breaking news
South India
-
తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్
ఎన్నేళ్లు తెలుగు ఇండస్ట్రీలో పని చేసినా కొందరు హీరోయిన్లకు తెలుగు అస్సలు రాదు. కానీ పైన కనిపిస్తున్న కథానాయిక మాత్రం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనెవరో మీరీపాటికే గుర్తుపట్టేసి ఉంటారు. గుడ్నైట్ హీరోయిన్ మీథా రఘునాథన్ (Meetha Raghunath). 3 BHK సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీథా అనర్గళంగా తెలుగు మాట్లాడింది. తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అంటూ స్పీచ్ మొదలుపెట్టింది.రెండోసారి..మీరు నన్ను గుడ్నైట్ సినిమాలో చూసి ఉంటారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు స్కూల్ ట్రిప్ కోసం తొలిసారి హైదరాబాద్కు వచ్చాను. ఇప్పుడు 3 BHK మూవీ కోసం రెండోసారి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 BHK.. కలలను సాకారం చేసుకునే కథ. ఇది మా కథ మాత్రమే కాదు, మీ కథ.. మనందరి కథ. ఈ సినిమాను ప్రేమతో, హృదయపూర్వకంగా చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్కు వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా..ఈ మూవీ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సినిమా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రసంగం విని సిద్దార్థ్ నోరెళ్లబెట్టాడు. చాలా బాగా మాట్లాడావని మెచ్చుకున్నాడు. నెక్స్ట్ తెలుగు మూవీ చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడతానని మీథా మాటిచ్చింది. ఇకపోతే మీథా రఘునాథ్ తెలుగులో డైరెక్ట్గా ఇంతవరకు సినిమా చేయలేదు. గుడ్నైట్ అనే తమిళ సినిమా తెలుగు వర్షన్తోనే ఇక్కడివారికి సుపరిచితురాలైంది. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ స్ట్రయిట్ ఫిలిం చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.తెలంగాణ అల్లుడిని కదా..3 BHK మూవీలో శరత్కుమార్, సిద్దార్థ్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సిద్దార్థ్ మాట్లాడుతూ.. 25 ఏళ్లయింది.. నేను ఇంతవరకు భూమి, ఇల్లు ఏవీ కొనలేదు. 3 బీహెచ్కే సినిమా చేస్తున్నప్పుడు తొలిసారి ఇల్లు కొనుక్కున్నాను. పెళ్లయ్యాక బాధ్యతలు పెరిగాయి కదా.. అసలే తెలంగాణ అల్లుడిని కదా! అందుకే నా భార్యతో కలిసి కొత్త ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: 'కాంటా లగా' సాంగ్తో సెన్సేషన్.. నటి కన్నుమూత -
ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్
‘‘ప్రపంచ సినిమాకి చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణులను అకాడమీలోకి ఆహ్వానిస్తున్నందుకు మాకెంతో థ్రిల్గా, ఆనందంగా ఉంది. అంకితభావం, నిబద్ధతతో ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ పురోగతికి కృషి చేస్తున్న ప్రతిభావంతులు వీరు ’’ అంటూ ఆస్కార్ అకాడమీ కమిటీ సీఈవో బిల్ క్రామర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ పేర్కొన్నారు. 98వ ఆస్కార్ అవార్డు వేడుక వచ్చే ఏడాది మార్చి 15 (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16)న లాస్ ఏంజెల్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు కమిటీ ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా విజేతల ఎంపిక ఓటింగ్ కోసం అకాడమీలో సభ్యులుగా చేరాలంటూ దేశ, విదేశాలకు చెందిన సినిమా తారలకు ఆహ్వానం పంపింది కమిటీ. ఆ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నట్లుగా పేర్కొంది. వారిలో యాక్టింగ్ విభాగంలో ఇండియన్ స్టార్స్ కమల్హాసన్, ఆయుష్మాన్ ఖురానాలకు, దర్శకురాలుపాయల్ కపాడియా, సినిమాటోగ్రాఫర్ రణబీర్ దాస్, క్యాస్టింగ్ డైరెక్టర్ కరణ్, ఫ్యాషన్ డిజైనర్ మ్యాక్సిమా బసు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్మృతీ ముంద్రాలకు ఆహ్వానం పంపారు.ఆస్కార్ అవార్డు విజేతల ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు హక్కు లభిస్తుంది. నామినేషన్ల దశ నుంచి విజేతల ఎంపిక వరకూ సభ్యులు ఓటింగ్లోపాలు పంచుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్తగా ఎంపిక చేసిన 534 మంది సభ్యుల్లో స్త్రీల సంఖ్య 41 శాతం ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ దక్కించుకున్నవారి జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు. -
హీరోగా స్టార్ హీరో తనయుడి ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్’. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ నిర్మించారు. ఫీనిక్స్ మూవీలో అభినక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా... వరలక్ష్మి శరత్కుమార్, సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలోని ఇందా వాంగికో...(ఇదిగో తీసుకో అని అర్థం) అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. గతంలో నానుమ్ రౌడీదాన్, సిందుబాద్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన సూర్య సేతుపతి హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్, చక్కని ఎమోషన్తో రూపొందించిన ఈ చిత్రాన్ని జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించారు. -
'అద్దె ఇంట్లో ఉంటున్నా'.. ప్రియురాలు కావాలంటే తప్పదుగా!
3 BHK.. అద్దె ఇంట్లో ఉంటున్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. ఈ కలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రమే 3BHK. హీరో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ట్రైలర్ గురువారం రిలీజైంది. ఈ ఈవెంట్కు తమిళ స్టార్ హీరో రవి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.అద్దె ఇంట్లో ఉంటున్నా..రవి మోహన్ (Ravi Mohan) మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ అద్దె ఇంట్లో ఉండలేదు. నేను పుట్టినప్పటి నుంచి నాకు చెందిన ఇళ్లల్లోనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మాత్రం అద్దె ఇంట్లో బతుకుతున్నాను. ఈ సినిమా నా జీవితానికి దగ్గరగా ఉంది. మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఈ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఇది జనాలకు అస్సలు మింగుడుపడలేదు. ప్రియురాలితో ఉండాలంటే..'అద్దె ఇంట్లో ఉండటమంటే లక్షలు రెంటు కట్టడం కాదు.. సొంతిల్లు లేక అగచాట్లు పడటం!', 'అయినా ఎందుకీ చెత్తంతా వాగుతున్నావు.. నువ్వు హీరోవి, కోట్లల్లో సంపాదిస్తున్నావు.. అద్దె ఇంట్లో కష్టాలు పడే కూలీలా మాట్లాడకు..', 'నీకు పెళ్లయి భార్య ఉంది, కానీ ఆమెను పక్కనపెట్టి ప్రియురాలు కావాలనుకున్నావ్, అలాంటప్పుడు అద్దె ఇంట్లోనే కదా ఉండాల్సింది! సింపతీ కార్డు వాడకు', 'అద్దింట్లో ఉంటున్నావ్.. కానీ సినిమాలు నిర్మిస్తున్నావ్' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమాకాగా రవి మోహన్- ఆర్తి దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సింగర్ కెనీషాతో ప్రేమాయణమే దంపతుల మధ్య చిచ్చు పెట్టిందన్న రూమర్లున్నాయి. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులోనే ఉండగా భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. 3 BHK సినిమా విషయానికి వస్తే.. ఆర్ శరత్కుమార్, దేవయాని, యోగిబాబు, మీఠా రఘునాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా అనుకోలే: మనోజ్ -
మాది కూడా 3 BHK.. అమ్మానాన్న కష్టపడి..: సిద్ధార్థ్ భావోద్వేగం
సిద్దార్థ్ (Siddharth) హీరోగా నటించిన 40వ సినిమా 3 BHK. హైదరాబాద్లో గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో భావోద్వేగానికి లోనయ్యాడు. సిద్దార్థ్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు కూడా 3 BHKలోనే ఉండేవారు. నటుడిగా నాకిది 40వ సినిమా. 3BHK మూవీ చేస్తున్నానని చెప్పగానే నాన్న (సూర్యనారాయణన్) ముఖంలో సంతోషం కనిపించింది. ఒకరకమైన తృప్తి, ఒకింత గర్వం కనబడింది.నాకోసం సంపాదనంతా..ఈ సినిమాలో అందరూ నన్ను ఏడిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీ చేసినందుకు సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో నమ్మారు. నా జీవితం బాగుండాలని వారు సంపాదించినదంతా ఖర్చుపెట్టారు. నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్కు థాంక్యూ అంటూ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు.సినిమాసొంతిల్లు అనేది ఎన్నో మధ్యతరగతి కుటుంబాల కల. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ కల నెరవేర్చుకుందా? లేదా? దానికోసం ఏ చేశారన్నదే 3 BHK కథ. శరత్కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. చదవండి: బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
స్టార్ సింగర్ చిత్రకు గాయం.. ఎలా జరిగిందంటే?
స్టార్ సింగర్ కేఎస్ చిత్ర (KS Chitra)ను ఇష్టపడని వాళ్లుండరు. అద్భుత గాత్రంతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తోంది. ఇటీవల చిత్రకు ప్రమాదం జరిగిందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. చేతికి కట్టుతో కనిపించడంతో ఇది నిజమేనని తేలిపోయింది. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి వివరాలు బయటపెట్టింది చిత్ర. మలయాళంలో వచ్చే స్టార్ సింగర్ (10వ సీజన్) షోలో చిత్ర మాట్లాడుతూ.. చెన్నై ఎయిర్పోర్టులో ఈ ప్రమాదం జరిగింది.కింద పడిపోయా..హైదరాబాద్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వెళ్లాను. అక్కడ సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని నా భర్త కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో అక్కడున్న అభిమానులు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా వెనకాలే సెక్యూరిటీ వస్తువులు పెట్టే ట్రే ఉంది. నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో నన్ను కాస్త వెనక్కు నెట్టారు. ఫోటోలు దిగడం అయిపోయాక నేను వెనక్కు తిరిగి ఓ అడుగు వేశాను. అంతే.. నా కాలు ట్రేకు తగలడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాను.విశ్రాంతిఅప్పుడు నా భుజం ఎముక ఒకటిన్నర అంగుళం కిందకు జరిగింది. డాక్టర్లు దాన్ని సరిచేశారు. కానీ, మూడువారాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మూడు నెలలపాటు జాగ్రత్తగా ఉండమని సూచించారు అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. చిత్ర త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా చిత్ర.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది. ఇప్పటివరకు 25 వేలకుపైగా పాటలు పాడినట్లు తెలుస్తోంది. ఈమెను మెలోడీ క్వీన్ అని పిలుస్తారు. View this post on Instagram A post shared by Asianet (@asianet) చదవండి: Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
చిటుకు... చిటుకు
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, ‘దిల్’ రాజు యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ విడుదల చేయనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘చికిటు..’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించిన ఈ పాటని అనిరు«ధ్, అరివు పాడారు. ‘‘కూలీ’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్ను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన ‘చికిటు..’ పాటకి మంచి స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: గిరీష్ గంగాధరన్. -
థగ్లైఫ్కి మరో ఎదురు దెబ్బ.. రూ.25 లక్షలు జరిమానా?
థగ్లైఫ్(Thug Life ) చిత్రం ఏ ముహూర్తాన మొదలైయిందో గానీ, విడుదల నుంచి వరుసగా అవరోదాలను, అవమానాలను, నష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష , నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడైతే కర్ణాటకలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన నటుడు కమలహాసన్ తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచే ఈ చిత్రానికి కష్టాలు మొదలయ్యాయి. థగ్లైఫ్ చిత్ర విడుదలను కన్నడిగులు అడ్డుకున్నారు.కర్ణాటక హైకోర్టు కూడా నటుడు కమలహాసన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఆయన్ని క్షమాపణ చెప్పాలని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు చిత్ర విడుదలను అడ్డుకోరాదని, పోలీసులు రక్షణ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చిత్రానికి భద్రత కల్పించనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియేసింది. అయితే థగ్లైఫ్ చిత్రం ఇప్పటి వరకూ కర్ణాటకలో విడుదల కాలేదు. అదేవిధంగా విడుదలయిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, తమ డబ్బును వాపస్ చేయాల్సిందిగా డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే థగ్లైఫ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం క్షమాపణ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే చిత్రం ప్లాప్ అవడంతో ఇప్పుడు రూ. 90 కోట్లే ఇస్తాయని మడత పేచీ పెట్టిందని, చివరికి చర్చలనంతరం రూ. 110 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. అదే విధంగా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లు రూ. 25 లక్షలు జరిమానా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం నటుడు కమలహాసన్ థగ్లైప్ చిత్రం విడుదలై 8 వారాల తరువానతనే ఓటీటీలో ప్రసారం చేస్తామని చెప్పారనీ, అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో మల్టీఫ్లెక్స్ థియేటర్లు రూ.25 లక్షలు అపరాధం వేసినట్లు సమాచారం. ఇలా ఈ చిత్రం దెబ్బ మీద దెబ్బను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. -
భార్యకు విడాకులు.. దుబాయ్కు వెళ్లిందంటే అమ్మాయి చెడిపోయినట్లేనా?
సినీ నటుడు రఫీ- మహిన మున్నా విడిపోయారు. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు మహిన ప్రకటించింది. దయచేసి అందుకు గల కారణాలు అడగవద్దని కోరింది. అలాగే తనపై వస్తున్న ఆరోపణలపైనా స్పందించింది. మహిన మాట్లాడుతూ.. నేను, రఫీ కలిసున్నామా? లేదా? అన్నది చాలామంది ప్రశ్న. లేదు, మేమిద్దరం విడిపోయాం. ఎందుకు? ఏమిటి? అనేది ఎవరూ అడగకండి. మా గురించి పేరెంట్స్ను, బంధువులను అడిగి వారిని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను.దుబాయ్కు వెళ్తే అంతేనా?నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పాలనుకోవడం లేదు. మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దు. దుబాయ్కు వెళ్లాకే మహినా మారిపోయింది, రఫీని వదిలించుకుంది అని చెత్త కామెంట్లు చేస్తున్నారు. అవి నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దుబాయ్కు వెళ్తున్న అమ్మాయిలందరూ చెడ్డవారేనా? నేను నా కెరీర్ కోసం ఇక్కడికి వచ్చాను. నా కాళ్లపై నేను నిలబడాలనుకున్నాను. నా పేరెంట్స్ బాగోగులు నేనే చూసుకోవాలనుకున్నాను. దుబాయ్కు రాగానే అమ్మాయిలు మారిపోతారు, చెడిపోతారనే మాటల్లో ఏమాత్రం నిజం లేదు.నేనేంటో మీకేం తెలుసు?నేనే కాదు, 95% మంది ఇక్కడికి పనికోసమే వస్తారు. ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యంగా పని చేస్తారు. నేను కూడా అలా స్వశక్తితో ఎదగాలని వచ్చాను. నా గురించి పనికిరాని కామెంట్లు చేసేవారికి నేనేంటో తెలీదు. నా గురించి తెలిస్తే అలా ఏది పడితే అది వాగరు. రఫీని మోసం చేశానని అనేవాళ్లూ ఉన్నారు. అమ్మాయిలే మోసం చేస్తారా? అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. 100% మంచివాళ్లంటూ ఎవరూ ఉండరు.విడిపోవడమే మంచిదని..మేము కలిసుండటానికి ఎంతగానో ప్రయత్నించాం. అదిక జరగదని అర్థమయ్యాకే విడిపోయాం. దీని గురించి పదేపదే అడిగి అతడి పేరెంట్స్ను కూడా ఇబ్బంది పెట్టకండి. కలిసికట్టుగా ఉంటేనే జీవితం ముందుకు సాగుతుందని నాకూ తెలుసు. కానీ సఖ్యత చెడిపోయినప్పుడు ఆ బంధాన్ని అలాగే కొనసాగించేబదులు విడిపోవడమే మంచిది. మేము చేసిందదే! మా కారణాలు మాకున్నాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మేము కలిసున్నప్పుడు సంతోషాన్నే మీకు చూపించాం. కొందరు వారి కష్టాలు, బాధలు, పోట్లాటలు అన్నీ కూడా వీడియోలు చేసి చెప్తుంటారు. అలా చేయడం నాకిష్టం ఉండదు.ఫేమ్ చూసి పెళ్లి?రఫీకి ఉన్న పాపులారిటీ వల్లే నేనిక్కడిదాకా వచ్చానంటున్నారు. ఆయన ఫేమ్ చూసి నేను పెళ్లి చేసుకోలేదు. ఫేమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా కెరీర్ కోసం విడిపోయాం అని చెప్పుకొచ్చింది. రఫీ, మహినా.. 2022లో పెళ్లి చేసుకున్నారు. రఫీ.. చక్కపాలెం సీరియల్తో పాపులర్ అయ్యాడు. కనిమంగళం కోవిలగం అనే వెబ్ సిరీస్ చేశాడు. ప్రస్తుతం సుమతి వలవు మూవీ చేస్తున్నాడు.చదవండి: ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటకొస్తాయ్ -
రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.రజినీకి భారీ పారితోషికం..ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.#Chikitu 💃🕺 - https://t.co/TcCvuNmTSE#Coolie #CoolieFirstSingle Superstar @rajinikanth in a @Dir_Lokesh directorial 💥 @sunpictures ⚡️With the legendary TR sir, the genius @Arivubeing and thank you @iamSandy_Off for making us dance🙏🏻#Coolie releasing worldwide August… pic.twitter.com/KGjY2S3v8g— Anirudh Ravichander (@anirudhofficial) June 25, 2025 -
వంద కోట్ల క్లబ్లో 'కుబేర'
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేర (Kuberaa Movie). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనాలకు విపరీతంగా నచ్చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తాజాగా కుంభస్థలాన్ని కొట్టేసింది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని కుబేర చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.కుబేర కథదీపక్ (నాగార్జున) నిజాయితీ గల సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. ఆయనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్ మిత్రా(జిమ్ సర్భ్) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్ రూ.లక్ష కోట్ల బ్లాక్ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ.50 వేల కోట్లను బ్లాక్లో పంపించాలి. దానికోసం దీపక్.. నలుగురు భిక్షగాళ్లను తీసుకొచ్చి వాళ్ల పేరు మీద చెరో రూ.10 వేల కోట్ల చొప్పున అకౌంట్లో జత చేస్తాడు. ఆ తర్వాత నలుగురిలో ఒకరైన యాచకుడు దేవా (ధనుష్) తప్పించుకుని పారిపోతాడు. దేవా ఎందుకు తప్పించుకున్నాడు? దేవాను నీరజ్ గ్యాంగ్ పట్టుకుంటుందా? లక్ష కోట్లు చేతులు మారాయా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే! Wealth. Wisdom. And now... ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025 -
ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటపడతాయ్
చెన్నై: కోలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్ -
డ్రగ్స్ కేసు : అజ్ఞాతంలోకి నటుడు కృష్ణ!
మాదక ద్రవ్యాల వ్యవహారం కోలీవుడ్లో విశ్వరూపం దాల్చుతోందనిపిస్తోంది. డ్రగ్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మరో తమిళ నటుడు కృష్ణ కూడా మాదక ద్రవ్యాలను వాడినట్లు సమచారం అందడంతో పోలీసులు ఆయన్ని విచారించాలని నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం కేరళలో షూటింగ్లో పాల్గొంటున్న నటుడు కృష్ణను విచారించడానికి పోలీసులు కేరళకు వెళ్లారు. అయితే కృష్ణ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలోని అనేక యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్ నటులతోనూ కృష్ణకు పరిచయాలు ఉన్నాయి. దీంతో అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ ఈ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. మరి ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి. -
కోర్ట్లో తప్పు ఒప్పుకొన్న నటుడు శ్రీకాంత్
తమిళ నటుడు శ్రీకాంత్.. ఈ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో హాజరు పరచగా.. తను చేసిన తప్పుని ఒప్పుకొన్నాడు. అసలు డ్రగ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చాడు. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు మత్తు పదార్థలు అలవాటు చేశాడని న్యాయస్థానానికి విన్నవించాడు. ప్రసాద్ తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, డబ్బు అడిగిన ప్రతిసారి ఆయన కొకైన్ ఇచ్చేవాడని, అలా తనకు అది అలవాటు అయిపోయిందని శ్రీకాంత్ అన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)తాను డ్రగ్స్ అమ్మలేదని, కేవలం తీసుకున్నానని శ్రీకాంత్ చెప్పాడు. తీసుకోవడం తప్పని తనకు తెలుసని, బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరాడు. కానీ న్యాయస్థానం శ్రీకాంత్ అభ్యర్థని తిరస్కరించింది. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. ఇక ఇదే కేసుతో సంబంధమున్న నటుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. దొరకగానే అతడిని కూడా అరెస్ట్ చేయనున్నారు.'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న శ్రీకాంత్.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దాదా, స్టాప్ లాంటి స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీస్ చేశాడు. దళపతి విజయ్ 'స్నేహితుడు' చిత్రంలోనూ శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇతడు కాస్త డౌన్ అయ్యాడు. ఈ ఏడాది శ్రీకాంత్ చేసిన రెండు తమిళ మూవీస్, ఓ తెలుగు సినిమా 'ఎర్రచీర' రిలీజైంది. కాకపోతే అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే గనుక) -
హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్!
హీరోయిన్ శ్రుతి హాసన్ ట్విటర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఆమె అకౌంట్ నుంచి బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. వరుసగా ఆమె ఖాతా నుంచి ఈ సందేశాలు రావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. హ్యాకింగ్ గురించి శృతిహాసన్ ఇన్స్టా వేదికగా తెలిపింది. దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది.శృతి హాసన్ ట్విటర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు వరుసగా దర్శనమిచ్చాయి. మావెరిక్స్ యజమాని - మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్ పోస్ట్ చేశారు. అయితే శృతి హాసన్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఎవరో నా ఖాతాను హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలర్ట్ చేసింది. -
అజిత్ కుమార్ న్యూ లుక్.. షాకవుతున్న ఫ్యాన్స్!
ఈ ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించింది.ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అజిత్కు కారు రేసింగ్ అంటే ప్రాణం. ఇప్పటికే తన టీమ్తో కలిసి విదేశాల్లో టైటిల్స్ కూడా సాధించారు. సినిమాలకు కాస్తా విరామం దొరకడంతో కార్ రేసింగ్లో బిజీ అయిపోయారు. అజిత్ కుమార్ ప్రస్తుతం బెల్జియంలో తన జీటీ4 యూరోపియన్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ వీకెండ్లో ఈ కార్ రేసింగ్ జరగనుంది.అయితే తాజాగా అజిత్ కుమార్ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. రేసింగ్ ట్రాక్పై సైకిల్ తొక్కుతూ కనిపించారు. అయితే ఈ ఫోటోల్లో అజిత్ కుమార్ గుండు చేయించుకుని కొత్త లుక్తో దర్శనమిచ్చారు. తాజా లుక్ను చూసిన అజిత్ కుమార్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఏడాది 'విదాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో మెప్పించి అజిత్ కుమార్ ప్రస్తుతం ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. AK at Spa Francochamps circuit, Belgium preparing for the 3rd round of GT4 European series coming weekend#ajithkumar #ajithkumarracing #akracing #GT4 #europeanseries #weekendracing #racing pic.twitter.com/nXksEJZUdc— Ajithkumar Racing (@Akracingoffl) June 24, 2025 -
స్టార్ హీరోతో రిలేషన్ .. ప్రేమపై త్రిష పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొంతకాలంగా అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్ బర్త్డే రోజు త్రిష అతని ఫోటో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్ సింబల్ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్ అయింది.తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్ని త్రిష తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. విజయ్తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.త్రిష కెరీర్ విషయానికొస్తే. ఇటీవల థగ్లైఫ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్గా తీసుకున్నారు. విజయ్ విషయానికొస్తే.. తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
డిష్యుం.. డిష్యుం
డిష్యుం.. డిష్యుం.. అంటూ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. ఆయన హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది.కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని ఫిల్మ్నగర్ సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, కొన్ని సన్నివేశాల్లో నెగటివ్ షేడ్స్ కూడా కనిపిస్తాయనే టాక్ తెరపైకి వచ్చింది. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
మూడుభాషల్లో ఒకేసారి దృశ్యం 3
‘దృశ్యం’ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’పై ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, వెంకటేశ్–జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం 2’ హిట్గా నిలిచాయి.ఇక హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన ‘దృశ్యం’, అజయ్ దేవగణ్– డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం 2’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరులో సెట్స్పైకి వెళ్లనుంది.ఇదిలా ఉంటే... జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో ‘దృశ్యం 3’ ఉంటుందని అజయ్ దేవ్గణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ–‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషల్లోనూ ‘దృశ్యం 3’ సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీమ్కు ఇస్తాను. అక్కడి సంస్కృతి, నేటివిటీకి తగ్గట్టు వాళ్లు కథలో మార్పులు చేసుకుంటారు.మూడు భాషల్లో ఒకేసారి ‘దృశ్యం 3’ని చిత్రీకరించడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది’’ అని స్పష్టం చేశారాయన. ‘దృశ్యం 3’ తెలుగులో వెంకటేశ్, హిందీలో అజయ్ దేవగణ్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం
లెజెండరీ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అందులోనూ బ్లాక్బస్టర్ కాంబినేషన్ అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన నాయకన్ (తెలుగులో నాయకుడు) ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన సినిమాయే థగ్ లైఫ్ (Thug Life Movie).క్షమించండిబోలెడు ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ రిజల్ట్పై మణిరత్నం (Mani Ratnam) స్పందిస్తూ సారీ చెప్పారు. మా నుంచి నాయకన్లాంటి సినిమా వస్తుందని ఎదురుచూసినవారికి నేనొక్కటే చెప్పగలను. మమ్మల్ని క్షమించండి. మేము గతాన్ని తిరగరాయాలనుకోలేదు. ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాం. కానీ మీరు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఊహించని ఫలితాల్సి అందుకున్నాం. ప్రేక్షకులు.. మేము ఇచ్చినదానికంటే పూర్తి భిన్నమైనదేదో ఎక్స్పెక్ట్ చేశారు అని పేర్కొన్నారు. జూన్ 5న విడుదలైన థగ్ లైఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చదవండి: జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే? -
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష
అతడు, సైనికుడు సినిమాల్లో సూపర్స్టార్ మహేశ్బాబు(Mahesh Babu)తో జోడీ కట్టింది హీరోయిన్ త్రిష (Trisha Krishnan). నిజానికి ఈ బ్యూటీకి మహేశ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందే తెలుసు. వీరిద్దరూ చెన్నైలోనే కాలేజీ విద్య పూర్తి చేశారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా మహేశ్, త్రిష మధ్య పరిచయం ఏర్పడింది. కానీ యాక్టర్స్ అవుతామని అస్సలు అనుకోలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అదే ఇంటర్వ్యూలో మహేశ్ గురించి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.షూటింగ్ అయిపోగానే..త్రిష మాట్లాడుతూ.. మహేశ్ అద్భుతమైన నటుడు. నాకు ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. పెద్ద స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారు. చాలామందికి అది చేతకాదు. తను చాలా ప్రొఫెషనల్. చాలా హార్డ్వర్క్ చేస్తారు. నాకేమో.. షూటింగ్ అయిపోగానే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోదామనిపిస్తుంది. కానీ వేకువజామునే సెట్కు వచ్చిన మహేశ్ మాత్రం రాత్రి 10.30 గంటలవరకు అక్కడే ఉంటాడు. అలా ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యాను.ఎప్పుడూ మానిటర్ దగ్గరే..తను వానిటీ వ్యాన్కు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదు. తన సీన్ షూట్ లేనప్పుడు కూడా.. మానిటర్ దగ్గరే కూర్చునేవారు అని చెప్పుకొచ్చింది. త్రిష చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించింది. మహేశ్బాబు SSMB29 సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ -
పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. సీనియర్ నటుడు, ప్రస్తుత కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగింది?(ఇదీ చదవండి: దేవి శ్రీ ప్రసాద్కి డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరు?)జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ తీశారు. అయితే జానకి అనే పేరు సీతాదేవికి మర పేరు అని, అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ కూడా ఈ వివాదం గురించి మాట్లాడారు.సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు అని ఉన్నికృష్ణన్ గుర్తుచేశారు. మరి ఈ విషయంలో చిత్రబృందం ఏం చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి అంజలి పవన్ సీమంతం వేడుక) -
త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?
తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం 'హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్' అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ 'జన నాయగణ్' మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో '96' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)Happy Birthday bestest🤗🧿 pic.twitter.com/K4JFdIZXjn— Trish (@trishtrashers) June 22, 2025 -
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు) -
చిన్న వయసులో విగతజీవిగా మారిన నటుడు
మరాఠీ నటుడు తుషార్ ఘడిగోయెంకర్ (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై గోరెగావ్లోని అద్దెకుంటున్న ఫ్లాట్లో శుక్రవారం విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల నివేదిక ప్రకారం.. శుక్రవారం రోజు.. రామ్ మందిర్ రోడ్లో ఓ ఫ్లాట్లోని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు కంట్రోల్ రూమ్కు ఫోన్కాల్ వచ్చింది. అపస్మారక స్థితిలో?వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా తుషార్ నేలపై స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగుల ప్రపంచంలో రాణించాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తుషార్కు పెద్దగా అవకాశాలు దొరక్కపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏడాది కాలంగా మద్యానికి బానిసయ్యాడని పోలీసులు చెప్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నటుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా తుషార్.. మరాఠీ సినిమాల్లోనే కాకుండా థియేటర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ఘంట నాద్ ప్రొడక్షన్ పేరిట సొంతంగా ఓ మ్యూజిక్ వీడియో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆయన.. ఇలా చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు -
నాన్నకు ప్రేమతో..
ఓ తండ్రిది బాధ్యత... మరో నాన్నది పగ. ఇంకో ఫాదర్ది ప్రేమ... ఇలా ఫాదర్ సెంటిమెంట్, ఎమోషన్లతో సిల్వర్ స్క్రీన్పై సినిమాలొస్తే ఆ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. పైగా ఈ తరహా సినిమాల్లో తండ్రి–కొడుకు ఈ రెండు పాత్రలనూ తమ అభిమాన హీరో చేస్తే అభిమానులు ఖుష్ అవుతారు. ఇలా తండ్రీ కొడుకుల ద్విపాత్రాభినయంతో కొందరు హీరోలు, తండ్రిగానో, కొడుకుగానో మరికొందరు హీరోలు ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ ఫాదర్ ఎమోషన్తో సినిమాలు చేసున్నారు. ఆ హీరోలపై ఓ లుక్ వేద్దాం...గతం నిశ్శబ్దంగా ఉండదు జార్జి కుట్టి గుర్తున్నాడుగా..! అదేనండీ... తన కుమార్తెల రక్షణ కోసం, తన కుటుంబం కోసం పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన వ్యక్తి. మలయాళ బ్లాక్బస్టర్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మోహన్లాల్ పాత్ర పేరు జార్జి కుట్టి. ఈ సినిమాలో ఓ తండ్రిగా మోహన్లాల్ నటన అద్భుతమని ప్రేక్షకులు కితాబులు ఇచ్చారు. అందుకే ‘దృశ్యం’ సిరీస్ నుంచి ఇప్పటివరకు ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలు రాగా ఈ రెండు చిత్రాలూ సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇప్పుడు ‘దృశ్యం’ సినిమాలో మూడో భాగంగా ‘దృశ్యం 3’ రానుంది. ‘దృశ్యం, దృశ్యం 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ‘దృశ్యం 3’ సినిమాకూ దర్శకత్వం వహించనున్నారు.‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు... దృశ్యం 3 సినిమా ఉంది’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ఖరారు చేశారు మోహన్లాల్. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానుందని శనివారం మోహన్లాల్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా వెల్లడించారు. మరి... ఈ సారి ఓ తండ్రిగా మోహన్లాల్ తన కుటుంబాన్ని, కుమార్తెలను ఏ విధంగా సంరక్షించుకుంటారో చూడాలి. అయితే ఈసారి తండ్రీ–కుమార్తెల మధ్య ఉన్న ఎమోషనల్ మోతాదును పెంచాలని జీతూ జోసెఫ్ అనుకుంటున్నారట. ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించనున్నారు. మోహన్లాల్ త్వరితగతిన సినిమాలు పూర్తి చేస్తుంటారు కాబట్టి, ‘దృశ్యం 3’ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో రిలీజైనా ఆశ్చర్యపోవడానికి లేదు.మూడు తరాల కథ శర్వానంద్ హీరోగా ‘లూజర్’ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ రానుంది. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూడు తరాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఫాదర్ అండ్ సన్ల మధ్య ఉండే ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందట. మూడు తరాల నేపథ్యం కాబట్టి ఈ చిత్రం డిఫరెంట్ టైమ్లైన్స్లో ఉంటుందనుకోవచ్చు. ఈ సినిమాలో శర్వానంద్ బైక్ రైడర్గా కనిపిస్తారని, ‘రేస్ రాజా’ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం.హిట్ ఫార్ములాఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్ను బాగా అలరించి, హిట్ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ మెయిన్ పాయింట్ ఫాదర్ ఎమోషనే. సముద్రఖని –ధన్రాజ్ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్ కిషన్–రావు రమేశ్ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, మోహన్లాల్ ‘తుడరుమ్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్ ఎమోషన్నే మెయిన్ పాయింట్గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ఇటీవలి కాలంలో తండ్రీ కొడుకుల వినోదం, ఎమోషన్ నేపథ్యం ఉన్న కొన్ని చిత్రాలు ఆడియన్స్ను బాగా అలరించి, హిట్ ఫార్ములా అనిపించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో తండ్రి పాత్రలో వెంకటేశ్, కొడుకు రుత్విక్ ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచిన రామ్చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ మెయిన్ పాయింట్ ఫాదర్ ఎమోషనే. సముద్రఖని –ధన్రాజ్ల ‘రామం రాఘవం’, బ్రహ్మాజీ ‘బాపు’, సందీప్ కిషన్–రావు రమేశ్ల ‘మజాకా’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ నటుడు శశికుమార్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, మోహన్లాల్ ‘తుడరుమ్’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమాల్లో ఫాదర్ ఎమోషన్నే మెయిన్ పాయింట్గా తెరకెక్కిన చిత్రాలూ తెలుగులో అనువాదమై, తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.ధారా.. ఫాదర్ ఆఫ్ దేవా తండ్రీకొడకుల కథలంటే ప్రభాస్కు బాగా ఇష్టం ఉన్నట్లుగా తెలుస్తోంది. తండ్రి ఎమోషన్తో ప్రభాస్ హీరోగా ఆల్రెడీ చేసిన ‘మిర్చి, బాహుబలి’ వంటి సినిమాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. తాజాగా ప్రభాస్ కమిటైన చిత్రాల్లో ‘సలార్’ కూడా ఒకటి. ఈ సినిమాలో కూడా ఫాదర్ ఎమోషన్ గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ‘సలార్’ ఫ్రాంచైజీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రంలో దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ తండ్రి పేరు ధారాగా వినిపించింది. కాగా ‘సలార్: సీజ్ఫైర్’ ఎండింగ్లో ‘సలార్: శౌర్యాంగపర్వం’ సినిమా ఉన్నట్లుగా మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ‘సలార్: శౌర్యాంగ పర్వం’లో దేవా, ధారాల మధ్య మరింత ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న సన్నివేశాలు ఉండే అవకాశం ఉందనిపిస్తోంది. అంతేకాదు... దేవా తండ్రి ధారా పాత్రలోనూ ప్రభాసే కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.పైగా ‘సలార్’ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ప్రభాస్కు చెందిన రెండు డిఫరెంట్ లుక్స్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. వాటిలోని ఒక పోస్టర్లో ప్రభాస్ కాస్త ఏజ్డ్గా కనిపిస్తారు. ఈ పాత్రే ధారా అనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ‘సలార్: శౌర్యాంగపర్వం’ చిత్రం ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్కు వెళ్లలేదు. ఇక ప్రభాస్ హీరోగా చేస్తున్న మరో చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాకు మారతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం సైతం ఓ కుటుంబానికి చెందిన మూడు తరాల నేపథ్యంలో సాగుతుందని, తాత– మనవళ్ల ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ కూడా కాస్త ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’లో తండ్రీకొడుకులు అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి మధ్య ‘బాహుబలి’ సినిమాలో కాంబినేషన్ సీన్స్ లేనప్పటికీ మాహిష్మతి రాజ్యంలో తండ్రి అమరేంద్ర బాహుబలికి జరిగిన అన్యాయానికి తల్లి దేవసేన ్రపోత్సాహం, ప్రతీకారంతో.. మహేంద్ర బాహుబలి రివెంజ్ తీర్చుకోవడం ఆడియన్స్ను మెప్పించింది. ఇక ఇక్కడ ‘బాహుబలి’ ప్రస్తావన తీసుకు రావడానికి ఓ కారణం ఉంది. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ‘బాహుబలి’ ఈ ఏడాది అక్టోబరులో రీ రిలీజ్ కానుంది. అయితే ‘బాహుబలి’ రెండు భాగాలను (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్) కలిపి ఒకే సినిమాగా ఎడిట్ చేసి, రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.వర... సన్నాఫ్ దేవర దేవర చనిపోయినప్పుడు అతని కొడుకు వర చేతిలో కత్తి ఎందుకు ఉంది? తండ్రి దేవరను, అతని కొడుకు వరనే చం పాడా? అసలు ఏం జరిగింది? అనేది ‘దేవర 2’ సినిమాలో చూడాలి. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేసిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో తండ్రి పేరు దేవర. కొడుకు పేరు వర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. 2024 సెప్టెంబరు 24న ‘దేవర పార్ట్ 1’ విడుదలై, సూపర్హిట్గా నిలిచింది. ‘దేవర 2’ చిత్రం కూడా ఉంటుందని, ‘మ్యాడ్ 2’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఎన్టీఆర్ పేర్కొన్నారు.ఈ ‘దేవర 2’ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. అసలు దేవర, అతని కొడుకు వరల మధ్య ఏం జరిగింది? దేవర నిజంగానే చనిపోయాడా? అన్న ఆసక్తికరమైన అంశాలను ‘దేవర 2’లో చూడొచ్చని ‘వార్ 2’ ప్రమోషన్స్లో భాగంగా ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు పోలీస్... అటు ఖైదీ తండ్రంటే ఎవరికి ప్రేమ ఉండదు. కానీ విజయ్ప్రకాశ్కు ఇష్టం లేదు. ఈ విజయ్ప్రకాశ్ ఎవరంటే... ‘సర్దార్’ సినిమాలో పోలీసాఫీసర్. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు కార్తీ. తండ్రి సర్దార్పై దేశ ద్రోహి అనే అభియోగం ఉంటుంది. కానీ తన తండ్రి దేశద్రోహి కాదని, అసలు సిసలైన దేశభక్తుడని ప్రకాశ్ తెలుసుకుంటాడు. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అవుతాడు. కానీ.. ‘సర్దార్’ సినిమాలో తండ్రీకొడుకులు మధ్య ఉన్న సన్నివేశాల నిడివి తక్కవే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రానుంది. ఈ చిత్రంలోనూ కార్తీ తండ్రీ కొడుకుగా ద్వి పాత్రాభినయం చేశారు.పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్కుమార్ నిర్మించారు. ఇటీవలే బ్యాంకాక్లో జరిగిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణతో ‘సర్దార్ 2’ పూర్తయింది. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని కోలీవుడ్ సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా ఉంటాయట. ‘సర్దార్ 2’ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు.మరోవైపు కార్తీ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ఖైదీ 2’. ఈ సినిమాలో కూతురి కోసం తపన పడే దిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపిస్తారు కార్తీ. ‘ఖైదీ’లో తన కుమార్తెను కలవడంతో సినిమా ముగుస్తుంది. మరి... దిల్లీ ఎందుకు జైలుకు వెళ్లాడు? తన కుమార్తెకు దూరమై ఓ తండ్రిగా ఎంత ఆవేదన చెందాడు? అసలు దిల్లీ భార్యకు ఏం జరిగింది? అన్న విషయాలు ‘ఖైదీ 2’లో ఉండొచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఖైదీ 2’లో ఖైదీ దిల్లీ భార్య పాత్రలో అనుష్కా శెట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సెప్టెంబరులో చిత్రీకరణ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్నుప్లాన్ చేశారు. ‘ఖైదీ’ సినిమాను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థనే ‘ఖైదీ 2’నూ నిర్మించనుందట.తొలిసారి ద్వి పాత్రాభినయం ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో మూవీ రానున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్లోని ఈ 14వ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారు. బ్రిటిష్ పరి పాలన కాలం నేపథ్యంలో 1854–1878ల టైమ్ పీరియడ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రీకొడుకుగా ద్వి పాత్రాభినయం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.స్క్రీన్పై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ ద్వి పాత్రాభినయం చేయలేదు. సో... తొలిసారి విజయ్ ఈ తరహా ప్రయత్నం చేస్తుండటంతో, ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్లో అంచనాలు ఉన్నాయి. ఇంకా ‘గీత గోవిందం, డియర్ కామ్రెడ్’ వంటి సినిమాల తర్వాత హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ఈ సినిమా కోసం మరోసారి కలిసి పని చేయనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగే ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్ వర్క్ తుది దశకు చేరుకుంది. సెట్ వర్క్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక విజయ్ సెట్స్కి వచ్చి, రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనడమే ఆలస్యం. 2026 చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.మధ్యతరగతి తండ్రి కథ పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘చౌకీదార్’. ఈ చిత్రంలో సాయికుమార్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీ అంబర్, సాయికుమార్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నాన్న అంటేనే దైవం’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను బట్టి ఈ సినిమాలో తండ్రీకొడుకుల ఎమోషన్, ఓ మధ్య తరగతి తండ్రి తన కుటుంబం కోసం పోరాడే తీరు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో కల్లహల్లి చంద్రశేఖర్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఫాదర్ ఎమోషన్తో మరికొన్ని సినిమాలు రానున్నాయి. -
'గతం నిశ్శబ్దంగా ఉండదు'.. మోహన్ లాల్ దశ్యం-3 ఎప్పుడంటే?
దృశ్యం సినిమా సిరీస్కు ఆడియన్స్లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో ఇప్పటికే రెండు పార్టులు విడుదలై అభిమానులను అలరించాయి. మలయాళంలో వచ్చిన ఈ సినిమాను అటు తెలుగులో.. ఇటు బాలీవుడ్లోనూ రిలీజ్ చేయగా సూపర్హిట్గా నిలిచాయి. ఇప్పటికే ఈ సూపర్ హిట్ మూవీ సిరీస్లో దృశ్యం-3 కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే తాజాగా దృశ్యం-3 రిలీజ్ ఎప్పుడనేది కూడా మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్లో థియేటర్లలో విడుదల కానుందనిప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దృశ్యం మూవీపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. 'దృశ్యం సినిమా మలయాళ పరిశ్రమకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మేము ఆ చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రాన్ని భారతదేశమంతా వీక్షించింది. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మలయాళ పరిశ్రమ గురించి తెలుసు. దృశ్యం తర్వాత మరిన్ని మలయాళ చిత్రాలను చూడటం ప్రారంభించారు. ఇది మా పరిశ్రమకు, అంతర్జాతీయంగా కూడా ఒక వరంలా మారింది." అని సంతోషం వ్యక్తం చేశారు.'దృశ్యం సూపర్ హిట్ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సింహళీ, చైనీస్ భాషలలో కూడా రీమేక్ చేశారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 'దృశ్యం 3' హిందీ వర్షన్ సైతం అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ సినిమాను రీమేక్ చేస్తారా? లేదంటే సొంతగా కథను తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తొలి రెండు భాగాలు మలయాళం నుంచి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. October 2025 — the camera turns back to Georgekutty.The past never stays silent.#Drishyam3 pic.twitter.com/8ugmxmb2wO— Mohanlal (@Mohanlal) June 21, 2025 -
దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్ రెండో పెళ్లి
దర్శకుడు, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అనీశ్ ఉపాసన (Aniesh Upaasana) రెండో పెళ్లికి సిద్ధమయ్యా. కారణం.. ఉపాసన బుల్లితెర నటి తుషారా కమలాక్షితో ఉన్న ఫోటోను షేర్ చేయడమే! ఈ పోస్ట్ కింద తుషారాను లైఫ్ పార్ట్నర్ (జీవిత భాగస్వామి)గా అభివర్ణిస్తూనే హార్ట్ సింబల్ జత చేశాడు. ఇది చూసిన అభిమానులు ఈ లవ్ బర్డ్స్కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. దృశ్యం నటితో పెళ్లి- విడాకులుఅనీశ్ గతంలో నటి అంజలి నాయర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె నెడునల్వాడై, తానక్కరణ్, కలింగళిల్ ఆవల్ వాసంతం, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్, దృశ్యం 2 వంటి చిత్రాల్లో నటించింది. అనీశ్.. మ్యాట్నీ, సెకండ్స్, పాప్కార్న్, జానకి జానే సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు దశాబ్దాలుగా మోహన్లాల్ దగ్గర ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. త్వరలోనే రెండో పెళ్లిఅనీశ్ దర్శకుడిగా పరిచయమైన మ్యాట్నీ సినిమాలో అంజలి హీరోయిన్గా నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 2011లో పెళ్లిచేసుకోగా.. ఈ జంట ప్రేమకు గుర్తుగా ఓ కూతురు జన్మించింది. తర్వాతేమైందో కానీ 2016లో అంజలి, అనీశ్ విడిపోయారు. 2022లో అంజలి అజిత రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ పాప పుట్టింది. View this post on Instagram A post shared by ANIESH UPAASANA (@director_aniesh_upaasana) చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్ వార్నింగ్ -
కొత్త రూల్.. సంతకం పెడితేనే సినిమా షూటింగ్
మలయాళ చిత్రసీమలో డ్రగ్ కల్చర్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. షూటింగ్ లొకేషన్స్లోనే పలువురు నటులు మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు తోటి నటీనటుల్ని ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓ మూవీ సెట్లో తోటి నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపణ చేసింది. మరోవైపు డ్రగ్స్ ఆరోపణలతో షైన్ టామ్ చాకో సహా పలువురు నటుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: ‘స్ట్రా' మూవీ రివ్యూ.. కూతురు కోసం ఒంటరి మహిళ పోరాటం)దీంతో ప్రస్తుత పరిస్థితుల్ని మార్చేందుకు మాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. ఇకపై సినిమాలు చేయాలంటే షూటింగ్ టైంలో డ్రగ్స్ తీసుకోం అని రాసున్న అఫిడవిట్లో సంతకం చేయాలని తీర్మానించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నటీనటులు ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఒప్పుకొనేటప్పుడు తప్పకుండా ఈ అఫిడవిట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సెట్లో అడుగుపెట్టనిస్తారు. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఈ రూల్ వర్తిస్తుంది. అలానే నటీనటుల సిబ్బంది కూడా ఇది కచ్చితంగా పాటించాలి.షూటింగ్ లొకేషన్స్తోపాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుందని కేరళ చిత్రసీమ చెప్పుకొచ్చింది. నిర్మాతల అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆమోదం వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం 'అమ్మ' (మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 26 నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది. చూడాలి మరి ఎంతమంది పాటిస్తారో?(ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన) -
ధనుష్తో కుబేర చూసిన శేఖర్.. రెస్పాన్స్ అదిరిపోలా!
