Market
-
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 567 పాయింట్లు పెరిగి 22,901 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1874 పాయింట్లు ఎగబాకి 73,833 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.19 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.91 శాతం పెరిగింది.నాస్డాక్ 3.83 శాతం పుంజుకుంది.Today Nifty position 01-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎఫ్అండ్వోపై లావాదేవీల పన్ను అప్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు నిబంధనల భారం తగ్గనుంది. ఇందుకు వీలు కల్పిం చే కొత్త ఆదాయపన్ను చట్టం– 2025 నేటి నుంచి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తోంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని సులభతరంగా తీర్చిదిద్దినట్టు కేంద్రం చెబుతోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) పెరగనుంది. విదేశీ పర్యటనలు, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపే నిధులపై మూలం వద్దే పన్ను కోత (టీసీఎస్) తగ్గనుంది. అలాగే, భారత్ నుంచి డేటా సెంటర్ సేవలను పొందే విదేశీ కంపెనీలపై 20 ఏళ్ల వరకు పన్ను భారం ఉండదు. ⇒ కొత్త చట్టానికి మారే క్రమంలో.. ఈ–ఫైలింగ్ పోర్టల్ పాత, కొత్త పన్ను చట్టాల్లోని నిబంధనల అమలుకు వీలు కల్పించనుంది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయి. ⇒ అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుంది. ⇒ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపులు జూన్ నుంచి ప్రారంభం కానుండగా, అవి కొత్త చట్టం కిందే అమలు కానున్నాయి. ⇒ గతంలో అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనేవి ఉండేవి. ఇకపై ‘పన్ను సంవత్సరం’ అమల్లోకి రానుంది. ⇒ ఐటీఆర్లను గడువు తర్వాత దాఖలు చేసినప్పటికీ టీడీఎస్ రిఫండ్ కోరవచ్చు. ⇒ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి పెరగనుంది. ఆప్షన్ల ప్రీమియంపై ఎస్టీటీ 0.1 శాతం నుంచి 0.15 శాతానికి, ఆప్షన్ల ఎక్సర్సైజ్పై 0.125 శాతం నుంచి 0.15 శాతానికి పెరగనుంది. తద్వారా ఎఫ్అండ్వోలో స్పెక్యులేషన్ తగ్గుతుందన్నది ప్రభుత్వం అంచనా. చిన్న ఇన్వెస్టర్లు నష్టపోకుండా చూడొచ్చని కేంద్రం భావిస్తోంది. ⇒ విదేశీ పర్యాటక ప్యాకేజీల కోసం చేసే చెల్లింపులపై 20 శాతంగా ఉన్న టీసీఎస్ 18 శాతానికి తగ్గనుంది. ⇒ విదేశాల్లో వైద్యం, విద్య కోసం చేసే నగదు తరలింపులపై 5 శాతం స్థానంలో 2 శాతం టీసీఎస్ చెల్లిస్తే చాలు. ⇒ 20 ఏళ్ల పన్ను రహిత ప్రయోజనంతో డేటా సెంటర్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి. భారత డేటా సెంటర్ల నుంచి సేవలు పొందే విదేశీ కంపెనీలు ఇకపై పన్ను చెల్లించక్కర్లేదు. ఇది పరోక్షంగా భారత డేటా సెంటర్ కంపెనీలకు మేలు చేయనుంది. సొంతంగా భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకూ ఈ ప్రయోజనం దక్కనుంది. ⇒ ఐటీ సేవలకు సంబంధించి ‘సేఫ్ హార్బర్’ విధానం కింద అర్హత పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచారు. ఐటీ, ఐటీఈఎస్, కేపీవో, కాంట్రాక్ట్ ఆర్అండ్డీ సేవలన్నీ ఐటీ సేవల కిందే పరిగణించనున్నారు. ⇒ బ్యాంకుల్లో రూ.50 వేలు మించిన జమలపై కాకుండా.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలు మించినప్పుడు పాన్ ఇస్తే సరిపోతుంది. ⇒ ఇల్లు లేదా భూమి కొనుగోలు, విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే ఇకపై పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలు. ⇒ ఇకపై ఏ వాహన కొనుగోలు అయినా విలువ రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సిందే. ⇒ హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు లక్ష రూపాయలు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీ కొనుగోలుకు పాన్ ఇవ్వడం తప్పనిసరి. -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుకేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది. -
పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీఓకు ఆరు కంపెనీలు
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దేశీయ ఈక్విటీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. అయినప్పటికీ ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనేందుకు సంకేతంగా సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. యుద్ధ అస్థిరతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే పబ్లిక్ ఇష్యూలకు ఆమోదం రావడం ఆసక్తికర పరిణామం. వృద్ధి ప్రణాళికలతో ముందుకొస్తున్న ఈ ఆరు కంపెనీలు సమీకరించనున్న నిధుల వినియోగం, ఆర్థిక స్థితి, భవిష్యత్ వ్యూహాలు తదితర వివరాలు ఇలా ఉన్నాయి. విభిన్న రంగాలకు చెందిన ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్, ప్రాసోల్ కెమికల్స్, నోపేపర్ఫామ్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, షా ఇన్వెస్టర్స్ హోమ్ లిమిటెడ్లు గతేడాది సెపె్టంబర్–డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మార్చి 25–27 మధ్య దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.4,575 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ.3,750 కోట్ల విలువైన ఈక్విటీలను కొత్తగా జారీ చేనుంది. అదనంగా రూ. 550 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారు ‘నార్త్ఫండ్’ ఆఫర్ చేయనుంది. సమీకరించే నిధులను తన అనుబంధ సంస్థలు ఎస్ఏఈఎల్ సోలార్ పీ5 ప్రైవేటు లిమిటెడ్, ఎస్ఏఈఎల్ సోలార్ పీ4 ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్నీటి శుద్ధి, మురుగు నీటి నిర్వహణ రంగానికి చెందిన ఈ సంస్థ ఐపీఓలో భాగంగా రూ.1,250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదనంగా రూ.1,000 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ ప్రీమియర్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఆఫర్ చేయనుంది. మొత్తంగా ఇష్యూ ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. సమీకరించే నిధుల ద్వారా తన అనుబంధ సంస్థల రుణాల చెల్లింపులు, అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, సోలార్ పవర్ ప్రాజెక్టుల మూలధన వ్యయాలకు వినియోగించనుంది. సింబయోటెక్ ఫార్మాల్యాబ్ఫార్మా, బయోటెక్ రంగంలో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఐపీఓలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు రూ.2,030 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. దీంతో మొత్తం రూ.2,180 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను వ్యాపార అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. ఫార్మా రంగంలో గ్లోబల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ప్రాసోల్ కెమికల్స్స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.80 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.420 కోట్ల షేర్లను విక్రయించనుంది. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. షా ఇన్వెస్టర్స్ హోమ్బ్రోకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ పరిమాణాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే 54 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించే నిధులను వ్యాపార విస్తరణ, టెక్నాలజీ అప్గ్రేడ్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నోపేపర్ఫామ్స్ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రహస్య విధానంలో (కాని్ఫడెన్షియల్ ఫైలింగ్) ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. తాజాగా సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూకు అనుమతి లభించింది. అయితే ఇష్యూ పరిమాణాన్ని ఇంకా వెల్లడించలేదు.లిస్టింగ్ బాటలో..రెంటోమోజో: ఆన్లైన్ రెంటల్, సబ్్రస్కిబ్షన్ ప్లాట్ఫామ్ రెంటోమోజో ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు సమరి్పంచింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.150 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.83 కోట్ల ఈక్విటీలను విక్రయానికి పెట్టినట్లు ముసాయిదా పత్రాల ద్వారా తెలిసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, గిడ్డంగులు ఎక్స్పీరియన్స్ స్టోర్లు, సాధారణ కార్పొరేట్, లీజు అద్దెలు లేదా లైసెన్స్ ఫీజుల చెల్లింపు అవసరాలకు వినియోగించుకుంటామని వెల్లడించింది.భారత్ పెట్ సమీకృత ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందించే భారత్ పెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 120 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 640 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులు, రూ. 36 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1998లో ఏర్పాటైన కంపెనీ కంపెనీ పోర్ట్ఫోలియోలో పెట్ బాటిళ్లు, జార్లు, టిన్ కంటెయినర్లు, క్యాప్లు తదితర రిజిడ్ ప్యాకేజింగ్ ప్రొడక్టులున్నాయి.గతేడాది(2024–25) ఆదాయం రూ. 412 కోట్లకు చేరగా.. 51 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
రూపీ @ 95
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సోమవారం డాలరుతో పోలిస్తే ఒక దశలో ఏకంగా 95 మార్కును దాటేసి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 95.22ని తాకింది. ఇంట్రాడేలో 165 పైసల శ్రేణిలో తిరుగాడింది. చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం నాడు 89 పైసలు పతనమై 94.85 వద్ద క్లోజయిన రూపాయి, రిజర్వ్ బ్యాంక్ సానుకూల చర్యల దన్నుతో, సోమవారం నాడు ట్రేడింగ్లో కాస్త పుంజుకుని 128 పైసల లాభంతో 93.62 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డాలరు ఇండెక్స్, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి ఉంటోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 92–97 శ్రేణిలో రూపాయి తిరుగాడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ బాగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పదా్నలుగేళ్లలో భారీ క్షీణత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో.. 2012 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 4.2 శాతానికి పెరిగిపోయిన తరుణంలో దేశీ కరెన్సీ 12.4 శాతం పతనమైంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, డాలరు బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు లాంటి అంశాలు ఇప్పటి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 28న పశి్చమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చూస్తే రూపాయి విలువ 4.1 శాతం పడిపోయింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు దాదాపు 55.073 బిలియన్ డాలర్లను విక్రయించింది. డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా కరెన్సీలు కూడా గణనీయంగా క్షీణించాయి. జపాన్ యెన్ 6 శాతం, ఫిలిప్పీన్ పెసో 5.74 శాతం, దక్షిణ కొరియా వాన్ 2.88 శాతం తగ్గాయి. -
2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్ బాజా!
ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ రెండోరోజూ ‘బేర్’ మంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,636 పాయింట్లు కుప్పకూలి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 22,331 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,809 పాయింట్లు 71,774 పాయింట్లు వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు క్షీణించి 22,284 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ 3%, దక్షిణ కొరియా 3%, తైవాన్ 2%, హాంకాంగ్ 1% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1–0.5% లాభపడ్డాయి. అమెరికా సూచీలు అర శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, దేశీ స్టాక్ మార్కెట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7% పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 5,467 పాయింట్లు, నిఫ్టీ 1,188 పాయింట్లు పడ్డాయి. → రంగాల వారీ బీఎస్ఈ ఇండెక్సుల్లో పీఎస్యూ బ్యాంక్ 4.60%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 3.50%, ఫైనాన్సియల్ సర్వీసెస్ 3.46%, టెలికమ్యూనికేషన్ 3.09%, రియల్టీ 3.03% క్షీణించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.13%, 2.14% పతనమయ్యాయి. సెన్సెక్స్ సూచీలో పవర్గ్రిడ్ (0.27%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ (–5.09%), ఎస్బీఐ (–3.95%), ఇండిగో (–3.80%), బజాజ్ఫిన్సర్వ్ (–3.71%) అత్యధికంగా నష్టపోయాయి. కీలక దశలోకి పశ్చిమాసియా యుద్ధంఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కని్పంచకపోవడంతో అమెరికా ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి సిద్ధమైంది. దాడులు జరిపేందుకు 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలించారు. యూఎస్ భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకోవడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలుఆర్బీఐ విధించిన ఫారెక్స్ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ నికర ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను రోజువారీ ట్రేడింగ్ ముగిసే సరికి 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బిట్రాజ్ పొజిషన్ల అన్వైండింగ్ నేపథ్యంలో డాలర్ విక్రయాలు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రూపాయికి తాత్కాలిక ఊరట ఇచ్చినా, బ్యాంకింగ్ షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ పీఎస్యూ ఇండెక్స్ 4.60 క్షీణించగా, ప్రైవేట్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.50% పతనమైంది. ఎక్స్పైరీ ఒత్తిడితో తీవ్ర ఊగిసలాటనిఫ్టీ నెలవారీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లలో మార్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. సాధారణంగా నెలవారీ ఎక్స్పైరీ నెల చివరి మంగళవారం జరుగుతుంది. అయితే మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ సోమవారం నిర్వహించారు. ఆగని ఎఫ్ఐఐల విక్రయాలుపశ్చిమాసియా యుద్ధం అయిదో వారంలోకి ప్రవేశించడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఊపందుకుంది. గడిచిన 20 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఒక్క రోజే రూ.11,163 కోట్లు అమ్మకాలకు పాల్పడటం పతనం తీవ్రతకు నిదర్శనం.సీఎంపీడీఐ.. లిస్టింగ్ నిరాశకోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ) షేరు లిస్టింగ్లో నిరాశపరించింది. ఇష్యూ ధర (రూ.172)తో పోలిస్తే 5.43 శాతం డిస్కౌంటుతో రూ.163 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ఒక దశలో 11.45% క్షీణించి రూ.152 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 10.43% నష్టంతో రూ.154 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,999 కోట్లుగా నమోదైంది.2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల ఆవిరిబేర్ ఎటాక్తో రెండు రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.41 లక్షల కోట్లకు దిగివచి్చంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) సెన్సెక్స్ 9,339 పాయింట్లు (11.48%) క్షీణించింది. -
'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్బాల్ క్రీడాకారుడు.. బేస్బాల్లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్ను కొనాల్సిన అవసరం లేదు.Warren Buffett’s greatest lesson: NEVER CHASE. In the market, you have time. If an exceptional company trades at insane prices, don’t buy it.Wait for an exceptional company at a reasonable price. When you find it, invest heavily. If you don’t, wait. pic.twitter.com/s2Aax4wCj6— R (@AlphaWizarDD) March 29, 2026బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు. -
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యారో గ్రీన్టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, సెక్మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.గమనిక: రేపు (మార్చి 31) మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు ఇలా.. ఆనందంగా కొనేలా!!
దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మూడు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా! -
భారీ పతనంలో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ గణనీయంగా క్షీణించాయి.ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 0.86 శాతం లేదా 195 పాయింట్లు తగ్గి 22,624 వద్ద, సెన్సెక్స్ 0.97 శాతం లేదా 720 పాయింట్లు తగ్గి 72,862 వద్ద ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్లో బీఈఎల్, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.95 శాతం, 2.31 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అతిపెద్ద డ్రాగర్లు. నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
యుద్ధ పరిస్థితులే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్కవరింగ్కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్ వ్యూఇండిగో పెయింట్స్బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్ఖాన్ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్హెచ్సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
నిన్న భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఇలా..
దేశంలో పసిడి ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రెండు రోజులు పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి ఊరటని చెప్పవచ్చు.అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే! -
ట్రేడింగ్ బ్రేక్.. స్టాక్ మార్కెట్ సెలవులు
స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వచ్చే వారం తమ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం, వచ్చే వారంలో ఒక ప్రభుత్వ సెలవు దినం, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మార్కెట్లు పనిచేయవు.వచ్చే వారం సెలవుల వివరాలువచ్చే వారం మార్చి 31, మంగళవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీనికి తోడు సాధారణ వారాంతపు సెలవులైన ఏప్రిల్ 4 (శనివారం), ఏప్రిల్ 5 (ఆదివారం) తేదీల్లో కూడా మార్కెట్ మూసి ఉంటుంది.ఈ సెలవు దినాల్లో ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGR) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు.2026లో రానున్న సెలవులు ఎన్ఎస్ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శని, ఆదివారాలు కాకుండా మొత్తం 16 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. రాబోయే ముఖ్యమైన సెలవులు ఇవే..మార్చి 31 - శ్రీ మహావీర్ జయంతిఏప్రిల్ 3 - గుడ్ ఫ్రైడేఏప్రిల్ 14 - డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిమే 1 - మహారాష్ట్ర దినోత్సవంమే 28 - బక్రీద్ సెప్టెంబర్ 14 - గణేష్ చవితిఅక్టోబర్ 2 - మహాత్మా గాంధీ జయంతిఅక్టోబర్ 20 - దసరాడిసెంబర్ 25- క్రిస్మస్ముహూర్త ట్రేడింగ్నవంబర్ 8 (ఆదివారం) సెలవు దినమైనప్పటికీ, దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా ప్రత్యేక 'ముహూర్త ట్రేడింగ్' కోసం కొద్దిసేపు మార్కెట్ తెరుస్తారు. దీని సమయాలను ఎక్స్ఛేంజీలు విడిగా ప్రకటిస్తాయి.మార్కెట్ రెగ్యులర్ టైమింగ్స్సాధారణ రోజుల్లో స్టాక్ మార్కెట్ పనివేళలు కింది విధంగా ఉంటాయి..ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 నుండి 9:08 వరకు (ఆర్డర్ ఎంట్రీ).రెగ్యులర్ ట్రేడింగ్: ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు.ముగింపు సెషన్: మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 4:00 వరకు.బ్లాక్ డీల్ విండో: ఉదయం: 8:45 – 9:00 మధ్యాహ్నం: 2:05 – 2:20మార్కెట్ పరిస్థితులను బట్టి లేదా అత్యవసర సమయాల్లో పైన పేర్కొన్న పనివేళలను మార్చే లేదా సెలవులను సవరించే అధికారం ఎక్స్ఛేంజీలకు ఉంటుంది. -
పసిడి కెరటం.. అమాంతం పైకి లేచిన ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు. -
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్ స్ట్రీట్ మళ్లీ బేర్ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్కాంగ్, సింగపూర్ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. రోజంతా అమ్మకాలు...బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్ఫాల్ టాక్స్’ విధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది. -
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!
భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.ఎన్ఎస్ఈ వెబ్సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.శుక్రవారం మార్కెట్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఆర్ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.నేటి స్టాక్ మార్కెట్శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా? -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు వంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
జియో ఐపీవో ఎప్పుడంటే?
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లోని టెలికం నిర్వాహక హోల్డింగ్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కొత్త ఏడాదిలో ఐపీవో బాట పట్టిన తొలి కంపెనీగా నిలిచే వీలుంది.దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చైర్మన్గా 2016లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ.. ఆయన తనయుడు ఆకాశ్ అంబానీ నాయకత్వంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. 125 బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయించే వీలుంది.దీంతో ఐపీవో పరిమాణం 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 28,000 కోట్లు)గా సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2022 మే నెలలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ 2.5 బిలియన్ డాలర్ల ఐపీవో చేపట్టింది. ఇది రికార్డుకాగా.. తదుపరి 2024 అక్టోబర్లో ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ 2.97 బిలియన్ డాలర్ల సమీకరణతో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. తద్వారా రికార్డును సవరించింది. -
పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 243 పాయింట్లు నష్టపోయి 23,063 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 841 పాయింట్లు పడిపోయి 74,445 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.84బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 107.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.74 శాతం నష్టపోయింది.నాస్డాక్ 2.38 శాతం పడిపోయింది.Today Nifty position 27-03-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు మణిపాల్ హెల్త్
ఆసుపత్రుల దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 4,32,27,668 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.పీఈ దిగ్గజం టెమాసెక్కు పెట్టుబడులున్న సంస్థ ఈక్విటీ జారీ నిధుల్లో మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన రుణ చెల్లింపులకు రూ. 5,378 కోట్లు వెచ్చించనుంది. అనుబంధ కంపెనీ సహ్యాద్రి హాస్పిటల్స్లో మైనారిటీ వాటా కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 574 కోట్లు వినియోగించనుంది.ఐపీవోకంటే ముందుగా రూ. 1,600 కోట్ల షేర్ల విక్రయ యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవోలో ఈక్విటీ జారీ పరిమాణాన్ని కుదించనుంది. కార్డియాలజీ, అంకాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, కిడ్నీ మార్పిడి తదితర పలు స్పెషాలిటీలు కలిగిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను దేశవ్యాప్తంగా కంపెనీ నిర్వహిస్తోంది. 2025 సెప్టెంబర్కల్లా 38 ఆసుపత్రుల ద్వారా 10,761 పడకలను కలిగి ఉంది. గతేడాది(2024–25)లో ఆదాయం రూ. 8,242 కోట్లను అధిగమించగా.. దాదాపు రూ. 1,082 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
నకిలీ ట్రేడింగ్ యాప్లకు సెబీ చెక్
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్లోని స్టాక్ ట్రేడింగ్ యాప్ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.ముంచుకొస్తున్న ముప్పుఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్లు అచ్చం ఒరిజినల్ ప్లాట్ఫారమ్ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్లకు మాత్రమే ‘వెరిఫైడ్ బ్యాడ్జ్’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్లకు కూడా ఈ ఫీచర్ను విస్తరించనున్నారు.‘ఫిన్ఫ్లుయెన్సర్ల’పై నిఘాఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.సెబీ బ్రోకర్ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.యాప్లో గ్రాఫ్లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు. -
బంగారం కాస్త కొత్త ధరలు.. మారాయిలా..
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం
రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి పతనమవుతోంది. డాలర్ మారకంలో 20 పైసలు బలహీనపడి తాజా జీవితకాల కనిష్టం 93.96 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, నెలాఖరున డాలర్లకు డిమాండ్ నెలకొనడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 93.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 93.86 – 94.13 శ్రేణిలో ట్రేడైంది. -
బైబ్యాక్లో షేర్లు అమ్ముకుంటే 12 శాతం సర్చార్జీ
న్యూఢిల్లీ: వ్యక్తిగత లేదా కార్పొరేట్ వాటాదారులు ఎవరైనా బైబ్యాక్లో భాగంగా విక్రయించే షేర్లపై ఆర్జించే లాభాలకు 12% సర్చార్జీ వర్తించనుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఫైనాన్స్ బిల్లులో సవరణలకు తాజాగా లోక్సభ ఆమోదముద్ర వేసింది.2026 ఫైనాన్స్ బిల్లులో 32 సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదించగా.. లోక్సభ ఆమోదముద్ర వేసింది. రేపు(శుక్రవారం) రాజ్యసభలో ఆమో దం కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే రూ. 50 లక్షలవరకూ ఆదాయంగల వారిపై ఎలాంటి సర్చార్జీ లేదు.రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ పన్నువర్తించే ఆదాయంగల వారికి బైబ్యాక్లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించే లాభాలపై 10% సర్చార్జీ అమలు చేస్తున్నారు. అయితే ఫ్లాట్ 12% సర్చార్జీ విధింపుతో ఆయా పన్ను చెల్లింపుదారులపై భారం పడనుంది. -
సిల్వర్ హిట్.. బంగారం ధగధగలు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.భౌగోళిక రాజకీయ సెంటిమెంట్ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్ వెండి ఔన్స్కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!
దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రరత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.50 వేల టన్నుల బంగారం నిల్వలునేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.అడ్డంకిగా 3% జీఎస్టీభౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.తప్పనిసరి హాల్మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లు మాత్రం డీలా
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా పడిన పసిడి, వెండి ధరలు ఈరోజు మార్కెట్లో తిరిగి పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కాకుండా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు, అమ్మకాల ర్యాలీలో పాల్గొంటేనే ధరలు అధికంగా ప్రభావితం అవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 295 పాయింట్లు పెరిగి 23,207 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 888 పాయింట్లు పుంజుకొని 74,962 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.28బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 99.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.84 శాతం పడిపోయింది.Today Nifty position 25-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కోలుకున్న పసిడి... అక్కడే వెండి
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల నుంచి పసిడి బయటపడింది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి రూ.1.44లక్షలకు (పన్నులు సహా) చేరుకుంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకి రూ.2.30 లక్షల వద్దే ఉన్నట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో రికవరీకితోడు, కనిష్ట స్థాయిల్లో కొనగోళ్ల మద్దతుతో బంగారం ధర పెరిగినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్స్కు 17 డాలర్ల వరకు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి సైతం 1% పుంజుకుని ఔన్స్కు 69.86 డాలర్ల స్థాయిని చేరుకుంది. ‘9 రోజుల క్షీణత తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్కు 4,420 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అప్రమత్తతతో కూడిన ఆశావహధోరణి కనిపించింది’ అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
వార్కు బ్రేక్.. బుల్కు జోష్!
ముంబై: ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో దలాల్ స్ట్రీట్లో రిలీఫ్ ర్యాలీ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడం... క్రూడ్ ధర దిగిరావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,372 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్లు బలపడి 22,912 వద్ద నిలిచింది. సూచీల 2% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు చేరింది. అదిరిపోయే ఆరంభం: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,793 పాయింట్లు ఎగసి 74,489 వద్ద, నిఫ్టీ 544 పాయింట్లు బలపడి 23 వేల స్థాయిపైన 23,057 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు లభించడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో పవర్గ్రిడ్ (–0.81%), సన్ఫార్మా (–0.20%), ఎస్బీఐ(–0.09%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లూ లాభడ్డాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో సర్వీసెస్ 3.46%, ఇండ్రస్టియల్స్ 3%, ప్రైవేటు బ్యాంక్స్ 2.63%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.46%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.39%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34%, ఆటో 2.30%, కమోడిటీస్ 2.19 శాతం పెరిగాయి. ‘ఇరాన్ ఇంధన సదుపాయాలపై అమెరికా దాడులు తాత్కాలికంగా నిలివేయడం పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత తగ్గే అవకాశానికి సంకేతంగా భావించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. అయినప్పట్టకీ.., హర్మూజ్ జలసంధి చుట్టూ జరిగే రాజకీయ, భౌగోళిక పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీస్తున్నాయి. దౌత్య సంబంధాలు ఏ మాత్రం బెడిసికొట్టినా మార్కెట్లపై మళ్లీ బేర్స్ పట్టుబిగించే వీలుంది. భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వేల్యూ బయింగ్ కారణంగా ర్యాలీ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిని ఇన్వెస్టర్లు తక్కువ ధరల్లో నాణ్యమైన షేర్లను కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలి’ అని లైవ్ లాంగ్ వెల్త్ రీసెర్చ్ విశ్లేషకుడు హరిప్రసాద్ తెలిపారు.ప్రపంచ మార్కెట్లు..నష్టాల్లోంచి లాభాల్లోకియుద్ధంపై చర్చలకు సంబంధించి అమెరికా నుంచి సంకేతాలు అందాయంటూ ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పష్టం చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోంచి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్కాంగ్ 3%, దక్షిణ కొరియా 2.67%, చైనా 1.75%, జపాన్ 1.41%, థాయిలాండ్ 1%, సింగపూర్ అరశాతం పెరిగాయి. ఇంట్రాడేలో 2% పతనమైన యూరప్ మార్కెట్లు నష్టాలను దాదాపు భర్తీ చేసుకున్నాయి. జర్మనీ డాక్స్ 0.25% స్వల్ప నష్టంతో ముగిసింది. ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.1% లాభపడగా, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.5% పెరిగింది. యూఎస్ ప్రధాన సూచీల్లో నాస్డాక్ 0.45% నష్టాల్లో ట్రేడవుతోంది. డోజోన్స్ 0.25%, ఎస్అండ్పీ–500 సూచీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.సరికొత్త కనిష్టానికి రూపాయి... 23 పైసలు బలహీనపడి 93.76 వద్దకు.. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, క్రూడాయిల్ ధరల రికవరీ, పశి్చమాసియా సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తదితర అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 93.66 వద్ద మొదలైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరికి ఇంట్రాడే కనిష్టం(93.76) వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో 93.65 – 94.25 శ్రేణిలో ట్రేడవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మార్చిలో రూపాయి 4.5 శాతం కరిగిపోయింది. జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ సక్సెస్ ఆగ్రోకెమికల్ కంపెనీ జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర రూ.320తో పోలిస్తే బీఎస్ఈలో 4% ప్రీమియంతో రూ.332 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఒకదశలో 14% ఎగిసి రూ.364 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.356 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,656.53 కోట్లుగా నమోదైంది. -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. అయితే ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న యూ టర్న్కు ముందు ఏం జరిగింది అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్ సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వార్కు బ్రేక్ ప్రకటించడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగిన ఒక రహస్య ట్రేడింగ్ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది?20 నిమిషాల్లో రూ. 840 కోట్ల లాభం: మిస్టరీ ట్రేడ్ఇరాన్ ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని ట్రంప్ ప్రకటనకు కేవలం 15 నిమిషాల ముందే మార్కెట్లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు సమాచారం. ఈచెయిన్ రియాక్షన్ కేవలం 20 నిమిషాల్లోనే సుమారు రూ. 840 కోట్ల లాభాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నారు.న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:20 గంటలకు). ఎవరో గుర్తుతెలియని వ్యక్తి/సంస్థ ఒక్కసారిగా రూ. 12,600 కోట్ల విలువైన S&P 500 ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దాదాపు రూ. 1,615 కోట్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.ట్రంప్ వార్ బ్రేక్ ప్రకటన రాగానే చమురు ధర భారీగా పడిపోయింది. అలాగే మార్కెట్ ప్రారంభానికి ముందే ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ 109 డాలర్ల నుండి 92 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దాదాపు 6 శాతం పడిపోయి, బ్యారెల్కు 88.70 డాలర్లను తాకింది.ఇరాన్పై దాడులు ఆగిపోవడంతో చమురు సరఫరాకు ఢోకా ఉండదని భావించిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 109 డాలర్ల నుండి 92 డాలర్లకు పడిపోయింది.ఫలితంగా కేవలం ఆయిల్ ధరల మార్పు వల్లే ఆ వ్యక్తికి 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు (100 మిలియన్ డార్లు) లాభం వచ్చింది. ఇక షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభం దీనికి అదనం.'అన్యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రకారం, ఈ ట్రేడ్లను నిర్వహించిన వారు రెండు సమన్వయ పందాలు వేశారు. మొదటిది ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాతో, వారు సుమారు రూ. 12,600 కోట్లు లేదా 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్&పి 500 ఫ్యూచర్స్ను కొనుగోలు చేశారు.రెండో బెట్ సరఫరా భయాలు తొలగిపోతే ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనాతో సుమారు రూ. 1,615 కోట్లు లేదా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ను విక్రయించారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో, దాదాపు 580 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 4,870 కోట్ల విలువైన 6,200 బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు చేతులు మారాయి. ఇది ఆ గంటలో ట్రేడ్ అవుతున్న మిగతా వాటి కంటే నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ.ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలుట్రంప్ నిర్ణయం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా, అంత భారీ మొత్తంలో (రూ. 14,000 కోట్లకు పైగా) పక్కా టైమింగ్తో పెట్టుబడి పెట్టడం చూస్తుంటే.. ప్రభుత్వ నిర్ణయం ముందే ఎవరికైనా తెలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తన 25 ఏళ్ల మార్కెట్ అనుభవంలో ఇలాంటి వింతైన ట్రేడింగ్ పద్ధతిని ఎప్పుడూ చూడలేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మాట్ విలియం ఎక్స్లో పేర్కొన్నారు. ఒక యూ.ఎస్. బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. కారణాన్ని నిరూపించడం సులభం కానప్పటికీ, ట్రంప్ పోస్ట్ వెలువడటానికి 15 నిమిషాల ముందు ఏం జరిగింది అనేదానిపై కచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.నికోలస్ మదురో అరెస్ట్కు ముందు కూడాఅలాగే గతంలో వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ విషయంలో కూడా ఇలాగే 'పాలీమార్కెట్'లో ముందే బెట్టింగ్ జరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు జనవరి నాటికి అమెరికా వెనిజులాపై దాడి చేస్తుందని సుమారు 34వేల డాలర్ల పందెం వేశారు. దీంతో వీరికి అంతర్గత సమాచారం అంది ఉంటుందనే అనుమానాలు ట్రేడర్లలో తలెత్తాయి.కాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ విచారణ జరిగితే దీని వెనుక ఎవరున్నారు అనేది నిగ్గు తేలే అవకాశం ఉంది. ఇదీ చదవండి : ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో సూచీలు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం లాభంతో 74,068.45 వద్ద, నిఫ్టీ 412.25 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 22,924.90 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, DCX సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
950 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు పెరిగి 22,818 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 956 పాయింట్లు పుంజుకొని 73,651 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.21 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.15 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 24-03-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎంసీఎక్స్లో 10% పైగా డౌన్
నిన్నమొన్నటిదాకా ఆకాశమే హద్దుగా ఎగబాకి కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బంగారం.. ఇప్పుడు భారీ పతనంతో ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించిన పసిడి ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది. సోమవారం ఎంసీఎక్స్ కమోడిటీ మార్కెట్లో ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 10 గ్రాముల రేటు ఏకంగా 10.3 (రూ.14,897) పతనమై.. రూ.1,29,595కు పడిపోయింది.ఈ ఏడాది జనవరి 29న నమోదైన రూ.1,93,096 ఆల్టైమ్ గరిష్టం నుంచి చూస్తే 33 శాతం (రూ.63,501) క్షీణించడం గమనార్హం. మరోపక్క, వెండి కూడా వెలవెలబోతోంది. ఏప్రిల్ కాంట్రాక్టు కేజీ ధర సోమవారం ఒకానొకదశలో రూ.27,248 దిగజారి రూ.,2,04,500 తాకింది. కాగా, ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాములు మేలిమి బంగారం ధర రూ.9,050 పడిపోయి రూ.1,43,600కు చేరింది. వెండి కేజీ రూ.10,500 నష్టంతో రూ.2,30,000కు తగ్గింది.అంతర్జాతీయంగా తీవ్ర హెచ్చుతగ్గులు..క్రూడ్ సెగలు, యుద్ధ ప్రకంపనలతో అంతర్జాతీయంగానూ బంగారం క్రాష్ అయింది. నైమెక్స్ ఏప్రిల్ ఫ్యూ చర్స్ ఔన్స్ ధర ఒక దశలో 10.4 శాతం (474.9 డాలర్లు) కుప్పకూలి 4,100 డాలర్ల కనిష్టాన్ని తాకింది. అలాగే వెండి ఔన్స్ రేటు సైతం 12 శాతం పైగా నష్టపోయి 61.23 డాలర్లకు దిగొచ్చింది. కాగా, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు అయిదు రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పసిడి, వెండి ధరలు భారీగా కోలుకున్నాయి. పసిడి ఔన్స్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో 2 శాతం నష్టంతో 4,550 డాలర్ల వద్ద, వెండి 1 శాతం లాభంతో 70.1 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికవరీతో ఎంఎసీఎక్స్లోనూ బంగారం ధర రూ.1,41,388కి (నష్టం 2 శాతం) పుంజుకుంది. వెండి మళ్లీ లాభాల్లోకి వచ్చింది. అర శాతం పెరిగి రూ.2,34,155కు చేరింది.ఎందుకీ పతనం..పశ్చిమాసియాలో యుద్ధం దెబ్బకు క్రూడ్ భగభగలు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర తాజాగా 119 డాలర్లను తాకడం, హార్మూజ్ జలసంధిని దాదాపు మూసివేయడంతో ఇంధన సరఫరాలకు తీవ్ర ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలతో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. యూఎస్ ఫెడ్తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. వెరసి డాలరు విలువ పుంజుకోవడంతో బాండ్ ఈల్డ్లు ఎగబాకుతున్నాయి. ఈ అంశాలన్నీ బంగారం ధర వెలవెలబోయేలా చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ‘తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో బడా సంస్థాగత ఇన్వెస్టర్లు, ముఖ్యంగా అరబ్ గల్ఫ్ ప్రాంతానికి చెందిన ఇన్వెస్టర్లు బంగారం, ఇతరత్రా లిక్విడ్ అసెట్లను అమ్మేసుకుని, నగదు జమ చేసుకుంటున్నారు’ అని ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాని విశ్లేషించారు.వార్ బ్రేక్.. క్రూడ్ కూల్..ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో క్రూడ్ రేట్లు చప్పున చల్లారాయి. నైమెక్స్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా 10 శాతం మేర దిగజారి 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ రేటు సైతం 10 శాతం పడి 96 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో నైమెక్స్ 101 డాలర్లను, బ్రెంట్ 109 డాలర్లను తాకింది. ఇరాన్తో చర్చల్లో కాస్త పురోగతి నెలకొందని, అందుకే దాడులకు బ్రేక్ ఇస్తున్నామంటూ ట్రంప్ తాజా ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు నెలకొన్నాయని, దీంతో క్రూడ్ ధరలు శాంతించాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
