Market
-
బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే..
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? అనే విషయాన్ని వెల్లడించారు. తనను ప్రతిరోజూ ఒక ప్రశ్న అడుగుతున్నారని, దానికి సమాధానం చాలా సులభమని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.నేను ప్రభుత్వం ముద్రించే డబ్బులో పెట్టుబడి పెట్టను. నేను స్టాక్స్,బాండ్స్, ఈటీఎఫ్స్ కొనను. నా పెట్టుబడులు మొత్తం వ్యాపారాలు, బంగారు గనులు, చమురు బావులు, పశువులపైన ఉంటాయి. నా పశువులు కూడా డబ్బు సంపాదించి పెడతాయి. అవి పిల్లలను కన్న ప్రతిసారీ, నాకు రాబడి పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. ధనవంతులు ఎప్పుడూ కూడా నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు. అంటే వారు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టతారన్నమాట. ప్రభుత్వం కేవలం డబ్బును ముద్రించగలదు. కానీ.. గోల్డ్, ఆయిల్, పశువులు వంటివాటిని ముద్రించలేదు. కాబట్టి ఇవే నిజమైన విలువైన ఆస్తులు. కాబట్టి డబ్బును నిజమైన ఆస్తుల్లో పెడుతున్నారా, లేదా ప్రతిరోజూ కొత్తగా ముద్రితమవుతున్న డాలర్లను ధనంగా పరిగణించే సిస్టమ్పై నమ్మకం పెడుతున్నారా? అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని కియోసాకి వెల్లడించారు.గోల్డ్, చమురు, పశువులపై పెట్టుబడి పెట్టడానికి డబ్బులేదు అని చాలామంది అనుకుంటారు. కానీ తక్కువ డబ్బుతో ప్రారభించడం మంచిది. ఉద్యోగం కాదు.. అదనపు ఆదాయం కోసం పనిచేయడం కూడా కాదు. మీరు విశ్రాంతి తీసుకున్నపుడు కూడా డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని రిచ్ డాడ్ చెబుతారు.ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్: వివరాలు లీక్! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 382.50 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 74,649.84 వద్ద, నిఫ్టీ 100.95 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 23,483.55 వద్ద నిలిచాయి.థాకర్ & కంపెనీ లిమిటెడ్, జీనా సిఖో లైఫ్కేర్ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, పయనీర్ ఇన్వెస్ట్కార్ప్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్, మ్యానుగ్రాఫ్ ఇండియా లిమిటెడ్, బి&బి ట్రిపుల్వాల్ కంటైనర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు 'నో' చెప్పాలి?
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు ఎవరు? అంటే.. తప్పకుండా దీనికి సమాధానం 'వారెన్ బఫెట్' అనే చెబుతారు. ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా నష్టాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే ఈయన.. ఇప్పటికీ ఎంతోమందికి మార్గదర్శం. ఇన్వెస్టర్గా బఫెట్ సాధించిన విజయాల కంటే.. ఎప్పుడు నో చెప్పాలో తెలిస్తే తప్పకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన బలంగా విశ్వసిస్తారు.తాను పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టకూడదని వారెన్ బఫెట్ చెబుతారు. ఈ క్రమశిక్షణే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆయనను నష్టాల నుంచి కాపాడింది.2008 సెప్టెంబర్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దిగ్గజ సంస్థలు సైతం దివాలా అంచుకు చేరుకున్నాయి. ఆ సమయంలో ఏఐజీ, లెహ్మాన్ బ్రదర్స్ సంస్థలు ఆర్థిక సహాయం కోసం బఫెట్ను సంప్రదించాయి. అయితే బఫెట్ ఆ సంస్థల ఆర్థిక పరిస్థితిని, వ్యాపార నమూనాను, రిస్కులను పూర్తిగా పరిశీలించిన తరువాత సహాయం చేయడానికి నిరాకరించారు. ఆ తరువాత లెహ్మాన్ బ్రదర్స్ సంస్థ దివాలా తీసింది.ఒకవేళా బఫెట్ ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఉంటే.. ఆయన కూడా ఆ నష్టాల్లో భాగస్వామి కావాల్సి వచ్చేది. ముందుగానే ఆలోచించి ఇన్వెస్ట్ చేయడానికి నిరాకరించారు. దీన్ని బట్టి చూస్తే బఫెట్ తీసుకున్న నిర్ణయాలు ఎంత సరైనవో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బఫెట్ నుంచి పెట్టుబడిదారులు నేర్చుకోవాల్సిన ఐదు పాఠాలుఅర్థం అయ్యే వ్యాపారాల్లోనే పెట్టుబడి పెట్టాలి: ఏ వ్యాపారం ఎలా డబ్బు సంపాదిస్తుందో, దాని భవిష్యత్తు ఏమిటో, దాని రిస్కులు ఏమిటో అర్థం కాకపోతే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టకూడదు. కేవలం ఇతరులు కొనుగోలు చేస్తున్నారని లేదా షేర్ ధర పెరుగుతోందని పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం.లిక్విడిటీ (నగదు లభ్యత) చాలా ముఖ్యం: కొన్ని కంపెనీలు లాభదాయకంగా కనిపించినా.. తక్షణ అవసరాలకు సరిపడా నగదు లేకపోతే సమస్యల్లో పడవచ్చు. అందువల్ల పెట్టుబడిదారులు కంపెనీ నగదు నిల్వలు, అప్పుల స్థాయి, చెల్లింపుల సామర్థ్యాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి.సంక్షోభంలో ఉంటే జాగ్రత్త అవసరం: కొన్నిసార్లు ఒక కంపెనీ సమస్య మొత్తం రంగానికే వ్యాపిస్తుంది. దీనిని కాంటేజియన్ ఎఫెక్ట్ అంటారు. ఒక కంపెనీ కుప్పకూలితే.. అదే రంగంలోని ఇతర కంపెనీలు కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం.నమ్మకం ప్రధానం: ప్రత్యేకించి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ప్రజల నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఒకసారి పెట్టుబడిదారులు లేదా వినియోగదారులు నమ్మకం కోల్పోతే ఆ సంస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది. అందువల్ల పారదర్శకత, నిజాయితీ, మంచి యాజమాన్యం ఉన్న కంపెనీలను ఎంచుకోవాలి.బలమైన కంపెనీలకే మూలధనం: ఆర్థికంగా బలమైన కంపెనీలు కష్టకాలంలో కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. బ్యాంకులు, పెట్టుబడిదారులు, మార్కెట్ వాటికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే దీర్ఘకాలికంగా సంపద సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.వారెన్ బఫెట్ ప్రకారం.. ప్రతి అవకాశాన్ని అందుకోవడం కంటే, సరైన అవకాశాన్ని మాత్రమే ఎంచుకోవడం పెట్టుబడిలో విజయం సాధించే మార్గం. కొన్నిసార్లు 'నో' అని చెప్పడం కూడా మంచి పెట్టుబడి నిర్ణయమే అవుతుంది. ''స్పష్టత, క్రమశిక్షణ, ప్రాథమిక విశ్లేషణ, సహనం'' ఇవే విజయవంతమైన పెట్టుబడిదారుడి అసలైన ఆయుధాలు.ఇదీ చదవండి: రూ.72 లక్షల జాబ్ ఆఫర్.. అందుకే రిజెక్ట్ చేసాడు! -
నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు నష్టపోయి 23,266 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 323 పాయింట్లు దిగజారి 73,958 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.19బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.44 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.42 శాతం పుంజుకుంది.Today Nifty position 02-06-2026(time: 09:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 508.40 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో 74,267.34 వద్ద, నిఫ్టీ 165.15 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 23,382.60 వద్ద నిలిచాయి.ఎన్ఐఐటీ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, లంబోధర టెక్స్టైల్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, పశుపతి అక్రిలాన్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీనా సిఖో లైఫ్కేర్ లిమిటెడ్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్, అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మరింత పడిపోయిన బంగారం.. కొనేవాళ్లకు పండుగే!
దేశంలో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. మూడు రోజుల క్రితం భారీ పెరుగుదల అనంతరం తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరోసారి మరింతగా దిగివచ్చాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఊరటని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 23,585 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 162 పాయింట్లు పుంజుకొని 74,937 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం పెరిగింది.నాస్డాక్ 0.21 శాతం పుంజుకుంది.Today Nifty position 01-06-2026(time: 09:55 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జీడీపీ, ఆర్బీఐ పాలసీపై ఫోకస్
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ఓవైపు యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు ప్రభావం చూపనుండగా.. మరోపక్క ఆర్బీఐ పరపతి సమీక్ష, క్యూ4 జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. పశ్చిమాసియా సంక్షోభంపై రోజుకో రకంగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలకు రెక్కలురావడంతో పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా భారత్ చమురు వినియోగంలో 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడటంతో రూపాయి బలహీనపడుతోంది. దిగుమతుల బిల్లులో పసిడి, చమురు ప్రధా న పాత్ర పోషిస్తుండటం దీనికి కారణంకాగా.. వాణిజ్య లోటు పెరుగుతోంది. వెరసి పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం భారత్కు సానుకూల అంశమని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్, ఇరాన్ చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. గణాంకాల విడుదల నేడు(సోమవారం) ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. 2026 మార్చిలో ఐఐపీ 4.1 శాతం ఎగసింది. ఫిబ్రవరిలో సవరించిన 5.1 శాతం గణాంకాలతో పోలిస్తే కొంతమేర వెనకడుగు వేసింది. అంతేకాకుండా మే నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసెస్, కాంపోజిట్ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో దాదాపు నాలుగేళ్లలోనే తక్కువస్థాయి తయారీ పీఎంఐ 54.3కు మందగించింది. వీటితోపాటు మే నెలకు ఆటో రంగ(వాహన విక్రయ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 2025–26 క్యూ4, పూర్తి ఏడాది జీడీపీ గణాంకాలు జూన్ 5న విడుదల కానున్నాయి.వడ్డీ రేట్లు యథాతథం! వారాంతాన(జూన్ 5న) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడుతుంది. క్రూడ్ సెగతో ధరలకు రెక్కలొస్తున్న విషయం విదితమే. దీంతో టోకుతోపాటు, రిటైల్ ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. దీంతో కఠిన విధానాలవైపు ఆర్బీఐ మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం రిసు్కలున్నప్పటికీ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును మరోసారి 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు పేర్కొంటున్నారు. గత రెండు పాలసీ సమీక్షలలో ఆర్బీఐ రెపో రేటులో స్టేటస్ కో అమలు చేసిన సంగతి తెలిసిందే. లిక్విడిటీ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆర్బీఐ స్పందన సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. ఆర్బీఐ పాలసీ, జీడీపీ, ఐఐపీ, ఆటో రంగ గణాంకాలు సమీప భవిష్యత్లో మార్కెట్ల నడకను ప్రభావితం చేయన్నుట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు, ఎఫ్పీఐల షాక్ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మే నెలలోనూ రూ. 33,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 2.25 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తద్వారా మొత్తం 2025 ఏడాదిలో చేపట్టిన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను మించిపోవడం గమనార్హం!! ఇతర దేశ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండటం, రూపాయి బలహీనత తదితర అంశాలు దీనికి కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మినహా ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లోనూ ఎఫ్పీఐలు విక్రయాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.సాంకేతికంగా చూస్తే.. గత వారం ప్రధాన ఇండెక్సులు తొలుత బలపడినప్పటికీ ఎగువ స్థాయిలవద్ద నిలదొక్కుకోలేకపోయాయి. వారాంతాన ఉన్నట్టుండి పెరిగిన భారీ అమ్మకాలతో బలహీనపడ్డాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 23,000 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆపై అమ్మకాలు కొనసాగితే సమీప భవిష్యత్లో 22,400 వరకూ పతనమయ్యే చాన్సుంది. ఈస్థాయిల వద్ద బలమైన సపోర్ట్కు వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టీవీఎస్ సప్లై చైన్ ఫలితాలు అదుర్స్!
ప్రయివేట్ రంగ సంస్థ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలనువీడి రూ. 18 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4 కోట్ల నికర నష్టం ప్రకటించింది.మొత్తం ఆదాయం సైతం 21 శాతం ఎగసి రూ. 3,032 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,499 కోట్ల టర్నోవర్ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 10 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,996 కోట్ల నుంచి రూ. 11,003 కోట్లకు బలపడింది. -
స్టాక్ మార్కెట్ అలర్ట్: ట్రేడింగ్ సమయంలో మార్పు
డెరివేటివ్స్ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్–ఎఫ్అండ్ఓ) విభాగంలో ట్రేడింగ్ సమయాలను పొడిగిస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం 2026 ఆగస్టు 3 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సాధారణ ట్రేడింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3:40 గంటలకు మారనుంది. ప్రీ-ఓపెన్ సెషన్, మార్కెట్ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.క్యాష్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్న ‘క్లోజింగ్ ఆక్షన్ సెషన్’ (CAS)తో డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాలను సమలేఖనం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఎన్ఎస్ఈ వెల్లడించింది. కొత్త విధానంలో క్యాష్ మార్కెట్లో మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు క్లోజింగ్ ఆక్షన్ నిర్వహించి, ఆ రోజు అధికారిక ముగింపు ధర (Closing Price)ను నిర్ణయించనున్నారు.ట్రేడర్లకు మరింత వెసులుబాటుక్లోజింగ్ ఆక్షన్ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్అండ్ఓ ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభిస్తుంది. దీంతో క్యాష్, డెరివేటివ్స్ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.మారని అంశాలు ఇవే...ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకే ప్రారంభంరెగ్యులర్ మార్కెట్ ప్రారంభ సమయం యథాతథంట్రేడ్ మాడిఫికేషన్ సౌకర్యం సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతుందిఎఫ్అండ్ఓ క్లోజింగ్ ధరల లెక్కింపునకు ఉపయోగించే VWAP విండోను 3:10–3:40 గంటల మధ్య ట్రేడింగ్కు అనుగుణంగా సవరించనున్నారు.ఇటీవలి కీలక మార్పులుగత కొంతకాలంగా డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ఎస్ఈ పలు సంస్కరణలను అమలు చేస్తోంది. 2025 చివర్లో ఎఫ్అండ్ఓ విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు క్లోజింగ్ ఆక్షన్ వ్యవస్థకు అనుగుణంగా ట్రేడింగ్ సమయాన్ని కూడా పొడిగిస్తోంది. మార్కెట్ పారదర్శకత, మెరుగైన ధరల నిర్ణయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు. -
పండుగలా దిగివచ్చిన పసిడి, వెండి..
దేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే వారం మొత్తంలో పెరుగుదల కంటే తగ్గుదలే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మే 25 నుంచి మే 31 మధ్య పసిడి, వెండి ధరలు వరుస తగ్గుదలతో కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి.మే 25తో పోలిస్తే మే 31 నాటికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,380 నుంచి రూ.1,57,040కు చేరి రూ.2,340 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,100 నుంచి రూ.1,43,950కు తగ్గి రూ.2,150 మేర దిగివచ్చింది.బంగారం ధరలు మారాయిలా..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మే 25న రూ.1,59,380 ఉండగా, మే 26న రూ.490 తగ్గి రూ.1,58,890కు చేరింది. మే 27న మరో రూ.600 తగ్గి రూ.1,58,290, మే 28న ఏకంగా రూ.2,230 పడిపోయి రూ.1,56,060కు చేరింది. అయితే మే 29న రూ.1,580 పెరిగి రూ.1,57,640కు చేరగా, మే 30న రూ.600 తగ్గి రూ.1,57,040కు పడిపోయింది. మే 31న స్థిరంగా కొనసాగింది.ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మే 25న రూ.1,46,100 నుంచి మే 26న రూ.450, మే 27న రూ.550, మే 28న రూ.2,050 తగ్గి రూ.1,43,050కు చేరింది. అనంతరం మే 29న రూ.1,450 పెరిగి రూ.1,44,500కు చేరగా, మే 30న రూ.550 తగ్గి రూ.1,43,950కు పడిపోయి, మే 31న అదే స్థాయిలో నిలిచింది.వెండిలోనూ తగ్గుదలవెండి ధరలు కూడా వారాంతానికి బలహీనతను చూపించాయి. వెండి ధరలు కేజీకి మే 25, 26 తేదీల్లో రూ.2.95 లక్షల వద్ద స్థిరంగా ఉండగా, మే 27న రూ.5,000 తగ్గి రూ.2.90 లక్షలకు చేరాయి. మే 28న మరో రూ.5,000 తగ్గి రూ.2.85 లక్షలకు పడిపోయినా, మే 29న తిరిగి రూ.5,000 పెరిగి రూ.2.90 లక్షలకు చేరాయి. మే 30, 31 తేదీల్లో అదే స్థాయిలో కొనసాగాయి. మొత్తంగా వారాంతానికి వెండి కేజీకి రూ.5,000 తగ్గిందన్న మాట.అంతర్జాతీయ మార్కెట్లలో పారిశ్రామిక డిమాండ్ అంచనాలు, డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ ప్రభావంతో కిలో వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. దేశీయ బులియన్ మార్కెట్లలో కొనుగోళ్లు మందగించడం కూడా వెండి ధరలపై ప్రభావం చూపింది.బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలివే..ఈ వారం బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా రావడం, డాలర్ సూచీ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగవచ్చన్న అంచనాలు బంగారంపై ఒత్తిడిని పెంచాయి. మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతలపై కొంత ఉపశమనం కనిపించడంతో సేఫ్హేవన్ ఆస్తిగా బంగారంపై డిమాండ్ తగ్గింది. దీంతో అంతర్జాతీయ బులియన్ ధరలు సరిదిద్దుకునే దిశగా కదిలాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ ప్రతిబింబించింది.ఇదీ చదవండి: బంగారం ఖరీదంటే భ్రమే!వచ్చే వారం ఎలా ఉంటుంది?విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా ఫెడ్ విధాన నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు వచ్చే రోజుల్లో బంగారం, వెండి ధరలకు కీలకంగా మారనున్నాయి. ధరలు ఇటీవల గరిష్ఠ స్థాయిల నుంచి కొంత వెనక్కి వచ్చినప్పటికీ, దీర్ఘకాల పెట్టుబడిదారుల దృష్టిలో విలువైన లోహాలపై ఆసక్తి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే వారంలో అంతర్జాతీయ సంకేతాల ఆధారంగా మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. -
విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్?