ఏదో వచ్చామా? నాలుగు సినిమాలు చేశామా? అని కాదు.. చేసిన సినిమా గురించి నలుగురు మాట్లాడుకున్నారా? జనాలు గుండెలో పెట్టుకున్నారా? అనేట్లు ఉండాలి. శేఖర్ కమ్ముల (Sekhar Kammula)కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే.. భారీ ఫైట్లు.. విజువల్ ఎఫెక్ట్స్.. భారీ బడ్జెట్ చిత్రాల జోలికి పోడు. సింపుల్గా రాసుకున్న కథలతోనే ఊహించని విజయాలు అందుకుని థియేటర్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాడు.నాలుగేళ్ల గ్యాప్తో మూవీఇప్పుడదే జరుగుతోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తీసి ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అయినా వెంటనే సినిమా చేయలేదు. నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని కుబేర (Kuberaa Movie)తో వచ్చాడు. ధనుష్ను యాచకుడిగా, నాగార్జునను సీబీఐ ఆఫీసర్గా చూపించాడు. డబ్బు, స్వార్థం చుట్టూ కథ అల్లుకున్నాడు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.వీడియో వైరల్జనాల స్పందన ఎలా ఉందో చూద్దామని శేఖర్, ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లారు. ప్రజల అరుపులు, కేకలు విని ఆనందంతో వారికి కడుపు నిండిపోయింది. ధనుష్ అయితే.. డంపింగ్ యార్డ్లో కంపు కొడుతున్నా గంటల తరబడి షూటింగ్ చేసిన కష్టాన్ని మర్చిపోయి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dhanush get emotional after seeing #Kuberaa Response 🥹🙏🙏@dhanushkraja WHAT A PERFORMANCE THROUGHOUT ENTIRE MOVIE 👏👏pic.twitter.com/rYl2BQSBUV— Dhanush Trends ™ (@Dhanush_Trends) June 20, 2025Whistles, applause and what not 🔥🔥It’s a BLOCKBUSTER WAVE that’s set @dhanushkraja & @sekharkammula’s hearts ablaze ❤️🔥This is the kind of cinema that demands to be experienced on the big screens 💥💥Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa… pic.twitter.com/yJTmUKtuhQ— Kuberaa Movie (@KuberaaTheMovie) June 20, 2025 చదవండి: 'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి' -
'కుబేర నాకెంతో స్పెషల్.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి'
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తాజాగా చిత్రం కుబేర. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఓ ట్వీట్ వేసింది. చాలా కారణాల వల్ల కుబేర నాకు స్పెషల్ చిత్రంగా నిలవబోతుంది. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకోవడం, అద్భుతంగా నటించడం ధనుష్ సర్ వల్లే సాధ్యమవుతుంది.ఎప్పటికీ గుర్తుండిపోతుందిశేఖర్ (Sekhar Kammula) గారి డైరెక్షన్లో నాగార్జున సర్ కిల్లర్ లాంటి పాత్రలో కనిపించడం మాకు కన్నుల పండగ్గా ఉంటుంది. ప్రియమైన రష్మిక.. శేఖర్ గారు తన సినిమాల్లో హీరోయిన్లకు శక్తివంతమైన పాత్రలు ఇస్తారు. కుబేరలో నీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే నీ విజయాల పరంపరలో ఈ మూవీ కూడా చేరిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ గారు.. మీరు మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం! రక్తం ధారపోశారుచైతన్య, సూరి, అజయ్, స్వరూప్.. మీరంతా రక్తం ధారపోసి కష్టపడ్డారు. అందుకు ప్రతిఫలం, గుర్తింపు తప్పకుండా వస్తుంది. నిర్మాత సునీల్ గొప్ప కథల్ని ఎంచుకుని అందిస్తున్నందుకు దివంగత నారాయణ్దాస్ గారు పై నుంచి ఎంతో గర్విస్తుంటారు. శేఖర్గారిలాంటి స్వచ్ఛమైన హృదయం కలవారే ఇలాంటి సినిమాలు తీయగలరు. మీరు ఒక తరాన్నంతటినీ ప్రభావితం చేస్తున్నారు. అందులో నేనూ ఉన్నాను. నా గురువుగారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కుబేరఇలాంటి మంచి కథల్ని మరెన్నో అందించాలని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సాయిపల్లవి ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చేసింది. కుబేర సినిమా విషయానికి వస్తే.. నాగార్జున సీబీఐ ఆఫీసర్గా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. నికేత్ బొమ్మరెడ్డి కెమెరామేన్గా పని చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న రిలీజైంది. #Kuberaa is going to be special for many reasons! @dhanushkraja sir’s masterclass in acting & art of picking challenging characters that only he can pull off so effortlessly. @iamnagarjuna sir, It’s going to be a treat to watch you in a killer character under Sekhar garu’s…— Sai Pallavi (@Sai_Pallavi92) June 20, 2025 చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ -
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు -
సౌత్లో బాడీ షేమింగ్.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్
వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్ రెడ్డి రీమేక్).. హిందీలో అక్టోబర్, సర్దార్ ఉద్ధమ్, మదర్ థెరిస్సా అండ్ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్లో సినిమాతో పాటు వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్ షెర్డిల్ మూవీ జీ5లో శుక్రవారం (జూన్ 20) రిలీజ్ కానుంది.నిద్ర లేకుండా షూటింగ్ఈ సందర్భంగా ప్రమోషన్స్లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. బ్లాక్లిస్ట్.. లెక్కచేయనుఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్లిస్ట్లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
అందరిచూపు సౌత్వైపే.. ఇక్కడే పాగా వేస్తానంటున్న బ్యూటీ
ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్బాస్ 18 ఫేమ్, హీరోయిన్ యామిని మల్హోత్రా (Yamini Malhotra) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.అన్నీ ప్రత్యేకమేదంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్ బబుల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్ప్లే, విజన్ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.ఎగ్జయిట్ అయ్యా.. కానీ!తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ 'చిల్ మార్ నా బ్రో' మూవీతో ఇటీవలే బాలీవుడ్లో అడుగుపెట్టింది.చదవండి: సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా -
సౌత్లో మంచి రోల్స్ ఇవ్వలే? యాంకర్కు కౌంటర్ ఇచ్చిన జెనీలియా
జెనీలియా.. హహ.. హాసినిగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! బొమ్మరిల్లు ఒక్కటే కాదు సై, నా అల్లుడు, హ్యాపీ, ఢీ, రెడీ, ఆరెంజ్.. ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. ఇందులో కొన్ని సినిమాలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి కూడా! అందులో రామ్పోతినేనితో చేసిన రెడీ మూవీ ఒకటి. ఇది హిందీలో సల్మాన్ ఖాన్తో రీమేక్ చేశారు. కానీ హీరోయిన్గా జెనీలియా (Genelia D'Souza)కు బదులుగా అసిన్ను తీసుకున్నారు. జెనీలియాను సల్మాన్ వద్దనడంపై అప్పట్లో చర్చ జరిగింది.ఇంకో అవకాశం ఎదురుచూస్తుందేమో..సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న జెనీలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెడీ హిందీ రీమేక్లో మిమ్మల్ని తీసుకోనందుకు బాధపడ్డారా? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. అందుకు హీరోయిన్.. అలాంటిదేం లేదు. కానీ నన్ను సంప్రదించుంటే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఎందుకంటే అది నా సినిమా. అయినా ఆ అవకాశం పోయిందంటే సల్మాన్తో నటించేందుకు మరో మూవీ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో.. అని చెప్పుకొచ్చింది.రుణపడి ఉన్నాతర్వాత యాంకర్.. దక్షిణాదిన మంచి పాత్రలు దక్కలేదు కదా? అని ప్రశ్నించగా వెంటనే జెనీలియా కాదంటూ మధ్యలోనే అడ్డుకుంది. ఆమె మాట్లాడుతూ.. సౌత్లో నాకెప్పుడూ మంచి పాత్రలే దక్కాయి. నా సినిమాలు చూస్తే సౌత్లో నాకు ఎంత అద్భుతమైన పాత్రలు దక్కాయో తెలుస్తుంది. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. నాకు మంచి సినిమాలు ఇచ్చారు.. అందుకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఈరోజు హైదరాబాద్కు వెళ్లినా సరే హాసిని(బొమ్మరిల్లులో జెనీలియా పాత్ర పేరు) అంటే చాలు నా పేరు చెప్తారు. ఎంజాయ్ చేశాతమిళంలో హరిణి (సంతోష్ సుబ్రహ్మణ్యం), మలయాళంలో ఆయేషా (ఉరుమి).. ఈ పేర్లతోనే నన్ను ఇప్పటికీ పిలుస్తుంటారు. అలాంటి పాత్రలు దక్కడం నా అదృష్టం. శంకర్, రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్లతోనే కాకుండా కొత్త దర్శకులతోనూ పని చేశాను. ఈ మొత్తం ప్రక్రియను నేను ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ ఇండస్ట్రీపై విషం కక్కాలనుకున్న యాంకర్కు జెనీలియా గట్టిగానే బుద్ధి చెప్పిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Anchor: South films never used to give solid roles.Genelia : No, I always got - if you see my South films, I've had the best roles ever. It was my learning ground. I am eternally indebted to the work that I got there.#GeneliaDeshmukh pic.twitter.com/OBOhFQAAqZ— Whynot Cinemas (@whynotcinemass_) June 18, 2025చదవండి: బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
కోలీవుడ్ అగ్రనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మణిరత్న- కమల్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో విఫలమైంది.అయితే బెంగళూరులో కమల్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటక రిలీజ్ చేయలేదు. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ థగ్ లైఫ్ సినిమాపై నిషేధం విధించింది. ఈ వివాదంపై కమల్ హాసన్ టీమ్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ను కర్ణాటకలో అడ్డుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది మీ కర్తవ్యమని కర్ణాటక ప్రభుత్వానికి గుర్తు చేసింది.సుప్రీం తీర్పుతో థగ్ లైఫ్ సినిమా స్క్రీనింగ్కు ఎట్టకేలకు రక్షణ కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం నుంచి హామీ లభించింది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన పిల్ విచారణను ముగించింది. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో ఈ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. -
'మమ్ముట్టి' ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్ నిజమే : రాజ్యసభ ఎంపీ
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ పలు వ్యాఖ్యలు చేశారు. మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. కానీ, చిన్న ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. మమ్ముట్టి గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆయన టీమ్ గతంలోనే అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఇలా చెప్పారు. 'మమ్ముట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేది నిజం. కానీ, కేవలం చిన్న ఆరోగ్య సమస్యకు మాత్రమే చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన బాగానే ఉన్నారు, నేను ఇప్పుడే అతనితో ఫోన్లో మాట్లాడాను. మేము చాలా సంవత్సరాలుగా స్నేహితులం, కానీ మేము ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను చర్చించే రకం కాదు. ఇటీవల రోజుల్లో, మేము అలాంటి విషయాలను కూడా పంచుకుంటున్నాము. ఆయన పూర్తి సంతోషంతో ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. త్వరలో సినిమా సెట్లో ఆయన్ను చూస్తారు.' అని ఆయన చెప్పారు.మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్లోనే మమ్ముట్టి కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సినిమా షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. త్వరలో ఆయన మళ్లీ సెట్స్లో అడుగుపెట్టనున్నారు. -
నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు
కోలీవుడ్ నటుడు ఆర్య నివాసం, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆకస్మిక దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్లోని తను నిర్వహిస్తున్న 'సీ షెల్' హోటల్తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.ఆర్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు. ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్ను గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. -
నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల( Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'. జూన్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం శేఖర్ కమ్ముల చేసిన సాయం గురించి యాంకర్ ప్రశ్నించారు. ఒక రైతు కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం ఎందుకు శారో చెప్పాలని కోరారు. దీంతో శేఖర్ కమ్ముల పలు విషయాలను పంచుకున్నారు.కూతురు పెళ్లి చేద్దామని ఓ రైతు దాచుకున్న డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. దీంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడని వార్త తెలిసింది. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. కూతురి పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బు అలా కాలిపోవడంతో నేను బాగా ఎమోషనల్ అయ్యాను. బాగా డబ్బున్నోడి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతేనే బాధేస్తుంది..అలాంటిది పేదోడి డబ్బు, అది కూడా ఎంతో కష్టపడి సంపాధించింటాడు. దీంతో ఆ రైతు బాధేంటో నాకు అర్థం అయింది. అందుకే సాయం చేశాను.' అని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ నుంచి పలు సేవలు అందించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి ప్రతిరోజు ఆయన భోజనం అందించారు. అయితే, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేదు.2021 సమయంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో తన కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచుకున్న రూ. లక్షలు మంటల్లో కాలిపోయాయి. ఆ వార్త తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి రూ. 2లక్షలు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు పంపించారు. అదే సమయంలో రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అవసరమైతే మరింత సాయం చేస్తానని.. ముందు కూతురు పెళ్లి మంచిగా జరిపించాలని కోరారు. 🚨కూతురు పెళ్లి కోసం దాచుకున్న రెండు లక్షల రూపాయలు కాలిపోయాయని తెలియగానే,నా కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే 2 లక్షలు పంపించాను …! – #SekharKammula | #Kuberaa pic.twitter.com/0pNLtXRq7X— Bharat Media (@bharatmediahub) June 18, 2025 -
రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు!
దర్శకుడు శంకర్ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్, జీన్స్, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.🎥 తమిళ అన్నియన్ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్తో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించారు.🎥 శంకర్ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ప్లేలో స్టార్ రైటర్ సుజాత రంగరాజన్ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్ వెల్లడించాడు.🎥 ఎక్కడైనా హీరో డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్లో వంద రోజులు ఆడింది.🎥 అపరిచితుడు పబ్లిక్తో మాట్లాడే సీన్ను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.🎥 శంకర్ ఈ కథ మొదటగా రజనీకాంత్కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!🎥 విక్రమ్ భార్య శైలజ సైకాలజిస్ట్. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్.🎥 హీరోయిన్గా కూడా జీన్స్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నారు. కానీ బాలీవుడ్లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.🎥 ఏఆర్ రెహమాన్ లేకుండా సినిమా చేయని శంకర్.. ఈ చిత్రానికి రెహమాన్ శిష్యుడు హ్యారిస్ జైరాజ్ను తీసుకున్నాడు.🎥 ఫ్రెంచ్ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.🎥 ఫైట్ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్ అయింది.20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్? వీడియోతో ఆన్సర్ దొరికేసింది! -
అవమానించారని అనుపమ ఆవేదన.. టాప్ హీరోయిన్లకూ అదే కర్మ?
అనుపమ (Anupama Parameswaran).. మా గుండెకాయ అని చెప్పుకునే కుర్రాళ్లు బోలెడంతమంది. చూపు తిప్పుకోని అందంతో, సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందీ బ్యూటీ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్కు సొంతగడ్డ అయిన కేరళలో మాత్రం ఆదరణ దక్కలేదట! ఆ విషయాన్ని స్టేజీపై చెప్తూ ఎమోషనలైందీ కేరళ కుట్టి.నటన రాదని హేళనఅనుపమ ప్రస్తుతం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్లో అనుపమ మాట్లాడుతూ.. మలయాళంలో చాలామంది నన్ను రిజెక్ట్ చేశారు. నాకు నటన రాదని హేళన చేశారు. ఎంతో ట్రోల్ చేశారు. అలాంటిది దర్శకుడు ప్రవీణ్ నన్ను నమ్మి శక్తివంతమైన పాత్ర ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. అక్కడే స్టేజీపై ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపి ఈ మాటలు విని చలించిపోయాడు. ఆయన మాట్లాడుతూ.. అనుపమ మాటలు గుండె లోతుల్లోనుంచి వచ్చాయి. అయినా ఇలాంటివి జరగడం ఇది మొదటిసారి కాదు.ఆ హీరోయిన్ల విషయంలోనూ..ఒకప్పుడు హీరోయిన్ సిమ్రాన్ (Simran)ను కూడా మలయాళ చిత్రపరిశ్రమ పట్టించుకోకుండా వదిలేసింది. తను ఓ స్థాయికి చేరుకున్నాక నాకు తెలిసిన ఎంతోమంది టాప్ డైరెక్టర్లు తనను కథానాయికగా తీసుకోవాలని ఆమె వెంటపడ్డారు. కర్మంటే ఇదే.. అలాగే కేరళకు చెందిన అసిన్, నయనతార (Nayanthara) కూడా వివిధ భాషల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. అనుపమ జీవితంలోనూ ఇదే జరుగుతుంది. తను తప్పకుండా రాణిస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జూన్ 27న విడుదల కానుంది.సినిమాఅనుపమ విషయానికి వస్తే.. నివీన్ పౌలీ 'ప్రేమమ్' అనే మలయాళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగచైతన్య 'ప్రేమమ్', అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, రాక్షసుడు, కార్తికేయ 2, రౌడీ బాయ్స్, 18 పేజీస్, టిల్లు స్క్వేర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో.. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, బైసన్, లాక్డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ చిత్రాలున్నాయి.చదవండి: హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం -
సింగర్తో జయం రవి రిలేషన్.. ఏకంగా ఇద్దరు కలిసి!
కోలీవుడ్ స్టార్ జయం రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. గతేడాది తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ హీరో.. ఆ తర్వాత తన భార్య ఆర్తి ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు తెరపైకి రావడంతో జయం రవితో రిలేషన్లో ఉందంటూ వార్తలొచ్చాయి. ఆర్తి రవి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. అంతకుముందే జయం రవి, సింగర్ కెన్నీషా ఓ పెళ్లి వేడుకలో జంటగా కనిపించడంతో వీరి రిలేషన్పై మరింత టాక్ వినిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్పై చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం.సాంగ్లో జయం రవి ప్రత్యక్షం..తాజాగా సింగర్ కెన్నీషా ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోను రిలీజ్ చేసింది. 'ఆండ్రమ్ ఇంద్రమ్'అనే పేరుతో మ్యూజిక్ వీడియో జూన్ 15న విడుదలైంది. ఈ పాటలో జయం రవి అతిథి పాత్రలో కనిపించాడు. అంతేకాకుండా రవి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కెనీషాకు అభినందనలు తెలిపారు. దీంతో వీరిద్దరి రిలేషన్పై మరోసారి కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో ఉన్నందున వీరిద్దరి తమ రిలేషన్పై మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
'తండ్రి నుంచి చాలా నేర్చుకుంటున్నారు'.. జయం రవి భార్య ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు గత కొద్దికాలంగా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం తన భార్య ఆర్తితో విడాకులకు సిద్దమవడమే. గతేడాది సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత భార్య, భర్తలిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అప్పట్లో మరింత హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత వీరి మధ్యలో సింగర్ కెన్నీషా పేరు రావడంతో విడాకుల వ్యవహారం కాస్తా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా మూడో వ్యక్తి ప్రమేయం వల్లే తాము విడిపోతున్నామంటూ ఆర్తి ఆరోపించింది. ప్రస్తుతం విడాకుల పంచాయతీ మాత్రం కోర్టులో పెండింగ్లో ఉంది.అయితే ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా జయం రవి భార్య ఆర్తి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన తండ్రి కృష్ణమూర్తి విజయ్కుమార్తో ఆమె కుమారులు సరదాగా ఆడుకుంటున్న వీడియోను పంచుకుంది. ఆయన తనకు ఎంత అండగా నిలిచారో నాకు మాత్రమే తెలుసన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించడన్ని తన పిల్లలు కూడా ఆయన నుంచి నేర్చుకుంటారని రాసుకొచ్చింది. తనను మొదట ప్రేమించిన వ్యక్తి తన తండ్రేనని ఆర్తి ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఆర్తి రవి తన తండ్రిన గురించి రాస్తూ.. 'తనను మొదట ప్రేమించిన వ్యక్తి నా తండ్రి. నన్ను మొదట ప్రేమించిన వ్యక్తి ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ రోజు కొన్ని పదాలు వినడానికి మనసుకు చాలా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నా చుట్టూ చాలా అనిశ్చితిగా అనిపించినప్పుడు నేను ఎలా బయటపడాలో కూడా నాకు తెలియని రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాతోనే ఉన్నారు.. కానీ ఏమి చేయాలో మీరు అడగలేదు. ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా ఉన్నారు. తన తండ్రి ప్రేమను తాను తేలికగా తీసుకుంటున్నానని.. అయితే తన పిల్లలు మాత్రం ఆయన ప్రేమను చూసి చాలా నేర్చుకుంటున్నారు. షరతులు లేకుండా ప్రేమించబడటం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే చాలు. మీరు నన్ను మాత్రమే కాదు.. నా పిల్లలను కూడా అలానే పెంచుతున్నారంటూ ' ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.అంతేకాకుండా జీవితంలో తన అనుభవాలు తనను ఎలా మార్చాయో కూడా ఆర్తి ప్రస్తావించింది. జీవితంలో మళ్లీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు నేను మీ దృష్టిలో ఒకప్పుడు మీరు వదిలేసిన అమ్మాయిని కాదని నాకు తెలుసు. జీవితం నన్ను ఎవరూ ఊహించని విధంగా పరీక్షించింది. నేను వాగ్దానం చేస్తున్నా.. మళ్లీ మీ చిన్న అమ్మాయిగా తిరిగి వస్తా అంటూ పోస్ట్ చేసింది. కాగా.. దాదాపు 15 ఏళ్ల తర్వాత రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. View this post on Instagram A post shared by Aarti Ravi (@aarti.ravi) -
రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి ఆరోపణలు
మలయాళంలో ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన చిత్రం తుడరుమ్ (Thudarum Movie). మోహన్లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.230 కోట్లు రాబట్టింది. దీంతో మలయాళ సినీచరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా తుడరుమ్ నిలిచింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది.2020లో రాసుకున్న కథతాజాగా ఈ మూవీ చూసిన డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరణ్ (Sanal Kumar Sasidharan) తుడరుమ్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. 2020లో నేను 'తీయట్టం' అని ఓ స్క్రిప్ట్ రాశాను. తుడరుమ్ చూస్తుంటే.. తీయట్టంలోని మూలకథను దొంగిలించినట్లే అనిపించింది. నా కథను చోరీ చేసి ఈ సినిమా రూపొందించారు. నా కథ సారాంశాన్ని గ్రహించేంత శక్తి వారికి లేకపోవడం వల్ల మూల కథ ఆత్మ ఇందులో చెక్కుచెదరకుండా కనిపిస్తోంది.డైలాగ్ కూడా నాదే!తీయట్టం కథ అంబి అనే ఆటో డ్రైవర్ చుట్టూ నడుస్తుంది. కొందరు ఓ వ్యక్తిని తల నరికి అతడి ఆటోలో పడేస్తారు. దీంతో ఈ హత్య కేసులో అంబి ఇరుక్కుంటాడు. ఇదే ప్రధాన కథ. నాకు మచ్చుకైనా చెప్పకుండా, ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా దీన్ని కాస్త అటుఇటుగా మార్చేసి తుడరుమ్లో వాడుకున్నారు. అలాగే ఒరిజినల్లో.. నువ్వు చంపితే అది పాపం.. కానీ, తింటే అది శుద్ధి అవుతుంది అన్న డైలాగ్ను కూడా సందర్భం లేకపోయినా తుడురుమ్లో వాడుకున్నారు.ఓవర్ కాన్ఫిడెన్స్ఎంతో అనుభవమున్న దొంగలు కూడా ఎవరికీ దొరకములే అన్న అతి విశ్వాసంతో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. తుడరుమ్లో ఈ డైలాగ్ను చేర్చడం చూస్తే నాకలాగే అనిపించింది. నేనెప్పుడో ఈ సినిమా చేయాల్సింది. మంజు వారియర్, టోవినో థామస్, మురళీ గోపి వంటి నటులతో ఈ మూవీ చేసేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. కానీ ఐదు సంవత్సరాలు అయిపోయినందున వారంతా దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే నా కథను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని రాసుకొచ్చాడు.చదవండి: 'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన -
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్కు అర్చకుల సూచన
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార ఎంత హిట్ అయ్యిందో తెలియనిది కాదు, చిన్న బడ్జెట్తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి కాంతార: చాప్టర్ 1 పేరుతో పార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నట్లు సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. జూనియర్ ఆర్టిస్టు కపిల్, నటుడు రాకేశ్ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వీకే ఈ సినిమాలో నటిస్తూ, ఆకస్మికంగా మరణించారు. ఇంతలో శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ మునిగిపోయింది.ఆర్టిస్టుల ఆకస్మిక మరణాలు● కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్టుగా ఈ కాంతారా చాప్టర్ 1లో నటిస్తూ ఉండేవాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌప ర్ణికా నదిలో కపిల్ ఈత కొడుతూ నది లో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.● కామెడి కిలాడిగళు ద్వారా పేరు పొందిన రాకేశ్ పూజారి మంచి హాస్యనటుడు. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడుపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు.● సరిగ్గా నెలరోజులకు జూన్ 12న కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారు.ప్రమాదాలు సైతం● గతేడాది నవంబర్లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళుతున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.● కాంతార చాప్టర్ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసం అయి ఆస్తి నష్టం కలిగింది.● హాసన్జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖాధికారులు కూడా తనిఖీ చేశారు.రిషబ్కు అర్చకుల సూచనరిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి , జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి అని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. -
అల్లు అర్జున్ డైరెక్టర్ చిత్రాలన్నీ కాపీనే?.. దర్శకుడి రియాక్షన్ ఇదే!
జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ ఏడాది బిగ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. అది కూడా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుగొణె హీరోయిన్గా కనిపించనుంది.అయితే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టరేట్ స్వీకరించిన అట్లీ సినిమాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా తన చిత్రాలన్నీ కాపీ చేశారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ సినిమా గురించి కూడా మాట్లాడారు.అట్లీ మాట్లాడుతూ.. "సాధారణంగా ప్రేక్షకులు నా సినిమాలు కాపీ అని అంటారు.కానీ ఈ రోజు నా జీవితం గురించి నేను మీకు చెప్తా. ఈ రోజు నిజం చెబుతున్నా నేను తీసే సినిమాలన్నీ నా జీవితం నుంచి ప్రేరణ పొందా. ఇవాళ మీకు కనెక్ట్ అయ్యే ఒక ఉదాహరణ చెప్తా. విజయ్ నటించిన బిగిల్ సినిమా.. గ్యాంగ్స్టర్ నుంచి ఫుట్బాల్ కోచ్గా మారిన మైఖేల్ రాయప్పన్ పాత్రను జేపీఆర్ సార్ జీవితం నుంచి ప్రేరణ పొందా. రాయప్పన్ ఈ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ కూడా. ఈ రోజు మీరు నాకు డాక్టరేట్ ఇచ్చారు. నేను ఈ దేశం గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నా" అని అన్నారు.అల్లు అర్జున్ చిత్రం గురించి మాట్లాడుతూ..' ఈ సినిమాను కళానిధి మారన్ సర్ (సన్ పిక్చర్స్) నిర్మిస్తున్నారు. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ మూవీ కోసం అంతా కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఈ చిత్రం కోసం నేను పెద్ద కలలు కంటున్నా. ఈ మూవీ బడ్జెట్ ఇంకా లాక్ కాలేదు. నిర్మాత విడుదల తేదీని నిర్ణయిస్తారు.' అని పంచుకున్నారు. #Atlee: "Generally Audience says my films are copied, but I'm telling truth today that it's all inspired from my life. For Ex Bigil Raayappan character was inspired from JPR sir. You have given doctorate, i promise that I will make proud for this country. #AA22xA6 la therikka… pic.twitter.com/UQeZdqhJev— AmuthaBharathi (@CinemaWithAB) June 14, 2025 -
కాంతార షూటింగ్ సెట్లో ప్రమాదం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 సెట్లో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందని.. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఈ అంశంపై మాట్లాడారు.ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్ వేశామని.. అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో నటీనటులు కానీ.. సిబ్బంది లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలోనే మూవీ షూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనలో ఉదయం నుంచి వస్తున్న రూమర్స్కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టేసింది.(ఇది చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)కాగా.. 2022లో సూపర్ హిట్గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. -
'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో
'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ) -
మోస్ట్ వయొలెంట్ చిత్రానికి సీక్వెల్.. సారీ చెప్పిన ఉన్ని ముకుందన్!
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ గతేడాది మార్కో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోస్ట్ వయొలెంట్గా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్గా కూడా ఉంటుందని అభిమానులు భావించారు. దీంతో ఓ అభిమాని సైతం మార్కో-2 ఎప్పుడొస్తుందని ట్విటర్ వేదికగా హీరోను ప్రశ్నించాడు.దీనికి ఉన్ని ముకుందన్ కూడా రిప్లై ఇచ్చారు. ఈ విషయంలో క్షమించండి.. మార్కో సిరీస్ను కొనసాగించాలనే ఉద్దేశాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్పై ఎక్కువగా నెగెటివిటీ ఉంది.. అయితే మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా.. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో మార్కో సీక్వెల్ వస్తుందని భావిస్తోన్న అభిమానులకు నిరాశ ఎదురైంది.కాగా..2024 డిసెంబర్లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన మార్కోను రూ. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది. -
మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్
టాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. ఇదివరకే ప్రమోషన్స్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం కొచ్చిలో.. నటుడు మోహన్ లాల్ చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇదే ఈవెంట్లో మోహన్ లాల్-మోహన్ బాబు మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అలానే మోహన్ బాబు ఓ పెద్ద కోరికని బయటపెట్టారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా)'కన్నప్ప'లో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తాజాగా కొచ్చిలో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మోహన్ లాల్ మాట్లాడుతుండగా.. మీ సినిమాలో తాను విలన్ చేస్తానని మోహన్ బాబుతో అన్నాడు. బదులుగా మీ మూవీలో తాను విలన్గా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అలా అయితే తొలి సీన్లో మిమ్మల్ని కాల్చి పడేస్తానని మోహన్ లాల్ అనేసరికి స్టేజీపై ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు.మరోవైపు ఇదే వేడుకలో మాట్లాడిన మోహన్ బాబు.. కేరళలో 'తుడరుమ్' చిత్రాన్ని 'కన్నప్ప' అధిగమించాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. ఆ మూవీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ 'కన్నప్ప'కు రావాలని తాను అనుకుంటున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ చివర్లో రిలీజైన మోహన్ లాల్ 'తుడరుమ్'.. మలయాళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరి మోహన్ బాబు చాలా పెద్దగా ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)#Mohanlal: You be the hero, I’ll play the villain in that film.#MohanBabu: No, I really want to act as a villain in your film, please...#Mohanlal: Then I’ll shoot and kill you in the first scene in that film!— #Kannappa Event | Kochi pic.twitter.com/8fGqUsXGUc— Whynot Cinemas (@whynotcinemass_) June 14, 2025 -
ది రాజాసాబ్ హీరోయిన్కు చేదు అనుభవం.. పోలీసులు నిద్రలేచారు!
తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్లో కనిపించనుంది. మలయాళం, తమిళ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మాళవిక మోహనన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. తన స్నేహితులతో కలిసి రాత్రి సమయంలో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఓ వ్యక్తి తమవైపే చూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైనట్లు మాళవిక పంచుకుంది. ముంబయి లాంటి నగరంలో మహిళల భద్రత లేదని నటి మాళవిక మోహనన్ తెలిపింది.అయితే ఈ వార్త చూసిన ముంబయి పోలీసులు ఆమె జరిగిన ఘటనపై స్పందించారు. మాళివిక గారు మేము మీ గురించి వార్తల్లో చూశాం.. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. నగరంలో రోజులో ఏ సమయంలో లేదా ఏ ప్రదేశంలోనైనా.. దయచేసి 112 లేదా 100 నంబర్లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తామని తెలిపారు.(ఇది చదవండి: రాత్రి ట్రైన్లో ప్రయాణం.. ఏకంగా ముద్దిస్తావా? అని అడిగాడు: మాళవిక మోహనన్)ముంబయి పోలీసులు తమ పోస్ట్లో రాస్తూ..'ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. భద్రత మరింత మెరుగుపరచడానికి మేము ఎలాంటి చర్యలకైనా సిద్ధం. నేరస్థుడిని తగిన విధంగా.. చట్టబద్ధంగా శిక్షిస్తాం. దయచేసి మీ పేరును ఉపయోగించి ఈ విషయాన్ని వ్యాప్తి చేయండి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది.' అని విజ్ఞప్తి చేశారు. Ms @MalavikaM_ We came across an article in an online portal of a newspaper, which you shared your experince and raised concern over women safety in the city. We can imagine that experiences like these can be startling and leave a long term impact. Thus we must reiterate…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) June 14, 2025 -
కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్బస్టర్ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్ ప్రీక్వెల్ (కాంతార: చాప్టర్ 1) ప్రకటించారు.అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.గతంలో..షూటింగ్ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అడవిలో పేలుళ్లుఅయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో -
పదేళ్ల వయసులోనే డైరెక్టర్.. గిన్నిస్ బుక్లో చోటు
ప్రతి వారం టీవీలోనో, ఓటిటి (OTT)లోనో, థియేటర్లోనో ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం. సినిమా తీయడం టీమ్ ఎఫెర్ట్. చాలామంది కలిసి పని చేస్తేనే సినిమా తయారవుతుంది. వాళ్లందరూ ఏమేం చేయాలో చెప్పేవాడే డైరెక్టర్. అందుకే డైరెక్టర్ని ‘కెప్టెన్ ఆఫ్ ద షిఫ్’ అని పిలుస్తారు. ఎంతో అనుభవం, టాలెంట్ ఉంటే తప్ప డైరెక్టర్గా మారడం కష్టం. అలాంటిది పదేళ్ళ పిల్లాడు దర్శకుడిగా మారి సినిమా తీశాడంటే, ఆ సినిమా గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు సంపాదించిందంటే నమ్మడం సాధ్యమేనా? అవును సాధ్యమే! చిన్న వయసులోనే..ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు కర్ణాటకకి చెందిన కిషన్ శ్రీకాంత్. బెంగళూరులో జన్మించిన కిషన్ చిన్నప్పటినుంచే సినిమాల మీద విపరీతమైన ఆసక్తి చూపించాడు. ఆ ఆసక్తి ఇష్టంగా మారి ఏకంగా సినిమాని డైరెక్ట్ చేసేదాక తీసుకెళ్లింది. 2006లో Care of Footpath సినిమాను పదేళ్ళ వయస్సులో కన్నడలో తీశాడు కిషన్. అనాథ బాలుడు విద్యను కాంక్షించే నేపధ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, సౌరభ్ శుక్లా, జయశ్రీ వంటి ప్రముఖ నటులు నటించారు. అంతర్జాతీయంగా..మొత్తం ఐదు భారతీయ భాషల్లో డబ్ అయిన ఈ సినిమా 54వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో గోల్డెన్ లోటస్ అవార్డ్తో పాటు కర్ణాటక స్టేట్ అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయంగా కూడా సైప్రస్, ఇటలీ, దక్షిణ కొరియా ఫిలిం ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, పూర్తి నిడివిగల ఫీచర్ ఫిలింని డైరెక్ట్ చేసినందుకు ‘అతి పిన్న ఫీచర్ ఫిలిం డైరక్టర్గా గిన్నిస్ బుక్లో రికార్డ్స్ సాధించాడు కిషన్.సినిమాలుఆ తరువాత కాలంలో Care of Footpath సీక్వెల్ను త్రిభాషా చిత్రంగా కన్నడ, హిందీ, తెలుగులో డైరెక్ట్ చేశాడు కిషన్. ఇందులో జువెనైల్ నేరాలు, న్యాయ వ్యవస్థ పనితీరుల గురించి చర్చించారు. ఇషా డియోల్, అవికా గోర్ నటించారు. ఈ రెండు సినిమాలతో పాటు Kill Them Young (2015), Teenage (2013), Enidu Manasali (2014), Maanja (2016) వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. మరికొన్నిట్లో నటించాడు కూడా! -
హైదరాబాద్ జట్టు ఓనర్తో అనిరుధ్ పెళ్లి?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక పెళ్లి రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు నమ్మాలనిపించదు. మరికొన్నిసార్లు మాత్రం నిజంగా ప్రేమించుకుంటున్నారా? పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అలాంటి ఓ గాసిప్ పుల్గా వైరల్ అవుతోంది. అదే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి?తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. గతంలో ఆండ్రియా, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లతో డేటింగ్ చేశాడనే వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. కానీ కాలక్రమేణా వాటి గురించి జనాలు మర్చిపోయారు. సడన్గా ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ని అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 2014 నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, కానీ ఈ విషయం బయటపడకుండా సైలెన్స్ మెంటైన్ చేశారని.. త్వరలో మాత్రం పెళ్లి చేసుకుంటారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ తమిళవాళ్లు కావడంతో ఇది నిజమేనేమోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇరువైపుల నుంచి ఎలాంటి ఖండన లేదు. అలా అని అంగీకారం కూడా లేదు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇది రూమర్ మాత్రమే.అనిరుధ్ విషయానికొస్తే టీనేజీలోనే సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కావ్య మారన్ విషయానికొస్తే.. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు. ఇప్పటికే తండ్రితోపాటు పలు వ్యాపారాల్లో కీలకంగా ఉంది. వీటితో పాటు ఐపీఎల్లోనూ హైదరాబాద్ జట్టుకి యజమానిగా వ్యవహరిస్తోంది.(ఇదీ చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?) -
సడన్గా ఆ సీన్లో నటించమన్నారు.. ఇష్టం లేకుండానే..: మధుబాల
రోజా సినిమాతో మధుబాల (Madhoo/ Madhubala) క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది. ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని భీష్మించుకుని కూర్చుంది. కానీ ఓ సినిమా కోసం దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధుబాల మాట్లాడుతూ.. నేను పెరిగిన వాతావరణం వల్ల ఆన్స్క్రీన్లో కొన్ని సన్నివేశాల్లో నటించాలంటే ఇబ్బందిగా అనిపించేది. సడన్గా ఆ సీన్లో..ఆయా సీన్లలో నటించలేక సినిమాలు వదిలేసుకున్న సందర్భాలెన్నో..! అయితే ఓ సినిమా చేస్తున్న సమయంలో ముద్దు సన్నివేశంలో నటించాలన్నారు. దీనిగురించి నాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. షూటింగ్కు ముందు ఒక్కమాటైనా చెప్పలేదేంటి? అని నిలదీశాను. అప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్లి.. ఈ సీన్ అవసరం.. అందుకే చేయమంటున్నాం అని బతిమాలారు. అసలు ఆ సీన్ అవసరమే లేదుఇష్టం లేకపోయినా ఆ సన్నివేశంలో నటించాను. దాన్ని సినిమాలో ఉంచకూడదని దర్శకుడిని నేనడగలేదు. వాళ్ల ఇష్టానికే వదిలేశాను. తీరా ఆ సీన్కు ఎటువంటి ప్రాధాన్యత లేదని పక్కన పెట్టేశారు. అప్పుడు నాది చాలా చిన్నవయసు. కానీ, ఈ రోజుల్లో 22 ఏళ్ల అమ్మాయి కూడా చాలా తెలివిగా ఉంటున్నారు. ఏ సీన్కైనా రెడీ అని సాహసం చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే మధుబాల నటించిన కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది.చదవండి: పాకిస్తాన్లో 'దంగల్' ఎందుకు రిలీజ్ చేయలేదో చెప్పిన ఆమిర్ ఖాన్ -
మృణాల్ కామెంట్స్ కమల్ హాసన్ చెవిన పడితే..
ఒకటి రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకుంటే స్టార్ హీరోహీరోయిన్లకు జరిగే నష్టమేమీ ఉండదు. అయితే అభిమానులు ఆ సమయంలో కాస్త నిరాశపడతారు. హీరోహీరోయిన్లు మాత్రం వాటిని అధిగమించి పోతుంటారు. కమల్ హాసన్( Kamal Haasan) వంటి వారైతే ఇలాంటివి ఇంతకుముందు చాలా చూసి ఉంటారు. ఆయన సమీపకాలంలో నటించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఆ తరువాత ఆయన నటించిన ఇండియన్–2, థగ్లైఫ్ చిత్రాలు ప్రేక్షుకుల అంచనాలను అందుకోలేకపోయాయి. కాగా ప్రస్తుతం ట్విన్స్ స్టంట్మాస్టర్స్ అన్బరివ్లను దర్శకులుగా పరిచయంచేస్తూ కమల్ తన రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈచిత్రం ద్వారా ఆయన ఏఐ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయనున్నారు. ఇందులో కమల్ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ దృష్టిలో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur) పడే ప్రయత్నం చేశారు. హిందీ, మరాఠి, తెలుగు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇంతకుముందు తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈమె మార్కెట్ డల్ అయ్యింది. మళ్లీ కోలీవుడ్లో మిస్ అయిన అవకాశాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తమకు నచ్చిన కథానాయకులతో జతకట్టాలని ఆశిస్తుంటారు. అలా మృణాల్ఠాకూర్ కమలహాసన్ సరసన నటించాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ కమల్తో కలిసి నటించాలని ఎంతగానో ఆశపడుతున్నానని పేర్కొన్నారు. కమల్తో కలిసి స్టెప్స్ వేయాలని ఆశపడుతున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. ఈ వార్త నటుడు కమల్ దృష్టికి వెళితే ఆమె కలను నెరవేరుస్తారా చూడాలి. -
అజిత్కి జోడీగా...
స్టార్ హీరో అజిత్కి జోడీగా శ్రీనిధీ శెట్టి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. యశ్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’తో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రీనిధీ శెట్టి. ఆ సినిమాపాన్ ఇండియా హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ నెలకొంది. ఆ తర్వాత ఆమె నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, తమిళ చిత్రం ‘కోబ్రా’ మంచి విజయాలు సాధించాయి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది థర్డ్ కేస్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు శ్రీనిధి.ఈ చిత్రంలో తనదైన నటన, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే... అజిత్ కుమార్తో నటించే క్రేజీ చాన్స్ను శ్రీనిధి అందుకున్నట్లు టాక్. అజిత్ నటిస్తున్న 64వ సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.అజిత్తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి సినిమా తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ‘ఏకే 64’ (వర్కింగ్ టైటిల్)కి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ నవంబరులో ఆరంభం అవుతుందట. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి... అజిత్కి జోడీగా శ్రీనిధి నటిస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు!
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్పై ప్రభావం చూపింది.అయితే థగ్లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. -
'24 ఏళ్లుగా అక్కడే ఉన్నా.. నేను, నా స్నేహితులు షాకయ్యాం '
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. అక్కడే దాదాపు 24 ఏళ్లు నివసించానని తెలిపారు. తాను నివాసమున్న ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్లో విమాన ప్రమాదం జరిగిందని అన్నారు. నా బాల్యమంతా అక్కడే గడిచిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను నివసించిన ప్రాంతంలో ఈ విషాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన విన్న వెంటనే తాను, తన పాఠశాల స్నేహితులు షాక్లో ఉన్నామని తెలిపారు. కాగా.. కేరళలోని త్రిసూర్లో జన్మించిన ఉన్ని ముకుందన్ అహ్మదాబాద్లోని మణినగర్లో పెరిగారు.అంతకుముందు బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉన్ని ముకుందన్ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. మేఘనినగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక ఉన్ని ముకుందన్ సినీ కెరీర్ విషయానికొస్తే 'సీడన్' అనే తమిళ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'మల్లూ సింగ్'లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'విక్రమాదిత్యన్', 'కెఎల్ 10 పట్టు', 'స్టైల్', 'ఒరు మురై', 'వంతు పార్థయ', 'అచాయన్స్', 'మాలికప్పురం' 'మార్కో' చిత్రాలతో అభిమానులను అలరించారు. నిర్మాతహా తన తొలి చిత్రం'మెప్పడియాన్'కి జాతీయ అవార్డు అందుకున్నారు. -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ... "హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్" చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం" అని అన్నారు!!రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష... ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు -
ప్రదీప్ రంగనాథన్ బిగ్ ప్లాన్.. మరో హిట్ గ్యారెంటీనా?
కోలీవుడ్లో 'కోమాలి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీలోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తనే దర్శకత్వం వహించి సూపర్హిట్ కొట్టారు. ఇటీవల డ్రాగన్ చిత్రంలో హీరోగా నటించి సంచలన విజయాన్ని సాధించారు. ఇలా వరుసగా హీరోగా, దర్శకుడిగా విజయాలను అందుకున్న ప్రదీప్ ప్రస్తుతం విఘ్నేశ్శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంతో పాటు కీర్తీవాసన్ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న డ్యూడ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరో సారి ఈయన మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీన్ని లవ్టుడే చిత్రాన్ని నిర్మించి సూపర్హిట్ కొట్టిన ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం మాత్రమే చేస్తారా లేక కథానాయకుడిగానూ నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తివివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అకాశం ఉంది. -
కథ, పాత్రలో దమ్ముంటే చాలు ఇలాంటి సినిమాలు హిట్టే
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయ్. హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపిస్తే అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు దక్కే మజానే వేరు. ఖాకీ డ్రెస్లో లాఠీ, తు పాకీ చేతబట్టి ఆన్ డ్యూటీలో భాగంగా పవర్ఫుల్ డైలాగులతో విలన్లకు వార్నింగ్ ఇస్తుంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, కేకలు వేస్తూ సందడి చేస్తుంటారు.పైగా పోలీస్ బ్యాక్డ్రాప్ అన్నది ఎవర్ గ్రీన్ ఫార్ములా. కథ, పాత్రలో దమ్ముంటే చాలు పోలీస్ సినిమాలు హిట్టయిపోతాయ్. ఇప్పటికే పోలీస్ కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమాల్లో ‘ఆన్ డ్యూటీ’ అంటూ పోలీస్గా విజృంభిస్తున్న హీరోల గురించి తెలుసుకుందాం.ముత్తువేల్ పాండియన్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (2023) చిత్రం సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్గా ముత్తువేల్ పాండియన్ సత్తా ఏ రేంజ్లో ఉంటుందన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అయితే ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించనున్నారని టాక్. అయితే ఆమె పాత్ర ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. కెరీర్లో తొలిసారి... వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్తో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ‘ఈశ్వర్’ (2002) సినిమాతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారాయన. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఈ జనరేషన్ హీరోల్లో ఖాకీ డ్రెస్ వేయని ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఆయన్ని ఖాకీ డ్రెస్లో, పవర్ఫుల్ పాత్రలో చూడాలని ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ‘స్పిరిట్’ సినిమాతో ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పిరిట్’.ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా త్రిప్తి డిమ్రీ నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్, మురాద్ ఖేతానీ నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి ప్రభాస్ ఖాకీ డ్రెస్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ‘స్పిరిట్’లో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఏ రేంజ్లో విజృంభిస్తారో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి. పోలీస్ జాతర పోలీస్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు హీరో రవితేజ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘వెంకీ’ (2004)లో మొదటిసారి ఖాకీ డ్రెస్లో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించరు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’ (2006) సినిమాలో విక్రమ్ రాథోడ్గా పవర్ ఫుల్ పోలీసాఫీసర్గా కనిపించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘ఖతర్నాక్, మిరపకాయ్, పవర్, టచ్ చేసి చూడు, క్రాక్’ వంటి సినిమాల్లో పోలీసాఫీసర్గా తనదైన మేనరిజమ్తో ప్రేక్షకులను అలరించారు రవితేజ.చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలోనూ ఏసీపీ విక్రమ్ సాగర్గా కనిపించారు. తాజాగా రవితేజ పోలీస్ ఆఫీర్గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ఈ సినిమాలో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా మే 9న విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించలేదు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్లో... పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో మరోసారి ఖాకీ డ్రెస్లో కనిపించారు పవన్ కల్యాణ్. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేదు. కాగా తనకు ‘గబ్బర్ సింగ్’ వంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో మరోసారి పోలీసాఫీసర్గా నటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. పవన్ కల్యాణ్తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.డబుల్ ధమాకా హీరో కార్తీ పోలీసాఫీసర్గా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్దార్’ (2022) చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్గా నిలిచింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్గా కార్తీ–పీఎస్ మిత్రన్ దర్శకత్వంలోనే ‘సర్దార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. ఆషికా రంగనాథ్, మాళవికా మోహనన్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సినిమాలో కార్తీ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేశారు. తండ్రి ఖైదీ పాత్రలో కనిపించనుండగా ఆయన కొడుకు పాత్ర పవర్ పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుందట. హిట్ 4లో.... తెలుగులో ‘హిట్’ సిరీస్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సిరీస్లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (విశ్వక్ సేన్), ‘హిట్: ది సెకండ్ కేస్’ (అడివి శేష్), ‘హిట్: ది థర్డ్ కేస్’ (నాని) సినిమాలు విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న నాలుగో చిత్రం ‘హిట్ 4’. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించనున్నారు. ఏసీపీ వీరప్పన్గా కార్తీ నటించనున్నట్లు ‘హిట్: ది థర్డ్ కేస్’ క్లైమాక్స్లో చూపించారు మేకర్స్.స్పై పోలీస్ ఆఫీసర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో, స్పై పోలీస్ ఆఫీసర్గా సందడి చేయనున్నారట విజయ్.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ నటించిన ఏ సినిమా ఇప్పటిæవరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమా రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది.రెండోసారి... హీరో విశ్వక్ సేన్ రెండోసారి పోలీసాఫీసర్గా చార్జ్ తీసుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ అధికారిగా నటించారు విశ్వక్. హీరో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా మరోసారి ఆయన ఖాకీ దుస్తులు ధరించారు. శ్రీధర్ గంగా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీఎస్ 13’ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎల్వీసీ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లో చూస్తుంటే విశ్వక్ మరోసారి పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారని స్పష్టం అవుతోంది. విశ్వక్ ఫేస్ కనిపించకుండా పాకెట్లో తు పాకీతో అటువైపు తిరిగి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ‘ప్రతి యాక్షన్కి అదిరిపోయే రియాక్షన్ ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి ‘బందూక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. రక్షక్! నటనకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్లో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన ఓ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమా మే 30న విడుదలైంది. ఈ చిత్రంలో గజపతి వర్మ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు మనోజ్. అదే విధంగా తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘మిరాయ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్ర చేస్తున్నారు మనోజ్. ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రక్షక్’. ఈ చిత్రం ద్వారా నవీన్ కొల్లి దర్శకునిగా పరిచయమవుతున్నారు.శ్రీనిధీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పోలీసాఫీసర్గా నటిస్తున్నారు మంచు మనోజ్. మే 20న ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్లోని మనోజ్ శక్తిమంతమైన లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొందరు తాము చేసిన నేరాన్ని బయటకు రాకుండా దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే హీరో ఎలా వెలికి తీశాడు? అన్నది కథలో ఆసక్తిగా ఉంటుం దట. అంతేకాదు... ప్రస్తుతం సమాజంలో మహిళల మీద జరుగుతున్న వేధింపులను కూడా ఇందులో ప్రస్తావించారని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. తండ్రి బాటలో... పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ‘పోలీస్ స్టోరీ’ సినిమాలో ఆయన నటన, డైలాగులను ఎప్పటికీ మరచిపోలేరు ప్రేక్షకులు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పోలీసాఫీసర్గా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు సాయికుమార్. తాజాగా ఆయన తనయుడు ఆది సాయికుమార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఐ యుగంధర్’. యశ్వంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నటుడు రాకేందు మౌళి విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ పినాక మోషన్ పిక్చర్స్పై ప్రదీప్ జూలూరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్గా వైవిధ్యమైన కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
కీర్తి సురేశ్ కామెడీ ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'రివాల్వర్ రీటా'. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి జేకే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ డేట్ ప్రకటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రివాల్వర్ రీటా వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కీర్తి సురేశ్ పోస్ట్ర్ను షేర్ చేశారు. తాజాగా విడుదలైన వీడియో చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు.ఇక బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ ధావన్కు జంటగా బేబీజాన్ చిత్రంలో నటించారు. Rita is ready to roll babyyy 💥#RevolverRita from 27th August 🔥Tamil: 🔗https://t.co/hOuJQ0zOUkTelugu: 🔗https://t.co/pGTzJcx1Qz@Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction… pic.twitter.com/TToEIXOLtg— Keerthy Suresh (@KeerthyOfficial) June 11, 2025 -
సింగర్గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ
నటి దేవయాని (50) చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్ ఇండియాలో పాపులర్ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్, టీ రాజేందర్, కార్తీక్ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్లో మంచి సింగర్గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.టాలీవుడ్లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్లో ఆమె నటించనున్నారు. View this post on Instagram A post shared by zeetamil (@zeetamizh) -
రిస్క్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. పొరపాటు జరిగితే అంతే
పాన్ ఇండియన్ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు ఉమెన్స్ సెంట్రిక్ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్ అగ్వరాల్కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాగే ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె మళ్లీ ఫ్రైమ్ టైమ్లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయకుండా రిస్క్తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి. -
స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన మామ పీఎస్ అబు(92) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయనకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు. మామ చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో శోకసంద్రంలో ఉంది.(ఇదీ చదవండి: హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు)1971 సినిమాలు చేస్తున్న మమ్ముట్టి.. 300కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ ఈయనకు అభిమానులు ఉన్నారు. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో మమ్ముట్టి నుంచి భ్రమయుగం, టర్బో, బజుక తదితర మూవీస్ వచ్చాయి.మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మేనమామ గోపీనాథ్ నాయర్ కూడా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. తనువు చాలించారు. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సదరు హీరోల అభిమానులు.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
సుహాసిని అందం గురించి పార్తీబన్ షాకింగ్ కామెంట్స్
మల్టీ టాస్కింగ్ అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పార్తీబన్ (R. Parthiban). అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్గా తన ప్రతిభ చాటుకున్నారు. యుగానికి ఒక్కడూ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తాజాగా ఆయన హీరోయిన్ సుహాసినిపై ప్రశంసలు కురిపించాడు. వర్డిక్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. అందరూ సుహాసిని యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఓరోజు ఫోన్ చేసి..కానీ తన ఆత్మవిశ్వాసం గురించి మీకు చెప్పాలి. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి పార్తీబన్.. ఈరోజు నాకు 50 ఏళ్లు నిండాయి అని చెప్పింది. అసలు ఏ మహిళ కూడా 28 ఏళ్లు దాటాక తన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తనకు 50 ఏళ్లు అని నిర్మొహమాటంగా చెప్పిందంటే అది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. 50 ఏళ్లు వచ్చినా తనెంత అందంగా ఉందో మీరే చూడండి అనడంతో అక్కడే స్టేజీపై ఉన్న సుహాసిని (Suhasini) సరదాగా నవ్వేసింది.సినిమావర్డిక్ట్ సినిమా విషయానికి వస్తే.. పార్తీబన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి శరత్కుమార్, విద్యుల్లేఖ, ప్రకాశ్ మోహన్దాస్ తదితరులు నటిస్తున్నారు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
కన్నడిగులని మళ్లీ ట్రిగర్ చేసిన రష్మిక
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. కానీ ఆ రాష్ట్రానికి చెందిన ప్రేక్షకులే ఈమెని ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. గతంలో పలుమార్లు ఈమే మాట్లాడిన మాటలే దీనికి కారణం అని చెప్పొచ్చు. మరి తెలిసి చేసిందో తెలియక చేసిందో గానీ ఇప్పుడు మరోసారి కన్నడని కెలికింది. అసలే కమల్ హాసన్ వల్ల కోపంతో ఉన్నారు. ఇప్పుడు రష్మిక లేటెస్ట్ పోస్ట్ చూసి షాకవుతున్నారు.రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా జూన్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ముంబైలో ఓ ఈవెంట్ జరగ్గా.. అంతకు ముందు దక్షిణాదిలోనూ జరిగాయి. ఈ క్రమంలోనే రష్మిక తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు చెన్నైతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంది. ఇప్పుడదే కన్నడిగుల ఆగ్రహం తెప్పిస్తోంది.(ఇదీ చదవండి: 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?)రష్మిక పోస్ట్లో ఏముందంటే.. 'చెన్నైలోనే తన బాల్యం గడిచింది. అందుకే చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది' అని రాసుకొచ్చింది. అంటే ఓ రకంగా తనది చెన్నై అన్నట్లు చెబుతోంది. ఇది ఇప్పుడు కన్నడిగులకు అసంతృప్తి తెప్పిస్తోంది. ఎందుకంటే రష్మిక పుట్టి పెరిగింది, స్కూల్ చదువుకున్నదంతా కర్ణాటకలోనే. కానీ చెన్నైలో బాల్యం గడపడం ఏంటి అని కన్నడ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.గతంలో 'కాంతార' సినిమాని తాను ఇంకా చూడలేదని చెప్పి ట్రోలింగ్కి గురైన రష్మిక.. మరో సందర్భంలో హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని చెప్పి కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. ఇప్పుడు మరి ఉద్దేశపూర్వకంగా చేసిందో లేదో తెలీదు గానీ ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
'టూరిస్ట్ ఫ్యామిలీ'తో ఫేమస్.. ఎవరీ డస్కీ బ్యూటీ?