సాయి పేరెంటరల్స్ ఐపీవో నేడు
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూ నేడు(24న) ప్రారభమై శుక్రవారం(27న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 372-392కాగా.. తద్వారా రూ. 409 కోట్లవరకూ సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు తాజాగా షేర్లను కేటాయించింది. ఒక్కో షేరుకీ రూ. 392 ధరలో 31,28,485 షేర్లు విక్రయించింది. తద్వారా దాదాపు రూ. 123 కోట్లు సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో కొటక్ లైఫ్ సైన్సెస్ ఫండ్, క్వాంట్ ఎంఎఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ, ఇండియా ఎమర్జింగ్ జెయింట్స్ ఫండ్ ఉన్నాయి. దేశీ మ్యూచువల్ ఫండ్స్సహా.. బీమా కంపెనీలు, తదితర విభిన్న సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు యాంకర్ పెట్టుబడుల జాబితాలో చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 38 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 2కల్లా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానుంది. యాంకర్ పెట్టుబడులు.. కంపెనీ బిజినెస్ మోడల్, వృద్ధి అవకాశాలు, నిర్వహణా సామర్థ్యాలపట్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కుమార్ కె. పేర్కొన్నారు. కంపెనీ ప్రధానంగా ఇంజెక్టబుల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. బ్రాండెడ్ జనరిక్స్తోపాటు.. కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ(సీడీఎంవో) సర్వీసులు సైతం అందిస్తోంది. కార్డియోవాస్కులర్, యాంటీబయోటిక్స్, డయాబెటిస్ తదితర వివిధ థెరప్యూటిక్ విభాగాలలో ఇంజెక్టబుల్స్, ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ తదితర డోసేజీలు రూపొందిస్తోంది.ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్ -
మార్కెట్లో వార్ విధ్వంసం
ముంబై: ఒకపక్క ‘ఇరాన్ వార్, మరోపక్క ‘చమురు ధరల బాంబ్’తో దలాల్ స్ట్రీట్ మరోసారి దద్దరిల్లింది. డాలర్ మారకంలో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి నమోదుచేస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలూ మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,837 పాయింట్లు(2.46%) క్షీణించి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 602 పాయింట్లు(2.60%) కుప్పకూలి 22,513 వద్ద నిలిచింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ట్రేడింగ్ సమయంలో అమ్మకాల సునామీ వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,975 పాయింట్లు క్షీణించి 72,558 వద్ద, నిఫ్టీ 644 పాయింట్లు పతనమై 22,471వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.ఇండెక్సులన్నీ నష్టాల్లోనేఅన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 5%, మెటల్ 4.76%, సరీ్వసెస్ 4.70%, ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.39%, కమోడిటీస్ 4.35%, ఇండ్రస్టియల్స్ 4.05%, క్యాపిటల్ గూడ్స్ 3.99 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 3.82%, 3.66 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో హెచ్సీఎల్టెక్ 1.83%, పవర్గ్రిడ్ 1.39%, ఇన్ఫోసిస్ 0.28% మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లూ నష్టపోయాయి.యుద్ధం మొదలయ్యాక రూ.48.29 లక్షల కోట్లు ఆవిరి పశి్చమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) ఇన్వెస్టర్లు మొత్తం 15 ట్రేడింగ్ సెషన్లలో రూ.48.29 లక్షల కోట్లు కోల్పోయాయి. సెన్సెక్స్ 8,591 పాయింట్లు (10.56%), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58%) నష్టపోయాయి. తాజా గా సోమవారం ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.414.77 లక్షల కోట్లకు దిగివచి్చంది.నష్టాలు ఎందుకంటేహార్మూజ్ జలసంధి అంశంపై అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో తాజా యుద్ధ భయాలు మార్కెట్లను కుదిపేశాయి. జలసంధి మూసివేత హెచ్చరికలతో క్రూడ్ బ్యారెల్ 110 డాలర్లపైకి చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరగడమే కాకుండా, వృద్ధి మందగమన ఆందోళనలు తలెత్తాయి. చమురు దిగుమతుల భారం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలతో రూపాయి సరికొత్త కనిష్టాలను తాకింది. యుద్ధం మొదలైన తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు మార్కెట్ను మరింత బలహీనపరిచింది.ఆసియా మార్కెట్లు డౌన్..లాభాల్లోకి యూరప్, యూఎస్పశి్చమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చనే ఆందోళనలతో ఆసియా మార్కెట్ల పతనం కొనసాగింది. ఫలితంగా దక్షిణ కొరియా 7%, చైనా 4%, జపాన్ 3.60%, హాంగ్కాంగ్ 3.54%, తైవాన్ 2.50%, సింగపూర్ 2.22 శాతం క్షీణించాయి. మన మార్కెట్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో పరిస్థితులు తారుమారయ్యాయి. పశి్చమాసియాలో నెలకొన్న ఘర్షణలకు ‘సంపూర్ణ, శాశ్వత పరిష్కారం’ కనుగొనే దిశగా ‘ఫలప్రదమైన చర్చలు’ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న ‘అన్ని రకాల దాడులను అయిదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు’ ట్రంప్ ప్రకటించారు. దీంతో యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్బ్యాక్ అయ్యాయి. జర్మనీ డాక్స్ ఇండెక్స్ 3%, జర్మనీ సూచీ సీఏసీ సూచీ 2%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 1% పెరిగాయి. అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 2.25%, డోజోన్స్ 2.50%, ఎస్అండ్పీ–500 సూచీ 2% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది.సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.స్టాక్ల విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్క్యాప్100, నిఫ్టీ మిడ్క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి. -
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.Something very strange is happening in precious metals right now:In just 3 hours, gold and silver just erased a combined -$2 TRILLION in market cap.Meanwhile, oil prices have erased their gains on the day and US stock market futures are nearly green.Since the Iran War… pic.twitter.com/zP43wSr9wE— The Kobeissi Letter (@KobeissiLetter) March 23, 2026ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. -
జాక్పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి జాక్పాట్ తగిలినట్లయింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా అమాంతం పతనమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లపై బేర్ పంజా.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 411 పాయింట్లు తగ్గి 22,711 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1269 పాయింట్లు నష్టపోయి 73,268 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 112.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.51 శాతం పడిపోయింది.నాస్డాక్ 2.01 శాతం నష్టపోయింది.Today Nifty position 23-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పశ్చిమాసియాపైనే ఫోకస్!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక ఆర్థిక అంశాలు కొరవడిన నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులే దారి చూపనున్నాయి. దీంతో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, రూపాయి మారకం తదితర అంశాలు కీలకంగా నిలవనున్నాయి. గురువారం(26న) శ్రీరామ నవమి సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం... రోజులు గడిచేకొద్దీ పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముదురుతోంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన తదుపరి పరిస్థితులు మరింత వికటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో ఆసియా మొదలు అమెరికా వరకూ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలే ప్రధానంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి(26న) సెలవుతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గణాంకాల విడుదల దేశీయంగా ఈ వారం మార్చి నెలకు రేపు(24న) హెచ్ఎస్బీసీ ఫ్లాష్ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. తయారీ, సర్వీసులు, కాంపోజిట్ వివరాలు వెల్లడికానున్నాయి. తద్వారా బిజినెస్ యాక్టివిటీ ముందస్తు అంచనాలకు వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఈ బాటలో 28న ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మ్యాన్యుఫాక్చరింగ్ గణాంకాలు విడుదలకానున్నాయి. హార్ముజ్పై ఫోకస్ కొద్ది రోజులుగా హార్ముజ్ ద్వారా జల రవాణా దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు కీలకంగా మారినట్లు ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని అంచనా వేశారు. బ్రెంట్ చమురు 100 డాలర్ల ఎగువన కదులుతుండటం దేశీయంగా వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. చమురు ధరలతో పలు దేశాలలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తుండటంతో కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలవైపు చూపు సారించవచ్చని వివరించారు. గత వారం అక్కడక్కడే తీవ్ర ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 31 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,533 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 37 పాయింట్లు క్షీణించి 23,115 వద్ద స్థిరపడింది.సాంకేతికంగా ఈ వారంయుద్ధ భయాల నుంచి గత వారం నెమ్మదిగా రికవరీ బాట పట్టిన దేశీ స్టాక్ మార్కెట్లను ప్రయివేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దెబ్బకొట్టింది. మరోపక్క ముడిచమురు ధరల మంట సెంటిమెంటుకు షాకివ్వడం దీనికి జత కలసింది. దీంతో చివరికి మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగిశాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం పశ్చిమాసియా ప్రకంపనల ఆందోళనలతో బలహీనపడటానికే అధిక వీలుంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో విక్రయాలకు పాల్పడుతుండటం బ్లూచిప్స్ను పడగొడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. → నిఫ్టీకి తొలుత 22,900 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి 22,300–22,200 స్థాయిలో కొనుగోళ్లకు వీలుంది. ఒకవేళ తొలి మద్దతుస్థాయి నుంచి బలపడితే.. 23,800–24,000 వరకూ పుంజుకోవచ్చు. సమీప కాలంలో 22,900– 24,000 శ్రేణిలో కదిలేందుకు వీలుంది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలు.. యుద్ధ భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఇటీవల దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నగదు విభాగంలో ఏకంగా రూ. 88,180 కోట్ల(9.6 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ధరల పెరుగుదలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఆందోళనలు వ్యక్తం చేయడానికితోడు.. డాలరుతో మారకంలో రూపాయి పతనంకావడం సైతం కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరలతో కార్పొరేట్ ఫలితాలు నీరసించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. అంతకుముందు నెల(ఫిబ్రవరి)లో గత 17 నెలల్లోనే అత్యధికంగా ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..
ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.బంగారం ధరలు తగ్గుతాయా?బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు. -
పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.పతనానికి ప్రధాన కారణాలుసాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్ను తగ్గిస్తున్నాయి.ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.1983లో ఏం జరిగిందంటే.. 1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.నేటి బంగారం, వెండి ధరలు నేడు (మార్చి 22, 2026) దేశీయంగా ఎంసీఎక్స్ (MCX) మార్కెట్కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. -
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది. -
గుడ్న్యూస్.. బంగారం బాగా తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
విదేశీ ఇన్వెస్టర్లకు ఇదో అద్భుత అవకాశం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటుచేసుకున్న ఇటీవలి మార్పులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా మారాయని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్నే పేర్కొన్నారు. ప్రస్తుత కరెక్షన్ వల్ల షేర్ల విలువ ఆకర్షణీయంగా మారాయని, ఇది భారత్లో పెట్టుబడులు పెంచుకోవడానికి సరైన సమయమని విశ్లేషించారు.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా జరిగిన ‘రష్యా-ఇండియా క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రేషన్’ ఫోరంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వర్ష్నే తెలిపారు. అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా ఉన్నారు. కేవలం మార్చి మొదటి 15 రోజుల్లోనే సుమారు రూ.77,000 కోట్ల నిధులు బయటకు వెళ్లడం గమనార్హం. రష్యా ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న సాంకేతిక, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి సెబీ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.‘భారతీయ మార్కెట్లలోని అనుబంధ సంస్థల విలువ, విదేశాల్లోని వారి మాతృ సంస్థల కంటే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రష్యా కంపెనీలు భారత మార్కెట్లలో లిస్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు’ అని తెలిపారు. భారతీయ మార్కెట్లు కేవలం పెట్టుబడితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానానికి వేదికగా మారుతున్నాయని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) అంతలోనే ధర పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే సుమారు రూ.7 వేలు తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం తగ్గుముఖంలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ బాంబ్.. మార్కెట్ క్రాష్
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో దలాల్ స్ట్రీట్లో అన్ని రంగాల షేర్లు దగ్ధమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం పేకమేడలా కూలిపోయింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ తారస్థాయికి చేరుకోవడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం తదితర అంశాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 2,497 పాయింట్లు(3.26%) క్షీణించి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 776 పాయింట్లు కుప్పకూలి 23,002 వద్ద నిలిచింది. 2024 జూన్ 24 తర్వాత ఇరు సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ మూడు శాతానికిపైగా పతనంతో ఒక్కరోజే రూ.12.87 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆసియా మార్కెట్లు 3%, యూరప్ మార్కెట్లు 2.50% పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అమ్మకాల సునామీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,753 పాయింట్లు క్షీణించి 73 వేల స్థాయి దిగువన 73,951 వద్ద, నిఫ్టీ 848 పాయింట్లు పతనమై 22,930 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. → బీఎస్ఈ ఇండెక్సుల్లో ఆటో 4.07%, రియల్టీ 3.79%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 3.66% పతనయమ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 3.34%, 2.77% పడ్డాయి. సెన్సెక్స్లో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్(5.6%), బజాజ్ ఫైనాన్స్(5.4%), ఎంఅండ్ఎం(5.2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(5.1%), ఎల్అండ్టీ (4.7%) అత్యధికంగా నష్టపోయాయి.పతనానికి ‘పంచ’ కారణాలు → భగ్గుమన్న చమురు ధరలు: ఇరాన్ దాడులు తీవ్రం చేయడంతో గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ పూర్తి గా స్తంభించిపోయింది. దీంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ 119 డాలర్ల స్థాయికి తాకింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. → విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు: యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ వారంలో కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.24 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలు విక్రయించారు. గురువారం ఒక్క రోజే రూ.7,558 కోట్లు అమ్మకాలకు పాల్పడ్డారు. గడిచిన 14 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. → ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాలను కారణాలుగా చూపుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు.→ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ల అమ్మకాలు: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామాతో బ్యాంకు షేరు ఇంట్రాడేలో బ్యాంక్ షేర్లు 8.7 శాతం మేర పతనమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన స్టాక్ కావడంతో సూచీలపై ఆ ప్రభావం కనిపించింది.→ లాభాల స్వీకరణ: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా... దేశీ సూచీలు గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ మొత్తం 2,140 పాయింట్లు(2.87%) ఎగసింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. -
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో చేతులు కలిపిన స్టాక్ బ్రోకర్లపై పెండింగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్మెంట్ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్ బ్రోకర్ సంస్థలకు 2025 జూన్ 16 నుంచి సెపె్టంబర్ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్వరకూ గడువును పొడిగించింది. -
నక్కతోక తొక్కినట్లు.. గంటల్లోనే పడిపోయిన బంగారం!
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లు మరింత ఊరట లభించింది.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.2550 తగ్గి రూ.1,42,750 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.7140 క్షీణించి రూ.1,37,750 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.6550 కరిగి రూ. 1,50,280 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.10000 క్షీణించి రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.మార్కెట్ను ముంచేసిన 5 ప్రధాన కారణాలుపతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభంఅమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.భగ్గుమన్న ముడిచమురుయుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో కుదుపుదేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్ను షాక్కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ను భారీగా కిందకు లాగింది.అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరిఅమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.రూపాయి పతనం- ఎఫ్ఐఐల అమ్మకాలుఅంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 11 శాతం పెరిగింది. -
బిగ్రిలీఫ్.. పండగపూట బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ నేలకరిచిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన మూడు సెషన్లలో లాభాల్లోకి చేరిన మార్కెట్లు ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 459 పాయింట్లు తగ్గి 23,312 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1526 పాయింట్లు దిగజారి 75,201 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 111.37 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.36 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.46 శాతం నష్టపోయింది.Today Nifty position 19-03-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి. -
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. -
పసిడి ప్రియులకు ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.97 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది.నాస్డాక్ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాయి పేరెంటరల్స్ @ రూ. 372–392
హైదరాబాద్: డైవర్సిఫైడ్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూకి తాజాగా రూ. 372–392 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కంపెనీ రూ. 285 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 32 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఐపీవో కీలక మైలురాయిగా కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ కేకే పేర్కొన్నారు. తాము సాధించిన పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. వ్యూహాత్మక ప్రణాళికలను వేగవంతం చేసేందుకు తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. తద్వారా తదుపరి విస్తరణ దశకు మద్దతు లభించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా గ్లోబల్ ఫార్ములేషన్ల బిజినెస్తోపాటు.. ఇంజెక్టబుల్స్, ఓరల్ డోసేజీ ఫార్ములేషన్లలో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించారు. -
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!
రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది. -
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026 -
బంగారం, డాలర్ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!
ఇరాన్ పై అమెరికా- ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న మొదలు పెట్టిన దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. సాధారణంగా యుద్ధం, లేదా సంక్షోభ సమయాల్లో చమురు, బంగారం, అమెరికన్ డాలర్ బాగా పెరుగుతాయి. అలాగే స్టాక్మార్కెట్లు కూడా పెట్టుబడుదారుల ప్యానిక్ అమ్మకాలతో కుప్పకూలుతాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధ సమయంలో మాత్రం మార్కెట్ సమీకరణాలు మారుతున్నాయి. బంగారం, డాలర్ను మించి దూసుకుపోతోంది. అదేంటో తెలుసుకుందాం ఈ కథనంలో మారుతున్న పెట్టుబడి ధోరణికి అనుగుణంగా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి బిట్కాయిన్ విలువ 74 వేల డాలర్ల మార్కును దాటింది. అంటే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. బంగారం ఔన్సుకు దాదాపు 5,035 డాలర్ల వద్ద ఉంది. గతంలో బిట్కాయిన్ పెట్టుబడులు చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారంగా భావించేవారు. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఇది సేఫ్గా మారుతుండటం విశేషం.బిట్ కాయన్పై ఎందుకింత ఆసక్తి?INRGrid స్టేబుల్ వ్యవస్థాపకుడు అనుజ్ చౌదరి అభిప్రాయం ప్రకారం.. బిట్కాయిన్ను బ్యాంకులు లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్షణమే సరిహద్దులు దాటించి తరలించ వచ్చు. యుద్ధం వంటి సమయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించినా, బిట్కాయిన్ నియంత్రణ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బంగారం లేదా సాంప్రదాయ మార్కెట్ల వలె కాకుండా, బిట్కాయిన్ 24/7 ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్లు మూసి ఉన్నప్పుడు, భౌగోళిక రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ సంఘటనల సమయంలో ఇదొక ప్రాధాన్య సాధనంగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్ ప్రకటన : ఇరాన్కు మరో ఎదురుదెబ్బ?!ఇన్వెస్ట్పీడియా నివేదిక ప్రకారం, ఇరాన్పై దాడులు మొదలైనప్పటి నుంచీ ఐషేర్స్ బిట్కాయిన్ ట్రస్ట్ ,ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ బిట్కాయిన్ ఫండ్తో సహా బిట్కాయిన్కు 1.1 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు వచ్చాయంటేనే బిట్కాయన్ క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.బిట్కాయిన్ నిజంగా సురక్షితమేనా?ఇరాన్ యుద్ధం సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడంతో, కొంతమంది పెట్టుబడిదారులు క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లవచ్చు. అయితే, ఒక రక్షణ సాధనంగా (హెడ్జ్గా) బిట్కాయిన్ను బంగారంతో పోల్చడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బిట్ కాయిన్లో పెట్టుబడులు అంత సులువు కాదు. దీనిపై నిపుణులు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం భౌతికంగా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిట్కాయిన్ డిజిటల్గా ఉండటం వల్ల దాన్ని ఎవరూ సీజ్ చేయలేరు. కానీ అయితే, దీని ధరల్లో ఉండే తీవ్రమైన హెచ్చుతగ్గుల (Volatility) చాలా తీవ్ర స్థాయిల్లో ఉంటుంది. అందుకే లాభనష్టాలను బేరీజు వేసుకోనొ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, లేదా కోవిడ్-19 సంక్షోభం వంటి భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో క్రిప్టోకరెన్సీ పెరగవచ్చు. అయినా వ్యాపారులు/ పెట్టుబడిదారులు బిట్కాయిన్ను నమ్మదగిన సురక్షిత ఆశ్రయ ఆస్తిగా పరిగణించ కూడదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు బిట్కాయిన్ను కొనుగోలు చేసే అవకాశం లేనందున, రిజర్వ్ ఆస్తిగా దాని పాత్ర పరిమితం. మరోవైపు, గత కొన్నేళ్లుగా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకున్నాయనేది గమనించాలి. -
ఉడుకుతున్న బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు పెరిగి 23,476 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు ఎగబాకి 75,713 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.89బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 102.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగింది.నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.Today Nifty position 17-03-2026(time: 9:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మూడు కంపెనీల లిస్టింగ్కు ఓకే
సెకండరీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి తగ్గింది. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు, ముడిచమురు రవాణాకు విఘాతం కలగడంతో మండుతున్న ధరలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు కంపెనీల ప్రాస్పెక్టస్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్కు అనుమతి పొందిన తాజా జాబితాలో ట్రావెల్స్టాక్ టెక్, లెర్న్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్, టీ పోస్ట్ చేరాయి. ఈ మూడు కంపెనీలు గతేడాది జూన్, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరో మూడు కంపెనీలు ఐపీవో రేసు నుంచి తప్పుకోవడం లేదా ప్రాస్పెక్టస్లను సెబీ తిప్పిపంపడం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రేస్ పవర్ ఇన్ఫ్రా, మాధుర్ ఐరన్ అండ్ స్టీల్, అర్జున్ జ్యువెలర్స్ ఉన్నాయి. ఈ కేలండర్ ఏడాది(2026)లో ఇప్పటివరకూ 12 కంపెనీలు ఐపీవో చేపట్టడం ద్వారా నిధులు సమీకరించాయి. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు సైతం ఈ నెలాఖరుకల్లా పబ్లిక్ ఇష్యూలకు వచ్చే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.ట్రావెల్ టెక్నాలజీఐపీవోలో భాగంగా ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ.. ట్రావెల్స్టాక్ టెక్ రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2,68,52,969 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 135 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, రూ. 45 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన సొమ్మును సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. లక్ష్య కోచింగ్లక్ష్య బ్రాండుతో కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్న లెర్న్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 246 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 40 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఇష్యూ నిధులను కొత్తగా క్యాంపస్ల ఏర్పాటుతోపాటు.. సేల్స్, మార్కెటింగ్ కార్యక్రమాలకు, రుణ చెల్లింపులకు, దీర్ఘకాలిక క్యాంపస్ల లీజ్ చెల్లింపులకు వినియోగించనుంది.టీ కేఫ్..టీ కేఫ్ బ్రాండ్ స్టోర్ల నిర్వాహక కంపెనీ టీ పోస్ట్ త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.43 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ నిర్వహణలో కొత్తగా టీ కేఫ్ల ఏర్పాటుకు ప్రధానంగా ఐపీవో నిధులను వెచి్చంచే యోచనలో ఉంది.ఫోన్పే ప్రస్తుతానికి నోడిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. ప్రస్తుత రాజకీయ, భౌగోళిక వివాదాల నేపథ్యంలో ఐపీవో యోచనను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లు ఫోన్పే తాజాగా పేర్కొంది. యుద్ధ భయాల కారణంగా సెకండరీ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడటం తదితర అంశాలు దీనికి కారణంగా తెలియజేసింది. అయితే ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లలో నిలకడ కనిపిస్తే తిరిగి లిస్టింగ్ ప్రాసెస్కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. యుద్ధ ప్రభావానికి లోనవుతున్న ప్రాంతాలలో వేగంగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా ఫోన్పేను లిస్ట్ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
బంగారం ధరల్లో భారీ మార్పు.. సాయంత్రానికే కొత్త రేట్లు
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. సోమవారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం రూ.450 తగ్గి రూ.1,45,900 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.2050 క్షీణించి రూ.1,44,300 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర సోమవారం ఉదయం రూ.490 తగ్గి రూ.1,59,170 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.2240 కరిగి రూ. 1,57,420 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఉదయం స్వల్పంగా కేజీకి రూ.100 తగ్గిన వెండి సాయంత్రానికి రూ.4000 క్షీణించి రూ.2,76,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేశాయి.నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది. -
పతనమౌతున్న పసిడి.. మరింత తగ్గిన తులం బంగారం ధర
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) ఐదో రోజూ కూడా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 81 పాయింట్లు పెరిగి 23,227 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 244 పాయింట్లు ఎగబాకి 74,823 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.12 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.61 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.93 శాతం నష్టపోయింది.Today Nifty position 16-03-2026(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గణాంకాలు, ఫెడ్ సమీక్షపై దృష్టి
దేశ, విదేశీ గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష తదితరాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను బలహీనపరచిన పశ్చిమాసియా యుద్ధం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. ముడిచమురు ధరల పెరుగుదల ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తోంది. వెరసి మరోసారి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ బ్రెంట్ చమురు బ్యారల్ లండన్ మార్కెట్లో గత వారం 102 డాలర్ల ఎగువకు చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇరాన్, యూఎస్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, హుర్ముజ్ మార్గంలో నౌకల రవాణాకు అంతరాయాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా చమురు, గ్యాస్ సరఫరాల కొరత భారత్ను వేధిస్తోంది. నేడు(16న) చమురు ధరలు మరోసారి మండితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే వీలుంది. ఫెడ్ దారెటు? ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను బుధవారం(18న) ప్రకటించనుంది. గత పాలసీ సమీక్షలో యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ రేట్లు 3.5–3.75% వద్దే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, ప్రయివేట్ రంగ ఉపాధి, చమురు నిల్వల గణాంకాలు సైతం ఈ వారం విడుదల కానున్నాయి. వీటికితోడు పశి్చమాసియా యుద్ధం, ధరల పెరుగుదల తదితర అంశాలను ఫెడ్ పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆర్ధికవేత్తలు తెలియజేశారు. దేశీయంగా.. దేశీయంగా గత నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 10 నెలల గరిష్టం 3.21 శాతాన్ని తాకింది. నేడు టోకు ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 1.81 శాతం పెరిగింది. ఫిబ్రవరి నెలకు వాణిజ్య గణాంకాలు సైతం విడులకానున్నాయి. కాగా.. బ్రెంట్ చమురు 101 డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు పెరగనుంది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం బలహీనపడుతోంది. యుద్ధం కొనసాగితే చమురు, గ్యాస్ కొరత పెరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.సాంకేతికంగా చూస్తే ఈ వారం .. యుద్ధ భయాలు, చమురు ఆందోళనలు ఈ వారం సైతం మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి విశ్లేషణ ప్రకారం మార్కెట్లు మరింత బలహీనపడే అవకాశముంది. ⇒ ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,800–22,600 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఇక్కడి నుంచి బలపడకుంటే 22,200–22,100 పాయింట్లవరకూ పతనంకావచ్చు. ఒకవేళ బలాన్ని పుంజుకుంటే 23,700–23,900 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురయ్యే వీలుంది. 24,000 పాయింట్లు దాటితే మరింత పుంజుకోవచ్చు.గత వారం పతన బాటలోపశ్చిమాసియా యుద్ధం, చమురు ధరలు, రూపాయి క్షీణత ప్రభావంతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నికరంగా సెన్సెక్స్ 4,355 పాయింట్లు(5.5 శాతం) పతనమై 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 1,299 పాయింట్లు(5.3 శాతం) కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 4 శాతం స్థాయిలో క్షీణించాయి. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే సెన్సెక్స్ 6,723 పాయింట్లు(8.3 శాతం) పడిపోయింది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 34 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలుపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ నెల ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో నికరంగా రూ. 52,704 కోట్ల(5.73 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా గత 17 నెలల్లోనే అత్యధిక పెట్టుబడులు చేపట్టారు. అయితే చమురు ధరలు, యుద్ధ భయాలతో ఈ నెల నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. -
గ్లోబల్ షాక్స్ను తట్టుకునే టెక్నిక్ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక ఒడిదుడుకుల మధ్య భారత క్యాపిటల్ మార్కెట్లు బలంగా ఉన్నాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లు లోతుగా విస్తరిస్తున్నాయని, సూచీలపై ప్రపంచ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ మార్కెట్ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.స్వల్పకాలిక అలజడి.. దీర్ఘకాలిక లక్ష్యంగత రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు పాండే కీలక సూచన చేశారు. ‘మార్కెట్ ఒడిదొడుకులు చూసి ఆందోళన చెందకుండా, భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండాలి. రిటైల్ పెట్టుబడిదారులు ఓపికగా ఉండటమే అత్యుత్తమ వ్యూహం. గతంలో కూడా ఇలాంటి అంతరాయాల తర్వాత మార్కెట్లు తిరిగి బలంగా కోలుకున్నాయి’ అని ఆయన గుర్తుచేశారు. గత 18 నెలలుగా బెంచ్ మార్క్ సూచీలు పరిమిత రాబడిని అందించడం వల్ల ఇన్వెస్టర్లలో కొంత నిరాశ ఉన్నప్పటికీ ఇది తాత్కాలికమేనని ఆయన విశ్లేషించారు.ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకభారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ మన క్యాపిటల్ మార్కెట్లు కూడా పరిమాణం, సంక్లిష్టతలో అభివృద్ధి చెందుతున్నాయని పాండే హైలైట్ చేశారు. ‘సమర్థవంతమైన మార్కెట్లు కేవలం లాభాల కోసం మాత్రమే కాదు, అవి పారదర్శక ధరల ఆవిష్కరణకు, ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితులను గ్రహించడానికి సహాయపడతాయి. నమ్మకమే ఆర్థిక వ్యవస్థకు పునాది. అది లేకపోతే మూలధనం తగ్గిపోతుంది’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
క్యాష్, ట్రాష్, క్రాష్.. మార్కెట్పై కియోసాకి ట్వీట్
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' క్యాష్, ట్రాష్, క్రాష్ అంటూ.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలను గురించి వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్రాష్లో క్యాష్ అంటే ట్రాష్ కాదు అని ట్వీట్ ప్రారంభించిన కియోసాకి.. ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ స్టాక్స్, బాండ్స్ వంటివి విక్రయించి ఎందుకు బిలియన్ల కొద్దీ నగదుతో కూర్చున్నారు? అని ప్రశ్నించారు. దీనికి కారణం ''keeping his powder dry'' అనే వ్యూహం. అంటే మార్కెట్ పడిపోయిన తర్వాత మంచి కంపెనీలు లేదా విలువైన ఆస్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటిని కొనడానికి చేతిలో డబ్బు ఉండాలి.నా వ్యూహం ఏమిటంటే.. నా దగ్గర ఉన్న డబ్బును మరిన్ని ఆయిల్ వెల్స్, బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి పెట్టుబడుల్లో పెట్టాను. అంటే ప్రతి వ్యక్తి లేదా పెట్టుబడిదారుడు.. తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత కూడా బంగారం, వెండి, బిట్కాయిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు నా ఆలోచన తప్పుగా అనిపించవచ్చు. కానీ పెట్టుబడుల్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పడిపోయినప్పుడు మీ వద్ద స్పష్టమైన పెట్టుబడి ప్రణాళిక లేకపోతే, ఏమీ చేయకుండా ఉండటం కూడా ఒక మంచి నిర్ణయం కావచ్చు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని కియోసాకి స్పష్టం చేశారు.CASH is not TRASH in a CRASHQ: Why has Warren Buffet sold stocks and bonds and is sitting with billions in cash?A: Because he is “keeping his powder dry” a.k.a. He is in CASH so he can buy priceless assets….after the crash and are on sale. Q: Should you follow in…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 15, 2026 -
బంగారం ధరల రివర్స్!.. వారం రోజుల్లో..