ఆకాశంలో ఫ్లైట్స్ ఎన్నో ఎగురుతూ ఉంటాయి. విమానాల వల్లే సుదూర ప్రాంతాలకు తొందరగా చేరుకోగలుగుతున్నాం. ఏ రంగమైనా రెవెన్యూతో ముడిపడి ఉంటుంది. మరి ఫ్లైట్ రెవెన్యూ అంటే అసలుఏంటి? ఒక ఎయిర్లైన్ సంస్థకు విమాన ప్రయాణాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఫ్లైట్ రెవెన్యూ అంటారు.ప్రధానంగా రెవెన్యూ వచ్చే మార్గాలుప్రయాణికుల టికెట్ బుకింగ్స్ నుంచి అంటే.. బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి అదనపు లగేజ్ చార్జీలు ఫుడ్ అండ్ బెవరేజ్ సేల్స్ కార్గో అండ్ పార్సల్ సర్వీసులు, ఇన్ఫ్లైట్ వైఫై లేదా ప్రీమియం సేవలు అంటే ఇది దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పైలట్ అండ్ సిబ్బంది జీతాలు, ఎయిర్పోర్ట్ చార్జీలు, విమాన మెయింటెనెన్స్, ట్యాక్సీలు ఇవన్నీ కలిపి కూడా ఫ్లైట్ రెవెన్యూ కిందకు వస్తుంటాయి.ఎగరడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం..ఉదాహరణకు.. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్ బస్ A380 ఒక సింగల్ ఫ్లైట్ లో ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి లండన్ వెళ్తుంది అనుకుందాం. ప్రయాణం 7 గంటలు పడుతుందనుకుందాం. దీంట్లో 506 సీట్స్ ఉంటాయి. ఫుల్లీ బుక్డ్ అనుకుందాం.. ఈ ఫ్లైట్ మొత్తం మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో 14 ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటే అందులో నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం అక్షరాల ఒకటిన్నర కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన సీట్లు ఉంటాయి కదా.. 76 బిజినెస్ క్లాట్స్ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. మరి అందులో నుంచి వారికి 86 అంటే 86.2 లాక్స్ ఆదాయం వస్తుంది. అలాగే 416 ఎకానమీ ప్యాసెంజర్ సీట్స్ ఉంటాయి.అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత మిగిలిన సీట్స్ తర్వాత ఎకానమీ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. వాళ్ల నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం 1/2 కోట్లు ఉండొచ్చు. మరి ఇక టికెట్ రెవెన్యూ రఫ్ గా చూసుకున్నట్లయితే వీళ్లకి రూ.3.16 కోట్లు. అలాగే మన కార్గో చార్జీలు అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా వాళ్లకి వచ్చే ఆదాయం 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక టోటల్ రెవెన్యూ మాత్రం దగ్గర దగ్గరగా 3.83 కోట్ల వరకు వస్తుంది.ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చు?ఒకవేళ ఈ ఫ్లైట్ నే తీసుకుందాం A380. ఈ ఫ్లైట్ అసలు నడవడానికి కొంతవరకు బర్న్ అయ్యే ఫ్యూయల్ ఉంటుంది కదా.. ఒకవేళ 2600 గలోన్స్ ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్ ఉంటే ఒక ఫ్లైట్ కి కావాల్సింది 27600 గెలోన్స్ దీనికి కాస్ట్ ఎంత పడుతుందనుకుంటున్నారు? నియర్లీ 60,000 డాలర్.. అంటే అక్షరాల రూ.57 లక్షలు అవుతుంది. మరి ల్యాండింగ్ ఫీస్ సెక్యూరిటీ బ్యాగేజ్ హ్యాండిలింగ్ ఫీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వీటికి కూడా 12.45 లక్ష అవుతుంది. ఇక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఫీస్ ఉంటుంది 11.5 లాక్స్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రూ ఉంటారు ఫ్లైట్ లో మరి వాటికి కూడా వాళ్లకు కూడా చార్జీలు ఉంటాయి. ఇక క్రూ మొత్తం కలుపుకుంటే ఆ పెద్ద ఫ్లైట్ లో 22 ఫ్లైట్ అటెండెన్స్ ఉంటాయి. అంటే 22 ఫ్లైట్ అటెండెన్స్ ప్లస్ఫోర్ పైలట్స్ చూసుకున్నట్లయితే వాళ్లకి కూడా శాలరీస్ ఉంటాయి. మరి దానికి ఖర్చు రూ.14.36 లక్షలు ఉండొచ్చు. ఇక ఇంజన్ సిస్టం మెయింటనెన్స్ కాస్ట్లు పడుతూ ఉంటాయి. మరి దానికి అయ్యే ఖర్చు రూ.4.78 లక్షలు. ఇక వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి ఒక కోటి రూపాయల వరకు అవ్వచ్చు. మరి అలాగే డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. వాటికి కూడా 47.87 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్మూత్ గా వెళ్తుంటే రూ.2.35 క్రోర్స్ వరకు వాళ్లకు ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చులు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చూసే ప్రతి ఫ్లైట్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. వేలాది ఉద్యోగాలు కోట్ల రూపాయల బిజినెస్, బారి ప్లానింగ్ తో నడిచే ఒక పెద్ద ఇండస్ట్రీ ఆకాశంలో ఎగిరేది విమానం మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న రెవెన్యూ కూడా... -
బంగారం రేట్లు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు పెరిగినట్టే పెరిగి మళ్లీ దిగివచ్చాయి. మూడు రోజులు వరుసగా తగ్గి మళ్లీ క్రితం రోజున పసిడి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. అయితే బంగారం ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. దీంతో పసిడి ప్రియుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
అందుకే.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఈ రోజు (మే 29) గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఉన్నట్టుండి పసిడి ధరలు పెరగడానికి కారణాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు. ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై కొనసాగుతున్న ఆందోళనలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపించిందని న్యూస్ ఏజెడ్ తన నివేదికలో వెల్లడించింది.మార్కెట్ వివరాల ప్రకారం.. స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం పెరిగి ఔన్స్కు సుమారు 4,505.57 డాలర్లకు చేరింది. అదే సమయంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగి 4,535.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.గోల్డ్సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్ ప్రకారం.. కాల్పుల విరమణ ప్రకటన రాకముందు ధరలు ఇంకా పడిపోతాయని భావించారు. కానీ అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందాలకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో రలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి చాలా అస్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్పై ఉన్న ఆంక్షలను సడలించే అవకాశం ఉంది. ఇది ప్రపంచ చమురు మరియు వాణిజ్య రవాణాపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే.. ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. అదే.. సమయంలో ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా ఈ ఒప్పందం పూర్తిగా ఖరారు కాలేదని తెలిపింది.ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్! -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.05 పాయింట్లు లేదా 1.44 శాతం నష్టంతో 74,775.74 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్లు లేదా 1.50 శాతం నష్టంతో 23,547.75 వద్ద నిలిచాయి.సుప్రియా లైఫ్సైన్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జయకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఒక్కసారిగా రేటెక్కిన బంగారం, వెండి
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేకులు పడ్డాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు పుంజుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు తగ్గి 23,906 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 75,948 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 91.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగింది.నాస్డాక్ 0.91 శాతం పుంజుకుంది.Today Nifty position 29-05-2026(time: 09:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ధరల పతనం షురూ.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు (మే 28) పసిడి రేటు భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎక్కడ, ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మే 26న 1,58,890 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి (మే 28) 1,56,060 రూపాయల వద్దకు చేరింది. అంటే మూడు రోజుల్లో 3320 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర 1,45,650 రూపాయల నుంచి 1,43,050 వద్దకు (3050 రూపాయలు తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల తులం ధర రూ.1,59,040 దగ్గర నుంచి 1,56,210 రూపాయల (రూ.3320 తగ్గింది) వద్దకు.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,45,800 రూపాయల నుంచి 1,43,200 రూపాయల (3050 రూపాయలు తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలు.. మూడు రోజుల్లో భారీ మార్పుకు లోనయ్యాయి. ఇక్కడ మే 26న రూ.1,60,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మే 28 నాటికి 158180 రూపాయల (రూ.3060 తగ్గింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,47,300 నుంచి రూ. 1,45,000 వద్దకు (రూ.2800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది! -
పుష్ప్ బ్రాండ్ రూ. 1,000 కోట్ల ఐపీవో
మసాలా దినుసుల తయారీ కంపెనీ పుష్ప్ బ్రాండ్ (ఇండియా) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇండోర్ (మధ్యప్రదేశ్) కంపెనీ ఇందుకు అనుమతించాలంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా కంపెనీ రూ. 800–1,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి.ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 74.45 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. 1974లో ఏర్పాటైన కంపెనీ బ్రాండెడ్ ప్యాకేజ్డ్ మసాలాలు, ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. విస్తరణలో భాగంగా కంపెనీ 2028కల్లా పర్యావరణహిత తయారీ కేంద్రంతోపాటు.. సమీకృత స్టోరేజీ సౌకర్యాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది.ఈ బాటలో పూర్తిస్థాయి శుద్ధ మసాలాలకు వీలుగా 2029కల్లా గ్రైండింగ్, మిల్లింగ్ లైన్కు తెరతీసే ప్రణాళికలు వేసింది. కాగా.. ప్యాకేజ్డ్ మసాలాల విభాగంలో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఓర్క్లా ఇండియా, ఎండీహెచ్, బాద్షా మసాలా తదితర సుప్రసిద్ధ కంపెనీలతో పోటీ పడుతోంది. గతేడాది(2025–26) రూ. 482 కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు.. రూ. 59 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
లక్కీ ఛాన్స్.. భారీగా పడిపోయిన బంగారం..
దేశంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరింత పతనమై హ్యాట్రిక్ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారుకు బంగారం ధరలు లక్కీ ఛాన్స్గా నిలిచాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా దిగొచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బెర్క్షైర్ హాత్వే పోర్ట్ఫోలియోలో షాకింగ్ మార్పులు!
బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బెర్క్షైర్ హాత్వే నూతన సీఈఓ గ్రెగ్ అబెల్, అంతర్జాతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బఫెట్ చూపిన వ్యూహాత్మక మార్గంలోనే నడుస్తానని ప్రకటించిన అబెల్.. తాజాగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన ‘13F’ ఫైలింగ్లో సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. టెక్నాలజీ, బ్యాంకింగ్, కన్స్యూమర్ గూడ్స్లో ఆయన చేసిన కొన్ని కీలక మార్పులు ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.అమెజాన్కు గుడ్బై..సాధారణంగా టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులకు వారెన్ బఫెట్ దూరంగా ఉంటారు. కానీ, మార్కెట్ లీడర్ల వ్యూహాలను గమనించి 2019లో ఆయన అమెజాన్ షేర్లను కొనుగోలు చేశారు. అప్పటి నుండి గత ఏడాది ముగింపు నాటికి ఈ స్టాక్ ఏకంగా 160% లాభాలను తెచ్చిపెట్టింది.అయితే, ప్రస్తుత సీఈఓ గ్రెగ్ అబెల్ అనూహ్యంగా అమెజాన్లోని కంపెనీ మొత్తం వాటాను (ఇది బెర్క్షైర్ పోర్ట్ఫోలియోలో 0.2% కంటే తక్కువ) విక్రయించారు. అదే సమయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దూసుకుపోతున్న మరో దిగ్గజం గూగుల్ మాతృసంస్థ 'ఆల్ఫాబెట్'లో తన పెట్టుబడులను భారీగా పెంచారు.ఆల్ఫాబెట్ క్లాస్-A షేర్లు: ఈ వాటాను ఏకంగా మూడు రెట్లు పెంచారు. ప్రస్తుతం బెర్క్షైర్ వద్ద 5.42 కోట్లకు పైగా క్లాస్-A షేర్లు ఉన్నాయి. ఇది వారి మొత్తం పోర్ట్ఫోలియోలో 5.9 శాతానికి సమానం.ఆల్ఫాబెట్ క్లాస్-C షేర్లు: ఓటింగ్ హక్కులు లేని ఈ విభాగంలో కొత్తగా 35.8 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఇది పోర్ట్ఫోలియోలో 0.4% వాటాగా ఉంది.దిగ్గజ కంపెనీల నుండి పూర్తిగా నిష్క్రమణమార్కెట్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రెగ్ అబెల్ పోర్ట్ఫోలియోను పూర్తిగా ప్రక్షాళన చేశారు. దాదాపు 12 ప్రధాన కంపెనీల నుండి బెర్క్షైర్ హాత్వే పూర్తిగా తప్పుకుంది. అందులో ముఖ్యమైనవి చార్టర్ కమ్యూనికేషన్స్, డియాజియో, అలెజియన్.కీలక రంగాలలో వాటాల తగ్గింపుఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. అబెల్ నేతృత్వంలో బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లోని కొన్ని కీలక షేర్లను తగ్గించుకున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, చెవ్రాన్, న్యూకోర్, కాన్ స్టెలేషన్ బ్రాండ్స్ లలో వాటాలను కొంతమేర విక్రయించారు. ఆర్థిక, ఫుడ్ రంగాలకు చెందిన ఇతర ప్రధాన షేర్లను కూడా భారీ మొత్తంలో వదిలించుకున్నారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలహీన పనితీరుతో బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ తగ్గాయి. నిఫ్టీ 6.55 పాయింట్లు లేదా 0.03 శాతం నష్టపోయి 23,907.15 వద్ద, సెన్సెక్స్ 141.90 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టపోయి 75,867.80 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.42 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.15 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
కరుగుతోన్న బంగారు కొండ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు తగ్గి 23,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 149 పాయింట్లు నష్టపోయి 75,838 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.11బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పెరిగింది.నాస్డాక్ 1.19 శాతం పుంజుకుంది.Today Nifty position 27-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ను అధిగమించిన తైవాన్!
గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్బెర్గ్ డేటా వెల్లడించింది.తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, క్వాల్కామ్ ఉపయోగించే అధునాతన చిప్లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. -
బక్రీద్పై కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్లకు సెలవా?
భారతదేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్లైన.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు 2026 మే 28, గురువారం రోజున బక్రీద్ పండుగ సందర్భంగా మూతపడనున్నాయి. కాబట్టి.. స్టాక్ మార్కెట్లలో అన్ని ప్రధాన ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.ఎన్ఎస్ఈ విడుదల చేసిన అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ రోజు ఈక్విటీ ట్రేడింగ్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) వంటి విభాగాలలో ట్రేడింగ్ ఉండే అవకాశం లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఆ రోజున షేర్ల కొనుగోలు లేదా అమ్మకాలు చేయలేరు.అయితే.. ఈసారి బక్రీద్ సెలవు మే 27న ఉంటుందా?, లేదా మే 28న ఉంటుందా? అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాలు, సంస్థలు మొదట మే 27ను పరిగణించినప్పటికీ.. ఎక్కువ శాతం ఆర్థిక సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు మే 28నే అధికారిక సెలవు రోజుగా ప్రకటించాయి. దీంతో పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ప్రణాళికలను దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.అదేవిధంగా.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) కూడా మే 28 ఉదయం సెషన్ మూతపడనుంది. అయితే.. సాయంత్రం సెషన్లో కమోడిటీ ట్రేడింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే.. బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ వంటి వస్తువుల ట్రేడింగ్ సాయంత్రం తర్వాత కొనసాగుతుందన్నమాట.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక! -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 479.26 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 76,009.70 వద్ద, నిఫ్టీ 118.00 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టంతో 23,913.70 వద్ద నిలిచాయి.ఇండో రామా సింథటిక్స్ (ఇండియా) లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఆగ్రో ఫోస్ ఇండియా లిమిటెడ్, ప్రతాప్ స్నాక్స్ లిమిటెడ్, జిందాల్ వరల్డ్వైడ్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టెక్నో ఎలక్ట్రిక్ & ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్, డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్, అజ్మేరా రియల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 24,023 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు నష్టపోయి 76,451 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం పెరిగింది.నాస్డాక్ 0.19 శాతం పుంజుకుంది.Today Nifty position 26-05-2026(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెండు ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో హైదరాబాద్ కంపెనీ దీపా జ్యువెలర్స్తోపాటు ఫార్మాస్యూటికల్ రంగ సంస్థ కోటెక్ హెల్త్కేర్ చేరాయి. 2025 సెపె్టంబర్లో కోటెక్ హెల్త్, డిసెంబర్లో దీపా జ్యువెలర్స్ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తాజా అనుమతులతో ఐపీవో చేపట్టడం ద్వారా రెండు కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్కానున్నాయి. ఈక్విటీ జారీ.. ఫార్మా రంగ కంపెనీ కోటెక్ హెల్త్కేర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 295 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 60 లక్షల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 226 కోట్లు కొత్త ప్రాజెక్ట్పై వెచ్చించనుంది. తద్వారా ప్రస్తుత తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంతోపాటు.. కొత్త ప్రొడక్టుల తయారీని చేపట్టనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ ఫార్మా రంగంలో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ(సీడీఎంవో) సేవలను సమకూర్చుతోంది. హాల్మార్క్తో.. ఐపీవోలో భాగంగా హాల్మార్క్ కలిగిన బంగారు ఆభరణాలు సరఫరా చేసే దీపా జ్యువెలర్స్ రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా 1,18,48,340 షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆశిష్ అగర్వాల్, సీమా అగర్వాల్ విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 215 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్కు వెచ్చించనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్సహా.. కర్ణాటక, తమిళనాడు, కేరళలో కార్యకలాపాలు విస్తరించింది. -
భారత కంపెనీల లాభాలకు రిస్క్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా ఏర్పడిన సరఫరా పరమైన అవరోధాలు మరింత కాలం పాటు కొనసాగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు (2 శాతం) తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కాకపోతే బలమైన బ్యాలన్స్ షీట్లు, దేశీ డిమాండ్ స్థిరంగా ఉండడం, ప్రభుత్వ మూలధన వ్యయాల మద్దతుతో భారత కంపెనీలు ఈ సమస్యలను ఎదుర్కొని బలంగా నిలుస్తాయని అంచనా వేసింది. 34 రంగాల్లోని సంస్థలు ఏ మాత్రం ఒత్తిళ్లను ఎదుర్కోగలవన్న దానిపై క్రిసిల్ రేటింగ్స్ ఒక అధ్యయనం చేసింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న పశ్చిమాసియా ఘర్షణ దేశీ కంపెనీలు తమ సరఫరా చైన్లను తిరిగి సమీక్షించుకోవడం, ధరల ఒత్తిళ్లను అధగమించడం, అధిక ఇంధన, రవాణా వ్యయాలను ఎదుర్కోవడం, కరిగిపోతున్న రూపాయి విలువను తట్టుకుని నిలబడేలా ప్రేరేపిస్తున్నట్టు వివరించింది. సంఘర్షణ ముగిసేందుకు, స్థిరీకరణకు ఎక్కువ కాలం పడితే, సరఫరా సమస్యలతో ద్రవ్యోల్బణం పెరిగిపోయి డిమాండ్పై ప్రభావం పడొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి పేర్కొన్నారు. కనుక ఘర్షణ స్థాయి, అది ఎంత కాలం పాటు కొనసాగుతుంది, చమురు ధరల పెరుగుదల ఎంత కాలం పాటు కొనసాగుతుందన్నది కీలకంగా చూడాల్సి ఉంటుందని.. ఇవన్నీ కంపెనీల క్రెడిట్ నాణ్యతను (రుణాలకు సకాలంలో చెల్లింపులు) ప్రభావం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సోమశేఖర్ వేమూరి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మూడో నెలలోకి ప్రవేశించడం, ఇంకెంత కాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోవడంతో కంపెనీలపై దీని ప్రభావాన్ని తెలుసుకునేందుకు క్రిసిల్ రేటింగ్స్ ఈ అధ్యయం చేయడం గమనార్హం. తొమ్మిది నెలల పాటు సమస్యలే.. సరఫరా సమస్యలు తొమ్మిది నెలల పాటు కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చమురు ధరలు బ్యారెల్కు సగటున 110 డాలర్ల స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. కనీసం 95 డాలర్ల స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఆదాయ వృద్ధి కంటే ఖర్చులను నియంత్రించుకోవడం, లాభదాయకతను కాపాడుకోవడం కంపెనీలకు సవాళ్లుగా క్రిసిల్ రేటింగ్స్ ఎండీ సుబోధ్ రాయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఎనిమిది రంగాల్లోని కంపెనీల రుణ నాణ్యత ప్రభావితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, రొయ్యల ప్రాసెసర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ దారులు రూపాయి విలువ క్షీణతతో లాభపడొచ్చని తెలిపింది. -
బంగారం మార్కెట్లో కొత్త దశ!
