టం ఉండదు.ఫేమ్ చూసి పెళ్లి?రఫీకి ఉన్న పాపులారిటీ వల్లే నేనిక్కడిదాకా వచ్చానంటున్నారు. ఆయన ఫేమ్ చూసి నేను పెళ్లి చేసుకోలేదు. ఫేమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా కెరీర్ కోసం విడిపోయాం అని చెప్పుకొచ్చింది. రఫీ, మహినా.. 2022లో పెళ్లి చేసుకున్నారు. రఫీ.. చక్కపాలెం సీరియల్తో పాపులర్ అయ్యాడు. కనిమంగళం కోవిలగం అనే వెబ్ సిరీస్ చేశాడు. ప్రస్తుతం సుమతి వలవు మూవీ చేస్తున్నాడు.చదవండి: ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయ్ -
రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.రజినీకి భారీ పారితోషికం..ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.#Chikitu 💃🕺 - https://t.co/TcCvuNmTSE#Coolie #CoolieFirstSingle Superstar @rajinikanth in a @Dir_Lokesh directorial 💥 @sunpictures ⚡️With the legendary TR sir, the genius @Arivubeing and thank you @iamSandy_Off for making us dance🙏🏻#Coolie releasing worldwide August… pic.twitter.com/KGjY2S3v8g— Anirudh Ravichander (@anirudhofficial) June 25, 2025 -
వంద కోట్ల క్లబ్లో 'కుబేర'
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేర (Kuberaa Movie). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తాజాగా కుంభస్థలాన్ని కొట్టేసింది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని కుబేర చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.కుబేర కథదీపక్ (నాగార్జున) నిజాయితీ గల సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. ఆయనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ.50 వేల కోట్లను బ్లాక్లో పంపించాలి. దానికోసం దీపక్.. నలుగురు భిక్షగాళ్లను తీసుకొచ్చి వాళ్ల పేరు మీద చెరో రూ.10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జత చేస్తాడు. ఆ తర్వాత నలుగురిలో ఒకరైన యాచకుడు దేవా (ధనుష్) తప్పించుకుని పారిపోతాడు. దేవా ఎందుకు తప్పించుకున్నాడు? దేవాను నీరజ్ గ్యాంగ్ పట్టుకుంటుందా? లక్ష కోట్లు చేతులు మారాయా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే! Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025 -
ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటపడతాయ్
చెన్నై: కోలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్ -
డ్రగ్స్ కేసు : అజ్ఞాతంలోకి నటుడు కృష్ణ!
మాదక ద్రవ్యాల వ్యవహారం కోలీవుడ్లో విశ్వరూపం దాల్చుతోందనిపిస్తోంది. డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మరో తమిళ నటుడు కృష్ణ కూడా మాదక ద్రవ్యాలను వాడినట్లు సమచారం అందడంతో పోలీసులు ఆయన్ని విచారించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం కేరళలో షూటింగ్లో పాల్గొంటున్న నటుడు కృష్ణను విచారించడానికి పోలీసులు కేరళకు వెళ్లారు. అయితే కృష్ణ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలోని అనేక యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు పరిచయాలు ఉన్నాయి. దీంతో అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఈ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. మరి ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి. -
కోర్ట్లో తప్పు ఒప్పుకొన్న నటుడు శ్రీకాంత్
తమిళ నటుడు శ్రీకాంత్.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో హాజరు పరచగా.. తను చేసిన తప్పుని ఒప్పుకొన్నాడు. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తు పదార్థలు అలవాటు చేశాడని న్యాయస్థానానికి విన్నవించాడు. ప్రసాద్ తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, డబ్బు అడిగిన ప్రతిసారి ఆయన కొకైన్ ఇచ్చేవాడని, అలా తనకు అది అలవాటు అయిపోయిందని శ్రీకాంత్ అన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)తాను డ్రగ్స్ అమ్మలేదని, కేవలం తీసుకున్నానని శ్రీకాంత్ చెప్పాడు. తీసుకోవడం తప్పని తనకు తెలుసని, బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరాడు. కానీ న్యాయస్థానం శ్రీకాంత్ అభ్యర్థని తిరస్కరించింది. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ఇక ఇదే కేసుతో సంబంధమున్న నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. దొరకగానే అతడిని కూడా అరెస్ట్ చేయనున్నారు.'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న శ్రీకాంత్.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దాదా, స్టాప్ లాంటి స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీస్ చేశాడు. దళపతి విజయ్ 'స్నేహితుడు' చిత్రంలోనూ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇతడు కాస్త డౌన్ అయ్యాడు. ఈ ఏడాది శ్రీకాంత్ చేసిన రెండు తమిళ మూవీస్, ఓ తెలుగు సినిమా 'ఎర్రచీర' రిలీజైంది. కాకపోతే అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే గనుక) -
హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్!
హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. హ్యాకింగ్ గురించి శృతిహాసన్ ఇన్స్టా వేదికగా తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది.శృతి హాసన్ ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు వరుసగా దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని - మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్ పోస్ట్ చేశారు. అయితే శృతి హాసన్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేసింది. -
అజిత్ కుమార్ న్యూ లుక్.. షాకవుతున్న ఫ్యాన్స్!
ఈ ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించింది.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అజిత్కు కారు రేసింగ్ అంటే ప్రాణం. ఇప్పటికే తన టీమ్తో కలిసి విదేశాల్లో టైటిల్స్ కూడా సాధించారు. సినిమాలకు కాస్తా విరామం దొరకడంతో కార్ రేసింగ్లో బిజీ అయిపోయారు. అజిత్ కుమార్ ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ4 యూరోపియన్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ వీకెండ్లో ఈ కార్ రేసింగ్ జరగనుంది.అయితే తాజాగా అజిత్ కుమార్ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. రేసింగ్ ట్రాక్పై సైకిల్ తొక్కుతూ కనిపించారు. అయితే ఈ ఫోటోల్లో అజిత్ కుమార్ గుండు చేయించుకుని కొత్త లుక్తో దర్శనమిచ్చారు. తాజా లుక్ను చూసిన అజిత్ కుమార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఏడాది 'విదాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో మెప్పించి అజిత్ కుమార్ ప్రస్తుతం ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. AK at Spa Francochamps circuit, Belgium preparing for the 3rd round of GT4 European series coming weekend#ajithkumar #ajithkumarracing #akracing #GT4 #europeanseries #weekendracing #racing pic.twitter.com/nXksEJZUdc— Ajithkumar Racing (@Akracingoffl) June 24, 2025 -
స్టార్ హీరోతో రిలేషన్ .. ప్రేమపై త్రిష పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొంతకాలంగా అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్ బర్త్డే రోజు త్రిష అతని ఫోటో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్ సింబల్ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్ అయింది.తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్ని త్రిష తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విజయ్తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.త్రిష కెరీర్ విషయానికొస్తే. ఇటీవల థగ్లైఫ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్గా తీసుకున్నారు. విజయ్ విషయానికొస్తే.. తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
డిష్యుం.. డిష్యుం
డిష్యుం.. డిష్యుం.. అంటూ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయనే టాక్ తెరపైకి వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
మూడుభాషల్లో ఒకేసారి దృశ్యం 3
‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, వెంకటేశ్–జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం 2’ హిట్గా నిలిచాయి.ఇక హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన ‘దృశ్యం’, అజయ్ దేవగణ్– డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే... జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో ‘దృశ్యం 3’ ఉంటుందని అజయ్ దేవ్గణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ–‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ ‘దృశ్యం 3’ సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీమ్కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు.మూడు భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’ని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని స్పష్టం చేశారాయన. ‘దృశ్యం 3’ తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం
లెజెండరీ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందులోనూ బ్లాక్బస్టర్ కాంబినేషన్ అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన నాయకన్ (తెలుగులో నాయకుడు) ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమాయే థగ్ లైఫ్ (Thug Life Movie).క్షమించండిబోలెడు ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ రిజల్ట్పై మణిరత్నం (Mani Ratnam) స్పందిస్తూ సారీ చెప్పారు. మా నుంచి నాయకన్లాంటి సినిమా వస్తుందని ఎదురుచూసినవారికి నేనొక్కటే చెప్పగలను. మమ్మల్ని క్షమించండి. మేము గతాన్ని తిరగరాయాలనుకోలేదు. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. కానీ మీరు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఊహించని ఫలితాల్సి అందుకున్నాం. ప్రేక్షకులు.. మేము ఇచ్చినదానికంటే పూర్తి భిన్నమైనదేదో ఎక్స్పెక్ట్ చేశారు అని పేర్కొన్నారు. జూన్ 5న విడుదలైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చదవండి: జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే? -
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్స్టార్ మహేశ్బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ -
పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. సీనియర్ నటుడు, ప్రస్తుత కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగింది?(ఇదీ చదవండి: దేవి శ్రీ ప్రసాద్కి డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరు?)జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు. అయితే జానకి అనే పేరు సీతాదేవికి మర పేరు అని, అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ కూడా ఈ వివాదం గురించి మాట్లాడారు.సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు అని ఉన్నికృష్ణన్ గుర్తుచేశారు. మరి ఈ విషయంలో చిత్రబృందం ఏం చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి అంజలి పవన్ సీమంతం వేడుక) -
త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?
తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం 'హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్' అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ 'జన నాయగణ్' మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో '96' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)Happy Birthday bestest🤗🧿 pic.twitter.com/K4JFdIZXjn— Trish (@trishtrashers) June 22, 2025 -
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు) -
చిన్న వయసులో విగతజీవిగా మారిన నటుడు
మరాఠీ నటుడు తుషార్ ఘడిగోయెంకర్ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై గోరెగావ్లోని అద్దెకుంటున్న ఫ్లాట్లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల నివేదిక ప్రకారం.. శుక్రవారం రోజు.. రామ్ మందిర్ రోడ్లో ఓ ఫ్లాట్లోని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు కంట్రోల్ రూమ్కు ఫోన్కాల్ వచ్చింది. అపస్మారక స్థితిలో?వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా తుషార్ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తుషార్కు పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడని పోలీసులు చెప్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నటుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా తుషార్.. మరాఠీ సినిమాల్లోనే కాకుండా థియేటర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ఘంట నాద్ ప్రొడక్షన్ పేరిట సొంతంగా ఓ మ్యూజిక్ వీడియో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆయన.. ఇలా చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు -
నాన్నకు ప్రేమతో..
ఓ తండ్రిది బాధ్యత... మరో నాన్నది పగ. ఇంకో ఫాదర్ది ప్రేమ... ఇలా ఫాదర్ సెంటిమెంట్, ఎమోషన్లతో సిల్వర్ స్క్రీన్పై సినిమాలొస్తే ఆ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. పైగా ఈ తరహా సినిమాల్లో తండ్రి–కొడుకు ఈ రెండు పాత్రలనూ తమ అభిమాన హీరో చేస్తే అభిమానులు ఖుష్ అవుతారు. ఇలా తండ్రీ కొడుకుల ద్విపాత్రాభినయంతో కొందరు హీరోలు, తండ్రిగానో, కొడుకుగానో మరికొందరు హీరోలు ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ ఫాదర్ ఎమోషన్తో సినిమాలు చేసున్నారు. ఆ హీరోలపై ఓ లుక్ వేద్దాం...గతం నిశ్శబ్దంగా ఉండదు జార్జి కుట్టి గుర్తున్నాడుగా..! అదేనండీ... తన కుమార్తెల రక్షణ కోసం, తన కుటుంబం కోసం పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి. మలయాళ బ్లాక్బస్టర్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మోహన్లాల్ పాత్ర పేరు జార్జి కుట్టి. ఈ సినిమాలో ఓ తండ్రిగా మోహన్లాల్ నటన అద్భుతమని ప్రేక్షకులు కితాబులు ఇచ్చారు. అందుకే ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటివరకు ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలు రాగా ఈ రెండు చిత్రాలూ సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు ‘దృశ్యం’ సినిమాలో మూడో భాగంగా ‘దృశ్యం 3’ రానుంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ‘దృశ్యం 3’ సినిమాకూ దర్శకత్వం వహించనున్నారు.‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు... దృశ్యం 3 సినిమా ఉంది’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ఖరారు చేశారు మోహన్లాల్. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానుందని శనివారం మోహన్లాల్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు. మరి... ఈ సారి ఓ తండ్రిగా మోహన్లాల్ తన కుటుంబాన్ని, కుమార్తెలను ఏ విధంగా సంరక్షించుకుంటారో చూడాలి. అయితే ఈసారి తండ్రీ–కుమార్తెల మధ్య ఉన్న ఎమోషనల్ మోతాదును పెంచాలని జీతూ జోసెఫ్ అనుకుంటున్నారట. ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించనున్నారు. మోహన్లాల్ త్వరితగతిన సినిమాలు పూర్తి చేస్తుంటారు కాబట్టి, ‘దృశ్యం 3’ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజైనా ఆశ్చర్యపోవడానికి లేదు.మూడు తరాల కథ శర్వానంద్ హీరోగా ‘లూజర్’ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ రానుంది. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడు తరాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఫాదర్ అండ్ సన్ల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందట. మూడు తరాల నేపథ్యం కాబట్టి ఈ చిత్రం డిఫరెంట్ టైమ్లైన్స్లో ఉంటుందనుకోవచ్చు. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్గా కనిపిస్తారని, ‘రేస్ రాజా’ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం.హిట్ ఫార్ములాఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్ను బాగా అలరించి, హిట్ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ మెయిన్ పాయింట్ ఫాదర్ ఎమోషనే. సముద్రఖని –ధన్రాజ్ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్ కిషన్–రావు రమేశ్ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, మోహన్లాల్ ‘తుడరుమ్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్ ఎమోషన్నే మెయిన్ పాయింట్గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్ను బాగా అలరించి, హిట్ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ మెయిన్ పాయింట్ ఫాదర్ ఎమోషనే. సముద్రఖని –ధన్రాజ్ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్ కిషన్–రావు