బంగారం ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. గడచిన వారం రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేటు గణనీయంగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేట్లలో జరిగిన మార్పు గురించి, నేటి ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 9(సోమవారం)న 1,61,680 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, ఈ రోజుకి (మార్చి 15) 1,59,660 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ. 2020 తగ్గిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,48,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,46,350 వద్దకు (రూ.1850 తగ్గింది) చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో గణనీయంగా తగ్గింది. మార్చి 9న.. అంటే సోమవారం రోజు 1,61,830 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నేటికి (మార్చి 15) రూ.1,59,810 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఏడు రోజుల్లో రూ.2020 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,48,350 రూపాయల నుంచి రూ.1850 తగ్గి 1,46,500 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర వారం రోజుల్లో 1,63,090 రూపాయల దగ్గర నుంచి 1,61,020 రూపాయల దగ్గరకు చేరింది. వారం రోజుల్లో రూ. 2070 తగ్గిందన్నమాట. తులం 22 క్యారెట్ల బంగారం రేటు 1,49,500 రూపాయల నుంచి రూ. 1,47,600 వద్దకు (రూ.1900 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. మార్చి 9న రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు నేటికి (మార్చి 15) రూ.2.80 లక్షలకు చేరింది. వారం మధ్యలో రేట్ల పెరుగుదల, తగ్గుదల ఉన్నప్పటికీ.. మొత్తం మీద కేజీ రేటు 10,000 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది. -
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 14) పసిడి ధర గరిష్టంగా రూ.1030 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం బాటలోనే నేను కూడా అన్నట్టు.. వెండి అడుగులు వేసింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. -
అదే భయం... అదే పతనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతోపాటు.. చమురు ధరలు మండుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు బేర్మంటున్నాయి. వరుసగా మూడో రోజు అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,580 పాయింట్లు పడిపోయి 74,455కు చేరింది. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం నీరసించడం సెంటిమెంటును దెబ్బతీసింది.ముంబై: చమురు ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నాయి. దీనికితోడు ఇంధన కొరత ఆర్థిక వ్యవస్థల వృద్ధికి విఘాతం కలిగించనున్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసియాసహా అమెరికావరకూ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దేశీయంగా మూడో రోజూ మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1,471 పాయింట్లు పడిపోయి 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. మిడ్సెషన్కల్లా సెన్సెక్స్ 1,580 పాయింట్లు క్షీణించి 74,455 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 23,112 వరకూ నీరసించింది. మెటల్స్ మెల్టింగ్.. ఎన్ఎస్ఈలో అన్నిరంగాలూ నీరసించగా.. మెటల్స్ 5 శాతం పతనమైంది. క్రూడ్ సెగతో ఆటో, పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, కెమికల్స్ 3.6–2.7 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ 7.5 శాతం పడిపోగా.. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, గ్రాసిమ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టీఎంపీవీ, మారుతీ, ఎంఅండ్ఎం, ఐషర్, అల్ట్రాటెక్, యాక్సిస్ బ్యాంక్ 6–3 శాతం మధ్య డీలాపడ్డాయి. కేవలం టాటా కన్జూమర్, ఎయిర్టెల్ 2–1 శాతం బలపడ్డాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 102 డాలర్లకు ఎగువన కదులుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం పెరగనున్నట్లు తెలియజేశారు. చిన్న షేర్లు విలవిల తాజా అమ్మకాలతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 2.5 శాతం పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 3,439 నష్టపోగా.. కేవలం 858 లాభపడ్డాయి. నగదు విభాగంలో తాజాగా ఎఫ్పీఐలు రూ. 10,717 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 9,977 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 4 రోజుల్లోనూ ఎఫ్పీఐలు రూ. 24,320 కోట్లకుపైగా పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 27,450 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల 2–6 మధ్య సైతం ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే.మరో 10 లక్షల కోట్లు ఆవిరిఅమ్మకాల సునామీతో ఒక్క రోజులోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువకు రూ. 10.24 లక్షల కోట్ల మేర చిల్లు పడింది. రెండు వారాల్లో సెన్సెక్స్ 8.3% (6,723 పాయింట్లు) పతనంకాగా.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 33.68 లక్షల కోట్లు ఆవిరైంది. వెరసి మార్కెట్ క్యాప్ రూ. 429.82 లక్షల కోట్లు (4.65 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది. -
సాయంత్రానికి మళ్లీ తగ్గిన ధర.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇదే!
భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యుద్ధ సంక్షోభం : రూ. 19 లక్షల కోట్లు ఢమాల్!
Iran War: ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రం వచ్చినా, భౌగోళికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా ముఖ్యంగా యుద్ధం వచ్చిందంటే ముందుగా ప్రభావితమయ్యేది దేశీయ స్టాక్ మార్కెట్లు. తాజాగా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్య అనిశ్చితి, హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు సంక్షోభం భారత మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా గత నాలుగేళ్లలో అత్యంత దారుణమైన వారంగా ఈ వారం నిలిచింది. ఈ దారుణ పతనంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను కూడా బలహీనపరిచిందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.75వేల దిగువకు సెన్సెక్స్, మార్కెట్ క్యాప్ నష్టంఈ వారం వీకెండ్ శుక్రవారం రోజు సెన్సెక్స్ 1,442 పాయింట్లు కోల్పోయి 75వేల పాయింట్ల (74,592 పాయింట్ల వద్ద ముగిసింది)దిగువకు చేరింది. ఒక రోజులో దాదాపు రూ.9.8 లక్షల కోట్ల సందప తుడిచి పెట్టుకుపోయింది. ఫలితంగా రూ.19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ వాల్యుయేషన్ రూ.430 లక్షల కోట్లకు చేరింది. FIIలు అమ్మకాల భారీగా కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ టాటా స్టీల్ , SBI, భారత్ ఎలక్ట్రానిక్స్ , మారుతి టాప్ లూజర్స్గా నిలిచాయి. మునుపటి శుక్రవారం అంటే మార్చి 6న బీఎస్సీ సెన్సెక్స్ 78,918 వద్ద ముగిసింది. అప్పటి మార్కెట్ వాల్యుయేషన్ రూ.449.35 లక్షల కోట్లుగా ఉంది.ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్ వీడియో వైరల్నిఫ్టీ నష్టాలు ఇలా..ఇక నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 23,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి 5న నమోదైన గరిష్ట స్థాయి 26,373 పాయింట్లు. అంటే 10 శాతం క్షీణించింది. భారత మార్కెట్లు చివరిసారిగా ఈ స్థాయిలో నష్టాలను చవిచూసింది 2022 జూన్లో మాత్రమే. బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్కు 102 డాలర్లకు పెరగడం ఈ వారం పెట్టుబడిదారులకు ఒక పీడకల చెప్పవచ్చు.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలుయుద్ధం చమురు సంక్షోభం- మార్కెట్లు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు సరఫరాపై ప్రభావం ముడిచమురు ధరలను అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా, జపాన్, చైనా , హాంకాంగ్ల సూచీలు దిగువన ముగిశాయి. (తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్ మీడియా కథనాలు) -
మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక.. ఎన్ఎస్ఈ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్స్చేంజ్ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా 20 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. అంతేకాకుండా పలు లా, ఇంటర్మీడియెరీ సంస్థలను సైతం ఎంపిక చేసుకుంది. శ్రీనివాస్ ఇంజేటి అధ్యక్షతన ఎన్ఎస్ఈ ఐపీవో కమిటీ ఇందుకు అనుమతించింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఎస్ఈ బోర్డ్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐపీవోపై ముందుకెళ్లేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజా ఎంపికలను చేపట్టింది. ఎంపికైన మర్చంట్ బ్యాంకర్లలో కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ తదితరాలున్నాయి. -
మార్కెట్లు క్రాష్.. కియోసాకి సంచలన ట్వీట్!
చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.CRASH ACCELERATES:Private credit funds are panicked as investors withdraw their money.Major big name banks and brand name financial institutions are in trouble.Jim Rickards formally declares the US in the New Depression.What are you going to do?If you have followed my X…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 13, 2026కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలుమార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం నష్టంతో.. 74,563.92 వద్ద, నిఫ్టీ 468.70 పాయింట్లు లేదా 1.98 శాతం నష్టంతో 23,170.45 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, సుమిత్ వుడ్స్ లిమిటెడ్, సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కృతిక వైర్స్ లిమిటెడ్, ఎస్ఈపీసీ లిమిటెడ్, అకీ ఇండియా లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, లోరెంజిని అప్పారల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కరుగుతోన్న ఇన్వెస్టర్ల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు తగ్గి 23,422 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 694 పాయింట్లు దిగజారి 75,357 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.72బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.52 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.78 శాతం నష్టపోయింది.Today Nifty position 13-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గిఫ్ట్ సిటీ తొలి ఐపీవో తేదీ మార్పు
పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో గిఫ్ట్ సిటీ తొలి పబ్లిక్ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభంకానుంది. ఎగ్జిక్యూటివ్ లెర్నింగ్ సొల్యూషన్ల కంపెనీ ఎక్స్ఈడీ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఐపీవో నిజానికి ఈ నెల 6న ప్రారంభంకావలసి ఉంది. అయితే యుద్ధ అనిశ్చితుల కారణంగా తేదీలో మార్పు చేసింది.ఐఎఫ్ఎస్సీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటైన దేశీ ఐఎఫ్ఎస్సీ నుంచి తొలిసారి ఐపీవోకు వస్తున్న కంపెనీ 1.2 కోట్ల డాలర్ల సమీకరణపై కన్నేసింది. ఇందుకు షేరుకి 10–10.5 డాలర్ల ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ముగియనుంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు)సహా.. ఎన్ఆర్ఐలు తదితర అనుమతించిన ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు లక్ష్యంగా ఈ షేర్లు డాలర్ల రూపేణా ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్(గిఫ్ట్ సిటీ)లో లిస్ట్ కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సీనియర్ వృత్తి నిపుణులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సరీ్వసులు అందిస్తోంది. భారత్సహా.. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు విస్తరించింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 829.29 పాయింట్ల నష్టంతో 76,034.42 వద్ద, నిఫ్టీ 227.70 పాయింట్ల నష్టంతో 23,639.15 వద్ద నిలిచాయి.ఐసీడీఎస్ లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్, క్రియేటివ్ ఐ లిమిటెడ్, అవాన్మోర్ క్యాపిటల్ & మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్, అక్యూస్ లిమిటెడ్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా వస్తాయి. ముఖ్యంగా S&P 500 వంటి పెద్ద మార్కెట్ సూచీలు పడిపోయినప్పుడు (మార్కెట్ క్రాష్ జరిగినప్పుడు) చాలా మంది పెట్టుబడిదారులు డబ్బు కోల్పోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో మీరు డబ్బు కోల్పోయారా? లేక డబ్బు సంపాదించారా? అని ప్రశ్నించారు.మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ మంది పెట్టుబడిదారులు నష్టపోవడం సాధారణం. అయితే కొందరు పెట్టుబడిదారులు మాత్రం సరైన వ్యూహాలు, మంచి జ్ఞానం & అనుభవం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాభాలు పొందగలుగుతారు. అంటే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సరైన నిర్ణయాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవడం లేదా కొన్నిసార్లు లాభాలు కూడా పొందటం సాధ్యమే.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. మార్కెట్లో నష్టపోతే, అది కేవలం మార్కెట్ కారణంగా మాత్రమే కాదు. మనం నేర్చుకున్న విధానం, మనకు మార్గదర్శనం చేసిన వ్యక్తులు లేదా గురువులు కూడా కొంతవరకు కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో నేను అనుసరిస్తున్న గురువు లేదా నేర్చుకుంటున్న విధానం సరైనదేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది.ఇప్పుడు కూడా చాలా మంది పెట్టుబడిదారులు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఫైనాన్స్ & స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నారు. అక్కడ అనేక మంది ఫైనాన్స్ నిపుణులు, ట్రేడింగ్ గురువులు తమ అనుభవాలను & సూచనలను పంచుకుంటారు. కానీ అందరూ నిజంగా విజయవంతమైన పెట్టుబడిదారులే అని అనుకోవడం సరైంది కాదు. కొందరు ప్రసిద్ధ యూట్యూబర్లు కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద నష్టాలు చవిచూసి ఉండవచ్చు.అలాగే కొందరు తమ లాభాలను గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నిజమైన పెట్టుబడి విద్య అంటే కేవలం లాభాలను చూపించడం కాదు. మార్కెట్ ప్రమాదాలను అర్థం చేసుకోవడం, నష్టాలను ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు కోల్పోయినట్లయితే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది ఒక పాఠంగా తీసుకుని, మీ పెట్టుబడి పద్ధతిని తిరిగి పరిశీలించాలి. అవసరమైతే మంచి గురువులను, విశ్వసనీయమైన విద్యను ఎంపిక చేసుకోవాలి.మొత్తానికి, మార్కెట్ క్రాష్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సరైన జ్ఞానం, సరైన మార్గదర్శనం ఉంటేనే పెట్టుబడుల్లో దీర్ఘకాల విజయాన్ని సాధించవచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అనుసరించడం చాలా అవసరం. మార్కెట్లో నష్టాలు కూడా ఒక గురువు లాంటివే.. ఎందుకంటే అవి మనకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పిస్తాయి.S & P MARKET CRASH: Q: Did you lose money?Q: Did you make money?A: If you lost money is it time to change teachers?Q: Who do you follow on YouTube?A: I could name some YouTube financial rock stars who lost a lot of money.But that would not be cool.And I could…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2026 -
డబుల్ రిలీఫ్.. పసిడి, వెండి ప్రియులకు ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్ సూచీలు నేల చూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 255 పాయింట్లు తగ్గి 23,606 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 పాయింట్లు దిగజారి 76,045 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.92 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.08 శాతం పెరిగింది.Today Nifty position 12-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ ఫోకస్లోకి ఈక్విటీ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరిలో మెరిశాయి. అంతకుముందు రెండు నెలల్లో వరుస క్షీణత తర్వాత మెరుగైన పెట్టుబడులు నమోదయ్యాయి. రూ.25,978 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.24,028 కోట్ల కంటే 8 శాతం అధికం. 2025 డిసెంబర్లో రూ.28,054 కోట్లు, నవంబర్లో రూ.29,911 కోట్ల చొప్పున పెట్టుబడులు రావడం గమనార్హం. ఫిబ్రవరి చివరికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.82.3 లక్షల కోట్లకు చేరుకుంది. జనవరి చివరికి ఈ మొత్తం రూ.81 లక్షల కోట్లుగానే ఉంది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య దేశీ ఈక్విటీలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న తరుణంలోనూ ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడుల రాక వారిలోని విశ్వాసానికి నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. విభాగాల వారీ..ఫిబ్రవరిలో ఫండ్స్ పరిశ్రమలో 42.58 లక్షల కొత్త ఫోలియోలు నికరంగా పెరిగాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే గుర్తింపు సంఖ్యను ఫోలియోగా చెబుతారు. అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.6,295 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఏడో నెలలోనూ ఈ పథకాలు మెరుగైన పెట్టుబడులను రాబట్టాయి.మిడ్క్యాప్ ఫండ్స్ రూ.4,003 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ సైతం రూ.3,881 కోట్లు ఆకర్షించి మెరిశాయి.సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్లోకి రూ.2,987 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో కొత్త ఫండ్ ఆఫర్లు (ఎన్ఎఫ్వో) ఇన్వెస్టర్ల నుంచి రూ.3,995 కోట్లను సమీకరించాయి. ముఖ్యంగా సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ విభాగంలో ఆరు ఎన్ఎఫ్వోలు కలిపి రూ.3,560 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఒక లార్జ్క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో రూ.324 కోట్లు, మిడ్క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో రూ.71 కోట్ల చొప్పున సమీకరించాయి.కళ తప్పిన వెండి ఈటీఎఫ్లు వెండి ఈటీఎఫ్లు జవనరిలో రూ.9,463 కోట్లను ఆకర్షించి రికార్డు సృష్టించగా.. ఫిబ్రవరిలో పరిస్థితి తలకిందులైంది. ఇన్వెస్టర్లు నికరంగా రూ.826 కోట్లను వెండి ఈటీఎఫ్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. 2023 నవంబర్ తర్వాత వెండి ఈటీఎఫ్ల నుంచి పెబ్టుబడులు బయటకు వెళ్లిపోవడం ఇదే మొదటిసారి.బంగారం ఈటీఎఫ్ల్లోకి రూ.5,255 కోట్లు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.24,039 కోట్లు, 2025 డిసెంబర్లో వచ్చిన రూ.11,647 కోట్లతో పోలి్చతే గణనీయంగా తగ్గాయి. వెండి, బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణికి గురైనట్టు తెలుస్తోంది. ఇండెక్స్ ఫండ్స్లోకి రూ.3,233 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్ ఫండ్స్ రూ.42,106 కోట్లను ఆకర్షించాయి. జనవరిలో వచి్చన రూ.74,827 కోట్లతో పోలిస్తే తగ్గాయి.పటిష్టంగానే సిప్ పెట్టుబడులుఫిబ్రవరిలో సిప్ పెట్టుబడులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. బలంగానే నమోదయ్యాయి. రూ.29,845 కోట్లను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టారు. జనవరిలో ఇవి రూ.31,002 కోట్లుగా ఉన్నాయి. అయినప్పటికీ ఫండ్స్ నిర్వహణలోని సిప్ ఆస్తుల విలువ నెలవారీగా 1.7 శాతం పెరిగి రూ.16.64 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో 20.3 శాతం సిప్ రూపంలోనే వచి్చనవే కావడం గమనార్హం. సిప్ల నిలిపివేత 76 శాతంగా ఉంది. జనవరిలో నిలిపివేత 74 శాతం కంటే స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం సిప్ పెట్టుబడులు తగ్గడానికి కారణమని యాంఫి సీఈవో వెంకట్ ఎన్ చలసాని తెలిపారు. 29, 30, 31వ తేదీల్లోని సిప్ వాయిదాలు మార్చి నెలలో ప్రాసెస్ అవుతుంటాయని చెప్పారు.సిఫ్కు భలే ఆదరణసంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలోనే అధిక రాబడి కోరుకునే వారి కోసం తీసుకొచ్చిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) నిర్వహణ ఆస్తులు ఫిబ్రవరిలో రూ.9,711 కోట్లకు పెరిగాయి. జనవరితో పోల్చితే 47.9 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఫండ్స్లో కనీసం రూ.10 లక్షల ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ విభాగంలోకి నికరంగా రూ.3,127 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మూడు కొత్త సిఫ్లు ప్రారంభమయ్యాయి. రెండు ఈక్విటీ స్ట్రాటజీ సిఫ్లు రూ.916 కోట్లు, ఒక హైబ్రిడ్ స్ట్రాటజీ సిఫ్ రూ.436 కోట్లను సమీకరించాయి.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే! -
ఆసియా మార్కెట్లు ఢమాల్..
