breaking news
Market
-
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.25 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 83,013.96 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 25,421.00 వద్ద నిలిచాయి.టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్, దీపక్ బిల్డర్స్ & ఇంజనీర్స్ ఇండియా, షాలిమార్ పెయింట్స్, జీటీఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, ఎక్స్ప్రో ఇండియా, బ్రాండ్ కాన్సెప్ట్స్, రుషిల్ డెకర్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు..
న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.‘‘యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటుతటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్ ఫ్యూచర్స్లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ బిట్కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటుయూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025 -
కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరలు చాన్నాళ్ల తరువాత తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు గరిష్టంగా.. రూ.550 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. పసిడి ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది. కాగా ఈ రోజు (సెప్టెంబర్ 18) పసిడి ధరలు ఏ నగరంలో ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,400 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:23 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 25,407కు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు పుంజుకొని 82,981 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 96.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.07 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.1 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.33 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏఎంసీ షేర్ల హవా
దేశీ స్టాక్ మార్కెట్లను మించుతూ గత ఆరు నెలలుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 10 శాతం పుంజుకోగా.. లిస్టెడ్ కంపెనీల షేర్లు 50–30 శాతం మధ్య పురోగమించాయి. ప్రధానంగా దేశీ పెట్టుబడులు జోరందుకోవడం ఇందుకు సహకరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. కుటుంబ ఆదాయాలు బలపడటం, పెట్టుబడి అవకాశాలపట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటలైజేషన్తోపాటు.. మార్కెట్లో సరళతర లావాదేవీలకు వీలు ఏర్పడటం వంటి అంశాలు కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా పొదుపునకు వెచ్చించగల ఆదాయాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వివిధ పెట్టుబడి విభాగాలపై దృష్టిపెడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారం, రియల్టీ తదితర ఫిజికల్ ఆస్తుల నుంచి పొదుపు ఆలోచన ఆర్థిక మార్గాలవైపు మళ్లుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు దేశీయంగా రిటైలర్లు ఈక్విటీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బత్తిని పేర్కొన్నారు. ఫలితంగా విభిన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. వెరసి మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)కు చెందిన క్రమానుగత పెట్టుబడి(సిప్) పథకాలు, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు) తదితరాలకు పెట్టుబడులు తరలివస్తున్నట్లు వివరించారు. సిప్ల దన్నుబీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆస్తుల నిర్వహణా పరిశ్రమలోని లిస్టెడ్ దిగ్గజాలలో అత్యధికంగా నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ స్టాక్స్ గత ఆరు నెలల్లో 53 శాతానికిపైగా దూసుకెళ్లాయి. ఈ బాటలో యూటీఐ ఏఎంసీ 48 శాతం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 40 శాతం జంప్చేయగా.. శ్రీరామ్ ఏఎంసీ 23 శాతం, కేఫిన్ టెక్నాలజీస్ 22 శాతం చొప్పున ఎగశాయి. ప్రధానంగా పసిడి, వెండిపై ఇన్వెస్ట్ చేసే కుటుంబ ఆదాయాలు విభిన్న పెట్టుబడి పథకాలవైపు ప్రయాణిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎఫ్లకు తరలి వస్తున్న పెట్టుబడులు, నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ భారీగా మెరుగుపడటం, సిప్ల ద్వారా రిటైలర్ల నిరవధిక పెట్టుబడులు ఏఎంసీ కంపెనీల షేర్లకు జోష్నిస్తున్నట్లు తెలియజేశారు.పెట్టుబడుల తీరిలా నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం గత నెల(ఆగస్ట్)లో ఈక్విటీలలోకి నికర పెట్టుబడులు నెలవారీగా చూస్తే 25 శాతం క్షీణించి రూ. 42,360 కోట్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రపంచస్థాయిలో భౌగోళిక, రాజకీయ అస్థిరతలు కొంతమేర ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే సిప్ పథకాలకు నిలకడగా రూ. 28,270 కోట్లు ప్రవహించడం రిటైల్ ఇన్వెస్టర్ల కట్టుబాటును సూచిస్తున్నట్లు ప్రస్తావించారు! ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో ఎంఎఫ్ల ఏయూఎం 11 శాతం బలపడి రూ. 74.41 లక్షల కోట్లను తాకాయి. ఇందుకు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ దన్నునిచ్చాయి. ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ వివరాల ప్రకారం ఈ కాలంలో ఏయూఎం రూ. 7 లక్షల కోట్లమేర పుంజుకుంది. నికరంగా రూ. 4.18 లక్షల కోట్ల పెట్టుబడులు జమయ్యాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వస్తున్నాయ్ కొత్త ఐపీవోలు.. కొనుక్కోండి షేర్లు
సోలార్ ఫొటొ వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 442–465 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. కంపెనీ లిస్టయితే రూ. 5,910 కోట్ల మార్కెట్ విలువను అందుకునే వీలుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 477 కోట్లు సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయనుంది. ఒడిషాలోని గోపాల్పూర్ ఇండ్రస్టియల్ పార్క్లో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 166.5 కోట్లు అనుబంధ సంస్థ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2025 జూన్30కల్లా 3.8 గిగావాట్ల సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టుఎండ్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సంబంధ సర్వీసులను కంపెనీ సమకూర్చుతోంది.జీకే ఎనర్జీ @ రూ. 145–153 సౌర విద్యుత్(సోలార్ పవర్) ఆధారిత వ్యవసాయ నీటి పంప్ సిస్టమ్స్ అందించే జీకే ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 145–153 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 65 కోట్ల విలువైన 42 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 465 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను విక్రయించనుంది.ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 323 కోట్లు కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సోలార్ పవర్ వ్యవసాయ పంప్ సిస్టమ్స్కు కంపెనీ పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కమిషనింగ్(ఈపీసీ) సేవలు సమకూర్చుతోంది. తద్వారా రైతులకు వీటికి సంబంధించిన సర్వే, డిజైన్, సప్లై, అసెంబ్లీ, ఇన్స్టలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ఏకీకృత సర్వీసులు అందిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 98 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
బ్యాంక్, ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరుతుందన్న ఆశాభావంతో భారత ఈక్విటీ సూచీలు సానుకూలంగా కదిలాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ వెనుకబడి ఉన్నాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.5 శాతం నష్టపోయింది. -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,307కు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు పుంజుకొని 82,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెండు నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 25,239 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి సూచీలకి రెండు నెలల గరిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలు, పండుగ డిమాండ్ రికవరీపై ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమవ్వొచ్చనే ఆశలతో ఐటీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 658 పాయింట్లు బలపడి 82,443 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 25,261 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ అధిక వెయిటేజీ ఎల్అండ్టీ(2%), కోటక్ మహీంద్రా(2.50%), మహీంద్రా (2.2%), మారుతీ (2%), టీసీఎస్ (1%) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 352 పాయింట్లు కావడ విశేషం. -
సరికొత్త శిఖరాలకు పసిడి
న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి రూ.1,15,100 స్థాయికి చేరింది. ఇదొక సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి. డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడంతో ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం కొత్త గరిష్టానికి చేరింది.కిలోకి రూ.570 పెరిగి రూ.1,32,870 స్థాయిని నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్ భేటీలో భారీ రేట్ల కోత దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తీసుకురావడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ డాలర్ బలహీనతకు తోడు, ఫెడ్ ఒకటికి మించిన రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలతో మంగళవారం బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరినట్టు చెప్పారు.పది వారాల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ బలహీనపడినట్టు తెలిపారు. రేట్ల కోత దిశగా ఫెడ్ సానుకూల వైఖరి, భారత్, చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన పరిణామాలతో ట్రేడర్లు బంగారంలో లాంగ్ పొజిషన్లను కొనసాగిస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం లాభాలతో కొనసాగుతూ 3,739 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది. -
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్లో మాట్లాడుతూ.. తన పోర్ట్ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్కాయిన్ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్కాయిన్ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 594.95 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో.. 82,380.69 వద్ద, నిఫ్టీ 169.90 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 25,239.10 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. కొఠారి ప్రొడక్షన్, రవీందర్ హైట్స్, రెడింగ్టన్, లక్ష్మీ డెంటల్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరాయి. శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, మాగ్నమ్ వెంచర్స్, థెమిస్ మెడికేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
82,000 మార్కు చేరిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 25,128కు చేరింది. సెన్సెక్స్(Sensex) 216 పాయింట్లు పుంజుకుని 82,002 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
7 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఊగిసలాడుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సెబీ తాజాగా 7 కంపెనీలను అనుమతించింది. జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్,కెనరా రొబెకో, హీరో మోటర్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 55 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా సుమారు రూ. 75,000 కోట్లు సమీకరించాయి. మరో 12 కంపెనీలు రెండు, మూడు వారాల్లో ఐపీవోకు రానున్నాయి. తాజా వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇటీవల జోరుగా లిస్టవుతున్న పలు కంపెనీల బాటలో మరో 7 కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు దారి ఏర్పడింది. సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల సమీకరణ బాటలో సాగనున్నాయి. ఐపీవోకు అనుమతి పొందిన కంపెనీల జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రొబెకో ఏఎంసీ, హీరో మోటార్స్సహా ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, పైన్ ల్యాబ్స్, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఎంటీఆర్ ఫుడ్స్ చేరాయి. ఈ ఏడాది(2025) ఏప్రిల్–జూలై మధ్య ఈ కంపెనీలన్నీ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వెరసి ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మర్చంట్ వర్గాలు తెలియజేశాయి. అత్యధిక శాతం కంపెనీలు ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. మరోవైపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులకు తమ పెట్టుబడులు విక్రయించేందుకు సైతం వీలు కల్పించనున్నాయి. జీవిత బీమా సంస్థ పీఎస్యూ దిగ్గజం కెనరా బ్యాంక్ బీమా అనుబంధ సంస్థ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా సంస్థ 23.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు, ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ సైతం 47 లక్షల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ను కెనరా బ్యాంక్, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ గ్రూప్ ప్రమోట్ చేశాయి. 2024 మార్చికల్లా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం)రీత్యా మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.ఫిన్టెక్ కంపెనీపీఈ దిగ్గజాలు టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఫిన్టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 2,600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు మరో 14.78 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లోక్వీర్ కపూర్సహా.. టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్, యాక్టిస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 870 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 760 కోట్లు క్లౌడ్, డిజిటల్ చెక్ఔట్ పాయింట్లు తదితర ఐటీ మౌలికసదుపాయాలపై వెచి్చంచనుంది.రూ. 1,200 కోట్లపై కన్నుపబ్లిక్ ఇష్యూలో భాగంగా హీరో మోటార్స్ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రమోటర్ సంస్థలలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ. 390 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్లోగల యూనిట్ విస్తరణకు రూ. 237 కోట్లు(పరికరాల కొనుగోలుకి) వెచి్చంచనుంది.అసెట్ మేనేజ్మెంట్ఐపీవోలో భాగంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ).. కెనరా రొబెకో ఏఎంసీ 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని సంస్థ ప్రమోటర్లు కెనరా బ్యాంక్(2.59 కోట్ల షేర్లు), ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్వీ(2.39 కోట్ల షేర్లు) ఆఫర్ చేయనున్నాయి. వెరసి ఐపీవో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి.సోలార్ పరికరాలుఐపీవో ద్వారా సోలార్ పరికరాల తయారీ కంపెనీ ఎమ్వీ ఫొటొవోల్టాయిక్ పవర్ రూ. 3,000 కోట్లు అందుకోవాలని ప్రణాళికలు వేసింది. వీటిలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 2,144 కోట్లు, ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 856 కోట్లు చొప్పున సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,608 కోట్లు అనుబంధ సంస్థలతోపాటు కంపెనీ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఒర్క్లా ఇండియాఎంటీఆర్ ఫుడ్స్, ఈస్టర్న్ బ్రాండ్లతో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు విక్రయించే ఒర్క్లా ఇండియా(మాతృ సంస్థ) ఐపీవో ద్వారా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లతోపాటు.. ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. మణిపాల్ పేమెంట్బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ కార్ట్ తయారీ కంపెనీ మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఐపీవో బాటలో మెడికవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్కేర్ సేవల దిగ్గజం మెడికవర్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుత రుణభారం సుమారు రూ.1,000 కోట్లుగా ఉంది. సంస్థ సీఎండీ అనిల్ కృష్ణ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. కొత్తగా రెండు ఆస్పత్రులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. గ్రూప్లో 24వదైన సికింద్రాబాద్ హాస్పిటల్ను మంగళవారం (నేడు) ప్రారంభించనుండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో మరొకటి (500 బెడ్స్ సామర్థ్యం) అందుబాటులోకి వస్తుందని కృష్ణ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం సుమారు రూ. 1,850 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇక కొత్త ఆస్పత్రితో కలిపి నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) పడకల సామర్థ్యం 5,800గా ఉంటుందని కృష్ణ చెప్పారు. హైదరాబాద్ చందానగర్లో 150 పడకల విస్తరణతో మొత్తం బెడ్స్ సంఖ్య 6,400కి చేరుతుందన్నారు. ఐపీవోకి సంబంధించి వంద కోట్ల డాలర్ల దాకా వేల్యుయేషన్ అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ ... ప్రస్తుతం తమకు కార్యకలాపాలున్న ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కృష్ణ తెలి పారు. బెంగళూరు, పుణేల్లాంటి నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించారు. అవకాశం వస్తే 300 –350 బెడ్స్ సామర్థ్యాలు ఉండే ఇతర ఆస్పత్రుల కొనుగోలు అంశాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. సాధా రణంగా లీజు ప్రాతిపదికన ప్రాంగణాలను తీసుకుంటున్న తాము ఇకపై తమ కార్యకలాపాల కోసం పూర్తి స్థాయిలో ప్రాపర్టీని కొనుగోలు చేయడంపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రతిభావంతులైన వైద్యుల కొరత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అధునాతన టెక్నాలజీ గల పరికరాల దిగుమతి వ్యయాలు పెరిగిపోవడమనేది, చికిత్స వ్యయాల పెరుగుదలకు దారితీస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన, కచి్చతమైన చికిత్సను అందించడంలో కృత్రిమ మేథ (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని కృష్ణ చెప్పారు. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’ను ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్ అని సంస్థ ఎండీ మధు లూనావత్ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్ఐ దీనికి బెంచ్మార్క్గా ఉంటుందని పేర్కొన్నారు.ప్రైవేట్ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్ గ్రూప్లో ది వెల్త్ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (ఏఐఎఫ్)ను కూడా నిర్వహిస్తోంది.హెచ్డీఎఫ్సీ ‘డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్’ ఎఫ్వోఎఫ్ .. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.పలు ఫండ్ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్తో పొందవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. ఎన్ఎఫ్వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ తొలి ఫండ్.. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు మందగించాయి. అయితే ఈ వారం చివర్లో రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు దృష్టి సారించారు. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు లేదా 0.15 శాతం స్వల్పంగా తగ్గి 81,785.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 44.8 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 25,069.2 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్ లో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటాన్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.అయితే, విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.44 శాతం, 0.76 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.41 శాతం పెరిగి టాప్ గెయినర్ గా ఉంది. ఫ్లిప్ సైడ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.64 శాతం క్షీణించాయి. -
జియో బ్లాక్రాక్ తొలి ఫండ్..
జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ తొలి యాక్టివ్ ఈక్విటీ ఫండ్ ‘జియోబ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్’ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 23న ప్రారంభం కానుంది. ‘‘ఇది మాకు తొలి యాక్టివ్ ఫండ్ అవుతుంది. మరో మూడు నాలుగు యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈటీఎఫ్లను సైతం తీసుకొస్తాం’’అని జియోబ్లాక్రాక్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రిషి కోహ్లీ ప్రకటించారు.అంతర్జాతీయంగా నిరూపితమైన ఎస్ఏఈ ప్లాట్ఫామ్పై దీన్ని నిర్మించామని, 400 సంకేతాల ఆధారంగా, టెక్నాలజీ సాయంతో పెట్టుబడులు పెట్టనున్నట్టు, దీనివల్ల వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి రిస్క్ తగ్గుతుందని జియోబ్లాక్రాక్ తెలిపింది.నష్టాల రిస్క్ను పరిమితం చేయడం, స్థిరమైన రాబడిని తెచ్చిపెట్టడం జియోబ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లక్ష్యమని పేర్కొంది. జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ అన్నది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్రాక్ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ కంపెనీ కావడం గమనార్హం. -
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు (సెప్టెంబర్ 15) తెలుగు రాష్ట్రాల్లో సహా చెన్నై, ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,092కు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 81,869 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.45 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపించగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫైనాన్షియల్ మార్కెట్లతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సైతం ఫెడ్ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నాయి. మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక టెక్నికల్ అంశాల ప్రకారం మార్కెట్లు ఈ వారం బ్రేకవుట్ సాధించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.దేశీయంగా నేడు(15న) ఆగస్ట్ నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 2025 జూలైలో డబ్ల్యూపీఐ మైనస్ 0.45 శాతంగా నమోదైంది. అయితే గత నెలలో 0.45 శాతం పెరిగే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఇతర కీలక విభాగాలలో ధరల పెరుగుదల కారణంకానున్నట్లు అంచనా వేశారు. కాగా.. గత వారాంతాన విడుదలైన వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 2.07 శాతానికి చేరింది. జూలైలో 1.61 శాతం కాగా, గత నెలలో కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, నూనెలు, కొవ్వు ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రభావం చూపింది. ఇవికాకుండా యూఎస్తో వాణిజ్య వివాదాలకు చెక్ పడటంపై సానుకూల సంకేతాలు వెలువడితే దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. కనీసం పావు శాతం ఫెడరల్ రిజర్వ్ చైర్పర్శన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఈ నెల 16 నుంచి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) రెండు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించనుంది. యూఎస్ ఉపాధి మార్కెట్ నీరసించిన నేపథ్యంలో 17న ఫెడరల్ ఫండ్స్(కీలక వడ్డీ) రేటులో కోత పెట్టనున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సీపీఐ జూలైలో 0.2 శాతంకాగా.. ఆగస్ట్లో 0.4 శాతానికి ఎగసింది. దీంతో వార్షిక ద్రవ్యోల్బణం 2.9 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి పాలసీ సమావేశంలో ఉద్యోగ కల్పనకు దన్ను, ధరల తగ్గింపును ఫెడ్ కీలక లక్ష్యాలుగా ఎంచుకునే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. కనీసం పావు శాతం కోతకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేటు 4.25–4.5% గా ఉంది. ఈ నేపథ్యంలో అటు యూఎస్, ఆసియా మార్కెట్లతోపాటు దేశీయంగానూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత బలమివ్వనున్నట్లు ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అయితే ఫెడ్ వడ్డీ కోత పెడితే దేశీ మార్కెట్లో పెట్టుబడులు పుంజుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల(ఆగస్ట్)లో దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్పీఐలు రూ. 34,900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. జూలైలోనూ రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఈ నెలలో సైతం తొలి వారంలో రూ. 12,257 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం గమనార్హం! కాగా.. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టాలకు చేరుతోంది. దీంతో అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. రూపాయి బలహీనతతో దిగుమతుల బిల్లు పెరిగి మరింత వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో వినియోగం ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా.. జీఎస్టీ సంస్కరణలు, భారత్, యూఎస్ మధ్య టరిఫ్ వివాద పరిష్కారంపై ఆశలతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,117 పాయింట్లు(1.4%) జంప్చేసి 81,905 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లుపైగా(1.4%) ఎగసి 25,114 వద్ద స్థిరపడింది.బ్రేకవుట్కు చాన్స్యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో కోతపై అంచనాలు, జీఎస్టీ సంస్కరణలతో పలు రంగాలలో ఊపందుకోనున్న వినియోగం వంటి సానుకూల అంశాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చాయి. తాజా సానుకూలతల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో బ్రేకవుట్కు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. కొద్దిరోజులుగా బీఎస్ఈ సెన్సెక్స్ 79,750–82,250 పాయింట్ల శ్రేణిలో కదులుతోంది. 82,250ను అధిగమిస్తే.. 83,500–83,650 పాయింట్లకు బలపడే వీలుంది. ఒకవేళ దిగువకు చేరితే.. 81,450–81,200 స్థాయిలో మద్దతు లభించవచ్చు. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ పుంజుకుంటే 25,250ను అధిగమించవలసి ఉంటుంది. ఆపై 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. బలహీనపడితే 24,900 వద్ద తొలుత, ఆపై 24,700 వద్ద తదుపరి మద్దతు అందుకునే వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2024 సెప్టెంబర్లో దాదాపు రూ.73,200 వద్ద ఉండేది. అదే ఇప్పుడు (2025 సెప్టెంబర్) రూ.1,11,000కు చేరింది. అంటే రేటు సుమారు 54 శాతం పెరిగిందన్నమాట. గోల్డ్ ధరలు మాత్రమే కాకుండా.. గోల్డ్ ఈటిఎఫ్లు కూడా 50% వరకు రాబడిని అందించాయి. ఇది ఈటిఎఫ్లలో పెట్టుబడులను పెంచడానికి దోహదపడింది.2025 ఆగస్టులో గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు రూ.2,189.5 కోట్లు అని తెలుస్తోంది. ఏఎంఎఫ్ఐ ప్రకారం.. గోల్డ్ ఈటిఎఫ్లలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.72,495 కోట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టమవుతోంది.గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏమిటి?గోల్డ్ ఈటీఎఫ్లు అనేవి.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే మ్యూచువల్ ఫండ్ వంటిది అన్నమాట. పెట్టుబడిదారులు షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతాల ద్వారా ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, తద్వారా వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటి విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.పెట్టుబడిదారులు గోల్డ్ ఈటిఎఫ్లను ఎందుకు ఇష్టపడతారు●గోల్డ్ ఈటీఎఫ్లను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.●సాధారణ బంగారం మాదిరిగా.. గోల్డ్ ఈటిఎఫ్లనుప్రత్యేకంగా భద్రపరచాల్సిన అవసరం లేదు.●గోల్డ్ ఈటీఎఫ్లను చిన్న మొత్తంలో.. అంటే రూ. 500 లేదా రూ. 1000 కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.●గోల్డ్ ఈటీఎఫ్లకు మంచి లిక్విడిటీ ఉంటుంది. వీటిని తొందరగా అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.బంగారంపై పెట్టుబడికి మార్గాలు●గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడి●సావరిన్ గోల్డ్ బాండ్లు: వడ్డీతో పాటు, పెరిగిన ధరలను అందుకోవచ్చు●భౌతిక బంగారం: ఆభరణాలు, నాణేలు, కడ్డీలుబంగారం ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ సంఘటనలు వంటివన్నీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బంగారంపై సురక్షితమైనదని నిపుణులు చెబుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారుడే నిర్ణయం తీసుకోవాలి. -
పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారగా పెరిగాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూ నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా విషయంలో వెసులుబాటును కల్పించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితినీ సవరించనుంది. వీటితో పాటు పలు తాజా ప్రతిపాదనలను శుక్రవారం(12న) నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..ముంబై: అతి భారీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడంలో దన్నునిస్తూ సెబీ తాజాగా పలు వెసులుబాట్లకు తెరతీస్తోంది. ప్రధానంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే అంశంలో గడువును సవరించేందుకు నిర్ణయించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తదితర మెగా అన్లిస్టెడ్ కంపెనీలు లబ్ది పొందే వీలుంది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే దిగ్గజ కంపెనీలు లిస్టింగ్లోనే భారీగా వాటాను విక్రయించవలసిన అవసరం ఉండదు. పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో తగినంత గడువుకు వీలు చిక్కనుంది. 10 శాతం నుంచి తగ్గింపు కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల కంపెనీలు ఐపీవోలో ప్రస్తుత 10 శాతానికి బదులుగా 8 శాతం వాటాను విక్రయించేందుకు అనుమతిస్తారు. వీటికి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించడంలో ఐదేళ్ల గడువునిస్తారు. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా అమలవుతోంది. రూ. లక్ష కోట్లకుపైన మార్కెట్ విలువతో ఐపీవోకు వచ్చే కంపెనీలు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2.75 శాతం వాటాను ఆఫర్ చేయవచ్చు. రూ. 5 లక్షల కోట్లకు మించిన అతిభారీ కంపెనీలైతే ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయానికీ వీలుంటుంది. ఇలాంటి భారీ కంపెనీలు 10ఏళ్లలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐదేళ్లు గడువును అనుమతిస్తోంది. వెరసి అతితక్కువ స్థాయిలో వాటా విక్రయించడం ద్వారా కంపెనీలు లిస్టయ్యేందుకు వీలు చిక్కుతుంది. తదుపరి దశలవారీగా పబ్లిక్ వాటాకు తెరతీయవచ్చు. దీంతో ఓకేసారి భారీస్థాయిలో వాటా విక్రయించవలసిన అవసరం తప్పుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా భారీ ఐపీవోలకు లిక్విడిటీ సమస్య తలెత్తకుండా నివారించవచ్చని తెలియజేశారు. రిటైల్ పరిమాణం ఓకే రూ. 5,000 కోట్లకు మించిన ఐపీవోల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులను 35 శాతంగానే కొనసాగించనున్నట్లు పాండే తెలియజేశారు. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) వాటాను సైతం 50 శాతం నుంచి పెంచే ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐపీవోలలో మరింత చోటు కల్పించేందుకు వీలుగా యాంకర్ కేటాయింపులను సవరిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ప్రకారం యాంకర్ వాటా రూ. 250 కోట్లుదాటితే ఇన్వెస్టర్ల సంఖ్యను ప్రస్తుత 10 నుంచి 15కు పెంచనుంది. కనీసం 5 నుంచి గరిష్టంగా 15వరకూ అనుమతిస్తారు. ఆపై ప్రతీ రూ. 250 కోట్ల కేటాయింపులకు అదనంగా 15మంది ఇన్వెస్టర్లకు వీలుంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్కు కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడికి వీలుంటుంది. ఇదేవిధంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపుల వాటా ప్రస్తుత 33 శాతం నుంచి 40 శాతానికి పెరగనుంది. దీనిలో ఎంఎఫ్లకు 33 శాతం, జీవిత బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లకు మిగిలిన వాటాను రిజర్వ్ చేయనున్నారు. రీట్, ఇన్విట్లలో బీమా, పెన్షన్ ఫండ్స్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ నిబంధనలను సెబీ సవరించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్)సహా కొన్ని కేటగిరీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు)ను ఇందుకు అనుమతించనుంది. అంతేకాకుండా రీట్ను ఈక్విటీగా గుర్తించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రత్యేక పెట్టుబడులకు వీలుగా ఇన్విట్ను హైబ్రిడ్గా కొనసాగించనుంది. ఇన్విట్, రీట్ నిబంధనల సవరణ ద్వారా ఇన్వెస్టర్ల పరిధి మరింత విస్తరించనుంది. దీంతో రీట్, ఇన్విట్ల వ్యూహాత్మక పెట్టుబడిదారుల కేటగిరీలో విభిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వీలు చిక్కనుంది. ఇది రీట్, ఇన్విట్లకు జోష్నివ్వడంతోపాటు.. సులభ వ్యాపార నిర్వహణకు దారి ఏర్పడనున్నట్లు పాండే పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా ఫండ్స్ తదితర పలు భారీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లకు ప్రస్తుత నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపే ఆయా సంస్థలకు రీట్, ఇన్విట్లు అత్యుత్తమ అవకాశాలని సెబీ పేర్కొంది. ఎగ్జిట్ లోడ్ కుదింపు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే వ్యూహంలో భాగంగా సెబీ బోర్డు ఎంఎఫ్ పంపిణీ సంస్థలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మరింత పారదర్శక, నిలకడైన ప్రోత్సాహకాలకు దన్నునిస్తూ గరిష్ట ఎగ్జిట్ లోడ్ను ప్రస్తుత 5 శాతం నుంచి 3 శాతానికి కోత పెట్టింది. టాప్–30 పట్టణాలను దాటి ఫండ్స్లోకి కొత్తగా మహిళా ఇన్వెస్టర్లను చేర్చుకుంటే పంపిణీదారులకు అధిక ప్రోత్సాహకాలు అందేటట్లు నిబంధనలు సవరించింది.లోరిస్క్ ఎఫ్పీఐలకు సపోర్ట్ తక్కువ రిస్్కగల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను సింగిల్ విండో ద్వారా దేశీ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించనున్నారు. ఇందుకు వీలుగా సెబీ బోర్డు నిబంధనలను సవరించింది. తద్వారా ఎఫ్పీఐలకు దేశీయంగా సులభతర పెట్టుబడులకు వీలు చిక్కనుంది. లోరిస్క్ ఎఫ్పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో సులభంగా పెట్టుబడులు చేపట్టేందుకు స్వాగత్–ఎఫ్ఐ పేరుతో తెరతీయనున్న సింగిల్ విండో దారి చూపనుంది. దీంతో యూనిఫైడ్ రిజి్రస్టేషన్ విధానం ద్వా రా విభిన్న పె ట్టుబడి మార్గాలలో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని పాండే తెలియజేశారు. ఫలితంగా పెట్టుబడుల విష యంలో ఎఫ్పీఐలకు పదేపదే ఎదురయ్యే నిబంధనలు, భారీ డాక్యుమెంటేషన్ వంటి అవరోధాలు తొలగిపోనున్నట్లు వివరించారు. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ సొంత ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యంత నియంత్రణలతోకూడిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ చేరనున్నట్లు వెల్లడించారు. స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాల ను ఎఫ్ఫీఐలతోపాటు.. విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్వీసీఐలు)కు వర్తించనున్న ట్లు పేర్కొన్నారు. 2025 జూన్30కల్లా దేశీయంగా 11,913 మంది ఎఫ్పీఐలు రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించింది. రూ. 80.83 లక్షల కోట్ల ఆస్తులను హోల్డ్ చేస్తున్నట్లు తెలియజేసింది. -
బంగారం @ 1,13,800
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం ఈ విలువైన లోహాలు సరికొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.700 పెరగడంతో రూ.1,13,800 స్థాయిని నమోదు చేసింది. వెండి కిలోకి ఏకంగా రూ.4,000 పెరిగి 1,32,000ను తాకింది. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘‘ఇటీవలి యూస్ ఆర్థిక డేటాతో ఫెడ్ 2025లోనే ఒకటికి మించిన విడతల్లో రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో బంగారంలో కొనుగోళ్లు పెరిగాయి’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పారిశ్రామిక డిమాండ్కు తోడు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి బలమైన పెట్టుబడుల ప్రవాహంతో వెండి ధరలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి లాభాన్నిచ్చాయి. ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు రూ.34,850 (44 శాతం), వెండి ధర కిలోకి రూ.42,300 (47 శాతం) చొప్పున పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 3,683 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 25,107.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్టైల్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం వంటి కంపెనీలు చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ. లక్ష.. కోటి రూపాయలైంది..!
స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర 2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది. అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ది. 2025 జూన్ 30 నాటికి ఈ కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.ఒలెక్ట్రా గురించి.. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్2, టైర్3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్ బస్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.) -
పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారం మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,054కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 పాయింట్లు పుంజుకుని 81,691 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.83 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.85 శాతం పెరిగింది.నాస్డాక్ 0.72 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్ఫీ18,000 వేల కోట్ల రికార్డ్ బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి అంగీకరించింది. గురువారం (11న) సమావేశమైన బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్ఈలో ముగింపు ధర రూ. 1,510తో పోలిస్తే బైబ్యాక్కు 19 శాతం ప్రీమియంను నిర్ణయించింది. కంపెనీ 2025 జూన్ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల (రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్ ఫ్లోను ప్రకటించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 2021లో 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టింది. ఇన్ఫోసిస్ షేరు 1.5% క్షీణించి రూ. 1,510 వద్ద ముగిసింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 123.58 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 81,548.73 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,005.50 వద్ద నిలిచాయి.స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్, గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గుడ్ లక్ ఇండియా, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైనమిక్ ప్రొడక్ట్స్(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడుల జోరు ఆగస్ట్లో కొంత తగ్గింది. రూ.33,430 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. జూలైలో రూ.42,702 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్లో రూ.23,587 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2024 ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.38,239 కోట్లుగా ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,980 కోట్లు నికరంగా బయటకు వెళ్లాయి. జూలైలో రూ.1.06 లక్షల కోట్ల నికర డెట్ పెట్టుబడులతో పోల్చి చూస్తే భిన్నమైన పరిస్థితి కనిపించింది. దీంతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.75.20 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఈ మొత్తం రూ.75.36 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు నీరసించడం వెనుక కొత్త పథకాల (ఎన్ఎఫ్వో) ఆవిష్కరణ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘గత ధోరణుల ఆధారంగా ఆగస్ట్ నెలలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు అధికంగా నమోదవుతాయని ఆశించాం. కానీ, అవి ఫ్లాట్గా రూ.28,265 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నప్పటికీ, ఎఫ్పీఐలు విక్రయాలు కొనసాగిస్తున్నా కానీ, భారత ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. మార్కెట్లకు ఇంది ఎంతో అనుకూలం’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. విభాగాల వారీగా..ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి అధికంగా రూ.7,679 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,330 కోట్లను ఆకర్షించాయి.స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.4,993 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.3,893 కోట్ల పెట్టుబడులతో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ తర్వాతి స్థానంలో నిలిచాయి. మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.3,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లో రూ.2,835 కోట్లను ఆకర్షించాయి. 23 న్యూ ఫండ్ ఆఫర్లు (కొత్త పథకాలు) ఆగస్ట్లో రాగా, ఇవన్నీ కలసి రూ.2,859 కోట్లను సమీకరించాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ రూ.2,316 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ డెట్ కలయికతో కూడిన)లోకి పెట్టుబడులు జూలైతో పోలి్చతే ఆగస్ట్లో 27 శాతం తగ్గి రూ.15,293 కోట్లుగా ఉన్నాయి. డెట్ విభాగం నుంచి నికరంగా రూ.7,890 కోట్లను ఇన్వెస్టర్లు ఉపహరించుకున్నారు. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,350 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఓవర్నైట్ ఫండ్స్ రూ.4,950 కోట్లను ఆకర్షించాయి. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,189 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ఆగస్ట్ మాసంలో నికరంగా రూ.52,443 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. జూలైలో వచి్చన రూ.1.8 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 24.89 కోట్లకు చేరాయి. జూలై చివరికి ఇవి 24.13 కోట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్.. కారణం..
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలుక్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
బంగారం స్పీడ్కు బ్రేకులు.. పసిడి ప్రియులకు ఉపశమనం
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త శాంతించి ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,000 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 113 పాయింట్లు పుంజుకుని 81,528 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూల నోట్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ లో ర్యాలీతో లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 323.83 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,425.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 104.50 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24,973.10 వద్ద ముగిసింది.భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4.50 శాతం లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్ షేర్లు 2.46 శాతం వరకు పడిపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.83 శాతం, 0.73 శాతం లాభంతో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 2.63 శాతం, 2.09 శాతం లాభంతో స్థిరపడ్డాయి. ఎంఆర్ఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.28 శాతం నష్టంతో స్థిరపడింది.మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఎన్ఎస్ఈలో 3,128 ట్రేడెడ్ స్టాక్స్ లో 1,835 గ్రీన్లో ముగిశాయి. 1,210 రెడ్లో ముగిశాయి. మరోవైపు 83 షేర్లలో మార్పులేదు. ఎన్ఎస్ఈలో లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.14 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధర రికార్డు స్థాయిలకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:19 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్(Sensex) 327 పాయింట్లు పుంజుకుని 81,436 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ చైర్పర్సన్గా శ్రీనివాస్ ఇంజేటి
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) గవర్నింగ్ బోర్డు చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి శ్రీనివాస్ ఇంజేటి నియమితులయ్యారు. 1960 మే 26న జన్మించిన శ్రీనివాస్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీఏ ఎకనామిక్స్ (ఆనర్స్), ఆ తర్వాత బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లో ఎంబీయే చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి (ఒరిస్సా కేడర్) అయిన శ్రీనివాస్కి కార్పొరేట్ రెగ్యులేషన్, ఆర్థిక సేవలు, గవర్నెన్స్, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుభవం ఉంది.2017 నుంచి 2020 వరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, కంపెనీల చట్టం తదితర సంస్కరణలకు సారథ్యం వహించారు. 2020 నుంచి 2023 వరకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్విసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) వ్యవస్థాపక చైర్మన్గా వ్యవహరించారు. అంతకు ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఖేలో ఇండియా ప్రోగ్రాంనకు శ్రీకారం చుట్టారు. అటు నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీకి కూడా సారథ్యం వహించడంతో పాటు సెబీ, ఎల్ఐసీ తదితర బోర్డుల్లో కూడా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో...
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 81,181 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు 24,892 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీతో పాటు ఫార్మా, టెక్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.22%, 0.20 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్అండ్గ్యాస్, రియల్టి, ఇంధన, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఆటో, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా స్టాక్ సూచీలు 0.50%–2% నష్టపోయాయి. జపాన్ నికాయ్ తొలిసారి 44,000 స్థాయిని అధిగమించి 44,186 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. తదుపరి లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.42% నష్టపోయి 43,459 వద్ద స్థిరపడింది. హాంకాంగ్, కొరియా, థాయ్లాండ్ స్టాక్ సూచీలు 1.50% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్స్ 0.50% నష్టపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.25% పెరిగాయి. అమెరికా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు 5% పెరిగి రూ.1,505 వద్ద స్థిరపడింది. డైరెక్టర్ల బోర్డు ఈ నెల 11న సమావేశమై ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తుందని తెలపడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 5.18% లాభపడి రూ.1,507 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.29,967 కోట్లు పెరిగి రూ.6.25 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. -
వెండి.. భవిష్యత్తు బంగారం!
