breaking news
Market
-
సుంకాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ల పతనం
బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఎగుమతులపై 50 శాతం సుంకాల ప్రభావంతో భారత స్టాక్స్ నష్టాల్లో గురువారం ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 705.97 పాయింట్లు (0.87 శాతం) క్షీణించి 80,080.57 వద్ద, నిఫ్టీ 50 211.15 పాయింట్లు లేదా 0.85 శాతం క్షీణించి 24,500.9 వద్ద స్థిరపడ్డాయి.బీఎస్ఈలో హెచ్సీఎల్టెక్, టీసీఎస్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా, టైటాన్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.27 శాతం, 1.45 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా క్షీణించాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
500 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 146 పాయింట్లు పడిపోయి 24,564కు చేరింది. సెన్సెక్స్(Sensex) 504 ప్లాయింట్లు దిగజారి 80,274 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగ రోజు బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం వినాయక చవితి రోజున బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఊపందుకున్న బంగారం ధరలు: ఒక్కసారిగా పైకి..
వినాయక చవితి వచ్చేసింది. బంగారం ధరలు మరోసారి ఊపందుకున్నాయి. నేడు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 335.84 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 81,300.06 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు లేదా 0.44 శాతం నష్టంతో.. 24,859.00 వద్ద ముందుకు సాగుతున్నాయి.రెలియబుల్ డేటా సర్వీస్, ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, శ్రీ రామ మల్టీ టెక్, అక్షర్ స్పింటెక్స్ లిమిటెడ్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్, ఇండోవిండ్ ఎనర్జీ, హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, శ్రీయోస్వాల్ సీడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.05 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,635.91 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,967.75 వద్ద నిలిచాయి.రెలియబుల్ డేటా సర్వీసెస్, ఇమామి పేపర్ మిల్స్, శ్రీ రామ మల్టీ టెక్, జేకే పేపర్, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలువగా.. ఆరోన్ ఇండస్ట్రీస్, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, వండర్ ఎలక్ట్రికల్, డీపీ వైర్స్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరలకు బ్రేక్.. తులానికి ఎంతంటే..
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తులం రూ.లక్షకు చేరిన తర్వాత కొద్దికాలంగా ఫ్లాట్గా కొనసాగుతున్న పసిడి ధరలు నేడు (సోమవారం) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం వరుసగా పెరుగదలతో బెంబేలిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే.. -
250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు పెరిగి 24,946కు చేరింది. సెన్సెక్స్(Sensex) 254 పాయింట్లు ఎగబాకి 81,563 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్యూ1 జీడీపీపై కన్ను
వినాయక చవితి సందర్భంగా బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించిన అదనపు టారిఫ్లు అమలుకానుండగా.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలపై దృష్టి పెట్టడం ద్వారా ఇటీవల పలు రంగాలతోపాటు.. స్టాక్ మార్కెట్లకు జోష్నిచి్చంది. వివరాలు చూద్దాం... ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్(క్యూ1) కాలానికి దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలు శుక్రవారం(29న) వెలువడనున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత్పై విధించిన 25 శాతం అదనపు సుంకాలకు బుధవారం(27) నుంచి తెరలేవనుంది. జాక్సన్ హోల్ వద్ద యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వార్షికంగా నిర్వహించే సదస్సు సందర్భంగా గత వారాంతాన ప్రస్తుత చైర్మన్ జెరోమీ పావెల్ వడ్డీ రేట్ల కోతకు వీలున్నదంటూ సంకేతాలిచ్చారు. బుధవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో 4 రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో ఈ వారం మార్కెట్ల సరళిపై విశ్లేషకులు పలు అంశాలు ప్రభావం చూపనున్నట్లు ప్రస్తావిస్తున్నారు. జీడీపీపై అంచనాలు ఈ ఏడాది క్యూ1లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి చూపగలదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ వ్యయాలు పెరగడం, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం, సర్వీసుల రంగం పటిష్ట పురోగతి వంటి అంశాలు సహకరించనున్నట్లు భావిస్తున్నారు. గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో దేశ జీడీపీ 7.4 శాతం బలపడింది. ఈ బాటలో జూలై పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) వివరాలు గురువారం(28న) వెల్లడికానున్నాయి. జూన్లో ఐఐపీ 2024 ఆగస్ట్ తదుపరి కనిష్టంగా 1.5 శాతం పుంజుకుంది. జీడీజీ, ఐఐపీ గణాంకాలు బలపడితే.. మార్కెట్లు మరింత పుంజుకునే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. జీఎస్టీ శ్లాబులతోపాటు.. రేట్లను భారీగా తగ్గించనున్న వార్తలతో పలు రంగాలకు హుషారొచి్చనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. వెరసి జీఎస్టీ సంస్కరణలపై అంచనాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు బలాన్నిచి్చనట్లు పేర్కొన్నారు. విదేశీ అంశాలు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్.. కొద్ది రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్యకు ప్రయతి్నస్తున్న నేపథ్యంలో భారత్పై విధించిన 25 శాతం అదనపు టారిఫ్ల అమలు వాయిదా పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇదికాకుండా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. ఇది ఇటీవల దేశీ స్టాక్స్లో నిరంతర విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను యూటర్న్ తీసుకునేలా ప్రోత్సహించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక యూఎస్ హౌసింగ్ విక్రయాలు, ఫ్యాక్టరీ ఆర్డర్లు తదతర గణాంకాలు సైతం ఈ వారం వెలువడనున్నాయి. ఈ అంశాలన్నిటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల సంకేతాలతో గత వారాంతాన యూఎస్ మార్కెట్లు 2 శాతంవరకూ బలపడటాన్ని ఈ సందర్భంగా జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ ప్రస్తావించారు.డౌన్ట్రెండ్కు చెక్.. ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ గత వారం చివర్లో భారీ అమ్మకాలు తలెత్తాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 1 శాతం లాభంతో ముగిశాయి. అయితే గత వారం ఆరు వారాల నష్టాలకు చెక్ పడింది. కాగా.. ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కదలికలపై సాంకేతిక అంశాలతో ఇలా విశ్లేషించారు. వీటి ప్రకారం మార్కెట్లలో డౌన్ట్రెండ్కు కొంతమేర చెక్ పడింది. అంతేకాకుండా ట్రెండ్ రివర్సల్(బుల్లి‹Ù)కు సంకేతాలు అందుతున్నాయి. ఎఫ్పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్ల టర్న్ తీసుకుంటే మరింత బలపడే వీలుంది. వెరసి మార్కెట్లు బలహీనపడితే సెన్సెక్స్ 80,800–80,700 పాయింట్ల వద్ద మద్దతు తీసుకోవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 82,200 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. తదుపరి 83,600–83,700 పాయింట్లవరకూ బలపడే వీలుంది. నిఫ్టీకి 24,600 పాయింట్ల తొలి సపోర్ట్ లభించవచ్చు. 24,500 వద్ద మరోసారి మద్దతు కనిపించవచ్చు. బలపడితే.. తొలుత 25,200 పాయింట్ల వద్ద, ఆపై 25,500 వద్ద రెసిస్టెన్స్కు వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!
బంగారం ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ద్రవ్యోల్బణం, జీడీపీ, అంతర్జాతీయ పరిణామాలు (భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు) ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో జరిగే అనేక అంశాలు గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. కాగా ఇప్పుడు బంగారం ధరలలో కీలక మార్పుకు కారణమయ్యే ఒక ప్రకటన వచ్చింది.నిజానికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. యూఎస్ డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగితే.. బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య కొంత తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే.. డాలర్ విలువ తగ్గి, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.కొంత కాలంగా.. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నారు. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించారు. కానీ ట్రంప్ విధిస్తున్న సుంకాలు.. భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియడం లేదు. ఈ కారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే సెప్టెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు.వచ్చే నెలలో జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ 'జెరోమ్ పావెల్' వడ్డీ రేటు తగ్గింపుకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇది ఉద్యోగ మార్కెట్కు నష్టాలు తెస్తుందని, ద్రవ్యోల్బణం ముప్పు కూడా ఉండదని పేర్కొన్నారు. అయినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. దీంతో డాలర్ విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంతో బంగారం ధరలు ఊహించినట్లుగానే పెరిగాయి. ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 16, 17న జరగనుంది.ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్లో 1.5 లక్షల ఉద్యోగాలుఇక భారతదేశంలో కూడా బంగారం ధరలు ఊహకందని రీతిలో శనివారం (ఆగస్టు 23) గరిష్టంగా రూ. 1090 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 1,01,620 (10 గ్రా)కు చేరింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1000 పెరిగి రూ. 93150 (10 గ్రా)కు చేరింది. కేజీ వెండి ధర రూ. 1,30,000లకు చేరింది. -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారం భారీ షాక్
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. తులం రూ.లక్షకు చేరిన తర్వాత కొద్దికాలంగా ఫ్లాట్గా కొనసాగుతున్న పసిడి ధరలు నేడు (శనివారం) ఒక్కసారిగా ఎగిసి కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. మరో వైపు వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్లపై ఎఫ్పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్లను నమ్మొద్దని సూచించింది. భారత్లో నివసించే పౌరులకు ఎఫ్పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది. -
మహిళా ఇన్వెస్టర్లపై సెబీ స్పెషల్ ఫోకస్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693.86 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 81,306.85 వద్ద, నిఫ్టీ 213.65 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 24,870.10 వద్ద నిలిచాయి.కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం, చెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్, ఏజెడ్ఎమ్ఓ లిమిటెడ్, ఫోసెకో ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, వండర్ ఎలక్ట్రికల్స్, ఫోర్స్ మోటార్స్, వింటా ల్యాబ్స్, డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
బంగారం అంటేనే అందరికీ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ 9K లేదా 9 క్యారెట్ గోల్డ్ ఒకటి ఉందని, దీని ధర చాలా తక్కువ ఉంటుందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో 9 క్యారెట్స్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.బంగారం పట్ల భారతీయులకు మక్కువ ఎక్కువ, అయితే 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాలి. కానీ 9 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే మాత్రం అంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఈ 9 క్యారెట్స్ బంగారానికి కూడా హాల్మార్కింగ్ ఉండాలని.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) స్పష్టం చేసింది.2025 ఆగస్టు నాటికి హాల్మార్క్ ప్యూరిటీల జాబితాలో 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్ మాత్రమే ఉండేవి. ఇటీవల 9 క్యారెట్స్ గోల్డ్ కూడా జాబితాలో చేరింది.24 క్యారెట్స్.. 9 క్యారెట్స్ బంగారం మధ్య వ్యత్యాసం24 క్యారెట్స్ బంగారం అనేది.. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అన్నమాట. అంటే ఇందులో దాదాపుగా ఇతర లోహాలు ఉండవు. అయితే 9 క్యారెట్స్ బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5 శాతం.. రాగి, వెండి లేదా జింక్ వంటి మిశ్రమ లోహాలతో కూడి ఉంటుంది.9 క్యారెట్స్ బంగారం ఎందుకు?అధిక క్యారెట్ల బంగారం ధర చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు.. ముఖ్యంగా యువకులు లేదా గ్రామీణ ప్రజలు దీనికోసం అంత డబ్బు కేటాయించలేరు. అలాంటి వారు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు. దీనికి హాల్మార్క్ కూడా ఉండటం వల్ల ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉంటారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?9 క్యారెట్స్ vs 24 క్యారెట్స్ గోల్డ్ ధరలుఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 10,000 కంటే ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే.. 10 గ్రాముల కోసం రూ. లక్ష కంటే ఎక్కువ కేటాయించాలి. అయితే ఒక గ్రామ్ 9 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 3,700 ఉంటుంది. ఈ బంగారాన్ని 10 గ్రాములు కొనాలంటే రూ. 37,000 పెట్టుబడి సరిపోతుంది. -
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు నేడు (శుక్రవారం) మళ్లీ దిగివచ్చాయి. వెండి ధరలు వరుస పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
250 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు తగ్గి 25,003కు చేరింది. సెన్సెక్స్(Sensex) 255 ప్లాయింట్లు దిగజారి 81,747 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏడాది చివరికి ఔన్స్కు 3,600 డాలర్లకు చేరుకోవచ్చని వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడుల పరంగా డిమాండ్ పసిడిని నడిపించొచ్చని తెలిపింది.కామెక్స్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర ఈ నెల 7న 3,534 డాలర్లను నమోదు చేయగా.. డిసెంబర్ నాటికి 3,600 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. దేశీ మార్కెట్లో పరిశీలిస్తే ఎంసీఎక్స్లో ఈ నెల 8న అక్టోబర్ నెల గోల్డ్ కాంట్రాక్టు (10 గ్రాములు) ధర రూ.1,02,250 రికార్డు స్థాయిని నమోదు చేసింది. అమెరికాలో బలహీన వృద్ధి, యూఎస్ డాలర్ ఇండెక్స్పై ఒత్తిళ్లు, పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను వెంచురా సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు తెలిపింది.‘‘ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడుల డిమాండ్ 3 శాతం పెరిగి రూ.1,249 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా 132 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు 16 శాతం పెరిగి జూన్ చివరికి 3,616 టన్నులుగా ఉన్నాయి’’ అని వెంచురా సెక్యూరిటీస్ వివరించింది. బంగారం నిర్వహణ ఆస్తుల విలువ ఏడాది కాలంలో 64 శాతం ఎగసి 383 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. దేశీయంగానూ ఇదే ధోరణి.. దేశీయంగానూ బంగారంపై పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు వెంచురా సెక్యూరిటీస్ గణాంకాలను ప్రస్తావించింది. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని బంగారం నిల్వలు జూన్ 30 చివరికి 66.68 టన్నులకు పెరిగినట్టు తెలిపింది. ఏడాది కాలంలో 42 శాతం పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని పసిడి ఆస్తుల విలువ ఇదే కాలంలో రెట్టింపై రూ.64,777 కోట్లకు చేరినట్టు పేర్కొంది.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్టర్ల ఖాతాలు (ఫోలియోలు) 41 శాతం పెరిగి 76.54 లక్షలకు చేరాయని.. ఏడాది కాలంలో 317 శాతం పెరిగినట్టు తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్లు తదితర డిజిటల్ గోల్డ్ సాధనాలపై పెట్టుబడులకు యువ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో బంగారం ఆభరణాల డిమాండ్ స్థిరంగా కొసాగుతోందని తెలిపింది. ముఖ్యంగా భౌతిక, డిజిటల్ బంగారంపై పెట్టుబడులతో కూడిన హైబ్రిడ్ విధానాలను అనుసరిస్తున్నట్టు పేర్కొంది. దీర్ఘకాలంలో రాబడులు.. ‘‘గత 20 ఏళ్లలో 14 సంవత్సరాల్లో బంగారం సానుకూల రాబడులు అందించింది. దీంతో విలువ పెరిగే సాధనంగా, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా బంగారానికి గుర్తింపు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల ర్యాలీ దీన్ని బలపరుస్తోంది. గత మూడేళ్లలో వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 సూచీ వార్షిక రాబడి 11 శాతంగానే ఉంది’’ అని వెంచురా సెక్యూరిటీస్ తన నివేదికలో వివరించింది.సెంట్రల్ బ్యాంక్లు సైతం స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడాన్ని ప్రస్తావించింది. సార్వభౌమ బంగారం బాండ్ల జారీని 2024 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ నిలిపివేయడంతో, ఈటీఎఫ్, ఇతర బంగారం డిజిటల్ సాధనాల్లోకి అధిక పెట్టుబడులు వెళ్లొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన యూఎస్ డాలర్కు తోడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో బంగారం ధరలు ఈ ఏడాది మిగిలిన కాలంలో స్థిరంగా ఎగువవైపు చలించొచ్చు’’అని వెంచురా సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,400 డాలర్ల సమీపంలో ఉంది. -
ఐపీవో గ్రే మార్కెట్కు సెబీ చెక్