భారత్లో పెట్టుబడులపరంగా పసిడికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ప్రస్తుతం దేశీయ బంగారం, ఆభరణాల రంగం కీలకమైన మార్పుల దశలోకి ప్రవేశిస్తోంది. మారుతున్న ప్రభుత్వ విధానాలు, నానాటికీ పెరుగుతున్న డిమాండ్, కస్టమర్ల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు ఈ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ధరలు చుక్కలనంటుతున్నా సరే.. పసిడిపై భారతీయుల మక్కువ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.ధరల భారం ఉన్నా.. తగ్గని డిమాండ్సాధారణంగా ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుందనేది మార్కెట్ సూత్రం. కానీ, బంగారం విషయంలో ఈ సూత్రం తలకిందులవుతోంది. గడిచిన కాలంలో పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పండుగలు మాత్రమే కాకుండా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా జనం బంగారాన్ని ఎంచుకుంటున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు కూడా ప్రస్తుత డిమాండ్కు ఊతమిస్తున్నాయి.పారదర్శకతకే పెద్దపీట: కార్పొరేట్ బ్రాండ్ల హవాప్రస్తుత తరం కస్టమర్లు డిజైన్లతోపాటు స్వచ్ఛత, ధరల్లో పారదర్శకత, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి కావడం మార్కెట్లో పెద్ద మార్పుకు కారణమైంది. నమ్మకమే పెట్టుబడిగా మారిన ప్రస్తుత తరుణంలో జ్యుయలరీ మార్కెట్ క్రమంగా కన్సాలిడేట్ అవుతోంది. అసంఘటిత రంగం నుంచి వ్యాపారం వేగంగా సంఘటిత రంగం వైపు మళ్లుతోంది.గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సంఘటిత రిటైల్ జ్యుయలరీ విభాగం ఊహించని రీతిలో విస్తరించింది. ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లు చిన్న నగరాలు, పట్టణాలకు సైతం తమ నెట్వర్క్ను పెంచుకుంటూ పోతున్నాయి.పెట్టుబడులకు అనువైన కాలంఆర్థిక విశ్లేషకులు, మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో మధ్యకాలికంగా ఈ రంగం పెట్టుబడులకు ఎంతో అనువుగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రముఖ జ్యుయలరీ కంపెనీల ఆదాయాలు, లాభాల వృద్ధి రేటు మెరుగ్గా ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరలకు దీర్ఘకాలంలో ఢోకా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక! -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం లాభల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,073.61 పాయింట్లు లేదా 1.42 శాతం లాభంతో 76,488.96 వద్ద, నిఫ్టీ 312.40 పాయింట్లు లేదా 1.32 శాతం లాభంతో 24,031.70 వద్ద నిలిచాయి.సుందరం బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ వంటివి లాభాలను పొందాయి. సూర్య రోష్ని లిమిటెడ్, సాన్స్టార్ లిమిటెడ్, ఎక్సెల్సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
తగ్గుతున్న బంగారం ధరల్లో మార్పు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు మారిపోయాయి. గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త నిరాశ తప్పడం లేదు.ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 242 పాయింట్లు పెరిగి 23,961 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 813 పాయింట్లు లాభపడి 76,214 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.03బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం పెరిగింది.నాస్డాక్ 0.19 శాతం పుంజుకుంది.Today Nifty position 25-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పశ్చిమాసియా పరిస్థితులే దిక్సూచి
ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితులు ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు నాలుగో త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్ దాదాపు ముగింపునకు రావడంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఇకపై పశ్చిమాసియా పరిస్థితులు నిర్దేశించనున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రోజుకోతీరుగా మారుతున్న యుద్ధ వాతావరణం లేదా చర్చలపై అవకాశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. వారాంతన యూఎస్ అత్యున్నత అధికారి మార్కో రూబియో రెండు దేశాల మధ్య చర్చులు పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. మరోపక్క ఇటీవలే ముగిసిన యూ ఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనా పర్యటన ప్రకటనలవరకే ఫలవంతమైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవికాకుండా కొన్నేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు గ్లోబల్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 4 రోజులే ట్రేడింగ్ బక్రీద్ సందర్భంగా గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో ఎయిర్లైన్స్సహా పలు రంగాల ముడివ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ఆర్బీఐతోపాటు.. ఫెడరల్ రిజర్వ్(యూఎస్) తదితర పలుదేశాల కేంద్ర బ్యాంకుల పరపతి విధానాలు కఠినతరమయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది రుణాలకు డిమాండును తగ్గించడంతోపాటు.. కార్పొరేట్ల రుణ వ్యయాలు పెరిగేందుకు కారణంకానున్నట్లు అంచనా వేశారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు యథాప్రకారం ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఎఫెక్ట్ భారత్ దిగుమతుల బిల్లును ప్రధానంగా చమురు, పసిడి ధరలు పెంచే సంగతి తెలిసిందే. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు దారి చూపుతోంది. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలన్నీ కొద్ది రోజులుగా దేశీ కరెన్సీని దెబ్బతీస్తు న్నాయి. దీంతో డాలరుతో మారకంలో రూపా యి ఏకంగా 96 స్థాయికి పడిపోయింది. ఆర్బీఐ చర్యల కారణంగా వారాంతాన కొంతమేర బలపడినప్పటికీ 94–95 స్థాయిలో కదులుతోంది. కాగా.. వా రాంతాన ఆర్బీఐ కొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించడం సానుకూల అంశమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఫోకస్ యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రభుత్వ వ్యయాలకు దన్నునివ్వవచ్చని, లిక్విడిటీని పెంచే వీలున్నదని మిశ్రా అభిప్రాయపడ్డారు. చమురు ధరలు బలహీనపడటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై అంచనాలు, మరింత నిర్మాణాత్మక మార్కెట్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.గతవారం అక్కడక్కడే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు(0.23 శాతం) బలపడి 75,415 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు(0.32 శాతం) పుంజుకుని 23,719 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్స్ ఫ్లాట్గా ముగిసింది. సాంకేతికంగా చూస్తే.. సుమారు రెండు వారాలుగా దేశీ స్టాక్మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ గత వారం సైతం పరిమితుల మధ్యే కదిలాయి. వెరసి సమీప భవిష్యత్లో మార్కెట్ల కదలికలపై స్పష్టమైన సంకేతాలు అందడంలేదని సాంకేతిక నిపుణులు చెబుతునన్నారు. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు అటు ఎగువముఖంగా లేదా ఇటు దిగువ ముఖంగా బ్రేక్ సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 23,860–23,250 పాయింట్ల మధ్యే కదులుతోంది. 24,000 పాయింట్ల సమీపంలో రెసిస్టెన్స్ ఎదురవుతోంది. దీనిని అధిగమిస్తే 24,300వరకూ బలపడవచ్చు. 23,250 దిగువకు బలహీనపడితే.. 22,750– 22,350 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. సెన్సెక్స్ 76,000–74,000 పాయింట్ల మధ్య కదులుతోంది. ఈ శ్రేణిని ఛేదించవలసి ఉంది. ఎగువన 77,000 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్, దిగువన 73,000 వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా మార్పు కనిపించింది. కేవలం వారం రోజుల్లో (మే 17 నుంచి 23 వరకు) రేట్లు తగ్గుతూ.. పెరుగుతూ.. వారాంతంలో స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం వెండి రేటు ఎలా ఉంది?, ధరల తేడాకు ప్రధాన కారణం ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.మే 17న (ఆదివారం) రూ.2,90,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు మే 23 (శనివారం) నాటికి రూ.2,95,000 వద్దకు చేరింది. అయితే వారం మధ్యలో వెండి రేటు రూ.3 లక్షలకు కూడా చేరింది. చివరకు కొంత తగ్గుదల కనిపించింది.హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కేజీ వెండి రేటు రూ.2.95 లక్షల వద్ద ఉండగా.. ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశ రాజధాని నగరంలో సిల్వర్ రేటు తక్కువని స్పష్టమవుతోంది.వెండి ధరలు పెరగడానికి కారణం!మార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే! -
స్టాక్ మార్కెట్ అలర్ట్: 3 రోజులు నో ట్రేడింగ్
వచ్చే వారం ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు అలర్ట్. మే 25 నుండి మే 31 మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు పరిమిత రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ వారంలో శని, ఆదివారాలతో పాటు అదనంగా మరో రోజు కూడా మార్కెట్లు మూతపడనున్నాయి. దీంతో మొత్తం 3 రోజుల పాటు ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.సెలవులు ఇలా..కేంద్ర ప్రభుత్వం తాజాగా చంద్ర దర్శనం ఆధారంగా బక్రీద్ (ఈదుల్ అజ్హా) సెలవు దినాన్ని సవరించింది. మొదట ప్రకటించిన తేదీకి బదులుగా, మే 28 (గురువారం) నాడు అధికారిక సెలవుగా ఖరారు చేసింది. దీనిని అనుసరిస్తూ దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు మే 28న ట్రేడింగ్కు విరామం ప్రకటించాయి.ఆ తర్వాత మే 30 (శనివారం), మే 31 (ఆదివారం) వారాంతపు సెలవులు కావడంతో ఆ రోజుల్లోనూ మార్కెట్లు యథావిధిగా మూసివుంటాయి. ఫలితంగా వచ్చే వారంలో కేవలం 4 రోజులు (సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు) మాత్రమే ట్రేడింగ్ సాగుతుంది.ఏయే విభాగాల్లో ట్రేడింగ్ బంద్?మే 28 గురువారం నాడు బక్రీద్ సందర్భంగా మార్కెట్లోని దాదాపు అన్ని ప్రధాన విభాగాలు పనిచేయవు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్స్ సెగ్మెంట్ (F&O), కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ (MCX కూడా ఉదయం సెషన్ మూసివుంటుంది)లో కార్యకలాపాలు ఉండవు.గత వారం ఎలా ముగిసిందంటే?గత ట్రేడింగ్ వారంలో భారత మార్కెట్లు అత్యంత అస్థిరత మధ్య సాగినప్పటికీ, ముగింపులో సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి. నిఫ్టీ 50 (Nifty 50) గత వారంతో పోలిస్తే 1.50% వృద్ధితో 23,719 వద్ద ముగసింది. సెన్సెక్స్ (Sensex) 1.55% వృద్ధితో 75,415 దగ్గర స్థిరపడింది. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సానుకూలత, విదేశీ పెట్టుబడుల మద్దతుతో సూచీలు బలపడ్డాయి.వచ్చే వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ అందుబాటులో ఉండటం, అందులోనూ గురువారం సెలవు రావడం వల్ల వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ (Expiry) బుధవారమే (మే 27) జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు తమ పొజిషన్లను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అస్థిరతను గమనిస్తూ తగిన స్టాప్-లాస్లు నిర్వహించడం మంచిది. -
పసిడి ధరలు పైకి.. కిందకు.. వారంలో ఎంత మార్పు?
పసిడి ప్రియులకు, ఇన్వెస్టర్లకు గత వారం (మే 18 నుంచి మే 24 వరకు) ఉత్కంఠను రేకెత్తించింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల కారణంగా దేశీయంగా పసిడి ధరలు తీవ్ర అస్థిరతకు లోనయ్యాయి. వారం ప్రారంభంలో స్వల్పంగా తగ్గినప్పటికీ, వారం మధ్యలో భారీగా పుంజుకుని, వారాంతానికి మళ్లీ స్వల్పంగా దిగొచ్చాయి.ధరల హెచ్చుతగ్గుల విశ్లేషణతాజా గణాంకాల ఆధారంగా, హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారంలో 10 గ్రాముల 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరల ప్రయాణం ఎలా సాగిందో ఓసారి పరిశీలిద్దాం..వారం ప్రారంభంలో ఊరట: మే 18 సోమవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,200 వద్ద ట్రేడ్ అయింది. ఇది వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మంగళవారం (మే 19) నుంచే పసిడి మళ్లీ వేగం పుంజుకుంది.రికార్డు స్థాయి పరుగు: మే 20, 21 తేదీల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మే 21 నాటికి 24 క్యారెట్ల పసిడి దాదాపు రూ.1.60 లక్షల మార్కుకు చేరువగా (రూ.1,59,930) ఈ వారంలోనే అత్యంత గరిష్ఠ స్థాయిని తాకింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర కూడా రూ.1,46,600 కు చేరింది.వారాంతంలో స్వల్ప బ్రేక్: వారమంతా లాభాల్లో దూసుకుపోయిన పసిడి ధరలు శుక్ర, శనివారాల్లో (మే 22, 23) స్వల్పంగా దిగొచ్చాయి. శనివారం నాటికి 24 క్యారెట్ల ధర రూ.1,59,060 వద్దకు, 22 క్యారెట్ల ధర రూ.1,45,800 వద్దకు చేరింది.నేటి ధరలు ఇలా..ఈరోజు, మే 24 (ఆదివారం) మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,800 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.1,59,060 దగ్గర ఉన్నాయి.పసిడి ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగ్లోబల్ మార్కెట్ ఒత్తిడులు: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాల కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో గ్లోబల్ స్పాట్ మార్కెట్లో డిమాండ్ పెరిగి స్థానిక మార్కెట్లపై ప్రభావం పడింది.యూఎస్ ఫెడ్ నిర్ణయాలు & డాలర్ ఇండెక్స్: అమెరికా కేంద్రీయ బ్యాంక్ (US Federal Reserve) వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల సంకేతాలు, డాలర్ ఇండెక్స్లో వచ్చిన మార్పులు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారం మధ్యలో డాలర్ స్వల్పంగా బలహీనపడటం బంగారానికి కలిసి వచ్చింది.లాభాల స్వీకరణ: గురువారం నాటికి ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్లలో లాభాల స్వీకరణకు (Profit Booking) దిగారు. దీనివల్ల శుక్రవారం నుంచి ధరల్లో స్వల్ప కరెక్షన్ (తగ్గుదల) కనిపించింది.పెళ్లిళ్ల సీజన్ డిమాండ్: దేశీయంగా, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో స్థానిక జ్యువెలర్ల నుంచి డిమాండ్ బలంగా ఉంది. ఇది కూడా ధరలు ఒకేసారి పడిపోకుండా నిలకడగా ఉండటానికి తోడ్పడింది. -
ఐపీఓకు దూత్ ట్రాన్స్మిషన్
ముంబై: ఆటో విడిభాగాల తయారీ సంస్థ దూత్ ట్రాన్స్మిషన్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ సెబీకి సవరించిన ముసాయిదా పత్రాలు (యూడీఆర్హెచ్పీ) సమర్పించింది. దాఖలు చేసిన యూడీఆర్హెచ్పీ ప్రకారం.. ఈ ఐపీఓలో రూ.1,400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్ కంపెనీలు మొత్తం 1.63 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టాయి. ఇందులో ‘బైన్ క్యాపిటల్’ దాదాపు 1.32 కోట్ల షేర్లను, ‘మంగళం క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ 31.18 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు యూడీఆర్హెచ్పీలో పేర్కొంది.పబ్లిక్ ఇష్యూ పూర్తైన తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. దూత్ ట్రాన్స్మిషన్ సంస్థ 1999లో ప్రారంభమైంది. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన వైరింగ్ హార్నెస్లు, ఎల్రక్టానిక్ సెన్సర్లు, కనెక్టర్లు, జంక్షన్ బాక్సులు, డేటా కేబుళ్లు తదితర భాగాలను తయారు చేసి సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(ఆర్థిక సంవత్సరం 2025–26)లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.3,444.86 కోట్లకు చేరగా, నికర లాభం రూ.353.89 కోట్లుగా నమోదైంది. -
పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!
భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎప్పటి నుంచో.. ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి ప్రతి ముఖ్యమైన సందర్భంలో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలకు కొత్త ఆభరణాలు కొనడం కష్టంగా మారుతోంది. పసిడి తన మెరుపును కోల్పోలేదు కానీ అది మధ్యతరగతి, సాధారణ కుటుంబాల అందుబాటుకు దూరమవుతోంది.రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో.. బంగారు ఆభరణాల అమ్మకాల తగ్గుతున్నట్లు తెలిసింది. ప్రజలు కొనుగోలు చేసే బంగారం బరువు తగ్గుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం అమ్మకాల పరిమాణం సుమారు 8% తగ్గిందని, ఇంకా ఈ ఏడాది 13-15% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇది గత పదేళ్లలోనే కనిష్ట స్థాయి అని పేర్కొంది. దీనికి కారణం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు.భారతదేశంలో వినియోగించే బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతం వరకు పెంచింది. దీని వల్ల బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,60,000 వరకు చేరింది. అందువల్ల ప్రజలు అవసరమైన ఆభరణాలకే పరిమితం అవుతున్నారు.అయితే.. బంగారం అమ్మకాల పరిమాణం తగ్గినా, దాని విలువ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే తక్కువ బంగారం కొనుగోలు చేసినా, అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా జువెలరీ కంపెనీల ఆదాయం 20-25% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కంపెనీలు అమ్మే బంగారం బరువు తగ్గినా, అధిక ధరల వల్ల వారి ఆదాయం తగ్గడం లేదు.ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు! -
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం (మార్కెట్ క్రాష్) రాబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని కియోసాకి అంచనా వేశారు.బంగారం, వెండిపై కియోసాకి అంచనాలు ఇవేప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రిచర్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి ఈ వివరాలను పంచుకున్నారు.బంగారం ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర సుమారు 4,500 డాలర్లుగా ఉంటే... అది భవిష్యత్తులో ఏకంగా 1,00,000 (ఒక లక్ష) డాలర్లకు చేరుకుంటుందని జిమ్ రిచర్డ్స్ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు.వెండి ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇది 200 డాలర్లను తాకుతుందని తాను భావిస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు."సంక్షోభంలోనూ ధనవంతులు కావచ్చు"భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు (పెట్టుబడులు) తీసుకోగలిగినవారే అత్యుత్తమ ఇన్వెస్టర్లు అవుతారని కియోసాకి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు."రాబోయే ఆర్థిక సంక్షోభానికి మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభ సమయంలోనూ మీరు మరింత ధనవంతులు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కియోసాకి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారింది.Crash imminent.Jim Richard’s calls for gold to get to$ 100,000Today gold is at $4,500I think silver will hit $200 an ounceToday silver is at $75.What do you think?The best investors are able to see the future and take action. Remember you do not have to be a…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 23, 2026 -
పసిడి పతనం.. రెండో రోజూ గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గుదల బాటపట్టాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. పుత్తడి ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సెబీలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్: ఎవరికి.. ఎన్ని రోజులు?
దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు కార్పొరేట్, ప్రభుత్వ రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధాని విజ్ఞప్తి చేసిన పక్షం రోజుల వ్యవధిలోనే, ప్రముఖ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI) తమ జూనియర్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గ్రేడ్ 'ఎ' నుండి గ్రేడ్ 'సి' వరకు ఉన్న ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని సెబీ కల్పించినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ ఇంధన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, తాత్కాలిక చర్యల్లో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇంధన పరిరక్షణ చొరవలో భాగంగా సెబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అంతర్గతంగా నిర్వహించే పలు కార్యక్రమాలను వాయిదా వేయాలని భావిస్తోంది. ఉద్యోగుల అనవసర ప్రయాణాలను, హోటల్ బస ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన సెబీ మాత్రమే కాకుండా, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం ప్రధాని పిలుపునకు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ట్రెజరీ కార్యకలాపాలు, క్రెడిట్ అండర్ రైటింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సేవలు వంటి కీలక విభాగాల్లోని ఎంపిక చేసిన సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది. అలాగే హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ (HDFC Securities) కూడా ఇప్పటికే తమ ఉద్యోగుల కోసం 'హైబ్రిడ్ వర్కింగ్ మోడల్'ను అమలుల్లోకి తెచ్చింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 326.42 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 75,509.78 వద్ద, నిఫ్టీ 64.60 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,719.30 వద్ద నిలిచాయి.జాన్ కాకరిల్ ఇండియా లిమిటెడ్, మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్ఎమ్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, గణేశ ఎకోస్ఫియర్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు కాస్త కూల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
440 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 23,774 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 448 పాయింట్లు లాభపడి 75,643 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.04 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.17 శాతం పెరిగింది.నాస్డాక్ 0.09 శాతం పుంజుకుంది.Today Nifty position 22-05-2026(time: 09:51 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐ(పి)టీ స్టాక్స్..