న్యూఢిల్లీ: బంగారం మాదిరే వెండికి సైతం డిమాండ్ బలపడుతోంది. ఫలితంగా వెండి ధర కిలోకి రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. బలమైన పారిశ్రామిక డిమాండ్, డాలర్ బలహీనత, సురక్షిత సాధనంగా పెట్టుబడుల డిమాండ్ ధరలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర 37 శాతం పెరిగినట్టు గుర్తు చేసింది.‘‘వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చే ఆరు నెలల్లో కిలోకి రూ.1,35,000కు చేరుకోవచ్చు. 12 నెలల్లో రూ.1,50,000కు చేరొచ్చు. డాలర్తో రూపాయి మారకం 88.5 శాతం స్థాయిలో ఉంటుందని భావిస్తూ వేసిన అంచనా ఇది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ తొలుత ఔన్స్కు 45 డాలర్లు, తర్వాత 50 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. బలమైన డిమాండ్ 2025లో వెండి మొత్తం ఉత్పత్తిలో 60 శాతం డిమాండ్ పారిశ్రామిక రంగం నుంచి వచ్చినట్టు యూఎస్కు చెందిన సిల్వర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు, 5జీ ఇన్ఫ్రా రంగాల నుంచి వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు వెండికి డిమాండ్ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ధరలు ఎగిసేందుకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బంగారానికి తోడు వెండిని సైతం తమ రిజర్వుల్లోకి చేర్చుకోవడానికి కొన్ని సెంట్రల్ బ్యాంక్లు ఆసక్తి చూపిస్తుండడం, వెండి మెరుపులకు తోడవుతోంది. వచ్చే మూడేళ్లలో 535 మిలియన్ డాలర్ల విలువైన వెండిని తమ దేశ రిజిర్వుల్లోకి చేర్చుకోనున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది 40 మిలియన్ డాలర్ల మేర సిల్వర్ ఈటీఎఫ్లను కొనుగోలు చేయనుంది. 3,000 టన్నుల దిగుమతిదేశీయంగానూ వెండికి డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,000 టన్నుల వెండి దిగుమతి అయింది. పారిశ్రామిక రంగం నుంచే కాకుండా, పెట్టుబడులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘‘జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత ఫెడ్ సెప్టెంబర్ సమావేశంలో పావు శాతం మేర రేట్లను తగ్గించడం తప్పనిసరి అని తెలుస్తోంది. తక్కువ రేట్లు, యూఎస్ ఈల్డ్స్ క్షీణిస్తుండడం విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా స్వల్పకాలంలో లాభాల స్వీకరణను కొట్టిపారేయలేమని పేర్కొంది. ప్రస్తుత స్థాయి నుంచి, రేట్లు తగ్గిస్తే రూ.1,18,000– 1,15,000 స్థాయి వరకు వెండిని కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
బంగారం ఆల్టైమ్ రికార్డ్ ధర: ఒక్కసారిగా పెరగడానికి కారణాలు
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర మంగళవారం 10 గ్రాములకు రూ.723 పెరిగి రూ.1,10,312కు చేరుకుంది. ఎంసీఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .723 లేదా 0.65% పెరిగి రూ .1,10,312 వద్ద కొత్త గరిష్టానికి చేరుకుంది.అంతర్జాతీయంగా డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్కు 3,698.02 డాలర్ల కొత్త ఆల్-టైమ్ గరిష్టానికి పెరిగింది. స్పాట్ గోల్డ్ కూడా ఔన్స్కు 3,658.38 డాలర్ల రికార్డు స్థాయికి పెరిగింది. బంగారం ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి నిపుణులు పలు కారణాలను పేర్కొంటున్నారు.బంగారం ధర ఆకాశాన్ని తాకడానికి ముఖ్య కారణాలుఅమెరికా ఫెడ్ రేటు తగ్గింపు ఆశలుట్రేడర్లు ఫెడ్ రేట్ల తగ్గింపుపై మరింత ఆశాభావంతో ఉన్నారు. మనీ మార్కెట్లు ఇప్పటికే 25-బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును పూర్తిగా అంచనా వేశాయి. అంతేకాక సీఎంఈ ఫెడ్వాచ్ టూల్ ప్రకారం.. 50-బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు అవకాశాలు కూడా దాదాపు 12% వరకు పెరిగినట్లు తెలుస్తోంది.బలహీనమైన అమెరికన్ డాలర్జపనీస్ యెన్ తో పోలిస్తే డాలర్ 0.2 శాతం తగ్గి 147.21 వద్ద ఉండగా, బ్రిటీష్ పౌండ్ 0.1% పెరిగి 1.3558 డాలర్లకు చేరుకుంది. జూలై 24 నుండి క్లుప్తంగా గరిష్ట స్థాయిని తాకిన తరువాత యూరో 1.1752 డాలర్లకు పడిపోయింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంఉక్రెయిన్ పై మాస్కో ప్రతీకార దాడి తరువాత రష్యాపై అమెరికా అదనపు ఆంక్షల సంభావ్యత సురక్షిత-స్వర్గధామ ఆస్తుల డిమాండ్ ను మరింత పెంచిందని కమోడిటీస్ మార్కెట్ నిపుణులు గుర్తించారు.సుంకం మినహాయింపులునికెల్, బంగారం, వివిధ లోహాలు, అలాగే ఫార్మాస్యూటికల్ కాంపౌండ్స్, రసాయనాలతో సహా పారిశ్రామిక ఎగుమతులపై ఒప్పందాలను కుదుర్చుకునే వాణిజ్య భాగస్వాములకు సెప్టెంబర్ 8 నుంచి సుంకం మినహాయింపులను మంజూరు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. -
ఇన్ఫోసిస్ షేర్ల దూకుడు.. దూసుకెళ్లిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెప్టెంబర్ 11 న జరగనున్న బోర్డు సమావేశంలో షేర్ బైబ్యాక్ ను పరిశీలిస్తామని ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ప్రకటించిన తరువాత బెంచ్ మార్క్ సూచీలు స్థిరమైన లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా సానుకూల ధోరణిని ప్రదర్శించింది. 314 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 81,101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 స్థాయికి చేరుకుంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్ గా ఉంది. ఒక్కో 5 శాతం పెరిగి రూ.1,504 లను తాకింది. ఈ స్టాక్ ఒక్కటే బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ కు 217 పాయింట్ల లాభానికి దోహదపడింది. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ 1 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్ 1-2 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం పెరిగాయి. రంగాలవారీగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.7 శాతం ఘన లాభంతో స్థిరపడటంతో కీలకమైన అవుట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. మంగళవారం ట్రేడింగ్ లో ఇండియా వోలాటిలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) 1.8 శాతం క్షీణించింది. -
స్పీడుమీదున్న కనకం.. తొలిసారి రికార్డు స్థాయికి!
భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 281.70 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 81,068.99 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 24,849.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.సెంచరీ ఎక్స్ట్రూషన్స్, SAL స్టీల్, షా అల్లాయ్స్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్, మహాలక్ష్మి ఫాబ్రిక్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. MIC ఎలక్ట్రానిక్స్, సురానా టెలికాం అండ్ పవర్, డీపీ వైర్స్, మోస్చిప్ టెక్నాలజీస్, స్పేస్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పాత స్టాక్ పైనా డిస్కౌంట్!
న్యూఢిల్లీ: తగ్గిన ధరలపై ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టేట్టు ఉంది. వచ్చే నెల ఆరంభం లేదా మధ్య నాటికి ఈ ఉత్పత్తులు మార్కెట్కు చేరుకుంటాయని గోద్రేజ్ కన్జ్యూమర్ సహా పలు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కానీ, ఇప్పటికే కంపెనీలు, డీలర్లు, రిటైల్ స్టోర్లలో పెద్ద ఎత్తున ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత స్టాక్ను ఎలా విక్రయించాలా? అన్న ఆలోచనలో పడ్డాయి. పాత ఎంఆర్పీ (గరిష్ట చిల్లర విక్రయ ధర)పై తగ్గింపు రేట్లతో ఈ నెల 22 తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందన్న ఆశతో ఉన్నాయి. పాత స్టాక్ ఖాళీ అయి, కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చే వరకు కొన్ని అవాంతరాలు ఎదుర్కోక తప్పేట్టు లేదని భావిస్తున్నాయి. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ప్రతి సంస్థ ఆలోచిస్తోందని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఎంఆర్పీలను మార్చడం దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దీన్ని ఎదుర్కోవడంపై ఒక ప్రణాళికతో ముందుకు వస్తామని ప్రకటించారు. జీఎస్టీలో 12, 28 శాతం రేట్లను ఎత్తివేసి, ఇందులోని వస్తువులను 5, 18% శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. స్వల్పకాలంలో ఇబ్బందులు తప్పవు.. అధిక టారిఫ్ల్లోని ఉత్పత్తులను 5 శాతం కిందకు తీసుకురాడం వల్ల స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సు«దీర్ సీతాపతి చెప్పారు. డీలర్లు, కంపెనీల వద్ద అధిక ఎంఆర్పీలతో ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్టు చెప్పారు. కనుక కొత్త ఎంఆర్పీలతో కూడిన ఉత్పత్తులు వినియోగదారులను చేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పాత స్టాక్పై తగ్గింపు ఇస్తే అది నేరుగా వినియోగదారులకు బదిలీ అవుతుందన్న గ్యారంటీ లేదన్నారు. స్పష్టత కోసం చూస్తున్నాం.. కొత్త జీఎస్టీ రేట్ల అమలు మార్గదర్శకాల కోసం పరిశ్రమ వేచి చూస్తున్నట్టు పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించామని, వెంటనే కొత్త రేట్లకు మారిపోవాలా లేక కొత సమయం ఇస్తారా? అన్నది తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాత ధరలతో ఉన్న నిల్వల విషయంలో ఒక్కో కంపెనీ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పోల్చినప్పుడు ఆహారోత్పత్తుల మన్నిక (షెల్ప్ లైఫ్/నిల్వ కాలం) తక్కువగా ఉంటుందన్నారు. ఏం చేయాలన్నది అంతా ప్రభుత్వ మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంటుందంటూ, ఇవి త్వరలో వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ముందే తగ్గిస్తాం..తమ స్టోర్లలో ఉన్న ఉత్పత్తుల ధరల లేబుళ్లను మార్చబోమని, దీనికి బదులు తుది బిల్లు మొత్తంపై తగ్గింపు ఇస్తామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్, ఎండీ లలిత్ అగర్వాల్ ప్రకటించారు. ప్రభుత్వం జీఎస్టీలో కల్పించిన ఉపశమనం మేర బిల్లులో తగ్గింపు ఉంటుందన్నారు. కంపెనీ స్టోర్లలో కస్టమర్లకు తెలిసేలా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. ఏసీలు, ఇతర కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలోని బ్లూస్టార్ సైతం సెపె్టంబర్ 22 తర్వాత కస్టమర్లకు తగ్గింపులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
రూ. 3,820 కోట్ల ఐపీవో.. సెబీకి ఫిజిక్స్వాలా అప్డేట్
ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్వాలా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి తాజా ముసాయిదా పత్రాలను అందించింది. రూ. 3,820 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ తొలుత 2025 మార్చిలో గోప్యతా విధానంలో సెబీకి దరఖాస్తు చేసింది.దీనిలో భాగంగా మరోసారి అప్డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికితోడు మరో రూ. 720 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లు అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ విడిగా రూ. 360 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు.ప్రస్తుతం కంపెనీలో ఇరువురుకీ విడిగా 40.35 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 461 కోట్లు ఆఫ్లైన్, హైబ్రిడ్ సెంటర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 548 కోట్లు ప్రస్తుత కేంద్రాల లీజ్ చెల్లింపులకు వినియోగించనుంది. -
లాభాల్లో స్టాక్మార్కెట్.. దూసుకెళ్లిన టాటా మోటర్స్ షేర్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ముగిసే సమయానికి లాభాలు కొంత తగ్గినప్పటికీ సోమవారం సానుకూలంగానే ముగిశాయి. ఇంట్రాడేలో 81,171.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం సెషన్లో 76.54 పాయింట్లు (0.09 శాతం) పెరిగి 80,787.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 32.15 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 24,773.15 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో సూచీ 24,885.50 నుంచి 24,751.55 మధ్య కదలాడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.50 శాతం, 0.16 శాతం లాభాలతో ముగిశాయి. భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మదర్సన్ సుమి, టాటా మోటార్స్ నేతృత్వంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 3.30 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ ఐటీ 0.94 శాతం నష్టపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్ టిఐ, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 3,144 షేర్లలో 1,749 షేర్లు లాభాల్లో ముగియగా, 1,285 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 110 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం 114 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 50 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.07 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
పసిడి ప్రియులకు మంచి రోజు.. ఎందుకంటే?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూ.. ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 8) పసిడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 99,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 99,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,08,770 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 99,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 1,08,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 90 తక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (సెప్టెంబర్ 08) కేజీ సిల్వర్ రేటు రూ. 1,37,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,27,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 35 పాయింట్లు పెరిగి 24,776కు చేరింది. సెన్సెక్స్(Sensex) 136 పాయింట్లు పుంజుకుని 80,857 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.86 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.09 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.32 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.03 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘థీమ్యాటిక్’తో ప్రయోజనం ఎంత..
అంతర్జాతీయంగా వ్యాపారాల్లో అనిశ్చితులు నెలకొనడం, కేవలం ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా కాదా అనే అంశంపై మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐటీ, ఫార్మాకు గట్టిగా దెబ్బ తగిలే అవకాశం ఉందని .. తయారీ రంగం, భారీ పెట్టుబడులు అవసరమయ్యే పరిశ్రమలు పాజిటివ్గా ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతగా బాగోలేని రంగాలను పక్కన పెట్టి, ఆకర్షణీయమైన రంగాలు లేదా థీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్లకు మించి రాబడులను రాబట్టాలనుకోవడం చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మెరుగ్గా రాణించే రంగాలను మాత్రమే అందిపుచ్చుకోవడమనేది పెద్ద సవాలుగా ఉంటుంది. నియంత్రణ సంస్థలపరంగా నిబంధనల్లో మార్పులు, కొత్త ఉత్పత్తులు లేదా మార్కెట్ పరిణామాలు, అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు, వడ్డీ రేట్లలో మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కమోడిటీలు లేదా కరెన్సీల్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు మొదలైన వాటి వల్ల తాత్కాలికంగా కొన్ని రంగాలు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అయితే, సగటు రిటైల్ ఇన్వెస్టర్లకు పరిశ్రమవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితులతో పాటు కంపెనీకి మాత్రమే పరిమితమయ్యే ఇతరత్రా అంశాలను కూడా అధ్యయనం చేయడమనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫలితంగా సదరు రంగం ఇటీవలి పనితీరు చూసి కావచ్చు లేదా మీడియాలో హైప్ వల్ల కావచ్చు చాలా మటుకు రిటైల్ ఇన్వెస్టర్లు, సెక్టోరల్ లేదా థీమ్యాటిక్ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.బూమ్..ఢామ్..సెక్టార్లు, థీమ్లు సాధారణంగా హెచ్చుతగ్గులు లోనవుతూ వలయాకృతిలో తిరుగాడుతుంటాయి. సదరు రంగం వాస్తవ పనితీరు కనిపించడానికి చాలా ముందే, అంచనాల ఆధారంగా స్టాక్ మార్కెట్లలో వాటి షేర్ల ధర పెరిగిపోతాయి. ఉదాహరణకు ఐటీ రంగం కొన్నాళ్లు బ్లాక్ బస్టర్ రాబడులు అందించాక (ఎన్ఎస్ఈ ఐటీ సూచీ: 1997–1999 మధ్య కాలంలో +173%, +193%, +493%), కొన్నాళ్లు భారీగా కరెక్షన్కి లోనయ్యింది (2000–2002 మధ్య కాలంలో –35%, –36%, –6%). ఇక ఫార్మా తీసుకుంటే నాలుగేళ్లు పటిష్టంగా ఉండగా (2012 నుంచి 2015 వరకు: +32%, +26%, +42%, +10%) తర్వాత వరుసగా నాలుగేళ్లు నెమ్మదించింది (–14%, –7%, –8%, –9%). అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తే వరకు ఇన్ఫ్రా, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఎన్బీఎఫ్సీల పరుగులు కొనసాగాయి. ఏదైతేనేం, సెక్టోరల్ పెట్టుబడులతో విజయం సాధించాలంటే ఇన్వెస్టరు కచ్చితత్వంతో ఎంట్రీ ఇవ్వడంతో పాటు కచ్చితమైన పాయింటులో వైదొలగడమూ ముఖ్యమే. ఇది చాలా కష్టతరంగా ఉంటుంది.సెక్టోరల్ ఫండ్స్ పరిమితులు..సెక్టోరల్ ఫండ్స్కి సంబంధించి కొన్ని రంగాలకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. సదరు థీమ్ కారణంగా ఆ రంగంలో ఉన్న దాదాపు అన్ని సంస్థలను ఫండ్ మేనేజర్లు ఎంచుకోవాల్సి రావచ్చు. దీనితో కేవలం అత్యధిక రాబడులను అందించే స్టాక్స్ను ఎంచుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఫలితంగా ఫండ్ పనితీరు పూర్తిగా పరిశ్రమ కదలికలపైనే ఆధారపడుతుంది తప్ప ఫండ్ మేనేజరు నైపుణ్యాలకు తావుండదు.స్మార్ట్ విధానం ..ఈ నేపథ్యంలో పరిశోధనల ఆధారంగా వివిధ రంగాలకు కేటాయింపులను ఎప్పటికప్పుడు సవరించే అనుభవజు్ఞలైన నిపుణుల సారథ్యంలోని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోల్లో ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం అవుతుంది. సంప్రదాయ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే వారు లేదా తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు దాదాపు సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్తో మొదలుపెట్టడం మంచిది. అనుభవజ్ఞులైన లేదా దూకుడుగా ఉండే మదుపరులు కోర్–శాటిలైట్ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇందులో ఈక్విటీలకు సంబంధించి 75 శాతం లేదా అంతకు మించిన మొత్తాన్ని ఫ్లెక్సీ–క్యాప్ లేదా మల్టీ–క్యాప్ వ్యూహాల్లాంటివి పాటిస్తూ, నిర్వహణపరంగా మెరుగ్గా ఉన్న డైవర్సిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మిగతా 25 శాతాన్ని తమ నమ్మకానికి అనుగుణంగా థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్కి కేటాయించవచ్చు. వినియోగం, ఆర్థికం లేదా తయారీకి సంబంధించిన థీమ్యాటిక్ ఫండ్స్ పలు పరిశ్రమలవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి కాబట్టి సెక్టోరల్ ఫండ్స్తో పోలిస్తే కాస్త తక్కువ రిసు్కలు ఉండొచ్చు. ఉదాహరణకు ‘కేపెక్స్’ థీమ్ ఫండ్లో యుటిలిటీలు, సిమెంటు, విద్యుత్, హౌసింగ్, ఆటో మొదలైన రంగాలు ఉండొచ్చు. దీనితో కేవలం ఒకే రంగంలో మొత్తం పెట్టుబడులంతా పెట్టడం వల్ల వచ్చే రిసు్కలు కాస్త తగ్గవచ్చు.ఇదీ చదవండి: ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది? -
దేశ, విదేశీ గణాంకాలు కీలకం
ప్రధానంగా దేశ, విదేశీ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటికితోడు జీఎస్టీ సంస్కరణల ప్రభావం, యూఎస్తో వాణిజ్య పరిస్థితులు తదితరాలు సైతం ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యూఎస్ అదనపు టారిఫ్ల అమలు ప్రతికూల ప్రభావాన్ని చూపగా.. జీఎస్టీ సంస్కరణలు జోష్ నివ్వడంతో గత వారం ఆటుపోట్ల మధ్య మార్కెట్లు 1 శాతంపైగా బలపడ్డాయి. వివరాలు చూద్దాం..వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలకు గత వారం తెరతీయడంతో పలు రంగాలకు లబ్ది చేకూరనున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో ఇటీవల మందగించిన ఆటో రంగంతోపాటు.. ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, వినియోగ, ఫుట్వేర్ తదితర రంగాలు పుంజుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సైతం జోష్ వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ఈ వారం దేశ, విదేశీ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఆగస్ట్ నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు శుక్రవారం(12న) వెలువడనున్నాయి. జూలైలో రిటైల్ ధరల రేటు(సీపీఐ) వరుసగా 9వ నెలలోనూ వెనకడుగు వేసింది. 2.1 శాతం నుంచి 1.55 శాతానికి తగ్గింది. చైనా వాణిజ్య మిగులు.. ఆగస్ట్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు నేడు(8న) వెల్లడికానున్నాయి. జూలై చైనా వాణిజ్య మిగులు 98.24 బిలియన్ డాలర్లను తాకింది. దిగుమతులను మించుతూ ఎగుమతులు భారీగా పెరిగిపోవడం మిగులుకు దారి చూపే సంగతి తెలిసిందే. ఇక ఆగస్ట్ సీపీఐ వివరాలు బుధవారం(10న) వెలువడనున్నాయి. జూలైలో సీపీఐ 0.1 శాతం పెరిగింది. ఇతర అంశాలు యూఎస్ వాణిజ్య టారిఫ్లు, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, ముడిచమురు ధరలు, ఆరు ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు కదలికలు వంటి అంశాలు సైతం దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. యూఎస్ గణాంకాలకుతోడు భారత్తో వాణిజ్య టారిఫ్లపై వార్తలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అయితే ఇన్వెస్టర్లు వినియోగ ఆధారిత, పెట్టుబడి వ్యయాలకు సంబంధించిన రంగాలవైపు దృష్టిసారించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ తెలియజేశారు. మార్కెట్లలో అప్రమత్తత కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అటు యూఎస్ టారిఫ్ల అమలు, ఇటు జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు మార్టస్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ద్రవ్యోల్బణ గణాంకాలేకాకుండా ఈసీబీ వడ్డీ పాలసీ సమీక్ష, జపాన్ రెండో త్రైమాసిక(ఏప్రిల్–జూన్) జీడీపీ వివరాలు వెల్లడికానున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వెల్లడించారు.యూఎస్ నిరుద్యోగితయూఎస్ నిరుద్యోగ గణాంకాలు ఆగస్ట్ చివరి వారంలో 8,000 పెరిగి 2,37,000కు చేరాయి. వెరసి నిరుద్యోగ లబ్ది దరఖాస్తులు జూన్ తదుపరి అధికంగా నమోదయ్యాయి. గత నెలలో ప్రయివేట్ రంగ ఉపాధి 54,000 పుంజుకోగా.. జూలైలో వాణిజ్య లోటు దాదాపు 33 శాతం పెరిగి 78 బిలియన్ డాలర్లను దాటింది. జూలైలో కోవిడ్–19 తదుపరి గరిష్టస్థాయిలో నిరుద్యోగిత నమోదైంది. ట్రంప్ వాణిజ్య టారిఫ్లు, తదితర అంశాలు ఉపాధిని దెబ్బతీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 16–17 తేదీలలో చేపట్టనున్న పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల కోతకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. ఈ బాటలో ఆగస్ట్ నెలకు యూఎస్ ఉత్పత్తిదారుల ధరల ఇండెక్స్ 10న వెల్లడికానుంది. జూలైలో ఇది 0.9% బలపడింది. గత నెల ద్రవ్యోల్బణ వివరాలు 11న వెల్లడికానున్నాయి. జూలైలో కీలక ద్రవ్యోల్బణం వార్షికంగా 2.7% పెరిగింది.గత వారమిలా.. ప్రధానంగా జీఎస్టీ సంస్కరణలు ఆకట్టుకోవడంతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ను సాధించాయి. దీంతో యూఎస్ ప్రెసిండెట్ ట్రంప్ విధించిన 25 శాతం అదనపు సుంకాలు సైతం అమల్లోకి వచి్చన ప్రతికూల వార్తలను అధిగమిస్తూ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 901 పాయింట్లు(1.1 శాతం) బలపడి 80,711 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లు(1.3 శాతం) ఎగసి 24,741 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు నామమాత్రంగానే లాభపడటం గమనార్హం!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక్క నెలలో విశ్వరూపం! బంగారం, వెండి షాకింగ్ ధరలు