ముంబై: ఐపీవోకంటే ముందు(ప్రీ ఐపీవో) లావాదేవీల నిర్వహణకు అధికారిక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుత అనధికార(గ్రే) మార్కెట్ లావాదేవీలకు చెక్ పెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నియంత్రణలకు లోబడి ప్రీఐపీవో లావాదేవీలు చేపట్టేందుకు కొత్త ప్లాట్ఫామ్ ఇన్వెస్టర్లను అనుమతించనుంది. ఐపీవో కేటాయింపులు(అలాట్మెంట్), స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ మధ్య మూడు రోజులపాటు లావాదేవీలకు వీలు కల్పించనుంది. దీంతో ప్రస్తుత గ్రే మార్కెట్ స్థానే నియంత్రిత లావాదేవీల ప్లాట్ఫామ్కు సెబీ తెరతీయనున్నట్లు పాండే వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రీలిస్టింగ్ సమాచారం ఒక్కటే సరిపోదని 2025 ఫిక్కీ క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా సెబీ చీఫ్ స్పష్టం చేశారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించడంతోపాటు.. ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుగా నియంత్రణలతోకూడిన ప్రీఐపీవో ట్రేడింగ్ను పరిశీలనాత్మకంగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.నగదు ఈక్విటీ మార్కెట్పై దృష్టిఈక్విటీ డెరివేటివ్స్ గడువు(ఎక్స్పైరీ)లోనూ మార్పులు చేపట్టనున్నట్లు పాండే సంకేతమిచ్చారు. వీటి కాలావధి, ఎక్స్పైరీని ఒక క్రమపద్ధతిలో పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది(2024–25) 91 శాతం వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోయిన ఇలాంటి ప్రొడక్టులకు కళ్లెం వేసే వీలుంటుందని పేర్కొన్నారు. నగదు ఈక్విటీ మార్కెట్లను విస్తరించే బాటలో ఈక్విటీ డెరివేటివ్స్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలియజేశారు. దీర్ఘకాలిక గడువుగల ప్రొడక్టులను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ నాణ్యతను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే సంబంధిత వర్గాలతో చర్చలు చేపట్టాక, ఒక క్రమపద్ధతిలో డెరివేటివ్ ప్రొడక్టుల మెచూరిటీపై నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. దీంతో హెడ్జింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు దన్నునివ్వనున్నట్లు వివరించారు. నగదు విభాగంలో పరిమాణం భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో లావాదేవీల పరిమాణం రెట్టింపైనట్లు తెలియజేశారు. పారదర్శకత కీలకమని, దీంతో క్యాపిటల్ మార్కెట్లలో నిధుల సమీకరణకు వీలుంటుందని వివరించారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 142.87 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో.. 82,000.71 వద్ద, నిఫ్టీ 33.20 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,083.75 వద్ద నిలిచాయి.ఇజ్మో లిమిటెడ్, డీపీ వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, NAVA, బీఎఫ్ యుటిలిటీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యూవై ఫిన్కార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హింద్ రెక్టిఫైయర్స్, బీఎస్ఈ లిమిటెడ్, మాస్టర్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 ప్లాయింట్లు పుంజుకుని 81,991 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు దారి ఏర్పడింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేటివ్యూ ఇండియా, పార్క్ మెడీ వరల్డ్, రన్వాల్ ఎంటర్ప్రైజెస్, జిన్కుషాల్ ఇండస్ట్రీస్, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ చేరాయి. ఈ కంపెనీలు 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 48 కంపెనీలు లిస్ట్కావడం గమనార్హం! ఈ నెలలో ఇప్పటివరకూ 11 కంపెనీలు ఐపీవోకురాగా.. వచ్చేవారం మరికొన్ని కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇష్యూల వివరాలు చూద్దాం..సెక్యూరిటీ సొల్యూషన్లుభద్రతా, నిఘా(సెక్యూరిటీ, సర్వెలెన్స్) సొల్యూషన్లు అందించే ఇన్నోవిటివ్యూ ఇండియా ఐపీవోకు రానుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా పూర్తిగా ప్రమోటర్లకు చేరనున్నాయి.ఆసుపత్రుల చైన్ఆరోగ్యపరిరక్షణ రంగ సంస్థ పార్క్ మెడి వరల్డ్ ఐపీవో చేపట్టనుంది. పార్క్ బ్రాండ్తో ఆసుపత్రులను నిర్వహిస్తున్న కంపెనీ తద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకోనుండగా.. ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు(కొత్త ఆసుపత్రుల ఏర్పాటు), పరికరాల కొనుగోలుకి వెచి్చంచనుంది. అనుబంధ సంస్థలు పార్క్ మెడిసిటీ(ఎన్సీఆర్), బ్లూహెవెన్స్ విస్తరణకు సైతం నిధులు వెచ్చించనుంది.రియల్టీ సంస్థఐపీవోకు రానున్న రియల్టీ అభివృద్ధి సంస్థ రన్వాల్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 450 కోట్లు అనుబంధ సంస్థలలో పెట్టుబడులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మెషీన్ల కంపెనీచత్తీస్గఢ్కు చెందిన మెషీన్ల ఎగుమతి కంపెనీ జిన్కుషాల్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 86.5 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 10 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఆగ్రోకెమికల్జైపూర్ సంస్థ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇలా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్తోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్ కిస్త్ మాతృ సంస్థ ఆన్ఈఎంఐ టెక్నాలజీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 88.79 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 750 కోట్లు అనుబంధ సంస్థ సై క్రెవా మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2016లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వేగవంత, సులభతర క్రెడిట్ సొల్యూషన్లు అందిస్తోంది. ప్రధానంగా యువతపై దృష్టిసారించింది. 2025 మార్చి31కల్లా 5.32 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. 91 లక్షలకుపైగా కస్టమర్లకు సేవలు సమకూర్చింది. రూ. 4,087 కోట్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,337 కోట్ల ఆదాయం, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ఐదో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరిగి 81,858 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 25,051 వద్ద స్థిరపడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు పెరిగి 81,985 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 25,089 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఐటీ 3%, టెక్ 2.22%, ఎఫ్ఎంసీజీ 1.36%, రియల్టి, టెలికమ్యూనికేషన్ 0.68% రాణించాయి. మిడ్, స్మా ల్ క్యాప్ సూచీలు 0.39%, 0.30% పెరిగాయి. బ్యాంకులు, చమురు, ఫైనాన్స్ సర్విసెస్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ⇒ ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రియల్ మనీ గేమింగ్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం లేదంటూ కంపెనీ వివరణ ఇచ్చినప్పట్టకీ.., నజరా టెక్నాలజీస్ షేరు 13% పతనమై రూ.1,222 వద్ద స్థిరపడింది. ఆన్మొబైల్ గ్లోబల్స్ షేరు 3.53% నష్టపోయి రూ.53.27 వద్ద నిలిచింది. ⇒ రీగల్ రిసోర్సెస్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.102)తో పోలిస్తే 39% ప్రీమియంతో రూ.142 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 43% ఎగసి రూ.146 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29% లాభంతో రూ.132 వద్ద ముగిసింది. కంపెనీ మార్కె ట్ విలువ రూ.1,352 కోట్లుగా నమోదైంది. -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు నెల రోజుల విరామం తర్వాత 25,000 మార్కును తిరిగి పొందగలిగింది. ఈ సూచీ చివరిసారిగా జూలై 24న 25,000 మార్క్ పైన ముగిసింది. నేడు ఐటీ షేర్లలో బలమైన లాభాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 25,089కు ఎగబాకి, చివరకు 70 పాయింట్లు లేదా 0.3 శాతం లాభంతో 25,050 స్థాయిల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే నిఫ్టీ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 563 పాయింట్లు లాభపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు (0.3 శాతం) లాభపడి 81,858 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ దాదాపు 4 శాతం లాభపడి రూ.1,495 స్థాయికి చేరుకోగా, ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే 165 పాయింట్లు లాభపడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా 1-3 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు దీర్ఘకాలంగా పనితీరు కనబరచకపోవడంతో విలువ కొనుగోళ్లు లాభపడటానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.బీఎస్ఈ సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ కూడా 1 శాతానికి పైగా క్షీణించాయి. విస్తృత సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ 0.3 శాతం పెరిగాయి.రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 1,718 షేర్లు క్షీణించగా, 2,347 షేర్లు లాభపడ్డాయి. అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ)ను నిషేధించే ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించడంతో వ్యక్తిగత షేర్లలో నజారా టెక్నాలజీస్ 13 శాతం నష్టపోయింది. -
బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గత రెండు రోజులుగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 24,933కు చేరింది. సెన్సెక్స్(Sensex) 130 ప్లాయింట్లు నష్టపోయి 81,510 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగోరోజూ రయ్..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో జీఎస్టీ సంస్కరణల ఆశావహ దృక్పథం కొనసాగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు నాలుగోరోజూ లాభాలు గడించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ (3%), టాటా మోటార్స్ (3.5%), ఎయిర్టెల్ (2.75%) షేర్లు రాణించి సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 24,980 వద్ద నిలిచింది. ⇒ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్స్టైల్ షేరు లిస్టింగ్లో గట్టెక్కింది. ఇష్యూ ధర (రూ.517)తో పోలిస్తే బీఎస్ఈలో 1.58% డిస్కౌంట్తో రూ.509 వద్ద లిస్టయ్యింది. అయితే ఇంట్రాడేలో 9% ఎగసి రూ.564 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6% లాభంతో రూ.546 వద్ద ముగిసింది.⇒ ట్రంప్ టారిఫ్ విధింపుతో టెక్స్టైల్ రంగంలో వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీని తాత్కలింగా తొలగించింది. దీంతో టెక్స్టైల్ షేర్లు వర్ధమాన్ టెక్స్టైల్స్ 9%, రేమాండ్ లైఫ్స్టైల్ 8%, వెల్స్పన్ లివింగ్ 6%, అరవింద్ లిమిటెడ్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 3% లాభపడ్డాయి.⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 87.13 వద్ద ముగిసింది. -
డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని, స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా రిచ్డాడ్ పాఠం పేరుతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేయదు. చాలా సందర్భాలలో ప్రజలను మాత్రమే కాకుండా దేశాలను కూడా పేదరికంగా మారుస్తుందని అన్నారు. కోట్లు సంపాదించేవారు కూడా పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ తరువాత సుమారు 7 సంవత్సరాలలో 65 శాతం మంది దివాళా తీస్తున్నారని రికార్డులు చూపిస్తున్నాయని కియోసాకి పేర్కొన్నారు. లాటరీ విజేతలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.లక్షలాది డాలర్లు సంపాదించే వారు కూడా పేదవారు అవుతున్నారు. అమెరికాలో సగటు పని చేసే వ్యక్తిని తీసుకోండి, ఒక వెయిటర్ 50 సంవత్సరాల పాటు పనిచేసి సుమారు 1.75 మిలియన్ డాలర్లు సంపాదించాడు అనుకుంటే.. కొన్నేళ్ళకు ఆ డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!డబ్బు సంపాదించినప్పటికీ పేదవారుగా ఎందుకు అవవుతున్నారు?.. ఇది ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్నకు.. పేద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించే పూర్ ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ కారణమని రాబర్ట్ కియోసాకి సమాధానం ఇచ్చారు. ధనవంతులు కావాలంటే.. ధనవంతులైన వ్యక్తులను వెతకండి. విజయవంతమైన వ్యక్తుల గురించి తెలుసుకోండి అని ఆయన అన్నారు.లాటరీ గెలిచి ఎందుకు నష్టపోవాలి లేదా జీవితాంతం పని చేసి ఎందుకు పేదవాడిగా మారాలి? అనే ప్రశ్నకు.. నువ్వు దానికంటే చాలా తెలివైనవాడివిగా ఉండాలని రాబర్ట్ కియోసాకి సింపుల్గా సమాధానం ఇచ్చారు.RICHDAD $ LESSON:Q: Does money make you rich?A: NO: In most cases money makes people and countries poorer.Take extreme examples of college sports stars who join a pro team earning Millions. Records show that 65% are bankrupt 7-years after retirement. The same is true…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 19, 2025 -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 370.64 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 81,644.39 వద్ద, నిఫ్టీ 103.70 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 24,980.65 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, కేఐఓసీఎల్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, వర్ధమాన్ పాలిటెక్స్, భారత్ గేర్స్ వంటి కంపెనీలు చేరాయి. నిట్కో, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్డిజి టెక్, రెలియబుల్ డేటా సర్వీసెస్, SP అప్పారల్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్ది రోజులుగా పసిడి ధరలు.. తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 24,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 81,417 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్బీఎఫ్సీ బాహుబలి ఐపీవో!
న్యూఢిల్లీ: అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. లిస్టింగ్కు వీలుగా టాటా గ్రూప్ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. టాటా క్యాపిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ 2023 నవంబర్లో ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది. -
బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
బంగారం, వెండి & బిట్కాయిన్.. ఈ మూడు గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు భారీ రాబడులను ఇచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే బంగారం ధర 40 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేజీ వెండి ధర రూ.1.16 లక్షల వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ అద్భుతాలు చేస్తోంది. దీని విలువ 111 శాతం పెరిగి, కోటి రూపాయలు దాటేసింది. ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలని కొందరు పెట్టుబడిదారులు సతమతమవుతుంటారు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కియోసాకి & వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే..'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్ 'నిజమైన డబ్బు' అని చెబుతారు. ఎందుకంటే డబ్బును అదా చేస్తే.. దాని విలువ పెరగదు. వీటిపై (బంగారం, వెండి, బిట్కాయిన్) ఇన్వెస్ట్ చేస్తే విలువ పెరుగుతుంది, సంపన్నులవుతారని అంటారు. డాలర్ లాంటి కరెన్సీలను ఆయన 'నకిలీ డబ్బు' అని పిలుస్తారు.పేదలు, మధ్యతరగతి వారు దాదాపు డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఆ డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కానీ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారం, చమురు, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సంపద పెరుగుతుందని కియోసాకి చెబుతారు.ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్.. పెట్టుబడిదారుడిగా అతని జ్ఞానాన్ని పెట్టుబడి ప్రపంచంలో బైబిల్గా పరిగణిస్తారు. అయితే బంగారం పనికిరానిదని, వెండి మంచిదని, బిట్కాయిన్కు విలువ లేదని చెబుతారు. బంగారం ఏమీ చేయదు.. అక్కడే ఉంటుంది. ఏదైనా ఆస్తి ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుందని బఫెట్ విశ్వసిస్తారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం మీద పెట్టుబడి చూపడానికి ఆసక్తి చూపని బఫెట్.. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతారు. ఎందుకంటే.. వెండి ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి మంచి వాల్యూ ఉంటుందని చెబుతారు. బిట్కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ఏ ఉత్పాదక కార్యకలాపాలతోనూ సంబంధం లేదని ఆయన నమ్ముతారు.గమనిక: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటిపై తప్పకుండా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడులు పెడితే.. లాభాల సంగతి దేవుడెరుగు, నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీటిపై అవగాహన పెంచుకోవాలనే విషయం మర్చిపోవద్దు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 676.09 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు లేదా 1.00 శాతం లాభంతో 24,876.95 వద్ద నిలిచాయి.పెన్నార్ ఇండస్ట్రీస్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, IFB ఇండస్ట్రీస్, సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, రవీందర్ హైట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, NDL వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ కొత్త ధరకు వెండి.. బంగారం మాత్రం అక్కడే..
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈరోజు (సోమవారం) కూడా నిలకడగా కొనసాగాయి. ఓవైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: ‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం! -
1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 339 పాయింట్లు పెరిగి 24,941కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1037 ప్లాయింట్లు పుంజుకుని 81,635 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవో బాటలో పవరికా
న్యూఢిల్లీ: పవర్ సొల్యూషన్లు అందించే పవరికా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా మొత్తం రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రమోటర్లలో నరేష్ ఒబెరాయ్ కుటుంబ ట్రస్ట్ రూ. 490 కోట్లు, కబీర్, కిమయా ఫ్యామిలీ ప్రయివేట్ ట్రస్ట్ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కాగా.. కంపెనీ ఇంతక్రితం 2019లోనూ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ ఐపీవో చేపట్టకపోవడం గమనార్హం! కంపెనీ ప్రధానంగా డీజిల్ జనరేటర్(డీజీ) సెట్లు, మధ్యస్థాయి స్పీడ్ భారీ జనరేటర్లు(ఎంఎస్ఎల్జీ), తత్సంబంధ సరీ్వసులను అందిస్తోంది. -
జీఎస్టీ సంస్కరణలే దిక్సూచి
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్అండ్పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం... రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు. జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కీలకం..కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ మినిట్స్ ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.రేటింగ్ ఎఫెక్ట్ గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్లుక్తో బీబీబీ రేటింగ్ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్అండ్పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.గత వారమిలా.. నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.సాంకేతికంగా చూస్తే.. ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి ఇటీవల దేశీ స్టాక్స్లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్లో హైదరాబాద్ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. లగ్జరీదే మూడో వంతు వాటా.. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది. ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల.. కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్సీఆర్ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది. అందుబాటు ఇళ్ల కొరత.. నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్పూర్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది. -
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు. -
తగ్గుతున్న బంగారం ధరలు: వరుసగా ఎనిమిదో రోజు ఇలా
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (శనివారం) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 60 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. పసిడి ధరలు తగ్గుతుంటే.. వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీవోకి ఆర్ఎస్ బ్రదర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల రిటైలింగ్ సంస్థ ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా (ఆర్ఎస్ బ్రదర్స్) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, రూ. 118 కోట్ల మొత్తాన్ని ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్స్ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 73 స్టోర్స్ ఉన్నాయి. సౌతిండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్, వేల్యూ జోన్ హైపర్మార్ట్ పేరిట వివిధ ఫార్మాట్లలో స్టోర్స్ నిర్వహిస్తోంది. పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, తిరువీధుల ప్రసాద రావు తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు. 2024–25లో కంపెనీ రూ. 2,694 కోట్ల ఆదాయం, రూ. 104 కోట్ల లాభం నమోదు చేసింది. -
‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం!
దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలకు బంగారమంటే మక్కువ తగ్గకుండా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగా పసిడి ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.భారతదేశం స్వాతంత్య్రం పొందిన 1947లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.88 మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికి అది రూ.1,04,000 దాటింది. అంటే దాదాపు 1,100 రెట్లు పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల వెనుక ఉన్న కారణాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోయినా, ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది దేశీయ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారక రేటు, భారతీయుల సంప్రదాయాల మిశ్రమ ప్రభావం. బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ రావడంతో దీన్ని "సురక్షిత పెట్టుబడి"గా భావించే ధోరణి పెరుగుతోంది.వందల నుంచి లక్షలకు..1950లలో తులం బంగారం ధర రూ.100కు చేరగా, 1970లో రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200, 2000లో రూ.4,400గా నమోదైంది. 2010 నాటికి ఇది రూ.18,500కు పెరిగింది. 2020 నాటికి రూ.50,151గా ఉండగా, 2025 నాటికి రూ.1,04,320కి చేరింది. ఈ గణాంకాలు చూస్తే, ప్రతి దశలో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మార్కెట్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల మానసిక ధోరణి కూడా దీనిపై ప్రభావం చూపాయి.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.అంతర్జాతీయ సంక్షోభాలు: యుద్ధాలు, మహమ్మారులు వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు.రూపాయి-డాలర్ మారక రేటు: రూపాయి బలహీనత కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.భారతీయ డిమాండ్: పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాల వల్ల బంగారం డిమాండ్ ఎప్పటికీ అధికంగా ఉంటోంది.కేంద్ర బ్యాంకుల విధానాలు: బంగారం నిల్వల కొనుగోలు, అమ్మకాలు ధరలపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. "బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులకు భద్రతను కలిగించే సాధనం," అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తమ బంగారం నిల్వలను పెంచడం ద్వారా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్బీఐ వంటి సంస్థలు బంగారం కొనుగోలు చేయడం, నిల్వలు పెంచడం వంటి చర్యలు మార్కెట్లో దీని విలువను స్థిరంగా ఉంచుతున్నాయి. -
క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ సునామీ.. సరికొత్త రికార్డ్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత క్రిప్టో కరెన్సీ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందింది. బిట్కాయిన్ విలువ అంతకు ముందుకంటే.. కూడా బాగా పెరిగింది. గురువారం ఆసియా వాణిజ్యంలో బిట్కాయిన్ వాల్యూ మొదటిసారిగా 124000 డాలర్లకు (రూ. 1,08,68,742) చేరింది. దీనికి యూఎస్ మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా.. క్రిప్టోకరెన్సీ రంగానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు మద్దతునిచ్చాయి.డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన నియంత్రణ మార్పులు బిట్కాయిన్ పెరుగుదలకు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు క్రిప్టో సంస్థలతో పనిచేయకుండా నిరుత్సాహపరిచిన ఆంక్షలను.. ట్రంప్ ఉపసంహరించుకున్నందున, క్రిప్టో మార్కెట్ అత్యంత అనుకూలమైన ఫండమెంటల్స్తో కూడిన కాలాన్ని ఆస్వాదిస్తోంది" ఎక్స్ఎస్.కామ్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు 'సమీర్ హాస్న్' పేర్కొన్నారు.ట్రంప్ మీడియా గ్రూప్ & ఎలాన్ మస్క్ టెస్లా వంటి కంపెనీలు భారీ మొత్తంలో బిట్కాయిన్ను కొనుగోలు చేయడంతో.. ఇతర పెట్టుబడిదారులు, సంస్థలు కూడా బిట్కాయిన్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. ఈ కారణంగా బిట్కాయిన్కు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు బిట్కాయిన్ విలువ సుమారు 32 శాతం పెరిగింది. దీంతో నవంబర్ 2024లో 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ.. ఇప్పుడు 4.18 ట్రిలియన్ డాలర్లు దాటింది.ఇదీ చదవండి: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?బిట్కాయిన్పై రాబర్ట్ కియోసాకి వ్యాఖ్యలుడబ్బును పొదుపు చేయడం ఉత్తమ పెట్టుబడిదారుల లక్షణం కాదని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి కొనుగోలు చేయాలని సూచించారు. అంతే కాకుండా బిట్కాయిన్పై ఇన్వెస్ట్ చేస్తే.. పేదవారు కూడా ధనవంతులు అవుతారని, శారీరక శ్రమ లేకుండానే ఆర్థికంగా ఎదుగుతారని పలుమార్లు సూచించారు.వ్యూహాత్మకంగా స్పందించాలిబిట్కాయిన్ చరిత్రాత్మకంగా రూ.1.03 కోట్ల గరిష్ట స్థాయికి చేరిన ఈ దశలో, ఇన్వెస్టర్లు భావోద్వేగాలపై కాకుండా వ్యూహాత్మకంగా స్పందించాలి. మార్కెట్లో స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ, ఫెడ్ రేట్ల మార్పులు వంటి స్థూల అంశాలు గాలి మార్పుల్లా ప్రభావం చూపగలవు. ఈ నేపథ్యంలో, డాలర్-కాస్ట్ యావరేజింగ్, ముందుగా నిర్ణయించిన రీబ్యాలెన్సింగ్, అత్యవసర లిక్విడిటీని క్రిప్టో వెలుపల ఉంచడం వంటి పద్ధతులు పెట్టుబడులను రక్షించడంలో కీలకంగా ఉంటాయి. ధరల హెచ్చుతగ్గులపై కాకుండా ప్రక్రియపై ఆధారపడే పెట్టుబడి విధానం దీర్ఘకాలిక విజయానికి మార్గం.- విక్రమ్ సుబ్బరాజ్, సీఈవో, జియోటస్.కామ్ -
బంగారం కొనడానికి ఇది మంచి తరుణం: ఎందుకంటే?
భారతదేశంలో ఆగస్టు 09 నుంచి బంగారం ధరలు ఏ మాత్రం పెరగడం లేదు. క్రమంగా తగ్గుతూ నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,240 వద్దకు చేరుకుంది. 22 క్యారెట్స్ పసిడి ధరలు కూడా అమాంతం తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనడానికి ఇదో మంచి తరుణం అని పసిడి ప్రియులు భావిస్తున్నారు. ఈ కథనంలో ఈ రోజు (శుక్రవారం) దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్ను ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని డిఫెన్స్ థీమ్ స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్లో) ఇండెక్స్లో మార్పులు, చేర్పులు చేస్తారు. విధాన సంస్కరణలు, పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపులు, దేశీయంగా తయారీపై మరింతగా దృష్టి పెరుగుతుండటం తదితర సానుకూల అంశాలతో డిఫెన్స్ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ వివరించింది.ఈ నేపథ్యంలో ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్ మొదలైన ప్యాసివ్ ఫండ్స్కి ఇండెక్స్ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. అలాగే, పీఎంఎస్ వ్యూహాలు, మ్యుచువల్ ఫండ్ స్కీములు, ఫండ్ పోర్ట్ఫోలియోల పనితీరు మదింపునకు దీన్ని ప్రామాణికంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. -
స్టాక్ మార్కెట్ ఈరోజుకి ఫ్లాట్.. రేపటి నుంచి సెలవులు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి. వీక్లీ నిఫ్టీ 50 ఆప్షన్ల గడువు ముగియడంతో బెంచ్ మార్క్ సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11.95 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 24,631.30 వద్ద ముగిసింది.మరోవైపు సెన్సెక్స్ 261 పాయింట్ల స్వల్ప రేంజ్లో కదలాడింది. బీఎస్ఈ బెంచ్మార్క్ 80,751.18 వద్ద గరిష్టాన్ని, 80,489.86 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 0.07 శాతం లేదా 57.75 పాయింట్లు పెరిగి 80,597.66 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలవగా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో విప్రో, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.31 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.38 శాతం నష్టపోయింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (0.75 శాతం), నిఫ్టీ ఐటీ (0.4 శాతం) టాప్ గెయినర్స్గా నిలిచాయి. మెటల్, రియల్టీ వరుసగా 1.39 శాతం, 0.76 శాతం నష్టపోయాయి.కాగా ఈవారం ట్రేడింగ్ సెషన్ ఈరోజుతో ముగసింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న శుక్రవారం భారత మార్కెట్లకు సెలవు ఉంటుంది. తదుపరి మార్కెట్ సెషన్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. -
స్థిరంగా బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో.. నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రమే పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు (గురువారం) పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.అమలు: 2025 సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు.స్వచ్ఛత గ్రేడ్లు: వెండి ఆభరణాల కోసం బీఐఎస్ 900, 800, 835, 925, 970, 990 అనే ఆరు స్వచ్ఛత గ్రేడ్లను పేర్కొంది.హాల్మార్కింగ్ ప్రక్రియ: హాల్మార్కింగ్ ప్రక్రియలో వెండి ఆభరణాలకు ఆరు అంకెల HUID అందించడం జరుగుతుంది. ఈ నెంబర్ దాని ప్రామాణికత, స్వచ్ఛతను సూచిస్తుంది.ఉపయోగం: వినియోగదారులు బీఐఎస్ కేర్ యాప్ 'వెరిఫై HUID' ఫీచర్ను ఉపయోగించి.. హాల్మార్క్ చేసిన ఆభరణాల ప్రామాణికతను ధృవీకరించవచ్చు. హాల్మార్కింగ్ వల్ల నకిలీ లేదా కల్తీ వెండి ఉత్పత్తులను కనిపెట్టవచ్చు. తద్వారా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్మార్కింగ్ అంటే.. బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్ -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,641కు చేరింది. సెన్సెక్స్(Sensex) 68 ప్లాయింట్లు పుంజుకుని 80,611 వద్ద ట్రేడవుతోంది.> రేపు ఆగస్టు 15 రోజున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు పని చేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘బంగారం’ పెట్టుబడులు భారీగా తగ్గాయ్..
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి జులైలో రూ.1,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పెట్టుబడులు రూ.2,081 కోట్లతో పోల్చి చూస్తే ఏకంగా 40 శాతం తగ్గాయి. ఈ ఏడాది మే నెలలోనూ బంగారం ఈటీఎఫ్లు రూ.292 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం.పసిడి ధరలు ఆల్టైమ్ గరిష్టాల్లో ఉండడంతో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.అంతకుముందు వరుసగా రెండు నెలల్లో.. ఏప్రిల్లో రూ.6 కోట్లు, మార్చిలో 77 కోట్ల చొప్పున గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏడు నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,277 కోట్లుగా ఉన్నాయి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలోకి పసిడికి సైతం చోటు కల్పిస్తున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జూలై చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు రూ.67,634 కోట్లకు పెరిగాయి. జూన్ చివరికి ఉన్న రూ.64,777 కోట్లతో పోల్చి చూస్తే 4.4 శాతం వృద్ధి చెందాయి.78.69 లక్షల ఫోలియోలు గోల్డ్ ఈటీఎఫ్లలో మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతా) జూలై చివరికి 78.69 లక్షలకు చేరాయి. 2.15 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. ‘బంగారం గత రెండేళ్లలో బలమైన పనితీరు చూపించినప్పటికీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు కష్టమే. చాలా మంది ఇన్వెస్టర్లు హెడ్జింగ్ దృష్ట్యా బంగారానికి కొంత పెట్టుబడులు కేటాయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లో ఉన్న దృష్ట్యా అప్రమత్తత అవసరం’ అని జెర్మైట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ సూచించారు.స్థూల ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లలో అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోర్ట్ఫోలియో వైవిధ్యం దృష్ట్యా బంగారానికి డిమాండ్ కొనసాగుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 304.32 పాయింట్లు లేదా 00.38 శాతం పెరిగి 80,539.91 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 131.95 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 24,619.35 వద్ద ముగిసింది.బీఎస్ఈలో బీఈఎల్, ఎటర్నల్, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.63 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.66 శాతం లాభపడింది. రంగాలవారీగా పనితీరు మిశ్రమంగా ఉంది. నిఫ్టీ హెల్త్కేర్ 2.13 శాతం, ఫార్మా 1.73 శాతం, మెటల్ 1.26 శాతం, ఆటో 1.12 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 0.04 శాతం, 0.14 శాతం, 0.05 శాతం నష్టపోయాయి. -
ఈరోజు కాస్త ఊరించిన బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు స్పల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు పెరిగి 24,546కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 80,392 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టారిఫ్ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!
అమెరికా టారిఫ్ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం మనపై స్వల్పకాలికంగానే ఉంటుందని యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ మధు నాయర్ చెప్పారు. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, భారీ రుణభారం ఉన్న అమెరికా, ప్రస్తుతంతో పోలిస్తే కాస్త బలహీనపడొచ్చని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా స్థిరపడి భారత్లాంటి దేశాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కరెక్షన్ రాకపోవచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల సంగతి అలా ఉంచితే, భారత ఆర్థిక మూలాలు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పటిష్టంగా ఉంటోందని నాయర్ చెప్పారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఈపీఎఫ్ నిధులు, రిటైల్ ఇన్వెస్టర్లు, యులిప్స్ వంటి మార్గాల్లో ప్రతి నెలా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రూ.లక్ష కోట్ల ఏయూఎం లక్ష్యంరాబోయే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) స్థాయిని సాధించాలని నిర్దేశించుకున్నట్లు నాయర్ చెప్పారు. ప్రస్తుతం ఇది సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రస్తుత పథకాలపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నాయర్ తెలిపారు. సెప్టెంబర్ 1న డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టెలికాం టారిఫ్లు పెంపు?అర్థయ పేరిట స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఎస్ఐఎఫ్)ను నవంబర్లో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కన్జూమర్ డిస్క్రిషనరీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్/ఇండస్ట్రియల్స్ రంగాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండగా ఇంధన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని నాయర్ చెప్పారు. -
అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలు
ముంబై: అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం మేర నష్టపోయాయి. భారత్, అమెరికాల జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 80,235 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పతనమై 24,487 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 833 పాయింట్ల పరిధిలో 80,164 వద్ద కనిష్టాన్ని, 80,998 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 24,465 – 24,702 శ్రేణిలో ట్రేడైంది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా మరో 90 రోజుల విరామం, యూఎస్ జూలై ద్రవ్యోల్బణ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇష్యూ ధర (రూ.70)తో పోలిస్తే బీఎస్ఈలో 67% ప్రీమియంతో రూ.117 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 75% ఎగసి రూ.123 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి., అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.881 కోట్లుగా నమోదైంది. -
పాలు రూ.396, బ్రెడ్ రూ.230: కెనడాలో ఇంత రేటా?
కెనడాలో నివసిస్తున్న.. భారతీయ మహిళ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రెండు దేశాల మధ్య కిరాణా ధరలలో వ్యత్యాసం ఎలా ఉన్నాయో చూసి.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోతున్నారు.''బ్రెడ్, పాలు మాత్రమే కొన్న తర్వాత ఎప్పుడైనా విసుగు చెందినట్లు అనిపించిందా?.. కెనడాకు స్వాగతం. భారతదేశంలో కిరాణా ధరలు వర్సెస్ కెనడా ధరలు. షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి'' అంటూ.. ఇన్స్టా యూజర్ వీడియో షేర్ చేశారు.వీడియోలో గమనిస్తే.. ఒక క్యాలీఫ్లవర్ ధర రూ. 237.25, అల్లం రూ. 177.30, క్యారెట్ రూ. 66.88, ఒక మామిడి రూ. 106, ఒక యాపిల్ రూ. 78.87, ఒక బంగాళాదుంప రూ. 78.24, నాలుగు లీటర్ల పాలు రూ. 396.25, బ్రెడ్ రూ. 230 ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కెనడాలో నిత్యావసరాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ధరలు చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు సంపాదించేది డాలర్లలో ఉన్నప్పుడు, ధరలను మాత్రం రూపాయల్లో ఎందుకు పోల్చుతున్నారు అని అన్నారు. View this post on Instagram A post shared by Kanupria | Canada Explorer (@kanutalescanada) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 368.48 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో.. 80,235.59 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 24,487.40 వద్ద నిలిచింది.టాప్ గెయినర్స్ జాబితాలో.. యాత్ర ఆన్లైన్, డబ్ల్యుఎస్ ఇండస్ట్రీస్, NDL వెంచర్స్, రికో ఆటో, సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీలు చేరాయి. మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), మార్క్సాన్స్ ఫార్మా, బ్యాంకో ప్రొడక్ట్స్ (ఇండియా), పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఆస్ట్రల్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారంపై సుంకం లేదు: డొనాల్డ్ ట్రంప్
బంగారం దిగుమతులపై అదనపు సుంకాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' పేర్కొన్నారు. ఇటీవల ఆయన విధించిన సుంకాల పెంపు బంగారు కడ్డీలకు వర్తిస్తుందా?, లేదా?.. అనే దానిపై గందరగోళం చెలరేగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు.బంగారం మీద సుంకాలు విధించడం వల్ల.. వీటి ధరలు మరింత ఎక్కువవుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి బంగారంపై సుంకాల విషయంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తరువాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.ట్రంప్ పోస్ట్ తర్వాత.. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ రేటు ఔన్సుకు 2.4 శాతం తగ్గి 3,407 డాలర్లకు చేరుకుంది. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర 1.2 శాతం మేర తగ్గి 3,357 డాలర్ల వద్ద నిలిచింది. గోల్డ్ మైనింగ్ కంపెనీల షేర్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.BREAKING: President Trump just declared that gold will not be tariffed!HUGE! pic.twitter.com/0JdVT9cXIs— Gunther Eagleman™ (@GuntherEagleman) August 11, 2025భారతదేశంలో బంగారం ధరలుబంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం గోల్డ్ రేటు తగ్గుముఖం పడుతోంది. ఈ రోజు కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 880 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 101400 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ. 800 తగ్గి.. రూ. 92950 (10 గ్రామ్స్) వద్ద నిలిచింది.ఇదీ చదవండి: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే? -
దిగొస్తున్న కనకం ధరలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు పెరిగి 24,645కు చేరింది. సెన్సెక్స్(Sensex) 203 ప్లాయింట్లు పుంజుకుని 80,802 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల వరద!