రీసెంట్ టైంలో ఓటీటీలో ట్రెండ్ అయిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఇదో తమిళ మూవీ. ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడంతో మనోళ్లకు కూడా ఇది నచ్చేసింది. ఈ చిత్రంలో చిన్న పిల్లాడిగా చేసిన కమల్ జగదీశ్ కాకుండా ప్రధాన పాత్రధారి ధర్మదాస్.. ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి కూడా ఆకట్టుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఈమె పాత్ర చిన్నదే గానీ యువతకు తెగ నచ్చేసింది. దీంతో ఈ అమ్మాయి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈమె ఎవరంటే?(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)'టూరిస్ట్ ఫ్యామిలీ'లో ధర్మదాస్ అద్దెకు ఉండే ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి అసలు పేరు యోగలక్ష్మీ. చూడటానికి డస్కీగా ఉన్నప్పటికీ ఈమె యాక్టింగ్కి యూత్ ఫిదా అవుతున్నారు. సినిమాలోని ఈమె ప్రపోజల్ సీన్ని రిపీట్స్లో చూస్తున్నారు. ఈమె విషయానికొస్తే.. ఈ సినిమా కంటే ముందు 'హార్ట్ బీట్', 'సింగపెన్నె' అనే వెబ్ సిరీసులు చేసింది. కాకపోతే ఓ మాదిరి గుర్తింపు మాత్రమే దక్కింది.ఈ మధ్య యూట్యూబ్లో 'మ్యాచ్ ఫిక్సింగ్' షార్మ్ ఫిల్మ్లోనూ యోగలక్ష్మీ నటించింది. ఈమెది తమిళనాడే అయినప్పటికీ ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అనే డీటైల్స్ దొరకట్లేదు. ప్రస్తుతానికైతే 'టూరిస్ట్ ఫ్యామిలీ' వల్ల ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించేందుకు ఈమె అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈమెపై కొన్ని మీమ్స్ కూడా వస్తుండటం విశేషం. మరి తెలుగులోనూ ఎవరైనా దర్శక నిర్మాతలు ఈమెకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) View this post on Instagram A post shared by Yogz👾 (@iamyogalakshmi) -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!
సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్తో 'కూలీ' తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ 'బెంజ్'లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?)సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా 'బెంజ్' విలన్కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.లోకేశ్ ప్రస్తుతం 'కూలీ' తీస్తున్నాడు. దీని తర్వాత 'ఖైదీ 2' ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు
స్వతహాగా మలయాళీ అయినప్పటికీ హీరో మోహన్ లాల్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్', 'తుడరుమ్' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం ఈయన నటించిన తెలుగు మూవీ 'కన్నప్ప' రిలీజ్కి సిద్ధంగా ఉంది. అలాంటి ఈయన ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?)మోహన్ లాల్కి మేనమామ గోపీనాథన్ నాయర్(93) ఉన్నారు. గతంలో అలప్పుజా కో ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసిన ఈయన.. వయసు మీద పడటంతో గత 14 ఏళ్ల నుంచి మాత్రం అమృతపురిలోని మాత అమృతానందమయి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ కుటుంబ సభ్యులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.మోహన్ లాల్ అసలు పేరు రోషన్ లాల్. కానీ మేనమామ అయిన గోపీనాథన్.. ఈ పేరుని కాస్త మార్పు చేసి మోహన్ లాల్ అని పెట్టారు. తర్వాత తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. మోహన్ లాల్ మామతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అంత్యక్రియలు కూడా మోహన్ లాల్ కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకోనున్నారు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్) -
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. రేటు ఎంతంటే?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషకు చెందిన హీరోలు.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి ఏం లేని టైంలోనే దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకున్న కొందరు నటీనటులు ఉన్నారు. వాళ్లలో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఒకరు. ఈయనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడంలో ఓ ఫ్లాట్ ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?)దుబాయిలో బుర్జ్ ఖలీఫా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు దీన్ని సందర్శించకుండా తిరిగిరాడు. అలాంటిది ఈ ఎత్తయిన కట్టడంలోని 29వ ఫ్లోర్లో సింగిల్ బెడ్ రూమ్ని చాన్నాళ్ల క్రితమే మోహన్ లాల్ కొనుగోలు చేశారు. దాదాపు రూ.3.5 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకున్నారు. కాకపోతే దీన్ని తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించారు. దీనితో పాటు దుబాయిలోనే పెద్ద విల్లాలోని 3 బీహెచ్కే ఫ్లాట్ కూడా మోహన్ లాల్ కొన్నారు.ఇలా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక నటుడిగా మోహన్ లాల్ రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. తెలుగు నటుల్లోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్కి కూడా దుబాయిలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారనే గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా చూసుకుంటే మాత్రం దుబాయిలో టూరిజం బాగా పెరిగింది. దీంతో మనదేశానికి చెందిన పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు.మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో నటించడంతో ఈ తరం ఆడియెన్స్కి పరిచమయ్యారు. రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన కొడుకు ప్రణవ్ కూడా హీరోగా మలయాళంలో పలు చిత్రాలు చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ) -
'టూరిస్ట్ ఫ్యామిలీ' తర్వాత యంగ్ హీరోయిన్తో మూవీ ప్లాన్ చేసిన శశికుమార్
వైవిధ్య కథాచిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న 'శశికుమార్' వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన 'అయోద్ధి' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శశికుమార్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల నటి సిమ్రాన్తో కలిసి నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం శశికుమార్ హీరోగా నటించిన ఫ్రీడమ్ చిత్రం జూలై 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈయన తొలిసారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇంతకు ముందు రూపొందిన వదంతి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వదంతి–2 రూపొందుతోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో సాగే ఈ వెబ్ సిరీస్లో నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మదురై, తిరునల్వేల్లి ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్లో తాను శశికుమార్కు జంటగా నటిస్తున్నట్లు నటి 'అపర్ణదాస్'(Aparna Das) ఇటీవల ఒక భేటీలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల బ్యూటీ 50 ఏళ్లకు పైగానే ఉన్న శశికుమార్కు జంటగా నటించనుంది. ఆమె ఇప్పటికే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించారన్నది గమనార్హం. ముఖ్యంగా తమిళంలో నటుడు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించి 'దాదా' (పాపా) సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా చిత్రం తెలుగులో జూన్ 12న విడుదల కానుంది.కాగా దీని తరువాత శశికుమార్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన మెగాఫోన్ పట్టి శ్రీకుట్రపరంపరైశ్రీ అనే వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని శశికుమార్నే ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు. -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఇండియన్-2 కంటే తక్కువ వసూళ్లు!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ తొలి రోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత పెద్దగా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల లోపే నెట్ వసూళ్లు సాధించింది.ఇక వీకెండ్ చివరి రోజు ఆదివారం కలెక్షన్లతో కలిసి నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్గా రూ.43 నికర వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే థగ్ లైఫ్ నాలుగు రోజుల్లో రూ.73 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ చేరుకుంది. ఈ సంఖ్య అంతకుముందు కమల్ హాసన్ నటించిన ఇండియన్-2 కంటే చాలా తక్కువగా నమోదైంది. గతేడాది విడులదైన ఇండియన్-2 నాలుగు రోజుల్లో రూ.113.55 కోట్ల నికర వసూళ్లు సాధించింది.అయితే థగ్ లైఫ్ వసూళ్లు తగ్గడానికి కన్నడ భాష వివాదం కూడా ఓ కారణం. బెంగళూరు ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమాను నిషేధించారు. కమల్ కామెంట్స్తో ఈ చిత్రం షెడ్యూల్ కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. కాగా.. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో
పెళ్లైన దంపతులను నిండునూరేళ్లు కలిసి జీవించమని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, ఈ కాలంలో నూరేళ్లు బతకడం కష్టమే అయితే, అంతవరకు కలిసి జీవించడం పెద్ద సవాల్గా మారింది. ఎన్నో జంటలు ఆడంబరంగా వివాహం చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఈ ధోరణి కాస్త ఎక్కువే కనిపిస్తుంది.నిందలు- బాధలుఅయితే విడాకులు తీసుకోవడం ఈజీ అయినా, ఆ బాధను మర్చిపోవడం అంత తేలిక కాదంటున్నాడు హీరో ప్రోసెంజిత్ చటర్జీ (Prosenjit Chatterjee). ఇతడు సహనటి దెబశ్రీ రాయ్ (Debashree Roy)ను పెళ్లాడాడు. వివాహమైన కొంతకాలానికే విడిపోయారు. ఈ విషయం గురించి ప్రొసెంజిత్ తాజాగా టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అప్పుడు మా వయసు పెద్దదేం కాదు. విడిపోయినప్పుడు ఒకరినొకరు నిందించుకున్నాం.టాప్ 10 నటుల్లో నేను లేనుకానీ ఆ బాధ నుంచి బయటపడలేకపోయాను. పనిపై దృష్టి సారించలేకపోయాను. కొంత డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగ్గా అదే సమయంలో బెంగాల్లో టాప్ 10 నటుల గురించి ఓ వార్త రాశారు. టాప్ 10 జాబితాలో ఎక్కడా నా పేరు లేదు. అది నన్ను మరింత బాధలోకి నెట్టేసింది. నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తిరిగి ఆఫీస్కు వెళ్లి ఒకేసారి తొమ్మిది సినిమాలు సంతకం చేశాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేం లేదు.ప్రొసెంజిత్ చటర్జీ- దెబశ్రీ రాయ్మూడు పెళ్లిళ్లుబాధగా అనిపించినప్పుడల్లా నా తోటకి వెళ్లేవాడిని. ఎవరితోనూ మాట్లాడకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చునేవాడిని అని చెప్పుకొచ్చాడు. దెబశ్రీకి విడాకులు ఇచ్చాక ప్రొసెంజిత్ మరోసారి ప్రేమలో పడ్డాడు. అపర్ణ గుహ తకుర్తను పెళ్లాడాడు. వీరికి ప్రేరణ అనే కూతురు పుట్టింది. తర్వాత ఈ జంట మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. నటి అర్పితా పాల్ను మూడో పెళ్లి చేసుకున్నాడు. కెరీర్బాలీవుడ్ నటుడు బిస్వజిత్ చటర్జీ కుమారుడే ప్రొసెంజిత్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ప్రొసెంజిత్ హీరోగా, విలన్గా అనేక సినిమాలు చేశాడు. బెంగాలీ, హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు. దోసర్ మూవీకి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. చివరగా ఖాకీ: ద బెంగాల్ చాప్టర్ అనే వెబ్ సిరీస్లో కనిపించాడు. ప్రస్తుతం మాలిక్ అనే మూవీ చేస్తున్నాడు. పులకిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లరి, మేధా శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
సిద్ధ వైద్యం వల్లే ప్రముఖ నటుడు మృతి?
కోలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ (Tamil actor Rajesh) (75) ఇటీవలే కన్నుమూశారు. మే 29న ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మరణించారు. చలనచిత్రపరిశ్రమలో 50 ఏళ్లకు పైగా రాణించిన ఆయన ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని కల కన్నాడు. కానీ, అది నెరవరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే అధునాతన వైద్యాన్ని కాదని సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే రాజేశ్ చనిపోయాడని ప్రచారం జరిగింది. సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే?ఆస్పత్రిలో చేరడానికి ముందు సిద్ధ వైద్యుడితో నటుడు గంటల తరబడి గడిపాడని రాజేశ్ సోదరుడు చేసిన కామెంట్లతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంపై నటుడు రాజేశ్ కూతురు దివ్య స్పందించింది. మా నాన్న ట్రీట్మెంట్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇంతటితో ఆపండి. ఈ వదంతులు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. దయచేసి ఈ సమయంలో మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయండి.నిజమెంత?మా నాన్న సిద్ధ వైద్యమే కావాలని.. మరొకటి వద్దని మొండిగా వ్యవహరించాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే ఓ సిద్ధ వైద్యుడు మా నాన్నను రెగ్యులర్గా చెక్ చేస్తుండేవాడు. ఆరోజు నాన్న శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని సిద్ధ వైద్యుడే గమనించి చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ దారిలోనే కన్నుమూశాడు. దయచేసి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.ఎవరీ రాజేశ్?రాజేశ్ తమిళనాడు వాసి. దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో రాజేశ్ సినీప్రస్థానం మొదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు, రుద్రుడు సినిమాల్లో నటించారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించారు . 1985లో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అలరించారు. కార్తిగై దీపం సీరియల్లో యాక్ట్ చేశారు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా! చదవండి: అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..! -
శివకార్తికేయన్తో ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్..
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan).. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి, అదే విధంగా సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాలే. వీటిలో పరాశక్తి చిత్రం సెప్టెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని సమాచారం. రవిమోహన్ ప్రతి నాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయక కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. శివకార్తికేయన్ తాజాగా మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ఈయన వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇంతకుముందే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే ఇందులో శివకార్తికేయన్కు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు క్రేజీ నటి కాయాదు లోహర్ కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్ అని సమాచారం. కాగా కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఇంతకుముందే శివకార్తికేయన్కు జంటగా హీరో (శక్తి) చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆమె తెలుగులో 'చిత్రలహరి, హలో' వంటి సినిమాలతో మెప్పించారు. మరోవైపు కాయాదు లోహర్(Kayadu Lohar) పేరు డ్రాగన్ సినిమాతో తెలుగు, తమిళ్లో బాగా పాపులర్ అయిపోయిన విషయం తెలిసిందే. కాగా శివకార్తికేయన్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న చిత్రం అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
కమల్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ వద్ద థగ్ లైఫ్ కష్టాలు!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'థగ్ లైఫ్' 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2', రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు. -
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.అమితాబ్తో పాట షూటింగ్బచ్చన్ సర్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ (Amitabh Bachchan) సర్ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సర్ దగ్గర కారవాన్ ఉంది. కానీ చాలామంది షూట్ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.చెట్టు వెనకాల..నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సర్ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కల్కి 2898 ఏడీలో..కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్ (హెవీ మేకప్) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్ హాసన్ యాస్కిన్గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనుంది. చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్ -
ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్ (Shivakumar) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగారు. కొంతకాలంగా కలిసే ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. శనివారం (జూన్ 8న) శివకుమార్ బర్త్డే. ఈ సందర్భంగా అండమాన్- నికోబార్లో అతడి పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్ చేసింది.బీచ్లో ప్రపోజల్..నెచ్చెలి ఎదురుగా వచ్చి చేయందుకోమన్నాక ఎవరైనా ఎలా ఆగుతారు. శివ్ కూడా అంతే.. సంతోషంతో గంతేశాడు. తప్పకుండా అని అంగీకారంగా హత్తుకున్నాడు. అప్పుడు ప్రియాంక సగం పెళ్లి అయిపోనట్లే అన్నట్లుగా ఓ ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. కలిసి ఎదుగుదాం..ఇక్కడివరకు మన ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఏయేటికాయేడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం అని రాసుకొచ్చింది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్తో పాపులర్కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్తో పాపులర్ అయింది. మౌనరాగం సీరియల్లో శివకుమార్కు జంటగా నటించింది. అక్కడ మొదలైన పరిచయమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ అయిపోగానే వివాహం చేసుకోవాలనుకున్నారు. గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్కాకపోతే అంగరంగ వైభవంగా, కొన్నిరోజులపాటు పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకుందట ప్రియాంక. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని, అది సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని గతేడాది శివకుమార్ బయటపెట్టాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదే వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే.. -
మహేశ్ సినిమాలో..?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్లోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్నగర్ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మేరకు మాధవన్తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.మరి... ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తోపాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్. -
సూపర్ హీరోలు వస్తున్నారోచ్
ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్... ఇలా హాలీవుడ్ సూపర్ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ కూడా వస్తున్నారోచ్. వెండితెరపై ఆడియన్స్ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్ వావ్ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్ హీరో వివరాలపై ఓ లుక్ వేయండి.విశ్వంభర ప్రపంచంలో... ‘విశ్వంభర’ సినిమాలో సూపర్ హీరో మాదిరి యాక్షన్ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్ హీరోలా యాక్షన్ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్ సెంటిమెంట్తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్ కనిపిస్తారని తెలిసింది.వచ్చే ఏడాది స్టార్ట్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ సూపర్ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్ కనగరాజ్ కథలోని సూపర్ హీరోగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సూపర్ హీరో సినిమాను ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సూపర్ హీరో కథ చెప్పారని, లోకేశ్తో తాను ఈ సూపర్ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని ఆమిర్ ఖాన్ చెప్పారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆమిర్ ఖాన్. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్ కనగరాజ్. ఇలా... ఆమిర్–లోకేశ్ల ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.ఆన్ ద వే! సిల్వర్ స్క్రీన్పై రవితేజను ఓ సూపర్ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్’ డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్ హీరో స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్ శంకర్. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్ శంకర్ ఫైనల్ నరేషన్ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కల్యాణ్ శంకర్తో సూపర్ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే కల్యాణ్ శంకర్–రవితేజల సూపర్ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సో... సూపర్ హీరో ఆన్ ద వే అన్నమాట.సరికొత్త ప్రపంచంలోకి... ఆడియన్స్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్ నేతృత్వంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్ ΄్లాన్ అని భోగట్టా.ఇటు అధీర... అటు మహాకాళి! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా కొన్ని సూపర్ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో పవర్స్ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సూపర్ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ యూనివర్స్లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్ సూపర్ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్ లీడ్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్ వర్మ షో రన్నర్గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్వర్మ. ఈపోస్టర్పై మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్ అని ఉండటం విశేషం.పీపుల్స్ సూపర్ హీరో పీపుల్స్ సూపర్ హీరోగా చెప్పుకునే శక్తిమాన్ సరికొత్త పవర్స్తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్గా రణ్వీర్ సింగ్ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్వీర్ సింగ్ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్లో వినిపించింది. మరి... శక్తి మాన్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.సూపర్ యోధ ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్’ గ్లింప్స్ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్తోపాటు కొన్ని మైథలాజికల్ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.మల్టీవర్స్ మన్మథన్ మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘మల్టీవర్స్ మన్మథన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్ చంద్ర శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్ ఈ సినిమాకు కో రైటర్స్గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్ ఫస్ట్ మల్టీవర్స్ సూపర్ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో నివిన్ పౌలీ ‘ఎక్స్’పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్ రైజింగ్’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కల నిజమైంది నటుడిగా ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్. తాను చిన్నప్పట్నుంచి సూపర్ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్ హీరోస్ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. మిథున్ మాన్యువేల్ థామస్ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్. ఈ కోవలో మరికొంతమంది సూపర్ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు -
పాన్ వరల్డ్ హీరోయిన్ రీఎంట్రీ..
మలయాళంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అదే ఏడాదిలో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
రెండో పెళ్లి చేసుకున్న హీరో.. పోస్ట్ వైరల్
ప్రముఖ తమిళ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదివరకే 2014లో ఓసారి కైవల్య అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు నటుడు కృష్ణ కులశేఖరన్ ప్రకటించాడు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్తోపాటు పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరీ నటుడు? టాలీవుడ్తో ఏమైనా సంబంధం ఉందా?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన కృష్ణ.. తర్వాత హీరోగానూ పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం వెబ్ సిరీసుల్లో సహాయ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీసెంట్ టైంలో ఝాన్సీ, పారాచూట్ లాంటి తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సిరీసుల్లో కనిపించాడు. ఇతడు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 'పంజా' దర్శకుడు విష్ణువర్ధన్ ఇతడికి స్వయానా అన్నయ్య అవుతాడు.2014లోనే కైవల్య అనే అమ్మాయిని కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు తమిళ హీరో ఆర్యతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కొన్నాళ్ల తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అయితే అమ్మాయి ఎవరు? యాక్టరా కాదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్) View this post on Instagram A post shared by Krishna kulasekaran (@krishnakulasekaran) -
తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత?
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు) -
స్టార్ హీరోయిన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముంబైకి చెందిన సిమ్రాన్ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో దీపక్ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అందులో సీరియల్స్తో పాటు పలు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు అధీప్ గ్రాడ్యేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్ ఇలా చెప్పుకొచ్చారు. ' చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.' అని సిమ్రాన్ పేర్కొన్నారు.సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సౌత్లో చిరంజీవి,రజనీకాంత్,కమల్ హాసస్, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా మెప్పించింది. View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
విందులో విజయ్ ఎమోషనల్.. ఇక గుడ్బై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. -
చాకో కారుకు ప్రమాదం.. ‘దసరా’ విలన్ ఇంట తీవ్ర విషాదం!
కోలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తమిళ నటుడు షైన్ టామ్ చాకో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చాకో తండ్రి మృతి చెందగా, తల్లి, సోదరుడు, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో చాకో కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాకో కుటుంబం ఎర్నాకులం నుంచి బెంగళూరుకు కారులో ప్రయాణిస్తుండగా, పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుడి చేతికి గాయం అయింది. అతని తల్లి, సోదరుడు, డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. షైన్కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుషైన్ టామ్ చాకో మలయాళ చిత్రసీమలో ప్రముఖ నటుడు మాత్రమే కాకుండా, తెలుగు చిత్రం దసరాలో విలన్ పాత్రతో టాలీవుడ్లో కూడా గుర్తింపు పొందారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో షైన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. -
విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!