బంగారం, వెండి ధరలు ఒక్క నెలలోనే విశ్వరూపం చూపించాయి. రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగిపోయాయి. భారత్, బ్రెజిల్, రష్యా సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఆంక్షలు, ఉక్రెయిన్, గాజా స్ట్రిప్లో కొనసాగుతున్న ఘర్షణలతో సహా భౌగోళిక రాజకీయ ఆందోళనల మధ్య రిటైల్, ఫ్యూచర్స్ దేశీయ మార్కెట్లలో గత 30 రోజుల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ .6,000 పైగా పెరిగాయి.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,07,740 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ఆగస్టు 5న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,076 నుంచి రూ.6,06,338కు పెరిగినట్లు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తెలిపింది. ఈ వారంలోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,845 పెరగ్గా, ఆగస్టు 18 నుంచి (రూ.99,623) 10 గ్రాములకు రూ.6,715 పెరిగింది.వెండి కూడా భారీగా..ఇక వెండి ధరలు కూడా నెల రోజుల్లో భారీగా ఎగిశాయి. సెప్టెంబర్ 4న వెండి ధర కేజీకి రూ.1,23,207 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆగస్టు 5న రూ.1,12,422గా ఉన్న కేజీ వెండి ధర నెల రోజుల్లో రూ.10,748 పెరిగి రూ.1,23,170కు (సెప్టెంబర్ 5 నాటికి) ఎగిసింది. ఈ వారం, వెండి ధర సాపేక్షంగా స్థిరంగా ఉంది. సెప్టెంబర్ 1న రూ .1,22,800 నుండి రూ .370 పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఈ వారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయిఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) నివేదిక ప్రకారం సెప్టెంబర్ 4, సాయంత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ .1,04,424 నుండి రూ .1,06,021 కు పెరిగింది. ఒక్క రోజులోనే రూ.1,597 పెరిగింది. -
రూ.855 కోట్ల ఐపీవో.. సెబీకి ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: ప్రయాణ సర్వీసులందించే చార్టర్డ్ స్పీడ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు పంకజ్ గాంధీ, అల్కా పంకజ్ గాంధీ విక్రయానికి ఉంచనున్నారు.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్ బస్ల కొనుగోలుకీ వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 2007లో ఏర్పాటైన అహ్మదాబాద్ కంపెనీ ప్రధానంగా ప్యాసింజర్ మొబిలిటీ సర్వీసులను అందిస్తోంది.2025 జూన్30కల్లా 500 పట్టణాలలో 2,000 బస్సులతో సర్వీసులు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 667 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నికర లాభం ఆర్జించింది. అనుబంధ సంస్థల ద్వారా 945 ఎలక్ట్రిక్ బస్ల కొనుగోలుకి ఆర్డర్లు జారీ చేసింది. -
మరింత భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) నేడు మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఓయో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ ఓయో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 200 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 87 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం జంప్చేసి రూ. 2,019 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 1,371 కోట్ల టర్నోవర్ అందుకుంది. హోటళ్ల ఇన్వెంటరీని ప్రీమియమైజ్(మెరుగైన ధరలు) చేయడంతోపాటు.. గదుల వినియోగం పుంజుకోవడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల బుకింగ్ విలువ(జీబీవీ) రూ. 7,227 కోట్లను తాకింది. గత క్యూ1లో నమోదైన రూ. 2,966 కోట్ల జీబీవీతో పోలిస్తే 144 శాతం దూసుకెళ్లింది. కాగా.. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనున్నట్లు ఓయో వెల్లడించింది. తద్వారా అదీకృత వాటా మూలధనం రెట్టింపుకానుంది. దీంతోపాటు ఇసాప్లో భాగంగా 8.8 కోట్ల స్టాక్ అప్షన్స్కు తెరతీయనుంది. కంపెనీ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే. -
రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు: మూడు కారణాలు
ఈ రోజుల్లో బంగారం కేవలం అలంకారానికి ఉపయోగించే ఆభరణం కాదు. భవిష్యత్తు కోసం దాచుకునే ఓ పెట్టుబడి. ప్రస్తుతం గోల్డ్ రేట్లు రాకెట్లా దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో రూ. 78వేలు నుంచి రూ. 84వేలు మధ్య ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర నేడు.. రూ. లక్ష దాటేసింది. ఇంతలా ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం లేదా రిటైల్ డిమాండ్ వంటివి మాత్రమే కాకుండా.. మరో మూడు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.➤పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. యూఎస్ డాలర్ మీద తగ్గుతున్న నమ్మకం వంటివి బంగారం ధరలను అమాంతం పెంచేసాయి. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడంపై సుముఖత చూపుతున్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో మాత్రమే, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఐదేళ్ల సగటు కంటే 24 శాతం ఎక్కువగా ఉన్నాయి. చైనా, పోలాండ్ వంటివి ఈ విషయంలో ఇతర దేశాల కంటే ముందు ఉన్నాయి.➤బంగారం ధరలు పెరగడానికి.. ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణం. 2022లో 300 బిలియన్లకు పైగా రష్యన్ నిల్వలు స్తంభింపజేసినప్పుడు.. అనేక దేశాలు తమ డాలర్ విలువను పెంచుకోవచ్చని గ్రహించాయి. ఆ సమయంలో బంగారం ఒక భీమా పాలసీగా మారింది. కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఇప్పుడు 1,000 టన్నులను మించిపోయాయి, ఇది దశాబ్ద సగటు కంటే రెట్టింపు అని తెలుస్తోంది.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక➤భారతదేశంలో గోల్డ్ ఇటీఎఫ్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు 2025 జూన్లో రూ. 2,000 కోట్లు, 2025 జూలైలో మరో రూ. 1,256 కోట్లకు పైగా ఈ నిధులలోకి ఇన్వెస్ట్ చేశారు. భారతీయులలో కూడా చాలామంది బంగారాన్ని కేవలం పండుగలకు మాత్రమే కాకుండా.. పొదుపు చేయడంలో భాగంగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.ఈ రోజు బంగారం ధరలు ఇలాసెప్టెంబర్ 05న భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 700 పెరిగి రూ. 98,650 వద్దకు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 760 పెరిగి రూ. 1,07,620 వద్ద నిలిచింది. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ పెరిగిపోయింది. -
మనీ మార్కెట్లకు సెలవులో మార్పు: రిజర్వ్ బ్యాంక్
ముంబై: మనీ మార్కెట్లకు ఈ నెల 8న సెలవు వర్తించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతక్రితం ప్రకటించిన సెలవు తేదీ 5ను తాజాగా 8కు మార్చడంతో ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్)లు, విదేశీ మారకం, రుపీ ఇంటరెస్ట్ రేటు డెరివేటివ్స్లో లావాదేవీలు, సెటిల్మెంట్స్ ఉండబోవని స్పష్టం చేసింది. వెరసి ఈ నెల 5న జీసెక్లు, విదేశీ మారకం, మనీ మార్కెట్, రుపీ ఇంటరెస్ట్ రేటు డెరివేటివ్స్ మార్కె ట్లు యథావిధిగా పనిచేస్తాయని తెలియజేసింది. ఇంకొంత వివరంగా చెప్పాలంటే ఈ సెలవు మార్పు వెనుక ఉన్న కారణం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాత్కాలిక నిర్ణయం. ముంబై నగరంలో సెప్టెంబర్ 6న జరగనున్న అనంత చతుర్దశి సందర్భంగా గణేశ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. అదే సమయంలో ఈద్-ఎ-మిలాద్ కూడా జరగనుండటంతో, రెండు పెద్ద ఉత్సవాలు ఒకే రోజు జరగడం వల్ల లాజిస్టికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో, మత సామరస్యత, సౌకర్యవంతమైన నిర్వహణ కోసం ఈద్-ఎ-మిలాద్ సెలవును సెప్టెంబర్ 8కి మార్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మార్పు ప్రభావం ముంబై నగరం, పరిసర జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం సెప్టెంబర్ 5న సెలవు యథావిధిగా అమలులో ఉంటుంది. -
ఒక్కరోజుకే ఆవిరైన జీఎస్టీ జోష్: తలకిందులైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాలను పొందాయి. సెన్సెక్స్ 7.25 పాయింట్లు లేదా 0.0090 శాతం నష్టంతో.. 80,710.76 వద్ద, నిఫ్టీ 6.70 పాయింట్లు లేదా 0.027 శాతం లాభంతో 24,741.00 వద్ద నిలిచాయి.నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, జేఐటీఎఫ్ ఇన్ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, బరాక్ వల్లీ సిమెంట్స్, పీవీపీ వెంచర్స్, ఎస్ఏఎల్ స్టీల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, ఎఫ్ఐఈఎమ్ ఇండస్ట్రీస్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ధరలు: తగ్గినట్టే తగ్గి.. తులం మళ్లీ..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) క్రితం రోజున కాస్త కరుణించి నేడు మళ్లీ భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 95 పాయింట్లు పెరిగి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 304 పాయింట్లు పుంజుకుని 81,023 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు ఎల్డొరాడో అగ్రిటెక్
న్యూఢిల్లీ: విత్తనాలు, సస్య రక్షణ రంగ కంపెనీ ఎల్డొరాడో అగ్రిటెక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని శ్రీనివాసరావు లింగ, రూ. 160 కోట్ల విలువైన షేర్లను ఉషా రాణి పాపినేని ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ. 1,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. శ్రీకర్ సీడ్స్ బ్రాండుతో కార్యకలాపాలు విస్తరించిన తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. విత్తనాలుసహా సమీకృత సస్య రక్షణ సొల్యూషన్లు అందించే కంపెనీ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా విభిన్నతరహా హైబ్రిడ్, స్వీయ పరాగ సంపర్క(ఓపీవీ) విత్తనాలను పంపిణీ చేస్తోంది. జొన్న, ధాన్యం, పత్తి, గోధుమలు, సజ్జలు తదితర పంటల సంబంధ విత్తనాలను ఆఫర్ చేస్తోంది. 2025 జూన్కల్లా సీఐబీఆర్సీ నుంచి 269 రిజి్రస్టేషన్లు పొందింది. గతేడాది(2024–25)లో రూ. 441 కోట్ల ఆదాయం, రూ. 71 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
వెండికి హాల్మార్కింగ్
న్యూఢిల్లీ: స్వచ్చంద ప్రాతిపదికన ప్రభుత్వం వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ను ప్రవేశపెట్టింది. సెపె్టంబర్ 1నుంచి అమల్లోకి వచ్చేటట్లు హాల్మార్కింగ్ నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) తాజాగా సవరించింది. వినియోగదారులకు డిజిటల్ గుర్తింపు వ్యవస్థ ద్వారా వెండి స్వచ్చతను తెలియజేసే బాటలో ప్రభుత్వం తాజా చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం బంగారు ఆభరణాలకు అనుసరిస్తున్న విధానంలోనే వెండి ఆభరణాలకు సైతం హాల్మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్(హెచ్యూఐడీ)ను ప్రవేశపెట్టింది. దీంతో స్వచ్చతను సులభంగా గుర్తించేందుకు వీలు చిక్కనుంది. కొత్త విధానంలో భాగంగా కొనుగోలుదారులు ఆయా వస్తువు(ఆరి్టకల్) ఎలాంటిది, స్వచ్చత, హాల్మార్కింగ్ తేదీ, టెస్టింగ్ సెంటర్ తదితర వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 సెపె్టంబర్ 1 తదుపరి హాల్మార్క్ చేసిన వెండి ఆభరణాలను బీఐఎస్ కేర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు వివరాలను పరిశీలించుకోవచ్చని ఒక ప్రకటనలో బీఐఎస్ పేర్కొంది. తాజా సవరణల ప్రకారం వెండి 7 ప్రమాణాలు(800, 835, 925, 958, 970, 990, 999)గా స్వచ్చతను నిర్దారించనున్నారు. వీటిలో 958, 999ను కొత్తగా ప్రవేశపెట్టారు. సిల్వర్, ప్యూరిటీ గ్రేడ్, హెచ్యూఐడీతో బీఐఎస్ స్టాండర్ట్ మార్క్ పరిగణిస్తారు. -
క్యూ1లో ఎఫ్డీఐల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 15 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి. వీటిలో యూఎస్ నుంచి మూడు రెట్లు అధికంగా 5.61 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024–25 క్యూ1లో 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్డీఐలు 25.2 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ1లో 22.5 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు లభించాయి. టారిఫ్ సవాళ్లున్నప్పటికీ యూఎస్ నుంచి అత్యంత భారీగా 5.61 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. గత క్యూ1లో ఇవి కేవలం 1.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది క్యూ1లో ప్రధానంగా సింగపూర్ నుంచి 4.59 బిలియన్ డాలర్లు, మారిషస్ నుంచి 2.08 బిలియన్ డాలర్లు, సైప్రస్ నుంచి 1.1 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి బిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. కాగా.. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్వరకూ చూస్తే 76.26 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో యూఎస్ మూడో ర్యాంకులో నిలవగా.. 182.2 బిలియన్ డాలర్లతో మారిషస్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ బాటలో సింగపూర్ 179.48 బిలియన్ డాలర్లతో రెండో పెద్ద ఇన్వెస్టర్గా నిలిచింది. రంగాలవారీగా చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పలు రంగాలలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి. ప్రధానంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ 5.4 బిలియన డాలర్లను ఆకట్టుకోగా.. సర్వీసులు 3.28 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ 1.29 బిలియన్ డాలర్లు, సంప్రదాయ ఇంధనం 1.14 బిలియన్ డాలర్లు, ట్రేడింగ్ 50.6 కోట్ల డాలర్లు, కెమికల్స్ 14 కోట్ల డాలర్లు, టెలికమ్యూనికేషన్లు 2.4 కోట్ల డాలర్లు చొప్పున అందుకున్నాయి. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే కర్ణాటక అత్యధికంగా 5.69 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను సమకూర్చుకుంది. జాబితాలో తదుపరి మహారాష్ట్రకు 5.36 బిలియన్ డాలర్లు, తమిళనా డుకు 2.67 బిలియన్ డాలర్లు, గుజరాత్కు 1.2 బిలియన్ డాలర్లు, హర్యానాకు 1.03 బిలియన్ డాలర్లు, ఢిల్లీకి బిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. -
బెంబేలెత్తిస్తున్న ప్రముఖ బ్యాంక్ రిపోర్ట్
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఐసీఐసీఐ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 ప్రథమార్థం చివరి నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.1,25,000 వరకు పెరగవచ్చని చెబుతోంది. 2025లో ఇక మిగిలిన ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.99,500 నుంచి రూ.1,10,000 మధ్య ట్రేడవుతుందని, 2026 ప్రథమార్థంలో ఇది రూ.1,10,000 నుంచి రూ.1,25,000 వరకు పెరుగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ రీసెర్చ్ నోట్ తెలిపింది.‘మా అంచనాల కంటే అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి చాలా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయితే ఈ అంచనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కాలానికి డాలర్తో రూపాయి మారక విలువ సగటున 87.00 - 89.00 మధ్య ఉంటుందని అంచనా వేశాం’ అని నివేదిక పేర్కొంది.అంతర్జాతీయ ప్రభావాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య సడలింపు అంచనాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై నిరంతర సంస్థాగత ఆందోళనల మద్దతుతో 2025లో ఇప్పటివరకు ప్రపంచ బంగారం ధరలు 33 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ బులియన్ 2025లో సగటున ఔన్స్కు 3,400-3,600 డాలర్లు, 2026 ప్రథమార్థంలో ఔన్స్కు 3,600-3,800 డాలర్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమైతే, ఈ పరిధులు మరింత తారుమారయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.దేశీయ కారణాలు రూపాయి బలహీనపడటం (డాలర్తో పోలిస్తే రూ.87 –రూ.89 మధ్యగా ఉంటుందని అంచనా ) పండుగల కాలంలో బంగారం డిమాండ్ పెరగడం.బంగారం దిగుమతులు పెరగడం (జూన్ 2025లో 1.8 బిలియన్ డాలర్లు, జూలై 2025లో 4.0 బిలియన్ డాలర్లు)గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు అధికం కావడం ( జూలైలో రూ.1,260 కోట్లు, 2025లో ఇప్పటివరకు రూ.9,280 కోట్లు, 2024లో రూ.4,520 కోట్లు) -
జీఎస్టీ జోష్.. మరింత లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల గడువు ముగియడంతో భారత బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం ప్రారంభ లాభాలను అందుకున్నాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రోజు ముందు ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలను ఇన్వెస్టర్లు హర్షించడంతో ఆటో, ఎఫ్ఎంసీజీ వంటి వినియోగ ఆధారిత రంగాల బలం మద్దతుతో మరింత లాభాల్లో ముగిశాయి.పన్ను వ్యవస్థను రెండు శ్లాబులుగా (5 శాతం, 18 శాతం) క్రమబద్ధీకరించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో నిత్యావసర వస్తువులపై రేట్లు తగ్గుతాయని, అదే సమయంలో విలాస వస్తువులపై అధిక సుంకాలు ఉంటాయని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 888.96 పాయింట్లు లేదా 1.03 శాతం పెరిగి 81,456.67 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది, ఆ తర్వాత 150.30 పాయింట్లు లేదా 0.19 శాతం పెరిగి 80,718.01 వద్ద స్థిరపడింది.అలాగే నిఫ్టీ 50 1.07 శాతం లేదా 265.7 పాయింట్లు పెరిగి 24,980.75 స్థాయిల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది, తరువాత 19.25 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 24,734.30 స్థాయిల వద్ద ముగిసింది.బీఎస్ఈలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా నిలవగా, మారుతీ సుజుకీ, బీఈఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్గా నిలవగా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జ్యూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ లూజర్గా నిలిచాయి.విస్తృత సూచీలు ట్రెండ్ ను తారుమారు చేస్తూ పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.67 శాతం నష్టపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.71 శాతం నష్టపోయింది.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో (0.85 శాతం), ఎఫ్ఎంసీజీ (0.24 శాతం) టాప్ గెయినర్స్గా నిలిచాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.11 శాతం, ఐటీ 0.94 శాతం, మీడియా 0.78 శాతం నష్టపోయాయి. -
బంగారం ధరలు: హమ్మయ్య.. కరుణించావా కనకం!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు కొండెక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) కాస్త కరుణించాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
550 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు పెరిగి 24,869కు చేరింది. సెన్సెక్స్(Sensex) 554 పాయింట్లు పుంజుకుని 81,123 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.22బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.21 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.51 శాతం పెరిగింది.నాస్డాక్ 1.03 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్సైడర్ ట్రేడింగ్కు చెక్ పెట్టాలి
ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణలను పాటించడం బ్యాంకుల యాజమాన్యాల నైతిక బాధ్యత అని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఉల్లంఘనలను గుర్తించి, నివారించేందుకు వీలుగా అంతర్గత నియంత్రణలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.‘అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రక్రియలు అస్పష్టంగా ఉన్నప్పుడు, బాధ్యతలను సరిగ్గా నిర్వచించనప్పుడు, పర్యవేక్షణ సరిగ్గా లేనప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ రిస్క్ పెరుగుతుంది’ అని పాండే తెలిపారు. చాలా మోసాలకు అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉండడమే కారణమన్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ మాజీ ఎండీ–సీఈవో, డిప్యూటీ సీఈవోలు బయటకు వెల్లడించని సున్నిత సమాచారం (యూపీఎస్ఐ) ఆధారంగా బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ నిర్వహించినట్టు తేలుస్తూ, సెబీ ఇటీవలే చర్యలు ప్రకటించడం గమనార్హం. దీంతో సెబీ చైర్మన్ తాజా సూచనలకు ప్రాధాన్యం నెలకొంది.అంతర్గతంగా బలమైన నియంత్రణలు ఏర్పాటు చేసుకోవడం, వెంటనే సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడం, తమ బాద్యతల పట్ల ఉద్యోగుల్లో స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా ప్రతి సున్నిత సమాచారం విషయంలో జవాబుదారీ తనం ఉండేలా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో సున్నిత సమాచారాన్ని అనధికారికంగా పంచుకోవడం, ఈమెయిల్ రూపంలో తెలియజేసినా దాన్ని ఉల్లంఘనగానే పరిగణించాలని పేర్కొన్నారు. ‘ఒక్కసారి సమచారం లీక్ అయితే సెకన్లలోనే డిజిటల్ నెట్వర్క్లపైకి చేరిపోతుంది. దాంతో స్టాక్ ధరలకు, ఇన్వెస్టర్ల విశ్వాసం, బ్యాంకు ప్రతిష్టకు జరిగే నష్టాన్ని భర్తీ చేయలేం’ అని పేర్కొన్నారు. -
జీఎస్టీ సంస్కరణల ఆశలతో....