న్యూఢిల్లీ: అమెరికాతో టారిఫ్లపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జూలైలో నికరంగా రూ. 42,702 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఈ విభాగానికి సంబంధించి నెలవారీగా చూస్తే ఇది రికార్డు స్థాయి. జూన్లో నమోదైన రూ. 23,587 కోట్లతో పోలిస్తే ఏకంగా 81 శాతం ఎగిశాయి. అలాగే, వరుసగా 53వ నెలా ఈక్విటీల్లోకి పెట్టుబడులు వచి్చనట్లు ఫండ్స్ పరిశ్రమ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) తొలిసారిగా రూ. 75 లక్షల మార్కును దాటింది. ‘టారిఫ్ యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత వృద్ధి గాథ పటిష్టంగానే ఉంది. నెమ్మదించిన ద్రవ్యోల్బణం, లిక్విడిటీ.. పొదుపు మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో ఈక్విటీల్లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం ఇందుకు నిదర్శనం‘ అని యాంఫీ సీఈవో వెంకట్ ఎన్ చలసాని చెప్పారు. మార్కెట్లు మధ్యమధ్యలో కరెక్షన్లకు లోనవుతుండటమనేది ఇన్వెస్టర్లు ఎంట్రీ ఇచ్చేందుకు ఆకర్షణీయమైన అంశంగా నిలి్చందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → జూలైలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్లో నమోదైన రూ. 49,000 కోట్లు, మే నెలలో రూ. 29,000 కోట్లతో పోలిస్తే ఇది గణనీయంగా అధికం. పెట్టుబడుల ప్రవాహంతో జూన్లో రూ. 74.4 లక్షల కోట్లుగా ఉన్న పరిశ్రమ ఏయూఎం జూలైలో రూ. 75.36 లక్షల కోట్లకు చేరింది. → ఈక్విటీ ఆధారిత ఫండ్స్కి సంబంధించి సెక్టోరల్/థీమాటిక్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ. 9,426 కోట్లు నికరంగా వచ్చాయి. ఈ సెగ్మెంట్లో కొత్త స్కీములు మొత్తం రూ. 7,404 కోట్లు సమీకరించాయి. తర్వాత స్థానంలో రూ. 7,654 కోట్ల పెట్టుబడులతో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఉన్నాయి. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండటం వీటికి సానుకూలంగా నిలిచింది. ఇక స్మాల్ క్యాప్ ఫండ్స్ (6,484 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,182 కోట్లు), లార్జ్..మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,035 కోట్లు)లోకి కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి మాత్రమే రూ. 368 కోట్లు తరలిపోయాయి. → జూన్లో నమోదైన రూ. 27,269 కోట్లతో పోలిస్తే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా పెట్టుబడులు రూ. 28,464 కోట్లకు పెరిగాయి. → రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో డెట్ ఫండ్స్ జూలైలో పటిష్టంగా పుంజుకున్నాయి. లో–డ్యూరేషన్, మనీ మార్కెట్ ఫండ్స్తో పాటు లిక్విడ్, ఓవర్నైట్ ఫండ్స్లోకి కూడా పెట్టుబడులు వచ్చాయి. జూన్లో రూ. 1.711 కోట్ల పెట్టుబడులు నికరంగా తరలిపోయాయి. → గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు జూన్లో నమోదైన రూ. 2,081 కోట్లతో పోలిస్తే క్షీణించి రూ. 1,256 కోట్లకు పరిమితమయ్యాయి. వేగం నెమ్మదించినప్పటికీ వరుసగా మూడో నెలా ఇన్వెస్ట్మెంట్స్ రావడం గమనార్హం. అనిశ్చితి వేళ పెట్టుబడుల డైవర్సిఫికేషన్కి అనువైన సాధనంగా పసిడి ఆకర్షణీయత కొనసాగుతోందని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేష్రామ్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటికే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా స్టాక్ మార్కెట్ క్రాష్ సూచికలు స్టాక్లలో భారీ పతనాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను చూసిస్తున్నాయి. స్టాక్లలో భారీ పతనం గురించి హెచ్చరిస్తున్నాయి. అయితే బంగారం, వెండి, బిట్కాయిన్ యజమానులకు శుభవార్త'' అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ చేశారు.అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాలు పెట్టుబడిదారుల్లో కొంత భయాన్ని రేకెత్తించాయి. ఈ కారణంగానే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ సమయంలో స్థిరమైన రాబడి కోరుకునేవారు మాత్రం బంగారం, వెండి వంటివాటిలో మాత్రమే కాకుండా బిట్కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి రాబడని తీసుకొస్తుందని. రాబోయే ఆర్ధిక మాంద్యం సమయంలో ఇవే కాపాడతాయని కియోసాకి పేర్కొన్నారు.Stock market crash indicators warning of massive crash in stocks.Good news for gold, silver, and Bitcoin owners.Bad news for Baby Boomers with 401 k.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) August 11, 2025 డొనాల్డ్ ట్రంప్ గ్రేట్!అమెరికన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన 401(కె) రిటైర్మెంట్ ప్లాన్ల బ్యాలెన్స్లలో ఉన్న నిధులను డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. దీనిని రాబర్ట్ కియోసాకి ప్రశంసించారు. బిట్కాయిన్ కొనుగోలుకు ప్రజలు తమ రిటైర్మెంట్ పొదుపును ఖర్చు చేయడానికి ట్రంప్ అనుమతించడం గొప్ప వార్త. ఆయన గొప్ప అధ్యక్షుడు, గొప్ప నాయకుడు. మీరు బిట్కాయిన్ సేవ్ చేస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే? -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 746.29 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 80,604.08 వద్ద, నిఫ్టీ 198.85 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 24,562.15 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సీఎల్ ఎడ్యుకేట్, యాత్ర ఆన్లైన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎన్డీఎల్ వెంచర్స్, ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ వంటి కంపెనీలు చేరాగా.. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఫేజ్ త్రీ, ఆరోన్ ఇండస్ట్రీస్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, బెస్ట్ ఆగ్రోలైఫ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. వరలక్ష్మీవ్రతం, రాఖీ పండుగ అనంతరం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత మార్కెట్ సెషన్తో పోలిస్తే సోమవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 45 పాయింట్లు పెరిగి 24,414కు చేరింది. సెన్సెక్స్(Sensex) 145 ప్లాయింట్లు పుంజుకుని 80,005 వద్ద ట్రేడవుతోంది.భారత్ దిగుమతులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గణాంకాలపై మార్కెట్ల ఫోకస్
ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాలు, యూఎస్ టారిఫ్లు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కానున్నాయి. అంతేకాకుండా ఇటీవల నిరవధికంగా అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) ధోరణి సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. మరోపక్క ముగింపు దశకు చేరుకున్న క్యూ1 ఫలితాల సీజన్కూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) సెలవుకావడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ద్రవ్యోల్బణ గణాంకాలు, ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు, యూఎస్తో వాణిజ్య సంబంధాలు, ఎఫ్పీఐల అమ్మకాలు ఈ వారం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు చెబుతున్నారు. జూలై నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) విడుదలకానున్నాయి. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 8వ నెలలోనూ దిగివస్తూ 2.1 శాతానికి పరిమితమైంది. 2019 జనవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మే నెలలో 2.8 శాతంగా నమోదైంది. ఇక జూలై నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. జూన్లో డబ్ల్యూపీఐ అనూహ్యంగా 0.13 శాతం క్షీణించింది. దిగివచ్చింది. మే నెలలో 0.39 శాతం పెరుగుదల నమోదుకాగా.. 2023 అక్టోబర్ తర్వాత తొలిసారి వెనకడుగు వేసింది. క్యూ1 జాబితా ఈ వారం మరికొన్ని దిగ్గజాలు ప్రస్తుత ఏడాది(2025– 26) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో పీఎస్యూ దిగ్గజాలు ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్(ఐవోసీ)తోపాటు.. ఎస్జేవీఎన్, ఐఆర్సీటీసీ, ఆస్ట్రల్ పాలీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, పీఐ ఇండస్ట్రీస్, సంవర్ధన మదర్సన్, ముత్తూట్ ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్, అశోక్ లేలాండ్, పతంజలి ఫుడ్స్ తదితరాలు చేరాయి. ఇవికాకుండా జూలైలో ప్రయాణికుల వాహన అమ్మకాల వివరాలను సియామ్ 15న విడుదల చేయనుంది. 2025 జూన్లో మొత్తం ప్రయాణికుల వాహన అమ్మకాలు 6 శాతం క్షీణించి 2,75,766 యూనిట్లకు పరిమితంకావడం గమనార్హం! విదేశీ అంశాలు భారత్ దిగుమతులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు. కాగా.. జూలై నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. టారిఫ్లపై స్పష్టత వచ్చేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. గత వారమిలా.. గతవారం(4–8) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో వారంలోనూ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 742 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 79,858 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 202 పాయింట్లు(0.8 శాతం) నీరసించి 24,363 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ 1.9 శాతం చొప్పున బలహీనపడ్డాయి.ఎఫ్పీఐల భారీ అమ్మకాలుకొద్ది రోజులుగా పెట్టుబడులు వెనక్కి ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇక గత నెల(జూలై)లోనూ నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. దీంతో జూలైలో రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడు నెలల్లో(ఏప్రిల్ నుంచి జూన్) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వెరసి రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ నికరంగా చూస్తే ఎఫ్పీఐలు రూ. 1.13 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్ ప్రకటనలు, క్యూ1 ఫలితాల నిరుత్సాహం తదితర అంశాల కారణంగా ఎఫ్పీఐలు ఇటీవల తిరిగి అమ్మకాల బాటలో సాగుతున్నట్లు ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ విశ్లేషకులు వకార్జావేద్ ఖాన్, మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా.. ఎఫ్పీఐల అమ్మకాలు, యూఎస్ టారిఫ్ల వడ్డింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణపథంలో కదులుతున్నాయి. ఇదే బాటలో ఈవారం సైతం మరింత నీరసించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనకడుగు వేస్తే తొలుత 24,200 పాయింట్ల వద్ద, తదుపరి 24,000 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఒకవేళ బలపడితే 24,500 పాయింట్లవద్ద, 24,600 వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెరుగుతున్న బంగారం ధరలు: ప్రధాన కారణాలు
బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగి పసిడి ప్రియులను అవాక్కయ్యాలా చేసింది. ఈ స్థాయిలో కనకం ధరలు పెరగడానికి కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత పెంచిన సుంకాలు చాలామంది పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తించింది. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతుంటే.. బంగారం రేటు మాత్రం ఆకాశాన్నంటుతోంది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు.. గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే అని నిపుణులు భావిస్తున్నారు.2025 ఆగస్టు 01న గరిష్టంగా రూ. 210 తగ్గి రూ.99,820 (10 గ్రా 24 క్యారెట్స్) వద్ద నిలిచిన గోల్డ్ రేటు.. ఆ తరువాత ఆగస్టు 08 నాటికి రూ. 1,03,310 కు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఈ మధ్య కాలంలోనే రూ. 3490 పెరిగింది. ఇది బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి తెలుపడానికి నిదర్శనం.బంగారు కడ్డీలపై అమెరికా సుంకాలు, బలహీనమైన అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ అంచనాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..అస్థిర ఆర్థిక పరిస్థితుల్లో బంగారం సురక్షితమైన ఆస్తి. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేసే పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. 2005లో రూ. 7000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. 2025లో రూ. 100000 దాటేసింది. దీన్నిబట్టి చూస్తే దశాబ్దంలో రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. -
ఈ కంపెనీలు ఐపీవోకి వస్తున్నాయ్..
ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సంస్థ సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్లు విక్రయించనున్నారు.2023–2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 95 శాతం వృద్ధి చెందింది. పంపులు, మోటర్ల ఉత్పత్తికి సంబంధించి 24,00,000 యూనిట్లు, 72,00,000 ఫ్యాన్ల స్థాపిత సామర్థ్యంతో సంస్థకు గుజరాత్లోని రాజ్కోట్లో ప్లాంటు ఉంది. ఐపీఓకు టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సన్నద్ధమవుతోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా 95.05 లక్షల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. ప్రమోటర్ కంపెనీ కార్తికేయ్ కన్స్ట్రక్షన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 23.76 లక్షల షేర్లను విక్రయించనుంది.సమీకరించే రూ.138 కోట్ల నిధులను మూలధన వ్యయ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటామని కంపెనీ ముసాయిదా పత్రాల్లో తెలిపింది. ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా ఖంబట్టా సెక్యూరిటీస్, రిజిస్ట్రార్గా బిగ్షేర్ సర్వీసెస్లు సంస్థలు వ్యవహరించనున్నాయి. టెక్నోక్రాఫ్ట్ 2025 జూన్ 30 నాటికి రూ.685.83 కోట్ల విలువైన ఆర్డర్లు కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో రూ.28.20 కోట్ల నికర లాభం, రూ.279.56 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
పండుగ ముగిసింది: పసిడి ధర తగ్గింది
వరలక్ష్మి వ్రతం ముగియగానే.. భారతదేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ఏడు రోజుల తరువాత 'రక్షాబంధన్' సందర్భంగా గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శనివారం) పసిడి ధర గరిష్టంగా రూ. 270 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఈసారి మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్
రాఖీ (రక్షాబంధన్) పండుగ వస్తుందంటే.. మార్కెట్లు కోలాహలంగా మారిపోతాయి. తోబుట్టువులు రాఖీలు కొనుగోలు చేస్తే.. వారి కోసం అన్నదమ్ములు గిఫ్ట్స్ కోనేస్తుంటారు. ఈ సంవత్సరం రాఖీ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 17,000 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది.''ఈ సంవత్సరం మార్కెట్లలో చైనీస్ రాఖీలు, వస్తువులు కనిపించడం లేదు" అని CAIT సెక్రటరీ జనరల్ & చాందినీ చౌక్ ఎంపీ 'ప్రవీణ్ ఖండేల్వాల్' పేర్కొన్నారు. వినియోగదారులు కూడా చాలావరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని అన్నారు.రక్షా బంధన్ కేవలం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు మాత్రమే కాదు, జాతీయవాదానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఈ కారణంగానే ఈ సీజన్లో మోదీ రాఖీ, ఆపరేషన్ సిందూర్ రాఖీ, ఆత్మనిర్భర్ భారత్ రాఖీలు, డిజిటల్ రాఖీలు కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఖాదీ, వెదురు, పత్తితో తయారు చేసిన పర్యావరణ అనుకూల రాఖీలకు అధిక డిమాండ్ ఉంది. వీటిలో చాలా వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యవస్థాపకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు చేతితో తయారు చేసినవే ఉన్నాయి.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రాఖీలు మాత్రమే కాకుండా.. స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు, అలంకరణ వస్తువులు వంటి వస్తువుల ద్వారా ఏకంగా రూ.4,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని కైట్ అంచనా వేసింది. ఢిల్లీ, జైపూర్, ముంబై, లక్నో అంతటా ఎక్కువగా దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన రాఖీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. రక్షాబంధన్ భారతదేశంలో అత్యంత బలమైన పండుగ సీజన్లలో ఒకటిగా ఉంటుందని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. -
దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం
టారిఫ్ ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తో వాణిజ్య చర్చలను తోసిపుచ్చడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 765.47 పాయింట్లు (0.95 శాతం) క్షీణించి 79,857.79 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 232.85 పాయింట్లు లేదా 0.95 శాతం తగ్గి 24,363.30 వద్ద ముగిసింది.ఈ క్రమంలో ఈ వారం సెన్సెక్స్ 742 పాయింట్లు, నిఫ్టీ 202 పాయింట్లు నష్టపోయాయి. బీఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలవగా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, టైటాన్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.64 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 1.49 శాతం నష్టపోయింది. అన్ని రంగాలు నెగిటివ్ జోన్లో ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 2.11 శాతం, నిఫ్టీ మెటల్ 1.76 శాతం, ఆటో 1.40 శాతం, ఫార్మా 1.30 శాతం నష్టపోయాయి. -
బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి బలమైన హెచ్చరిక జారీ చేశారు. మార్కెట్ పతనం వైపు పయనిస్తోందని, బాండ్ల వంటి సాంప్రదాయ పెట్టుబడులు చాలామంది నమ్ముతున్నంత సురక్షితం కాదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'బాండ్లు సురక్షితం' అని చెప్పినప్పుడు ఆర్థిక ప్రణాళికదారులు అబద్ధం చెబుతారు. మార్కెట్ క్రాష్లో ఏదీ సురక్షితం కాదు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగం క్రాష్ అవుతోందని కూడా రాబర్ట్ కియోసా హెచ్చరించారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ద్వారా యూఎస్ బాండ్లను డౌన్గ్రేడ్ చేస్తోందని, బాండ్లను కొనుగోలు చేయడానికి ఎవరూ రావడం లేదని ఆయన అన్నారు.ఆసియాలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని కియోసాకి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ సంపదను నిల్వ చేసుకోవడానికి సురక్షితమైన ప్రదేశాల కోసం వెతకడం ప్రారంభించారు. వీరందరూ బంగారం, వెండి, బిట్కాయిన్ వంటివాటితో మాత్రమే కాకుండా.. చమురు, పశువుల కొనుగోలు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారని కియోసాకి పేర్కొన్నారు. ఇవన్నీ ఆర్ధిక మాంద్యం సమయంలో రక్షణ కల్పిస్తాయని అన్నారు.ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకిఒక పెద్ద పతనం.. మహా మాంద్యం రాబోతోందని కియోసాకి చెబుతున్నారు. స్టాక్, బాండ్ హోల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. కష్ట సమయాల్లో సంపదను కోల్పోయే బదులు, తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచించి, సంపదను పెంచుకోవడానికి సహాయపడే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు."మీరు మరింత ధనవంతులు అవుతారా? లేదా పేదవారు అవుతారా?.. అని ఆయన అనుచరులను ప్రశ్నిస్తూ, ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడంలో సహాయపడటమే తన లక్ష్యమని కూడా పేర్కొన్నారు అన్నారు.Financial Planners lie when they sat “Bonds are safe.” There is nothing safe in a market crash.The commercial real estate market is crashing.Moodys down graded US bonds.Asians buying gold.No one is showing up to buy bonds.I’ve been buying real gold, silver, and…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 7, 2025 -
రికార్డు స్థాయికి చేరిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..
ఆగస్టు ప్రారంభంలో కొంత తగ్గిన బంగారం ధరలు.. ఇప్పటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు గరిష్టంగా రూ. 760 పెరిగి పసిడి ప్రియులకు మళ్లీ షాకిచ్చింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
250 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 65 పాయింట్లు తగ్గి 24,529కు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 ప్లాయింట్లు నష్టపోయి 80,367 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సిప్.. సిప్.. హుర్రే!
మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడులు పెరగడం కొనసాగుతోంది. జూన్ త్రైమాసికంలో కొత్త సిప్ ఖాతాలు 1.67 కోట్ల మేర నమోదయ్యాయి. క్రితం క్వార్టర్లో నమోదైన 1.41 కోట్లతో పోలిస్తే ఇది అధికం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 41.9 లక్షల కొత్త సిప్లు, 25 శాతం మార్కెట్ వాటాతో గ్రో సంస్థ అగ్రగామిగా నిలిచింది. నెలవారీగా చూస్తే జూన్లో గ్రోలో కొత్త సిప్లు 15.7 లక్షలుగా రిజిస్టరయ్యాయి. విలువపరంగా చూస్తే కొత్త సిప్లు 32 శాతం పెరిగి రూ. 1,116 కోట్లకు చేరాయి. మరోవైపు, ఏంజెల్ వన్లో కొత్తగా 15 లక్షల సిప్లు, ఎన్జే ఇండియాఇన్వెస్ట్లో 5.9 లక్షలు, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్లో 3.8 లక్షలు, డిజిటల్ ప్లాట్ఫాం ఫోన్పేలో 5.9 లక్షల సిప్లు నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ మ్యూ చువల్ ఫండ్స్పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి మెరుగ్గానే ఉంటోంది.మరిన్ని వివరాలు..మ్యూచువల్ ఫండ్స్లో జూన్లో రికార్డు స్థాయిలో రూ. 27,269 కోట్ల మేర సిప్ పెట్టుబడులు వచ్చాయి. సిప్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) గతేడాది జూన్ 30 నాటి గణాంకాలతో పోలిస్తే ఈసారి జూన్ 30 నాటికి రూ. 15.3 లక్షల కోట్లకు చేరింది. 2025లో మ్యూచువల్ ఫండ్ విశిష్ట ఇన్వెస్టర్ల సంఖ్య 5.4 కోట్లకు చేరింది. 2023లో 3.8 కోట్లతో పోలిస్తే 42 శాతం, 2024లోని 4.5 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగింది. 2025 జూన్ ఆఖరు నాటికి పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రికార్డు స్థాయిలో 74.4 లక్షల కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 63.2 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది.రిటైల్ ఇన్వెస్టర్లు సంప్రదాయ పొదుపు విధానాల నుంచి పెట్టుబడుల మైండ్సెట్ వైపు మళ్లుతున్నారు. మ్యుచువల్ ఫండ్స్ను దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనాలుగా భావిస్తున్నారు.సులభతరంగా ఇన్వెస్ట్ చేసే విధానాలను డిజిటల్–ఫస్ట్ ప్లాట్ఫాంలు మరింతగా అందుబాటులోకి తేవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే యాంఫీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ప్రోత్సహించడంలో, మ్యుచువల్ ఫండ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే! -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఐటీ, ఫార్మా స్టాక్స్ నేతృత్వంలో భారత్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ రికవరీని సాధించాయి. సెన్సెక్స్ 811.97 పాయింట్లు పుంజుకుని రోజు కనిష్ట స్థాయి (79,811.29) నుంచి 80,623.26 వద్ద (0.10 శాతం లేదా 79.27 పాయింట్లు) ముగిసింది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పుంజుకుని 24,344.15 పాయింట్ల వద్ద (21.95 పాయింట్లు లేదా 0.09 శాతం) 24,596.15 వద్ద ముగిసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. గత వారం భారత దిగుమతులపై సంతకం చేసిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా ప్రకటించిన టారిఫ్ లు 21 రోజుల నోటీసు పీరియడ్ తర్వాత ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఎటర్నల్ (జొమాటో), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా కోలుకుని పాజిటివ్ గా ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.17 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, ఐటీ 0.87 శాతం, మీడియా 0.99 శాతం, ఆటో 0.25 శాతం, పీఎస్ యూ బ్యాంక్ 0.29 శాతం, మెటల్ 0.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. -
బాబోయ్ బంగారం!.. వరుసగా నాలుగో రోజు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 220 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (గురువారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ట్రంప్ టారిఫ్లు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,501కు చేరింది. సెన్సెక్స్(Sensex) 253 ప్లాయింట్లు నష్టపోయి 80,288 వద్ద ట్రేడవుతోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
5 కంపెనీలు ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ కంపెనీలు సెబీకి ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ ఐపీవో ద్వారా రూ. 2,700 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ విక్రయానికి ఉంచనుంది. ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకింగ్ సరీ్వసుల విభాగం ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఐపీవోలో భాగంగా రూ. 745 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న రూ. 745 కోట్లలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయ నున్నారు. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్లోని అల్వార్లోగల జిలోత్ ఇండ్రస్టియల్ ఏరియాలో తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోగల ప్లాంటు విస్తరణతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది. గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అహ్మదాబాద్లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుసహా.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు, వడోదరలో రోబోటిక్స్ పరికరాలతోపాటు కొత్త ఆసుపత్రి ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. -
ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్, ఇతర పెట్టుబడుల గురించి సూచనలు చేసే అమెరికా వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిట్కాయిన్ ఎవరినైనా ధనవంతులను చేస్తుంది. ఎలాంటి గందరగోళం లేదు, ఒత్తిడి లేదు. దాన్ని (బిట్కాయిన్) సెట్ చేసి మర్చిపో. నువ్వు ధనవంతుడైపోతావని అంటారు కియోసాకి. బిట్కాయిన్తో కోటీశ్వరులుగా మారడం చాలా సులభం అని మీరు చెబితే.. ఇన్ని లక్షల మంది పేదలు ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నకు.. నేనే దానికి ఉదాహరణ అంటూ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..నేను (రాబర్ట్ కియోసాకి) నా మొదటి మిలియన్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా రిస్క్ తీసుకున్నాను, చాలా సమయం పట్టింది. మొదటి మిలియన్ సంపాదించినా తరువాత.. బిట్కాయిన్ గురించి కొంత అధ్యయనం చేసి, అందులో కొంత పెట్టుబడి పెట్టి మర్చిపోయాను. అదే మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మిలియన్స్ సంపాదిస్తున్నాను, మీకు కూడా అదే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. అయితే జాగ్రత్తగా ఉండాలని అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.ANYONE CAN BECOME a MILLIONAiRE: I can’t believe how Bitcoin makes becoming rich so essy. Bitcoin is Pure Genius asset design. No mess no stress. Just set it and forget it. I made my first million in real estate. That took hard work, lots of risk, lots of money, lots of…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 6, 2025 -
ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు అమాంతం పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 110 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (బుధవారం) బంగారం ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు పుంజుకొని 80,783 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెంటాడిన టారిఫ్ భయాలు
ముంబై: రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పాలసీ ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకులు, చమురు షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించకలేపోతున్నాయి.ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 24,650 వద్ద నిలిచింది.⇒ తొలి త్రైమాసిక నికర లాభం 56% వృద్ధి నమోదుతో గాడ్ఫ్రై ఫిలిప్స్ షేరుకు డిమాండ్ లభించింది. బీఎస్ఈలో 10% పెరిగి రూ.9887 వద్ద లోయర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.జీవితకాల కనిష్టాన్ని తాకిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు నష్టపోయి 87.88 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2025 ఫిబ్రవరి 10 నాటి జీవితకాల కనిష్టం 87.95 స్థాయిని తాకింది. రష్యన్ చమురు కొనుగోలు కారణంగా భారత్పై సుంకాలను మరింత పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన కరెన్సీ కోతకు ప్రధాన కారణంగా నిలిచాయి. దేశీ స్టాక్ మార్కెట్ పతనం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.ఆదిత్య ఇన్ఫోటెక్ అరంగేట్రం అదుర్స్ సీపీ ప్లస్ బ్రాండ్ కింద నిఘా పరికరాలను విక్రయించే ఆదిత్య ఇన్ఫోటెక్ షేరు ఎక్సే్చంజీల్లోకి అదిరిపోయే అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర(రూ.675)తో పోలిస్తే బీఎస్ఈలో 51% ప్రీమియంతో రూ.1,018 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 64% ఎగసి రూ.1,104 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 61% లాభంతో రూ.1,084 వద్ద ముగిసింది. లక్ష్మి ఇండియా ఫైనాన్స్ నిరాశఎన్బీఎఫ్సీ లక్ష్మి ఇండియా ఫైనాన్స్ లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.158)తో పోలిస్తే బీఎస్ఈలో 14 శాతం డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి రూ.133 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 15% నష్టంతో రూ.134 వద్ద నిలిచింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 308.47 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో.. 80,710.25 వద్ద, నిఫ్టీ 73.20 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,649.55 వద్ద నిలిచాయి.ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్, తాన్లా ప్లాట్ఫారమ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, శీతల్ కూల్ ప్రొడక్ట్స్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
బంగారం ధరలు రయ్ రయ్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. ఇటీవల వరుసగా పడిన పసిడి ధరలు తిరిగి పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు దూసుకుపోయాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
300 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 77 పాయింట్లు నష్టపోయి 24,643కు చేరింది. సెన్సెక్స్(Sensex) 302 ప్లాయింట్లు దిగజారి 80,707 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోమారు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (ఆగస్ట్ 04) 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 50 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. పసిడి ధరల్లో స్వల్ప కదలికలు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 199.77 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో.. 80,799.68 వద్ద, నిఫ్టీ 71.85 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో.. 24,637.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్, మీర్జా ఇంటర్నేషనల్, సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్, ఆర్ఫిన్ ఇండియా, కాప్స్టన్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ZIM లాబొరేటరీస్, PSP ప్రాజెక్ట్స్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్, AMJ ల్యాండ్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఆర్బీఐ వైపు మార్కెట్ చూపు
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ పరపతి నిర్ణయాలవైపు దృష్టి సారించనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే జోరందుకున్న ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక గణాంకాలు సైతం కీలకంకానున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారాంతాన ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. వీటికితోడు మరిన్ని దిగ్గజాలు ఈ వారం ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరును వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో బాష్, శ్రీసిమెంట్స్, మారికో, ఏబీ క్యాపిటల్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, ట్రెంట్, పిడిలైట్ ఇండస్ట్రీస్, పీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, బీహెచ్ఈఎల్, ఎల్ఐసీ, టైటన్ కంపెనీ, హెచ్పీసీఎల్, స్టేట్బ్యాంక్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. నేడు(సోమవారం) ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత పాలసీలో స్పీడ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) గత సమీక్షలో అనూహ్యంగా కీలక వడ్డీ రేటు రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో మే నెలలో రెపో రేటు 5.5 శాతానికి దిగివచి్చంది. ఆర్థికవేత్తలు 0.25 శాతం తగ్గింపు అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రెపో రేటు 1 శాతం తగ్గింది. ఫలితంగా 2022 ఆగస్ట్ తదుపరి వడ్డీ రేట్లు కనిష్టానికి చేరాయి. నేడు ప్రారంభంకానున్న ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశాలు బుధవారం(6న) ముగియనున్నాయి. యూఎస్ టారిఫ్ల విధింపు, 3 శాతానికంటే దిగువకు చేరిన ద్రవ్యోల్బణం, ఈ ఏడాది ద్వితీయార్థంలో జీడీపీ నెమ్మదించవచ్చన్న అంచనాలు మరో 0.25 శాతం రేట్ల కోతకు వీలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే గత రేట్ల కోత, ఈ ఏడాది తొలి 3 నెలల్లో జీడీపీ 7.4 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో యథాతథ రేట్ల అమలుకే కట్టుబడవచ్చని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్వెస్టర్లు పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. విదేశీ గణాంకాలు జులై నెలకు చైనా సరీ్వసుల రంగ గణాంకాలు మంగళవారం(5న) వెలువడనున్నాయి. గురువారం(7న) వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. జూన్లోనే చైనా వాణిజ్య మిగులు దాదాపు 115 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం 99 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. జులై నెలకు యూఎస్ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం సోమ, మంగళవారాల్లో వెలువడనున్నాయి. ఇక ఈ వారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) వడ్డీ రేట్ల సమీక్షను చేపట్టనుంది. ఇతర అంశాలు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారత్పై 25 శాతం టారిఫ్లను విధించడంతో 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, రత్నాభరణాలు, ఆక్వా, ఫుట్వేర్, కెమికల్స్ తదితర పలు రంగాలకు సవాళ్లు ఎదురుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇవి మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. మరోపక్క గత నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచి్చనట్లు వివరించారు. జూలైలో నికరంగా రూ.17,741 కోట్ల విలువైన షేర్లను నికరరంగా విక్రయించారు.గత వారం డీలా.. శుక్రవారం(ఆగస్ట్ 1)తో ముగిసిన గత వారం స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో వారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్(బీఎస్ఈ) 863 పాయింట్లు(1.1 శాతం) క్షీణించి 80,560 వద్ద నిలిచింది. నిఫ్టీ(ఎన్ఎస్ఈ) 272 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,565 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ 2.5 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. యూఎస్ టారిఫ్ల విధింపు, ఎఫ్పీఐల అమ్మకాలకుతోడు గత వారాంతాన ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. వీటి ప్రకారం సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,900 స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఒక దశలో 24,550 దిగువకు చేరింది. దీంతో ఈ వారం 24,450 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 24,900–25,000కు తిరిగి చేరవచ్చు. ఇలాకాకుండా మరింత నీరసిస్తే 24,300కు, ఆపై 24,000 పాయింట్లస్థాయికి క్షీణించే వీలుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీగా పెరిగిన బంగారం ధరలు
ధరలు తగ్గుతున్నాయని సంబరపడేలోపే.. బంగారం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నేడు గరిష్టంగా రూ. 1530 పెరిగిన ధరలు పసిడి ప్రియులను అవాక్కయేలా చేసింది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు (శనివారం) పసిడి రేటు తారాజువ్వలా పైకి లేచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock market: భారీ నష్టాలు.. నెత్తురు కక్కిన ఫార్మా షేర్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 585.67 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 81,317.51 -80,495.57 శ్రేణిలో ట్రేడ్ అయింది.ఇక 24,784.15 -24,535.05 రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 203 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,565.35 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ 4.43 నుంచి 2.41 శాతం మధ్య నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.33 శాతం, 1.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లో టాప్లో ఉండి 3.33 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వరుసగా 5.17 శాతం, 4.89 శాతం నష్టపోయాయి. అస్థిరత సూచీ, ఇండియా (విఐఎక్స్) 3.74 శాతం పెరిగి 11.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
సీఈవో రాజీనామా.. కుప్పకూలిన షేర్లు
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో 17 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో రూ.819.25 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గిరిష్ కౌస్గీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఈ పతనం చోటుచేసుకుంది. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశ, స్థిరత్వంపై పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగించింది.నాయకత్వ శూన్యం2022 అక్టోబర్లో నాలుగేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన గిరీష్ కౌస్గీ 2025 అక్టోబర్ 28న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ తన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయడం వల్ల వారసత్వ ప్రణాళిక, నాయకత్వ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.అయితే కంపెనీ మాత్రం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార దృష్టి, వృద్ధి మార్గం యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇస్తోంది. కొత్త సీఈవో కోసం బోర్డు అనుభవజ్ఞుడైన వ్యక్తిని అన్వేషించడం ప్రారంభించింది.గత పనితీరు అమోఘంకౌస్గీ నాయకత్వంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 200 శాతం వృద్ధి చెందింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లలో అమ్మకాలు 50-రోజుల సగటు కంటే 1,176 శాతం అధికంగా నమోదయ్యాయి. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకాలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి.బలమైన క్యూ1 ఫలితాలుపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జూలై 21న బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం రూ.2,082 కోట్లుగా నివేదించింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.1,980 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.760 కోట్లు.ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ, సీఈవో రాజీనామా, టెక్నికల్ బ్రేక్డౌన్ కారణంగా తాత్కాలిక అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేచి చూడాలనే దృక్పథాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సీఈవో ఎవరు అవుతారు, మార్కెట్ భావన ఎలా మారుతుంది అన్నది స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు. -
పసిడి ప్రియులకు వరుస ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి మార్కెట్ సెషన్లో తగ్గిన పసిడి ధరలు ఈరోజు కూడా కాస్త దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ సూచీలు నేలచూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు నష్టపోయి 24,713కు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 ప్లాయింట్లు దిగజారి 81,001 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి డిమాండ్కు ధరాఘాతం!
ముంబై: పసిడి ధరలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరడంతో డిమాండ్ (పరిమాణం పరంగా) తగ్గుముఖం పట్టింది. జూన్ త్రైమాసికంలో భారత్లో బంగారం డిమాండ్ 134.9 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్ 149.7 టన్నుల కంటే ఇది 10 శాతం తక్కువ. ధరలు రికార్డు స్థాయిలకు చేరడం కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. ధరలు పెరిగిన ఫలితంగా పుత్తడి కొనుగోలుపై భారతీయులు అధికంగా వెచ్చించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. విలువ పరంగా పసిడి డిమాండ్ రూ.1,21,800 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.93,850 కోట్ల కంటే 30% పెరిగింది. బంగారు ఆభరణాల కొనుగోలు డిమాండ్ పరిమాణం పరంగా 17 శాతం తగ్గి 88.8 టన్నులకు పరిమితమైంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 106.5 టన్నులుగా ఉంది. విలువ పరంగా బంగారు ఆభరణాల డిమాండ్ 20 శాతం పెరిగి రూ.80,150 కోట్లకు చేరింది. ధరలు పెరగడం ఫలితంగా ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, అదనంగా ఖర్చు చేయాల్సి రావడం విలువ పెరిగేందుకు దారితీసింది. పెట్టుబడి పరంగా డిమాండ్.. పెట్టుబడి పరంగా బంగారం డిమాండ్ 7 శాతం పెరిగి 46.1 టన్నులుగా జూన్ త్రైమాసికంలో నమోదైంది. విలువ పరంగా చూస్తే డిమాండ్ 54 శాతం పెరిగి రూ.41,650 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలానికి విలువ పెరిగే సాధనంగా బంగారాన్ని చూస్తున్నారనడానికి ఇది నిదర్శమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. బంగారం దిగుమతులు 34 శాతం తగ్గి 102.5 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 150 టన్నులుగా ఉన్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది మరోపక్క, బంగారం రీసైక్లింగ్ (పునర్వినియోగపరిచిన) డిమాండ్ ఒక శాతం పెరిగి 23.1 టన్నులకు చేరుకుంది. 6 నెలల్లో 253 టన్నులు..జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు ఔన్స్కు సగటున 3,280 డాలర్లుగా ఉంటే, 10 గ్రాముల ధర భారత్లో రూ.90,307 స్థాయిలో ఉన్నట్టు సచిన్ జైన్ తెలిపారు. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యం కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది తొలి 6 నెలల్లో (జనవరి–జూన్) భారత్లో బంగారం డిమాండ్ 253 టన్నులుగా ఉండగా, పూర్తి ఏడాదికి 600–700 టన్నుల మధ్య ఉండొచ్చని సచిన్జైన్ తెలిపారు. ధరల్లో స్థిరత్వం ఏర్పడితే డిమాండ్ గరిష్ట స్థాయిలో 700 టన్నులకు చేరుకోవచ్చన్నారు. ధరల పెరుగుదల కొనసాగితే డిమాండ్ 600 టన్నులకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు గురువారం అస్థిర సెషన్ లో ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,803.27 నుంచి 80,695.15 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 86.70 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 24,768.35 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.70-1.34 శాతం రేంజ్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు 3.61 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.05 శాతం, 0.93 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మార్కెట్ ధోరణులను అధిగమించి ఇమామీ, హిందుస్థాన్ యూనిలీవర్ నేతృత్వంలో 1.44 శాతం లాభాలతో స్థిరపడింది. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,153 షేర్లలో 2,418 రెడ్లో, 1,598 గ్రీన్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు నిన్నటి మార్కెట్ సెషన్లో పెరిగాయి. తిరిగి ఈ రోజు మళ్లీ ధరలు తగ్గాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
200 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:39 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు నష్టపోయి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 ప్లాయింట్లు దిగజారి 81,261 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈలో ఇన్వెస్టర్ ఖాతాలు 23 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ఖాతాల సంఖ్య జూలైలో 23 కోట్ల స్థాయిని దాటింది. అకౌంట్ల సంఖ్య ఏప్రిల్లో 22 కోట్ల మార్కును దాటగా కేవలం మూడు నెలల్లోనే మరో 1 కోటి అకౌంట్లు జతయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 4 కోట్ల ఖాతాలు (మొత్తం అకౌంట్లలో 17 శాతం) ఉండగా, తర్వాత స్థానాల్లో ఉత్తర్ప్రదేశ్ (2.5 కోట్లు, 11 శాతం వాటా), గుజరాత్ (2 కోట్లకు పైగా, 9 శాతం వాటా), పశ్చిమ బెంగాల్..రాజస్థాన్ (చెరి 1.3 కోట్లు, 6 శాతం వాటా) ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లలో దాదాపు సగ భాగం వాటా ఈ అయిదు రాష్ట్రాలదే ఉంది. టాప్ 10 రాష్ట్రాల వాటా నాలుగింట మూడొంతులు ఉందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. విశిష్ట ఖాతాదారుల సంఖ్య 11.8 కోట్లుగా ఉంది. సాధారణంగా ఒకే ఇన్వెస్టరు పలు బ్రోకరేజీ సంస్థల్లో అకౌంట్లు తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లలో యువత, మొదటిసారిగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్ఎస్ఈ వివరించింది. డిజిటలీకరణ వేగవంతం కావడం, మొబైల్ ఆధారిత ట్రేడింగ్ సొల్యూషన్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడానికి కారణమని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్లో 10 రోజులు నో ట్రేడింగ్!