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేడు భారత స్టాక్ మార్కెట్ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. నేడు (గురువారం) ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా స్టాక్ మార్కెట్ సూచీలు భారీ పతనం దిశగా పయనిస్తుండటంతో మన దేశీయ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నేడు గ్యాప్ డౌన్తో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆసియా మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జపాన్ సూచీ నిక్కీ, కోస్పీ-దక్షిణ కొరియా మార్కెట్, గిఫ్ట్ నిఫ్టీ.. వంటి ముందస్తు దిక్సూచిగా భావించే సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇది భారత మార్కెట్లు కనీసం 1.5% నుంచి 2% నష్టంతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలుఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ద్రవ్యోల్బణ ముప్పుగా పరిణమించనుంది.గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్ల ర్యాలీకి బ్రేక్ పడింది. టెక్ దిగ్గజాల వాల్యుయేషన్లపై అనుమానాలు మొదలవడంతో అంతర్జాతీయ స్థాయిలో టెక్ షేర్లను ఇన్వెస్టర్లు వదిలించుకుంటున్నారు.భారత మార్కెట్పై ప్రభావం ఎలా ఉండబోతోంది?నిపుణుల అంచనా ప్రకారం.. మార్కెట్ అవర్స్లో బ్యాంక్ నిఫ్టీ, ఐటీ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మార్కెట్లు పడిపోతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నేడు బంగారం పెరిగే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడవచ్చు.‘ప్రస్తుత అస్థిరత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం లేదా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ పతనాన్ని అవకాశంగా మార్చుకోవడం ఉత్తమం’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే! -
పడగొట్టిన పశ్చిమాసియా
ముంబై: యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు చేసిన ప్రకటనపై స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే విశ్వాసాన్ని కోల్పోయాయి. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. వెరసి సెన్సెక్స్ 1,342 పాయింట్లు పతనమైంది. 76,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయి 23,867 వద్ద నిలిచింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ విలువలో రూ. 5.14 లక్షల కోట్లు ఆవిరైంది. తొలుత ఆసియా మార్కెట్ల సానుకూలతలతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చమురు ధరల సెగతో వెనువెంటనే డీలా పడ్డాయి. ఉదయం లండన్ మార్కెట్లలో బ్రెంట్ చమురు ధర పీపాకు 6 శాతం ఎగసింది. 93 డాలర్లకు చేరింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభంకావడంతో మిడ్సెషన్ నుంచీ సెంటిమెంటు మరింత బలహీనపడింది. ఫలితంగా సమయం గడిచేకొద్దీ అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో చివర్లో సెన్సెక్స్ 1,447 పాయింట్లు పడిపోయి 76,759ను తాకగా.. నిఫ్టీ 23,834వరకూ క్షీణించింది. ఫైనాన్స్, ఆటో వీక్..: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, కెమికల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ 3–1% మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ, మారుతీ, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, టీఎంపీవీ, టీసీఎస్, ఎయిర్టెల్ 5–2% మధ్య డీలాపడ్డాయి..గ్యాస్, జల్ జీవన్ పుష్.. గ్యాస్ కొరత ప్రభావంతో అదానీ టోటల్ గ్యాస్ 18 శాతం ఎగసింది, ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరగడంతో టీటీకే ప్రెస్టీజ్, స్టవ్క్రాఫ్ట్ షేర్లు 12 శాతం చొప్పున జంప్చేశాయి. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్కు మరింత మద్దతివ్వడంతో శక్తి పంప్స్, రోటో పంప్స్, జైన్ ఇరిగేషన్, జిందాల్ సా, ఎన్విరో ఇన్ఫ్రా, ఇండియన్ హ్యూమ్ పైప్, ఎస్పీఎంఎల్ తదితరాలు 20–13 శాతం మధ్య దూసుకెళ్లాయి.సెడెమాక్ లిస్టింగ్ భేష్ పతన మార్కెట్లోనూ ఆటో విడిభాగాల(పవర్ట్రెయిన్ కంట్రోల్స్) తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1,352తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 1,535 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 13.5 శాతం అధికం కాగా.. బీఎస్ఈలో 12 శాతం లాభంతో రూ. 1,510 వద్ద లిస్టయ్యింది. చివరికి 7.4 శాతం బలపడి రూ. 1,452 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్లో ‘బ్లడ్ బాత్’
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ ఏకంగా 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1342 పాయింట్లు దిగజారి 76,863 వద్దకు చేరింది. దీంతో మార్కెట్లో ఈ ఒక్కరోజే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనట్లు అయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. ఈరోజు (మార్చి 11, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రధానంగా ఎనర్జీ, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడి సూచీలను పాతాళానికి నెట్టింది.సూచీల పతనానికి ప్రధాన కారణాలుఇంధన సంక్షోభం: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు మార్కెట్ను భయపెట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతోంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశానికి పెద్ద దెబ్బగా మారింది.ఎనర్జీ సెక్టార్లో అమ్మకాలు: ముడిచమురు ధరల పెరుగుదల వల్ల ముడి పదార్థాల వ్యయం పెరుగుతుందన్న ఆందోళనతో ఎనర్జీ ఇండెక్స్ ఏకంగా కుప్పకూలింది.ఎఫ్ఐఐల విక్రయాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల వారు సురక్షితమైన బాండ్లు, బంగారం వైపు మళ్లుతుండటంతో దేశీయ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోతోంది.రూపాయి రికార్డు పతనం: చమురు దిగుమతుల కోసం డాలర్లకు డిమాండ్ పెరగడం, ఎఫ్ఐఐల నిష్క్రమణతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇది దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను పెంచి, దేశీయ ద్రవ్యోల్బణానికి దారితీస్తుందన్న భయం నెలకొంది.కీలక రంగాలు పతనం: బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రెడ్ మార్క్లో ట్రేడయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ ఉన్న షేర్లు నష్టపోవడం సూచీల పతనానికి ఆజ్యం పోసింది.ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉంది. నిఫ్టీకి 23,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, చమురు ధరలు తగ్గితే తప్ప తక్షణ రికవరీ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ అస్థిర సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నాణ్యమైన షేర్లలో సిప్ పద్ధతిని కొనసాగించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు తగ్గి 24,221 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు దిగజారి 77,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.82బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.65 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.21 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.01 శాతం పెరిగింది.Today Nifty position 11-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ కూల్.. బుల్ చల్!
వారం రోజులుగా భగభగలాడి చప్పున చల్లారిన చమురు ధరలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ అయ్యాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లు 2 శాతంపైగా బలపడటంతో దేశీయంగానూ ఇండెక్సులు జోరందుకున్నాయి. వెరసి ఒక దశలో సెన్సెక్స్ 960 పాయింట్లు జంప్చేసింది.ముంబై: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ సంక్షోభం త్వరలోనే ముగియనున్న అంచనాలకుతోడు.. ముడిచమురు ధరలు ఒక్కసారిగా చల్లబడటంతో ప్ర పంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్లు పైకెగశాయి. సెన్సెక్స్ 640 పాయింట్లు జంప్చేసి 78,206 వద్ద ముగిసింది. నిఫ్టీ 234 పాయింట్లు జమ చేసుకుని 24,262 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు 5–2 శాతం మధ్య పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు జోష్వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 960 పాయింట్లు ఎగసి 78,526ను తాకగా.. నిఫ్టీ 24,303వరకూ బలపడింది. ఐటీ డీలా ఎన్ఎస్ఈలో ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్(0.4 శాతం)మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ముందురోజు పతనమైన ఆటో, బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్ 3–1.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 8 శాతం దూసుకెళ్లగా.. ఇండిగో, ఎంఅండ్ఎం, ఐషర్, టీఎంపీవీ, ఐసీఐసీఐ, మారుతీ, యాక్సిస్, అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ 3.5–2.5 శాతం మధ్య జంప్చేశాయి. బ్లూచిప్స్లో ఇన్ఫోసిస్, ఎటర్నల్, రిలయన్స్, ఎయిర్టెల్, టీసీఎస్ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.4–0.4 శాతం మధ్య నీరసించాయి. చల్లారిన చమురు...ఉదయం సెషన్లో లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు పీపా ధర 9 శాతం పతనమై 90 డాలర్లకు చేరగా.. న్యూయార్క్లో లైట్ స్వీట్ చమురు బ్యారల్ 87 డాలర్లకు దిగివచ్చింది. ఫలితంగా ఏవియేషన్, ఆటో, బ్యాంకింగ్ తదితర రంగాల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. పశి్చమాసియా ఆందోళనలకు త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సా హం లభించినట్లు తెలియజేశారు. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 3,053 లాభపడితే.. 1,231 మాత్రమే డీలా పడ్డాయి. ఎఫ్పీఐల వెనకడుగు ఇటీవల దేశీ స్టాక్స్లో అమ్మకాలకే మొగ్గు చూపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) నగదు విభాగంలో తాజాగా రూ. 4,673 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ (డీఐఐలు) మాత్రం రూ. 6,333 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం ఎఫ్పీఐలు రూ. 6346 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 9,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల తొలి నాలుగు రోజుల్లో(2–6)నూ ఎఫ్పీఐలు రూ. 21,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించడం గమనార్హం.రూపాయి రయ్.. 36 పైసలు అప్– 91.85కు చమురు ధరలు దిగిరావడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చింది. డాలరుతో మారకంలో 36 పైసలు బలపడింది. వెరసి చరిత్రాత్మక కనిష్టం 92.21 నుంచి కోలుకుని 92 దిగువన 91.85 వద్ద ముగిసింది. రోజంతా 91.71– 92.19 మధ్య ఊగిసలాడింది. సోమవారం 39 పైసలు క్షీణించి 92.21 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ సైతం 0.5 శాతం క్షీణించి 98.65కు చేరింది.ఎరువుల షేర్లకు బలిమి గ్యాస్ కేటాయింపులలో ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ తదుపరి ఎరువులకు ద్వితీయ ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఫెర్టిలైజర్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో రాష్ర్టీయ కెమికల్స్(ఆర్సీఎఫ్) 16%, నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) 13%, దీపక్ ఫెర్టిలైజర్స్, పారదీప్ ఫాస్ఫేట్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ 5%, కోరమాండల్ ఇంటర్నేషనల్ 4% చొప్పున దూసుకెళ్లాయి. -
2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.REPEATING A WARNINGIn Rich Dad’s Prophecy (2013) I warned the biggest stock market crash in history….was STILL coming.In 2026, I hope I am wrong…. Yet I am afraid that crash is now arriving.Why did I make that prediction?Because the cause of the 2008 crash, the GFC,…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 10, 2026ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 92 పాయింట్లు పెరిగి 24,127 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 334 పాయింట్లు ఎగబాకి 77,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 93.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.83 శాతం పుంజుకుంది.నాస్డాక్ 1.38 శాతం పెరిగింది.Today Nifty position 10-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెండి కిందికి.. బంగారం పైకి..
న్యూఢిల్లీ: వెండి వరుసగా మూడో రోజు అమ్మకాలతో నష్టపోయింది. ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.3,400 తగ్గి (1.3 శాతం) రూ.2,68,300 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.1,64,300 స్థాయికి చేరింది.‘‘ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరోసారి తీవ్రతరమయ్యాయి. దీంతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు జాప్యం కావొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఈ పరిస్థితులు యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్కు మద్దతునిస్తున్నాయి. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ఔన్స్కు 65 డాలర్లు నష్టపోయి 5,105 డాలర్ల స్థాయిలో, వెండి ఔన్స్కు అర డాలర్ తగ్గి 83.92 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మార్కెట్వ్యాప్తంగా అమ్మకాలతో మార్జిన్కాల్స్ ఎదురై, పొజిషన్లను బలవంతంగా విక్రయించుకోవాల్సి రావడం సైతం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించినట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. -
పేకమేడల్లా కుప్పకూలిన సూచీలు.. కారణాలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1424 పాయింట్లు దిగజారి 77,494 వద్దకు చేరింది.భారత స్టాక్ మార్కెట్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పేకమేడల్లా కూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల సెన్సెక్స్, నిఫ్టీలను పాతాళానికి నెట్టేశాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు ఒకనొక సమయంలో రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలుగత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించడం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగింది.యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్స్ 4.20% స్థాయికి చేరడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన అమెరికా బాండ్ల వైపు మళ్లుతున్నాయి.వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’ -
స్టాక్ మార్కెట్ క్రాష్.. రూ.12 లక్షల కోట్లు ఆవిరి!
గత వారం నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ఉదయం కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా దాదాపు 3% పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 2,400 పాయింట్లు పడిపోయి 76,424కి చేరుకోగా, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా పడిపోయి 23,750కి చేరుకుంది.బీఎస్ఇలో జాబితా చేసిన అన్ని కంపెనీల మొత్తం.. మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి ప్రారంభమైన 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే రూ.12.39 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. సెన్సెక్స్లోని అన్ని భాగాలు నష్టాల్లో కూరుకున్నాయి. ఇండిగో షేర్లు దాదాపు 8% నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్ అండ్ టి, ఎస్బీఐ, మారుతి సుజుకి & ఎటర్నల్ షేర్లు వరుసగా 5% నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 5% కంటే ఎక్కువ పడిపోయి భారీ నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ ఆటో దాదాపు 4% పడిపోయింది, నిఫ్టీ రియాలిటీ అండ్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 3% పైగా పడిపోయాయి.పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు ప్రపంచం ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో ధరల పెరుగుదల శాశ్వతం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. -
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. తులం గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1960 తగ్గింది. కేజీ వెండి రేటు రూ.5000 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. -
బేర్మన్న స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో ప్రారంభం!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 2,284.27 పాయింట్లు లేదా 2.89 శాతం నష్టంతో 76,634.63 వద్ద, నిఫ్టీ 703.35 పాయింట్లు లేదా 2.88 శాతం నష్టంతో 23,747.10 వద్ద సాగుతున్నాయి.క్యుపిడ్ లిమిటెడ్, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ & హాలిడేస్ లిమిటెడ్, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషసాయి టెక్నాలజీస్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్ టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జింకుశల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ట్రిజిన్ టెక్నాలజీస్ లిమిటెడ్, నోయిడా టోల్ బ్రిడ్జ్ కంపెనీ లిమిటెడ్, మీషో లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
Stock Markets: ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలిపుడు?