ముంబై: కొత్త జీఎస్టీ సంస్కరణలపై ఆశలతో పాటు మెటల్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు బుధవారం అరశాతం లాభపడ్డాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ భేటిలో 500 ఉత్పత్తుల ధరలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత విధానంలో నాలుగు పన్ను శ్లాబ్లు (5%, 12%, 18%, 28%) ఉండగా.. ఇకపై రెండు శ్లాబ్లు (5%, 18%) మాత్రమే ఉంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. జీఎస్టీ 2.0తో ధరలు తగ్గి వినియోగం పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ 410 పాయింట్లు లాభపడి 80,568 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 24,715 వద్ద నిలిచింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,005 – 80,671 శ్రేణిలో మొత్తంగా 667 పాయింట్లు పరిధిలో కదలాడింది. నిఫ్టీ 157 పాయింట్లు బలపడి 24,737 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆసియాలో దక్షిణ కొరియా మినహా అన్ని రంగాల షేర్లూ నష్టాలు చవిచూశా యి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. → ట్రేడింగ్లో మెటల్ షేర్లు మెరిశాయి. చైనా 2025, 2026లో స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలనే నిర్ణయం, అంతర్జాతీయంగా డాలర్ బలహీనత కారణంగా మెటల్ షేర్లకు డిమాండ్ లభించింది. టాటా స్టీల్ 6%, జిందాల్ స్టీల్, సెయిల్ 5.50% ర్యాలీ చేశాయి. నాల్కో, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3%, ఎన్ఎండీసీ, లాయిడ్స్ మెటల్స్, వేదాంత 2% రాణించాయి. → రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో మెటల్ 3%, కమోడిటీ 1.50% లాభపడ్డాయి, ఫార్మా, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఫైనాన్సియల్ సరీ్వసెస్, బ్యాంకెక్స్, ఆటో సూచీలు 1% పెరిగాయి. మరోవైపు ఐటీ, టెక్, వినిమయ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. → విక్రాన్ ఇంజనీరింగ్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.97)తో పోలిస్తే బీఎస్ఈలో 3% ప్రీమియంతో రూ.98 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.102 వద్ద గరిష్టాన్ని, రూ.93 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి ఒకటిన్నర శాతం నష్టంతో రూ.95.64 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,467 కోట్లుగా నమోదైంది. -
లాభాల్లొ ముగిసిన స్టాక్ మార్కెట్లు
మెటల్, ఫార్మా షేర్ల లాభాల మద్దతుతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. పరోక్ష పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించడంపై చర్చించే రెండు రోజుల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా పుంజుకుంది.బీఎస్ఈ సెన్సెక్స్ 409.83 పాయింట్లు లేదా 0.51 శాతం లాభపడి 80,567.71 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 134.45 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 24,715.05 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో టాటా స్టీల్, టైటాన్, ఎంఅండ్ఎం షేర్లు లాభపడగా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, ఇన్ఫోసిస్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా లాభాలలోనే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.69 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.89 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్ 3.11 శాతం లాభపడగా, ఫార్మా 1.10 శాతం, పీఎస్యూ బ్యాంక్ 1.03 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ 0.74 శాతం, మీడియా 0.04 శాతం చొప్పున నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వామ్మో! బంగారం ఊసు ఎత్తకపోవడమే మంచిది.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 24,593కు చేరింది. సెన్సెక్స్(Sensex) 61 పాయింట్లు పుంజుకుని 80,215 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోలకు కంపెనీల క్యూ..!
కొద్ది నెలలుగా జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్లు మరోసారి కళకళలాడనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 13 కంపెనీలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం దోహదపడనుంది. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్ బోర్డులో 50 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. వీటిలో అత్యధికంగా 12 కంపెనీలు గత నెల(ఆగస్ట్)లోనే ఐపీవోలు చేపట్టడం గమనార్హం! వివరాలు చూద్దాం..ఐపీవో చేపట్టేందుకు సెబీ తాజాగా అనుమతించిన సంస్థల జాబితాలో అర్బన్ కంపెనీ, ఇమేజిన్ మార్కెటింగ్, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, మౌరి టెక్, రవి ఇన్ఫ్రా బిల్డ్ ప్రాజెక్ట్స్, పేస్ డిజిటెక్, ఓమ్నిటెక్ ఇంజినీరింగ్, కరోనా రెమిడీస్, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్, ఆల్కెమ్ లైఫ్సైన్స్, ప్రయారిటీ జ్యువెల్స్, ఓమ్ ఫ్రైట్ ఫార్వార్డర్స్ చేరాయి. ఈ కంపెనీలన్నీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నాయి.గత నెలలోనే..లిస్టింగ్ బాట పట్టిన కంపెనీలన్నీ ఆగస్ట్ 1–29 మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణకు తాజాగా అనుమతి పొందాయి. మర్చంట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ 13 కంపెనీలు ఉమ్మడిగా రూ. 15,000 కోట్లకుపైగా సమీకరించనున్నాయి. ఇష్యూ నిధులను పలు కంపెనీలు రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. ఆయా కంపెనీలలోని ప్రస్తుత వాటాదారులు ఐపీవోలో షేర్లను ఆఫర్ చేయడం ద్వారా పెట్టుబడులను విక్రయించనున్నారు. రూ.1,900 కోట్లపై కన్నుయాప్ ఆధారంగా బ్యూటీ, హోమ్ సర్వీసులందించే అర్బన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 429 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో రూ. 1,471 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వాటాలు ఆఫర్ చేయనున్న సంస్థలలో యాక్సెల్ ఇండియా, ఎలివేషన్ క్యాపిటల్ తదితరాలున్నాయి.ఇమేజిన్ మార్కెటింగ్బోట్ బ్రాండుతో ఆడియో, వేరబుల్ ప్రొడక్టులు రూపొందిస్తున్న ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకునే సన్నాహాల్లో ఉంది. కంపెనీ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది. రెనెవబుల్ ఎనర్జీపునరుత్పాదక ఇంధన(రెనెవబుల్ ఎనర్జీ) రంగ కంపెనీ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించడంపై కన్నేసింది. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. మెటల్ గ్రూప్ నుంచి..జైన్ మెటల్ గ్రూప్ కంపెనీ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఐపీవోకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణకు తెరతీయనుంది.రూ. 1,500 కోట్లకు రెడీగ్లోబల్ ఎంటర్ప్రైజ్ ఐటీ సొల్యూషన్స్ అందించే మౌరి టెక్ లిమిటెడ్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,500 కోట్లు అందుకోవాలని చూస్తోంది.విడిభాగాల కంపెనీప్రెసిషన్ ఇంజినీర్డ్ విడిభాగాలు రూపొందించే ఓమ్నిటెక్ ఇంజినీరింగ్ ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమీకరించడంపై దృష్టి పెట్టింది. ఇష్యూలో భాగంగా రూ. 520 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 330 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. ఫార్మా కంపెనీలు తాజాగా లిస్టింగ్కు అనుమతి పొందిన ఫార్మాస్యూటికల్ రంగ కంపెనీల తీరిలా ఉంది. కరోనా రెమిడీస్ ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఫార్మా సంబంధ ఏపీఐ, స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే ఆల్కెమ్ లైఫ్సైన్స్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఇతర సంస్థల తీరిలానిర్మాణ రంగ కంపెనీ రవీ ఇన్ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. టెలికం ప్యాసివ్ మౌలికసదుపాయాల సంస్థ పేస్ డిజిటెక్ సైతం ఐపీవోలో భాగంగా ఈక్విటీ జారీ(కొత్తగా) ద్వారానే రూ. 900 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికలు వేసింది. ఈ బాటలో వైర్ల తయారీ సంస్థ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఐపీవోలో భాగంగా రూ. 420 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 325 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. తద్వారా రూ. 745 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. బంగారు ఆభరణ తయారీ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ ఐపీవో ద్వారా 54 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. థర్డ్పార్టీ లాజిస్టిక్స్ అందించే ఓమ్ ఫ్రైట్ ఫార్వార్డ్స్ ఐపీవోలో భాగంగా రూ. 25 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్లు మరో 72.5 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్టంగా ఉండటం, టారిఫ్లపరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ. 1,000 పెరిగి మరో కొత్త రికార్డు స్థాయి రూ. 1,05,670ని తాకింది.99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ. 800 పెరిగి రూ. 1,04,800కి చేరింది. అమెరికా టారిఫ్లపరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు, పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి మారకం క్షీణిస్తుండటం, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి. త్రివేశ్ తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, టారిఫ్లపరమైన అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదలైన అంశాలు స్పాట్ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమవుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కాయ్నాత్ చైన్వాలా చెప్పారు.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు ఒక దశలో 3,556.87 డాలర్లకు ఎగిసింది. ఇది కొత్త ఆల్టైమ్ రికార్డు స్థాయి కావడం గమనార్హం. మరోవైపు, వెండి ధర కేజీకి మరో రూ. 1,000 పెరిగి ఇంకో కొత్త గరిష్ట స్థాయి రూ. 1,26,000ని తాకింది. పర్యావరణహిత విద్యుత్, ఎల్రక్టానిక్స్ తదితర పరిశ్రమల నుంచి డిమాండ్తో పాటు స్పెక్యులేషన్ కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని త్రివేశ్ వివరించారు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నుంచి లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 206.61 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 80,157.88 వద్ద.. నిఫ్టీ 45.45 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో.. 24,579.60 వద్ద నిలిచాయి.కౌసల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్, కొతారి షుగర్స్ & కెమికల్స్ లిమిటెడ్, వన్ మొబిక్విక్ సిస్టమ్స్, విమ్టా ల్యాబ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), జువారీ ఆగ్రో కెమికల్స్, బీఎస్ఎల్, ఎల్జీ రబ్బరు కంపెనీ, లుమాక్స్ ఆటోమొబైల్ కంపెనీ వంటివి నష్టాలను పొందాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 24,678కు చేరింది. సెన్సెక్స్(Sensex) 198 పాయింట్లు పుంజుకుని 80,566 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 68.44 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.64 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.15 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,05,880లకు చేరింది. వెండి రేటు రూ. 1,36,000 (కేజీ) వద్ద ఉంది. కాగా సిల్వర్ రేటు మరో మూడేళ్ళలో ఏకంగా రెండు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, ఫోటోవోల్టాయిక్ సెల్స్, వైద్య పరికరాలలో కూడా ఉపయోగిస్తున్నారు. ఆలయాల్లో కూడా వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో.. పెట్టుబడిదారులు వెండివైపు చూస్తున్నారు. ఈ పరిణామాలు వెండి ధరల్లో పెనుమార్పును తీసుకువచ్చే అవకాశం ఉంది.కేజీ వెండి రూ.2 లక్షల వద్దకు చేరుకోవడానికి ఇంకెంతో కాలం పట్టదు. ఈ ఏడాది వెండి ధరలు ఇప్పటికే 30 శాతం పెరిగి.. జీవితకాల గరిష్టాలను చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ మార్కెట్ ధోరణులు, పారిశ్రామిక వినియోగం, సాంస్కృతిక కొనుగోలు వంటివన్నీ ధరలు పెరుగుదలకు కారణమవుతాయని సీఏ నితిన్ కౌశిక్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?వెండి రేటు రాబోయే 12-24 నెలల్లో 15–20% పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ర్యాలీ కొనసాగితే.. కేజీ వెండి రూ. 2 లక్షలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా వెండిపై పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. వెండి నాణేలు, వెండి కడ్డీలు, వెండి ఆభరణాలు మొదలైనవాటిలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 554.84 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 80,364.49 వద్ద, నిఫ్టీ 198.20 పాయింట్లు లేదా 0.81 శాతం పెరిగి 24,625.05 వద్ద నిలిచాయి.శ్యామ్ సెంచరీ ఫెర్రస్, జిందాల్ పాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, బీఎస్ఎల్, అట్లాంటా, ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, రాయల్ ఆర్చిడ్ హోటల్స్, ట్రెఝరా సొల్యూషన్స్ లిమిటెడ్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా, స్టెర్లైట్ టెక్నాలజీస్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇంతలా పెరిగితే ఇక బంగారం కొనడం కష్టమే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) పెరుగుతూ పోతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు మళ్లీ భారీ స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
395 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు పెరిగి 24,541కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 పాయింట్లు పుంజుకుని 80,201 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీఎస్టీ కౌన్సిల్పైనే కళ్లన్నీ
కొద్ది రోజులుగా అటు దేశీ స్టాక్ మార్కెట్లకు, ఇటు పరిశ్రమ వర్గాలకు కీలకంగా మారిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. మంగళ, బుధ వారాల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంకానుంది. మరోపక్క విశ్లేషకుల అంచనాలను మించుతూ 2025 ఏప్రిల్–జూన్లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం ఎగసింది. దీంతో నేడు మార్కెట్లు కొంతమేర బలపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..గత వారాంతాన వెలువడిన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు పలువురు విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ఆర్థిక వృద్ధి 6.5 శాతం అంచనాలను మించుతూ ఏకంగా 7.8 శాతం బలపడింది. దీంతో దేశీయంగా సెంటిమెంటుకు జోష్రానున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన అదనపు(25 శాతం) టారిఫ్లు సైతం అమల్లోకిరావడంతో గత వారం స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ ప్రతికూలతలున్నప్పటికీ ప్రభుత్వ వ్యయాలు, పాలసీ విధానాలు వంటి అంశాలు సానుకూలతకు దోహదం చేయవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. చర్చలు షురూ జీడీపీ జోరుకుతోడు జీఎస్టీ సంస్కరణల ప్రతిపాదనలపై పరిశ్రమవర్గాల్లో భారీ ఆశలు నెలకొన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. జీఎస్టీ కౌన్సిల్ 2, 3 తేదీలలో నిర్వహించనున్న సమావేశాలలో పన్ను సంస్కరణల ప్రతిపాదనలపై చర్చించనుంది. దీంతో వస్తు, సేవల పన్ను సంస్కరణల అమలుపై అంచనాలు అధికమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. పన్ను రేట్లను భారీగా కుదించడంసహా శ్లాబులను తగ్గించేందుకు చేసిన ప్రతిపాదనలపై కౌన్సిల్ చర్చించనుంది. పలు గణాంకాలు ఈ వారం దేశీయంగా ఆగస్ట్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. గత నెల హెచ్ఎస్బీసీ తయారీ, సర్వీసు రంగ పీఎంఐ ఇండెక్సుల తీరు సైతం వెల్లడికానుంది. శుక్రవారం(12న) ఆగస్ట్ రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. జూలైలో సీపీఐ 1.55 శాతానికి నీరసించింది. విదేశీ అంశాలకు వస్తే గత నెలకు చైనా తయారీ, సర్వీసుల రంగ వివరాలు తెలియనున్నాయి. గత నెలకు వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పన, నిరుద్యోగ గణాంకాలను యూఎస్ విడుదల చేయనుంది. వెరసి దేశ, విదేశీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలు ఇటీవల కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లపై ఒత్తిడి పడుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గత వారం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 88ను దాటి చరిత్రాత్మక కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ఇవేకాకుండా ముడిచమురు ధరల కదలికలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. గత వారమిలా వినాయక చవితి పండుగ సందర్భంగా నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణపథంలో సాగాయి. గత వారం ట్రేడింగ్లో సెన్సెక్స్ నికరంగా 1,497 పాయింట్లు(1.8 శాతం) కోల్పోయింది. 79,810 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 443 పాయింట్లు(1.8 శాతం) క్షీణించి 24,427 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 2.7 శాతంపైగా పతనమయ్యాయి.సాంకేతికంగావిదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, యూఎస్ ప్రెసిడెంట్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకిరావడం, రూపాయి సరికొత్త కనిష్టాన్ని చవిచూడటం తదితర ప్రతికూలతలు ఇటీవల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 24,300 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఆపై 24,100, 24,000 స్థాయిలో సపోర్ట్ కనిపించవచ్చు. ఒకవేళ నిఫ్టీ బలాన్ని పుంజుకుంటే 25,000 పాయింట్లను తాకవచ్చు. తదుపరి 25,250 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. సెన్సెక్స్ 79,150, 79,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. ఆ స్థాయిలో బౌన్స్అయితే 82,000 వరకూ పుంజుకునే వీలుంది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలు రూ. 35,000 కోట్లు వెనక్కి గత 6 నెలల్లో అత్యధికం గత నెల(ఆగస్ట్)లో ఎఫ్పీఐలు భారీ అమ్మకాలకు తెరతీశారు. దేశీ స్టాక్స్ నుంచి అత్యధిక శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. వెరసి ఆగస్ట్లో నికరంగా రూ. 34,993 కోట్ల (సుమారు 4 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇది గత ఆరు నెలల్లోనే అత్యధికంకాగా.. జూలై అమ్మకాల (రూ.17,741 కోట్లు)తో పోలిస్తే రెట్టింపుకావడం గమనార్హం! దీంతో డిపాజిటరీ గణాంకాల ప్రకారం 2025 కేలండర్ ఏడాదిలో దేశీ స్టాక్స్ నుంచి మొత్తం రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నట్లయ్యింది. ఇంతక్రితం ఎఫ్పీఐలు 2025 ఫిబ్రవరిలో మాత్రమే ఈ స్థాయిలో అంటే రూ.34,574 కోట్ల స్టాక్స్ విక్రయించారు. ఇందుకు దేశ, విదేశీ అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా కొన్ని రంగాలలో క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు టారిఫ్ల విధింపు వంటి అంశాలను ప్రస్తావించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటి వరకు ధనవంతులు కావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయం వెల్లడించారు. ఇప్పుడు దిగ్గజ దేశాల్లో తలెత్తే ఆర్థిక సంక్షోభం గురించి వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఫ్రాన్స్ చారిత్రాత్మక బాస్టిల్ డే తిరుగుబాటును గుర్తుచేసే.. ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతోందని సూచించారు. ఈ అశాంతి నాటకీయ సామాజిక తిరుగుబాటుకు దారితీయవచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్ ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. బాండ్ల భద్రత గురించి కియోసాకి ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు బాండ్లపై అంత విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఇది భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేస్తుందని అన్నారు. బాండ్స్ ఎప్పుడూ సేఫ్ కాదు అని అన్నారు.2020 నుంచి అమెరికన్ ట్రెజరీ బాండ్లు 13% తగ్గాయి. యూరోపియన్ బాండ్లు 24%, బ్రిటిష్ బాండ్లు 32% తగ్గాయిని కియోసాకి పేర్కొన్నారు. జపాన్, చైనాలు అమెరికా బాండ్లను వదులుకుని బంగారం & వెండిని కొనుగోలు చేస్తున్నాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్లలోనే పెట్టుబడులు పెట్టుకోవాలని చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు.ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకిఅమెరికాలో పెరుగుతున్న రుణ సవాళ్ల గురించి రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. ఇది చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశంగా మారిందని హైలైట్ చేసింది. ఆర్థిక స్థిరత్వం ప్రస్తుతం ముప్పులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని పిలుపునిచ్చాయి.EUROPE is TOAST:French people are on verge of Bastille Day revolt. They’re bringing out their guiottinesand heads will roll as France may be forced to admit bankruotcy. BONDS are not safe: America is now the biggest debtor nation in world history. Since 2020 American…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025 -
Stock market: సెప్టెంబర్లో సెలవులున్నాయా? ట్రేడింగ్ ఆగుతుందా?