రెండు దశాబ్దాలుగా అటు ఉపాధి కల్పనలోనూ.. ఇటు దేశీ స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల్లోనూ ఆధిపత్యంవహిస్తూ వచ్చిన సాఫ్ట్వేర్ రంగం ఇటీవల కొద్ది రోజులుగా గాడి తప్పుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లలో కొద్ది వారాలుగా ఐటీ స్టాక్స్లో అమ్మకాలే అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఫండ్స్ పెట్టుబడుల్లో సాఫ్ట్వేర్ రంగానికి ఉన్న ప్రాధాన్యత మసకబారుతోంది... సుమారు ఏడాది కాలంగా పలు ప్రతికూలతలతో సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతోంది. ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ నిర్ణయాలలో క్లయింట్ల ఆలస్యం వంటి అంశాలు ప్రాజెక్టులు, డీల్స్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీల ఫలితాలు సైతం నీరసిస్తున్నాయి. ఇదే సమయంలో పులిమీద పుట్రలాగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్సహా గూగుల్(జెమినై), డీప్సీక్, తదితర ఏఐ దిగ్గజాలు మొత్తం ప్రపంచ ఐటీ రంగ ముఖ చిత్రాన్నే మార్చివేస్తున్నాయి. ఏఐతో అభివృద్ధి చేసిన క్లాడ్ తదితర టూల్స్.. కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ తదితర సంప్రదాయ సర్వీసులను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్సహా పలు టెక్ దిగ్గజాలలో అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాతోపాటు.. మధ్యస్థాయి కంపెనీల స్టాక్స్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని విభాగాలలో ఏఐ సానుకూల ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రా జెక్టులు, ధరలు వంటి కీలక అం శాలలో సవాళ్లు ఎదురుకానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 6.7 శాతానికి డౌన్ ఏఐ ప్రకంపనల నేపథ్యంలో కొద్ది నెలలుగా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఐటీ రంగంలో పెట్టుబడులపట్ల విముఖత చూపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. 2025 ఏప్రిల్తో పోలిస్తే మొత్తం ఈక్విటీ రంగంలో ఫండ్స్ పెట్టుబడులు 1.8 శాతం క్షీణించాయి. 2026 ఏప్రిల్కల్లా ఐటీ రంగంలో ఎంఎఫ్ల పోర్ట్ఫోలియో 8ఏళ్ల కనిష్టానికి చేరినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదికలో పేర్కొంది. నిజానికి గత 18 నెలలుగా ఐటీ స్టాక్స్ నీరసిస్తూ వస్తున్నాయి. 2024 డిసెంబర్లో నమోదైన గరిష్టం నుంచి చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 36% పతనమైంది. దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితరాల ఫలితాలు ఆకట్టుకోకపోగా.. భవిష్యత్ అంచనాలు(గైడెన్స్) ఆసక్తిని కలిగించకపోవడం దీనికి కారణమవుతోంది. నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వివరాల ప్రకారం మిరాయ్, హెచ్డీఎఫ్సీ, కొటక్ తదితర ఫండ్స్ పెట్టుబడులను తగ్గించుకోగా.. ఆదిత్య బిర్లా ఎస్ఎల్, ఐసీఐసీఐ ప్రు తదితరాలు హోల్డింగ్స్ పెంచుకున్నాయి. కారణాలున్నాయ్.. మూడు నెలలక్రితం పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ధరలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొన్ని దేశాల మిలటరీ వ్యయాలను పెంచింది. ఈ నేపథ్యంలో పలు దేశాల రిజర్వ్ బ్యాంకుల పరప తి విధానాలు ప్రభావితంకానున్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలకు సైతం సవాళ్లు ఎదురుకానున్నాయన్న భయాలు పెరుగుతున్నాయి. మరోపక్క ఇటీవల వేగంగా దూసుకువస్తున్న ఏఐ సేవలు ఐటీ ప్రాజెక్టుల రూపురేఖలను మార్చివేయడంతోపాటు ఉపాధి అవకాశాలపైనా తీవ్ర ప్రభావం చూపనున్న అంచనాలు వీటికి జత కలిశాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం కలవరపడుతోంది. అయితే ఇదే సమయంలో విప్లవాత్మక ఏఐ సేవలకు తెరతీస్తున్న చాట్ జీపీటీ, ఆంత్రోపిక్సహా.. చిప్ దిగ్గజం ఎన్విడియా సంచలనాలు సృష్టిస్తుండటం గమనార్హం! ఈ నేపథ్యంలో ఆంత్రోపిక్, ఎన్విడియా కంపెనీల విలువ రోజురోజుకీ బలపడుతుంటే.. గ్లోబల్ టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్ తదితరాల విలువ వెనకబడుతోంది!! ఇందుకు దేశ, విదేశీ పెట్టుబడుల తీరు ప్రభావం చూపుతోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాజా ఇంటర్నేషనల్తో రివర్స్ మెర్జర్ అనంతరం హైదరాబాద్కి చెందిన కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కెటో మోటర్స్ .. బీఎస్ఈలో లిస్టయింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఇదొక కీలక మైలురాయని సంస్థ డైరెక్టర్ వెంకటేష్ చల్లా తెలిపారు.దేశీయంగా వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల రంగం పరివర్తనలో తమ సంస్థ అర్ధవంతమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. కంపెనీ తెలంగాణలో తలపెట్టిన రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్రాజెక్టు, అర్బనోవా కేఈ9 పేరిట తొమ్మిది మీటర్ల ఎలక్ట్రిక్ బస్ ప్లాట్ఫాంను ఆవిష్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో సంస్థ లిస్టింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఫండ్స్ పెట్టుబడులకు థర్డ్పార్టీ చెల్లింపులు
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో థర్డ్పార్టీ (ఇన్వెస్టర్ పేరిట మరొకరు) చెల్లింపులను అనుమతించే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల కింద మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్టర్ తన బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తాన్ని బదిలీ చేయగలరు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలతో సెబీ ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.ఉదాహరణకు ఉద్యోగి తరఫున పెట్టుబడులకు యాజమాన్యం చెల్లింపులు చేయొచ్చు. వేతనం నుంచి ఈ మేరకు యాజమాన్యం మినహాయించుకుంటుంది. అలాగే, అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు (ఏఎంసీలు) మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులకు కమీషన్ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల రూపంలో చెల్లింపులు చేసేందుకూ ఈ ప్రతిపాదన వీలు కల్పించనుంది. అలాగే, ఇన్వెస్టర్లు తమ చందాలో లేదా రాబడిలో కొంత మొత్తాన్ని సామాజికాభివృద్ధికి అందించే ప్రతిపాదనను కూడా సెబీ చేసింది. జూన్ 10 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 196.63 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 75,121.76 వద్ద, నిఫ్టీ 19.10 పాయింట్లు లేదా 0.081శాతం నష్టంతో 23,639.90 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్, వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్, డిజిడ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ఎందుకింతలా పెరుగుతోంది?
దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) వరుసగా మూడో రోజూ ఎగిసి హ్యాట్రిక్ కొట్టేశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు రూ.4000 దాకా బంగారం ధరలు ఎగిశాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు పెరుగుదలను నమోదు చేశాయి.ఈరోజు బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలోని కొన్ని కీలక పరిణామాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ స్వల్పంగా బలహీనపడటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు , ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి.దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 23,736 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 పాయింట్లు లాభపడి 75,484 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.19బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.08 శాతం పెరిగింది.నాస్డాక్ 1.54 శాతం పుంజుకుంది.Today Nifty position 21-05-2026(time: 09:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మ్యూచువల్ ఫండ్స్పై రుణాలిస్తాం
సాక్షి, బిజినెస్ డెస్క్: యువ రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్ విధానంలో ఫండ్స్పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్ వైశ్యా బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్పై లోన్ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్ ఫండ్స్దే ఉంటోందని కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్స్పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్ ఆధారిత ఫండ్స్కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట ప్రక్రియ .. ఫండ్స్పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్.. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది. -
మార్కెట్లో ‘మెలొడీ’ సందడి!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి పార్లే ‘మెలొడీ’ టాఫీలను బహూకరించడం బుధవారం సోషల్ మీడియాలో సందడికి దారితీసింది. భారత్ నుంచి టాఫీ ఎగుమతులు ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టాఫీలు తదితర కన్ఫెక్షనరీ ఉత్పత్తుల ఎగుమతులు గత 12 ఏళ్లలో ఏకంగా 166 శాతం ఎగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. 2013–14లో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఎక్స్పోర్ట్స్ 2025–26 నాటికి రూ. 132 కోట్లకు చేరినట్లు తెలిపింది. పరిమాణంపరంగా 6,652 టన్నుల నుంచి 10 శాతం వృద్ధి చెంది 7,357 టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర 74 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ‘భారత టాఫీల గాథ నిజంగానే వీనులవిందైనది. 2013–14 నుంచి ఏకంగా 166 శాతం ఎగిసింది’ అని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గో యల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో టాఫీల ఎగుమతులు అంతగా లేని యూ రప్, గల్ఫ్ దేశాలకు కూడా పెరగడం భారత కన్ఫెక్షనరీల నాణ్యత, ప్యాకేజింగ్ ప్రమాణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని వా ణిజ్య శాఖ తెలిపింది. ‘చాలా చక్కని టాఫీ– మెలొ డీని బహూకరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అంటూ మెలోనీ సోషల్ మీడియాలో వీడి యో పోస్ట్ చేశారు. ఇరువురు ప్రధానుల పేర్లు కలిసేలా మెలొడీ పదం ఉండటంతో మీమ్స్ వైరల్ అయ్యాయి. మెలొడీకి జోష్.. మెలొడీ చాక్లెట్లకు ఒక్కసారిగా ఎక్కడలేని పాపులారిటీ రావడంపై వాటిని తయారు చేసే పార్లే ప్రోడక్ట్స్ హర్షం వ్యక్తం చేసింది. ‘1983 నుంచి బంధాలను తీపి చేస్తున్నాం’ అనే క్యాప్షన్తో ఇన్స్ట్రాగాంలో మోదీ, మెలొనీ వీడియోని షేర్ చేసింది. ‘పార్లే మెలొడీని అంతర్జాతీయ వేదికపైకి చేర్చినందుకు ధన్యవాదాలు‘ అంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక చక్కని మార్గం’ అంటూ పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా పేర్కొన్నారు. ‘పార్లే’ షేర్ల కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు... మెలొడీ చాక్లెట్లను తయారు చేసేది పార్లే అనే కంపెనీ అని తెలియడంతో ఆ సంస్థ షేర్లను కొనడానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనితో పార్లే ఇండస్ట్రీస్ అనే సంస్థ షేరు 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ రూ. 5.25ని తాకింది. 8.57 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఆ చాక్లెట్లను తయారు చేసేది పార్లే ప్రోడక్ట్స్ అనే కంపెనీ. అది స్టాక్ మార్కెట్లో కనీసం లిస్ట్ కూడా కాలేదు. కాకపోతే ‘ఆ పార్లే’..‘ఈ పార్లే’ ఒకటేనని ఇన్వెస్టర్లు పొరబడటమనేది పార్లే ఇండస్ట్రీస్కి బాగా కలిసి వచ్చింది. -
పడిలేచిన స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ట్రేడింగ్ చివరి గంటలో అన్ని ఇంట్రాడే నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వచ్చేశాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ 41 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 23,659 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 23,690.90 వద్ద గరిష్టం, 23,397.30 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 117.54 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 75,318.39 వద్ద ట్రేడింగ్ సెషన్ ను ముగించింది. ఈ ఇండెక్స్లో గరిష్టం 75,406.18 పాయింట్లు, కనిష్టం 74,529.41 వద్ద నమోదైంది.హిందాల్కో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో నిఫ్టీ 50లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.49 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.04 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించాయి. -
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
270 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:59 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు తగ్గి 23,544 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 274 పాయింట్లు నష్టపోయి 74,919 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 110.78 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.67 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.84 శాతం నష్టపోయింది.Today Nifty position 20-05-2026(time: 09:59 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.19 పాయింట్ల (0.15 శాతం నష్టం) నష్టంతో 75,200.85 వద్ద, నిఫ్టీ 31.95 పాయింట్ల నష్టంతో (0.14 శాతం నష్టం) 23,618.00 వద్ద నిలిచాయి.డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, రామ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, డైమైన్స్ & కెమికల్స్ లిమిటెడ్, నియోజెన్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన మూడు సెషన్ల్లో తగ్గిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 104 పాయింట్లు పెరిగి 23,751 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 371 పాయింట్లు పుంజుకుని 75,684 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 109.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.07 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.Today Nifty position 19-05-2026(time: 09:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆరంభంలో నష్టాలు.. ముగింపులో లాభాలు!
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (మే 18) ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరకు ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కుప్పకూలిన సూచీలు ద్వితీయార్థంలో దేశీయ కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,043 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైనప్పటికీ ముగింపు సమయానికి నష్టాలన్నింటినీ పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. చివరకు నిఫ్టీ 50 సూచీ 6 పాయింట్లు పుంజుకొని 23,649 వద్ద, సెన్సెక్స్ 77 పాయింట్లు పెరిగి 75,315 వద్ద స్థిరపడ్డాయి.ఆరంభ పతనానికి కారణాలుఅమెరికా-ఇరాన్ మధ్య సరికొత్తగా రేగిన ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్లో డ్రోన్ దాడుల వార్తలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో సెంటిమెంట్ను దెబ్బతీసింది.అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్కు 111 డాలర్ల మార్కును దాటింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున క్రూడాయిల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ భయాలను, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనలను పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 4.60% దాటడంతో భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96.2 మార్కుకు బలహీనపడింది. ఇది విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.గత శుక్రవారం అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా నష్టపోగా నేడు ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, హ్యాంగ్ సెంగ్ సైతం నష్టాల్లో ట్రేడ్ అవ్వడం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.ముగింపులో రికవరీకి కారణాలురూపాయి బలహీనపడటం ఐటీ, ఎగుమతి ఆధారిత రంగానికి లాభసాటిగా మారడంతో ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపారు.టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు నేడు సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను దాటేసి రూ.11.80 లక్షల కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ క్యాప్ గల కంపెనీగా నిలిచింది. ఈ స్టాక్ ర్యాలీలో కీలక పాత్ర పోషించింది.దేశీయంగా మార్చి త్రైమాసికం (2026 క్యూ4) ఆర్థిక ఫలితాల సీజన్ నడుస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో 10% వృద్ధి నమోదు చేయడం, టాటా స్టీల్ నికర లాభం రెండింతలు పెరగడం వంటి అంశాలు మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చాయి.నిఫ్టీ 23,300 స్థాయికి పడిపోయిన తరుణంలో విలువ ఆధారిత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దిగువ స్థాయిల వద్ద దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయడంతోపాటు ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్లో షార్ట్ కవరింగ్ జరగడం వల్ల సూచీలు రికవరీ అయ్యాయి.ప్రస్తుతానికి దేశీయ ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల గమనం రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. ఇన్వెస్టర్లు గ్లోబల్ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: కొత్త రేట్లు ఇవే!
బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు పతనమైంది. అయితే వెండి రేటు మాత్రం రూ.10 వేలు పెరగడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ. మూడు లక్షలకు చేరుకుంది. ఇక్కడ లేటెస్ట్ పసిడి ధరలు ఎక్కడ, ఎలా.. ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం. -
నష్టాల బాటలో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 802.74 పాయింట్లు లేదా 1.07 శాతం నష్టంతో 74,435.25 వద్ద, నిఫ్టీ 242.45 పాయింట్లు లేదా 1.03 శాతం నష్టంతో 23,401.05 వద్ద కొనసాగుతున్నాయి.రీజెన్సీ సిరామిక్స్ లిమిటెడ్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్, బైడ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
పశ్చిమాసియా, క్రూడ్పై కన్ను!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ ఒడిదుడుకులు... ‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు. రూపాయిపై ఫోకస్... యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు. గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి... అమెరికా, చైనా, భారత్లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.గతవారమిలా... ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్గేర్లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.సాంకేతికంగా చూస్తే... ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం ధరలు - ఊహకందని మార్పులు!
బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. తగ్గుతూ ఊహకందని మార్పులకు లోనవుతున్నాయి. వారం మధ్యలో పెరిగిన గోల్డ్ రేటు, వారాంతంలో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.మే 10న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,52,350 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర, మే 16 నాటికి 1,56,930 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,650 వద్ద నుంచి 1,43,850 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏడురోజుల్లో 1,54,370 రూపాయల నుంచి 1,60,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,500 వద్ద నుంచి రూ.1,47,500 వద్దకు చేరింది. ఈ మార్పు కేవలం వారం రోజులలో జరిగింది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలు, వారం రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసాయి. మే 10న 1,52,500 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు మే 16నాటికి 1,57,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,800 నుంచి 1,44,000 రూపాయల వద్దకు చేరింది.ధరలు పెరుగుదలకు కారణాలుబంగారం ధరలు పెరగడానికి సాధారణంగా అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి డబ్బును తీసి బంగారంలో పెట్టడం పెరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగుస్తాయి.అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కీలకం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గుతారు.ఇంకో కారణం వడ్డీ రేట్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం ఆకర్షణ పెరుగుతుంది, ఎందుకంటే ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభం తగ్గిపోతుంది. అదే విధంగా.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఆభరణాల డిమాండ్ (వివాహ సీజన్లు, పండుగలు), అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి.ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే! -
వెండి దిగుమతులు నిషేధం!
దేశ ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడం, వాణిజ్య లోటును తగ్గించడం, రూపాయి విలువను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది.భారతదేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రజలు పెట్టుబడుల కోసం, ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా ఈ లోహాలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే విదేశాల నుంచి ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తే దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇది రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం మే 13న బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5 శాతం ఏఐడీసీ ఉంటుంది. ఇది మే 13 నుంచే అమల్లోకి వచ్చింది.The Government of India has tightened the policy regarding the import of silver bars, changing their status from 'Free' to 'Restricted' with immediate effect. pic.twitter.com/k4Zyq4W2rO— ANI (@ANI) May 16, 2026తాజాగా ప్రభుత్వం వెండి దిగుమతులపై కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి బార్ల దిగుమతిని ఫ్రీ నుంచి పరిమిత వర్గంలోకి మార్చింది. ఫ్రీ అంటే.. ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. పరిమిత వర్గంలో అయితే.. ప్రభుత్వ అనుమతి అవసరం అవుతుంది. దీని వల్ల వెండి దిగుమతులు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.విదేశీ వాణిజ్యం (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1992 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో ఈ మార్పులు అమలు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశ్యం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం. -
వెండి రూ. 30వేలు డౌన్!
అంతర్జాతీయంగా డాలరు బలోపేతం అవుతుండటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయంగా వెండి, పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కేజీ ధర మూడు రోజుల్లో రూ.30వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.2.80 లక్షల వద్దకు చేరింది.బంగారం ధరలు కూడా వరుస తగ్గుదలను నమోదు చేశాయి. పెరిగిన ఇంధన ధరలు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయచ్చని, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. -
కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ట్రంప్ది మామూలు ట్రేడింగ్ కాదు!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక పెట్టుబడుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. తాజాగా బయటకు వచ్చిన ఆయన ఆర్థిక వెల్లడి (Financial Disclosure) నివేదిక, 2026 మొదటి త్రైమాసికంలో ఆయన ఖాతాల ద్వారా జరిగిన భారీ స్టాక్ ట్రేడింగ్ను బహిర్గతం చేసింది. అమెరికా ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్కు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం.. జనవరి నుండి మార్చి మధ్య కేవలం 3 నెలల కాలంలోనే ట్రంప్ ఖాతాల ద్వారా ఏకంగా 3,600కు పైగా ఆర్థిక లావాదేవీలు జరగడం విశేషం.రూ. వేల కోట్ల ట్రేడింగ్ వాల్యూమ్!ఈ మూడు నెలల కాలంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువ సుమారు 220 మిలియన్ నుండి 750 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో వేల కోట్ల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా. ప్రముఖ వినోద, మీడియా సంస్థల్లో కూడా ట్రంప్ భారీగానే పెట్టుబడులు పెట్టారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలో కనీసం 30,000 డాలర్లు పెట్టుబడి పెట్టగా.. డిస్నీకి సంబంధించిన ట్రేడింగ్ విలువ ఏకంగా 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.టెక్ దిగ్గజాలపైనే గురి..ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్న ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల్లో ట్రంప్ ఖాతాల ద్వారా భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ (Microsoft), బ్రాడ్కామ్, అమెజాన్ (Amazon), యాపిల్ (Apple) స్టాక్స్లో 1 మిలియన్ నుండి 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఏఎండీ, ఇంటెల్, ఆల్ఫాబెట్ (Google), గోల్డ్మన్ శాక్స్, ఎయిర్బీఎన్బీ, డోర్డాష్, మైక్రాన్, బ్లూమ్ ఎనర్జీ స్టాక్స్లో 5,00,000 నుండి 1 మిలియన్ డాలర్ల కొనుగోళ్లు జరిగాయి."మాకు సంబంధం లేదు"ఈ ట్రేడింగ్ హడావుడిపై 'ది హఫ్ పోస్ట్' ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆర్గనైజేషన్ స్పందించింది. ఈ లావాదేవీలతో ట్రంప్కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. "ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టుబడులన్నీ పూర్తిగా విచక్షణాధికార ఖాతాల (Discretionary Accounts) ద్వారానే సాగుతాయి. థర్డ్-పార్టీ ఆర్థిక సంస్థలు నిర్వహించే ఆటోమేటెడ్ పెట్టుబడి ప్రక్రియలు, సిస్టమ్స్ ద్వారానే ఈ పోర్ట్ఫోలియోలు రీబ్యాలెన్స్ అవుతుంటాయి, ట్రేడ్లు జరుగుతుంటాయి. ఏ స్టాక్ కొనాలి, ఏది అమ్మాలి అనే నిర్ణయాల్లో ప్రెసిడెంట్ ట్రంప్కు కానీ, ఆయన కుటుంబానికి కానీ, ట్రంప్ ఆర్గనైజేషన్కు కానీ ఎలాంటి పాత్ర లేదు. ఏ ట్రేడింగ్ జరుగుతుందనే ముందస్తు సమాచారం కూడా వారికి ఉండదు." అని ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వివరించారు. -
రూ.4400 తగ్గిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా!