గల్ఫ్ అంటేనే చమురు మార్కెట్కు హృదయం లాంటిది. అలాంటి గల్ఫ్లో పెద్ద దేశంగా చెలామణి అవుతున్న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లనే కాదు... స్టాక్ మార్కెట్లనూ అతలాకుతలం చేస్తున్నాయి. దేశానికి కావలసిన ముడి చమురులో 88 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్పైనా ఈ ప్రభావం పడుతోంది. మార్కెట్లు అనూహ్యంగా కదులుతున్నాయి. సూచీలు రోజూ 1–2 శాతం పడటం... కొంత రికవరీ కావటం జరుగుతోంది. ఇక కొన్ని షేర్లయితే దారుణంగా పడ్డాయి.ఐటీ సహా పలు షేర్లు మూడేళ్ల కనిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ల నుంచి విత్డ్రా అయి సురక్షిత సాధనాలవైపు మళ్లాలా? లేక మరికొంత ఇన్వెస్ట్ చేయాలా? సిప్లు ఆపేయాలా? కొనసాగించాలా? అసలు యుద్ధ ప్రభావం ఎన్నాళ్లుంటుంది? గతంలో యుద్ధాలు జరిగినపుడు మార్కెట్లు ఎలా స్పందించాయి? ఎన్నాళ్లకు కోలుకున్నాయి? వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లకు అవగాహన కలిగించడానికే ఈ ‘వెల్త్’ స్టోరీ...భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లవైపు వెళ్లటం పెరిగిన నాటి నుంచీ... అంటే 1990ల నుంచీ చాలా యుద్ధాలు, సంక్షోభాలు వచ్చాయి. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పటి ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ వరకూ పలు యుద్ధాలతో పాటు.. కోవిడ్ వంటి అంతర్జాతీయ సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినపుడు మార్కెట్లు తక్షణ స్పందనగా పతనమయ్యాయి. ఆ పతనం కొన్ని సార్లు భారీగా ఉంటే... మరికొన్నిసార్లు తక్కువగానే కనిపించింది. కోలుకోవటానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడితే... కొన్నిసార్లు వేగంగానే రికవరీ అయ్యాయి. మరో అద్భుతం ఏంటంటే ప్రతి యుద్ధం... ప్రతి సంక్షోభం ఓ కొత్త చరిత్రకు మార్గం చూపించింది. 1991 గల్ఫ్ యుద్ధం: సంస్కరణలకు మార్గం గల్ఫ్ యుద్ధ సమయంలో చమురు ధరలు 17 డాలర్ల నుంచి 36 డాలర్లకి ఎగబాకాయి. అంటే రెట్టింపుకన్నా ఎక్కువ. పైపెచ్చు మన దగ్గర చాలినంత విదేశీ కరెన్సీ నిల్వలు లేవు. దీంతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురయింది. సెన్సెక్స్ సుమారు 21శాతం పతనమైంది. అయితే ఇదే సమయంలో భారతదేశంలో కొత్త చరిత్ర మొదలైంది. నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తెచ్చింది. ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా కొత్త భారతదేశం ఆవిష్కృతమయ్యింది. 1990ల చివరినాటికి మార్కెట్ కొన్ని రెట్లు పెరిగింది. 2000 డాట్కామ్ బబుల్: సుదీర్ఘ రికవరీ ఇంటర్నెట్ కంపెనీలు పుట్టగొడుగులుగా వచ్చి... వాటికి సరైన ఆదాయ మార్గాలు లేకపోవటంతో మూతపడాల్సి వచ్చిన సమయమది. డాట్కామ్ బుడగ బద్దలయింది. కంపెనీలు మూతపడ్డాయి. ఈ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 6,150 పాయింట్ల నుంచి 2,594 పాయింట్లకి పడిపోయింది. రికవరీకి రెండున్నరేళ్లకు పైగానే (దాదాపు 850 రోజులు) పట్టింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సాగిన రికవరీ ఇది.అయితే ఈ కాలంలో ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటం... ద్రవ్యపరంగా క్రమశిక్షణ పాటించటం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిచ్చాయి. 2004 తర్వాత మళ్లీ బలమైన బుల్ రన్ ప్రారంభమైంది. మార్కెట్ల రికవరీని పక్కనబెడితే... డాట్కామ్ విప్లవం వల్ల ప్రపంచాన్ని కనెక్ట్ చేసే బలమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పడింది. సముద్రగర్భ కేబుళ్లతో పాటు విస్తృతమైన నెట్వర్క్ వచ్చింది. అది తరువాతి కాలంలో ప్రపంచ గతినే మార్చేసింది. 2008 ఆర్థిక మాంద్యం: భారీ పతనంఅమెరికాలో సబ్ప్రైమ్ సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసిన సమయమది. లేమన్ బ్రదర్స్తో మొదలుపెట్టి పలు ఆర్థిక సంస్థలు అప్పులు రికవరీ అయ్యే పరిస్థితి లేక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆర్థిక దిగ్గజాలు బోర్డు మూసేశాయి. పొదుపుపై నిలబడ్డ భారత వ్యవస్థ దేశంలో ఏ ఆర్థిక సంస్థా కుప్పకూలకుండా కాపాడినా... భారత్కు కూడా మాంద్యం తాకిడి తప్పలేదు.ఫలితంగా సెన్సెక్స్ 21,206 పాయింట్ల నుంచి 7,697 పాయింట్లకు పతనమైంది. అంటే దాదాపు 64% పతనం. అప్పట్లో స్టాక్ మార్కెట్ యుగం ముగిసినట్టే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆర్బీఐ లిక్విడిటీ మద్దతు, ప్రభుత్వ ఆరి్ధక ఉద్దీపన ప్యాకేజీలు, ఇన్ఫ్రా పెట్టుబడులు మార్కెట్కు మళ్లీ ఊపిరి పోశాయి. 750 రోజుల్లో సెన్సెక్స్ తిరిగి పాత గరిష్ట స్థాయికి చేరింది. ఈ సంక్షోభం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో స్రూ్కటినీని పెంచటంతో పాటు కొత్త పెట్టుబడి సాధనాలకు మార్గం చూపించింది. 2020 కోవిడ్: వేగవంతమైన రికవరీ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేయటంతో అంతర్జాతీయంగా స్టాక్మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ప్రపంచం లాక్డౌన్ అయింది. సెన్సెక్స్ 39 శాతం పతనమైంది. కానీ కేవలం 230 రోజుల్లోనే తిరిగి పాత గరిష్ఠ స్థాయిని చేరుకుంది. కాకపోతే ఈ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్వైపు నడిపించింది. సోషల్ మీడియాను కొత్త శిఖరాలకు చేర్చింది. పేమెంట్ల వ్యవస్థను, కార్యాలయాల్లో పనిచేసే పద్ధతిని సమూలంగా మార్చేసింది. ఇప్పుడు చూస్తున్న చాలా మార్పులు కోవిడ్ ఫలితమేనంటే అతిశయోక్తి కాదు. 2022 రష్యా– ఉక్రెయిన్ యుద్ధం: ద్రవ్యోల్బణ షాక్ ఉక్రెయిన్పై రష్యా దాడులకు దిగటంతో ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్ల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు 8 శాతం దాకా పతనమయ్యాయి. అయితే దేశం 6 నెలల్లో ఈ యుద్ధ ప్రభావం నుంచి కోలుకోగలిగింది. ఉక్రెయిన్ ఉద్రిక్తత కారణంగా భారత్ తన సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చుకుంది. గ్లోబల్ యుద్ధాల్లో నిలబడే శక్తిని సమకూర్చుకుంది. 2023–2026 అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలు పది రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్పై దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా ఖమేనీని క్షిపణి దాడులతో హతమార్చాయి. ఇరాన్ ప్రతి దాడులకు దిగటంతో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసింది. ఈ యుద్ధం ఫలితంగా ముడి చమురు ధరలు గడిచిన వారం రోజుల్లోనే 36 శాతం వరకూ పెరిగాయి. దీని ప్రభావం భారత్పై ఎక్కువే కావటంతో స్టాక్ మార్కెట్లు విపరీతంగా ఊగిసలాటకు గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నారు. ఈ యుద్ధం ఆరంభానికి ముందు 26,300 పాయింట్లను తాకిన నిఫ్టీ... దాదాపు 1,800 పాయింట్లు నష్టపోయింది. అంటే దాదాపు 7 శాతం పతనమైంది. యుద్ధం ఇంకా కొనసాగుతోంది. భారత్పై యుద్ధ ప్రభావాలు ఒకప్పటిలా ఉండే అవకాశం తక్కువ, ఎందుకంటే..⇒ సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా భారీ ఫారెక్స్ రిజర్వులున్నాయి. ⇒ పొదుపు ఆధారితం నుంచి వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. ⇒ రూపాయి కదలికలను – లిక్విడిటీని నియంత్రించే సామర్థ్యం రిజర్వ్బ్యాంకుకు ఉండడం. ⇒ దేశీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?సంక్షోభాల గురించి స్టాక్మార్కెట్లు చెబుతున్నదొకటే. పతనం తాత్కాలికం. ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంటే మార్కెట్లూ పెరుగుతాయి. నిపుణుల సూచన ప్రకారం... ఇప్పటికే మార్కెట్లు కొంత పడ్డాయి. భారీగా లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు తాత్కాలికంగా కొంతవరకూ వెనక్కి తీసుకున్నా పర్వాలేదు. కానీ నష్టాల్లో వైదొలగటం అనేది సరైన నిర్ణయం కాదు. మార్కెట్ల పతనం అనేది మరింత పెట్టుబడులకు అవకాశంగానే భావించాలి తప్ప ఉపసంహరణకు కాదు. సిప్ చేస్తున్నవారు మార్కెట్లు మరింత పతనమైతే మరింత పెట్టుబడి పెట్టే మార్గాన్ని పరిశీలించుకోవాలి. దిగువ స్థాయిల్లో సిప్ను కొనసాగిస్తేనే మంచి లాభాలు కళ్లచూస్తారు. యుద్ధాలు, సంక్షోభాలు ప్రతికూలం (నష్టపోయే రంగాలు)⇒ ఏవియేషన్⇒ ఆటోమొబైల్స్ ⇒ కెమికల్స్ ⇒ ఆయిల్ ఆధారిత పరిశ్రమలుఅనుకూలం (లాభపడే రంగాలు)⇒ డిఫెన్స్ సంబంధిత కంపెనీలు ⇒ ఎఫ్ఎంసీజీ సంస్థలు ⇒ ఫార్మా కంపెనీలు⇒ చమురు అన్వేషణ సంస్థలు ⇒ గోల్డ్ సంబంధిత పెట్టుబడులు -
పతనమైన వెండి.. రూ.35 వేలు తగ్గిన రేటు!
భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ సిల్వర్ రేటు వారం రోజుల్లో సుమారు రూ. 35వేలు తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ సిల్వర్ ధరల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.మార్చి 1న రూ.3.25 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు మార్చి 7 నాటికి రూ.2.90 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.35వేలు తగ్గిందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.85 లక్షల దగ్గర ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉందని తెలుస్తోంది.ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నవేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయనుకుంటే.. మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం తాత్కాలికం మాత్రమే. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పడిపోయిన పసిడి ధరలు.. వారమంతా ఆనందమే!
పసిడి ప్రియులకు గడిచిన వారమంతా ఆనందమే కలిగింది. దేశంలో బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా ధరలు పడిపోవడంతో పసిడి కొనే వారికి భారీ ఊరట లభించింది. గత వారంలో, అంటే మార్చి 2 నుంచి మార్చి 8 వరకు దాదాపు వారమంతా పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి. ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా ఒత్తిడికి గురయ్యాయి, దీంతో స్థానికంగా కూడా ధరలు పడిపోయాయి.ధరలు దిగొచ్చాయిలా..హైదరాబాద్, విశాఖ పట్నం సహా తెలుగు రాష్ట్రాలలో గత వారం బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.. మార్చి 2న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,70,510 ఉండగా మార్చి 8 నాటికి రూ.1,63,640 లకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మార్చి 2న రూ. 1,56,300 ఉండగా మార్చి 8 నాటికి రూ.1,50,000 లకు క్షీణించింది.అంటే వారం మొత్తంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,300 తగ్గుదలను నమోదు చేసింది. ఈ వారంలో ధరలు రోజుకు రోజూ తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో భారీ తగ్గుదల నమోదైంది. తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నా మొత్తంగా వారం అంతా క్షీణతే కనిపించింది. మార్చి 8న మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి.బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుఅంతర్జాతీయంగా బంగారం ధరలు మార్చి ప్రారంభంలో రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి (ఔన్స్కు సుమారు 5,400 డాలర్ల పైన). కానీ తర్వాత అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, మిడిల్ ఈస్ట్ ఘర్షణల నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ భయాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాల మార్పు వల్ల సేఫ్-హెవెన్ డిమాండ్ తగ్గింది. ఇది బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చింది. అలాగే, కొన్ని రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్, స్పెక్యులేటివ్ సెల్లింగ్ కూడా జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యుద్ధ ఆయుధాలు బంగారంతో.. కియోసాకి ట్వీట్
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనంయుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.TRAGICALLY: War is profitable.Still in Vietnam seeking personal answers to a war we should never have entered.FYI: I served in Vietnam twice, once in 1966-67 as a student and 71-72 as a US Marine Corps pilot. In 2026 I still do not know why we fought in Vietnam.I know…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 7, 2026 -
పసిడి ఆనందం ఆవిరి.. ఒక్కసారిగా రేట్లు రివర్స్!
దేశంలో పసిడి కొనుగోలుదారుల ఆనందం ఆవిరైంది. ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..( బంగారంపై భారీ డిస్కౌంట్.. దుబాయ్ బంగారానికి ఏమైంది? )(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
చమురు సలసల.. మార్కెట్ విలవిల!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ భయాలు, ముడిచమురు ధరల సెగ కలగలసి మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్ 79,000 పాయింట్ల స్థాయిని కోల్పోగా.. నిఫ్టీ 24,500 పాయింట్ల దిగువన స్థిరపడింది. ముంబై: ముడిచమురు ధరలు మండుతుండటంతో దిగుమతుల బిల్లు పెరగడంతోపాటు.. రూపాయి బలహీనపడనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆపై యూరోపియన్ మార్కెట్ల క్షీణతతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 1,097 పాయింట్లు పతనమై 78,919 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్ల (ఫ్యూచర్స్) నష్టాలు, క్రూడ్ భగభగలు సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో మిడ్సెషన్ నుంచీ మార్కెట్లు మరింత నీరసించాయి. చివరి సెషన్లో సెన్సెక్స్ 78,812 వద్ద, నిఫ్టీ 24,416 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.బ్యాంకులు బోర్లా: ఎన్ఎస్ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులుసహా రియల్టీ ఇండెక్స్ 2 శాతం క్షీణించింది. ఆటో 1 శాతం నీరసించగా.. కెమికల్స్, ఐటీ నామమాత్రంగా బలపడ్డాయి. ప్రయివేట్ బ్యాంకులలో ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఆర్బీఎల్, ఇండస్ఇండ్, కొటక్ 3–1.5 శాతం మధ్య నష్టపోయాయి. పీఎస్యూ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, బీవోబీ, కెనరా, మహారాష్ట్ర, ఐవోబీ 3–1.5 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే బీఈఎల్, ఆర్ఐఎల్, ఓఎన్జీసీ 2.5–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. షేర్లపై చమురు ఎఫెక్ట్: చమురు సెగ ప్రభావంతో ఇంధన మార్కెటింగ్ దిగ్గజాలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ 3–1.7% మధ్య నీరసించాయి. → పెయింట్ల విభాగంలో ఇండిగో, కన్సాయ్ నెరోలాక్, అక్సో నోబెల్ 3.4–2.5 శాతం మధ్య పతనమయ్యాయి. → ఏటీఎఫ్ భయాలతో విమానయాన దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 2.4 శాతం నష్టపోయింది. → ముడిసరుకుల ధరల ఆందోళనతో టైర్ల కంపెనీలలో టీవీఎస్ శ్రీచక్ర, అపోలో, ఎంఆర్ఎఫ్ 3–1 శాతం మధ్య క్షీణించాయి.డిఫెన్స్ సేఫ్..: యుద్ధ భయాల నేపథ్యంలో రక్షణ రంగ షేర్లు.. భారత్ డైనమిక్స్(బీడీఎల్), గార్డెన్ రీచ్, మజ్గావ్ డాక్, పారస్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీస్, ఎంటార్ టెక్, హెచ్ఏఎల్, డేటా ప్యాటర్న్స్, కొచిన్ షిప్, మిధానీ 6–3.3% మధ్య జంప్చేసింది. వెరసి ఎన్ఎస్ఈ డిఫెన్స్ ఇండెక్స్ 2.8% ఎగసింది. కారణాలివీ...: పశ్చిమాసియాలో దాడులతో చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం కలగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. క్రూడ్ మంటతో వాణిజ్య లోటు పెరగడంతోపాటు, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనున్నట్లు నిపుణులు తెలిపారు. దేశీ కరెన్సీ మరింత బలహీనపడనున్నట్లు పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ పరపతి విధానాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నట్లు వివరించారు. చమురు ధరలు పలు రంగాల లాభదాయకతను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొన్నారు.12 శాతం జంప్ చేసిన క్రూడ్రాత్రి 11.30 సమయంలో న్యూయార్క్లో నైమెక్స్ చమురు 14% జంప్చేసి 92.5 డాలర్లకు చేరింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 11 శాతం ఎగసి 94.5 డాలర్లను దాటింది. ఇవి మరింత బలపడితే ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై సోమవారం(9న) కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క యూఎస్ ఇండెక్సులు సైతం 1 శాతం పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి. -
మరింత తగ్గిన గోల్డ్ రేటు: లేటెస్ట్ ధరలు ఇలా..
మార్చి 2 నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,48,600 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,47,700 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయల నుంచి రూ. 1,61,130 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,48,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,47,850 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,62,260 రూపాయల వద్ద నుంచి రూ. 1,61,280 వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,49,600 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,200 వద్దనే ఉన్నాయి.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రారంభైనప్పుడు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మార్చి 2న రూ. 1,70,510 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (మార్చి 6) 1,61,130 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
కుప్పకూలిన మార్కెట్లు.. కూల్చేసిన క్రూడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరగడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు షెషన్ చివర్లో గణనీయ నష్టాలను చవిచూశాయి.నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 1.27 శాతం లేదా 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.37 శాతం లేదా 1,097 పాయింట్లు నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.యూఎస్-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది సరఫరా అంతరాయం భయానికి ఆజ్యం పోసింది. దీంతో యూరోపియన్ వాణిజ్య సెషన్ లో బ్రెంట్ క్రూడ్ ను బ్యారెల్ కు 87 డాలర్ల మార్కుకు పైగా నెట్టింది.నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.24 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.27 శాతం క్షీణతతో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన సూచీగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్లో నష్టపోయిన ఇతర రంగాలు. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో సెక్టోరల్ సూచీలను అధిగమించింది. -
పడిపోతున్న పసిడి ధరలు.. ఈసారి తులం..
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) పతనం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలుచేసే వారికి ఊరట కలుగుతోంది. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా కాస్త క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 101 పాయింట్లు నష్టపోయి 24,659 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 353 పాయింట్లు పడిపోయి 79,662 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 84.51 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.56 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 06-03-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్! -
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణంభారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్లో కొనుగోళ్లు పెంచారు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం
భారతీయ మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా తమ కష్టార్జితాన్ని ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలనే విషయంలో మునుపెన్నడూ లేని విధంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన ‘డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ విన్వెస్టర్ పల్స్’ నివేదిక ఈ ఆసక్తికర మార్పును వెల్లడించింది.పెరిగిన అవగాహన.. మారిన ధోరణిదేశవ్యాప్తంగా 5,050 మంది ఇన్వెస్టర్లపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే మహిళలు 2022లో 44 శాతంగా ఉండగా ప్రస్తుతం అది 56 శాతానికి పెరిగింది. ఆన్లైన్ వేదికల ద్వారా లభిస్తున్న సమాచారం, పెరిగిన ఆర్థిక అక్షరాస్యత ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. సర్వే ప్రకారం.. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు ప్రొఫెషనల్ అడ్వైజర్ల సలహా తీసుకుంటూ పూర్తి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆన్లైన్ అడ్వైజర్లకు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. అందుకే ఇప్పటికీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్లకే మొగ్గు చూపుతున్నారు.పురుషులు వర్సెస్ మహిళలుపెట్టుబడుల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది. మార్కెట్లు పతనమైనప్పుడు పెట్టుబడులను పెంచే విషయంలో పురుషులు (15%) ముందుండగా, మహిళలు (10%) కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మహిళలు ఎక్కువగా డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఇది వారు రిస్క్ మేనేజ్మెంట్లో పరిణతి సాధిస్తున్నారని సూచిస్తోంది.‘మహిళలు కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు, సమాచారంతో కూడిన స్వతంత్రతను ప్రదర్శిస్తున్నారు. మార్కెట్లను అర్థం చేసుకుంటూ తమ ఆశయాలకు అనుగుణంగా పెట్టుబడులను మలుచుకుంటున్నారు’ అని డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ చైర్పర్సన్ అదితి కొఠారీ దేశాయ్ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ సంక్షోభం.. ఏం చేయాలో ఆలోచించాలి! -
మరింత తక్కువకు బంగారం.. కొనేవారిదే భాగ్యం!