దేశంలో స్టాక్ మార్కెట్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులుఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవంఆగష్టు 27 - వినాయక చవితిఅక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరాఅక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజఅక్టోబర్ 22 - బలిప్రతిపాదనవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్డిసెంబర్ 25 - క్రిస్మస్ -
మార్కెట్ ముగిసిందిలా.. టాప్ గెయినర్స్ ఇవే..
భారత ఈక్విటీలు ఈ రోజు క్యూ1 ఫలితాలతో నడిచాయి. 2025 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన తర్వాత సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన నిర్ణయం ఇన్వెస్టర్లను పక్కకు నెట్టి స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు లోనయ్యాయి.సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143.9 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద ముగిసింది. అదేసమయంలో ఎల్అండ్టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ (0.96 శాతం), నిఫ్టీ ఆటో (0.6 శాతం) అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకుల అంచనాలను కొలిచే ఇండియా వీఐఎక్స్ 2.77 శాతం నష్టంతో 11.21 వద్ద ముగిసింది. -
బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 24,866కు చేరింది. సెన్సెక్స్(Sensex) 138 ప్లాయింట్లు పుంజుకుని 81,479 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.38 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లెన్స్కార్ట్.. ఐపీఓ రూట్
ఓమ్నిచానల్ ఐవేర్ రిటైలర్ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 13.22 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 273 కోట్లు దేశీయంగా సొంత స్టోర్ల ఏర్పాటు(పెట్టుబడి వ్యయాలు)కు, లీజ్, అద్దె, లైసెన్స్ ఒప్పందాల చెల్లింపులకు రూ. 591.5 కోట్లు, టెక్నాలజీపై రూ. 213.4 కోట్లు, బ్రాండ్ మార్కెటింగ్పై మరో రూ. 320 కోట్లు చొప్పున వెచ్చించనుంది.2008లో షురూ: దేశీయంగా 2008లో ఏర్పాటైన లెన్స్కార్ట్.. 2010లో ఆన్లైన్ ద్వారా బిజినెస్కు తెరతీసింది. 2013లో న్యూఢిల్లీలో తొలి రిటైల్ స్టోర్ను తెరిచింది. కంపెనీ ఐవేర్ విభాగంలో డిజైనింగ్, తయారీ, బ్రాండింగ్, రిటైలింగ్ను చేపడుతోంది. 2025 మార్చికల్లా దేశీయంగా నెలకొలి్పన 2,067 స్టోర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2,723 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’రాజస్తాన్లోని భివాడీ, హర్యానాలోని గురుగ్రామ్లలో ప్లాంట్లు ఉన్నాయి. జాన్ జాకబ్స్, విన్సెంట్ చేజ్, హూపర్ కిడ్స్ తదితర బ్రాండ్లతో బిజినెస్ నిర్వహిస్తోంది. 2024–25లో నష్టాల నుంచి బయటపడి రూ. 297 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 6,652 కోట్లను తాకింది. -
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,694కు చేరింది. సెన్సెక్స్(Sensex) 19 ప్లాయింట్లు పుంజుకుని 80,906 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ రెడ్లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 24,832కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు దిగజారి 81,397 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ పాలసీ, ఫలితాలు కీలకం
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం యూఎస్ కేంద్ర బ్యాంకు రేట్ల సమీక్ష, జీడీపీ, ఉపాధి గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా నేడు(28న) జూన్ పారిశ్రామికోత్పత్తి వివరాలు తెలియనున్నాయి. అంతేకాకుండా ఈ వారం మరిన్ని కంపెనీల క్యూ1 ఫలితాల వెల్లడికానున్నాయి. వివరాలు చూద్దాం.. దేశీయంగా నేడు జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. మే నెలలో ఐఐపీ వార్షికంగా 1.2 శాతం పుంజుకుంది. ఇక మరోవైపు ఇప్పటికే జోరందుకున్న కార్పొరేట్ల తొలి త్రైమాసిక(క్యూ1) ఫలితాల సీజన్ కొనసాగనుంది. ఈ వారం క్యూ1(ఏప్రిల్–జూన్) పనితీరు ప్రకటించనున్న జాబితాలో 28న ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్సహా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టొరెంట్ ఫార్మా, గెయిల్ ఇండియా, మజగావ్ డాక్ షిప్, వారీ ఎనర్జీస్, ఉన్నాయి. ఇదే విధంగా 29న ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హ్యుందాయ్ మో టార్స్, ఇండస్ టవర్స్, కేన్స్ టెక్నాలజీ, కేపీ ఐటీ టె క్, 30న హెచ్యూఎల్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకీ, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఐషర్, టీవీఎస్ మోటార్, స్విగ్గీ, డాబర్ ఇండి యా, ఆగస్ట్ 1న ఐటీసీ, టాటా పవర్, గోద్రెజ్ ప్రా పరీ్టస్, జీఎస్కే ఫార్మా, ఎంసీఎక్స్, హనీవెల్ ఆటోమేషన్, ఎల్ఐసీ హౌసింగ్ జాబితాలో చేరాయి. ఎఫ్అండ్వో ముగింపు జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారం(31న) ముగియనుంది. ఇవికాకుండా జూన్ నెలకు ఆటో అమ్మకాలు, టెలికం సబ్స్క్రయిబర్ల వివరాలు తదితర గణాంకాలు సైతం ఈ వారం వెలువడనున్నాయి. ఇటీవల దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నికరంగా అమ్మకాలు చేపడుతున్నారు. వీటితోపాటు థాయ్లాండ్, కాంబోడియా వివాదాలు, ప్రపంచ మార్కెట్ల తీరు.. తదితర అంశాలన్నిటిపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొనవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ట్రేడ్ డీల్స్పై కన్ను భారత్సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు వాణిజ్య సుంకాలను విధించిన విషయం విదితమే. వీటిపై సస్పెన్షన్ గడువు ఆగస్ట్ 1న ముగియనున్న నేపథ్యంలో యూఎస్తో వాణిజ్య ఒప్పందాలు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ నిర్ణయాల ఎఫెక్ట్ యూఎస్ ఫెడ్ 29న పాలసీ సమీక్ష చేపట్టనుంది. ఉపాధి సంబంధ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 30న క్యూ2(ఏప్రిల్–జూన్) జీడీపీ ముందస్తు గణాంకాలు వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్ యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. ఈసారి కూడా రేట్లలో మార్పులు చేపట్టకపోవచ్చని, సెప్టెంబర్కు వాయిదా వేయవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సాంకేతికంగా.. 2024 అక్టోబర్ తదుపరి ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ వరుసగా నాలుగో వారమూ నష్టాలతో ముగిసిన నేపథ్యంలో ఈ వారం సైతం మార్కెట్లు మరింత క్షీణించవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. నిఫ్టీ బలహీనపడితే 24,790, 24,620 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. ఇంతకంటే నీరసిస్తే 24,480 వద్ద సపోర్ట్ ఉందని పేర్కొన్నారు. ఒకవేళ బలపడితే.. స్వల్ప కాలానికి 25,200, 25,300 పాయింట్లస్థాయిలో అవరోధాలు ఎదురుకావచ్చని విశ్లేíÙంచారు.గత వారమిలా.. గత వారం(21–25) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోసారి నికరంగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 295 పాయింట్లు(0.4 శాతం) డీలాపడి 81,463 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 131 పాయింట్లు(0.5 శాతం) నీరసించి 24,837 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 1.5% స్థాయిలో నష్టపోయాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ. 353 కోట్ల ఐపీవోకి హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట డయాలసిస్ సేవలందించే హైదరాబాదీ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా నెఫ్రోప్లస్ రూ. 70.6 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్ట్కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టూ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనవి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను దేశీయంగా కొత్తగా డయాలసిస్ క్లినిక్లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్కి దేశవ్యాప్తంగా 269 నగరాల్లో 447 క్లినిక్లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్తో పాటు ఇటీవలే సౌదీ అరేబియా ద్వారా మధ్యప్రాచ్య మార్కెట్లోకి కూడా విస్తరించింది. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద 5,000 పైగా డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 755.8 కోట్ల ఆదాయం, రూ. 67 కోట్ల లాభం ఆర్జించింది. -
కురిసిన చినుకుల్లా బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కుప్పకూలిన బజాజ్ షేర్లు
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇతర హెవీవెయిట్ షేర్ల బలహీనత మధ్య భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు (0.88 శాతం) నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (0.9 శాతం) క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్ షేర్లు టాప్ లూజర్స్గా నిలవగా సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా (0.54 శాతం) మినహా అన్ని కౌంటర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఆటో 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.64 శాతం, నిఫ్టీ రియల్టీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం నష్టపోయాయి.దేశీయ మార్కెట్లో మార్కెట్ అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ 5.15 శాతం లాభంతో 11.28 వద్ద ముగిసింది. -
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతోపాటు, ఈ రోజు కూడా ఊరట లభించింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 134 పాయింట్లు నష్టపోయి 24,932కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 ప్లాయింట్లు దిగజారి 81,794 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బిట్చాట్... నెట్ అవసరం లేదు!
ట్విట్టర్ కో–ఫౌండర్ జాక్ డోర్సె ‘బిట్చాట్’ అనే కొత్త మెసేజింగ్ యాప్ను లాంచ్ చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్లాగా దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదు. మెసేజ్ను రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ చేయడానికి బ్లూటూత్ను ఉపయోగిస్తుంది బిట్చాట్. ప్రస్తుతం ఇది యాపిల్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నట్లు చెబుతున్నాడు డోర్సె. క్రౌడెడ్ ఏరియాలలో, ఇంటర్నెట్ యాక్సెస్ను బ్లాక్ చేసిన చోట బిట్చాట్ బాగా ఉపయోగపడుతుంది. -
మళ్లీ ఐపీవో హవా..!
ఓవైపు సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తున్నాయి. వెరసి ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఐపీవోల ద్వారా అన్లిస్టెడ్ కంపెనీలు రూ. 45,350 కోట్లు సమీకరించాయి. ఇది 45 శాతం వృద్ధికాగా.. మరో 118 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ బాటలో వచ్చే వారం 3 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. తద్వారా రూ. 6,200 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభంకానుంది. ఆగస్ట్ 1న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల శ్రేణి ప్రకటించవలసి ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా 5.01 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. వీటిని సంస్థలో ప్రధాన వాటాదారులైన స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈతోపాటు.. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూటీ(ఎస్యూయూటీఐ) విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో నిధులు ప్రస్తుత వాటాదారుల సంస్థలకు చేరనున్నాయి. 2017లోనే ఐపీవోకు వచ్చిన సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) ఇప్పటికే ఎన్ఎస్ఈలో లిస్టయిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా డిపాజిటరీ సరీ్వసులందించే రెండో సంస్థగా ఎన్ఎస్డీఎల్ లిస్ట్కానుంది. 1996 నవంబర్లో డీమెటీరియలైజేషన్కు తెరతీయడంతో కంపెనీ డీమ్యాట్ సేవలలో భారీగా విస్తరించిన విషయం విదితమే. 2024–25లో కంపెనీ ఆదాయం 12% పైగా ఎగసి రూ. 1,535 కోట్లను తాకింది. నికర లాభం 25% జంప్చేసి రూ. 343 కోట్లకు చేరింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడేసిన ఐటీ, రియల్టీ షేర్లు
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, కోఫోర్జ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 542.47 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 82,184.17 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 157.8 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.1 వద్ద ముగిశాయి.ఎటర్నల్ (జొమాటో), టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్గా లాభపడగా, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వరుసగా 0.58 శాతం, 1.09 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ రియల్టీ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి. -
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు నష్టపోయి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 ప్లాయింట్లు దిగజారి 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు ర్యాలీ.. రయ్మన్న ఆటో షేర్లు
ప్రపంచ మార్కెట్ల బలాన్ని ట్రాక్ చేస్తూ భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్ను లాభాలతో ముగించాయి. దీనికి తోడు జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై26) ఫలితాలకు సంబంధించి కొనసాగుతున్న త్రైమాసిక రాబడుల సీజన్ మధ్య స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా సెంటిమెంట్కు దిశానిర్దేశం చేసింది.బీఎస్ఈ సెన్సెక్స్ 539.83 పాయింట్లు (0.66 శాతం) లాభంతో 82,726.64 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 159 పాయింట్లు లేదా 0.63 శాతం లాభంతో 25,219.9 వద్ద సెషన్ను ముగించాయి. టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ టాప్ గెయినర్స్గా నిలవగా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.34 శాతం లాభంతో, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫ్లాట్ గా ముగిశాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.76 శాతం, నిఫ్టీ మెటల్ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 2.6 శాతం నష్టపోయింది. -
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా జరిగే ట్రేడింగ్ సర్వీసుల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దని సూచించింది. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించవలసిందిగా పేర్కొంది.స్టాక్ మార్కెట్లకు సమాంతరంగా నియంత్రణలులేని ఆఫ్మార్కెట్లో నిర్వహించే అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండమంటూ హెచ్చరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధం లేకుండా నిర్వహించే ఇలాంటి లావాదేవీలు భారీ రిస్క్లతో కూడి ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనకు సైతం దారితీస్తాయని హెచ్చరించింది. వెరసి డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమేకాకుండా.. రిస్క్లను సైతం ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. నియంత్రణ, అవగాహన, చట్టబద్ధ సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాఏమిటీ డబ్బా ట్రేడింగ్..సెబీ నిర్వచించిన విధంగా డబ్బా ట్రేడింగ్ అనేది చట్టవిరుద్ధమైన, క్రమబద్ధీకరించని ఆఫ్ మార్కెట్ ట్రేడింగ్. ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో ఉండదు. సెబీ గుర్తింపు పొందిన ఏ ఎక్స్ఛేంజ్లోనూ ఈ ట్రేడులు నమోదు అవ్వవు. వ్యాపారులు, డబ్బా ఆపరేటర్ల మధ్య నగదు రూపంలో సెటిల్మెంట్లు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ ధర కదలికలపై బెట్టింగ్ వేస్తారు. సెక్యూరిటీల వాస్తవ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు. వీటిని అనుసరించడం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1956, సెబీ యాక్ట్ 1992, భారతీయ న్యాయ్ సంహిత 2023ను ఉల్లంఘించడం అవుతుందని గుర్తుంచుకోవాలి. -
జీసీసీల నిర్వహణకు కోవాసెంట్ ‘ఎనేబ్లర్’ సేవలు
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల నిర్వహణకు ఉపయోగపడేలా ‘ఎనేబ్లర్’ పేరిట కొత్త సర్వీస్ల విభాగాన్ని ప్రారంభించినట్లు కోవాసెంట్ టెక్నాలజీస్ వెల్లడించింది. కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేయడం, నిర్వహించుకోవడం, కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడానికి సంబంధించి కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించి ఎనేబ్లర్ తగు వ్యూహాలను అందిస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాసరైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకోవడం నుంచి ఆటోమేషన్, అనలిటిక్స్ను ఉపయోగించుకోవడం వరకు ఇది అన్ని రకాల సేవలను అందిస్తుందని వివరించింది. కేవలం కంపెనీల కార్యకలాపాల నిర్వహణ పరమైన పనులకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు, వ్యూహాల్లో కూడా భాగస్వాములుగా జీసీసీలు ఎదిగేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోవాసెంట్ టెక్నాలజీస్ తెలిపింది. వచ్చే అయిదేళ్లలో హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 150 జీసీసీల ఏర్పాటుపై ఎనేబ్లర్ దృష్టి పెట్టినట్లు సంస్థ వివరించింది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,121కు చేరింది. సెన్సెక్స్(Sensex) 196 ప్లాయింట్లు పుంజుకుని 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి.. మళ్లీ రూ.లక్ష పైకి!