వినాయక చవితితో ఆగస్టు నెలాఖరులో ప్రారంభమైన పండుగ సీజన్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తదుపరి స్టాక్ మార్కెట్ సెలవుల గురించి ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఏమైనా సెలవులు ఉన్నాయా.. ఎన్ని రోజులు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుంది? అన్న సందేహాలుంటే ఈ కథనంలో తెలుసుకోండి.గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27 బుధవారం స్టాక్ మార్కెట్కు సెలవు వచ్చింది. తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ లో కాకుండా అక్టోబర్ లో వస్తుందని ఇన్వెస్టర్లు గమనించాలి. అయితే, రెగ్యులర్ వారాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, సెప్టెంబర్ నెలలో ఎనిమిది రోజులు భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు. వారాంతాలు మినహా అక్టోబర్ లో మూడు రోజుల పాటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండు స్టాక్ ఎక్స్ఛేంజ్లు ట్రేడింగ్ కు మూతపడతాయని ఇన్వెస్టర్లు గమనించాలి. దసరా, దీపావళి, బలిప్రతిపాద వంటి పండుగ రోజులతో పాటు గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సెలవు దినాలను ఈ సెలవుల్లో చూడవచ్చు.రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు2025లో మిగిలిన ఏడాది స్టాక్ మార్కెట్ సెలవులు ఎప్పుడున్నాయి.. ఏ రోజుల్లో ట్రేడింగ్ ఉండదో ఇక్కడ చూడండి..అక్టోబర్ 2 గురువారం గాంధీ జయంతిఅక్టోబర్ 21 మంగళవారం దీపావళిఅక్టోబర్ 22 బుధవారం బలిప్రతిపాదనవంబర్ 5 బుధవారం ప్రకాశ్ గురుపురబ్ గురునానక్ దేవ్డిసెంబర్ 25 గురువారం క్రిస్మస్ఇదీ చదవండి: హైదరాబాద్లో సెబీ ప్రత్యేక కార్యక్రమం -
హైదరాబాద్లో సెబీ ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను పొందడంలో ఇన్వెస్టర్లకు అవసరమయ్యే సహాయాన్ని అందించే దిశగా హైదరాబాద్లో ‘నివేశక్ శివిర్’ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చొరవతో, కార్పొరేట్ వ్యవహారాల శాఖలో భాగమైన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) దీన్ని నిర్వహించింది.సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, బీఎస్ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, ఎన్ఎస్ఈ, కేఫిన్ టెక్నాలజీస్ మొదలైనవి ఇందులో పాలుపంచుకున్నాయి. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా 23 సరీ్వస్ డెస్క్లను ఏర్పాటు చేశారు.హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 360 మంది పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు ఇందులో పాల్గొన్నారు. ఐఈపీఎఫ్ఏ సీఈవో అనితా షా ఆకెళ్ల, సెబీ ఈడీలు జీవన్ సోన్పరోటే, సునీల్ జయవంత్ కదమ్ తదితరులు దీనికి హాజరయ్యారు. -
ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ 21.5 లక్షల యూనిట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 32.3 శాతం క్షీణించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రూపొందించిన వరల్డ్వైడ్ క్వార్టర్లీ పర్సనల్ కంప్యూటింగ్ డివైజ్ ట్రాకర్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అమ్మకాలు నెమ్మదించినప్పటికీ 41.3 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగగా, 12.3 శాతంతో లెనొవొ రెండో స్థానంలో నిల్చింది. 11.8 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడో స్థానంలో ఉంది. ‘‘భారత్లో ట్యాబ్లెట్ మార్కెట్ (డిటాచబుల్, స్లేట్ ట్యాబ్లెట్స్ కలిపి) 2025 ప్రథమార్ధంలో 21.5 లక్షల యూనిట్లుగా నమోదైంది. వార్షికంగా చూస్తే 32.3 శాతం తగ్గింది. 2025 రెండో త్రైమాసికంలో మార్కెట్ గణనీయంగా నెమ్మదించింది. వార్షిక ప్రాతిపదికన 42.1 శాతం క్షీణించింది. 2025 తొలి త్రైమాసికంలో 18.4 శాతం నెమ్మదించింది’’ అని ఐడీసీ నివేదిక తెలిపింది. డిటాచబుల్ ట్యాబ్లెట్ సెగ్మెంట్ వార్షికంగా 18.9 శాతం పెరగ్గా, స్లేట్ ట్యాబ్లెట్ విభాగం గణనీయంగా 44.4 శాతం క్షీణించడంతో మొత్తం అమ్మకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. కమర్షియల్ సెగ్మెంట్లో 47.9 శాతం, వినియోగదారుల సెగ్మెంట్లో 37.6 శాతం వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యా ప్రాజెక్టులతో పాటు ఆన్లైన్ మాధ్యమాల ద్వారా దూకుడుగా విక్రయ వ్యూహాలు అమలు చేయడం ఇందుకు తోడ్పడింది. 2025 రెండో త్రైమాసికంలోనూ 40.8 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ ఆధిపత్యం కొనసాగించింది.యాపిల్కు కొత్త మోడల్స్ దన్ను కమర్షియల్ సెగ్మెంట్లో ఇటు చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు అటు కంపెనీల విభాగంలోనూ లెనొవొ మెరుగ్గా రాణించింది. మొత్తం మార్కెట్లో 12.3 శాతం వాటా దక్కించుకుంది. ఇక 11.8 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడో స్థానంలో నిల్చిందని ఐడీసీ నివేదిక తెలిపింది. కన్జూమర్ సెగ్మెంట్లో యాపిల్ వాటా 14.4 శాతంగా నిల్చింది. కొత్త ఐప్యాడ్ మోడల్స్, విద్యార్థులకు డిస్కౌంట్ ప్రోగ్రాంలు ఇందుకు తోడ్పడ్డాయి. కమర్షియల్ సెగ్మెంట్లో కంపెనీ వాటా 7.3 శాతానికి పెరిగింది. అటు ఐడీసీ అంచనాల ప్రకారం షావోమీ, ఏసర్ మార్కెట్ వాటాలు వరుసగా 11.4 శాతం, 9.1 శాతంగా ఉన్నాయి. ట్యాబ్లెట్ పీసీ సెగ్మెంట్లో ఏసర్ అత్యధికంగా నష్టపోయింది. అమ్మకాలు 73 శాతం క్షీణించాయి. -
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం..
బంగారం ధరలు రోజురోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. వెండి రేటు కూడా జీవితకాల గరిష్టాలకు చేరుకుంది. ఈ రోజు (ఆగస్టు 30) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1640 పెరిగి రూ. 1,04,950 వద్దకు చేరింది. కేజీ వెండి రూ. 1,31,000 వద్ద ఉంది. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే.. ఈ ధరలు చాలా ఎక్కువ అని తెలుస్తోంది.ఈ సంవత్సరం భారతదేశంలో బంగారం ధరలు దాదాపు 32 శాతం పెరిగాయి. ఇది పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులకు కొంత భారమైపోయింది. జనవరిలో పది గ్రాముల గోల్డ్ రూ. 80,000 నుంచి ప్రారంభమై.. మార్చి నాటికి రూ.90,000 చేరుకుంది. కాగా ఇప్పుడు ఈ ధరలు లక్ష రూపాయలు దాటేసింది.గ్లోబల్ మార్కెట్లో మే 2025 ప్రారంభంలో బంగారం ధర ఔన్సుకు 3392 డాలర్ల వద్ద ఉండేది. జూన్ మధ్య నాటికి ఇది 3368 డాలర్ల వద్దకు చేరుకుంది. గోల్డ్ రేటు విపరీతంగా పెరగడానికి రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న యూఎస్ డాలర్ విలువ మాత్రమే కాకుండా.. రూపాయి విలువ తగ్గడం కూడా ప్రధాన కారణమైందని నిపుణులు చెబుతున్నారు.ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ 'అక్ష కాంబోజ్' మాట్లాడుతూ.. పండుగ సీజన్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ అనిశ్చితి, బలహీనపడుతున్న డాలర్ ఇండెక్స్ మధ్య పెట్టుబడిదారులు బంగారం వైపు ఆకర్షితులయ్యారు. భారత ఎగుమతులపై అమెరికా విధించిన.. 50 శాతం సుంకాలు కూడా పసిడి డిమాండును మరింత పెంచిందని అన్నారు.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..బంగారం ధరలు పెరగడానికి సీజనల్ డిమాండ్ మరో కీలకమైన అంశం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారతదేశంలో పండుగలు.. వివాహాల సీజన్ మొదలైపోయింది. దీనివల్ల కూడా బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ధర ఎంత పెరిగినా.. బంగారంపై పెట్టుబడి ఎప్పటికి మంచి లాభాలను తెస్తుందనేది మాత్రం వాస్తవం. -
బాబోయ్ బంగారం ధరలు.. ఊహించనిస్థాయిలో పెరిగిన రేట్లు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి హైజంప్: కొత్త గరిష్టానికి బంగారం ధర
పసిడి ధరలకు రూపాయి బలహీనత ఆజ్యం పోసింది. ఫలితంగా శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి నూతన జీవిత కాల గరిష్టమైన రూ.1,03,670 (పన్నులతో కలిపి)కు చేరింది. ఈ నెల 8న నమోదైన రూ.1,03,420 99.9 శాతం స్వచ్ఛతకు పూర్వపు ఆల్టైమ్ గరిష్ట స్థాయిగా ఉంది. డాలర్తో రూపాయి బలహీనపడడంతో స్టాకిస్టులు కొనుగోళ్లకు మొగ్గు చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.‘‘అంతర్జాతీయంగా సానుకూల ధోరణికి తోడు రూపాయి బలహీనతతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ల వల్ల జీడీపీపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు సైతం ధరల పెరుగుదలకు తోడయ్యాయి’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.ఎంసీఎక్స్లోనూ అక్టోబర్ కాంట్రాక్టు గోల్డ్ ధర రూ.713 పెరిగి రూ.1,02,813కు చేరుకుంది. మరో వైపు వెండి కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,19,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్కు 40 డాలర్ల మేర పెరిగి 3,515 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. -
జియో లిస్టింగ్ వచ్చే ఏడాదే..!
వచ్చే ఏడాది(2026) ద్వితీయార్ధంలోగా జియో ప్లాట్ఫామ్స్ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ కంపెనీ 48వ ఏజీఎంలో ప్రకటించారు. ఏఐ సంబంధిత భారీ మౌలికసదుపాయాలతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరున కొత్త జేవీకి తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో భాగస్వామ్యానికి చేతులు కలిపినట్లు వెల్లడించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఏఐ, ప్రతి చోటా ఏఐ విజన్ను ప్రకటించారు. రిలయన్స్తో కలసి జామ్నగర్ క్లౌడ్ రీజన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎంలో వర్చువల్గా పాలుపంచుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్బర్గ్ సైతం రిలయన్స్తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సంస్థ ఓపెన్ సోర్స్ లామా మోడళ్లను జేవీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. దేశీ సంస్థలకు ఈ జేవీ గేమ్ చేంజర్గా నిలవనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. రూ. 855 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మెటాతో జేవీకి తెరతీయనున్నారు. జేవీలో ఆర్ఐఎల్కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా లభించనుంది.జియో ప్లాట్ఫామ్స్ ఆర్ఐఎల్కు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న జియో ప్లాట్ఫామ్స్లో ఎంతమేర వాటా విక్రయించేదీ ముకేశ్ వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థలో ఆర్ఐఎల్కు 66.3 శాతం వాటా ఉంది. మెటా(ఫేస్బుక్) వాటా 10 శాతంకాగా.. గూగుల్ 7.7 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 16 శాతం వాటా పీఈ దిగ్గజాల చేతిలో ఉంది. ఐపీవోలో 10 శాతం వాటా ఆఫర్ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ విలువను 136–154 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ స్థాయిలో విలువ నమోదైతే ప్రపంచంలోనే ఆరో పెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటినట్లు సంస్థ చీఫ్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. → జియోఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్గ్లాస్లోకి ప్రవేశించింది. చేతులు వినియోగించకుండా కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ తదితరాలను వివిధ భాషలతో నిర్వహించవచ్చు.→ వాల్ట్ డిస్నీ ఇండియా విలీనంతో ఏర్పాటైన జియోహాట్స్టార్ రెండో పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. 34% టీవీ మార్కెట్ వాటా దీని సొంతం.రిలయన్స్ రిటైల్.. 40,000 కోట్లు ఆసియాలోకెల్లా అతిపెద్ద ఏకీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రిలయన్స్ రిటైల్ రూ. 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వీటిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, సస్టెయినబుల్ టెక్నాలజీలు వినియోగించనున్నట్లు సంస్థ ఈడీ ఈషా అంబానీ పేర్కొన్నారు. మూడేళ్లలో వార్షికంగా ఆదాయంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ బిజినెస్(ఆర్సీపీఎల్)ను 8 రెట్లు పెంచే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఆదా యాన్ని రూ. లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తోంది.ఓ2సీ... భారీ విస్తరణఆయిల్ 2 కెమికల్స్ విభాగంలో కొత్త ప్రాజెక్టులపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో తొలిసారి ప్రసంగించారు. 2035కల్లా నికర కర్బన రహిత లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. మొబిలిటీ విభాగంలో జియో–బీపీ ఇంధన రిటైల్ నెట్వర్క్ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీ చార్జింగ్, బ్యాటరీల స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా పెంచుతున్నట్లు అనంత్ తెలియజేశారు. n న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5–7 ఏళ్లలో ఓ2సీ బిజినెస్ను అధిగమించనున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2028 కల్లా రెట్టింపు ఇబిటాను సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. 2026 కల్లా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు వేసింది. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంపై కంపెనీ కన్నేసింది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 270.92 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 79,809.65 వద్ద, నిఫ్టీ 74.05 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,426.85 వద్ద నిలిచాయి.జిందాల్ ఫోటో, జిందాల్ పాలీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, కృతికా వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఎల్జీ రబ్బరు వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. స్టీల్కాస్ట్, జీఎస్ఎస్ ఇన్ఫోటెక్, పనామా పెట్రోకెమ్, బాలకృష్ణ పేపర్ మిల్స్, విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరలు.. గ్రాముకు ఒక్క రూపాయి..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు పెరిగి 24,539కు చేరింది. సెన్సెక్స్(Sensex) 136 ప్లాయింట్లు పుంజుకుని 80,202 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సుంకాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ల పతనం
బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఎగుమతులపై 50 శాతం సుంకాల ప్రభావంతో భారత స్టాక్స్ నష్టాల్లో గురువారం ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 705.97 పాయింట్లు (0.87 శాతం) క్షీణించి 80,080.57 వద్ద, నిఫ్టీ 50 211.15 పాయింట్లు లేదా 0.85 శాతం క్షీణించి 24,500.9 వద్ద స్థిరపడ్డాయి.బీఎస్ఈలో హెచ్సీఎల్టెక్, టీసీఎస్, పవర్గ్రిడ్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా, టైటాన్, ఎల్అండ్టీ, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.27 శాతం, 1.45 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు 1 శాతానికి పైగా క్షీణించాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
500 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 146 పాయింట్లు పడిపోయి 24,564కు చేరింది. సెన్సెక్స్(Sensex) 504 ప్లాయింట్లు దిగజారి 80,274 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగ రోజు బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం వినాయక చవితి రోజున బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఊపందుకున్న బంగారం ధరలు: ఒక్కసారిగా పైకి..