దేశంలో బంగారం ధరల (Today Gold Rate) తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ పసిడి ధరలు దిగివచ్చాయి. దీంతో పెళ్లిళ్ల సీజన్లో కొనుగోలుదారులకు ఉపశమనం కలుగుతోంది. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిన్న ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8.75 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (1.40%) నష్టపోయి 79,116.19 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది 1,795 పాయింట్ల వరకు పడిపోవడం గమనార్హం. నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) కోల్పోయి 24,480.50 వద్ద ముగిసింది. రంగాల వారీగా ఎనర్జీ సెక్టార్కు చెందిన షేర్లు అత్యధికంగా 14.90% పతనమయ్యాయి. రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్ సూచీలు కూడా 3% పైగా నష్టపోయాయి.మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి?ముడి చమురు సెగ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటం మార్కెట్లను భయపెట్టింది. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా బ్యారెల్కు 82 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే భారత్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ప్రమాదం ఉంది.రూపాయి రికార్డు పతనం: అంతర్జాతీయ అనిశ్చితి వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్టైమ్ కనిష్టానికి (92.17) పడిపోయింది. ఇది దిగుమతులపై భారాన్ని పెంచుతోంది.ఎఫ్ఐఐల అమ్మకాలు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత మూడు సెషన్లలోనే దాదాపు రూ.14,400 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.ఆసియా మార్కెట్ల ప్రభావం: జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి వంటి ఇతర ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉండటం దేశీయ సెంటిమెంట్ను దెబ్బతీసింది.ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలుఇలాంటి సంక్షోభ సమయాల్లో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భయం వద్దు.. మార్కెట్లు పడిపోగానే కంగారుపడి క్వాలిటీ షేర్లను విక్రయించకూడదు. యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికమే. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి పతనం తర్వాత మార్కెట్లు మరింత బలంగా పుంజుకున్నాయి.సిప్ కొనసాగిచాలి: మార్కెట్ కనిష్టాల్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీనివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం చేకూరుతుంది.నగదు నిల్వలు: పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం మంచిది. మంచి షేర్లు తక్కువ ధరలో లభించినప్పుడు కొనుగోలు చేయడానికి ఇది మీకు ఒక అవకాశం ఇస్తుంది.స్టాప్ లాస్ తప్పనిసరి: ట్రేడర్లు ట్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా స్టాప్ లాస్ పాటించాలి. మార్కెట్ సూచీల ఊగిసలాట ఎక్కువగా ఉన్నప్పుడు అధిక లివరేజ్ తీసుకోవడం రిస్క్తో కూడుకున్న పని.ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే చమురు ధరలు 100 డాలర్లకు చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పునసమీక్షించుకోవాలి. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమం.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! -
వార్.. బేర్!
ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్ జోరు’ కొనసాగింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్ స్ట్రీట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,123 పాయింట్లు పతనమై 79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి 24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి. బీఎస్ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్ ఇండెక్స్ 4%, పీఎస్యూ బ్యాంక్ 3.50%, ఇండ్రస్టియల్స్ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్ 3.12%, క్యాపిటల్ గూడ్స్ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్ 2.25%, పతనమమ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్లో 30 షేర్లలో ఎయిర్టెల్ (1.78%), ఇన్ఫోసిస్ (1.5%), టెక్ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి. → పీఎన్జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిస్టింగ్ రోజు మెరిసింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.ఆయిల్ మార్కెటింగ్, పెయింట్స్ షేర్లు డౌన్ గల్ఫ్ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్, పెయింట్ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్పీసీఎల్ 5.41%, బీపీసీఎల్ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్ 2.6%, బర్జర్ పెయింట్స్ 2.22%, ఇండిగో పెయింట్స్ 1.49%, ఏషియన్ పెయింట్స్ 0.95 పడిపోయాయి. ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం: దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్లాండ్ ‘సెట్ కాంపోసిట్’ సూచీ 6%, ఇండోనేసియా ‘జకార్తా కాంపోసిట్’ 5% పతనమయ్యాయి. తైవాన్ 4.50%, జపాన్ 4%, సింగపూర్ 2.16%, హాంగ్కాంగ్ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. జర్మనీ డాక్స్ 2%, ఫ్రాన్స్ సీఏసీ 1%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ అరశాతం లాభపడ్డాయి. నాస్డాక్ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి. -
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన రూపాయి
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడింది. అమెరికా–ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో బుధవారం డాలర్తో పోలిస్తే రూపాయి 67 పైసలు క్షీణించి 92.16 వద్ద ముగిసింది. ఇది తాత్కాలికంగా నమోదైన ఆల్టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం.ఫారెక్స్ మార్కెట్ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ‘రిస్క్ ఆఫ్’ పరిస్థితుల కారణంగా డాలర్ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీల బుట్టతో పోలిస్తే గ్రీన్బ్యాక్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది.ఇంటర్బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి 92.05 వద్ద ప్రారంభమై, ఒక దశలో 92.35 వద్ద ఆల్టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 92.16 వద్ద ముగిసి, గత ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే 67 పైసల నష్టాన్ని చవిచూసింది. సోమవారం రూపాయి 41 పైసలు బలహీనపడి 91.49 వద్ద స్థిరపడగా, హోలీ సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ మూతపడింది.ఇరాన్పై అమెరికా దాడులు, అలాగే హోర్ముజ్ జలసంధి మార్గంగా ఇంధన సరఫరాలకు ఉన్న ముప్పు కారణంగా ప్రపంచ చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్కు 1.29 శాతం పెరిగి 82.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు క్షీణించి 79,116.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 385.20 పాయింట్లు పడిపోయి 24,480.50 వద్ద స్థిరపడింది.మొత్తంగా, ప్రపంచ అనిశ్చితి పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. 1122 పాయింట్లు కూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి మదుపరులు ఆందోళన చెందడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ సెషన్లోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 1.6 శాతం లేదా 385.2 పాయింట్ల నష్టంతో 24,480.5 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 1.40 శాతం లేదా 1,122.66 పాయింట్లు నష్టపోయి 79,116.19 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్లో ఎన్బీ ట్రేడ్& ఫైనాన్స్, సికాల్ లాజిస్టిక్స్, సాధన నైట్రో కెమ్, పాదం కాటన్ యార్న్స్, ఎఫ్ మెక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్, రూబీ మిల్స్, మార్గ్ టెక్నో ప్రాజెక్ట్స్, పిక్చర్హౌస్ మీడియా, శ్రీ హవిషా హాస్పెటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను మించి పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.2 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బుధవారం సెషన్ ను లాభాలతో ముగించిన ఏకైక సెక్టోరల్ సూచీ నిఫ్టీ ఐటీ. -
బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.15బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.02 శాతం దిగజారింది.అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. అటు ఆసియా, యూరప్ సూచీలు కూడా భారీగా తగ్గాయి.దక్షిణ కొరియా కోస్పి స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్ నిల్వలున్నప్పటికీ జపాన్ నికాయ్ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు.అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్కి 7% పైగా పెరిగి 82.2 డాలర్ల వద్ద, నైమెక్స్ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.Today Nifty position 04-03-2026(time: 9:22 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల్లో ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇన్వెస్టర్ల రక్షణకు టెక్ ప్రొటెక్షన్
ఇటీవల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య బలపడుతున్న నేపథ్యంలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పెట్టుబడుల రక్షణకు టెక్ సేవలను అధికంగా వినియోగించనున్నట్లు తెలియజేశారు. వెరసి టెక్నాలజీ ఆధారిత సర్వీసుల ద్వారా ఐపీవో పెట్టుబడులకుముందు జరుగుతున్న మోసాలను నివారించనున్నట్లు తెలియజేశారు. దీంతో రిజిస్టర్ ఇంటర్మీడియరీల జోక్యంలేకుండానే ఇన్వెస్టర్ల పెట్టుబడులు దారి మళ్లుతుండటాన్ని అడ్డుకోనున్నట్లు వెల్లడించారు. సెబీ చైర్మన్గా మార్చి 1కల్లా ఏడాది కాలం పూర్తి చేసుకున్న పాండే పలు అంశాలపై స్పందించారు. నకిలీ యాప్స్ ఎఫెక్ట్మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్న పలువురు కొత్త ఇన్వెస్టర్లను అత్యధిక రిటర్నుల ఆశ చూపుతూ నకిలీ ట్రేడింగ్ యాప్స్, వాట్సాప్ గ్రూప్లు మోసం చేస్తున్నట్లు పాండే పేర్కొన్నారు. వీటితో మదుపరులను తప్పుదారిపట్టిస్తూ వారి సొమ్మును మోసగాళ్ల వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నట్లు తెలియజేశారు. వెరసి ఇన్వెస్టర్లలో అప్రమత్తతను, అవగాహనను పెంచవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేయదలచిన రిటైల్ ఇన్వెస్టర్లను మోసగాళ్లు సెబీ వద్ద రిజిస్టరైన ఇంటర్మీడియరీలకు తెలియకుండానే సొమ్మును దారిమళ్లిస్తున్నట్లు వివరించారు. అత్యున్నత ఆర్జన ఆశచూపి మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు వాట్సాప్ గ్రూప్లు, నకిలీ యాప్స్, తదితర డిజిటల్ చానళ్ల ద్వారా వలపన్నుతున్నట్లు తెలియజేశారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమైనట్లు ప్రస్తావించారు. పెట్టుబడులకు దిగేముందు ఆయా సంస్థల గుర్తింపును ధృవీకరించుకునేందుకు సెబీ చెక్ తదితర టూల్స్ను వినియోగించుకోవడం ప్రయోజనకరంకాగలదని ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి పలు చర్యల ద్వారా విస్తారంగా ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచవలసి ఉన్నదని, తద్వారా మాత్రమే సైబర్ మోసాలకు చెక్ పెట్టగలమని వివరించారు.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!
బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకుండా పోతోంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఏ నగరం ఎక్కువగా ఉన్నాయి?, ఏ నగరంలో కొంత తక్కువగా ఉంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,69,880 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు సాయంత్రానికి 1,70,510 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,55,650 రూపాయల దగ్గర నుంచి రూ. 1,56,300 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో ఉదయం 156660 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి అదే రేటు వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు (రూ.170840) విషయంలో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఈ రోజు ఉదయం 155880 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 156450 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1,69,950 రూపాయల వద్ద నుంచి 1,70,660 వద్ద నిలిచింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా.. బంగారం ధరల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం చెబుతున్నారు. -
యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం కారణంగా.. సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,048.34 పాయింట్ల నష్టంతో 80,238.85 వద్ద, నిఫ్టీ 312.95 పాయింట్ల నష్టంతో 24,865.70 వద్ద నిలిచాయి.జిందాల్ డ్రిల్లింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, తేజస్ నెట్వర్క్స్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, కృధాన్ ఇన్ఫ్రా లిమిటెడ్, AKG Exim లిమిటెడ్, క్లీన్ మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, ఫింకుర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!
బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్న వేళ, వెండి రేటు కూడా కొండెక్కుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటనేది ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోనిఇతర ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. సాధారణంగా ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కేజీ సిల్వర్ ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలు➤ప్రస్తుతం సిల్వర్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.➤యుద్ధం కారణంగా.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.➤యుద్ధం కాకుండా.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ యాక్ససరీస్ వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది.➤డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో.. దానికి తగిన విధంగా సరఫరా ఉండాలి. సరఫరా తగ్గితే.. ధరలు తప్పకుండా పెరుగుదల దిశగా పరుగులు పెడతాయి.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల భారీగా పెరుగుతున్న వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు వెండి దూరమైపోతుంది. -
భగ్గుమన్న బంగారం.. కియోసాకి ‘బ్లాస్ట్ ఆఫ్’ ట్వీట్
ప్రసిద్ధ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సాంప్రదాయ కరెన్సీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంగారం, వెండి, బిట్కాయిన్పై ఆశావాద వ్యాఖ్యలు చేశారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి తన తాజా సోషల్ మీడియా పోస్టులో బంగారం ఒకే రోజులో 128 డాలర్లు పెరిగిందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin) త్వరలో భారీగా ఎగిసిపడతాయని (బ్లాస్ట్ ఆఫ్) అభిప్రాయపడ్డారు.బంగారం ధరలుబంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరగడం మార్కెట్లలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి పెరుగుదలలు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటి కారణాలతో చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మళ్లడం సాధారణం.వెండి, బిట్కాయిన్పై..కియోసాకి ప్రకారం వెండి కూడా బంగారం తరహాలోనే వేగంగా పెరిగే అవకాశం ఉంది. వెండి పారిశ్రామిక వినియోగం, విలువ నిల్వ అనే రెండు కోణాల్లో ప్రాధాన్యం కలిగి ఉండటంతో, మార్కెట్ చలనం సమయంలో ఎక్కువ ఒడిదుడుకులు చూపుతుంది. అలాగే బిట్కాయిన్ను డిజిటల్ గోల్డ్గా పేర్కొంటూ, కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగితే క్రిప్టోకరెన్సీలకు మద్దతు పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.GOLD booms $128 in one day.Better news is silver and Bitcoin to blast off.Hang on.— Robert Kiyosaki (@theRealKiyosaki) March 2, 2026 -
బంగారం లాంటి న్యూస్! పసిడి ధరలు రివర్స్!!
దేశంలో బంగారం ధరలు (Today Gold Rate) ఉపశమనమిచ్చాయి. వరుసగా మూడో రోజులు దారుణంగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
1000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 283 పాయింట్లు తగ్గి 24,886 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1004 పాయింట్లు నష్టపోయి 80,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.8బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.98 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది.నాస్డాక్ 1.18 శాతం దిగజారింది.ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి.హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది.Today Nifty position 02-03-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పశ్చిమాసియా పైనే మార్కెట్ ఫోకస్
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆందోళనలు ఉపశమించే వరకూ సెంటిమెంటు బలహీనపడనున్నట్లు అంచనా వేశారు. వీటికితోడు చమురు ధరలకు రెక్కలువస్తే అటు వాణిజ్య లోటు, ఇటు రూపాయి బలహీనపడవచ్చని తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి. హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది. వెరసి తాజా పరిస్థితులు దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తవచ్చని, దీంతో ఆర్బీఐ పరపతి విధానాలపై ప్రభావం పడవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొ న్నారు. టెక్నాలజీ స్టాక్స్లో బలహీనతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా ప్రస్తావించారు. ఆటో అమ్మకాల ఎఫెక్ట్ రేపు(3న) హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఫిబ్రవరి నెలకు ఆటో రంగ(వాహన) అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా నేడు(2న) ఆటో కౌంటర్లు వెలుగులో నిలచే వీలుంది. వారాంతాన ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కొత్త సిరీస్ ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఈ బాటలో ఈ వారం పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. మరోపక్క యూఎస్, చైనా గణాంకాలు సైతం విడుదలకానున్నాయని, వీటి ఆధారంగా ఈ వారం మార్కెట్లలో యాక్టివిటీ నమోదుకానున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. సాంకేతికంగా చూస్తే..గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులుగా మారి రూ. 22,615 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధభయాలు ఇండెక్సులను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి అంచనాల ప్రకారం.. → ఈ వారం నిఫ్టీ 25,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. 24,800–24,700 స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. ఇక్కడినుంచి బౌన్స్ అయితే 25,500–25,700 పాయింట్లవరకూ బలపడవచ్చు. → సెన్సెక్స్ 81,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. ఆపై 80,500–80,100 పాయింట్లస్థాయిలో మద్దతు కనిపించే వీలుంది. ఇక్కడి నుంచి పుంజుకుంటే 82,000– 82,500 పాయింట్లవరకూ పురోగమించే అవకాశముంది. గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం(ఫిబ్రవరి 23–27) దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 1,528 పాయింట్లు(2 శాతం) పతనమై 81,287 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 393 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,179 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఊహకందని స్థాయికి చేరిన బంగారం ధర!
బంగారం తగ్గుతుందని సంబరపడేలోపే.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రూ. 1,59,280 వద్ద ఉన్న గోల్డ్ రేటు (ఫిబ్రవరి 28) శనివారం నాటికి రూ. 1,68,710 వద్దకు చేరింది. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. వారం రోజుల్లో రూ. 1,59,280 నుంచి రూ. 1,68,710 వద్దకు (రూ.9430 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ. 1,46,000 నుంచి రూ. 1,54,650 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 8650 రూపాయలు పెరిగిందన్నమాట. ఈ రోజు (మార్చి 1) ధరలు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ. 1,73,080 వద్దకు చేరాయి.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. ఫిబ్రవరి 22న రూ.1,60,150 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 9490 పెరిగి.. ఫిబ్రవరి 28 నాటికి 1,69,640 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 10 గ్రాములు 1,46,800 రూపాయల నుంచి రూ. 1,55,500 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల్లో 8700 రూపాయలు పెరిగిందన్నమాట.ఫిబ్రవరి 22న 1,59,430 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర ఫిబ్రవరి 28నాటికి రూ. 9430 పెరిగి.. 1,68,860 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,46,150 రూపాయల దగ్గర నుంచి రూ. 1,54,800 వద్దకు చేరింది. వారం రోజుల్లో రూ. 8650 పెరిగింది.