న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్మంది. కొనుగోళ్ల మద్దతుతో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 లాభపడి రూ.1,00,020 స్థాయికి చేరింది. స్టాకిస్టుల నుంచి బలమైన కొనుగోళ్లు జరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,000 పెరిగి రూ.99,550 స్థాయిని చేరుకుంది.అటు వెండిలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో రూ.3,000 లాభపడి కిలోకి రూ.1,14,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో (కామెక్స్ ఫ్యూచర్స్) ఔన్స్ బంగారం 35 డాలర్లకు పైగా లాభంతో 3,440 డాలర్ల స్థాయిని చేరుకుంది. వెండి ధర ఔన్స్కు 39.50 డాలర్ల వద్ద ఉంది. పరపతి విధానంపై యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.చైనా లోన్ ప్రైమ్ రేటుపై నిర్ణయం, యూఎస్ ఆర్థిక డేటా (పీఎం, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు), వడ్డీ రేట్లపై నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారంలో తదుపరి ర్యాలీని నిర్ణయిస్తాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ అభిప్రాయపడ్డారు. -
రిలయన్స్, ఐటీ షేర్లు పడేశాయ్..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 82,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,061 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆరంభంలోనే ఓ మోస్తారు లాభాలు గడించాయి. ఒక దశలో సెన్సెక్స్ 338 పాయింట్లు పెరిగి 82,538 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,182 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి.అయితే భారత్ – యూఎస్వాణిజ్య ఒప్పందానికి తుది గడువు ఆగస్టు 1 సమీపిస్తున్నా.. డీల్పై ఎలాంటి స్పష్టత రాకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇండెక్సుల వారీగా బీఎస్ఈలో రియల్టీ 1%, టెలీకమ్యూనికేషన్, ఆటో, ఐటీ, టెక్ షేర్లు అరశాతం నష్టపోయాయి.⇒ అంచనాలకు మించి క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటనతో డెలివరీ దిగ్గజం ఎటర్నల్ షేరు రెండో రోజూ రాణించింది. బీఎస్ఈలో 11% పెరిగి రూ.300 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.312 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.41,013 కోట్లు పెరిగి రూ.2.89 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. శాంతి గోల్డ్ @ రూ. 189–199న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 189–199 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. దీనిలో భాగంగా 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 360 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా విభిన్న బంగారు ఆభరణాల డిజైన్, తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం వార్షికంగా 2,700 కేజీల బంగారు ఆభరణాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు పెరిగి 25,109కు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 ప్లాయింట్లు పుంజుకుని 82,324 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ.99,020కు చేరిన బంగారం ధర
న్యూఢిల్లీ: స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధరలు సానుకూలంగా ట్రేడయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.99,020 స్థాయిని చేరింది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి సైతం ఇంతే మేర లాభపడి రూ.98,550 స్థాయిని తాకింది. మరోవైపు వెండి ధర కిలోకి రూ.500 పుంజుకోవడంతో రూ.1,11,000 స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 16 డాలర్ల వరకు పెరిగి 3,365 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యింది. ‘‘యూఎస్ టారిఫ్లకు సంబంధించి అనిశ్చితులు కొనసాగడంతో బంగారం ధరలు గరిష్టాల వద్ద ట్రేడయ్యాయి. డాలర్ బలపడడం విలువైన లోహాల ధరలకు మద్దతుగా నిలిచింది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
బ్యాంకు షేర్లకు డిమాండ్
ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు మెటల్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 443 పాయింట్లు పెరిగి 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 25,091 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 516 పాయింట్లు పెరిగి 82,274 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు బలపడి 25,111 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా.. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలహీనపడి 86.31 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్ గూడ్స్ 1.33%, బ్యాంకెక్స్ 1.28%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 1.26%, మెటల్, కమోడిటీస్ 1%, ఆటో, కన్జూమర్ డిస్క్రేషనరీ 0.5% చొప్పున పెరిగాయి.అంచనాలకు మించి తొలి త్రైమాసిక నికరలాభం రూ.16,258 కోట్ల నమోదుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% పెరిగి రూ.2,000 వద్ద స్థిరపడింది. క్యూ1 ఆరి్థక ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్, తొలిసారి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీతో పాటు బ్రోకరేజ్ సంస్థలు షేరుకు ‘బై’ రేటింగ్ కేటాయింపు అంశాలు కలిసొచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేరు 3% లాభపడి రూ.1,466 వద్ద స్థిరపడింది. తొలి త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించడంతో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3% నష్టపోయి రూ.1428 వద్ద నిలిచింది. తొలి త్రైమాసికంలో ఆయిల్–కెమికల్స్(ఓ2సీ), రిటైల్ విభాగాల పనితీరు నిరాశపరచడంతో పాటు ఇటీవలి ర్యాలీతో షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీవెయిట్స్ నుంచి బలమైన క్యూ1 రాబడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 82,200.34 స్థాయిలలో స్థిరపడగా, నిఫ్టీ 50 122.3 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,090.7 స్థాయిలలో ముగిసింది.నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.66 శాతం లాభపడగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, బీఎస్ ఈ, బీడీఎల్, పాలసీబజార్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సుజ్లాన్, అశోక్ లేలాండ్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ప్రతికూల ప్రభావంతో ఫ్లాట్ గా స్థిరపడింది.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, మెటల్ 1 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. బ్యాంక్ షేర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.7 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ, ఆటో, ఎనర్జీ, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, మీడియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 18 షేర్లు గ్రీన్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ 5.4 శాతం వరకు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.67 శాతం క్షీణించి 11.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
బంగారం ఇంకెంత పెరుగుతుంది?
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తులం (10 గ్రాములు) పసిడి ధర రూ.లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3,350 డాలర్ల వద్ద ఉంది. అయితే రాబోయే రోజుల్లో పుత్తడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బులియన్ ధరను నడిపించే అనేక అంశాలు రానున్న రోజుల్లో ఉన్నాయని చెబుతున్నారు.ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఏం మాట్లాడతారు.. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల గ్లోబల్ పీఎంఐ డేటా వంటి అంశాలను ట్రేడర్లు నిశితంగా పరిశీలించనున్నారు. బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనేదానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటిలో ఏ అంశాలు బంగారం ధరకు అనుకూలంగా పనిచేసినా పసిడి రేటు పెరుగుతుంది.అమెరికా ప్రకటించినా ప్రతీకార సుంకాల అమలు తేదీ ఆగస్టు 1 డెడ్లైన్ సమీపిస్తుండటంతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి బంగారం సేఫ్ హెవెన్ డిమాండ్కు ఊతమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దేశీయ పండుగల డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు.వెంచురా కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి ప్రకారం.. బలహీనమైన యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ నష్టాలు, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం వంటి సరైన ఉత్ప్రేరకాలు కార్యరూపం దాలిస్తే, 2025 ప్రథమార్ధంలో బలమైన 26 శాతం పెరుగుదల తర్వాత ద్వితీయార్ధంలోనూ బంగారం మరో 4-8 శాతం లాభపడవచ్చు. -
ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ధరలు స్పలంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వారంలో 4 పబ్లిక్ ఇష్యూలు.. 1 లిస్టింగ్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో మరోసారి ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరోవైపు ఇప్పటికే ఐపీవో పూర్తి చేసుకున్న ఏంథమ్ బయోసైన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. గత వారం మెయిన్బోర్డ్లో ఇష్యూ పూర్తి చేసుకున్న ఏంథమ్ బయోసైన్స్ కౌంటర్లో నేడు(21న) ట్రేడింగ్కు తెరలేవనుంది. ఇష్యూ ధర రూ. 570కాగా.. 64 రెట్లు అధికంగా స్పందన లభించడం గమనార్హం! కాగా.. వర్క్స్పేస్ సొల్యూషన్స్ సమకూర్చే ఇండిక్యూబ్ స్పేసెస్తోపాటు.. డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైళ్లు తదితర ప్రొడక్టుల పునరుద్ధరణ కంపెనీ జీఎన్జీ ఎల్రక్టానిక్స్ ఐపీవోలు 23న ప్రారంభంకానున్నాయి.ఇదీ చదవండి: రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?25న ముగియనున్న ఇష్యూల ద్వారా ఇండిక్యూబ్ రూ. 700 కోట్లు, జీఎన్జీ రూ. 460 కోట్లకుపైగా సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. రెండు సంస్థలు ఒకే విధంగా రూ. 225–237 ధరల శ్రేణిని ప్రకటించాయి. ఈ బాటలో ఆతిథ్య రంగ సంస్థ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవో 24న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న పబ్లిక్ ఇష్యూ ద్వారా హోటళ్ల చైన్ సంస్థ రూ. 750 కోట్ల వరకూ సమీకరించే యోచనలో ఉంది. బెంగళూరు, చైన్నై, కొచ్చి తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 9 హోటళ్ల ద్వారా 1,604 గదులను నిర్వహిస్తోంది. బంగారు ఆభరణ తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఐపీవో 25న ప్రారంభంకానుంది. దీనిలో భాగంగా కంపెనీ 1.8 కోట్ల షేర్లు కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు సంస్థలు ధరల శ్రేణిని ప్రకటించవలసి ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు నష్టపోయి 24,906కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 81,593 వద్ద ట్రేడవుతోంది.యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు కొంత మొత్తాన్ని కేటాయించుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల మార్కెట్ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఇవి పనిచేస్తుంటాయి. స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ కంపెనీల్లో మెరుగైన అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో రిస్్కను సమతుల్యం చేస్తూ.. మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో దశాబ్దాలుగా పనిచేస్తూ మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ముందుంది. రాబడులు.. గత పదేళ్ల కాల పనితీరును గమనించినట్టయితే వార్షిక రాబడి 16 శాతం చొప్పున ఉంది. ఏడేళ్లలో 20 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 30 శాతం, మూడేళ్లలో 27.43 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గత ఏడాది కాల రాబడి 8.43 శాతంగా ఉంది. 1995లో ఈ పథకం మార్కెట్లోకి వచి్చంది. అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 18.92 శాతం చొప్పున ఉంది. ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. మార్కెట్ పతనాలు, రంగాలు, కంపెనీల వారీ పరిణామాలను గమనించి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమైన పని. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరు. కనుక సంపద సమకూర్చుకోవాలని భావించే వారు ఈక్విటీ ఫండ్స్కు తగినంత కేటాయించుకోవడం అవసరం. సిప్ ద్వారా కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. చురుకైన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల విధానం ఈ పథకంలో గమనించొచ్చు. భవిష్యత్తులో గొప్పగా వృద్ధి చెందే బలాలున్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్ఫోలియోలో తగినంత వైవిధ్యాన్ని నిర్వహిస్తుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో పోటీ పథకాలతో పోల్చి చూసినప్పుడు హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ స్టాక్స్ నాణ్యత మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం పోర్ట్ఫోలియో పీఈ 17.68గా ఉంది. సగటున కంపెనీల వార్షిక వృద్ధి 27.42 శాతం చొప్పున ఉంది. క్వాలిటీ, వ్యాల్యూ వ్యూహాలను సైతం ఈ పథకం అమలు చేస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో ఈ పథకంతోపాటు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ టాప్–2గా ఉన్నాయి. పోర్ట్ఫోలియో.. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.79,585 కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఇందులో 87 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 0.66 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.62 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. 9.72 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే పెట్టుబడులకు వీలుగా నగదు నిల్వలు అధికంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 87 శాతం లార్జ్క్యాప్లోనే ఉండడం గమనార్హం. మిడ్ క్యాప్ స్టాక్స్లో 9 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 3.91 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.లార్జ్క్యాప్ వ్యాల్యూషన్లు సహేతుక స్థాయిలో ఉండడంతో ఎక్కువ పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 51 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 40 శాతం వరకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డి్రస్కీషినరీ కంపెనీలకు 16.99 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 8.64 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.55 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
ఫలితాలు, వాణిజ్య చర్చలపై దృష్టి
ప్రధానంగా తొలి త్రైమాసిక ఫలితాలే ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాతాన పలు దిగ్గజాలు ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో మరిన్ని బ్లూచిప్స్ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్గత వారాంతాన ప్రకటించిన క్యూ1 ఫలితాలలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్కు తెరతీసింది. ఒక త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 26,994 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వాటాదారులకు సంస్థ చరిత్రలోనే తొలిసారి అదికూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ప్రకటించింది. ఇక మరో దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1లో 16% వృద్ధితో రూ. 13,558 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి నేడు ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లు సందడి యనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రెడీ..: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ మరింత జోరందుకోనుంది. ఈ వారం డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఎంఅండ్ఎం, ఏసీసీ, కాల్గేట్, డిక్సన్, తదితర బ్లూచిప్స్ క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. అంతేకాకుండా ఎటర్నల్, జీల్, ఎంఫసిస్, కెనరా బ్యాంక్, ఎస్ బీఐ లైఫ్ తదితరాలు సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫలితాలపై అత్యధికంగా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. వాణిజ్య డీల్స్..: యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావానికి చెక్ పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లలో అనిశ్చితికి కారణమవుతున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. సాంకేతికంగా చూస్తే.. గత వారం నిఫ్టీ 25,000 మైలురాయి దిగువన 24,900కు క్షీణించింది. దీంతో సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం ఆటుపోట్ల మధ్య మరింత బలహీనపడి 24,500వరకూ నీరసించే వీలుంది. అయితే మార్కెట్లు బలపడితే నిఫ్టీకి 25,250 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.ఎఫ్పీఐల వెనకడుగుజులైలో రూ. 5,524 కోట్లు వెనక్కిన్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 5,524 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో 2025 తొలి 7 నెలల్లో రూ. 83,245 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే జూన్లో రూ. 14,590 కోట్లు, మే నెలలో రూ. 19,860 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ మధ్య నుంచి అమ్మకాల బాటను వీడి రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గత వారమిలా వరుసగా మూడో వారం దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 743 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 81,758 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 181 పాయింట్లు తగ్గి 24,968 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు 1–1.5 శాతం చొప్పున నష్టపోయాయి. -
అన్లిస్టెడ్ షేర్లు.. చేతులు కాలుతాయ్!