రమేశ్ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, మోహన్లాల్ ‘తుడరుమ్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్ ఎమోషన్నే మెయిన్ పాయింట్గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ధారా.. ఫాదర్ ఆఫ్ దేవా తండ్రీకొడకుల కథలంటే ప్రభాస్కు బాగా ఇష్టం ఉన్నట్లుగా తెలుస్తోంది. తండ్రి ఎమోషన్తో ప్రభాస్ హీరోగా ఆల్రెడీ చేసిన ‘మిర్చి, బాహుబలి’ వంటి సినిమాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా ప్రభాస్ కమిటైన చిత్రాల్లో ‘సలార్’ కూడా ఒకటి. ఈ సినిమాలో కూడా ఫాదర్ ఎమోషన్ గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘సలార్’ ఫ్రాంచైజీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ తండ్రి పేరు ధారాగా వినిపించింది. కాగా ‘సలార్: సీజ్ఫైర్’ ఎండింగ్లో ‘సలార్: శౌర్యాంగపర్వం’ సినిమా ఉన్నట్లుగా మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో దేవా, ధారాల మధ్య మరింత ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సన్నివేశాలు ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతేకాదు... దేవా తండ్రి ధారా పాత్రలోనూ ప్రభాసే కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.పైగా ‘సలార్’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ప్రభాస్కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. వాటిలోని ఒక పోస్టర్లో ప్రభాస్ కాస్త ఏజ్డ్గా కనిపిస్తారు. ఈ పాత్రే ధారా అనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్కు వెళ్లలేదు. ఇక ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాకు మారతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం సైతం ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల నేపథ్యంలో సాగుతుందని, తాత– మనవళ్ల ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ కూడా కాస్త ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో తండ్రీకొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి మధ్య ‘బాహుబలి’ సినిమాలో కాంబినేషన్ సీన్స్ లేనప్పటికీ మాహిష్మతి రాజ్యంలో తండ్రి అమరేంద్ర బాహుబలికి జరిగిన అన్యాయానికి తల్లి దేవసేన ్రపోత్సాహం, ప్రతీకారంతో.. మహేంద్ర బాహుబలి రివెంజ్ తీర్చుకోవడం ఆడియన్స్ను మెప్పించింది. ఇక ఇక్కడ ‘బాహుబలి’ ప్రస్తావన తీసుకు రావడానికి ఓ కారణం ఉంది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ‘బాహుబలి’ ఈ ఏడాది అక్టోబరులో రీ రిలీజ్ కానుంది. అయితే ‘బాహుబలి’ రెండు భాగాలను (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్) కలిపి ఒకే సినిమాగా ఎడిట్ చేసి, రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.వర... సన్నాఫ్ దేవర దేవర చనిపోయినప్పుడు అతని కొడుకు వర చేతిలో కత్తి ఎందుకు ఉంది? తండ్రి దేవరను, అతని కొడుకు వరనే చం పాడా? అసలు ఏం జరిగింది? అనేది ‘దేవర 2’ సినిమాలో చూడాలి. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి పేరు దేవర. కొడుకు పేరు వర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. 2024 సెప్టెంబరు 24న ‘దేవర పార్ట్ 1’ విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. ‘దేవర 2’ చిత్రం కూడా ఉంటుందని, ‘మ్యాడ్ 2’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఎన్టీఆర్ పేర్కొన్నారు.ఈ ‘దేవర 2’ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. అసలు దేవర, అతని కొడుకు వరల మధ్య ఏం జరిగింది? దేవర నిజంగానే చనిపోయాడా? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘దేవర 2’లో చూడొచ్చని ‘వార్ 2’ ప్రమోషన్స్లో భాగంగా ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు పోలీస్... అటు ఖైదీ తండ్రంటే ఎవరికి ప్రేమ ఉండదు. కానీ విజయ్ప్రకాశ్కు ఇష్టం లేదు. ఈ విజయ్ప్రకాశ్ ఎవరంటే... ‘సర్దార్’ సినిమాలో పోలీసాఫీసర్. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు కార్తీ. తండ్రి సర్దార్పై దేశ ద్రోహి అనే అభియోగం ఉంటుంది. కానీ తన తండ్రి దేశద్రోహి కాదని, అసలు సిసలైన దేశభక్తుడని ప్రకాశ్ తెలుసుకుంటాడు. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అవుతాడు. కానీ.. ‘సర్దార్’ సినిమాలో తండ్రీకొడుకులు మధ్య ఉన్న సన్నివేశాల నిడివి తక్కవే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రానుంది. ఈ చిత్రంలోనూ కార్తీ తండ్రీ కొడుకుగా ద్వి పాత్రాభినయం చేశారు.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించారు. ఇటీవలే బ్యాంకాక్లో జరిగిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణతో ‘సర్దార్ 2’ పూర్తయింది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని కోలీవుడ్ సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా ఉంటాయట. ‘సర్దార్ 2’ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.మరోవైపు కార్తీ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ఖైదీ 2’. ఈ సినిమాలో కూతురి కోసం తపన పడే దిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపిస్తారు కార్తీ. ‘ఖైదీ’లో తన కుమార్తెను కలవడంతో సినిమా ముగుస్తుంది. మరి... దిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? తన కుమార్తెకు దూరమై ఓ తండ్రిగా ఎంత ఆవేదన చెందాడు? అసలు దిల్లీ భార్యకు ఏం జరిగింది? అన్న విషయాలు ‘ఖైదీ 2’లో ఉండొచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఖైదీ 2’లో ఖైదీ దిల్లీ భార్య పాత్రలో అనుష్కా శెట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సెప్టెంబరులో చిత్రీకరణ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్నుప్లాన్ చేశారు. ‘ఖైదీ’ సినిమాను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థనే ‘ఖైదీ 2’నూ నిర్మించనుందట.