కోలీవుడ్ జంట రవి (Jayam Ravi)- ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే! మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తోందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ మూడో వ్యక్తి మరెవరో కాదని, సింగర్ కెనీషా అన్న ప్రచారం మొదలైంది. రవి.. సింగర్ కెనీషా (Keneeshaa)తో ప్రేమలో ఉన్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ పూలదండలతో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పూలదండలతో కోలీవుడ్ జంటఇది చూసిన నెటిజన్లు అదేంటి? అప్పుడే వీరి పెళ్లి జరిగిపోయిందా? అని షాకవుతున్నారు. అసలు విషయమేంటంటే.. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కుండ్రతుర్ మురుగన్ దేవాలయాన్ని రవి, కెనీషా సందర్శించారు. దర్శనం అనంతరం అర్చకులతో కలిసి ఇలా ఫోటో దిగారు. జయం సినిమాతో రవి విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతోనే అతడు జయం రవిగా స్థిరపడిపోయాడు. కానీ ఇటీవలే తనను జయం రవి అని పిలవొద్దని కేవలం రవి అని మాత్రమే పిలవాలని సూచించాడు. 15 ఏళ్ల బంధానికి ఫుల్స్టాప్!ఇకపోతే ఇతడు నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. తనకు భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది..: హీరో -
టూర్ బాగా జరిగిందా..?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇరుగు పొరుగు ఎవరున్నారో, ఏం చేస్తున్నారో అని తెలుసుకునే అవకాశం, తీరిక లేని బిజీ రోజుల్లో గడుపుతున్నాం. మన పొరుగింట్లో దొంగ దూరినా లేదా దొర వచ్చినా మనకు తెలిసే సమయానికి తెల్లారిపోతుంది. కానీ అదే ఇరుగు పొరుగు వారి కోసం ఓ కాలనీ వాళ్ళు ఏం చేశారన్నదే ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా దక్కింది. మరీ ముఖ్యంగా మన ప్రపంచ స్థాయి దర్శక జక్కన్న రాజమౌళి ఈ సినిమాని ప్రశంసించడం విశేషం. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం.శ్రీలంక దేశం నుండి ధర్మాన దాస్ కుటుంబం అక్రమంగా సముద్ర మార్గాన భారత్లోని తమిళనాడు తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ధర్మాన దాస్ సతీమణి వాసంతి. వాళ్ళకిద్దరు పిల్లలు నితూషన్, ముల్లి. శ్రీలంకలో సంక్షోభం వల్ల భారత్లో సంపాదించడానికి వాసంతి సోదరుడు ప్రకాశ్ సహాయంతో కుటుంబం అంతా రామేశ్వరానికి వస్తారు. అదే ఊర్లో ఉన్న కేశవనగర్ కాలనీలో ఓ ఇంట్లోకి అద్దెకి చేరతారు. ఆ కాలనీ చాలా విచిత్రమైనది. ఎవ్వరి మార్గం వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. ధర్మాన దాస్ తమ శ్రీలంక ఉనికి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఈ లోపల అదే ఊరిలోని ఓ చెత్త కుప్పలో భారీ బాంబు పేలుడు సంభవిస్తుంది. అంతకుముందే ధర్మాన దాస్ ఆ చెత్త తొట్టిలో తాము తిన్న పదార్థాల కవర్ వేస్తాడు. అది కాస్తా సీసీ టీవీలో రికార్డు అవుతుంది. దాంతోపోలీసులు ధర్మాన దాస్ కుటుంబం కోసం గాలిస్తుంటారు. ఓ పక్క తమ శ్రీలంక ఐడెంటీటీ ఇతరులకు తెలియనివ్వకుండా, మరో పక్క ఈపోలీస్ కేసును దర్మాన దాస్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.ఈ సినిమాకి మూల కథ రాసుకుని అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు శశికుమార్ హీరో పాత్రలో నటించగా, ప్రముఖ నటి సిమ్రాన్ హీరోయిన్గా నటించి అలరించారు. ముఖ్యంగా ధర్మాన దాస్ చిన్న కొడుకు ముల్లి పెట్టే గిలిగింతలు మామూలుగా ఉండవు. సినిమా మంచి ఎంటర్టైనర్. హాట్ స్టార్లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో ఈ వారం టూర్కి వెళ్ళండి. – హరికృష్ణ ఇంటూరు -
ఇక షురూ
తమిళనాడులోని పళని దేవాలయానికి హీరో సూర్య అండ్ టీమ్ వెళ్లారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మమితా బైజు హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ నెల 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.ఈ సందర్భంగా పళని దేవాలయంలో మురుగన్ని దర్శించుకుని, పూజలు నిర్వహించి, ‘‘ఓ మేజర్ స్టెప్ వేసేందుకు సన్నద్ధమౌతున్నాం. దేవుడి ఆశీర్వాదం కోసం పళని దేవాలయానికి వచ్చాం’’ అని యూనిట్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
విద్యార్థులకు 'విజయ్' కానుకలు.. రాజకీయాలు వద్దంటూ సూచన
కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా తమిళనాడు విద్యార్థులకు కానుకలు అందించారు. 2026 ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ నినాదాలు హోరెత్తిస్తూనే.. చదువుకునే పిల్లలు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పిన ఆయన తమ గోల్స్ పూర్తి అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని వారించారు. ఇందుకు మహాబలిపురంలో మలివిడతగా జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమం వేదికగా మారింది. పది, ప్లస్టూలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. మలివిడతగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులను సత్కరించి, ప్రోత్సాహాన్ని అందించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి సత్కరించడమే కాకుండా, వారితో గ్రూప్ ఫొటోలను విజయ్ దిగారు. అదే సమయంలో మైక్ అందుకున్న విద్యార్థులు విజయ్ తమలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ రూపంలో మార్పు తథ్యమని నినదించారు. అదే సమయంలో మైక్ అందుకున్న విజయ్ రాజకీయాలు వద్దు, విద్యాపరంగా ముందుకెళ్దామని సూచించారు. విద్యార్థులెవరూ రాజకీయాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర స్థాయిలోని టాపర్లకు బంగారు ఉంగరాలను విజయ్ అందజేశారు. మలి విడతగా ఈనెల 13న మరో 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టాపర్లను విజయ్ సత్కరించేందుకు నిర్ణయించారు. -
30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్కు కోర్టు హెచ్చరిక
కోలీవుడ్ హీరో విశాల్, ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)కు మధ్య కొన్నేళ్లుగా డబ్బు విషయంలో విభేదాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో విశాల్కు మద్రాస్ కోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్స్కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. న్యాయపరమైన ఖర్చులతో సహా లైకా ప్రొడక్షన్స్ వారికి డబ్బు తిరిగి ఇవ్వాలని కోర్టు తెలిపింది.సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకుని ఒప్పందం ప్రకారం ఎలాంటి సినిమా చేయలేదని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ఆపై డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో 2022 లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలోనే లైకా ప్రొడక్షన్స్కు విశాల్ రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు సూచించింది. తన ఆస్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అంతవరకు ఆయన నటించి, నిర్మించిన ఎలాంటి సినిమాలు థియేటర్స్, ఓటీటీల్లో విడుదల చేయకూడదంటూ స్టే విధించింది. అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని లైకా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆపై విశాల్ మీద కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది. దీంతో న్యాయస్థానం విశాల్ను మందలించింది. లైకాకు చెల్లించాల్సిన 21.29 కోట్ల రూపాయలను 30 శాతం వడ్డీ, న్యాయపరమైన ఖర్చులతో సహా చెల్లించాలని మద్రాస్ హైకోర్టు నటుడు విశాల్ను ఆదేశించింది. విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు దాఖలు చేశాడు. తన వద్ద 3 కార్లు, ఒక బైక్తో పాటు రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను కోర్టుకు అందించారు. తన ఇంటిపై తీసుకున్న రుణానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన అందించారు. -
స్టార్ హీరోతో 'లోకేష్ కనగరాజ్' కొత్త సినిమా ప్రకటన
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కోలీవుడ్లో విక్రమ్, లియో, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో టాప్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా లోకేష్ కనగరాజ్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తొలిసారి ఒక బాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు.ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్తో తాను ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలిపారు. అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని ఆయన అన్నారు. సూపర్హీరో జానర్లో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే, వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఈ సినిమా గురించి చర్చించుకుందామని ఆమిర్ ఖాన్ సూచించారు.‘పీకే 2’ సినిమా గురించి సోషల్మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమిర్ ఖాన్ అన్నారు. పీకే2 సినిమా చేయాలనే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే, 'దాదా సాహెబ్ ఫాల్కే'పై సినిమా చేస్తున్నామని, రాజ్ కుమార్ హిరాణీతో చర్చలు జరుగుతున్నాయిని చెప్పారు. ‘మహాభారతం’పై సినిమా చేయాలనేది తన 25 ఏళ్ల డ్రీమ్ అంటూ ఆమిర్ ఖాన్ తెలిపారు. అదొక యజ్ఞంలా చేయాలనే ఆలోచన ఉంది. చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని విషయాలు చెబుతానని ఆమిర్ అన్నారు.ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ మరో కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని ఆమిర్ సినిమా చేయనున్నారు. -
కాశ్మీర్లో స్టార్ హీరోయిన్ పేరుతో ఒక గ్రామం.. వైరల్ అవుతున్న ఫోటో
కోలీవుడ్ నటి త్రిషకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన పేరే ఒక బ్రాండ్ అనే రేంజ్కు ఒక హీరోయిన్గా ఆమె ఎప్పుడో చేరిపోయారు. అయితే అంతకుమించి అనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమా కథానాయికలు పదేళ్లు అగ్ర కథానాయికలుగా రాణించడం కష్టతరం. అలాంటిది త్రిష ఏకంగా 20 ఏళ్లకు పైగా క్రేజీ స్టార్గా వెలిగిపోతుండడం విశేషం. పెరగని వయసు, తగ్గని గ్లామర్ త్రిష సొంతం. ఈమె తాజాగా అజిత్ సరసన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విడుదలై కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు మణితర్నం దర్శకత్వంలో కమలహాసన్ సరసన నటించిన థగ్లైఫ్ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చేసింది. సూర్యకు జోడీగా నటిస్తున్న మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది భాషల్లో తగ్గేదేలే అంటూ తన జోరు సాగిస్తున్నారు. త్రిషకు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లోనే మిస్ చైన్నె కిరీటాన్ని గెలుచుకున్న త్రిషను ఇప్పటివరకూ ఒక బ్రాండ్ అనే అనుకున్నాం. అంతకుమించి అని ఇప్పుడు తెలిసింది. ఈ బ్యూటీ పేరుతో ఒక ఊరే ఉండడం విశేషం. అది ఎక్కడో తెలుసా లడక్లో, అవును ఆక్కడ త్రిష పేరుతో ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరుతో ఉన్న బోర్డును ఒక అభిమాని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అందులో త్రిష.. మీ పేరుతో లడక్లో ఒక ఊరు ఉంది. మీకు తెలుసా? తెలిస్తే మీరు వెంటనే ఆ ఊరుకు వస్తారు’ అని అతను పేర్కొన్నాడు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ..!
కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో 1987లో వచ్చిన నాయకన్ (నాయకుడు) మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వచ్చిన 38 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ నాయకుడు సినిమాకు ప్రత్యేక అభిమానులున్నారు. ఇన్నేళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమా రూపుదిద్దుకుంది. శింబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కన్నడలో ప్రదర్శితం కాని థగ్ లైఫ్అయితే కమల్ కన్నడ భాషపై చేసిన కామెంట్లతో పెద్ద వివాదం రాజుకుంది. తమిళం నుంచే కన్నడ పుట్టిందనడంతో కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించారు. అయినప్పటికీ కమల్ క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోలేదు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, కన్నడ ప్రజలంటే ఎంతో ప్రేమ అని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు కూడా తన సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని ప్రకటించాడు. కానీ అక్కడి అభిమానులు థగ్ లైఫ్ చూడకుండా ఉండలేకపోయారు.అభిమానంఓ ఫ్రెండ్స్ గ్రూప్ 42 కి.మీ. ప్రయాణించి తమిళనాడులోని హోసూర్లో థగ్ లైఫ్ ప్రదర్శితమవుతున్న థియేటర్కు చేరుకున్నారు. మరో అభిమానైతే.. కమల్కు నేను వీరాభిమానిని. సినిమా చూసేందుకు బైక్పై హోసూర్ రావడం సురక్షితమేనా? లేదంటే అక్కడకు వచ్చాక కర్ణాటకవాసినని నా బైక్ టైర్లు పంక్చర్ చేసి, పాడు చేయరు కదా? అని ప్రశ్నించాడు. అందుకు కొందరు.. అలా ఏం జరగదు. నిరభ్యంతరంగా వచ్చి సినిమా చూడొచ్చు. హోసూర్లో కర్ణాటకలో రిజిస్టర్ అయిన వాహనాలు ఎన్నో తిరుగుతాయి. భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చాడు.చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్ -
‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ
38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘థగ్ లైఫ్’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.‘థగ్ లైఫ్’ కథేంటంటే..?ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఒక గ్యాంగ్స్టర్. తన అన్న మాణిక్యం(నాజర్)తో కలిసి మరో గ్యాంగ్స్టర్ సదానందం(మహేశ్ మంజ్రేకర్)తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review). అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మణిరత్నం-కమల్ కాంబినేషన్లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్ లైఫ్’పై కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్లో కమల్ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు. సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ని యాడ్ చేసి ‘థగ్ లైఫ్’ ని తీర్చిదిద్దాడు మణి. సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అమర్ మారిపోవడం.. ఆధిపత్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ కూడా రొటీన్గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కమల్ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కమల్ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్ రొటీన్ పాత్రే చేశాడు. ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్ ఆఫీసర్గా అశోక్ సెల్వరాజ్, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్గా జోజు జార్జ్ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్ మంజ్రేకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్ రెహమాన్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ప్రతీది రాజకీయమే.. కమల్ 'కన్నడ' వివాదంపై రానా రియాక్షన్
'తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది' అని కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మా భాషను తక్కువ చేసి మాట్లాడతావా? అని ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా (Thug Life Movie)పై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) నిషేధం ప్రకటించింది. అప్పటికీ కమల్ వెనక్కుతగ్గలేదు. తన సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయాలని కోర్టుకెళ్లాడు. అసలు ఏ ఆధారంతో అటువంటి కామెంట్లు చేశారు? సారీ చెప్తే అయిపోతుందిగా అని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది.ఏది మాట్లాడినా వివాదమే..అప్పటికీ కమల్ క్షమాపణ చెప్పడం కాదుకదా.. అసలు కర్ణాటకలో సినిమా విడుదల చేయట్లేదని ప్రకటించాడు. తాజాగా ఈ వ్యవహారం హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)కి వద్ద ప్రస్తావనకు వచ్చింది. రానా నాయుడు- రెండో సీజన్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో కమల్- కన్నడిగుల మధ్య రాజుకున్న వివాదం గురించి రానా మాట్లాడుతూ.. అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్ఫామ్గా సోషల్ మీడియా మారిపోయింది. మొదట్లో ఇలాంటి మాధ్యమాలన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రతీది రాజకీయం చేస్తున్నారు అన్నాడు. ఇకపోతే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు రెండో సీజన్ జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది.చదవండి: మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్! -
మరో ఓటీటీకి వచ్చేస్తోన్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ముఖ్యంగా హారర్ మూవీలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారికోసమే మరో సూపర్ హిట్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. మలయాళంలో ఇప్పటికే అభిమానులను మెప్పించిన చిత్రం వడక్కన్. ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ కిశోర్, శృతి మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సజీద్ ఎ దర్శకత్వం వహించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఈ శుక్రవారం అంటే జూన్ 6వ తేదీ నుంచి నుంచి ఆహాలో స్ట్రీమింగ్కు రానుంది. ఆహాలో తెలుగు, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక కథ విషయానికొస్తే అతీంద్రీయ శక్తుల గురించి శోధించే ఇద్దరు వ్యక్తులు కేరళలోని ఓ చోట జరిగిన కొన్ని అంతు చిక్కని మరణాల గురించి తెలుసుకోవడానికి వస్తారు. అక్కడ వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే వడక్కన్ స్టోరీ. Mattrum oru thriller🔥🔥on the way makkaley😉#Vadakkan premieres from June6 on @ahatamil @OffbeetStudios #Vadakkanonaha #ahatamil pic.twitter.com/OAobkRgUyB— aha Tamil (@ahatamil) June 3, 2025 -
ఆరేళ్ల తర్వాత ఓటీటీకి దుల్కర్ సల్మాన్ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
గతేడాది లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'ఓరు యమండన్ ప్రేమకథ'. ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్కు బీసీ నౌఫల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళంలో అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఒక యముడి ప్రేమకథ టైటిల్తో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత రావడంతో ఓటీటీ ప్రియులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
బెంగళూరు విషాదం.. కమల్ హాసన్ ట్వీట్!
బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని పోస్ట్ చేశారు. ఈ ఘటన హృదయ విదారకంగా అనిపించిందని.. తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు.కాగా.. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన పరేడ్ విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమందికి పైగా మృతి చెందారు. చాలామంది ఫ్యాన్స్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు.మరోవైపు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ఇవాళే థియేటర్లలో విడుదలైంది. అయితే కన్నడ భాషపై ఆయన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. Heart wrenching tragedy in Bangalore. Deeply distressed and my heart reaches out to the families of the victims in this moment of grief. May the injured recover soon.— Kamal Haasan (@ikamalhaasan) June 4, 2025 -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్-2 కంటే వరస్ట్గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్గా ఉందంటున్నారు. థగ్ లైఫ్ సినిమాలో కమల్ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్గా అనిపించాయని ఓ నెటిజన్స్ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025 -
'థగ్ లైఫ్' మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?
గత కొన్నిరోజుల నుంచి తమిళ హీరో కమల్ హాసన్ వార్తల్లో ఉంటూనే ఉన్నారు. దీనికి కారణం 'థగ్ లైఫ్' సినిమా. కొన్నిరోజుల క్రితం జరిగిన చిత్ర ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష.. తమిళం నుంచే పుట్టిందని అన్నాడు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కమల్ వేసిన పిటిషన్ వల్ల ఈ వివాదంలోకి కర్ణాటక హైకోర్ట్ కూడా ఎంటరైంది. సారీ చెబితే సరిపోతుంది కదా అని చివాట్లు పెట్టింది.(ఇదీ చదవండి: చాలా హర్టయ్యా.. జీవితంలో అలా మాట్లాడను: రాజేంద్రప్రసాద్)ఇలా కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిన కమల్ హాసన్.. మరోవైపు 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయనని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ రేపు అనగా జూన్ 05న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఎలాంటి లొకేషన్స్లో మూవీని చిత్రీకరించారో చూపించారు. ఈ వీడియోకి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిఫరెంట్గా ఉంది.దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్-మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది. వీళ్లే నిర్మాతలగానూ వ్యవహరించారు. మరి కమల్ కావాలనే కన్నడ ప్రేక్షకులతో ఈ గొడవ పెట్టుకున్నాడా? అనిపిస్తుంది. ఎందుకంటే సారీ చెప్పనని లెటర్ రిలీజ్ చేయడం లాంటివి చూస్తుంటే భవిష్యత్తులో తమిళ మూవీస్కి సెగ తప్పదేమో అనిపిస్తుంది. మరి చూడాలి కమల్ 'థగ్ లైఫ్'తో ఏం చేస్తాడో?(ఇదీ చదవండి: 'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది) -
'థగ్లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్కి తగిలింది
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్లైఫ్ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్లైఫ్ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకన్', ఇప్పుడు 'థగ్ లైఫ్' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడమే.వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వీరి ప్లాన్స్ను థగ్లైఫ్ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్ లైఫ్ని బ్యాన్ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్ జననాయకన్' అనే కొత్త క్యాంపెయిన్ మొదలైంది.థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్ తన జననాయకన్ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా రాజేష్ లింగేష్ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్ కూడా బ్యాన్ చేయాలి అంటూ పోస్ట్లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.దీంతో విజయ్ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు సినిమా నిషేధించడం న్యాయం కాదు. జననాయకన్ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్లైఫ్.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం. -
తీవ్ర దుఃఖంలో శోభన.. మాటలు రావడం లేదంటూ..
సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోయింది. తనకు ఎంతో ఇష్టమైన మిత్రురాలు అనిత మీనన్ ఇక లేదన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. సోషల్ మీడియా వేదికగా మిత్రురాలి మృతికి సంతాపం ప్రకటించింది. నా ప్రియమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంతకుమించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బాబూ అంకుల్, సూ ఆంటీ, సతీశ్ మీనన్, అవీషా, అనీషా.. మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ స్నేహితురాలు అనితతో కలిసున్న చిన్ననాటి ఫోటోలను షేర్ చేసింది.చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్చెన్నైలోని మైలపోర్లో శోభన ఇంటి పక్కనే అనిత మీనన్ కుటుంబం నివాసముండేది. శోభన కంటే అనిత మూడేళ్లు చిన్నది. ఇరుగుపొరుగు కుటుంబాలు కావడంతో వీరిద్దరూ ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్గా కలిసుండేవారు. శోభన హీరోయిన్గా వెండితెరపై బిజీగా ఉన్నప్పటికీ అనితతో తన స్నేహాన్ని కొనసాగించింది. ఇకపోతే శోభన.. ఇటీవలే వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. తుడరుం సినిమాలో మోహన్లాల్ భార్యగా నటించింది. 1990లో వీరిద్దరి కాంబినేషన్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. సినిమాలు‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. మలయాళంలో మణిచిత్రతారు అనే సినిమాలో ద్విపాత్రాభినయంతో మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మిత్ర్ - మై ఫ్రెండ్ అనే సినిమాకుగానూ మరోసారి జాతీయ పురస్కారం గెల్చుకుంది. నటిగానే కాకుండా క్లాసికల్ టీచర్గా సేవలందిస్తున్న శోభనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్తో సత్కరించింది. View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) చదవండి: ఆ మందులు వాడమన్న సమంత.. భగ్గుమన్న డాక్టర్ -
లోకేష్ యూనివర్స్లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ
ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఈ తరహా యూనివర్స్ సృష్టించాడు. ఇందులో భాగంగా త్వరలో ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాలు రాబోతున్నాయని స్వయంగా లోకేశ్.. పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ యూనివర్స్లోకి కొత్త విలన్ వచ్చిచేరాడు.లోకేశ్ దర్శకుడిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు చిత్రాలకు కథలు అందిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాంటి ఓ మూవీనే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ వయలెంట్ యాక్షన్ మూవీలో ఇప్పుడు మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్గా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అతడి పాత్ర ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?) 'విక్రమ్' మూవీ చివర్లో వచ్చే రోలెక్స్ పాత్రని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. 'బెంజ్' విలన్ చూస్తుంటే సూర్యనే గుర్తొచ్చాడు. ఒళ్లంతా బంగారు చైన్స్, వాచ్, చివరకు బంగారు పళ్లతో నివిన్ పౌలీ కనిపించిన విధానం.. చివర్లో తన పేరు వాల్టర్ అని చెప్పడం ఇదంతా కూడా రోలెక్స్ పాత్రనే ఫాలో అయిపోయినట్లు అనిపించింది. ఇందులో వాల్టర్ అనే విలన్గా నివిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ వీడియోలోనే.. ఈ సినిమా లోకేశ్ యూనివర్స్లో భాగమని క్లారిటీ ఇచ్చారు. మరి ఏ సినిమాలో ఈ పాత్రని లింక్ చేస్తారో చూడాలి?బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు కాగా.. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోకు కూడా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. విలన్గా చేస్తున్న నివిన్ పౌలీ విషయానికొస్తే.. మలయాళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయిపల్లవికి ఎంతో పేరు తెచ్చిన 'ప్రేమమ్'లో హీరో ఇతడే. మరి ఇప్పుడు విలన్గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి) -
బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. కేజీఎఫ్తో బ్లాక్బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Director #PrashanthNeel is overjoyed as he celebrates #RCB’s victory in IPL 2025🏆#IPL2025Final #TeluguFilmNagar pic.twitter.com/tnXGeqqkem— Telugu FilmNagar (@telugufilmnagar) June 3, 2025 -
దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: తమిళ నిర్మాతల సంఘం వినతి
కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా నిషేధంపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు లేఖ రాసింది. ఈనెల 5న విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కమల్ హాసన్ కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తూ కేఎఫ్సీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమ లేఖలో రాస్తూ..' ఎన్నో ఏళ్లుగా కన్నడ, తమిళ సినీ పరిశ్రమలు కలిసి పనిచేస్తున్నాయి. శివరాజ్కుమార్, ఉపేంద్ర, సుదీప్ లాంటి కన్నడ హీరోలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సైతం కన్నడ చిత్రాలు తీశారు. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం ఇద్దరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి భాషకు ఓ చరిత్ర ఉంది. ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఈవెంట్లో కమల్హాసన్ ప్రేమతో మాట్లాడారు. అంతేకానీ మీ భాషను తక్కువ చేయాలని కాదు. కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ చిత్ర దర్శకులంటే ఆయన గౌరవం. థగ్ లైఫ్ వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో ఇండస్ట్రీల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది.' ' అని ప్రస్తావించారు.కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఆయన కామెంట్స్ చేయడంతో పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు కన్నడిగులు. ఈ నేపథ్యంలోనే కేఎఫ్సీసీ ఆయన సినిమా థగ్ లైఫ్ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కమల్ హాసన్ తాను క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు. -