పేరున్న కంపెనీ ఐపీవోకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వస్తోందంటే ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగిపోతుంది. అదృష్టాన్ని పరీక్షించుకుందామని పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తుంటారు. ఐపీవోలో షేర్లు దక్కని వారు లిస్టింగ్ తర్వాత కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇవన్నీ కలసి స్టాక్ వ్యాల్యూయేషన్లను అమాంతం పెంచేస్తుంటాయి. లిస్టింగ్లోనే లాభాలు కురుస్తుండడంతో ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎగబాగుతోంది.కొందరు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకుని మరీ.. ఐపీవోకు రావడానికి ముందుగానే ఆయా కంపెనీల షేర్లను అన్లిస్టెడ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధోరణి ఇటీవల విస్తరిస్తోంది. కానీ, అందరికీ ఇది అనుకూలం కాదు. రెగ్యులర్ మార్కెట్లకు మించి అన్లిస్టెడ్ మార్కెట్లో రెట్టింపు రిస్క్ ఎదురుకావొచ్చు. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్వన్97 కమ్యూనికేషన్స్ నుంచి స్విగ్గీ వరకు.. అంతెందుకు తాజాగా లిస్టయిన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ సైతం అన్లిస్టెడ్ మార్కెట్లో మంచి డిమాండ్ పలికినవే. ముందుగా ఇన్వెస్ట్ చేసినట్టయితే లిస్టింగ్ సమయానికి మంచి లాభాలు కళ్లజూడొచ్చన్న ఉద్దేశంతో కొందరు అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ లిస్టింగ్ సమయానికి కంపెనీల విలువలు పెరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. పడిపోవడం కూడా జరగొచ్చు. ఇందుకు నిదర్శనం హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్. చేదు అనుభవాలు..! అన్లిస్టెడ్ మార్కెట్లో కోట్ అయ్యే షేర్ల ధరలు కంపెనీ వాస్తవ విలువలను ప్రతిబింబించవు. ఎందుకంటే అక్కడ షేర్ల సరఫరా పరిమితంగా ఉంటుంది. కొద్ది డిమాండ్కే ధరలు అమాంతం ఎగబాకొచ్చు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్టెడ్ కంపెనీల విలువలు వాటి ఆరి్థక మూలాలను ప్రతిఫలిస్తుంటాయి. బుల్ర్యాలీలో అతిగా పెరిగినప్పటికీ తర్వాత దిద్దుబాటుతో దిగొస్తుంటాయి. రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంటుంది. అన్లిస్టెడ్ మార్కెట్ అలా కాదు. కేవలం కొద్దిపాటి సరఫరా ధరలను నిర్ణయిస్తుంటుంది. ఆ సరఫరా కూడా కొద్ది మంది బ్రోకర్ల పరిధిలోనే ఉంటే వారికి నచ్చిన విధంగా మానిప్యులేషన్ చేసే అవకాశం లేకపోలేదు.అధిక ధరల్లో కొనుగోలు చేస్తే, రాబడుల సంగతేమో కానీ, పెట్టుబడిని రాబట్టుకోవడానికే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావచ్చు. వన్97 కమ్యూనికేషన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్, రిలయన్స్ రిటైల్ షేర్లు అన్లిస్టెడ్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మిగిల్చిన చేదు అనుభవాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎన్బీఎఫ్సీ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐపీవో ఇటీవలే ముగిసింది. ఒక్కో షేరును రూ.740కే కేటాయించింది. కానీ, ఐపీవో ముందు వరకు అన్లిస్టెడ్ మార్కెట్లో ఒక్కో షేరు రూ.1400 ధర పలికింది. లిస్టింగ్కు ఏడాది ముందు కాలంలో రూ.700–1,400 మధ్య కదలాడింది.రూ.1,400 ధరపై కొనుగోలు చేసిన వారు తాజా ఐపీవో ధర ప్రకారం 40% నష్టపోయినట్టు తెలుస్తోంది. కంపెనీ మంచి పనితీరు చూపిస్తే కొంత కాలానికి షేరు ధర కోలుకుంటుందని ఆశించొచ్చు. అన్లిస్టెడ్ ధర కంటే తక్కువకే ఇప్పుడు ఎక్సే్ఛంజ్ల్లో లభిస్తుండడాన్ని ఇన్వెస్టర్లు ఒక గుణపాఠంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో విషయంలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. 2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరు ధరను రూ.475–500గా ఖరారు చేసింది. కానీ, అప్పటికి అన్లిస్టెడ్ మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.1,010–1,100 స్థాయిలో ట్రేడయ్యింది.పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ విషయంలో ఇన్వెస్టర్లకు చేదు అనుభవమే ఎదురైంది. 2021లో వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవోకి రాగా.. ఒక్కో షేరును రూ.2,150కు కేటాయించింది. లిస్టింగ్ రోజే కాదు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ధరకే చేరుకోలేదు. ఐపీవోకి ముందు అన్లిస్టెడ్ మార్కెట్లో రూ.2,800 వరకు ట్రేడయ్యింది. ఇక అన్లిస్టెడ్ మార్కెట్లో అధిక ధర పెట్టి రిలయన్స్ రిటైల్ షేర్లను కొనుగోలు చేసిన వారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద షాకిచ్చింది. 2023లో మైనారిటీ షేర్ హోల్డర్ల వద్దనున్న వాటాలను ఒక్కోటీ రూ.1,362 చొప్పున కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.అన్లిస్టెడ్ మార్కెట్లో అప్పటికి ఒక్కో షేరు రూ.2,700 ధర వద్ద ట్రేడవుతోంది. దీన్ని బట్టి అన్లిస్టెడ్ మార్కెట్లో ధరలు సహేతుక స్థాయిలో ఉండవన్న విషయం సుస్పష్టం. అన్లిస్టెడ్ మార్కెట్లో ధరల ఆధారంగా కంపెనీలు ఐపీవో ధరను నిర్ణయించవ ని అర్థం చేసుకోవాలి. అప్పటి మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్లలో ఆసక్తికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, లీడ్ మేనేజర్లు షేర్ల ధరల శ్రేణిని నిర్ణయిస్తుంటాయి. కనుక ఐపీవోకి ముందే కొనుగోలు చేయడం ద్వారా లాభం పొందుతామన్న గ్యారంటీ ఉండదని ఈ నిదర్శనాలను చూసి అర్థం చేసుకోవాలి.రిస్క్ లను పరిశీలించాలి.. అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు చిక్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ‘అన్లిస్టెడ్ మార్కెట్లో షేర్ల ధరలు పారదర్శకంగా ఉండవు. సెంటిమెంట్, కంపెనీకి సంబంధించి ప్రచారం, అంతర్గత సమాచారం ఆధారంగా మానిప్యులేషన్ (కృత్రిమంగా ధరలను ప్రభావితం చేయడం)కు అవకాశం ఉంటుంది. లిక్విడిటీ మరో పెద్ద సమస్య. అవసరమైనప్పుడు సులభంగా కొనుగోలు, విక్రయం సాధ్యపడదు. లావాదేవీలను ఎక్సే్ఛంజ్ ద్వారా కాకుండా మధ్యవర్తుల సాయంతో చేయాల్సి ఉంటుంది. ఇందులో పారదర్శకత ఉండదు. పెట్టుబడి మొత్తాన్ని ముందుగానే చెల్లించినప్పటికీ షేర్లను డెలివరీ చేయకపోవచ్చు. ఇంతటితో రిస్క్ లు ముగియలేదు. కంపెనీల విలువలను మదింపు వేయడం కూడా కష్టమే.అన్లిస్టెడ్ కంపెనీలు లిస్టెడ్ కంపెనీల మాదిరి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించవు. కనుక ఆయా కంపెనీల వ్యాపారం, నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం. పైగా సంబంధిత కంపెనీ ఎప్పటికీ లిస్టింగ్కు రాకపోతే అందులో పెట్టుబడి నిలిచిపోవచ్చు. ని ధుల సమీకరణ కోసం మరిన్ని షేర్లను జారీ చే స్తూ వెళుతుంటే అప్పటికే ఉన్న షేర్ల ధరల్లో సర్దుబాటు ఉంటుంది’ అని ఆనంద్రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి వివరించారు. పైగా వీటిపై సెబీ పర్యవేక్షణ ఉండదన్న విషయాన్ని గుర్తు చేశారు. జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ సైతం ఎక్స్ వేదికగా ఇటీవలే దీనిపై ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు లిస్టింగ్తో లాభాలు పొందొచ్చన్న ధోరణితో కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐపీవోను ప్రస్తావించారు. పారదర్శకత లేమి, తక్కువ లిక్విడిటీ (షేర్ల లభ్యత), నియంత్రణల మధ్య పనిచేయకపోవడం వల్ల రెగ్యులర్ స్టాక్ మార్కెట్తో పోల్చితే అన్లిస్టెడ్ మార్కెట్లో రిస్క్ ఎంతో ఎక్కువని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని, పెట్టుబడికి ముందు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ విషయమై ఇన్వెస్టర్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అన్లిస్టెడ్ సెక్యూరిటీలు లేదా అన«దీకృత ఎల్రక్టానిక్ ప్లాట్ఫామ్ల్లో లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించింది. ఆయా ప్లాట్ఫామ్లలో సెక్యూరిటీల లావాదేవీలకు సెబీ అనుమతి లేదని.. సెక్యూరిటీల చట్టం 1956కు విరుద్ధంగా అవి నడుస్తున్నట్టు పేర్కొంది.విలువలు కీలకం..రిలయన్స్ రిటైల్ ఉద్యోగులకు కేటాయించిన స్వల్ప వాటాలను వారు అన్లిస్టెడ్ మార్కెట్లో విక్రయించడంతో.. సరఫరా పరిమితంగా ఉండి ధర విపరీతంగా పెరిగిపోయింది. 2019లో రూ.400 వద్దనున్న షేరు 2021 నాటికే రూ.4,000కి పెరిగిపోవడం గమనార్హం. చివరికి 2023లో ఒక్కో షేరుకు రిలయన్స్ కట్టిన ధర రూ.1,362. ఆరంభంలో కొనుగోలు చేసి ఉంటే, ఈ ధరపైనా మంచి లాభమే వచ్చి ఉండేది. కంపెనీ ఆరి్థక మూలాలను అనుసరించి, సహేతుక ధరల వద్ద అన్లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చు.కానీ, అన్లిస్టెడ్ మార్కెట్లో డిమాండ్ లేని షేర్లే సహేతుక ధరల వద్ద లభిస్తుంటాయి. క్రేజీ షేర్లు ఎప్పుడు అసాధారణ ధరలపైనే ట్రేడవుతుంటాయి. వారీ ఎనర్జీస్ ఒక్కో షేరు ధర అన్లిస్టెడ్ మార్కెట్లో రూ.2,500 ఉంటే కంపెనీ ఐపీవోలో నిర్ణయించిన ధర రూ.1,500. కానీ, ఒక్కో షేరు రూ.2,500 వద్ద లిస్ట్ అయింది. ఇప్పుడు రూ.3,000కు పైనే ట్రేడవుతోంది. ఇలా ఒక్కో కంపెనీకి సంబంధించి అనుభవం వేర్వేరుగా ఉంటుంది. కనుక మంచి యాజమాన్యం, వ్యాపారపరమైన బలాలు, పటిష్టమైన ఆరి్థక మూలాలు కలిగి, ఆకర్షణీయమైన విలువల వద్ద లభిస్తేనే అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఆల్టీయస్ ఇన్వెస్టెక్, ఇన్క్రెడ్ మనీ, అన్లిస్టెడ్ జోన్ ఇలా పదుల సంఖ్యలో బ్రోకర్లు అన్లిస్టెడ్ మార్కెట్లో కీలకంగా పనిచేస్తున్నారు.ధరల్లో అస్థిరతలురెగ్యులర్ స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీ కొనుగోలు, విక్రయ లావాదేవీలను సులభంగా నిర్వహించుకోవచ్చు. సెబీ పర్యవేక్షణ లేని అన్లిస్టెడ్ మార్కెట్లో లావాదేవీల పూర్తికి కొన్ని రోజుల సమయం పడుతుంది. సంప్రదాయ స్టాక్ బ్రోకర్లు సెబీ నియంత్రణల కింద పనిచేస్తుంటారు. కనుక ముందస్తుగా చేసే చెల్లింపులకు భరోసా ఉంటుంది. అన్లిస్టెడ్ మార్కెట్లో కొనుగోలుకు సరిపడా మొత్తాన్ని ముందుగానే మధ్యవర్తుల ఖాతాలకు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు షేర్లను డెలివరీ చేస్తారు. షేర్లు విక్రయించాలనుకుంటే ముందుగా షేర్లను వారి ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత నగదు బదిలీ చేస్తారు. బ్రోకర్ విశ్వసనీయతపైనే లావాదేవీల సాఫల్యత ఆధారపడి ఉంటుంది. బ్రోకర్ చేతులెత్తేస్తే న్యాయపరంగా పోరాడడం మినహా మరో మార్గం ఉండదు. పైగా అమ్మకం, కొనుగోలు ధరకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఈ వ్యత్యాసమే బ్రోకర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.ఆరు నెలలు వెయిటింగ్..ఐపీవోకి ముందు అన్లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లిస్టింగ్ తర్వాత విక్రయించి లాభం పోగేసుకుందామని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే లిస్టింగ్ అయిన నాటి నుంచి ఆరు నెలల తర్వాతే వారు విక్రయించుకోగలరు. ఆరు నెలల లాకిన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఐపీవోకి ముందు ఇన్వెస్ట్ చేసిన వారు అంతకాలం ఆగిన తర్వాతే సెక్యూరిటీలను విక్రయించుకోగలరు. అప్పటికి స్టాక్ ధర ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఓయో కంపెనీ గత రెండేళ్లుగా ఐపీవో సన్నాహాలతో ఉంది. ఎప్పటికప్పుడు ఐపీవో వాయిదా పడుతోంది. కనుక త్వరలో ఐపీవోకి వస్తే విక్రయించుకోవచ్చన్న ఆశయంతో పెట్టుబడులు పెట్టేయడం సరికాదు.డిమాండ్ ఉన్న షేర్లలో చెన్నై సూపర్ కింగ్స్ షేరు ఒకటి. కానీ ఎప్పుడు ఐపీవోకి వస్తుందో తెలియని పరిస్థితి. ‘వ్యాపార పరంగా నిరూపించుకుని, స్టాక్ మార్కెట్లో సహేతుక వ్యాల్యుయేషన్ల వద్ద ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉండగా, క్రేజీ వ్యాల్యుషన్లతో అన్లిస్టెడ్ మార్కెట్లో తక్కువ లిక్విడిటీతో ట్రేడ్ అవుతున్న వాటి జోలికి పోవడం ఎందుకు?’ అని స్ట్రేజీ స్టార్టప్ సీఈవో మోహిత్ భండారీ ప్రశి్నంచారు. ఆరంభ స్థాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, అందుకు ఏంజెల్ ఇన్వెస్టింగ్ మంచి మార్గమని సూచించారు. -
మ్యూచువల్ ఫండ్స్లోకి మరో కొత్త కంపెనీ.. సెబీ నుంచి లైసెన్స్
ద వెల్త్ కంపెనీ అస్సెట్ మేనేజ్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (పాంటోమ్యాథ్ గ్రూప్ సంస్థ) మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెబీ నుంచి తుది ఆమోదం పొందినట్టు ప్రకటించింది. దీంతో రూ.74 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ‘ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్’ పేరుతో అధికారికంగా ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్టు తెలిపింది.సెబీ నుంచి సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18న మంజూరైనట్టు పేర్కొంది. సాధారణంగా ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో కనిపించే డేటా ఆధారిత పరిశోధన, వినూత్నమైన బోటమ్ అప్ విధానాలను తమ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం జూమ్ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 748 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 604 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం జంప్చేసి రూ. 968 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 775 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ నిర్వహణలోని సగటు ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 6.71 లక్షల కోట్ల నుంచి రూ. 8.3 లక్షల కోట్లకు బలపడింది. -
మళ్లీ లకారం దాటిన బంగారం!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల ప్రక్షాళన!
న్యూఢిల్లీ: బంగారం, వెండి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) నిర్వహణలోని భౌతిక బంగారం, వెండి విలువ మదింపునకు సెబీ నడుం బిగించింది. మరింత పారదర్శకతకు తోడు, స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా స్థిరత్వం కోసం కీలక ప్రతిపాదనలు చేసింది. అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్లు ప్రకటించే స్పాట్ ధరలను ఈటీఎఫ్ల నిర్వహణలోని బంగారం, వెండి విలువ మదింపునకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తన ముసాయిదా నిబంధనల్లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్లు తమ నిర్వహణలోని భౌతిక బంగారం విలువ మదింపునకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్బీఎంఏ) ధరలను అనుసరిస్తున్నాయి. ట్రాయ్ ఔన్స్ బంగారం ధర యూఎస్ డాలర్ల రూపంలో ఉంటుండగా.. మారకం రేటు ఆధారంగా బంగారం, వెండి విలువను నిర్ణయిస్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్లకు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎల్బీఎంఏ స్థానంలో దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్లు ప్రకటించే బంగారం, వెండి ధరలను అనుసరించేలా సెబీ ప్రతిపాదించింది. స్పాట్ ధరల విషయంలోనూ పోలింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే బెంచ్మార్క్ ఉండేలా చూడనుంది. దీనిపై ఆగస్ట్ 6 వరకు సలహా, సూచనలను అందించాలని సెబీ కోరింది. -
బంగారం ధరలు మళ్లీ ఇలా.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు ఈరోజూ అంతే స్థాయిలో పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదులుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీ వంటి సంస్థలు ప్రకటించిన జూన్ త్రైమాసికం (Q1FY26) ఫలితాలకు ఇన్వెస్టర్లు స్పందించడంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారత్పై అమెరికా 10-15 శాతం సుంకం విధించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.ఉదయం 9.34 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 161.82 (0.20%) పాయింట్లు క్షీణించి 82,097.4 వద్ద, నిఫ్టీ 50 36.85 (0.15%) పాయింట్లు క్షీణించి 25,099 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం నష్టపోయాయి.నేటి క్యూ1 ఫలితాలురిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ జింక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎల్టీ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, అతుల్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఇండియామార్ట్ ఇంటర్మేష్, మాస్టెక్, ఎంపీఎస్, ఆర్తి డ్రగ్స్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, శివ సిమెంట్, కేరళ ఆయుర్వేద, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్, అసోసియేటెడ్ స్టోన్ ఇండస్ట్రీస్ (కోటా) తదితర కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. -
వంట నూనెల కంపెనీలకు సవాళ్లు!
ముంబై: వంట నూనెల రిఫైనరీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా వాటి ఆదాయం 2–3 శాతం మేర తగ్గి, రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అమ్మకాలు మాత్రం 2024–25తో పోల్చి చూస్తే 2.8–3 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ మార్జిన్ 0.30–0.50 శాతం వరకు తగ్గి 3.3–3.5 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. మూలధన అవసరాలు, వ్యయాలు తక్కువగా ఉండడం కారణంగా వాటి పరపతి ప్రొఫైల్ స్థిరంగా ఉంటుందని తన నివేదికలో క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మన దేశ వంట నూనెల వినియోగంలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. నూనెల దిగుమతుల్లో 50 శాతం పామాయిల్ కాగా, సోయాబీన్, సన్ఫ్లవర్ ఇతర నూనెల వాటా మిగిలిన 50 శాతంగా ఉంటోంది. సోయాబీన్ మినహా మిగిలిన ప్రధాన వంట నూనెలు అయిన సన్ఫ్లవర్, పామాయిల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీల ఆదాయం కొంత క్షీణతను చూడనున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. బయోడీజిల్ తయారీ డిమాండ్ కారణంగా సోయాబీన్ నూనెల ధరలు పెరిగినట్టు తెలిపింది. బ్రాండెడ్ కంపెనీల మార్జిన్లపై అధిక ప్రభావం‘‘ఈ ఏడాది అమ్మకాలు స్థిరంగా 2.8–3% మేర వృద్ధి చెందొచ్చు. 25.5–26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండొచ్చు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి 2.7 శాతం కంటే ఎక్కువే. గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర విభాగాల నుంచి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ జయశ్రీ నందకుమార్ పేర్కొన్నారు. అమ్మకాలు పెరగడం వల్ల ఆదాయ క్షీణత 2–3 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. కంపెనీలు సాధారణంగా 40–50 రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు నిర్వహిస్తుంటాయి కనుక, ధరలు తగ్గడం వాటి మార్జిన్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. నాన్ బ్రాండెడ్ కంపెనీలతో పోలి్చతే బ్రాండెడ్ కంపెనీలు ఎక్కువ ఇన్వెంటరీలు (నిల్వలు) కలిగి ఉంటాయని, కనుక వాటి మార్జిన్లపై ఎక్కవ ప్రభావం పడుతుందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఫలితంగా రవాణా వ్యయాలు అధికమైతే.. అది నూనెల ధరలు ఎగిసేందుకు దారితీయొచ్చని అంచనా వేసింది.చౌక దిగుమతుల నుంచి రక్షణ ముడి నూనెలు, రిఫైనరీ నూనెల (శుద్ధి చేసిన) దిగుమతులపై భిన్నమైన సుంకాలతో పరిశ్రమకు ప్రభుత్వం మద్దతుగా నిలిచినట్టు క్రిసిల్ నివేదిక గుర్తు చేసింది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించగా, అదే సమయంలో రిఫైనరీ నూనెలపై 35.75 శాతం కస్టమ్స్ డ్యూటీని కొనసాగించడాన్ని ప్రస్తావించింది. ఈ చర్య చౌక దిగుమతుల నుంచి దేశీ నూనె రిఫైనరీ సంస్థలకు రక్షణ నివ్వడమే కాకుండా, నూనెల ధరలు 5 శాతం వరకు తగ్గడానికి దారితీసినట్టు తెలిపింది.