వినాయక చవితి వచ్చేసింది. బంగారం ధరలు మరోసారి ఊపందుకున్నాయి. నేడు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 550 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సోమవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాల బాట పట్టాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 335.84 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 81,300.06 వద్ద, నిఫ్టీ 108.75 పాయింట్లు లేదా 0.44 శాతం నష్టంతో.. 24,859.00 వద్ద ముందుకు సాగుతున్నాయి.రెలియబుల్ డేటా సర్వీస్, ప్రోటీన్ ఈగోవ్ టెక్నాలజీస్, శ్రీ రామ మల్టీ టెక్, అక్షర్ స్పింటెక్స్ లిమిటెడ్, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీ దిగ్విజయ్ సిమెంట్, ఇండోవిండ్ ఎనర్జీ, హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, శ్రీయోస్వాల్ సీడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 329.05 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,635.91 వద్ద, నిఫ్టీ 97.65 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 24,967.75 వద్ద నిలిచాయి.రెలియబుల్ డేటా సర్వీసెస్, ఇమామి పేపర్ మిల్స్, శ్రీ రామ మల్టీ టెక్, జేకే పేపర్, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలువగా.. ఆరోన్ ఇండస్ట్రీస్, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, వండర్ ఎలక్ట్రికల్, డీపీ వైర్స్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరలకు బ్రేక్.. తులానికి ఎంతంటే..
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తులం రూ.లక్షకు చేరిన తర్వాత కొద్దికాలంగా ఫ్లాట్గా కొనసాగుతున్న పసిడి ధరలు నేడు (సోమవారం) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం వరుసగా పెరుగదలతో బెంబేలిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే.. -
250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు పెరిగి 24,946కు చేరింది. సెన్సెక్స్(Sensex) 254 పాయింట్లు ఎగబాకి 81,563 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్యూ1 జీడీపీపై కన్ను
వినాయక చవితి సందర్భంగా బుధవారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించిన అదనపు టారిఫ్లు అమలుకానుండగా.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలపై దృష్టి పెట్టడం ద్వారా ఇటీవల పలు రంగాలతోపాటు.. స్టాక్ మార్కెట్లకు జోష్నిచి్చంది. వివరాలు చూద్దాం... ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్(క్యూ1) కాలానికి దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలు శుక్రవారం(29న) వెలువడనున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లను వ్యతిరేకిస్తూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత్పై విధించిన 25 శాతం అదనపు సుంకాలకు బుధవారం(27) నుంచి తెరలేవనుంది. జాక్సన్ హోల్ వద్ద యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వార్షికంగా నిర్వహించే సదస్సు సందర్భంగా గత వారాంతాన ప్రస్తుత చైర్మన్ జెరోమీ పావెల్ వడ్డీ రేట్ల కోతకు వీలున్నదంటూ సంకేతాలిచ్చారు. బుధవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో 4 రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో ఈ వారం మార్కెట్ల సరళిపై విశ్లేషకులు పలు అంశాలు ప్రభావం చూపనున్నట్లు ప్రస్తావిస్తున్నారు. జీడీపీపై అంచనాలు ఈ ఏడాది క్యూ1లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి చూపగలదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ వ్యయాలు పెరగడం, గ్రామీణ డిమాండ్ పుంజుకోవడం, సర్వీసుల రంగం పటిష్ట పురోగతి వంటి అంశాలు సహకరించనున్నట్లు భావిస్తున్నారు. గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో దేశ జీడీపీ 7.4 శాతం బలపడింది. ఈ బాటలో జూలై పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) వివరాలు గురువారం(28న) వెల్లడికానున్నాయి. జూన్లో ఐఐపీ 2024 ఆగస్ట్ తదుపరి కనిష్టంగా 1.5 శాతం పుంజుకుంది. జీడీజీ, ఐఐపీ గణాంకాలు బలపడితే.. మార్కెట్లు మరింత పుంజుకునే వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. జీఎస్టీ శ్లాబులతోపాటు.. రేట్లను భారీగా తగ్గించనున్న వార్తలతో పలు రంగాలకు హుషారొచి్చనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. వెరసి జీఎస్టీ సంస్కరణలపై అంచనాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు బలాన్నిచి్చనట్లు పేర్కొన్నారు. విదేశీ అంశాలు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్.. కొద్ది రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య సయోధ్యకు ప్రయతి్నస్తున్న నేపథ్యంలో భారత్పై విధించిన 25 శాతం అదనపు టారిఫ్ల అమలు వాయిదా పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇదికాకుండా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. ఇది ఇటీవల దేశీ స్టాక్స్లో నిరంతర విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను యూటర్న్ తీసుకునేలా ప్రోత్సహించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక యూఎస్ హౌసింగ్ విక్రయాలు, ఫ్యాక్టరీ ఆర్డర్లు తదతర గణాంకాలు సైతం ఈ వారం వెలువడనున్నాయి. ఈ అంశాలన్నిటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల సంకేతాలతో గత వారాంతాన యూఎస్ మార్కెట్లు 2 శాతంవరకూ బలపడటాన్ని ఈ సందర్భంగా జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ ప్రస్తావించారు.డౌన్ట్రెండ్కు చెక్.. ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ వేస్తూ గత వారం చివర్లో భారీ అమ్మకాలు తలెత్తాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 1 శాతం లాభంతో ముగిశాయి. అయితే గత వారం ఆరు వారాల నష్టాలకు చెక్ పడింది. కాగా.. ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కదలికలపై సాంకేతిక అంశాలతో ఇలా విశ్లేషించారు. వీటి ప్రకారం మార్కెట్లలో డౌన్ట్రెండ్కు కొంతమేర చెక్ పడింది. అంతేకాకుండా ట్రెండ్ రివర్సల్(బుల్లి‹Ù)కు సంకేతాలు అందుతున్నాయి. ఎఫ్పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్ల టర్న్ తీసుకుంటే మరింత బలపడే వీలుంది. వెరసి మార్కెట్లు బలహీనపడితే సెన్సెక్స్ 80,800–80,700 పాయింట్ల వద్ద మద్దతు తీసుకోవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 82,200 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. తదుపరి 83,600–83,700 పాయింట్లవరకూ బలపడే వీలుంది. నిఫ్టీకి 24,600 పాయింట్ల తొలి సపోర్ట్ లభించవచ్చు. 24,500 వద్ద మరోసారి మద్దతు కనిపించవచ్చు. బలపడితే.. తొలుత 25,200 పాయింట్ల వద్ద, ఆపై 25,500 వద్ద రెసిస్టెన్స్కు వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!
బంగారం ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ద్రవ్యోల్బణం, జీడీపీ, అంతర్జాతీయ పరిణామాలు (భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు) ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో జరిగే అనేక అంశాలు గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. కాగా ఇప్పుడు బంగారం ధరలలో కీలక మార్పుకు కారణమయ్యే ఒక ప్రకటన వచ్చింది.నిజానికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. యూఎస్ డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగితే.. బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య కొంత తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే.. డాలర్ విలువ తగ్గి, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.కొంత కాలంగా.. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నారు. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించారు. కానీ ట్రంప్ విధిస్తున్న సుంకాలు.. భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియడం లేదు. ఈ కారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే సెప్టెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు.వచ్చే నెలలో జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ 'జెరోమ్ పావెల్' వడ్డీ రేటు తగ్గింపుకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇది ఉద్యోగ మార్కెట్కు నష్టాలు తెస్తుందని, ద్రవ్యోల్బణం ముప్పు కూడా ఉండదని పేర్కొన్నారు. అయినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. దీంతో డాలర్ విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంతో బంగారం ధరలు ఊహించినట్లుగానే పెరిగాయి. ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 16, 17న జరగనుంది.ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్లో 1.5 లక్షల ఉద్యోగాలుఇక భారతదేశంలో కూడా బంగారం ధరలు ఊహకందని రీతిలో శనివారం (ఆగస్టు 23) గరిష్టంగా రూ. 1090 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 1,01,620 (10 గ్రా)కు చేరింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1000 పెరిగి రూ. 93150 (10 గ్రా)కు చేరింది. కేజీ వెండి ధర రూ. 1,30,000లకు చేరింది. -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారం భారీ షాక్
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. తులం రూ.లక్షకు చేరిన తర్వాత కొద్దికాలంగా ఫ్లాట్గా కొనసాగుతున్న పసిడి ధరలు నేడు (శనివారం) ఒక్కసారిగా ఎగిసి కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. మరో వైపు వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్లపై ఎఫ్పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్లను నమ్మొద్దని సూచించింది. భారత్లో నివసించే పౌరులకు ఎఫ్పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది. -
మహిళా ఇన్వెస్టర్లపై సెబీ స్పెషల్ ఫోకస్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693.86 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 81,306.85 వద్ద, నిఫ్టీ 213.65 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 24,870.10 వద్ద నిలిచాయి.కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం, చెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్, ఏజెడ్ఎమ్ఓ లిమిటెడ్, ఫోసెకో ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, వండర్ ఎలక్ట్రికల్స్, ఫోర్స్ మోటార్స్, వింటా ల్యాబ్స్, డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
బంగారం అంటేనే అందరికీ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ 9K లేదా 9 క్యారెట్ గోల్డ్ ఒకటి ఉందని, దీని ధర చాలా తక్కువ ఉంటుందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో 9 క్యారెట్స్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.బంగారం పట్ల భారతీయులకు మక్కువ ఎక్కువ, అయితే 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాలి. కానీ 9 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే మాత్రం అంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఈ 9 క్యారెట్స్ బంగారానికి కూడా హాల్మార్కింగ్ ఉండాలని.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) స్పష్టం చేసింది.2025 ఆగస్టు నాటికి హాల్మార్క్ ప్యూరిటీల జాబితాలో 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్ మాత్రమే ఉండేవి. ఇటీవల 9 క్యారెట్స్ గోల్డ్ కూడా జాబితాలో చేరింది.24 క్యారెట్స్.. 9 క్యారెట్స్ బంగారం మధ్య వ్యత్యాసం24 క్యారెట్స్ బంగారం అనేది.. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అన్నమాట. అంటే ఇందులో దాదాపుగా ఇతర లోహాలు ఉండవు. అయితే 9 క్యారెట్స్ బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5 శాతం.. రాగి, వెండి లేదా జింక్ వంటి మిశ్రమ లోహాలతో కూడి ఉంటుంది.9 క్యారెట్స్ బంగారం ఎందుకు?అధిక క్యారెట్ల బంగారం ధర చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు.. ముఖ్యంగా యువకులు లేదా గ్రామీణ ప్రజలు దీనికోసం అంత డబ్బు కేటాయించలేరు. అలాంటి వారు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు. దీనికి హాల్మార్క్ కూడా ఉండటం వల్ల ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉంటారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?9 క్యారెట్స్ vs 24 క్యారెట్స్ గోల్డ్ ధరలుఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 10,000 కంటే ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే.. 10 గ్రాముల కోసం రూ. లక్ష కంటే ఎక్కువ కేటాయించాలి. అయితే ఒక గ్రామ్ 9 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 3,700 ఉంటుంది. ఈ బంగారాన్ని 10 గ్రాములు కొనాలంటే రూ. 37,000 పెట్టుబడి సరిపోతుంది. -
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు నేడు (శుక్రవారం) మళ్లీ దిగివచ్చాయి. వెండి ధరలు వరుస పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
250 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు తగ్గి 25,003కు చేరింది. సెన్సెక్స్(Sensex) 255 ప్లాయింట్లు దిగజారి 81,747 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏడాది చివరికి ఔన్స్కు 3,600 డాలర్లకు చేరుకోవచ్చని వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడుల పరంగా డిమాండ్ పసిడిని నడిపించొచ్చని తెలిపింది.కామెక్స్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర ఈ నెల 7న 3,534 డాలర్లను నమోదు చేయగా.. డిసెంబర్ నాటికి 3,600 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. దేశీ మార్కెట్లో పరిశీలిస్తే ఎంసీఎక్స్లో ఈ నెల 8న అక్టోబర్ నెల గోల్డ్ కాంట్రాక్టు (10 గ్రాములు) ధర రూ.1,02,250 రికార్డు స్థాయిని నమోదు చేసింది. అమెరికాలో బలహీన వృద్ధి, యూఎస్ డాలర్ ఇండెక్స్పై ఒత్తిళ్లు, పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను వెంచురా సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు తెలిపింది.‘‘ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడుల డిమాండ్ 3 శాతం పెరిగి రూ.1,249 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా 132 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు 16 శాతం పెరిగి జూన్ చివరికి 3,616 టన్నులుగా ఉన్నాయి’’ అని వెంచురా సెక్యూరిటీస్ వివరించింది. బంగారం నిర్వహణ ఆస్తుల విలువ ఏడాది కాలంలో 64 శాతం ఎగసి 383 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. దేశీయంగానూ ఇదే ధోరణి.. దేశీయంగానూ బంగారంపై పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు వెంచురా సెక్యూరిటీస్ గణాంకాలను ప్రస్తావించింది. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని బంగారం నిల్వలు జూన్ 30 చివరికి 66.68 టన్నులకు పెరిగినట్టు తెలిపింది. ఏడాది కాలంలో 42 శాతం పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని పసిడి ఆస్తుల విలువ ఇదే కాలంలో రెట్టింపై రూ.64,777 కోట్లకు చేరినట్టు పేర్కొంది.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్టర్ల ఖాతాలు (ఫోలియోలు) 41 శాతం పెరిగి 76.54 లక్షలకు చేరాయని.. ఏడాది కాలంలో 317 శాతం పెరిగినట్టు తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్లు తదితర డిజిటల్ గోల్డ్ సాధనాలపై పెట్టుబడులకు యువ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో బంగారం ఆభరణాల డిమాండ్ స్థిరంగా కొసాగుతోందని తెలిపింది. ముఖ్యంగా భౌతిక, డిజిటల్ బంగారంపై పెట్టుబడులతో కూడిన హైబ్రిడ్ విధానాలను అనుసరిస్తున్నట్టు పేర్కొంది. దీర్ఘకాలంలో రాబడులు.. ‘‘గత 20 ఏళ్లలో 14 సంవత్సరాల్లో బంగారం సానుకూల రాబడులు అందించింది. దీంతో విలువ పెరిగే సాధనంగా, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా బంగారానికి గుర్తింపు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల ర్యాలీ దీన్ని బలపరుస్తోంది. గత మూడేళ్లలో వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 సూచీ వార్షిక రాబడి 11 శాతంగానే ఉంది’’ అని వెంచురా సెక్యూరిటీస్ తన నివేదికలో వివరించింది.సెంట్రల్ బ్యాంక్లు సైతం స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడాన్ని ప్రస్తావించింది. సార్వభౌమ బంగారం బాండ్ల జారీని 2024 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ నిలిపివేయడంతో, ఈటీఎఫ్, ఇతర బంగారం డిజిటల్ సాధనాల్లోకి అధిక పెట్టుబడులు వెళ్లొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన యూఎస్ డాలర్కు తోడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో బంగారం ధరలు ఈ ఏడాది మిగిలిన కాలంలో స్థిరంగా ఎగువవైపు చలించొచ్చు’’అని వెంచురా సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,400 డాలర్ల సమీపంలో ఉంది. -
ఐపీవో గ్రే మార్కెట్కు సెబీ చెక్
ముంబై: ఐపీవోకంటే ముందు(ప్రీ ఐపీవో) లావాదేవీల నిర్వహణకు అధికారిక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుత అనధికార(గ్రే) మార్కెట్ లావాదేవీలకు చెక్ పెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నియంత్రణలకు లోబడి ప్రీఐపీవో లావాదేవీలు చేపట్టేందుకు కొత్త ప్లాట్ఫామ్ ఇన్వెస్టర్లను అనుమతించనుంది. ఐపీవో కేటాయింపులు(అలాట్మెంట్), స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ మధ్య మూడు రోజులపాటు లావాదేవీలకు వీలు కల్పించనుంది. దీంతో ప్రస్తుత గ్రే మార్కెట్ స్థానే నియంత్రిత లావాదేవీల ప్లాట్ఫామ్కు సెబీ తెరతీయనున్నట్లు పాండే వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రీలిస్టింగ్ సమాచారం ఒక్కటే సరిపోదని 2025 ఫిక్కీ క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా సెబీ చీఫ్ స్పష్టం చేశారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించడంతోపాటు.. ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుగా నియంత్రణలతోకూడిన ప్రీఐపీవో ట్రేడింగ్ను పరిశీలనాత్మకంగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.నగదు ఈక్విటీ మార్కెట్పై దృష్టిఈక్విటీ డెరివేటివ్స్ గడువు(ఎక్స్పైరీ)లోనూ మార్పులు చేపట్టనున్నట్లు పాండే సంకేతమిచ్చారు. వీటి కాలావధి, ఎక్స్పైరీని ఒక క్రమపద్ధతిలో పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది(2024–25) 91 శాతం వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోయిన ఇలాంటి ప్రొడక్టులకు కళ్లెం వేసే వీలుంటుందని పేర్కొన్నారు. నగదు ఈక్విటీ మార్కెట్లను విస్తరించే బాటలో ఈక్విటీ డెరివేటివ్స్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలియజేశారు. దీర్ఘకాలిక గడువుగల ప్రొడక్టులను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ నాణ్యతను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే సంబంధిత వర్గాలతో చర్చలు చేపట్టాక, ఒక క్రమపద్ధతిలో డెరివేటివ్ ప్రొడక్టుల మెచూరిటీపై నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. దీంతో హెడ్జింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు దన్నునివ్వనున్నట్లు వివరించారు. నగదు విభాగంలో పరిమాణం భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో లావాదేవీల పరిమాణం రెట్టింపైనట్లు తెలియజేశారు. పారదర్శకత కీలకమని, దీంతో క్యాపిటల్ మార్కెట్లలో నిధుల సమీకరణకు వీలుంటుందని వివరించారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 142.87 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో.. 82,000.71 వద్ద, నిఫ్టీ 33.20 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,083.75 వద్ద నిలిచాయి.ఇజ్మో లిమిటెడ్, డీపీ వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, NAVA, బీఎఫ్ యుటిలిటీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యూవై ఫిన్కార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హింద్ రెక్టిఫైయర్స్, బీఎస్ఈ లిమిటెడ్, మాస్టర్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 ప్లాయింట్లు పుంజుకుని 81,991 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు దారి ఏర్పడింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేటివ్యూ ఇండియా, పార్క్ మెడీ వరల్డ్, రన్వాల్ ఎంటర్ప్రైజెస్, జిన్కుషాల్ ఇండస్ట్రీస్, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ చేరాయి. ఈ కంపెనీలు 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 48 కంపెనీలు లిస్ట్కావడం గమనార్హం! ఈ నెలలో ఇప్పటివరకూ 11 కంపెనీలు ఐపీవోకురాగా.. వచ్చేవారం మరికొన్ని కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇష్యూల వివరాలు చూద్దాం..సెక్యూరిటీ సొల్యూషన్లుభద్రతా, నిఘా(సెక్యూరిటీ, సర్వెలెన్స్) సొల్యూషన్లు అందించే ఇన్నోవిటివ్యూ ఇండియా ఐపీవోకు రానుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా పూర్తిగా ప్రమోటర్లకు చేరనున్నాయి.ఆసుపత్రుల చైన్ఆరోగ్యపరిరక్షణ రంగ సంస్థ పార్క్ మెడి వరల్డ్ ఐపీవో చేపట్టనుంది. పార్క్ బ్రాండ్తో ఆసుపత్రులను నిర్వహిస్తున్న కంపెనీ తద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకోనుండగా.. ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు(కొత్త ఆసుపత్రుల ఏర్పాటు), పరికరాల కొనుగోలుకి వెచి్చంచనుంది. అనుబంధ సంస్థలు పార్క్ మెడిసిటీ(ఎన్సీఆర్), బ్లూహెవెన్స్ విస్తరణకు సైతం నిధులు వెచ్చించనుంది.రియల్టీ సంస్థఐపీవోకు రానున్న రియల్టీ అభివృద్ధి సంస్థ రన్వాల్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 450 కోట్లు అనుబంధ సంస్థలలో పెట్టుబడులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మెషీన్ల కంపెనీచత్తీస్గఢ్కు చెందిన మెషీన్ల ఎగుమతి కంపెనీ జిన్కుషాల్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 86.5 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 10 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఆగ్రోకెమికల్జైపూర్ సంస్థ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇలా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్తోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్ కిస్త్ మాతృ సంస్థ ఆన్ఈఎంఐ టెక్నాలజీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 88.79 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 750 కోట్లు అనుబంధ సంస్థ సై క్రెవా మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2016లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వేగవంత, సులభతర క్రెడిట్ సొల్యూషన్లు అందిస్తోంది. ప్రధానంగా యువతపై దృష్టిసారించింది. 