కన్నడ భాష వివాదం వేళ.. తమిళంలో కమల్ హాసన్ ట్వీట్ వైరల్!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్తో కర్ణాటక వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ అనడంపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ లేటేస్ట్ మూవీ థగ్ లైఫ్పై ఏకంగా బ్యాన్ విధించారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థగ్ లైఫ్ను నిషేధిస్తూ ప్రకటన విడుదల చేసింది. కమల్ క్షమాపణ చెబితేనే రిలీజ్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.అయితే కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తన మూవీని కర్ణాటకలో విడుదల చేయడం లేదంటూ వెల్లడించారు. భాషా వివాద నేపథ్యంలో.. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పమన్న కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ను ఆదేశించింది.అయితే ఈ వివాదం నేపథ్యంలో కమల్ మరోసారి చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేశారు. 'ఆయన తన జీవితాంతం తమిళ భాష, తమిళ కళలకు, తమిళనాడు అభివృద్ధికి, తమిళ కళల సంక్షేమానికి అంకితం చేసిన అసమాన నాయకుడు కలైంగర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి నేను సంతోషిస్తున్నా' అంటూ కరుణానిధితో దిగిన ఫోటోను పంచుకున్నారు.(ఇది చదవండి: కమల్ హాసన్ థగ్ లైఫ్లో మీర్జాపూర్ నటుడు.. క్లారిటీ ఇదే!)థగ్ లైఫ్ వివాదం వేళ కమల్ హాసన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటకలో థగ్ లైఫ్ నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించగా.. ఉన్నత న్యాయస్థానం కమల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే సరిపోయేది కదా ఆంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎఫ్సీసీకి కమల్ లేఖ రాశారు కానీ క్షమాపణ మాత్రం చెప్పకపోవడం విశేషం.தமிழ் மொழிக்கும் தமிழ்க் கலைக்கும் தமிழ்நாட்டின் வளர்ச்சிக்கும் தமிழர்தம் நலனுக்கும் தன் மொத்த வாழ்வையும் அர்ப்பணித்துச் செயலாற்றிய ஒப்பற்ற தலைவர் கலைஞரை அவர்தம் பிறந்த நாளில் போற்றுவதில் மகிழ்கிறேன். pic.twitter.com/wnR0lOhfKS— Kamal Haasan (@ikamalhaasan) June 3, 2025 -
వెనక్కి తగ్గని కమల్..సారీ చెప్పను- రిలీజ్ చేయను
ప్రస్తుతం కమల్ హాసన్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ కామెంట్ చేశాడు. దీనిపై కర్ణాటక అధికార, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమాని తమ దగ్గర నిషేధిస్తున్నట్లు స్వయంగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన చేసింది. ఇప్పుడు ఈ విషయమై కమల్ లేఖ విడుదల చేశారు.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?)కన్నడ సూపర్స్టార్ రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన కమల్.. 'కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి వారు అపార్థం చేసుకోవడం బాధగా ఉంది. మనదంతా ఒకే కుటుంబం అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషని తక్కువ చేయడం కాదు' అని కమల్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహులుకు లేఖ రాశారు.కర్ణాటకలో 'థగ్ లైఫ్' నిషేధించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకోవడంతో కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా కమల్కి చివాట్లు పెట్టింది. మీరేమైనా చరిత్రకారులు అనుకుంటున్నారా? ఏ ఆధారంతో ఈ కామెంట్స్ చేశారు, సారీ చెబితే సరిపోతుంది కదా అని తీర్పు ఇచ్చింది. అయినా సరే కమల్ వెనక్కి తగ్గలేదు. క్షమాపణ చెప్పలేదు సరికదా.. కర్ణాటకలో 'థగ్ లైఫ్' రిలీజ్ చేయట్లేదని తన లేఖలో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు' మళ్లీ వాయిదా?) -
బర్త్ డే స్పెషల్.. ఇళయరాజా రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
మ్యాస్ట్రో ఇళయరాజా.. ఈ పేరు చెప్పగానే సంగీత ప్రియులు పరవశించిపోతారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో పెద్దగా ఈయన మార్క్ కనిపించట్లేదు గానీ 80-90ల్లో ఈయన ఓ సినిమా చేస్తున్నారంటే చాలు సూపర్ హిట్ గ్యారంటీ అనేలా ఉండేది. మరి ఇళయరాజా ఇప్పుడేం చేస్తున్నారు? ఒక్కో చిత్రానికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు?(ఇదీ చదవండి: కమల్ హాసన్కి చివాట్లు పెట్టిన హైకోర్ట్)తమిళనాడులో 1943లో ఇదే రోజున(జూన్ 03) పుట్టిన ఇళయారాజా.. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కర్ణాటిక్, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న ఈయన.. 1976లో 'అనార్కలి' అనే తమిళ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో డిఫరెంట్గా క్రియేట్ చేసిన సౌండ్.. ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక అప్పటి నుంచి ఈయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో 1000కి పైగా సినిమాలకు ఇళయారాజా పనిచేశారు. 7000 పైచిలుకు పాటల కంపోజ్ చేశారు. నాయగన్, దళపతి చిత్రాలు ఈయన కెరీర్లోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పటికీ సినిమాలకు సంగీతమందిస్తున్న ఇళయరాజా.. ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఒకప్పటిలా తన సంగీతంతో ప్రభావం చూపించలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది)ఇళయరాజా వ్యక్తిగత జీవితానికొస్తే.. జీవా అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఈమె 2011లో చనిపోయింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి. ఈ ముగ్గురు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. యువన్ రాజా.. తండ్రిలానే సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా ఆస్తి విషయానికొస్తే.. గ్రాండ్ చెన్నై బంగ్లాతో పాటు పలు స్టూడియోలు, అత్యాధునిక సంగీత పరికరాలు ఈయన సొంతం. అలానే దాదాపు రూ.800 కోట్లకు పైగా ఆస్తి ఈయనకు ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇళయరాజా సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం.. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కొన్నాళ్ల ముందు వరకు ఈయన అంటే అందరికీ గౌరవం ఉండేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలువురు దర్శక నిర్మాతలపై కాపీ రైట్ కేసులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇళయరాజా ఎందుకిలా చేస్తున్నారా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?) -
సారీ చెప్పాల్సిందే.. కమల్ హాసన్పై హైకోర్ట్ ఆగ్రహం
కమల్ హాసన్ చేసిన 'కన్నడ' కామెంట్స్ వల్ల 'థగ్ లైఫ్' సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ మూవీపై నిషేధం విధించారు. దీంతో కమల్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు తన చిత్ర విడుదల విషయమై పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కమల్ హాసన్కి చివాట్లు పెట్టింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.(ఇదీ చదవండి: అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ)కమల్ పిటిషన్పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్ట్.. 'మీరేమైనా చరిత్రకారుడా లేదా భాష పండితుడా? కన్నడ అనేది తమిళ నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు క్షమాపణ చెప్పింది. సమస్య పరిష్కారమవుతుంది' అని తీర్పు ఇచ్చింది.వివాదం విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ చెప్పారు. దీంతో కర్ణాటకలోని అధికార, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్.. తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో దారిలేక కమల్.. కర్ణాటక హైకోర్ట్ని ఆశ్రయించారు. ఇప్పుడు తీర్పు కమల్కి వ్యతిరేకంగా వచ్చింది. మరి ఇప్పటికైనా కమల్ సారీ చెబుతారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రానా నాయుడు 2 ట్రైలర్ వచ్చేసింది) -
రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్
అంజు అరవింద్ (Anju Aravind).. నటి మాత్రమే కాదు డ్యాన్సర్ కూడా! అప్పట్లో మలయాళ సినిమాల్లో టాప్ హీరోయిన్గా రాణించిన ఆమె కన్నడ, తమిళ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో రథయాత్ర అనే ఏకైక సినిమాలో నటించింది. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ సోదరిగానూ కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి వెల్లడించింది.రెండు పెళ్లిళ్లు విషాదాంతం..అంజు అరవింద్ మాట్లాడుతూ.. మొదటి పెళ్లి విడాకులతో ముగిసిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నాక భర్త మరణించాడు. ఇప్పుడు నేను నా చిన్ననాటి క్రష్తో కలిసి జీవిస్తున్నాను. సంజయ్ అంబలపరంబత్తో ఐదేళ్లుగా కలిసుంటున్నాను. నన్ను డ్యాన్స్ టీచర్గా నిలబెట్టి, బెంగళూరులో సెటిలవడానికి సాయం చేసింది సంజయే.. చిన్నప్పుడు ఒక డ్యాన్స్ స్కూల్లో కలుసుకున్నాం. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అప్పుడతడే నా ఫస్ట్ క్రష్. మా ప్రేమకథతో సినిమా తీయొచ్చుడ్యాన్స్ స్కూల్ అయిపోయాక మా జీవితాలు వేరయ్యాయి. చివరకు ఇలా విచిత్రంగా కలుసుకుని ఒక్కటయ్యాం.. మా కథ చెప్పాలంటే ఓ సినిమానే తీయొచ్చు అని చెప్పుకొచ్చింది. డ్యాన్సర్ అయిన సంజయ్ మొదట్లో ఐటీ నిపుణుడిగా పని చేశాడు. ప్రేయసి కోసం బెంగళూరులో అంజు అరవింద్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్ సంస్థను నెలకొల్పాడు. మలయాళంలో బోలెడన్ని సినిమాలు చేసిన అంజు అరవింద్.. తర్వాతి కాలంలో బుల్లితెరపైనా సందడి చేసింది. పలు సీరియల్స్లో కీలక పాత్రలు పోషించింది. చదవండి: క్యాన్సర్తో పోరాటం.. ట్రీట్మెంట్ పనిచేయక నటుడు మృతి -
'థగ్ లైఫ్ ఆడకూడదు అంటూ వార్నింగ్'
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్పై కర్ణాటక వ్యాప్తంగా వ్యతిరేకత అధికమవుతోంది. ఆయన నటించిన కొత్త సినిమా థగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల చేయకండి అంటూ కన్నడ సంఘాలు హెచ్చరించాయి. ఒక్క థియేటర్లో సినిమా ఆడినా బెంగళూరును బంద్ చేస్తామని కర్ణాటక రక్షణా వేదిక నాయకులు తెలిపారు. ఈ సినిమా జూన్ 5న దేశమంతటా విడుదల అవుతోంది. కమల్ క్షమాపణ చెప్పకపోవడంతో కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. సినిమా ఆడిస్తే థియేటర్ లోపలికి చొరబడి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. కన్నడ సంఘాలన్ని ఏకమై ఈ తీర్మానం చేసినట్లు నేతలు తెలిపారు. కమల్ సినిమా ఎట్టిపరిస్థితిల్లోనూ ఇక్కడ రన్ చేసేది ఉండదని వారు పేర్కొన్నారు. కమల్ని అరెస్టు చేయాలి కమల్ హాసన్ను వెంటనే అరెస్టు చేయాలని మైసూరులో కన్నడ చళువళి పోరాటదారుడు వాటాల్ నాగరాజు, సంఘాల నేతలు కమల్ చిత్రానికి నిప్పుపెట్టారు. కమల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాటాల్ మాట్లాడుతూ కర్ణాటకలో కమల్ హాసన్ సినిమాలను పూర్తిగా బహిష్కరణ చేయాలని అన్నారు. కన్నడ ప్రజలు కమల్ సినిమాలను వ్యతిరేకించాలని చెప్పారు. -
ఇక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో చదివాను: నాగార్జున
ధనుష్, నాగార్జున, నటి రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రం కుబేర( Kuberaa). శ్రీవెంకటేశ్వర ఫిలింస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 20వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ వేడుకలో నటుడు ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నటి రష్మిక మందన్న( Rashmika Mandanna) మాట్లాడుతూ తనను ఈ చిత్రంలోకి ఆహ్వానించినందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు ధనుష్తో మళ్లీ కలిసి నటించాలని కోరుకుంటున్నాననీ, అయితే ఈ సారి పూర్తి ప్రేమ కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత తదితర బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు ధనుష్ అంటూ ప్రశంసించారు. కుబేర అద్భుతమైన చిత్రం అని పేర్కొన్నారు. నటుడు నాగార్జున(Akkineni Nagarjuna) మాట్లాడుతూ అడయార్లో పుట్టి, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివి, చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే జీవితాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. చెన్నై ప్రేక్షకులు తనకు అందిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని అన్నారు. కుబేర చిత్రం తరువాత రజనీకాంత్తో కలిసి నటించిన కూలీ చిత్రం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించడానికి ఎదురు చూస్తోందని నాగార్జున పేర్కొన్నారు. నటుడు ధనుష్(Dhanush) మాట్లాడుతూ ఇది కలికాలం అనీ, వ్యతిరేకత, అసూయ పడేవారి కాలం అనీ, చెడు మంచి కంటే పెట్రేగిపోతోందని అన్నారు. పరలోకం నుంచి వచ్చిన దేవత మాదిరి స్వచ్ఛమైన మనసు కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి పని చేసే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వీ నారంగ్ కథపై అపార నమ్మకంతో ఈ చిత్రాన్ని బ్రహా్మండంగా నిర్మించారని పేర్కొన్నారు. -
మనసు నీకై రథమయ్యే రారా...
కమల్హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు, త్రిష, అభిరామి, నాజర్ ఇతర ప్రధానపాత్రలు పోషించారు. రాజ్కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్పై ఎన్. సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘విశ్వద నాయక...’ అంటూ సాగే నాలుగోపాటని విడుదల చేశారు. ‘విశ్వద నాయక.. విహిత వీరా... మనసు నీకై.. రథమయ్యే రారా...’ అంటూ ఈపాట సాగుతుంది. ‘‘ఈపాటలో కమల్హాసన్ క్యారెక్టర్ నేచర్, అభిరామి, త్రిషపాత్రల్లోని డైనమిక్స్ని లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రశాంత్ వెంకట్ రాసిన ర్యాప్ ఈపాటకు మరో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అలెగ్జాండ్రా జాయ్ వండర్ ఫుల్ వోకల్స్ ఎమోషన్ని నావిగేట్ చేయగా, ఏఆర్ అమీన్ ర్యాప్ ఎనర్జీని మరింతగా పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రజనీకాంత్ ఒడిలో బాలుడు.. ఏడేళ్ల నాటి స్టోరీ ఇప్పుడు వైరల్
సోషల్మీడియాలో కొద్దిరోజులుగా ఒక ఫోటో వైరల్ అవుతుంది. రజనీకాంత్ ఒడిలో ఒక బాలుడు కూర్చొని ఉన్న ఫోటో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే, అది ఎంతవరకు నిజం అని చాలామంది తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.ఈ ఫోటో 2018 నాటిది. రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఆ బాలుడి పేరు మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులో ఆ బాలుడు చేసిన పనితో తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. ఈరోడ్లో ఉన్న తన పాఠశాల సమీపంలో యాసిన్కు రూ. 50 వేలు దొరికింది. ఇంటి నుంచి తన పాఠశాలకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక పర్సును చూశాడు. ఆ పర్సులో రూ.100, రూ.500 నోట్లు మొత్తం రూ.50,000 ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు నేరుగా తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) 'శక్తి'కి ఇచ్చాడు. అప్పుడు ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదు, మీ ప్రిన్సిపాల్కు చెప్పకుండా నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగారు. దానికి యాసిన్ తిరిగి ఇలా సమాధానం ఇచ్చాడు. 'ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించి ఉంటారు. ఈ డబ్బు నాది కాదు. అలాంటప్పుడు దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలను. ఈ డబ్బు ఎవరిదో వారికే ఇవ్వండి' అంటూ తిరిగి బదులిచ్చాడు. బాలుడి నిజాయితీని మెచ్చిన ఏస్పీ నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు వెంటనే ఆ బాలుడు నాకు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) అంటే చాలా ఇష్టం. ఆయన్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. దీంతో వెంటనే పోలీసులు జరిగిన విషయాన్ని రజనీకాంత్కు తెలిపారు. అందుకు స్పందించిన రజనీ.. యాసిన్తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకు రమ్మని తెలిపారు. రజనీకాంత్ ఆ పిల్లవాడి నిజాయితీని ప్రశంసించి, అతని చదువుకు స్పాన్సర్ చేస్తానని ప్రకటించారు. ఆపై యాసిన్, అతని కుటుంబాన్ని పోయెస్ గార్డెన్లోని తన నివాసానికి ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. బాలుడికి సరైన దుస్తులు, కావాల్సిన బుక్స్ వంటివి తీసుకోవాలని అతని తల్లిదండ్రులకు రూ. 50వేలు రజనీ ఇచ్చారు. ఆపై యూసిన్ చదువులకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని రజనీ మాట ఇచ్చారు. 'రూ.100 నోటు కోసం కూడా మోసం, దొంగతనం, హత్య చేసే ఈ కాలంలో, అతను (యాసిన్) ఇది నా డబ్బు కాదని చెప్పి దానిని అప్పగించాడు. నిజంగా ఎంత నిజాయితీ. ఇది గొప్ప గుణం' అంటూ యాసిన్ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఆ బాలుడు ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్నాడు.This child sitting on the lap of superstar Rajnikanth became an example of honesty in Tamil Nadu. Mohammad Yasin found 50 thousand rupees on the road. He went straight to the police station and gave the money to the police officer and said "I found this money on the road.… pic.twitter.com/Vy4wrozbzO— Gabbar (@Gabbar0099) June 1, 2025 -
అందరిని మెప్పించేలా 'కుబేర' కొత్త సాంగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 20న కుబేర చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. తాజాగా విడుదలైన 'అనగనగా కథ' పాటను చంద్రబోస్ రచించారు. హైడ్ కార్తీ, కరీముల్లా ఆలపించారు. -
అలాంటి సినిమాలే చేస్తున్నావని నాపై ట్రోల్స్: యంగ్ హీరో
ఇండస్ట్రీలో కొందరు హీరోలు కొన్ని జానర్ సినిమాలతో ఫేమస్ అవుతారు. అలా కొన్నాళ్ల పాటు సదరు హీరో నుంచి ఒకే తరహా మూవీస్ వస్తాయి. విసుగెత్తిపోయిన ప్రేక్షకులు విమర్శించడం లాంటివి చేస్తే రూట్ మారుస్తారు. ఇప్పుడు సేమ్ అలాంటి అనుభవమే తనకు ఎదురైందని ఓ యంగ్ హీరో చెప్పుకొచ్చాడు. మిడిల్ క్లాస్ మూవీస్ చేసిచేసి బోర్ కొట్టేసిందని అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి సంగతి?తమిళ ఇండస్ట్రీలో రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన మణికందన్.. 'విక్రమ్ వేద', 'జై భీమ్' లాంటి హిట్ సినిమాల్లో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. అలా గత మూడేళ్లలో చూసుకుంటే 'గుడ్ నైట్', 'లవర్'తో రీసెంట్గా 'కుడుంబస్థాన్' సినిమాతో వరస హిట్స్ కొట్టేశాడు. అయితే ఇవన్నీ మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో తీసినవే. దీంతో ఒకే తరహా చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్పందించాడు.(ఇదీ చదవండి: తొలిప్రేమ తోపు కాదు.. ఇంట్రెస్టింగ్ 'చెన్నై లవ్ స్టోరీ')తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణికందన్.. మిడిల్ క్లాస్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టేసిందని అన్నాడు. గత మూడు చిత్రాలు హిట్ అయినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి ట్రోల్స్ కూడా వచ్చాయనే విషయాన్ని గుర్తుచేశాడు. ఈ ఏడాది ఓ మూడు సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఏడాది మరో మూడు చిత్రాల్లో నటిస్తానని.. ఇవన్నీ కూడా తన గత చిత్రాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయని హామీ ఇచ్చాడు.మణికందన్ గత మూడు చిత్రాలు నేరుగా తెలుగులో రిలీజ్ కానప్పటికీ.. ఓటీటీ డబ్బింగ్తో తెలుగు ఆడియెన్స్ని కూడా ఆకట్టుకోవడం విశేషం. 'గుడ్ నైట్' విషయానికొస్తే.. గురక సమస్యతో ఇబ్బందిపడే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు, పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే స్టోరీ. లవర్ విషయానికొస్తే.. ప్రస్తుత సమాజంలోని ప్రేమ, అతిప్రేమ లాంటి అంశాలతో తీసిన సినిమా. కుడుంబస్థాన్ విషయానికొస్తే.. మధ్య తరగతి యువకుడు ఓవైపు జాబ్ చేస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎలాంటి కష్టాలు అనుభవించాడనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' రివ్యూ)"I am bored of doing Middleclass films as it's happening on packed House for Goodnight, Lover & Kudumbasthan. Audience is also criticizing the same🙁. I'll be filming 3 Films this year & 3 Films next year. All those films will be different🫰"- #Manikandanpic.twitter.com/r7HPnbWTFk— AmuthaBharathi (@CinemaWithAB) June 2, 2025 -
కోలీవుడ్ పాన్ ఇండియా మూవీ 'ఫ్రీడమ్' టీజర్
కోలివుడ్ నుంచి తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ఫ్రీడమ్' (Freedom) నుంచి తాజాగా టీజర్ను విడుదల చేశారు. ఇందులో శశికుమార్ (Sasikumar), లిజోమోల్ జోస్ (Lijomol Jose) జోడీగా నటించారు. తాజాగా విడుదలైన తెలుగు టీజర్ ఆసక్తిగానే ఉంది. విజయ గణపతి పిక్చర్స్ బ్యానర్పై పాండియన్ పరశురామన్ దీనిని నిర్మిస్తున్నారు. సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 10న ప్రపంచవ్యాప్తంగా తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. -
ఓటీటీల్లో సినిమాల సందడి.. ఈ వారం ఏకంగా 22 చిత్రాలు!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ థగ్ లైఫ్ ఒక్కటే కాస్తా బజ్ ఉన్న సినిమా. ఆ తర్వాత తెలుగులో వస్తోన్న శ్రీ శ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్, బద్మాషులు లాంటి చిత్రాలు ఆసక్తిగా పెంచుతున్నాయి. బాలీవుడ్ నుంచి హౌస్ఫుల్-5 కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.అయితే ఈ వారం ఓటీటీల విషయానికొస్తే రజినీకాంత్ లాల్ సలామ్, జింఖానా, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి వచ్చేస్తున్నాయి. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది. ఈ సిరీస్లో రీతూ వర్మ, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇవీ మినహయిస్తే ఓటీటీల్లో అంతగా చెప్పుకొదగ్గ సినిమాలేవీ రావడం లేదు. బాలీవుడ్, హాలీవుడ్తో పాటు దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్..ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02క్రిమినల్ కోడ్- సీజన్ 4- జూన్ 04వన్ ఆఫ్ దెమ్ డేస్- (హాలీవుడ్ మూవీ) - జూన్ 04జిన్నీ అండ్ జార్జియా- సీజన్-3 - జూన్ 05టైర్స్ - సీజన్-2- జూన్ 05జాట్ (హిందీ మూవీ) - జూన్ 05 (రూమర్ డేట్)మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ- జూన్ 06స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06అమెజాన్ ప్రైమ్స్టోలెన్- జూన్ 04సన్ నెక్ట్స్లాల్ సలామ్- జూన్ 06జియో హాట్స్టార్టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02గజానా (హిందీ) - జూన్ 02దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06జీ5చాట్ కపట్- ది డిసెప్షన్ (హిందీ)- జూన్ 06సోనీ లివ్..అల్లప్పుజా జింఖానా- జూన్ 05మహారాణి- సీజన్-4- జూన్ 06లయన్స్గేట్ ప్లేరెడ్-2- అడ్వంచర్ మూవీ- జూన్ 0612 స్ట్రాంగ్- హాలీవుడ్ మూవీ- జూన్ 06హై ఫోర్సెస్- హాలీవుడ్ మూవీ- జూన్ 06కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06యాపిల్ టీవీ ప్లస్స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04 -
హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్!.. నాన్న భరించలేకపోయాడు: రకుల్ ప్రీత్సింగ్
సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల పర్సనల్ విషయాల వరకు అన్నింటిపైనా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరికొందరేమో వాటిపై స్పందించి నిజానిజాలు ప్రేక్షకులకు తెలియజేస్తుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి ఎన్నో పుకార్లు వస్తుంటాయి. వారిచ్చిపుచ్చుకునే కానుకల గురించైతే చెప్పనక్కర్లేదు.హైదరాబాద్ ఇల్లు గిఫ్ట్?అలా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గురించి కూడా ఓ గాలి వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో ఆమె ఉంటున్న ఇల్లు తను సంపాదించింది కాదని, ఎవరో రాజకీయ నాయకుడు ఆమెకు కానుకగా ఇచ్చాడన్నది సదరు వార్త సారాంశం. ఈ రూమర్ గురించి రకుల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. 'హైదరాబాద్లోని ఇల్లు ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారన్న వార్త చూసి మా నాన్న చాలా ఆగ్రహానికి గురయ్యాడు. నా కష్టార్జితం..నిజానికి ఆ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులన్నీ నాన్నే స్వయంగా చూసుకున్నాడు. అలాంటిది ఆ ఇల్లు మా సొంతం కాదన్న వార్త చూడగానే భరించలేకపోయాడు. ఏంటిది? నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్న ఇల్లు ఎవరో బహుమతిగా ఇచ్చారని ఎలా అంటారు? అని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇలాంటి పనికిరాని పుకార్లకు మనం స్పందించాల్సిన అవసరం లేదని నచ్చజెప్పాను. నాన్నేమో.. రిప్లై ఇవ్వాల్సిందే అంటాడు. ఇలాంటి చెత్త రూమర్లను పట్టించుకోనక్కర్లేదని నాన్నను ఎలాగోలా సముదాయించాను' అని రకుల్ చెప్పుకొచ్చింది.సినిమారకుల్ ప్రీత్.. 'కెరటం' సినిమాతో తెలుగులో తన ప్రయాణాన్ని ఆరంభించింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, పండగ చేస్కో, కిక్ 2, సరైనోడు, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో.., జయ జానకి నాయక, చెక్, ఇండియన్ 2 వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండియన్ 3, దేదే ప్యార్ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.చదవండి: అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్ -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ దర్శకుడు కన్నుమూత
కోలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మరణించారు.శంతను భాగ్యరాజ్, ప్రభు, కతీర్తో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్ సుగుమారన్ పనిచేశారు. డైరెక్టర్ మరణం పట్ల నటుడు శాంతను భాగ్యరాజ్ సంతాపం వ్యక్తం చేశారు. మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంత నేర్చుకున్నాననని అన్నారు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచకుంటానని పోస్ట్ చేశారు. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్.. మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.కాగా.. విక్రమ్ సుకుమారన్ 2013లో మధయనాయక్ కూట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కథిర్, అంజు జంటగా నటించారు. అంతకుముందు విక్రమ్.. బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. 2023లో వచ్చిన 'రావణ కొట్టం'తో సూపర్ హిట్ కొట్టారు. ఆడుకాలం మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఆయన చివరిసారిగా 'థెరం బోరం' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. #Rip dearest brother @VikramSugumara3 I’ve learnt so much from you & will always cherish every moment Gone too soonYou will be missed #RIPVikramSugumaran pic.twitter.com/U78l3olCWI— Shanthnu (@imKBRshanthnu) June 1, 2025 -
'అలాంటి వారు పక్కకెళ్లి ఆడుకోండి'.. హేటర్స్కు ధనుశ్ స్ట్రాంగ్ కౌంటర్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ప్రస్తుతం కుబేరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.ఇకపోతే ఈ మూవీ రిలీజ్కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్లో తనపై వస్తున్న నెగెటివ్ ప్రచారంపై ధనుశ్ స్పందించారు.తన రాబోయే సినిమాపై వస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని, రూమర్స్ను హీరో ధనుశ్ ఖంండిచారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి కుట్రపూరిత ప్రచారం తనను ఎలాంటి ప్రభావితం చేయదని అన్నారు. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. నా రియల్ అభిమానులు తనపై వచ్చిన ప్రతికూలతను హ్యాండిల్ చేస్తారని స్పష్టం చేశారు. నా సినిమా రిలీజ్కు నెల రోజులు ఉండగానే మీరు ఎంత నెగెటివ్ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్గా మాట్లాడారు.(ఇది చదవండి: శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!)ధనుష్ మాట్లాడుతూ.. "మీరు నాపై ఎంత నెగెటివ్ ప్రచారమైనా చేసుకోండి. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. ఎందుకంటే నా అభిమానులు నాతో ఉన్నారు. నా గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేసే మీరు.. దయచేసి పక్కకెళ్లి ఆడుకోండి. ఎందుకంటే మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడి ప్రజలు.. కేవలం నా అభిమానులు మాత్రమే కాదు.. వారు నా సహచరులు.. 23 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సహచరులు. నాపై రూమర్స్ ప్రచారం చేసిన నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే.. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అభిమానులారా.. మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి. గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఈ రోజు మంచి స్థితిలో ఉన్నా. పరిస్థితి ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉంటాను. ఈ ప్రపంచానికి 'కుబేర' లాంటి సినిమా అవసరం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 'అంటూ భావోద్వేగ కామెంట్స్ చేశారు.Never seen this D in these Years @dhanushkraja 🛐❤️🔥Cut & Right Reply To The Haters !!!#KuberaaAudioLaunch #Kuberaa pic.twitter.com/eqxDzMPcv0— Dhanush Thambinga Da (@dtd_team) June 1, 2025 -
హీరోతో ప్రేమ? క్లారిటీ ఇచ్చేసిన నిధి అగర్వాల్
సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో ఉన్నారని రూమర్స్ రావడం సహజం. కలిసి సినిమా చేస్తున్న టైంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో అయితే శ్రీలీల.. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరో హీరోయిన్.. తనపై వస్తున్న గాసిప్స్ గురించి క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: స్టేజీపై రాజేంద్ర ప్రసాద్ 'బూతు' పురాణం.. అలీని ఏకంగా)'ఇస్మార్ట్ శంకర్'తో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. ప్రభాస్తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో నటించింది. పవన్ మూవీ.. ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొన్న నిధికి.. తమిళ హీరో శింబుతో రిలేషన్ అంటూ వచ్చిన రూమర్స్పై ప్రశ్న ఎదురైంది. దీనికి సవివరంగా క్లారిటీ ఇచ్చేసింది.'సినిమాల్లో నటించిన హీరోయిన్ల గురించి చాలా పుకార్లు వస్తాయి. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారు. ఇదంతా చాలా కామన్. ఎందుకంటే జనాలకు నిజాల కంటే రూమర్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా గురించి ఎప్పుడూ ఏదో ఒకటి ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది) -
శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి!
అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్కు వెళ్లినప్పుడు ఓ హోటల్ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్ సారీ చెప్పాడు. అందుకు శంకర్.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్ కూతుర్లు చాలా సింపుల్గా ఉంటారంటూ మహేశ్బాబు ఈ సంఘటనను అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు.మహేశ్కు సారీ చెప్పిన శంకర్ కూతుర్లుతాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్ (Aditi Shankar) ఓ యూట్యూబ్ ఛానల్లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. అక్కడ మహేశ్బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం. వీడియో వైరల్అప్పుడు మహేశ్ బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్ రమేశ్ను మహేశ్కు బాడీగార్డ్ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు. Finally hearing from @shankarshanmugh daughter about her funny experience with @urstrulyMahesh.Papam @MeherRamesh ni body guard anukundi 😂😂#MaheshBabu #Khaleja4K #ssmb29 pic.twitter.com/TfzfBLePGo— 👌🌟Ⓜ️🅱️2️⃣9️⃣ (@SPYderLoading) May 31, 2025 చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్గా..! -
సినిమా హిట్టయినా అవకాశాలు నిల్.. దానిపైనే ఫోకస్ పెట్టిన బ్యూటీ
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం... తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. మాతృ భాష ఏదంటే?అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.ఆచితూచి..‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!హిట్ అయినా అవకాశాలు నిల్మలయాళంలో టొవినో థామస్తో చేసిన ‘ఎఆర్ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?
మాజీ భార్యాభర్తలు మళ్లీ కలిశారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ జంటగా విడిపోయినా తల్లిదండ్రులుగా మాత్రం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమ కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలకు వీరిద్దరూ హాజరయ్యారు. అతడిని మనసారా హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యాత్ర తల్లిదండ్రులుగా గర్వంగా ఉందని క్యాప్షన్ ఇచ్చాడు. అటు రజనీకాంత్ సైతం అదే ఫోటోను ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ నా మనవడు తొలి మైలురాయిని దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా.. అని రాసుకొచ్చాడు.20 ఏళ్లకు విడాకులుసూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అని ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో ఆదర్శవంతంగా ఉండే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి వీరు వేర్వేరుగానే జీవిస్తున్నారు. భార్యాభర్తలన్నాక చిన్నపాటి గొడవలు మామూలే, మళ్లీ కలిసిపోతారులే అనుకున్న అభిమానులకు షాకిస్తూ విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. రజనీకాంత్ రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. చివరకు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు వీరికి గతేడాది నవంబర్లో విడాకులు మంజూరు చేసింది. సినిమాల విషయానికి వస్తే ధనుష్.. కుబేర, ఇడ్లీ కడై సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇడ్లీ కడై సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g— Rajinikanth (@rajinikanth) May 31, 2025 చదవండి: ఈజీగా టచ్ చేయడానికి మేం ఆట బొమ్మలమా? : నిత్యామీనన్ ఫైర్ -
కర్ణాటకలో బ్యాన్.. తమిళనాడులో గుడ్న్యూస్.. థగ్ లైఫ్కు బిగ్ రిలీఫ్!
కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటేడ్ చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిరత్న దర్శకత్వం వహించారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు.తాజాగా ఈ మూవీకి తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విధిస్తోన్న వినోద పన్నును భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా థగ్ లైఫ్ పన్నులు తగ్గించాలని కమల్ హాసన్ ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్-19 తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వల్ల పన్ను తగ్గించాలని కమల్ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం వినోద పన్ను 8.6 శాతం నుంచి 4 శాతానికి పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సమాచార మంత్రి తిరు ఎంపీ సామినాథన్కు కూడా ధన్యవాదాలు తెలిపింది. చాలా మంది నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు కాగా.. ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ కామెంట్స్తో పెద్ద వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ను సినిమాపై నిషేధం విధించారు. -
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
హీరోయిన్ రాధికా ఆప్టే ఇటీవలే సిస్టర్ మిడ్నైట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని డిఫరెంట్ రోల్లో నటించింది. ఈ మూవీని ఇటీవలే కాన్స్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. మే 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది.ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఈ చిత్రం ఇండియాలో విడుదలకు ముందు సెన్సార్ గురించి ఆందోళన ఉండేదని రాధికా తెలిపింది. ఎలాంటి కట్ లేకుండా సెన్సార్ ఇస్తేనే బాగుంటుందని భావించినట్లు పేర్కొంది. ఎందుకంటే ఈ చిత్రం కట్ చేయకుండా ప్రదర్శిస్తేనే అర్థమవుతుందని వెల్లడించింది. అనుకున్నట్లే ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ వచ్చిందని రాధికా ఆప్టే పంచుకుంది.రాధికా ఆప్టే మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్ను తాను ఇంతకు ముందు చేసిన వాటికి భిన్నంగా ఉంది. ఇది చాలా విచిత్రమైన సినిమా. ఇది ఒక క్రేజీ సినిమా. అది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎవరికైనా నటనలో పూర్తి స్వేచ్ఛ లభిస్తే అది చాలా మంచి సినిమా అవుతుంది. లేకపోతే అది ఒక డిజాస్టర్గా మిగులుతుంది. ప్రతి సృజనాత్మక నిర్ణయం వెనుక డైరెక్టర్ కాంధారి ఉన్నారని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ ఫెస్టివల్ సర్క్యూట్లో మా సినిమా విజయం సాధించడం నమ్మకాన్ని మరింత పెంచిందని ఆమె చెప్పింది. -
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ విడుదల తర్వాత మూడు సెకన్ల సీన్పై పెద్ద చర్చే జరిగింది. 70 ఏళ్ల కమల్ హాసన్, 42 ఏళ్ల అభిరామి మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించడంతో చాలా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, జాతీయ వార్తా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి అభిరామి తొలిసారి మాట్లాడింది. ట్రైలర్లోని సన్నివేశం కేవలం మూడు సెకన్ల నిడివి మాత్రమే ఉందని, దాని గురించి ఇంత వివాదం సృష్టించడం అనవసరమని నటి అభిరామి పేర్కొంది.థగ్ లైఫ్ ప్రమోషన్స్లతో బిజీగా ఉన్న అభిరామి ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'ఈ రోజుల్లో ఏదైనా క్షణాల్లోనే వివాదంగా మారవచ్చు. మనం దాని నుంచి తప్పించుకోలేము. దర్శకులు మణిరత్నం సార్ నన్ను ఆ పాత్రకు ఎందుకు ఎంచుకున్నారో నేను ఆయన్ను ప్రశ్నించను. సినిమా విషయంలో వారి నిర్ణయం ఏదైనా సరే నేను దానిని అంగీకరిస్తున్నాను. పూర్తి నా ఇష్టంతోనే ఆ సీన్ తీశారు. ఇది కేవలం మూడు సెకన్ల దృశ్యం. కానీ, ట్రైలర్ వల్ల కొన్ని అపార్థాలు ఏర్పడ్డాయి. సినిమాలోని ఆ సన్నివేశంతోనూ, లిప్లాక్కు దారితీసే విషయాలతోనూ చాలా లింక్ ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఎవరూ అలాంటి కామెంట్లు చేయరని అనుకుంటున్నాను. అది ఆ సన్నివేశానికి బాగా సరిపోతుందనే చేశాం. దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. వారు ముందు సినిమా చూడాలని నేను అభ్యర్థిస్తున్నాను' అని అభిరామి అన్నారు.కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతున్న 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ చిత్రంలో శింబు, జోజు జార్జ్, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, నాసర్, అశోక్ సెల్వన్,అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, ఆర్ మహేంద్రన్, శివ అనంత్ నిర్మించారు.కమల్ హాసన్, మణిరత్నం 37 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
కమల్ హాసన్ వివాదాస్పద కామెంట్స్.. మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
కమల్ హాసన్ కామెంట్స్పై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. కన్నడ భాషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన థగ్ లైఫ్ మూవీ అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కమల్ హాసన్కు గట్టి షాకిచ్చింది. క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్పై బ్యాన్ విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీంతో కమల్ హాసన్కు ఇచ్చిన డెడ్ లైన్ పూర్తి కాగానే థగ్ లైఫ్ను నిషేధించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.అయితే ఈ వివాదం మరింత ముదురుతున్న వేళ.. కమల్ అండగా ఓ ప్రకటన విడుదలైంది. కమల్ హాసన్కు మద్దతుగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిలిచింది. కమల్ హాసన్పై ప్రస్తుతం వస్తున్న వ్యతిరేకత సినీ ఇండస్ట్రీలో ఓ చీకటికోణంగా నిలుస్తుందని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ప్రజలు, కన్నడ చిత్ర పరిశ్రమ ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. ప్రాంతీయ, భాషా రంగాలకు అతీతంగా ఐక్యతను ప్రోత్సహించిన కమల్ హాసన్ లాంటి వ్యక్తిని తప్పుగా చిత్రీకరించడం అన్యాయమని అసోసియేషన్ ప్రకటనలో వెల్లడించింది. కమల్ హాసన్ను కన్నడ భాష వ్యతిరేకిగా చిత్రీకరించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.అయితే తాను చేసిన కామెంట్స్పై కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యం, నాకు చట్టం, న్యాయంపై నమ్మకముంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజమైందన్నారు. నన్ను ఇంతకు ముందు కూడా ఇలానే బెదిరించారు.. నేను తప్పు చేస్తే క్షమాపణలు చెబుతా.. తప్పు చేయకపోతే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాగా.. ఇప్పటికే కమల్ హాసన్ రాబోయే చిత్రం 'థగ్ లైఫ్'ను కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిషేధించింది. Nadigarsangam Press Release:#kamalhaasan #NadigarSangam #ns #siaa@actornasser @VishalKOfficial @Karthi_Offl @PoochiMurugan @karunaasethu @johnsoncinepro pic.twitter.com/OhUYqzZIkY— nadigarsangam pr news (@siaaprnews) May 30, 2025 -
కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో హీరో సూర్య
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం 'కంగువ', 'రెట్రో' చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!) -
కమల్ హాసన్ కామెంట్స్.. కర్ణాటకలో థగ్ లైఫ్కు బిగ్ షాక్!
కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్కు డెడ్లైన్ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్సీసీ కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో నిషేధించింది. ఇప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది. -
నటుడు రవిమోహన్కు అత్త నోటీసులు
నటుడు రవిమోహన్ (జయం రవి), భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం సీరియల్గా సాగుతోందనే చెప్పాలి. ముందు రవిమోహన్, ఆర్తీ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. తమ జీవితంలో వివాదం తలెత్తడానికి కారణం గాయని కెనిషానే కారణం అని ఆర్తిపై విమర్శలు చేశారు. అయితే మీ వివాదంలోకి తనను లాగొద్దని కెనిషా గట్టిగానే హెచ్చరించారు. కాగా రవిమోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. కాగా తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని రవిమోహన్ ఆయన భార్య ఆర్తికి, అత్త సుజాతలకు నోటీసుల పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్తి తల్లి సినీ,టీవీ సీరియళ్ల నిర్మాత సుజాత తన న్యాయవాది ద్వారా రవిమోహన్కు ఒక నోటీస్ పంపారు. తమపై చేసిన తప్పుడు ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇకపై సోషల్మీడియాలో తప్పుడు పోస్ట్లను షేర్ చేయవద్దన్నారు. అదే నోటీస్ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో రవిమోహన్, ఆర్తీల వ్యవహారం గురించి, వారి వివాహ సమస్యల గురించిన ప్రసారాన్ని అన్ని సామాజిక మాధ్యమాల్లో తొలగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. అదేవిధంగా రవిమోహన్, ఆర్తి, ఆమె తల్లి సుజాతలకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయకూడదని పేర్కొన్నారన్నారు. వీరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి. -
కమల్ హాసన్కు స్ట్రాంగ్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పకపోతే!
కమల్ హాసన్ చేసిన కామెంట్స్పై వివాదం మరింత ముదురుతోంది. ఆయన క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేయడంపై కన్నడ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీ కర్ణాటకలో విడుదల కానివ్వని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో థగ్ లైఫ్ రిలీజ్ను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు కన్నడ సంఘాలు కమల్ హాసన్ కామెంట్స్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కమల్ సినిమాను కర్ణాటకలో పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాయి.కమల్ హసన్ కామెంట్స్పై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఘాటుగా స్పందించింది. ఈనెల 30లోగా ఆయన క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ స్పష్టం చేసింది. కమల్ హాసన్పై తమకు ఎలాంటి సానుభూతి లేదని.. కన్నడ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. మరోవైపు రేపటిలోగా కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. థగ్ లైఫ్ సినిమాను విడుదల కానివ్వమని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వార్నింగ్ ఇచ్చారు.కర్ణాటక కేఎఫ్సీసీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ..' కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాను నిషేధించాలని కన్నడ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై ఇప్పటికే సమావేశమై చర్చించాం. కమల్ తప్పు చేశారని నిర్ధారించాం. తన వ్యాఖ్యలపై కమల్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే అంశంపై ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. ఈ విషయాన్ని కేఎఫ్సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వెల్లడించారు. కాగా.. ఇటీవల ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్పై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై కన్నడ సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. అయితే ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. -
కన్నడ భాషపై కమల్ కామెంట్స్.. పోలీసులకు ఫిర్యాదు!
కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీశాయి. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు మండిపడుతున్నారు. కమల్ హసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ భాషను ఉద్దేశించిన కమల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ కౌంటరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్ణాటక రక్షణ వేదిక బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన కన్నడిగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. తమిళులకు, మాకు విష బీజాలు నాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ సినిమా విడుదలైన ప్రతిసారీ కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాగా.. థగ్ లైఫ్ ఆడియో లాంచ్ సందర్భంగా తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.కాగా.. కమల్ హాసన్ వ్యాఖ్యలతో అనేక కన్నడిగుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. బెళగావి, మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కమల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బెళగావి మరికొన్ని ప్రదేశాలలో కార్యకర్తలు కమల్ పోస్టర్లను తగలబెట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఆయన సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా బెదిరించారు. -
ప్రముఖ హీరో మృతి.. సంతాపం తెలిపిన రజనీకాంత్
తమిళ చత్రి పరిశ్రమలో విషాదం నెలకొంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు కోలీవుడ్లో రాణించిన నటుడు రాజేష్ (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఆయన సతీమణి జోన్ సిల్వియా గతంలోనే మరణించారు. వారికి దివ్య, దీపక్ పిలల్లు ఉన్నారు.1974లో దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుస ఛాన్సులు దక్కాయి. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. పోతురాజు, మహానది, సత్య, కన్ని పరువతిలే వంటి సినిమాల్లో నటించారు. ఆయన హీరో నుండి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించాడు . 1985లో చెన్నైలోని కె.కె. నగర్ సమీపంలో సినిమా షూటింగ్ కోసం ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ ఇంట్లో అనేక తమిళ, మలయాళ మరియు హిందీ సినిమా షూటింగ్లు పూర్తయ్యాయి. సినిమాలతో పాటు ఆయన హోటల్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు సినిమాల్లో నటించారు. ఆయన మరణం పట్ల సూపర్స్టార్ రజనీకాంత్ సంతాపం తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని కోరారు. రాజేష్తో తనకు ప్రత్యేకమైన అనుభంధం ఉందని గుర్తుచేసుకున్నారు. -
దీపికా పదుకొణెకు సపోర్టుగా తమన్నా.. నెటిజన్ల రచ్చ
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చేసిన ట్వీట్తో రెండు రోజులుగా దీపికా పదుకొణె( Deepika Padukone) పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. తను తీయబోతున్న సినిమా కథను ఒక స్టార్ హీరోయిన్ లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. సందీప్ చేసిన కామెంట్స్ దీపికను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సందీప్ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే దీపిక కూడా పరోక్షంగా స్పందించింది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే ప్రాధాన్యం ఇస్తాను. కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాను' అని చెప్పుకొచ్చింది. ఆ వీడియోతో పాటు దీపికకు చెందిన ఒక పాత వీడియోను ఆమె అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అగౌరవం, పురుషులు, లింగ వివక్షత, లింగ వేతన వ్యత్యాసం, ఓవర్ టైం పని, వృత్తి నైపుణ్యం లేకపోవడం, స్త్రీ ద్వేషం, ద్వంద్వ ప్రమాణాలు అంటూ చెప్పిన ఆమె మాటలను ఇప్పుడు మళ్లీ వైరల్ చేశాడు. దానిని తమన్నా లైక్ చేశారని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. అది కాస్త నెట్టింట వైరల్ అయిపోయింది. దీపికాకు తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ పేర్కొన్నారు. అయితే, తాజాగా తమన్నా వివరణ ఇచ్చింది. తాను ఎవరి పోస్ట్కు లైక్ కొట్టలేదని తెలిపింది. కొందరు కావాలనే ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. లైక్ కొట్టలేదని ఇన్స్టాగ్రామ్ చెప్పినా నమ్మలేని స్థితిలో కొందరు ఉన్నారని పేర్కొంది. తనకు తానుగా పోస్ట్లను ఇన్స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుందని ఆమె తెలిపింది. దయచేసి దీనిని ఇంతటితో వదిలేయండి చాలా పనులు ఉన్నాయంటూ ఆమె వెళ్లిపోయింది. -
నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్కుమార్, విజయ్కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు. -
కొలంబోలో అనసూయ చిల్.. ఎల్లో శారీలో రష్మిక హోయలు!
బ్లాక్ అవుట్ఫిట్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..కొలంబోలో అనసూయ చిల్..సెల్ఫీ ఫోజులో మహేశ్ బాబు కూతురు సితార..ఎల్లో శారీలో రష్మిక మందన్నా హోయలు..కాన్స్ ఫెస్టివల్ మూడ్లోనే ప్రణీత సుభాశ్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Karishma Patidar (@stylebykarishmaa) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
విజయ్ ఆంటోని మిస్టరీ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ చూశారా?
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమాకు కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే డైరెక్టర్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఇటీవల మార్గన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఈ సినిమాకు రిలీజ్కు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హీరో విజయ్ ఆంటోనీ హాజరయ్యారు. అయితే మూవీ పాత్రకు సంబంధించిన గెటప్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ సందర్భంగా మీ గెటప్ గురించి ఏమైనా రివీల్ చేస్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మీకు సినిమా మొత్తం ఇక్కడే చూపిస్తామని నవ్వుతూ మాట్లాడారు. ఒకవేళ ఇండియాలో నేనే గనక రిచ్ అయ్యుంటే.. నా సినిమాలన్నీ ఉచితంగా ప్రదర్శించేవాడినని విజయ్ అన్నారు. ఇది విన్న అభిమానులు విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మార్గన్ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి వస్తోన్న మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో క్రైమ్ జోనర్ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్లే అభిమానుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సినిమాలే ఎక్కువ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక మలయాళ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే మాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన బిగ్బెన్ మూవీ ఈనెల 30 నుంచే సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో అనుమోహన్, వినయ్ పోర్ట్, అదితి రవి, మియా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.కాగా.. ఈ ఏడాది మార్చిలోనే ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సన్ నెక్స్ట్ ప్రకటించింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. చివరికీ ఈ శుక్రవారం బిగ్బెన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత ఏడాది జూన్ నెలాఖరున ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన మియా జార్జ్ తెలుగులోనూ నటించింది. ఉంగరాల రాంబాబు మూవీలో సునీల్కు జోడీగా కనిపించింది. ఆమె నటించిన పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. A ticking clock. ⏰A missing child.And a truth that may shatter everything.Find out what else unravels when a botched kidnapping brings everything to light!!Big Ben - Coming soon, on SunNXT !#SunNXT #BigBenOnSunNXT #Mollywood pic.twitter.com/tDyPGQY9TN— SUN NXT (@sunnxt) May 27, 2025 -
ఉన్ని ముకుందన్పై ఆరోపణలు.. అసలు విషయం బయటపెట్టిన హీరో!
మార్కోతో మోస్ట్ వయొలెన్స్ను అభిమానులకు పరిచయం చేసిన హీరో ఉన్ని ముకుందన్. గతేడాది థియేటర్లలో విడుదలైన మార్కో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో విపరీతమైన వయోలెన్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్కు దూరమైంది. కొత్త ఏడాదిలో గెట్ సెట్ బేబీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులోనూ ఉన్ని ముకుందన్కు ఫ్యాన్స్ ఉన్నారు.అయితే తాజాగా ఉన్ని ముకుందన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు తెలిపారు. తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేయించారని విపిన్ కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అన్నీ అవాస్తవాలే..తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్ని ముకుందన్ స్పందించారు. అతను చేసేవన్నీ అసత్య ఆరోపణలేనని అన్నారు. అతనిపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు దాడి చేసినట్లు చెబుతున్న విపిన్ కుమార్ను తన మేనేజర్గా కూడా నియమించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను దాడి చేయించానని వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.ఉన్ని ముకుందన్ తన పోస్ట్లో రాస్తూ.. "2018లో నా సొంత నిర్మాణంలో నా మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నప్పుడు విపిన్ కుమార్ నన్ను సంప్రదించాడు. ఆయనను నా వ్యక్తిగత మేనేజర్గా ఎప్పుడూ నియమించలేదు. అతను చెప్పినట్లుగా ఎలాంటి భౌతిక దాడి జరగలేదు. అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, అవాస్తవం. మేమున్న ప్రదేశమంతా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని' రాసుకొచ్చారు.అతని పరిశ్రమలోని కొంతమంది స్నేహితుల మద్దతు ఉందని చెబుతున్నారు.. నా డేటా అంతా అతని వద్ద ఉండటంతో.. నేను ఆయనను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పమని అభ్యర్థించానని ఉన్ని ముకుందన్ తెలిపారు. కానీ అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కానీ నాపై న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియాలో పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఉన్ని ముకుందన్ వెల్లడించారు. -
జయం రవి విడాకుల కేసు.. అన్ని పోస్టులు డిలీట్ చేసిన భార్య!
కోలీవుడ్ హీరో జయం రవి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆయన భార్య, జయం రవి ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఓ బిగ్ షాకిచ్చింది. ఈ వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు. అంతేకాకుండా నటుడికి పరువు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పంపించారు.అదేవిధంగా ఆర్తి సైతం.. రవి మోహన్కు లీగల్ నోటీసులు పంపింది. ఆర్తితో పాటు అత్త సుజాతపై పోస్టులు చేయకుండా ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆర్తి హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ వ్యవస్థ పరువు నష్టం నుంచి రక్షణ కల్పించడం.. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని కాపాడిందని ఆమె పోస్ట్కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా.. జయం రవి, ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు. -
రజినీకాంత్ కూలీ.. పారితోషికం ఏకంగా అన్ని కోట్లా?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రంగా నిలవనుంది. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.ఈ మూవీ బడ్జెట్తో పాటు తలైవా రజినీకాంత్ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్ కెరీర్లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ కనగరాజ్ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం. ఇవన్నీ కలిపితే కూలీ బడ్జెట్ రూ.375 పైగానే ఉండనుంది.భారీ ధరకు కూలీ ఓటీటీ రైట్స్..ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాటిలైట్ హక్కులు రూ. 90 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 240 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్కుమార్తో 'జైలర్ 2లో నటించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. -
మరో వివాదంలో గుడ్ బ్యాడ్ అగ్లీ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానన్న స్టార్ హీరో తండ్రి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు. మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు. -
విజయ్ ఆంటోని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా ట్రైలర్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం మార్గన్. కోలీవుడ్లో పలు చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన లియో జాన్ పాల్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మర్టర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్లో నిర్మించారు.ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ను విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ మూవీని జూన్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ట్రైలర్లోనే ప్రకటించారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, అర్చన, కనిమొళి, నటరాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.