గురువారం ఉదయం రూ.2240 తగ్గిన పసిడి ధర, సాయంత్రానికి రూ.4420 తగ్గింది. దీంతో బంగారం రేటు ఒక్కరోజులోనే గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (మే 15) ఉదయం 2050 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, సాయంత్రానికి 4050 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల ధర ఉదయం 2240 రూపాయలు తగ్గింది. సాయంత్రానికి మరో రూ.2180 (మొత్తం రూ.4420 తగ్గింది) తగ్గింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధర భారీ పతనం చవిచూసిందని స్పష్టంగా అర్థమవుతోంది.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.4,050 తగ్గి రూ.1,44,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4200 తగ్గి 1,58,060 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,47,650 (2850 రూపాయలు తగ్గింది). 24 క్యారెట్ల ధర రూ.3100 తగ్గి 1,61,080 రూపాయల వద్దకు చేరింది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ మార్పులు జరగలేదు. కాబట్టి సిల్వర్ రేటు ఉదయం ఎలా ఉందో.. అలాగే ఉంది.మొత్తం మీద.. వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేటుకు బ్రేకులు పడినట్లు అనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా భారీ ధరల తగ్గుదల నమోదైంది. అయితే.. రానున్న రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 160.73 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 23,643.50 వద్ద నిలిచాయి.వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్, సాకర్ హెల్త్కేర్ లిమిటెడ్, అట్లాంటా లిమిటెడ్, షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోల్డ్-టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్, నవ లిమిటెడ్, ఎంఐఆర్సీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్, బీటా డ్రగ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 23,761 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 214 పాయింట్లు పుంజుకుని 75,622 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.07బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.93 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.77 శాతం పెరిగింది.నాస్డాక్ 0.88 శాతం పుంజుకుంది.Today Nifty position 15-05-2026(time: 09:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 789.74 పాయింట్లు లేదా 1.06 శాతం లాభంతో 75,478.15 వద్ద, నిఫ్టీ 277.00 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 23,689.60 వద్ద నిలిచాయి.బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, మోడీ నాచురల్స్ లిమిటెడ్, అమైన్స్ & ప్లాస్టిసైజర్స్ లిమిటెడ్, PNB గిల్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, శారదా క్రాప్కెమ్ లిమిటెడ్, ఇంటర్ఆర్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా
పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.TAKE ACTION: 2 reasons why inflation will steal your money1: As long as the war in Iran rising oil prices will cause inflation and your fist money to decline in purchasing power.2: Nation Debt will cause governments to print more fake money.Please protect your self,…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 13, 2026డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు. -
బంగారమా.. ఈరోజు కొంటామా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు పెరిగి 23,571 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 427 పాయింట్లు పుంజుకుని 75,062 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.49బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.58 శాతం పెరిగింది.నాస్డాక్ 1.2 శాతం పుంజుకుంది.Today Nifty position 14-05-2026(time: 09:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేటి మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 13, 2026) తీవ్ర ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భారీ అమ్మకాల పర్వానికి స్వల్ప విరామం లభించినట్లు కనిపిస్తోంది. ప్రధాన సూచీలు రోజంతా అనిశ్చితికి లోనైనప్పటికీ ముగింపు సమయానికి సానుకూల ధోరణిని ప్రదర్శించాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 33 పాయింట్ల స్వల్ప లాభంతో 23,412 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 49 పాయింట్లు పుంజుకుని 74,608 స్థాయిని చేరింది.మార్కెట్ గమనానికి కారణాలుగత సెషన్లలో మార్కెట్ భారీగా పతనం కావడంతో (ముఖ్యంగా మే 12న సెన్సెక్స్ 1,456 పాయింట్లు పడిపోయింది), కొన్ని కీలక షేర్లు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ రంగాల్లో ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్కు మొగ్గు చూపడం మార్కెట్కు ఊతమిచ్చింది.అమెరికాలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏప్రిల్లో 3.8%కి పెరగడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు) నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణం వేగవంతం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 106 డాలర్ల పైనే కొనసాగుతోంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాలు నెలకొన్నాయి. ‘మూడీస్’ సంస్థ ఇప్పటికే 2026కి భారత వృద్ధి అంచనాను 6%కి తగ్గించడం గమనార్హం.ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఎంటర్ప్రైజ్ ఏఐ రంగంలోకి ప్రవేశిస్తుండటంతో భారత ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా దెబ్బతింటుందనే భయంతో ఐటీ షేర్లలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నేడు ఇతర రంగాలు రాణించడంతో నిఫ్టీ పతనాన్ని అడ్డుకోగలిగింది.నిపుణుల విశ్లేషణప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిఫ్టీకి 23,200 నుంచి 23,400 మధ్య బలమైన మద్దతు (సపోర్ట్) కనిపిస్తోంది. ఒకవేళ అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే తప్ప మార్కెట్ మళ్లీ పూర్తి స్థాయి సానుకూల వృద్ధిలోకి రావడం కష్టమే. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి క్వాలిటీ స్టాక్స్కు మాత్రమే పరిమితం కావడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో బంగారం ఒకేరోజు భారీగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు తగ్గి 23,325 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 202 పాయింట్లు నష్టపోయి 74,344 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.16 శాతం తగ్గింది.నాస్డాక్ 0.71 శాతం నష్టపోయింది.Today Nifty position 13-05-2026(time: 09:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సబ్బు నుంచి బిస్కెట్ వరకు.. అన్నింటిపై ధరల మోత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో వినియోగదారులపై ధరల భారం పడుతోంది. ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థలు కొన్ని ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను కొంత మేర పెంచడంతోపాటు.. ప్యాక్ల బరువును (పరిమాణం/గ్రాములు) సైతం తగ్గించాయి. ఇప్పుడు మరో విడత, తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి అవి సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాల ధరలు మరింత పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడడం తెలిసిందే. దీంతో వీడి ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి ఫలితంగా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్, ఇతర ప్యాకేజింగ్ వస్తువుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. వీటి తయారీలోకి వినియోగించే ముడిసరుకులకు ముడిచమురు ఆధారం కావడం గమనార్హం. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతతో ముడి సరుకుల వ్యయాలు పెరిగాయి. దీంతో కంపెనీలు లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి అవి రేట్ల పెంపుతోపాటు, ప్యాక్ సైజులను తగ్గించేస్తున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్ మరింత భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల పెంపు.. ఇప్పటికే డాబర్, హెచ్యూఎల్, బ్రిటానియా తదితర సంస్థలు 3 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచేశాయి. మరింత పెంచే అవకాశం కూడా ఉందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఫలితాల వెల్లడి అనంతరం అనలిస్ట్ల కాల్లో పేర్కొన్నాయి. అలాగే, ప్రాచుర్యం పొందిన చిన్న ప్యాకెట్ల (రూ.5, 10, 15 రూపాయల ప్యాకెట్లు) ధరను మార్చకుండా, వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. తద్వారా తమ విక్రయాలు ప్రభావితం కాకుండా, మార్జిన్లను కాపాడుకునేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. డాబర్ ఇండియా ఇప్పటికే ఉత్పత్తుల ధరలను 4 శాతం వరకు పెంచింది. తమపై 10 శాతం మేర ద్రవ్యోల్బణం (ముడి సరుకుల వ్యయాల పెరుగుదల) ప్రభావం ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, అమ్మకాల్లో డబుల్ డిజిట్ వృద్ధి (ధరల పెంపు, అమ్మకాల పెంపు రూపంలో) నమోదు చేస్తామని చెప్పారు. ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు 20 శాతం వరకు పెరిగినందున ధరల పెంపుతోపాటు, పరిమాణం తగ్గింపు తప్పనిసరని అని బ్రిటానియా పేర్కొంది. ప్యాకేజింగ్లోకి వాడే లామినేట్స్ ధరల మంట సంస్థపై పడుతోంది. దీనికితోడు ఎల్పీజీ, పీఎన్జీపై ఆధారపడి ఉండడంతో మార్జిన్లపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తమ ముడి పదార్థాల ధరలు 40–50% పెరిగాయని, ఈ భారాన్ని క్రమంగా వినియోగదారులపై వేయక తప్పదని పిడిలైట్ స్పష్టం చేసింది. ప్రముఖ బ్రాండ్ ఫెవికాల్ ధరలను 12–15% మేర పెంచింది. ఈ సంస్థ ఉత్పత్తులకు ముడిచమురు డెరివేటివ్స్ కీలకం కాగా, వాటి ధరలు సగటున 40–50% వరకు పెరిగాయి. వరుణ్ బెవరేజెస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ వ్యయాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. తమకు కొబ్బరి ధరలు దిగిరావడం కలిసొచి్చందని.. ఇతర ముడి సరుకుల ధరల ఒత్తిళ్లను ఉత్పత్తుల ధరలను క్రమంగా పెంచడం, వ్యయ నియంత్రణ చర్యలతో అధిగమిస్తామని మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా ప్రకటించారు. ప్యాకేజింగ్, ఎల్పీజీ ధరలు పెరిగిపోవడంతో మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నట్టు టాటా కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. వైవిధ్యమైన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో కలిగి ఉన్నందున ఈ ఒత్తిళ్లను ప్రస్తుతానికి అధిగమించగలమని చెప్పారు. -
పడేసిన పొదుపు పిలుపు
ముంబై: పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన అనిశ్చితులు, ముడి చమురు ధరలు దూసుకెళ్లడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ 2% క్షీణించింది. దేశ ప్రజలు ‘పొదుపు చర్యలు’ పాటించాలంటూ ప్రధాని మోదీ పిలుపు ప్రభావం రెండో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 436 పాయింట్లు క్షీణించి 23,380 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. నష్టాలతో మొదలైన సూచీలు క్రమంగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1566 పాయింట్లు పతనమై 74,449 వద్ద, నిఫ్టీ 468 పాయింట్ల క్రాష్తో 23,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ⇒ ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగొచ్చనే ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఆసియాలో కొరియా (–2.34%), ఇండోనేషియా(–0.68%), చైనా (–0.25%), హాంగ్కాంగ్(–0.22%) నష్టపోయాయి. జపాన్(0.52%), తైవాన్ (0.22%) సింగపూర్(0.07%) లాభపడ్డాయి. యూరప్లో బ్రిటన్(–0.39%), ఫ్రాన్స్(–0.98%), జర్మనీ(–1.52%) పతనమయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు అరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ స్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా గడిచిన నాలుగు రోజుల్లో రూ.16.77 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ రూ.456.02 లక్షల కోట్లకు దిగివచి్చంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ⇒ సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్బీఐ(0.12%) మాత్రమే లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా(–4.44%), అదానీపోర్ట్స్ (–4.39%), హెచ్సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), టైటాన్(–3.06%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 4.22%, ఐటీ 3.61%, సర్విసెస్ 3.51%, కన్జూమర్ డ్యూరబుల్స్ 3.35% పతనమయ్యాయి. ⇒ మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లు బేర్మన్నాయి. అదానీ పవర్ 6%, అదానీ గ్రీన్ 5.87%, అదానీ పవర్ 5.63%, ఎన్డీటీవీ 4.78% అదానీ టోటల్ గ్యాస్ 4.77% క్షీణించాయి. అదానీ పోర్ట్స్ 4.39%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4.41%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.82% పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.16.70 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ పసిడి కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తంగమయిల్ జ్యువెలరీ 8.32%, సెంకో గోల్డ్ 6.39%, పీసీ జ్యువెలర్ 6.19%, కళ్యాణ్ జ్యువెలరీస్ 6.10%, స్కై గోల్డ్ 5.94%, త్రిభువన్ దాస్ భీంజీ జువేరీ 5.84%, టైటాన్ 3.6% పడ్డాయి. ⇒ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బేరీష్ ట్రెండ్కు తోడు, ఏఐ–డిఫ్లేషన్, ఓపెన్ఏఐ ‘డిప్లాయ్మెంట్ కంపెనీ’ ప్రకటనతో టెక్ మహీంద్రా(–4.44%), హెచ్సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), విప్రో(–3.59%), ఇన్ఫోసిస్ (–3.09%), హెక్సావేర్ టెక్ (–1.42%) నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్సు 3.67 శాతం పతనమైంది.ఇన్వెస్టర్లలో దెబ్బతిన్న విశ్వాసంప్రస్తుత మార్కెట్ పతనం సాధారణ లాభాల స్వీకరణ వల్ల జరిగింది కాదు; మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లలో ‘నమ్మకం దెబ్బతినడం’ వల్ల సంభవించిన పతనం ఇది. రాబోయే రోజుల్లో ఆర్థిక సవాళ్లు మరింత కఠినంగా ఉండబోతున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 105–107 డాలర్లకు చేరడం, రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా విక్రయాలకు పాల్పడటం వంటి అంశాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.దీనికి తోడు, ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్ఫైర్) ప్రస్తుతం ‘లైఫ్ సపోర్ట్’పై ఉన్నంత బలహీన స్థితిలో ఉందంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచి, మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి – కే. హరిప్రసాద్, లివ్లాంగ్ వెల్త్ ఫౌండర్, -
మోదీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో ‘బేర్’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. మార్కెట్లకు షాక్...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్తో సీజ్ఫైర్ గాల్లో దీపమంటూ.. ట్రంప్ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్ రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. పసిడి కొనుగోళ్లపై గందరగోళం... బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్టైమ్ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్ నిల్వలకు గండి పడుతోంది. గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. క్రూడ్ పైపైకి.. త్వరలో పెట్రో వాత! కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్తో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. రూపాయి విలవిల.. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్టైమ్ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. ఎరువులు, వంట నూనెల మంట! యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్ ఏకంగా 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
భారతీయ స్టాక్ మార్కెట్కు ఈ రోజు 'బ్లాక్ ట్యూస్డే'గా మారింది. ఒక్కరోజులోనే భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో దలాల్ స్ట్రీట్లో తీవ్ర పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ 1,450 పాయింట్లకుపైగా కుప్పకూలడంతో, పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఉదయం వరకు స్థిరంగా కనిపించిన మార్కెట్.. మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాల్లోకి జారిపోవడం పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెంచింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 467 లక్షల కోట్ల నుంచి రూ. 456.9 లక్షల కోట్లకు పడిపోయింది.ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించడంతో.. మళ్లీ యుద్ధ భయం పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, భారత మార్కెట్ కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.అంతేకాకుండా.. ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా కొనసాగుతుండటం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోవడం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఫలితంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారీగా షేర్లను అమ్ముతూ భారత మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నెలలోనే వారు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.పలు రంగాల షేర్లు ఈ పతనంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యోల్బణ ప్రభావంతో రుణాలు తిరిగి రాకపోవచ్చనే భయాలు కనిపించాయి. ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు కూడా చమురు ధరల అస్థిరత కారణంగా నష్టాలను చవిచూశాయి.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే, భారత మార్కెట్పై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. సరఫరా వ్యవస్థ దెబ్బతింటే దేశ ఆర్థిక వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉందని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో భయం, అనిశ్చితి, పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు లేదా 1.92 శాతం నష్టంతో 74,559.24 వద్ద, నిఫ్టీ 436.30 పాయింట్లు లేదా 1.83 శాతం నష్టంతో 23,379.55 వద్ద నిలిచాయి.బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ లిమిటెడ్, ఏషియన్ స్టార్ కంపెనీ లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, సెమాక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్, ప్రేమ్కో గ్లోబల్ లిమిటెడ్, జీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
సెగ పుట్టిస్తున్న పసిడి.. వెండి మళ్లీ రికార్డు దిశగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
620 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 171 పాయింట్లు తగ్గి 23,648 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 621 పాయింట్లు నష్టపోయి 75,397 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.11బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 12-05-2026(time: 09:56 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మరోసారి భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రధాని మోదీ పొదుపు చర్యల గురించి చేసిన వ్యాఖ్యలతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం దాదాపు 1.5% పతనమైంది. డాలర్తో మారకంలో రూపాయి (95.28) సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. సెన్సెక్స్ 1,313 పాయింట్లు క్షీణించి 76,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద నిలిచింది. సూచీలు దాదాపు 2% పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఫార్మా, హాస్పిటల్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 3.76%, రియల్టీ 2.74%, పీఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ 2.28%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 2.60%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.14%, విద్యుత్ 2.13% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.09%, 0.44 శాతం నష్టపోయాయి.విదేశీ మారక నిల్వలు పొదుపు లక్ష్యంగా దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ 9.23%, శాన్కో గోల్డ్ 8.61%, త్రిభువన్దాస్ భీంజీ జవేరీ 7.52%, టైటాన్ 6.83%, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్స్ 6.63%, తంగమయిల్ జ్యువెలరీ 5.69%, పీసీ జ్యువెలర్ 4.94 శాతం పతనమయ్యాయి.విదేశీ ప్రయాణాల విషయంలో నియంత్రణ పాటించాలని మోదీ కోరడంతో పర్యాటక, ప్రయాణ సంబంధిత సరీ్వసెస్, ఏవియేషన్ షేర్లు నేలచూపులు చూపాయి. యాత్ర ఆన్లైన్ 5.41%, థామస్ కుక్ 3.88%, ఈజీ ట్రిప్ ప్లానర్స్ 3.27% పతనమయ్యాయి. ఇండిగో 4.94%, స్పైస్జెట్ 4.72% నష్టపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ప్రధాని అభ్యర్థనతో ఎలక్ట్రిక్ వాహన కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఏథర్ ఎనర్జీ 6%, జేబీఎం ఆటో 4.75%, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2.47%, ఒలక్ట్రా గ్రీన్టెక్ 2.16 శాతం రాణించాయి.నష్టాలకు 4 కారణాలుప్రధాని పొదుపు పిలుపుతో కార్పొరేట్ సంస్థల ఆదాయంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కారణంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని సూచీలు ప్రభావితమయ్యాయి.అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం: పశ్చిమాసియాలో నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిస్పందనగా... లెబనాన్లో యుద్ధాన్ని ఆపాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ ఎదురు షరతులు విధించింది. అయితే, ఈ ప్రతిపాదనలు ‘అంగీకరించలేనివి అని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు: అమెరికా–ఇరాన్ శాంతి చర్చల వైఫల్యంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ 4 శాతానికి పైగా పెరిగి బ్యారెల్కు 105 డాలర్ల వద్దకు, నైమెక్స్ క్రూడ్ 3 శాతం వృద్ధితో 98 డాలర్లకు చేరుకుంది. తమ చమురు అవసరాల కోసం 85–90 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం పెను సవాలుగా మారింది. పెరిగిన ధరల వల్ల ద్రవ్యోల్బణం ఎగసి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు: దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. వరుసగా అయిదో రోజూ నికర అమ్మకందారులుగానే కొనసాగారు. తాజాగా సోమవారం రూ. 8,437.56 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
వార్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు హెచ్చరిక సంకేతాలు!
ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగనున్న పరిస్థితులు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వెరసి ఈ వారం భారీ ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ట్రేడ్కానున్నట్లు అంచనా వేశారు. వివరాలు చూద్దాం..కొద్ది వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంపై ఇన్వెస్టర్లు మరింత దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే వీలున్న వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగవచ్చని నిపుణులు విశ్లేషించారు. దీంతో గత మూడు వారాలుగా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపైనా తీవ్ర ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.గణాంకాలపై ఫోకస్12న ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), 14న టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 3.2% నుంచి 3.4%కి పెరిగింది. డబ్ల్యూపీఐ మరింత అధికంగా 2.13% నుంచి 3.88 శాతానికి ఎగసింది. దీంతో ఆర్బీఐ భవిష్యత్ పరపతి విధానాలపై ధరలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు పశ్చిమాసియాలో మళ్లీ ఆందోళనలు పెరుగుతుండటంతో ముడిచమురు ధరలు బ్యారల్ 100 డాలర్ల సమీపంలో కదులుతున్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి 95 స్థాయికి బలహీనపడిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ నెల 15న ఏప్రిల్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. మార్చిలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోపక్క చైనా, యూఎస్.. ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం తదితర గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్. పొన్మూడి, స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు. అయితే యూఎస్, ఇరాన్ మధ్య ఆశావహ పరిస్థితులు నెలకొంటే చమురు ధరలు దిగివచ్చే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వగలదని అభిప్రాయపడ్డారు.క్యూ4 జాబితాలోఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న 2025–26 చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాల సీజన్లో భాగంగా మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఎయిర్టెల్, డీఎల్ఎఫ్, హెచ్పీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్ తదితరాలున్నాయి.హెచ్చు తగ్గుల మధ్య గత వారం మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు(0.53 శాతం), నిఫ్టీ 179 పాయింట్లు(0.75 శాతం) చొప్పున ఎగశాయి. వెరసి 77,328 వద్ద, 24,176 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 3.4 శాతం, 4.3 శాతం చొప్పున జంప్చేయడం గమనార్హం!ఈ వారం సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలుంది. కొద్ది వారాలుగా నిఫ్టీ 23,600–24,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి నుంచి బయటపడితే అంటే 23,600 దిగువన 23,100–23,000 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఇలాకాకుండా బలపడి 24,700 పాయింట్లను దాటితే 25,000ను తాకవచ్చు. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయంలో కూడా భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 1,312.91 పాయింట్లు లేదా 1.70 శాతం నష్టంతో 76,015.28 వద్ద, నిఫ్టీ 360.30 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 23,815.85 వద్ద నిలిచిఆహాయిజీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, లాటీస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్ప్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3P ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, శ్రీ రామ మల్టీ-టెక్ లిమిటెడ్, ఆర్తి సర్ఫాక్టెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెప్పే రాబర్ట్ కియోసాకి.. తాజాగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోందని.. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త అని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఇలా ఎందుకు అన్నారు?, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఉత్తమ పెట్టుబడిదారులు భవిష్యత్తును చూడగలరు. ఉదాహరణకు.. నేను 1965లో వెండి ధర చాలా తక్కువ ఉండేది. ఆ సమయంలోనే వెండిని పోగు చేయడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ నాటి నుంచి పోగు చేసిన సిల్వర్ ఇప్పుడు నా అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటిగా నిలిచిందని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ పేర్కొన్నారు.కియోసాకి ట్వీట్లో రెండు ప్రశ్నలను కూడా సంధించారు. ఇందులో ఒకటి 'భవిష్యత్తులో ఏమి జరగబోతోందని మీరు భావిస్తున్నారు?'. మరొకటి, భవిష్యత్తులో లాభం పొందడానికి మీరు దేనిలో పెట్టుబడి పెట్టగలరు?'. ఈ ప్రశ్నలకు నెటిజన్లు తమదైన రీతిలో జవాబులు ఇస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణపెట్టుబడుల విషయంలో జాగ్రత్త అని చెబుతూనే.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త. అంధులకు ఇది దుర్వార్త. అని కియోసాకి తన ట్వీట్ ముగించారు.వెండి ధరలు ఇలా..నిజానికి వెండి ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి రూ.90 వేల వద్ద ఉన్న కేజీ సిల్వర్ ధర, 2026 ప్రారంభంలో రూ.2.34 లక్షలకు చేరింది. ఆ తరువాత రూ.3.85 లక్షలకు చేరి కొనుగోలుదారులకు షాకిచ్చింది. కాగా ఇప్పుడు వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. వెండి ధరలలో ఎలాంటి పరిణామాలు జరిగాయో స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరుగుతాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. -
నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
930 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 261 పాయింట్లు తగ్గి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 938 పాయింట్లు నష్టపోయి 76,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.07బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.84 శాతం పెరిగింది.నాస్డాక్ 1.71 శాతం పుంజుకుంది.Today Nifty position 11-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ ఆటుపోట్లకు చాన్స్
ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగనున్న పరిస్థితులు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వెరసి ఈ వారం భారీ ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ట్రేడ్కానున్నట్లు అంచనా వేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్కొద్ది వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంపై ఇన్వెస్టర్లు మరింత దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే వీలున్న వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగవచ్చని నిపుణులు విశ్లేషించారు. దీంతో గత మూడు వారాలుగా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపైనా తీవ్ర ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.గణాంకాలపై ఫోకస్12న ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), 14న టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 3.2% నుంచి 3.4%కి పెరిగింది. డబ్ల్యూపీఐ మరింత అధికంగా 2.13% నుంచి 3.88 శాతానికి ఎగసింది. దీంతో ఆర్బీఐ భవిష్యత్ పరపతి విధానాలపై ధరలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు పశి్చమాసియాలో మళ్లీ ఆందోళనలు పెరుగుతుండటంతో ముడిచమురు ధరలు బ్యారల్ 100 డాలర్ల సమీపంలో కదులుతున్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి 95 స్థాయికి బలహీనపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల 15న ఏప్రిల్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. మార్చిలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది.మరోపక్క చైనా, యూఎస్.. ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం తదితర గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్. పొన్మూడి, స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు. అయితే యూఎస్, ఇరాన్ మధ్య ఆశావహ పరిస్థితులు నెలకొంటే చమురు ధరలు దిగివచ్చే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వగలదని అభిప్రాయపడ్డారు.క్యూ4 జాబితాలో ..ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న 2025–26 చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాల సీజన్లో భాగంగా మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఎయిర్టెల్, డీఎల్ఎఫ్, హెచ్పీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్ తదితరాలున్నాయి.గత వారమిలాహెచ్చు తగ్గుల మధ్య గత వారం మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు(0.53 శాతం), నిఫ్టీ 179 పాయింట్లు(0.75 శాతం) చొప్పున ఎగశాయి. వెరసి 77,328 వద్ద, 24,176 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 3.4 శాతం, 4.3 శాతం చొప్పున జంప్చేయడం గమనార్హం!ఎఫ్పీఐల షాక్కొద్ది రోజులుగా భారీ అమ్మకాలతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్నిస్తున్నారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దీంతో 2026లో ఇప్పటివరకూ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నట్లయ్యింది! వెరసి 2025లో నమోదైన రూ. 1.6 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. ఎఫ్పీఐలు గత నెలలో రూ. 60,847 కోట్లు, మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే ఫిబ్రవరిలో మాత్రం అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు పశి్చమాసియాసహా చమురు ధరలు తదితర పలు అంశాలు ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.సాంకేతికంగా చూస్తే..ఈ వారం సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలుంది. కొద్ది వారాలుగా నిఫ్టీ 23,600–24,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి నుంచి బయటపడితే అంటే 23,600 దిగువన 23,100–23,000 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఇలాకాకుండా బలపడి 24,700 పాయింట్లను దాటితే 25,000ను తాకవచ్చు. -
తల్లి కోపం.. బఫెట్ విజయ రహస్యం!
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఈయన ఇంత గొప్ప ఇన్వెస్టర్ ఎలా అయ్యారు?, దాని వెనుక ఆయన తల్లి పాత్ర ఎంత వరకు ఉంది? అనే ఆసక్తికరమైన విషయాలు 'మదర్స్ డే' సందర్భంగా ఈ కథనంలో చూసేద్దాం.ప్రపంచంలో విజయవంతమైన, ధనవంతులైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చిన్న తనం నుంచి కఠినమైన క్రమశిక్షణలో పెరిగారు. తల్లి లీలా స్టాల్ బఫెట్ కనుసన్నల్లో ఎదిగిన వారెన్ బఫెట్ చిన్ననాటి నుంచే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగించేవారు. ఎందుకంటే తల్లి వృధా ఖర్చులను ప్రోత్సహించేది కాదు.లీలా స్టాల్ బఫెట్ చాలా క్రమశిక్షణ గల, కఠిన స్వభావం కలిగి ఉండటం వల్ల.. ఆమె కోపానికి వారెన్ బఫెట్ భయపడేవారు. ఇంట్లో వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉండేది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడి ఏర్పడేదని 'ద స్నోబాల్' (The Snowball) పుస్తకంలో వెల్లడించారు.ఒకసారి భోజన సమయంలో చిన్న విషయంపై.. తల్లి కోపగించుకున్నప్పుడు ఇంట్లో నిశ్శబ్దం నెలకొందని బఫెట్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యంగా ఫీలై డైనింగ్ టేబుల్ వదిలి తన గదికి వెళ్లిపోయినట్లు చెప్పుకున్నారు. అలాంటి అనుభవాలు ఆయన బాల్యంపై గాఢమైన ప్రభావం చూపాయి.బఫెట్ చిన్న వయసులోనే చూయింగ్ గమ్ అమ్మడం, కోకా కోలా బాటిళ్లు విక్రయించడం, న్యూస్ పేపర్ వేయడం వంటి పనులు చేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా.. పొదుపు చేసి తిరిగి పెట్టుబడి పెట్టేవాడు. వారెన్ బఫెట్ విజయానికి కేవలం తెలివి మాత్రమే కారణం కాదు. ఆయన సహనం, నియంత్రణ, ఆలోచన కూడా కారణాలే.ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణబిలియనీర్ అయినప్పటికీ బఫెట్ జీవనశైలిలో పెద్ద మార్పు లేదు. ఆయన ఇప్పటికీ చాలా సాదాసీదాగా జీవిస్తారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన నివాసం ఉంటున్నారు. విలాసవంతమైన జీవితం కన్నా సాదాసీదా జీవితాన్నే ఆయన ఎక్కువగా ఇష్టపడతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీన్నిబట్టి చూస్తే.. చిన్నతనంలో తల్లి వల్ల ఏర్పడిన క్రమశిక్షణే నేటికీ ఆయనపై ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. -
ఆరు ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారత్తో సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నప్పటికీ, దేశీయ ఐపీఓ మార్కెట్ మాత్రం ఆశావహ సంకేతాలు ఇస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడం, కార్యకలాపాలను విస్తరించుకోవడం, డైవర్సిఫికేషన్ లక్ష్యాలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన ఆరు కంపెనీలకు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. తద్వారా ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఐపీఓలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విభిన్న రంగాలకు చెందిన జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్, హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్, సర్జివేర్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హోటల్ పోలో టవర్స్ అక్టోబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మే 4 నుంచి 8 మధ్య ఈ దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీఓలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. రాబోయే ఐపీవోల వివరాలివీ.. జెప్టో రూ.11,000 కోట్ల ఇష్యూ క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో ప్రస్తుతం మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి దిగ్గజాలతో పోటీపడుతోంది. త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమిక మార్కెట్ నుంచి దాదాపు రూ.11 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సెబీ తాజా అనుమతులతో షేరు ధరల శ్రేణి, సబ్ర్స్కిప్షన్ తేదీలు, లిస్టింగ్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీ సన్నద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్, స్టార్టప్ ఐపీఓలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ జెప్టో పబ్లిక్ ఆఫర్కు రావడం గమనార్హం. లిస్టింగ్ పూర్తైతే ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీల్లో ఉన్న జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది. ధూత్ ట్రాన్స్మిషన్ ఆటో ఉపకరణాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ ద్వారా దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,258 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాలను విక్రయించబోరని సమాచారం. కంపెనీలో బెయిన్ క్యాపిటల్ పెట్టుబడులు ఉన్నాయి. → జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్ సంస్థలు ‘కాని్ఫడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ రూట్’ను ఎంచుకున్నాయి. ఈ విధానం ద్వారా ముసాయిదా పత్రాలను బహిరంగపరచకుండానే సెబీ నుంచి ప్రాథమిక అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్ ఐపీఓ ద్వారా రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఓఎఫ్ఎస్ లేదు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.2,250 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. సర్జివేర్ఉత్తరప్రదేశ్కు చెందిన మెడికల్ డివైసెస్ తయారీ సంస్థ సర్జివేర్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఐపీఓకు సిద్ధమైంది. తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ. 370 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ ఘనశ్యామ్ దాస్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ.370 కోట్ల ఈక్విటీలను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త యంత్రాల కొనుగోలు, తయారీ సామర్థ్యాల పెంపు, రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ వ్యవసాయ పంటల రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతో ఐపీఓకు రానుంది. అదనంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 74.05 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఎఫ్సీ ఎమర్జింగ్ ఆసియా ఫండ్ వాటాలను విక్రయించనున్నాయి. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థ సఫైర్ క్రాప్ సైన్స్ మూలధన అవసరాలు, భవిష్యత్ కొనుగోళ్లు, వ్యూహాత్మక విస్తరణకు వినియోగించనుంది. హోటల్ పోలో టవర్స్ హాస్పిటాలిటీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్ పోలో టవర్స్ సంస్థ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా 71.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధి, అప్పుల తగ్గింపు, మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా ఈశాన్య, తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ‘పోలో’, ‘మ్యాక్స్’ బ్రాండ్ల పేరుతో అప్స్కేల్, మిడ్స్కేల్ హోటళ్లు, రిసార్ట్స్ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.మే 12న ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ఇష్యూ షురూ.. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీదారు ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ప్యాక్ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 47–50గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.35.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ 70.65 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.35.32 కోట్ల సమీకరించనుంది. మే 11న యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ ఉంటుంది. -
బంగారం, వెండి ధరలు: వారం రోజుల్లో ఊహించని మార్పు!
బంగారం వెండి ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఊహకందకుండాపోయింది. ఈ రోజు తగ్గితే.. రేపు పెరిగిపోతున్న పరిస్థితులు వారం రోజుల్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (మే 3 నుంచి మే 9 వరకు) పసిడి ధరలు ఎలా మారాయి. ప్రస్తుతం ఏ మార్క్ దగ్గర ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగర్లో మే 3న (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం గోల్డ్ రేటు నేటికి (శనివారం) 1,52,350 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.1420 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల ధర ఈ సమయంలోనే 1,38,350 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,650 వద్దకు (రూ.1300 పెరిగింది) చేరింది.ఇక చెన్నై నగరంలో వారం రోజుల్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మే 3న రూ.152730 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు..154370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,40,000 రూపాయల దగ్గర నుంచి 141500 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతలా పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 1,51,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,52,500 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,38,500 నుంచి రూ.1,39,800 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. మే 3న రూ.2.70 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ.2.80 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు వారం రోజుల్లో రూ.10 వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
మళ్లీ అదే రిలీఫ్! బంగారంపై గుడ్ న్యూస్
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో నేడు కూడా పసిడి కొనుగోలుదారులకు కాస్త ఊరట కలుగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కుప్పకూలిన SBI షేరు.. రూ. 68 వేల కోట్లు లాస్!
స్టాక్ మార్కెట్లో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) షేర్లు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకి దిగారు. దీంతో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు రూ.67,932 కోట్ల మేర కోత పడింది.ఇంట్రాడే ట్రేడింగ్లో ఎస్బీఐ షేరు 7.4 శాతం వరకు క్షీణించి రూ.1,011.30 వద్దకు పడిపోయింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, బీఎస్ఈలో 6.6 శాతం నష్టంతో రూ.1,019.60 వద్ద ముగిసింది. చివరికి షేరు రూ.1,018.40 వద్ద స్థిరపడింది.ఈ పతనంతో ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.9.40 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2024 జూన్ 4 తర్వాత ఎస్బీఐ షేరుకు ఇది అతిపెద్ద సింగిల్డే క్షీణతగా నమోదైంది.లాభాలు పెరిగినా.. అంచనాలను అందుకోని ఫలితాలుమార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ రూ.19,684 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.6 శాతం వృద్ధి. అయితే మార్కెట్ విశ్లేషకులు రూ.20,030 కోట్ల లాభాన్ని అంచనా వేసిన నేపథ్యంలో ఫలితాలు నిరాశ పరిచాయి.బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా 3.8 శాతం పెరిగి రూ.44,386 కోట్లకు చేరింది. కానీ విశ్లేషకుల అంచనా అయిన రూ.46,940 కోట్లను అందుకోలేకపోయింది.ఇక బ్యాంకుల లాభదాయకతకు కీలకమైన నికర వడ్డీ మార్జిన్ మార్చి త్రైమాసికంలో 2.93 శాతంగా నమోదైంది. మార్జిన్లలో బలహీనత కనిపించడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది.52 వారాల గరిష్టం నుంచి 17% క్షీణతప్రస్తుతం ఎస్బీఐ షేరు 2026 ఫిబ్రవరి 24న నమోదైన 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,234.70తో పోలిస్తే 17.52 శాతం దిగువన ట్రేడ్ అవుతోంది. అయితే 2025 మే 9న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ.755.50తో పోలిస్తే ఇంకా 34.80 శాతం ఎగువన ఉంది.వారం వ్యవధిలో ఎస్బీఐ షేరు 4.68 శాతం క్షీణించగా, అదే సమయంలో నిఫ్టీ-50 సూచీ 0.74 శాతం లాభపడింది. నెలరోజుల వ్యవధిలో కూడా షేరు 4.06 శాతం పడిపోగా, నిఫ్టీ 0.75 శాతం పెరిగింది.అయితే దీర్ఘకాలికంగా చూస్తే ఎస్బీఐ షేరు మంచి రాబడులు అందించింది. 2026లో ఇప్పటివరకు 3.42% లాభం ఇచ్చింది. ఏడాది కాలంలో 32.43% పెరుగుదల నమోదు చేసింది. మూడేళ్లలో 74.50%, ఐదేళ్లలో 184.27% ర్యాలీ చేసింది.గ్లోబల్ టెన్షన్.. బలహీనంగా ముగిసిన మార్కెట్లుఅమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపగా, భారతీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ-50 సూచీ 150.50 పాయింట్లు లేదా 0.62 శాతం పడిపోయి 24,176.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టపోయి 77,328.19 వద్ద స్థిరపడింది.నిఫ్టీ-50లో టైటాన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 0.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 62,113.85 వద్ద కొత్త ఆల్టైమ్ హైని నమోదు చేసింది.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంక్ సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. -
కాస్త కూల్ అయిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
290 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 90 పాయింట్లు తగ్గి 24,238 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 296 పాయింట్లు నష్టపోయి 77,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 101.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం తగ్గింది.నాస్డాక్ 0.13 శాతం నష్టపోయింది.Today Nifty position 08-05-2026(time: 09:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే? -
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!
గురువారం ఉదయం స్వల్ప లాభాల వద్ద ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.00 పాయింట్లు లేదా 0.15 శాతం నష్టంతో 77,844.52 వద్ద నిలిచాయి. నిఫ్టీ 4.30 పాయింట్లు లేదా 0.018 శాతం నష్టంతో 24,326.65 వద్ద నిలిచాయి.ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అప్కోటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వి విన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాకర్ హెల్త్కేర్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, భిల్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
వేడి పెంచుతున్న పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 17 పాయింట్లు పెరిగి 24,348 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 18 పాయింట్లు పుంజుకొని 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 102.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.46 శాతం పెరిగింది.నాస్డాక్ 2.02 శాతం పుంజుకుంది.Today Nifty position 07-05-2026(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ స్టాక్స్లో పెట్టుబడులకు ప్రవాసుల ఆసక్తి
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో (రెమిటెన్స్లు) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపాదనలో మిగులు నిధులను మాతృదేశానికి పంపడాన్ని ఒక తప్పనిసరి బాధ్యతగా వారి ఇప్పుడు చూడడం లేదు. వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవాలన్న ప్రణాళికతో స్వదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్ఆర్ఐలు పెట్టుబడుల దృష్టితో మాతృదేశానికి నిధులు పంపిస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ సర్వే నివేదిక వెల్లడించింది. గల్ఫ్ ప్రాంతంలోని (జీసీసీ) 8,300 మంది ఎన్ఆర్ఐల అభిప్రాయాల ఆధారంగా ఈక్విరస్ ఈ వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గల్ఫ్ ప్రాంత ఎన్ఆర్ఐలకు సంపద సృష్టి కేంద్రంగా భారత్ స్థానం స్థిరపడుతోంది. అక్కడి వారు భారత్కు పంపిస్తున్న నిధుల్లో సగం పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్రణాళికల కోసమే ఉంటున్నాయి. సర్వే అంశాలు.. → జీసీసీ దేశాల ఎన్ఆర్ఐలు భారత్కు పంపిస్తున్న మొత్తం నిధుల్లో 27 శాతం పెట్టుబడుల కోసం ఉద్దేశించినవే. → ఆ తర్వాత 22 శాతం రెమిటెన్స్లు రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉంటున్నాయి. → ఇక 26 శాతం మేర నిధులు భారత్లోని తమ కుటుంబాల జీవన అవసరాల కోసం పంపిస్తున్నారు. → ప్రవాస భారతీయుల పెట్టుబడి ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భూములు, ఇళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపించగా, ఇప్పుడు ఆర్థిక సాధనాల వైపు ఆకర్షితులవుతున్నారు. → 40% మంది రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. → 73% మంది భారత స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటున్నారు. → 75% మంది దీర్ఘకాల చురుకైన ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం ప్రాంతీయ అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ప్రవాస భారతీయులు తమ పొదుపు మొత్తాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు ఈక్విరస్ వెల్త్ నివేదిక వెల్లడించింది. 83 శాతం మంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు తమ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయని అంగీకరించారు. ప్రాంతీయ అస్థిరతలపై 41 శాతం మంది ఆందోళన చెందుతుండగా.. 23 శాతం మంది ద్రవ్యోల్బణంపై, 13 శాతం మంది అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా గల్ఫ్ ప్రాంత ఎన్ఆర్ఐలకు ఉద్యోగ భద్రత, వీసా ప్రాధాన అంశాలుగా ఉంటుండగా.. ఇప్పుడు ఈ అంశాలపై కేవలం 12 శాతం మందే ఆందోళన చెందుతున్నారు. తమ ఆదాయ స్థిరత్వంపై వారిలో పెరిగిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ నివేదిక పేర్కొంది. -
అమెరికాలో భారత్ కంపెనీలు: ఒక్కరోజే భారీ పెట్టుబడులు!
అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.Under President Trump’s leadership investment is flowing back into the United States at record levels! Indian companies plan to invest over $20.5 billion in various sectors including tech, manufacturing, and pharmaceuticals. This includes the 12 Indian companies who announced…— Ambassador Sergio Gor (@USAmbIndia) May 6, 2026ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్లో బలమైన డిమాండ్ను సూచిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం లాభంతో 77,958.52 వద్ద, నిఫ్టీ 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 24,330.95 వద్ద నిలిచాయి.రేమండ్ రియల్టీ లిమిటెడ్, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్వైడ్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, రేమండ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, మనాక్సియా కోటెడ్ మెటల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి
ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki), తాజాగా బేబీ బూమర్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''1974లోనే నేను బేబీ బూమర్ల (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు) పదవీ విరమణ విపత్తు రాబోతోందని ఊహించాను. 2026 చివరి నాటికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. చాలామంది నిరాశ్రయులవుతారు'' అని కియోసాకి హెచ్చరించారు.ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కాస్త కఠినంగా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులు ఉద్యోగాలు కోల్పోయి, సరిపడా పొదుపులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజానికి పెద్ద సవాలు. అందుకే ముందుగానే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమని కియోసాకి చెబుతున్నారు.మన మెదడు మనకు ఉన్న గొప్ప ఆస్తి. సరైన జ్ఞానం, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సంపదను సృష్టించడం అంత కష్టం కాదు, సరైన మార్గం తెలుసుకుంటే సరిపోతుంది.ఇదీ చదవండి: ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు: కియోసాకి హెచ్చరికకొంతమంది నిపుణులు.. భవిష్యత్తు కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే డిజిటల్ ఆస్తులు అయిన బిట్కాయిన్, ఎథీరియం లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు వెళ్లడం అవసరం అని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. మొత్తం మీద.. రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలంటే ముందుగానే ప్రణాళిక అవసరం అని ఆయన పేర్కొన్నారు.BOMERS RETIREMENT DISASTER:In 1974 I saw the coming of the Baby Boomer Retirement Disaster. In 2026 millions of Boomers will be out of work in trouble financially….many homeless.I wrote two books for the Boomers and their families who wanted to prepare for this time in…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 6, 2026 -
ఒక్కసారిగా మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 126 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 359 పాయింట్లు పుంజుకొని 77,369 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.31బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 108.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.81 శాతం పెరిగింది.నాస్డాక్ 1.03 శాతం పుంజుకుంది.Today Nifty position 06-05-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈరోజు స్టాక్ మార్కెట్లో కుదుపులు ఎందుకంటే..