తొలిసారి ద్వి పాత్రాభినయం ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్లోని ఈ 14వ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారు. బ్రిటిష్ పరి పాలన కాలం నేపథ్యంలో 1854–1878ల టైమ్ పీరియడ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రీకొడుకుగా ద్వి పాత్రాభినయం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.స్క్రీన్పై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ద్వి పాత్రాభినయం చేయలేదు. సో... తొలిసారి విజయ్ ఈ తరహా ప్రయత్నం చేస్తుండటంతో, ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్లో అంచనాలు ఉన్నాయి. ఇంకా ‘గీత గోవిందం, డియర్ కామ్రెడ్’ వంటి సినిమాల తర్వాత హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేయనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగే ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుంది. సెట్ వర్క్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక విజయ్ సెట్స్కి వచ్చి, రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనడమే ఆలస్యం. 2026 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.మధ్యతరగతి తండ్రి కథ పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘చౌకీదార్’. ఈ చిత్రంలో సాయికుమార్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీ అంబర్, సాయికుమార్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాన్న అంటేనే దైవం’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను బట్టి ఈ సినిమాలో తండ్రీకొడుకుల ఎమోషన్, ఓ మధ్య తరగతి తండ్రి తన కుటుంబం కోసం పోరాడే తీరు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో కల్లహల్లి చంద్రశేఖర్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఫాదర్ ఎమోషన్తో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
'గతం నిశ్శబ్దంగా ఉండదు'.. మోహన్ లాల్ దశ్యం-3 ఎప్పుడంటే?
దృశ్యం సినిమా సిరీస్కు ఆడియన్స్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు పార్టులు విడుదలై అభిమానులను అలరించాయి. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను అటు తెలుగులో.. ఇటు బాలీవుడ్లోనూ రిలీజ్ చేయగా సూపర్హిట్గా నిలిచాయి. ఇప్పటికే ఈ సూపర్ హిట్ మూవీ సిరీస్లో దృశ్యం-3 కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే తాజాగా దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడనేది కూడా మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదల కానుందనిప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దృశ్యం మూవీపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. 'దృశ్యం సినిమా మలయాళ పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మేము ఆ చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రాన్ని భారతదేశమంతా వీక్షించింది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మలయాళ పరిశ్రమ గురించి తెలుసు. దృశ్యం తర్వాత మరిన్ని మలయాళ చిత్రాలను చూడటం ప్రారంభించారు. ఇది మా పరిశ్రమకు, అంతర్జాతీయంగా కూడా ఒక వరంలా మారింది." అని సంతోషం వ్యక్తం చేశారు.'దృశ్యం సూపర్ హిట్ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సింహళీ, చైనీస్ భాషలలో కూడా రీమేక్ చేశారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 'దృశ్యం 3' హిందీ వర్షన్ సైతం అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ సినిమాను రీమేక్ చేస్తారా? లేదంటే సొంతగా కథను తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తొలి రెండు భాగాలు మలయాళం నుంచి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. October 2025 — the camera turns back to Georgekutty.The past never stays silent.#Drishyam3 pic.twitter.com/8ugmxmb2wO— Mohanlal (@Mohanlal) June 21, 2025 -
దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి
దర్శకుడు, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అనీశ్ ఉపాసన (Aniesh Upaasana) రెండో పెళ్లికి సిద్ధమయ్యా. కారణం.. ఉపాసన బుల్లితెర నటి తుషారా కమలాక్షితో ఉన్న ఫోటోను షేర్ చేయడమే! ఈ పోస్ట్ కింద తుషారాను లైఫ్ పార్ట్నర్ (జీవిత భాగస్వామి)గా అభివర్ణిస్తూనే హార్ట్ సింబల్ జత చేశాడు. ఇది చూసిన అభిమానులు ఈ లవ్ బర్డ్స్కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. దృశ్యం నటితో పెళ్లి- విడాకులుఅనీశ్ గతంలో నటి అంజలి నాయర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె నెడునల్వాడై, తానక్కరణ్, కలింగళిల్ ఆవల్ వాసంతం, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్, దృశ్యం 2 వంటి చిత్రాల్లో నటించింది. అనీశ్.. మ్యాట్నీ, సెకండ్స్, పాప్కార్న్, జానకి జానే సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు దశాబ్దాలుగా మోహన్లాల్ దగ్గర ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. త్వరలోనే రెండో పెళ్లిఅనీశ్ దర్శకుడిగా పరిచయమైన మ్యాట్నీ సినిమాలో అంజలి హీరోయిన్గా నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 2011లో పెళ్లిచేసుకోగా.. ఈ జంట ప్రేమకు గుర్తుగా ఓ కూతురు జన్మించింది. తర్వాతేమైందో కానీ 2016లో అంజలి, అనీశ్ విడిపోయారు. 2022లో అంజలి అజిత రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ పాప పుట్టింది. View this post on Instagram A post shared by ANIESH UPAASANA (@director_aniesh_upaasana) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