2025 మార్చి31కల్లా 5.32 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. 91 లక్షలకుపైగా కస్టమర్లకు సేవలు సమకూర్చింది. రూ. 4,087 కోట్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,337 కోట్ల ఆదాయం, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ఐదో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరిగి 81,858 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 25,051 వద్ద స్థిరపడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు పెరిగి 81,985 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 25,089 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఐటీ 3%, టెక్ 2.22%, ఎఫ్ఎంసీజీ 1.36%, రియల్టి, టెలికమ్యూనికేషన్ 0.68% రాణించాయి. మిడ్, స్మా ల్ క్యాప్ సూచీలు 0.39%, 0.30% పెరిగాయి. బ్యాంకులు, చమురు, ఫైనాన్స్ సర్విసెస్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ⇒ ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రియల్ మనీ గేమింగ్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం లేదంటూ కంపెనీ వివరణ ఇచ్చినప్పట్టకీ.., నజరా టెక్నాలజీస్ షేరు 13% పతనమై రూ.1,222 వద్ద స్థిరపడింది. ఆన్మొబైల్ గ్లోబల్స్ షేరు 3.53% నష్టపోయి రూ.53.27 వద్ద నిలిచింది. ⇒ రీగల్ రిసోర్సెస్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.102)తో పోలిస్తే 39% ప్రీమియంతో రూ.142 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 43% ఎగసి రూ.146 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29% లాభంతో రూ.132 వద్ద ముగిసింది. కంపెనీ మార్కె ట్ విలువ రూ.1,352 కోట్లుగా నమోదైంది. -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు నెల రోజుల విరామం తర్వాత 25,000 మార్కును తిరిగి పొందగలిగింది. ఈ సూచీ చివరిసారిగా జూలై 24న 25,000 మార్క్ పైన ముగిసింది. నేడు ఐటీ షేర్లలో బలమైన లాభాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 25,089కు ఎగబాకి, చివరకు 70 పాయింట్లు లేదా 0.3 శాతం లాభంతో 25,050 స్థాయిల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే నిఫ్టీ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 563 పాయింట్లు లాభపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు (0.3 శాతం) లాభపడి 81,858 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ దాదాపు 4 శాతం లాభపడి రూ.1,495 స్థాయికి చేరుకోగా, ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే 165 పాయింట్లు లాభపడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా 1-3 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు దీర్ఘకాలంగా పనితీరు కనబరచకపోవడంతో విలువ కొనుగోళ్లు లాభపడటానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.బీఎస్ఈ సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ కూడా 1 శాతానికి పైగా క్షీణించాయి. విస్తృత సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ 0.3 శాతం పెరిగాయి.రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 1,718 షేర్లు క్షీణించగా, 2,347 షేర్లు లాభపడ్డాయి. అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ)ను నిషేధించే ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించడంతో వ్యక్తిగత షేర్లలో నజారా టెక్నాలజీస్ 13 శాతం నష్టపోయింది. -
బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గత రెండు రోజులుగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 24,933కు చేరింది. సెన్సెక్స్(Sensex) 130 ప్లాయింట్లు నష్టపోయి 81,510 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగోరోజూ రయ్..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో జీఎస్టీ సంస్కరణల ఆశావహ దృక్పథం కొనసాగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు నాలుగోరోజూ లాభాలు గడించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ (3%), టాటా మోటార్స్ (3.5%), ఎయిర్టెల్ (2.75%) షేర్లు రాణించి సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 24,980 వద్ద నిలిచింది. ⇒ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్స్టైల్ షేరు లిస్టింగ్లో గట్టెక్కింది. ఇష్యూ ధర (రూ.517)తో పోలిస్తే బీఎస్ఈలో 1.58% డిస్కౌంట్తో రూ.509 వద్ద లిస్టయ్యింది. అయితే ఇంట్రాడేలో 9% ఎగసి రూ.564 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6% లాభంతో రూ.546 వద్ద ముగిసింది.⇒ ట్రంప్ టారిఫ్ విధింపుతో టెక్స్టైల్ రంగంలో వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీని తాత్కలింగా తొలగించింది. దీంతో టెక్స్టైల్ షేర్లు వర్ధమాన్ టెక్స్టైల్స్ 9%, రేమాండ్ లైఫ్స్టైల్ 8%, వెల్స్పన్ లివింగ్ 6%, అరవింద్ లిమిటెడ్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 3% లాభపడ్డాయి.⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 87.13 వద్ద ముగిసింది. -
డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని, స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా రిచ్డాడ్ పాఠం పేరుతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేయదు. చాలా సందర్భాలలో ప్రజలను మాత్రమే కాకుండా దేశాలను కూడా పేదరికంగా మారుస్తుందని అన్నారు. కోట్లు సంపాదించేవారు కూడా పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ తరువాత సుమారు 7 సంవత్సరాలలో 65 శాతం మంది దివాళా తీస్తున్నారని రికార్డులు చూపిస్తున్నాయని కియోసాకి పేర్కొన్నారు. లాటరీ విజేతలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.లక్షలాది డాలర్లు సంపాదించే వారు కూడా పేదవారు అవుతున్నారు. అమెరికాలో సగటు పని చేసే వ్యక్తిని తీసుకోండి, ఒక వెయిటర్ 50 సంవత్సరాల పాటు పనిచేసి సుమారు 1.75 మిలియన్ డాలర్లు సంపాదించాడు అనుకుంటే.. కొన్నేళ్ళకు ఆ డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!డబ్బు సంపాదించినప్పటికీ పేదవారుగా ఎందుకు అవవుతున్నారు?.. ఇది ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్నకు.. పేద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించే పూర్ ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ కారణమని రాబర్ట్ కియోసాకి సమాధానం ఇచ్చారు. ధనవంతులు కావాలంటే.. ధనవంతులైన వ్యక్తులను వెతకండి. విజయవంతమైన వ్యక్తుల గురించి తెలుసుకోండి అని ఆయన అన్నారు.లాటరీ గెలిచి ఎందుకు నష్టపోవాలి లేదా జీవితాంతం పని చేసి ఎందుకు పేదవాడిగా మారాలి? అనే ప్రశ్నకు.. నువ్వు దానికంటే చాలా తెలివైనవాడివిగా ఉండాలని రాబర్ట్ కియోసాకి సింపుల్గా సమాధానం ఇచ్చారు.RICHDAD $ LESSON:Q: Does money make you rich?A: NO: In most cases money makes people and countries poorer.Take extreme examples of college sports stars who join a pro team earning Millions. Records show that 65% are bankrupt 7-years after retirement. The same is true…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 19, 2025 -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 370.64 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 81,644.39 వద్ద, నిఫ్టీ 103.70 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 24,980.65 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, కేఐఓసీఎల్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, వర్ధమాన్ పాలిటెక్స్, భారత్ గేర్స్ వంటి కంపెనీలు చేరాయి. నిట్కో, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్డిజి టెక్, రెలియబుల్ డేటా సర్వీసెస్, SP అప్పారల్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్ది రోజులుగా పసిడి ధరలు.. తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 24,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 81,417 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్బీఎఫ్సీ బాహుబలి ఐపీవో!
న్యూఢిల్లీ: అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. లిస్టింగ్కు వీలుగా టాటా గ్రూప్ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. టాటా క్యాపిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ 2023 నవంబర్లో ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది. -
బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
బంగారం, వెండి & బిట్కాయిన్.. ఈ మూడు గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు భారీ రాబడులను ఇచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే బంగారం ధర 40 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేజీ వెండి ధర రూ.1.16 లక్షల వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ అద్భుతాలు చేస్తోంది. దీని విలువ 111 శాతం పెరిగి, కోటి రూపాయలు దాటేసింది. ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలని కొందరు పెట్టుబడిదారులు సతమతమవుతుంటారు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కియోసాకి & వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే..'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్ 'నిజమైన డబ్బు' అని చెబుతారు. ఎందుకంటే డబ్బును అదా చేస్తే.. దాని విలువ పెరగదు. వీటిపై (బంగారం, వెండి, బిట్కాయిన్) ఇన్వెస్ట్ చేస్తే విలువ పెరుగుతుంది, సంపన్నులవుతారని అంటారు. డాలర్ లాంటి కరెన్సీలను ఆయన 'నకిలీ డబ్బు' అని పిలుస్తారు.పేదలు, మధ్యతరగతి వారు దాదాపు డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఆ డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కానీ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారం, చమురు, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సంపద పెరుగుతుందని కియోసాకి చెబుతారు.ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్.. పెట్టుబడిదారుడిగా అతని జ్ఞానాన్ని పెట్టుబడి ప్రపంచంలో బైబిల్గా పరిగణిస్తారు. అయితే బంగారం పనికిరానిదని, వెండి మంచిదని, బిట్కాయిన్కు విలువ లేదని చెబుతారు. బంగారం ఏమీ చేయదు.. అక్కడే ఉంటుంది. ఏదైనా ఆస్తి ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుందని బఫెట్ విశ్వసిస్తారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం మీద పెట్టుబడి చూపడానికి ఆసక్తి చూపని బఫెట్.. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతారు. ఎందుకంటే.. వెండి ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి మంచి వాల్యూ ఉంటుందని చెబుతారు. బిట్కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ఏ ఉత్పాదక కార్యకలాపాలతోనూ సంబంధం లేదని ఆయన నమ్ముతారు.గమనిక: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటిపై తప్పకుండా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడులు పెడితే.. లాభాల సంగతి దేవుడెరుగు, నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీటిపై అవగాహన పెంచుకోవాలనే విషయం మర్చిపోవద్దు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 676.09 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు లేదా 1.00 శాతం లాభంతో 24,876.95 వద్ద నిలిచాయి.పెన్నార్ ఇండస్ట్రీస్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, IFB ఇండస్ట్రీస్, సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, రవీందర్ హైట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, NDL వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ కొత్త ధరకు వెండి.. బంగారం మాత్రం అక్కడే..
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈరోజు (సోమవారం) కూడా నిలకడగా కొనసాగాయి. ఓవైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: ‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం! -
1,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 339 పాయింట్లు పెరిగి 24,941కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1037 ప్లాయింట్లు పుంజుకుని 81,635 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవో బాటలో పవరికా
న్యూఢిల్లీ: పవర్ సొల్యూషన్లు అందించే పవరికా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా మొత్తం రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రమోటర్లలో నరేష్ ఒబెరాయ్ కుటుంబ ట్రస్ట్ రూ. 490 కోట్లు, కబీర్, కిమయా ఫ్యామిలీ ప్రయివేట్ ట్రస్ట్ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కాగా.. కంపెనీ ఇంతక్రితం 2019లోనూ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ ఐపీవో చేపట్టకపోవడం గమనార్హం! కంపెనీ ప్రధానంగా డీజిల్ జనరేటర్(డీజీ) సెట్లు, మధ్యస్థాయి స్పీడ్ భారీ జనరేటర్లు(ఎంఎస్ఎల్జీ), తత్సంబంధ సరీ్వసులను అందిస్తోంది. -
జీఎస్టీ సంస్కరణలే దిక్సూచి
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్అండ్పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం... రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు. జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కీలకం..కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ మినిట్స్ ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.రేటింగ్ ఎఫెక్ట్ గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్లుక్తో బీబీబీ రేటింగ్ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్అండ్పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.గత వారమిలా.. నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.సాంకేతికంగా చూస్తే.. ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి ఇటీవల దేశీ స్టాక్స్లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఖరీదైపోయింది. ఒకప్పుడు దేశంలోనే అందుబాటు ఇళ్ల ధరల మార్కెట్లో హైదరాబాద్ ముందు వరసలో నిలవగా.. ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన రెండో నగరంగా అభివృద్ధి చెందింది. ఆధునిక వసతులు, విలాసవంతమైన జీవన శైలి, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు, నిర్మాణ వ్యయాలు, భూములు, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల వంటివి నగరంలో ఇళ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. లగ్జరీదే మూడో వంతు వాటా.. నగరంలో ఇళ్ల అమ్మకాల్లో విలాసవంతమైన గృహాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మొత్తం విక్రయాలలో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఆస్తుల వాటా మూడో వంతు కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. క్రెడాయ్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. జనవరి–జూన్ మధ్య కాలంలో నగరంలో రూ.56,345 కోట్ల విలువైన 30,553 ఇళ్ల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ.3 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల విలువలో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ధర ఉన్న ప్రీమియం ఫ్లాట్ల వాటా మరో 34 శాతంగా ఉంది. ధర ఏడాదిలో రూ.20 లక్షల పెరుగుదల.. కరోనా మహమ్మారి తర్వాత నగరంలో లగ్జరీ గృహాల మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ లగ్జరీ ప్రాపర్టీ విభాగానికి బూస్ట్ లాగా మారింది. దీంతో నగరంలో ఏటా గృహాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. సగటు టికెట్ పరిమాణం పరిశీలిస్తే.. 2024 ప్రారంభంలో రూ.1.62 కోట్లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా రూ.1.84 కోట్లకు చేరుకుంది. ఏడాదిలో రూ.20 లక్షల వరకూ ధరలు పెరిగాయి. ఎన్సీఆర్ తర్వాత దేశంలో రెండో అత్యంత ఖరీదైన మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది. అందుబాటు ఇళ్ల కొరత.. నగరంలో సగటు కొనుగోలుదారుకు ఇంటి యాజమాన్యం అందుబాటులో ఉండటం లేదు. సరసమైన గృహాలు దాదాపు కనుమరుగయ్యాయి. రూ.70 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఫ్లాట్ల అమ్మకాల విలువలో కేవలం 3 శాతమే ఉండటమే ఉదాహరణ. ఇవి కూడా ఎక్కువగా ఇస్నాపూర్, ఆదిభట్ల, కిస్మత్పూర్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. నగరంలో అందుబాటు గృహాల కొరత తీవ్రంగా ఉంది. చాలా మంది కొనుగోలుదారులు కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలకు సమీపంలో ఉన్న లగ్జరీ గృహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి పశ్చిమ హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.10వేలుగా ఉండగా.. ఇతర ప్రాంతాలలో రూ.8 వేలుగా ఉంది. -
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ జాక్పాట్ కొట్టారు. అమాంతం ఎగిసిన షేర్లను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ వారం ఆయన 2,01,404 కంపెనీ షేర్లను విక్రయించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) వద్ద ఫారం 4 ఫైలింగ్ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో తాను అనుసరించిన ముందస్తు ‘10 బి 5-1’ ట్రేడింగ్ ప్లాన్ కింద ఆగస్టు 11, 12, 13 తేదీలలో లావాదేవీలు జరిగాయి.ఈ షేర్లను 180.026 డాలర్ల నుంచి 183.6417 డాలర్ల వరకు విక్రయించి మొత్తం 40,959,534 డాలర్ల (సుమారు రూ.334 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించారు. ఇన్వెస్టింగ్.కామ్ (Investing.com) నివేదిక ప్రకారం.. ఎన్విడియా స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి 184.48 డాలర్లకు దగ్గరగా ట్రేడ్ కావడంతో ఈ లావాదేవీలు జరిగాయి. ఎన్విడియా గత 12 నెలల్లో 86% ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఈ లావాదేవీల తర్వాత హువాంగ్ కు కంపెనీలో ఇంకా 72,998,225 షేర్లు ఉన్నాయి.ఏమిటీ 10బి5-1 ట్రేడింగ్ ప్లాన్?రూల్ 10బి5-1 అనేది యూఎస్ ఎస్ఈసీ నుండి వచ్చిన నిబంధన. ఇది పబ్లిక్ లిస్టెడ్ సంస్థలలోని ఇన్సైడర్లు తమ వాటాలను ముందుగానే విక్రయించే ప్రణాళికను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. ఈ నియమం ప్రకారం, ప్రధాన వాటాదారులు నిర్ణీత సమయంలో నిర్ణీత సంఖ్యలో షేర్ల అమ్మకాన్ని షెడ్యూల్ చేయవచ్చు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు ఆస్కారం ఉండదు. చాలా మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఈ కారణంగా 10b5-1 ప్లాన్ లను ఉపయోగిస్తారు. -
తగ్గుతున్న బంగారం ధరలు: వరుసగా ఎనిమిదో రోజు ఇలా
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ రోజు (శనివారం) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 60 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. పసిడి ధరలు తగ్గుతుంటే.. వెండి మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ కథనంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీవోకి ఆర్ఎస్ బ్రదర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల రిటైలింగ్ సంస్థ ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా (ఆర్ఎస్ బ్రదర్స్) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, రూ. 118 కోట్ల మొత్తాన్ని ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్స్ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 73 స్టోర్స్ ఉన్నాయి. సౌతిండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్, వేల్యూ జోన్ హైపర్మార్ట్ పేరిట వివిధ ఫార్మాట్లలో స్టోర్స్ నిర్వహిస్తోంది. పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, తిరువీధుల ప్రసాద రావు తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు. 2024–25లో కంపెనీ రూ. 2,694 కోట్ల ఆదాయం, రూ. 104 కోట్ల లాభం నమోదు చేసింది. -
‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం!
దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలకు బంగారమంటే మక్కువ తగ్గకుండా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగా పసిడి ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.భారతదేశం స్వాతంత్య్రం పొందిన 1947లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.88 మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికి అది రూ.1,04,000 దాటింది. అంటే దాదాపు 1,100 రెట్లు పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల వెనుక ఉన్న కారణాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోయినా, ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది దేశీయ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారక రేటు, భారతీయుల సంప్రదాయాల మిశ్రమ ప్రభావం. బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ రావడంతో దీన్ని "సురక్షిత పెట్టుబడి"గా భావించే ధోరణి పెరుగుతోంది.వందల నుంచి లక్షలకు..1950లలో తులం బంగారం ధర రూ.100కు చేరగా, 1970లో రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200, 2000లో రూ.4,400గా నమోదైంది. 2010 నాటికి ఇది రూ.18,500కు పెరిగింది. 2020 నాటికి రూ.50,151గా ఉండగా, 2025 నాటికి రూ.1,04,320కి చేరింది. ఈ గణాంకాలు చూస్తే, ప్రతి దశలో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మార్కెట్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల మానసిక ధోరణి కూడా దీనిపై ప్రభావం చూపాయి.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుద్రవ్యోల్బణం: రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.అంతర్జాతీయ సంక్షోభాలు: యుద్ధాలు, మహమ్మారులు వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు.రూపాయి-డాలర్ మారక రేటు: రూపాయి బలహీనత కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.భారతీయ డిమాండ్: పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాల వల్ల బంగారం డిమాండ్ ఎప్పటికీ అధికంగా ఉంటోంది.కేంద్ర బ్యాంకుల విధానాలు: బంగారం నిల్వల కొనుగోలు, అమ్మకాలు ధరలపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. "బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులకు భద్రతను కలిగించే సాధనం," అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తమ బంగారం నిల్వలను పెంచడం ద్వారా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్బీఐ వంటి సంస్థలు బంగారం కొనుగోలు చేయడం, నిల్వలు పెంచడం వంటి చర్యలు మార్కెట్లో దీని విలువను స్థిరంగా ఉంచుతున్నాయి.