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచగా, దేశీయ సూచీలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో నిఫ్టీ ఒకానొక దశలో 23,882 పాయింట్లకు పడిపోయి, ఆ తర్వాత కోలుకుని 24,032 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ కూడా 76,515 పాయింట్ల డే కనిష్టాన్ని తాకి చివరకు 77,017 పాయింట్ల వద్ద స్థిరపడింది.మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు(అంచనా)పశ్చిమాసియా యుద్ధంపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న వివాదం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ప్రతిష్టంభన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లో భయాన్ని పెంచాయి.క్రూడాయిల్ ధరల సెగచమురు సరఫరాలో అంతరాయాల భయం క్రూడాయిల్ ధరలను రికార్డు స్థాయిలకు చేర్చింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల భయంఅంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదని, పైగా అవి మరింత పెరగవచ్చనే ఆందోళనలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తోంది.లాభాల స్వీకరణ, అప్రమత్తతగత కొద్ది రోజులుగా మార్కెట్ స్వల్పంగా కోలుకోవడంతో లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు అప్రమత్తమై లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా కీలకమైన ప్రతిఘటన స్థాయిల వద్ద (రెసిస్టెన్స్ లెవల్స్) ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని పెంచడం వల్ల సూచీలు ఒక దశలో బలహీనపడ్డాయి.నెక్ట్స్ ఏంటి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ కాన్సాలిడేషన్లో ఉందని తెలుస్తుంది. నిఫ్టీ 23,800-24,300 శ్రేణిలో కదలాడుతోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, క్రూడాయిల్ ధరలు స్థిరీకరణ చెందితే తప్ప మార్కెట్ పురోగతిని సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భౌగోళిక పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని మార్కెట్ నిపుణుల సూచన.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
ఇక బంగారం కొనడం ఈజీ.. EGR గురించి తెలుసా?
భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువ. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడం అంత సులభం కాదు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే దాని నిల్వ, భద్రత, స్వచ్ఛత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ).. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది.ఈజీఆర్ అంటే ఏమిటి?ఈజీఆర్ అనేది సెబీ గుర్తింపు పొందిన వాల్ట్ మేనేజర్ వద్ద జమ చేసిన భౌతిక బంగారానికి బదులుగా జారీ చేసే ఒక ఎలక్ట్రానిక్ రసీదు. ఇవి డీమ్యాట్ రూపంలో ఉండే సెక్యూరిటీస్ కాబట్టి, స్టాక్ల మాదిరిగా ఎక్స్చేంజ్లో సులభంగా కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. అంటే, బంగారం ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా ట్రేడ్ చేయగలిగేలా మారిందన్నమాట.EGRలు ఎలా పనిచేస్తాయి?ప్రతి ఈజీఆర్ వెనుక నిజమైన ఫిజికల్ గోల్డ్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎన్ఎస్ఈ ఒక 1000 గ్రాముల బంగారు గడ్డిని EGRగా మార్చింది. దీని ద్వారా భౌతిక బంగారం.. డిజిటల్ ఆస్తిగా మారుతుంది. పెట్టుబడిదారులు ఈ EGRలను స్టాక్ల మాదిరిగా ట్రేడ్ చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ EGRలకు తగిన పరిమాణంలో భౌతిక బంగారాన్ని కూడా పొందవచ్చు.EGR ప్రయోజనాలుబంగారాన్ని భద్రపరచడం కోసం బ్యాంక్ లాకర్ అవసరం లేదుదొంగతనం లేదా నష్టం ఉండదుబంగారం స్వచ్ఛతపై సందేహం ఉండదు (ఎందుకంటే ఇది ప్రమాణిత సంస్థల ద్వారా ద్రువీకరిస్తారు)చిన్న మొత్తాల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చుమార్కెట్లో సులభంగా కొనుగోలు/అమ్మకం చేయవచ్చుఇదీ చదవండి: బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం! -
బంగారం ధరల పతనం.. గోల్డ్ కొనేందుకు సరైన సమయం!
పసిడి ప్రియులకు శుభవార్త, ఎందుకంటే గోల్డ్ రేటు గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూనే ఉంది. ఈ రోజు (మంగళవారం) కూడా పసిడి ధరలు ఇదే బాటలో అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 243.41 పాయింట్ల నష్టంతో 77,025.99 వద్ద, నిఫ్టీ 90.10 పాయింట్ల నష్టంతో 24,029.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్, డైనాకాన్స్ సిస్టమ్స్ & సొల్యూషన్స్ లిమిటెడ్, ఎంఎంపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్కాన్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అవ్రో ఇండియా లిమిటెడ్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్ లిమిటెడ్, నాథ్ బయో-జీన్స్ (ఇండియా) లిమిటెడ్, డి నోరా ఇండియా లిమిటెడ్, జ్యోతి ల్యాబ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల్లో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మళ్లీ మొదలైన యుద్ధం: గ్లోబల్ మార్కెట్పై ఎఫెక్ట్!
గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. శాంతి చర్చల తరువాత యుద్దానికి బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు మళ్లీ వార్ మొదలైంది. ఈ యుద్ధం మళ్లీ మొదలవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షిణించే అవకాశం ఉంది. ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై కూడా పడింది.యుద్ధం మొదలైతే.. దీని ఎఫెక్ట్ వెంటనే స్టాక్ మార్కెట్ల మీద చూపిస్తుంది. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి పూనుకోరు. అంతే కాకుండా.. తమ పెట్టుబడులను కూడా వెనక్కి తీసుకోవడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఏవియేషన్, కన్స్యూమర్ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ సమయంలో ఆయుధాలకు డిమాండ్ పెరుగుతుంది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే ఇన్వెస్టర్లు, సురక్షితమైన ఆస్తులవైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో గోల్డ్ రేటు పెరుగుతుంది. అలాగే యూఎస్ డాలర్ బలపడుతుంది. డాలర్ బలపడటం వల్ల.. ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడతాయి.ఇది కరెన్సీ మార్కెట్లలో కూడా మార్పులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఇండియన్ రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీనివల్ల మళ్లీ ద్రవ్యోల్బణం ప్రారంభమవుతుంది. ఈ విధంగా ఒక ప్రభావం మరో ప్రభావాన్ని పెంచుతూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తుంది.మరో ముఖ్యమైన అంశం ట్రేడ్ అండ్ రవాణా. పశ్చిమాసియాలో ఉన్న సముద్ర మార్గాలు, ముఖ్యంగా హర్ముజ్ వంటి ప్రాంతాలు యుద్ధం వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ మార్గాలు ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ అంతరాయం కలిగితే, చమురు సరఫరా ఆలస్యం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి.భారతదేశం వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పెరిగిన చమురు ధరలు, కరెన్సీ బలహీనత, ద్రవ్యోల్బణం అన్నీ ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తాయి.ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వృద్ధి గాడి తప్పుతుంది.ఇదీ చదవండి: 'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక -
'ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు': కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయని, అప్పు చేయడం తప్పు కాదని, డబ్బును ఎలా నిర్వహించాలో తప్పకుండా తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..కియోసాకి హెచ్చరిక!ఈ రోజు చాలా మంది విద్యాసంస్థల్లో నేర్పే ఆర్థిక సలహాలు పాతవయ్యాయి. ఎందుకంటే ''బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, కష్టపడి పని చేయు, డబ్బు సేవ్ చేయు, అప్పులు తగ్గించు, దీర్ఘకాల పెట్టుబడులు పెట్టు'' అనే మాటలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవి ఇప్పటి ప్రపంచానికి సరిపోవని కియోసాకి హెచ్చరించారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 1971లో, అధ్యక్షుడు నిక్సన్ డాలర్ను బంగారు ప్రమాణం నుంచి తొలగించారు. ఆ తరువాత ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ముద్రించడం ప్రారంభించాయి. దీంతో డబ్బుకు విలువ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది.జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో..జీతం కోసం పనిచేస్తూ మీరు ధనవంతులు కాలేరు, ఎందుకంటే ఆ జీతమే మిమ్మల్ని ఉద్యోగి మనస్తత్వంలో బంధించి ఉంచుతుంది. కాబట్టి ''డబ్బు కోసం పని చేయడం కాకుండా, ఆస్తులు సృష్టించడం లేదా సంపాదించండి అని కియోసాకి చెబుతారు. ధనవంతులు తమ డబ్బును వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడిగా పెడతారు. అప్పులు తీసుకుని కూడా ఆస్తులు కొనుగోలు చేసి వాటి ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే పన్నుల వ్యవస్థను కూడా చట్టబద్ధంగా తమకు అనుకూలంగా ఉపయోగిస్తారని కియోసాకి అంటారు.జీతంపై ఆధారపడటం వల్లమరోవైపు, ఉద్యోగం చేసేవారు ఎక్కువగా జీతంపై ఆధారపడటం వల్ల ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. డబ్బు సంపాదించడం కంటే డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం ముఖ్యం. అప్పు, పన్నులు ధనవంతులను మరింత ధనవంతులుగా చేస్తాయి. ఇవి మధ్యతరగతి వారిని మరింత పేదలుగా చేస్తాయి. ఇందులో తేడా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అనే దానిలో లేదు. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే దానిలో ఉందని కియోసాకి పేర్కొన్నారు.పాతబడిపోయే ప్రపంచంలో జీవిస్తున్నాంప్రతి 18 నెలలకు సమాచారం పాతబడిపోయే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మీరు 20 లేదా 30 సంవత్సరాల క్రితం నేర్చుకున్న ఆర్థిక విద్యతోనే ఇప్పటికీ పనిచేస్తుంటే, మీరు ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. చెడ్డ ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. కేవలం మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది. మీ ఆలోచనా విధానం దృఢంగా లేకుంటే.. ప్రతి ఆర్థిక వ్యవస్థ చెడ్డగానే కనిపిస్తుంది. అనే విధంగా.. మీ ఆలోచనా విధానం బలంగా, విజ్ఞానవంతంగా ఉంటే, మీరు ప్రతిచోటా అవకాశాన్ని చూస్తారు అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'పాసివ్ ఇన్కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు -
రూ.1200 తగ్గిన గోల్డ్: కొత్త ధరలు ఇవే..
ఈ రోజు (సోమవారం) ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప, మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,350 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం, సాయంత్రానికి రూ.1,200 తగ్గి, రూ.1,37,150 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో ధరల తారుమారు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర 1,50,930 రూపాయల నుంచి 1,49,620 రూపాయల (రూ.1310 తగ్గింది) వద్దకు వచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల 1200 రూపాయలు తగ్గడంతో తులం గోల్డ్ రేటు 1,37,300 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల ధర రూ.1460 తగ్గి 149770 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఒక రోజు కూడా పూర్తికాక ముందే.. ధరల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించవచ్చు.చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,000 (తులం), 24 క్యారెట్ల ధర రూ.1,52,730 (10 గ్రామ్స్) వద్దనే ఉన్నాయి. కాగా వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సిల్వర్ రేటు రూ.2.70 లక్షల వద్ద ఉంది.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మార్కెట్లో జూదం ఆడుతున్నారు!
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారు, ‘ఓరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలువబడే వారెన్ బఫెట్ మదుపరులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత పెట్టుబడిదారులు సంప్రదాయ పద్ధతులను పక్కనపెట్టి ప్రమాదకరమైన జూదంలో మునిగి తేలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెర్క్షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.స్టాక్ మార్కెట్లు ‘అతి తక్కువ సమయంలో ఊహించని ధనవంతులు కావాలనే జూదగాళ్ల అడ్డాగా’ మారిందని బఫెట్ అన్నారు. నేటి మార్కెట్లలో పెట్టుబడి, ఊహాజనిత (స్పెక్యులేటివ్) కార్యకలాపాల మధ్య తేడా కనుమరుగవుతోందని ఆయన విశ్లేషించారు. ‘ఎవరైనా వన్-డే ఆప్షన్లతో ట్రేడింగ్ చేస్తుంటే అది పెట్టుబడి కాదు, కనీసం ఊహాజనితం కూడా కాదు.. అది పూర్తిగా జూదం లాంటిది. చరిత్రలో ఇంతటి తీవ్రమైన మానసిక స్థితి మదుపరుల్లో ఎప్పుడూ చూడలేదు’ అని బఫెట్ స్పష్టం చేశారు.సైనిక చర్యల సమాచారంతో..మార్కెట్లలో జరుగుతున్న ఈ అనాలోచిత ధోరణికి బఫెట్ ఒక సంచలన ఉదాహరణను ప్రస్తావించారు. వెనిజులాలో సైనిక చర్యకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి మార్కెట్లలో ఒక అమెరికన్ సైనికుడు సుమారు 4,00,000 డాలర్లు (రూ.3.3 కోట్లు పైగా) గడించాడనే ఆరోపణలతో జరుగుతున్న విచారణను ఆయన గుర్తుచేశారు. ఇటువంటి ఘటనలు మార్కెట్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయన్నారు. స్వల్ప కాలపు లాభాల కోసం అక్రమ మార్గాలను ఎంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.నాయకత్వ మార్పుఈ సమావేశం బెర్క్షైర్ హాత్వేలో కొత్త శకాన్ని ఆవిష్కరించింది. గ్రెగ్ అబెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా తన మొదటి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించారు. కృత్రిమ మేధ(ఏఐ) గురించి మాట్లాడుతూ, స్పష్టమైన ప్రయోజనం లేని ఏ సాంకేతికతను సంస్థ గుడ్డిగా అనుసరించదన్నారు. కేవలం వ్యాపార విలువను పెంచే అప్లికేషన్లపైనే దృష్టి సారిస్తామని అబెల్ స్పష్టం చేశారు. రైల్వే, బీమా రంగాల్లో సంస్థ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు ఆయన వివరించారు.ఇదీ చదవండి: భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన -
చెన్నైలో పసిడి ప్రియులకు ఊరట..
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం భారీగా పెరిగిన పుత్తడి ధరలు వరుసగా నిలకడగా కొనసాగడం పసిడి ప్రియులకు ఊరట కలిగించే విషయం. ఇక వెండి ధరలు సైతం వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్కు ఎన్నికల ఫలితాల జోష్..
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో భారత స్టాక్మార్కెట్లు నేడు ఊహించినట్టే ఆసక్తికరమైన కదలికలను నమోదు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బయటకు వస్తున్న కొద్దీ సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అసలు ఎన్నికల ఫలితాలకు, స్టాక్మార్కెట్ కదలికలకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ అంశాల వెనుక ఉన్న అసలైన ఆర్థిక కారణాలేమిటో విశ్లేషిద్దాం.రాజకీయ స్థిరత్వానికే ప్రాధాన్యతస్టాక్మార్కెట్కు అత్యంత ఇష్టమైన అంశం స్థిరత్వం. ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన మెజారిటీని ఇస్తే అది పాలనాపరమైన స్థిరత్వానికి సంకేతంగా మార్కెట్లు భావిస్తాయి. రాజకీయ అనిశ్చితి తొలగిపోయి పాలనలో స్థిరత్వం వస్తుందనే నమ్మకం కలిగినప్పుడు మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయి. ఒకే పార్టీ లేదా కూటమి గెలిచినప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థిక విధానాలు, సంస్కరణలు అలాగే కొనసాగుతాయనే ధీమా ఇన్వెస్టర్లలో పెరుగుతుంది.ఎందుకు ఇలా?ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మార్కెట్లు ఎందుకు పైకి లేస్తాయో, ఎందుకు కొన్నిసార్లు పడిపోతాయో అర్థం చేసుకోవడం ముఖ్యం. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు మౌలిక సదుపాయాలు, రైల్వేలు, విద్యుత్ రంగానికి సంబంధించిన షేర్లపై ప్రభావం చూపుతాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో గెలిచిన పార్టీకి మధ్య సయోధ్య ఉంటే ప్రాజెక్టుల అమలు వేగవంతమవుతుందని ఇన్వెస్టర్లు భావిస్తారు. ప్రస్తుత మార్కెట్ విశ్లేషణలను చూస్తే రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒక రోజు లేదా రెండు రోజుల సెంటిమెంట్ను మాత్రమే ప్రభావితం చేస్తాయి.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత మార్కెట్ను నడిపిస్తున్నది కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కీలక అంశాలు కూడా మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి.ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలునేడు మార్కెట్లో ఊపును చూసి రిటైల్ ఇన్వెస్టర్లు ఏమాత్రం ఆవేశపడకూడదు. ఎందుకంటే.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చిన స్వల్పకాలిక ర్యాలీని ఆసరాగా చేసుకుని పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించే అవకాశం ఉంది. దీనివల్ల కొంత సమయానికి మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగవచ్చు. ఎన్నికల ఫలితాల కంటే కంపెనీల త్రైమాసిక ఫలితాలు, వడ్డీ రేట్ల నిర్ణయాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలే దీర్ఘకాలంలో స్టాక్మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి.మొత్తంగా చెప్పాలంటే మే 04, 2026 నాటి ఈ ఎన్నికల ఫలితాలు మార్కెట్కు ఒక తాత్కాలిక బూస్ట్ను ఇచ్చినప్పటికీ సుస్థిరమైన ప్రయాణం కోసం ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాలను కూడా గమనించాలి. ఎన్నికల ఫలితాలు కేవలం ఒక ఈవెంట్ మాత్రమే, కానీ ఆర్థికాభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి, సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తూనే బేసిక్ ఫండమెంటల్స్ బలహీనపడకుండా చూసుకోవడం ఇన్వెస్టర్ల బాధ్యత.ఇదీ చదవండి: భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన -
816 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 235 పాయింట్లు పెరిగి 24,244 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 816 పాయింట్లు పుంజుకొని 77,724 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 108.33 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.29 శాతం పెరిగింది.నాస్డాక్ 0.89 శాతం పుంజుకుంది.Today Nifty position 04-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్స్కు ఎఫ్పీఐల షాక్
గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్నారు. ఫలితంగా ఏప్రిల్లో నికరంగా రూ. 60,847 కోట్ల(6.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి 4 నెలల్లో(జనవరి–ఏప్రిల్) రూ. 1.92 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వెరసి 2025 పూర్తి కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్లకంటే అధికంగా అమ్మకాలకు తెరతీశారు. పశ్చిమాసియా సంక్షోభానికితోడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలను దెబ్బతీయడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 4 నెలల్లో ఫిబ్రవరిలో మాత్రమే ఎఫ్పీఐలు(రూ. 22,615 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇది అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకావడం గమనార్హం! అయితే మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం ప్రస్తావనార్హం!!గత వారమిలా.. తొలుత క్యూ4 ఫలితాలతో మార్కెట్లు బలపడినప్పటికీ ఇరాన్–యూఎస్ యుద్ధంతో చివర్లో డీలా పడ్డాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 249 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుంది. 76,914 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) వృద్ధితో 23,998 వద్ద స్థిరపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ 2.2 శాతం పతనమైంది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ 2 శాతం జంప్చేయడం గమనార్హం! సాంకేతికంగా చూస్తే..ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణుల అంచనా. వీటి ప్రకారం నిఫ్టీకి 23,800–23,700 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 23,500 వద్ద బలమైన మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 24,600 పాయింట్లను తాకవచ్చు. ఆపై 24,700– 27,800కు చేరే అవకాశముంది. సెన్సెక్స్ 76,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ తీసుకునే వీలుంది. 77,500వరకూ పుంజుకోవచ్చు. 78,000 దాటితే 78,500 పాయింట్లను తాకే అవకాశముంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అసెంబ్లీ, క్యూ4 ఫలితాలపై ఫోకస్
ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కార్పొరేట్ దిగ్గజాల గతేడాది చివరి త్రైమాసిక పనితీరు ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దారి చూపనున్నాయి. అంతేకాకుండా విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. నేడు(4న) ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్ పెట్టనున్నట్లు ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. మరోపక్క తమిళనాడు ఫలితాలపైనా ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠతకు తెరతీయడంతో స్టాక్ ఇన్వెస్టర్లు సైతం వీటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు సైతం నేడు తెలియనున్నాయి. దిగ్గజాలు రెడీ ఇప్పటికే గతేడాది(2025–26) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ వేడెక్కింది. వారాంతాన కొటక్ మహీంద్రా బ్యాంక్సహా.. నాల్కో, సీడీఎస్ఎల్, స్టార్ హెల్త్, డీమార్ట్, ఏపీఎల్ అపోలో తదితరాలు క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం పనితీరు వెల్లడిచనున్నాయి. తాజా జాబితాలో అంబుజా సిమెంట్స్, బీహెచ్ఈఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జిందాల్ స్టెయిన్లెస్, ఎల్అండ్టీ, ఎస్ఆర్ఎఫ్, మారికో, కోఫోర్జ్తోపాటు.. ఆటో రంగ దిగ్గజాలు ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, హీరో మోటో, గోద్రెజ్ కన్జూమర్, పాలీక్యాబ్, శ్రీ సిమెంట్, బీఎస్ఈ, పిడిలైట్, లుపిన్, థెర్మాక్స్, ఏబీబీ, బీవోబీ, ఎంసీఎక్స్, స్విగ్గీ, కల్యాణ్ జ్యువెలర్స్ తదితరాలు చేరాయి. గణాంకాలు ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదేవిధంగా చైనా, యూఎస్ పీఎంఐ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ప్రధానంగా యూఎస్ ఉపాధి కల్పన, నిరుద్యోగ వివరాలు తెలియనున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. ఫెడ్ చైర్మన్గా పదవీ విరమణ చేయనున్న పావెల్ అధ్యక్షతన ఎఫ్వోఎంసీ ఫండ్స్ రేట్లను 3.5–3.75 శాతం స్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయించింది. చమురు మంట అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధమేఘాలు తొలగక పోవడం, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ గత వారం ఒక దశలో 126 డాలర్లను తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 95కు పతనమైంది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. గతేడాదికి దేశీయంగా వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లను దాటేసింది. 2024–25లో ఇది దాదాపు 284 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మండుతున్న చమురు ధరలు దిగుమతులు బిల్లును పెంచడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. ఆటుపోట్లకు చాన్స్ హార్ముజ్పై అనిశ్చితి, బలపడుతున్న చమురు ధరలు తదితర అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలకు ప్రాధాన్యమున్నప్పటికీ చమురు ధరలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు. -
'పాసివ్ ఇన్కమ్' అంటే ఏమిటి?: కియోసాకి చెప్పిన నిజాలు
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.పాసివ్ ఇన్కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.పూర్తిగా యాక్టివ్ వర్క్ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు. కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.పాసివ్ ఇన్కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలుమొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి. మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా! -
సీడీఎస్ఎల్ డివిడెండ్ రూ. 12.75
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 80 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 100 కోట్లు. ఇక ఆదాయం రూ. 256 కోట్ల నుంచి రూ. 268 కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 12.75 మేర తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ. 526 కోట్ల నుంచి రూ. 455 కోట్లకు తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 1,199 కోట్ల నుంచి రూ. 1,239 కోట్లకు చేరింది. 18 కోట్ల పైగా డీమ్యాట్ ఖాతాలు గల తొలి డిపాజిటరీగా ఆవిర్భవించినట్లు సంస్థ ఎండీ నేహల్ వోరా తెలిపారు. -
'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!
బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు! -
డీలాపడ్డ టెక్స్టైల్స్ ఎగుమతులు: కారణం ఇదే!
పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్మెంట్లు)లో తగ్గుదల కారణంగా టెక్స్టైల్స్, గార్మెంట్ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్టైల్స్ (–3.9%), రెడీమేడ్ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.భారత్ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్–మేడ్ టెక్స్టైల్స్ రూపాయి పరంగా 3.6% పెరిగినా, డాలర్ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్ మార్కెట్లలో భారత్ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు. -
పసిడి పతనం.. వెండి జోరు!
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో గత వారం మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. ఒకవైపు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, మరోవైపు వెండి మాత్రం పరుగులు తీస్తోంది. మే 3 నాటికి ముగిసిన వారపు ట్రేడింగ్ను పరిశీలిస్తే, విలువైన లోహాల ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.బంగారం బేజారు.. వెండి జోరు!అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం బంగారం ధరల్లో కొంత మేర సడలింపు కనిపించింది. అయితే, వెండి మాత్రం ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏప్రిల్ 27న రూ.1,53,710 ఉండగా మే 3 నాటికి అది రూ.1,50,930లకు దిగివచ్చింది. అంటే రూ.2,800 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏప్రిల్ 27న రూ.1,40,900 ఉండగా మే 3 నాటికి అది రూ.1,38,350లకు క్షీణించింది. అంటే రూ.2,550 కరిగింది.ఇక వెండి విషయానికి వస్తే కేజీ ధర ఏప్రిల్ 27న రూ.2,70,000 ఉండగా తగ్గుతూ పెరుగుతూ మే 3 నాటికి మళ్లీ రూ.2,70,000 వద్దకే వచ్చి ఆగింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో మాత్రం వెండి ధర వారం మొత్తంలో కేజీకి రూ.5,000 పెరిగింది.ధరల ఒడిదుడుకులకు కారణాలుమార్కెట్ నిపుణులు, 'రాయిటర్స్' నివేదికల ప్రకారం, ప్రస్తుత ధరల మార్పులకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.ప్రపంచ మార్కెట్ సంకేతాలు: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ ఆర్థిక పరిస్థితులు పసిడి ధరపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా 2026లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నాయి.మారిన డిమాండ్: పారిశ్రామిక అవసరాల రీత్యా వెండికి డిమాండ్ పెరగడం దాని ధర పెరగడానికి ఊతమిచ్చింది. ఇదే సమయంలో బంగారంపై ఇన్వెస్టర్లు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ధరల తగ్గుదలకు కారణమైంది.పెట్టుబడిదారుల ధోరణి: సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఈ లోహాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి కూడా మార్కెట్ కదలికలను శాసిస్తోంది.ఇదీ చదవండి: ఇల్లు కొంటే.. ఇన్ని ఖర్చులా? -
షేర్ బైబ్యాక్ల జోరు.. ఇన్వెస్టర్లకు కొత్త ఊపు!
గత రెండేళ్లుగా గణనీయంగా తగ్గిపోయిన షేర్ల బైబ్యాక్ కార్యకలాపాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఇన్వెస్టర్లకు సానుకూలంగా ఉండే విధంగా పన్నుల విధానాలను క్రమబద్ధీకరించడంతో ఇవి ఆకర్షణీయంగా మారాయి. దీంతో అరబిందో ఫార్మా, సైయెంట్, విప్రోలాంటి కంపెనీలు బైబ్యాక్ ప్రణాళికలను ప్రకటించాయి.గత కొన్నాళ్లుగా బైబ్యాక్లలో షేర్లను విక్రయించడంపై వచ్చిన లాభాలను, డీమ్డ్ డివిడెండ్లుగా పరిగణించి, శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను వేస్తుండటంతో ఇన్వెస్టర్లలో వీటిపై పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదు. అయితే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2026 చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారం, ఇన్వెస్టర్లకు సానుకూలంగా, హేతుబద్ధతతో వీటిని షేర్హోల్డర్ల చేతిలో క్యాపిటల్ గెయిన్స్గా పరిగణిస్తుండటంతో బైబ్యాక్లు కాస్త ఆకర్షణీయంగా మారుతున్నాయి. కంపెనీల నుంచి బైబ్యాక్ ప్రతిపాదనలు వెల్లువెత్తడానికి ఈ పన్నుపరమైన ప్రయోజనాలు కారణమని నిపుణులు చెబుతున్నారు.రెండేళ్లుగా డౌన్..గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బైబ్యాక్స్ గణనీయంగా పడిపోయాయి. 2024–25లో కేవలం రూ. 8,034 కోట్లు, 2025–26లో రూ. 19,500 కోట్లకు పరిమితమయ్యాయి. అదే పన్ను విధానాలు సానుకూలంగా ఉన్నప్పుడు 2023–24లో వీటి పరిమాణం ఏకంగా రూ. 50,750 కోట్లుగా నమోదైంది.వ్యాపారంపై ధీమా..కేవలం ట్యాక్స్ ప్రయోజనాల వల్లే కాకుండా ఇతర అంశాలూ బైబ్యాక్కి ఊతమిస్తున్నాయి. చాలా మటుకు స్టాక్స్ భారీగా కరెక్షన్కి లోనవడం, నిధులు పుష్కలంగా ఉన్న కంపెనీలు తమ స్టాక్స్ని చాలా చౌకగా కొనుక్కునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండు అంశాలే కాకుండా కంపెనీలు బైబ్యాక్లను చేపట్టడమనేది తమ ప్రధాన వ్యాపారాలపై కంపెనీలకి గల నమ్మకాన్ని సూచిస్తోందని నిపుణులు చెప్పారు. తమ షేర్లు ఉండాల్సిన విలువ కన్నా తక్కువ పలుకుతున్నా, ఈపీఎస్ (షేరువారీ ఆర్జన), రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్వోఈ) మెరుగుపడే కొద్దీ రేటు మరింత పెరుగుతుందని సంస్థలు ధీమాగా ఉండటాన్ని ఇది తెలియజేస్తోందన్నారు.భారీగా రాబడులిచ్చే అవకాశాలు పరిమితంగా ఉన్న కంపెనీల విషయానికొస్తే, నగదును పక్కన పెట్టుకుని కూర్చోవడానికి బదులు బైబ్యాక్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, గ్లోబల్గా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వేల్యుయేషన్లను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ రూపంలో కొనుక్కునే వెసులుబాటును తిరిగి ప్రవేశపెట్టాలని సెబీ యోచిస్తున్న నేపథ్యంలో ఈ విధానం మళ్లీ ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నారు. -
పసిడి ఆనందం ఆవిరి.. అంతలోనే ఏమైంది బంగారం!!
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కోలా పసిడి ధరలు మారిపోతున్నాయి. క్రితం రోజున ఏకంగా రూ.2000 పైగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. అలాగే వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీగా తగ్గిన బంగారం ధరలు: కొత్త రేట్లు ఇవే!
గత కొన్నిరోజులు బెంబేలెత్తించిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూ, ఒక్కసారిగా భారీ పతనం చవిచూశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2,350 తగ్గి, రూ.1,50,380 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 2,150 రూపాయలు తగ్గి, రూ.1,37,850 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా ఉంటాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రేటు 2450 రూపాయలు తగ్గింది. దీంతో దేశ రాజధాని నగరంలో తులం పసిడి ధర రూ.1,50,430 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 2150 రూపాయలు తగ్గి, 1,38,000 రూపాయల వద్ద నిలిచింది.చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం రేటు రూ.1,51,860 (రూ.1960 తగ్గింది) వద్ద, 22 క్యారెట్ల తులం ధర రూ. 1,39,200 (రూ.1800 తగ్గింది) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు! -
రెండు ఐపీవోలకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న రెండు కీలక సంస్థలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెనెరిక్ ఔషధాల తయారీ సంస్థ హిందుస్థాన్ లాబొరేటరీస్, స్టీల్ పైపుల ఉత్పత్తిదారు ఆర్కే స్టీల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి పొందాయి. గతేడాది సెప్టెంబర్లో ఈ సంస్థలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను పరిశీలించిన సెబీ, ఏప్రిల్ 27న తుది అనుమతులు (అబ్జర్వేషన్స్) మంజూరు చేసింది.హిందుస్థాన్ లాబొరేటరీస్: ఫార్మా రంగంలో సేవలందిస్తున్న హిందుస్థాన్ లా»ొరేటరీస్ ఐపీఓలో భాగంగా 50 లక్షల కొత్త షేర్లను జారీ చేయనుంది. దీనికి అదనంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్లు మరో 91 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ స్థాయిలో జెనెరిక్ మందులను సరఫరా చేసే (బీ2బీ) వ్యాపారంలో కొనసాగుతోంది.ఆర్కే స్టీల్ మాన్యుఫ్యాక్చరింగ్: స్టీల్ ట్యూబ్లు, పైపుల తయారీలో ఉన్న ఆర్కే స్టీల్ సుమారు 2 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఈ ఐపీఓలో ప్రమోటర్ల వాటా విక్రయం (ఓఎఫ్ఎస్) ఏమీ లేదు. సేకరించిన నిధులను ప్రధానంగా సంస్థకున్న రుణాల చెల్లింపులకు, మూలధన నిర్వహణ, వ్యాపార విస్తరణ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ రెండు కంపెనీల షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో లిస్ట్ కానున్నాయి. -
కాసింత చల్లబడిన బంగారం వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రూ.10 వేలు పెరిగిన వెండి ధర!
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పెరిగిన సిల్వర్ రేటు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు మరోమారు వెండి ధరలు పెరిగాయి.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు వెండి రేటు రూ.10,000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలకు చేరింది. ఈ ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. అయితే ఢిల్లీలో మాత్రం వెండి రేటు రూ.5000 తగ్గింది. కాబట్టి.. ఇక్కడ సిల్వర్ రేటు రూ.2.50 లక్షలకు చేరింది.వెండి ధరలు పెరగడానికి కారణాలుమార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.ఇదీ చదవండి: పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 582.86 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 76,913.50 వద్ద, నిఫ్టీ 180.10 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 23,997.55 వద్ద నిలిచాయి.సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీసీపీఎల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, వేదాంత లిమిటెడ్, వారీ ఎనర్జీస్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అంతుచిక్కని పసిడి ధరలు.. మళ్లీ తారుమారేనా..
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఉదయానికి ఉన్న రేట్లు సాయంత్రానికి తారుమారు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రితం రోజు ఉదయం పెరిగిన పసిడి ధరలు సాయంత్రానికి తగ్గాయి. ఇదే క్రమంలో నేడు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో కొనుగోలుదారులకు అంతుచిక్కడం లేదు. ఇక వెండి ధరల విషయానికి వస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate) , వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
940 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు తగ్గి 23,879 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 945 పాయింట్లు నష్టపోయి 76,544 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.97బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 113.05 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.04 శాతం తగ్గింది.నాస్డాక్ 0.04 శాతం పెరిగింది.Today Nifty position 30-04-2026(time: 09:31 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లలో బుల్ రన్.. ఈరోజు లాభాలకు కారణాలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఏప్రిల్ 29, 2026) వృద్ధిని కనబరిచాయి. అంతర్జాతీయ ప్రతికూలతలను అధిగమిస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 77,496 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 181 పాయింట్లు పుంజుకుని 24,177 స్థాయికి చేరుకుంది.లాభాలకు కారణాలు(నిపుణుల అంచనా)ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సడలింపు ఆశలుగత కొద్దివారాలుగా ప్రపంచ మార్కెట్లను వణికించిన ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొంత సడలినట్లు కనిపిస్తోంది. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకాలు తొలగుతాయన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి.క్రూడాయిల్ ధరల తగ్గుదలమధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా మార్చి నెలాఖరులో బ్రెంట్ క్రూడ్ ధర 120 డాలర్ల మార్కును దాటినప్పటికీ ప్రస్తుతం అది క్రమంగా తగ్గుముఖం పట్టి 111 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీనికి తోడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మే నెలలో ఒపెక్ నుంచి నిష్క్రమిస్తుందన్న వార్తలు చమురు సరఫరా పెరుగుతుందన్న అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చాయి. మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి చమురు ధర తగ్గడం మార్కెట్లకు సానుకూల అంశంగా మారింది.యూఎస్ ఫెడ్ నిర్ణయంపై దృష్టిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈరోజు తన వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లను మార్చకుండా 3.50% - 3.75% వద్దే కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న ఆశాభావంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లోకి నిధులను మళ్లించడం గమనార్హం.భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగనప్పటికీ భారత కంపెనీల ఆర్థిక పటిష్టత, అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ నేటి లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలు, అమెరికా ఫెడ్ ఇచ్చే దిశానిర్దేశం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి.ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’ -
దూసుకెళ్తున్న బంధన్ బ్యాంక్ షేర్లు
స్టాక్ మార్కెట్లో బంధన్ బ్యాంక్ షేర్లు దూసుకెళ్తున్నాయి. మంగళవారం మార్కెట్ సెషన్ తర్వాత ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాలకు ప్రతిస్పందనగా బ్యాంకు షేర్లు బుధవారం సుమారు 14 శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బంధన్ బ్యాంక్ షేర్లు (Bandhan Bank Stock Price) బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 13.8% పెరిగి రూ.203.36 వద్ద ఉన్నాయి. గత నెలలో స్టాక్ 43.9% లాభపడింది. బంధన్ బ్యాంక్ షేర్లు ఏప్రిల్లో ఇప్పటివరకు 27% పెరిగాయి. జూన్ 2020 (47%) నుండి బంధన్ బ్యాంక్ స్టాక్ ఉత్తమ నెలవారీ పనితీరు ఇదే.క్యూ4 ఫలితాలుబంధన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 68 శాతం జంప్చేసి రూ. 534 కోట్లను తాకింది. రుణ నాణ్యత మెరుగుపడటంతోపాటు.. రిటైల్ బ్యాంకింగ్, ట్రెజరీ విభాగాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. రిటైల్ బ్యాంకింగ్ నష్టాల నుంచి బయటపడటమేకాకుండా రూ. 434 కోట్ల లాభం ఆర్జించింది. ఇక ట్రెజరీ కార్యకలాపాల నుంచి రూ. 206 కోట్ల లాభం సమకూరింది. దీంతో హోల్సేల్ బ్యాంకింగ్ రూ. 80 కోట్ల నష్టం నమోదు చేసినప్పటికీ పనితీరు మెరుగుపడింది.స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.7 శాతం నుంచి 3.3 శాతానికి, నికర ఎన్పీఏలు 1.3 శాతం నుంచి 1 శాతానికి దిగివచ్చాయి. అయితే ఈ కాలంలో రూ. 677 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2,796 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 3 శాతం పుంజుకుని రూ. 3,567 కోట్లకు చేరింది. కాగా.. పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 1,224 కోట్లకు పరిమితమైంది. 2024–25లో రూ. 2,745 కోట్లు ఆర్జించింది. అధిక ప్రొవిజన్లు లాభాలను దెబ్బతీశాయి. -
పసిడి ధరలు: నిన్న ఊహించని పతనం.. నేడు ఇలా..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దేశంలో క్రితం రోజున భారీగా పతనమైన పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. నాలుగు రోజుల తర్వాత మళ్లీ బంగారం రేట్లు పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగడం కొంత ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate) , వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. -
లాభాల్లోకి స్టాక్మార్కెట్.. ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య ఆటో, రియాల్టీ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలకు ప్రారంభం వద్ద నష్టాలు తప్పాయి. ఉదయం 9:49 గంటల సమయానికి నిఫ్టీ 0.68 శాతం లేదా 163.30 పాయింట్ల లాభంతో 24,159.00 వద్ద, సెన్సెక్స్ 535.81 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 77,422.72 వద్ద ట్రేడవుతున్నాయి. మారుతి సుజుకి ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.57 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.68 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉండగా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ధరల పతనం.. ఊహకందని రీతిలో ఇలా!
భారతదేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు.. ఈ రోజు భారీ పతనాన్ని చవి చూసింది. దీంతో ఒక్కసారిగా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉంది?, సిల్వర్ ధరల్లో ఏమైనా మార్పు కనిపించిందా? అనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2780 తగ్గి 1,50,930 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2550 రూపాయలు తగ్గి రూ.1,38,350 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో గోల్డ్ రేటు వరుసగా రూ.1420, రూ.1300 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 153820 రూపాయల వద్ద, 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.141000 వద్ద నిలిచాయి. ఈ ధరలు నిన్నటి (మంగళవారం)తో పోలిస్తే చాలా తక్కువ.ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు పతనమయ్యాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,51,080 (రూ.2780 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,38,500 (రూ.2550 తగ్గింది) వద్ద ఉంది.వెండి ధరలు ఇలాబంగారం మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సిల్వర్ రేటు రూ.2.65 లక్షలు (రూ.5000 తగ్గింది) వద్ద, ఢిల్లీలో రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా! -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 416.73 పాయింట్లు లేదా 0.54 శాతం నష్టంతో 76,886.91 వద్ద, నిఫ్టీ 97.00 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,995.70 వద్ద నిలిచాయి.అబాన్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఏజీఐ గ్రీన్ప్యాక్ లిమిటెడ్, వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఊర్జా గ్లోబల్ లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎమామి రియల్టీ లిమిటెడ్, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విసాగర్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్కేర్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