కొత్త రూల్.. సంతకం పెడితేనే సినిమా షూటింగ్
మలయాళ చిత్రసీమలో డ్రగ్ కల్చర్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. షూటింగ్ లొకేషన్స్లోనే పలువురు నటులు మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు తోటి నటీనటుల్ని ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓ మూవీ సెట్లో తోటి నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణ చేసింది. మరోవైపు డ్రగ్స్ ఆరోపణలతో షైన్ టామ్ చాకో సహా పలువురు నటుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: ‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం)దీంతో ప్రస్తుత పరిస్థితుల్ని మార్చేందుకు మాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. ఇకపై సినిమాలు చేయాలంటే షూటింగ్ టైంలో డ్రగ్స్ తీసుకోం అని రాసున్న అఫిడవిట్లో సంతకం చేయాలని తీర్మానించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నటీనటులు ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఒప్పుకొనేటప్పుడు తప్పకుండా ఈ అఫిడవిట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సెట్లో అడుగుపెట్టనిస్తారు. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఈ రూల్ వర్తిస్తుంది. అలానే నటీనటుల సిబ్బంది కూడా ఇది కచ్చితంగా పాటించాలి.షూటింగ్ లొకేషన్స్తోపాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుందని కేరళ చిత్రసీమ చెప్పుకొచ్చింది. నిర్మాతల అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆమోదం వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం 'అమ్మ' (మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 26 నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది. చూడాలి మరి ఎంతమంది పాటిస్తారో?(ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన) -
ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
ఏదో వచ్చామా? నాలుగు సినిమాలు చేశామా? అని కాదు.. చేసిన సినిమా గురించి నలుగురు మాట్లాడుకున్నారా? జనాలు గుండెలో పెట్టుకున్నారా? అనేట్లు ఉండాలి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే.. భారీ ఫైట్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్ చిత్రాల జోలికి పోడు. సింపుల్గా రాసుకున్న కథలతోనే ఊహించని విజయాలు అందుకుని థియేటర్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాడు.నాలుగేళ్ల గ్యాప్తో మూవీఇప్పుడదే జరుగుతోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తీసి ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అయినా వెంటనే సినిమా చేయలేదు. నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని కుబేర (Kuberaa Movie)తో వచ్చాడు. ధనుష్ను యాచకుడిగా, నాగార్జునను సీబీఐ ఆఫీసర్గా చూపించాడు. డబ్బు, స్వార్థం చుట్టూ కథ అల్లుకున్నాడు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.వీడియో వైరల్జనాల స్పందన ఎలా ఉందో చూద్దామని శేఖర్, ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లారు. ప్రజల అరుపులు, కేకలు విని ఆనందంతో వారికి కడుపు నిండిపోయింది. ధనుష్ అయితే.. డంపింగ్ యార్డ్లో కంపు కొడుతున్నా గంటల తరబడి షూటింగ్ చేసిన కష్టాన్ని మర్చిపోయి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dhanush get emotional after seeing #Kuberaa Response 🥹🙏🙏@dhanushkraja WHAT A PERFORMANCE THROUGHOUT ENTIRE MOVIE 👏👏pic.twitter.com/rYl2BQSBUV— Dhanush Trends ™ (@Dhanush_Trends) June 20, 2025Whistles, applause and what not 🔥🔥It’s a BLOCKBUSTER WAVE that’s set @dhanushkraja & @sekharkammula’s hearts ablaze ❤️🔥This is the kind of cinema that demands to be experienced on the big screens 💥💥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa… pic.twitter.com/yJTmUKtuhQ— Kuberaa Movie (@KuberaaTheMovie) June 20, 2025 చదవండి: 'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి' -
'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి'
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజాగా చిత్రం కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఓ ట్వీట్ వేసింది. చాలా కారణాల వల్ల కుబేర నాకు స్పెషల్ చిత్రంగా నిలవబోతుంది. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడం, అద్భుతంగా నటించడం ధనుష్ సర్ వల్లే సాధ్యమవుతుంది.ఎప్పటికీ గుర్తుండిపోతుందిశేఖర్ (Sekhar Kammula) గారి డైరెక్షన్లో నాగార్జున సర్ కిల్లర్ లాంటి పాత్రలో కనిపించడం మాకు కన్నుల పండగ్గా ఉంటుంది. ప్రియమైన రష్మిక.. శేఖర్ గారు తన సినిమాల్లో హీరోయిన్లకు శక్తివంతమైన పాత్రలు ఇస్తారు. కుబేరలో నీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నీ విజయాల పరంపరలో ఈ మూవీ కూడా చేరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ గారు.. మీరు మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం! రక్తం ధారపోశారుచైతన్య, సూరి, అజయ్, స్వరూప్.. మీరంతా రక్తం ధారపోసి కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలం, గుర్తింపు తప్పకుండా వస్తుంది. నిర్మాత సునీల్ గొప్ప కథల్ని ఎంచుకుని అందిస్తున్నందుకు దివంగత నారాయణ్దాస్ గారు పై నుంచి ఎంతో గర్విస్తుంటారు. శేఖర్గారిలాంటి స్వచ్ఛమైన హృదయం కలవారే ఇలాంటి సినిమాలు తీయగలరు. మీరు ఒక తరాన్నంతటినీ ప్రభావితం చేస్తున్నారు. అందులో నేనూ ఉన్నాను. నా గురువుగారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కుబేరఇలాంటి మంచి కథల్ని మరెన్నో అందించాలని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయిపల్లవి ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చేసింది. కుబేర సినిమా విషయానికి వస్తే.. నాగార్జున సీబీఐ ఆఫీసర్గా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. నికేత్ బొమ్మరెడ్డి కెమెరామేన్గా పని చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న రిలీజైంది. #Kuberaa is going to be special for many reasons! @dhanushkraja sir’s masterclass in acting & art of picking challenging characters that only he can pull off so effortlessly. @iamnagarjuna sir, It’s going to be a treat to watch you in a killer character under Sekhar garu’s…— Sai Pallavi (@Sai_Pallavi92) June 20, 2025 చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ -
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
సౌత్లో బాడీ షేమింగ్.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.నిద్ర లేకుండా షూటింగ్ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. బ్లాక్లిస్ట్.. లెక్కచేయనుఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
అందరిచూపు సౌత్వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్బాస్ 18 ఫేమ్, హీరోయిన్ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అన్నీ ప్రత్యేకమేదంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్ప్లే, విజన్ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.ఎగ్జయిట్ అయ్యా.. కానీ!తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్ మార్ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా
జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా! అందులో రామ్పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్ ఖాన్తో రీమేక్ చేశారు. కానీ హీరోయిన్గా జెనీలియా (Genelia D'Souza)కు బదులుగా అసిన్ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో..సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.రుణపడి ఉన్నాతర్వాత యాంకర్.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు. ఎంజాయ్ చేశాతమిళంలో హరిణి (సంతోష్ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Anchor: South films never used to give solid roles.Genelia : No, I always got - if you see my South films, I've had the best roles ever. It was my learning ground. I am eternally indebted to the work that I got there.#GeneliaDeshmukh pic.twitter.com/OBOhFQAAqZ— Whynot Cinemas (@whynotcinemass_) June 18, 2025చదవండి: బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
కోలీవుడ్ అగ్రనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మణిరత్న- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో విఫలమైంది.అయితే బెంగళూరులో కమల్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటక రిలీజ్ చేయలేదు. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించింది. ఈ వివాదంపై కమల్ హాసన్ టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ను కర్ణాటకలో అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది మీ కర్తవ్యమని కర్ణాటక ప్రభుత్వానికి గుర్తు చేసింది.సుప్రీం తీర్పుతో థగ్ లైఫ్ సినిమా స్క్రీనింగ్కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన పిల్ విచారణను ముగించింది. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో ఈ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
'మమ్ముట్టి' ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్ నిజమే : రాజ్యసభ ఎంపీ
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ పలు వ్యాఖ్యలు చేశారు. మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. కానీ, చిన్న ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. మమ్ముట్టి గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆయన టీమ్ గతంలోనే అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఇలా చెప్పారు. 'మమ్ముట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేది నిజం. కానీ, కేవలం చిన్న ఆరోగ్య సమస్యకు మాత్రమే చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన బాగానే ఉన్నారు, నేను ఇప్పుడే అతనితో ఫోన్లో మాట్లాడాను. మేము చాలా సంవత్సరాలుగా స్నేహితులం, కానీ మేము ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను చర్చించే రకం కాదు. ఇటీవల రోజుల్లో, మేము అలాంటి విషయాలను కూడా పంచుకుంటున్నాము. ఆయన పూర్తి సంతోషంతో ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. త్వరలో సినిమా సెట్లో ఆయన్ను చూస్తారు.' అని ఆయన చెప్పారు.మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్లోనే మమ్ముట్టి కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సినిమా షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. త్వరలో ఆయన మళ్లీ సెట్స్లో అడుగుపెట్టనున్నారు. -
నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు
కోలీవుడ్ నటుడు ఆర్య నివాసం, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆకస్మిక దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్లోని తను నిర్వహిస్తున్న 'సీ షెల్' హోటల్తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.ఆర్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు. ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్ను గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. -
నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల( Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. జూన్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం శేఖర్ కమ్ముల చేసిన సాయం గురించి యాంకర్ ప్రశ్నించారు. ఒక రైతు కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం ఎందుకు శారో చెప్పాలని కోరారు. దీంతో శేఖర్ కమ్ముల పలు విషయాలను పంచుకున్నారు.కూతురు పెళ్లి చేద్దామని ఓ రైతు దాచుకున్న డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడని వార్త తెలిసింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బు అలా కాలిపోవడంతో నేను బాగా ఎమోషనల్ అయ్యాను. బాగా డబ్బున్నోడి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతేనే బాధేస్తుంది..అలాంటిది పేదోడి డబ్బు, అది కూడా ఎంతో కష్టపడి సంపాధించింటాడు. దీంతో ఆ రైతు బాధేంటో నాకు అర్థం అయింది. అందుకే సాయం చేశాను.' అని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ నుంచి పలు సేవలు అందించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఆయన భోజనం అందించారు. అయితే, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేదు.2021 సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో తన కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచుకున్న రూ. లక్షలు మంటల్లో కాలిపోయాయి. ఆ వార్త తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి రూ. 2లక్షలు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు పంపించారు. అదే సమయంలో రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అవసరమైతే మరింత సాయం చేస్తానని.. ముందు కూతురు పెళ్లి మంచిగా జరిపించాలని కోరారు. 🚨కూతురు పెళ్లి కోసం దాచుకున్న రెండు లక్షల రూపాయలు కాలిపోయాయని తెలియగానే,నా కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే 2 లక్షలు పంపించాను …! – #SekharKammula | #Kuberaa pic.twitter.com/0pNLtXRq7X— Bharat Media (@bharatmediahub) June 18, 2025 -
రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్తో మాట్లాడే సీన్ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే కర్మ?
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.నటన రాదని హేళనఅనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.ఆ హీరోయిన్ల విషయంలోనూ..ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న విడుదల కానుంది.సినిమాఅనుపమ విషయానికి వస్తే.. నివీన్ పౌలీ 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజీస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలున్నాయి.చదవండి: హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం -
సింగర్తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి!
కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చాయి. ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్పై మరింత టాక్ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.సాంగ్లో జయం రవి ప్రత్యక్షం..తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్పై మరోసారి కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్లో ఉంది.అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్కుమార్తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది. ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు. ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు
మలయాళంలో ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన చిత్రం తుడరుమ్ (Thudarum Movie). మోహన్లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్ నిలిచింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది.2020లో రాసుకున్న కథతాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరణ్ (Sanal Kumar Sasidharan) తుడరుమ్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్ రాశాను. తుడరుమ్ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.డైలాగ్ కూడా నాదే!తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్లో వాడుకున్నారు.ఓవర్ కాన్ఫిడెన్స్ఎంతో అనుభవమున్న దొంగలు కూడా ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్లో ఈ డైలాగ్ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్, టోవినో థామస్, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని రాసుకొచ్చాడు.చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన