Market
-
భగ్గుమన్న పశ్చిమాసియా
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలుముదురుతున్న అనిశ్చితిపశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పుయుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్పై ఒత్తిడి పెంచింది.వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలుద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.ఇప్పుడేం చేయాలి?ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
గోల్డ్ అలర్ట్: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే..
దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు కాస్త దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండటం పండుగ సందర్భంగా కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. మంగళవారం అమెరికా, ఇరాన్ మధ్య కుదురుతుందనుకున్న ఒప్పందం విఫలం కావడంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మదుపర్లలో ఆందోళన చెలరేగింది. దీంతో భారతీయ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి.ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 150 పాయింట్లు పడిపోయి 24,426 వద్ద, సెన్సెక్స్(Sensex) 591 పాయింట్లు క్షీణించి 78,681 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ లో హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ట్రెంట్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి.విస్తృత మార్కెట్లు మిశ్రమ గమనికతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.20 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.30 శాతం నష్టపోయాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ అత్యంత క్షీణించింది. నిఫ్టీ హెల్త్కేర్, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్, నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
'2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులుబంగారం (Gold)వెండి (Silver)చమురు (Oil)ఆహారం (Food)బిట్కాయిన్ (Bitcoin)ఈథీరియం (Ethereum)కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.బంగారం, వెండిబంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.క్రిప్టో కరెన్సీకియోసాకి బిట్కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.చమురు, ఆహారంచమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు! -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,576.60 వద్ద నిలిచాయి.శ్యామ్ టెలికాం లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, మనాక్సియా స్టీల్స్ లిమిటెడ్, వైశాలి ఫార్మా లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పశుపతి కాట్స్పిన్ లిమిటెడ్, సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్, తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అక్షిత కాటన్ లిమిటెడ్, సోలార్వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఉలుకు పలుకు లేని ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు పెరిగి 24,462 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351 పాయింట్లు ఎగబాకి 78,872 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.13బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.24 శాతం తగ్గింది.నాస్డాక్ 0.26 శాతం నష్టపోయింది.Today Nifty position 21-04-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అందుకే.. గోల్డ్ రేటు తగ్గింది!
గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.భారతదేశంలో ఇలా..భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.ద్రవ్యోల్బణ భయం!అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఐపీవోకు అవాడా ఎలక్ట్రో రెడీ
సోలార్ సెల్, మాడ్యూళ్ల తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ బాటలో టెక్స్టైల్స్ కంపెనీ సోనాసెలక్షన్ ఇండియా, చెన్నై సంస్థ గ్రాండ్ హౌసింగ్ సైతం ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతి పొందాయి. ఈ కంపెనీలన్నిటికీ ఏప్రిల్ 15–17 మధ్య సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.భారీస్థాయిలో..ఐపీవోలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా అవాడా ఎలక్ట్రో 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.1-1.3 లక్షల కోట్ల మధ్య నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేశాయి. కంపెనీ 2025 అక్టోబర్లో గోప్యతా మార్గాన సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. నిధులను సామర్థ్య విస్తరణకు వినియోగించనుంది.అత్యున్నత సామర్థ్యంగల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీపై వెచ్చించనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి చేస్తున్న 5.1 గిగావాట్ల సమీకృత సౌకర్యాలతోపాటు.. మహారాష్ట్రలోని బ్యూటిబోరీ ప్లాంటు విస్తరణకు నిధులు కేటాయించనుంది. పీఈ దిగ్గజం బ్రూక్ఫీల్డ్కు పెట్టుబడులున్న శుద్ధ ఇంధన అవాడా గ్రూప్ సంస్థ ఇది. సోలార్ పీవీ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజీ, గ్రీన్ డేటా సెంటర్లపై దృష్టిపెట్టి ముందుకు సాగుతోంది.ఈక్విటీ జారీ..బిల్వారా కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన సోనాసెలక్షన్ ఇండియా ఐపీవోలో భాగంగా 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులలో రూ. 80 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 48 కోట్లు ప్లాంట్, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా గ్రాండ్ హౌసింగ్ 3.55 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా అవాడా ఎలక్ట్రో, సోనాసెలక్షన్, గ్రాండ్ హౌసింగ్ స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ)లలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నాయి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్లు లేదా 0.074 శాతం నష్టంలో 78,435.12 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు లేదా 0.11 శాతం వద్ద 24,326.65 వద్ద నిలిచింది.అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, బట్లిబోయ్ లిమిటెడ్, రాజపాలయం మిల్స్ లిమిటెడ్, సికాజెన్ ఇండియా లిమిటెడ్, కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రావెయిల్ అండ్ వెయిల్ (ఇండియా) లిమిటెడ్, గుడ్ఇయర్ ఇండియా లిమిటెడ్, ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్ప్రింట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఊరటనిచ్చిన బంగారం.. ఉత్సాహంగా కొనేలా..
అక్షయ తృతీయ (Akshaya Tritiya) వేళ బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. దేశంలో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అలాగే వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండటంతో పండుగ సందర్భంగా కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 24,352 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 79 పాయింట్లు ఎగబాకి 78,569 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.28బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.26 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.2 శాతం పెరిగింది.నాస్డాక్ 1.52 శాతం పుంజుకుంది.Today Nifty position 20-04-2026(time: 9:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్కు హార్మూజ్ టెన్షన్!
పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్ జలాలపై యూఎస్, ఇరాన్ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్కు కీలకమైన ఇరాన్, యూఎస్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. రిజల్ట్స్ సీజన్.. గత వారాంతాన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐతోపాటు యస్ బ్యాంక్ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ టెక్, ఎల్టీఎం, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితరాలున్నాయి. గణాంకాలు కీలకం మార్చి నెలకు నేడు(20న) ఇన్ఫ్రా ఔట్పుట్ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.గత వారమిలా వరుసగా రెండో వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమ్మో.. అల్యూమినియం.. రికార్డ్!
అంతర్జాతీయ మార్కెట్లో అల్యూమినియం ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో గత నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకడమే కాకుండా, భారత మార్కెట్లో కూడా అల్యూమినియం ధర కేజీకి రూ.375 వద్ద ఆల్-టైమ్ హై రికార్డును సృష్టించింది. 2026లో గ్లోబల్ కమోడిటీ మార్కెట్లో బెస్ట్ పెర్ఫార్మర్గా అల్యూమినియం నిలుస్తోంది. దీంతో తక్కువ ధరలో ఉన్నప్పుడు అల్యూమినియంపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు అదృష్టవంతులని చెప్పవచ్చు.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు» నిర్మాణ, ఆటోమొబైల్ రంగాల డిమాండ్: ఇళ్లు, వాహనాలు మరియు ప్యాకేజింగ్ పరిశ్రమల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం.» ఇంధన ధరల ప్రభావం: అల్యూమినియం తయారీకి భారీగా విద్యుత్ అవసరం. చమురు ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారమై, ఆ భారం వినియోగదారుడిపై పడుతోంది.» సరఫరా లోటు: పర్యావరణ నిబంధనల వల్ల ఉత్పత్తి తగ్గడం, మరోవైపు గోదాముల్లో నిల్వలు అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. యుద్ధ భయాల వల్ల షిప్పింగ్ మార్గాల్లో అంతరాయం కలగడం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా లోహాల వైపు మొగ్గు చూపడంతో 'రిస్క్ ప్రీమియం' పెరిగి ధరలను పైకి నెట్టాయి.చైనా, అమెరికా వ్యూహాత్మక డిమాండ్ప్రపంచ అల్యూమినియం వినియోగంలో సగానికి పైగా వాటా కలిగిన చైనా, తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భారీగా కొనుగోళ్లు చేస్తోంది. మరోవైపు రక్షణ రంగం, ఆయుధాల తయారీ కోసం అమెరికా తన సైనిక అవసరాలకు అల్యూమినియంను పెద్ద ఎత్తున సేకరిస్తోంది.మరింత పెరుగుతాయా?ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ ఏడాది పొడవునా అల్యూమినియం ధరలు బుల్లిష్గానే (పెరుగుదల ధోరణి) ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సరఫరా మెరుగుపడకపోయినా లేదా చైనా ఆర్థిక వ్యవస్థ మందగించకపోయినా, ధరలు మరింత కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు.. వారంలో రూ.3 వేలు.. -
బంగారం ధరలు.. వారంలో రూ.3 వేలు..
పసిడి ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న పర్వదినం అక్షయ తృతీయ (Akshaya Tritiya) వచ్చేసింది. నేడు వారంతపు సెలవు కావడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ట్రేడింగ్ ఉండదు. దీంతో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల్లో (ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19 వరకు) బంగారం ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ 13న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,460 ఉండగా, అది ఏప్రిల్ 19 నాటికి రూ.1,55,780కి చేరుకోవడంతో మొత్తం రూ.3,320 మేర పెరిగింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏప్రిల్ 13న రూ.1,39,750 ఉండగా, ఏప్రిల్ 19 నాటికి అది రూ.1,42,800కి చేరుకొని వారం రోజుల్లో మొత్తంగా రూ.3,050 మేర పెరుగుదలను నమోదు చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్ ధర.. గుండె దడ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం, వెండికి అమ్మకాల సెగ!
అమ్మకాల ఒత్తిడికి పసిడి, వెండి నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.5,700 తగ్గి (2.2 శాతం) రూ.2.53 లక్షలకు, బంగారం 10 గ్రాములకు రూ.1,600 (1 శాతం) నష్టపోయి రూ.1,56,200 స్థాయిలకు దిగొచ్చాయి. కాల్పుల విరమణ పరిణామాలకు సంబంధించి వారాంతంలో వచ్చే తాజా అప్డేట్లకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.తాజా సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో బంగారం స్థిరీకరణ దశలో కొనసాగినట్టు చెప్పారు. హార్ముజ్ జలసంధితి పూర్తిగా తెరుస్తునట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి దూసుకెళ్లాయి. గోల్డ్ ఔన్స్కు 2 శాతం పెరిగి 4,900 డాలర్ల పైకి చేరింది. సిల్వర్ ఔన్స్కు 5 శాతానికి పైనే పెరిగి 83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ గరిష్ట స్థాయిల్లో బంగారం నిలదొక్కుకోవడం లేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
ఆ ఆశలతోనే.. ఎగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మంచి లాభాల్లో ముగిశాయి. వారాంతాల్లో జరగనున్న యూఎస్-ఇరాన్ చర్చల కోసం ట్రేడర్లు సిద్ధమవడంతో భారత బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 504.86 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 78,493.54 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.8 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 24,353.55 వద్ద ముగిసింది.హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.27 శాతం, 1.48 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ మీడియా మెరుగైన పనితీరు కనబరిచాయి.ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. లెబనాన్, ఇజ్రాయెల్ 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన గురువారం ప్రకటించారు. లెబనాన్ పై దాడిని ఆపడం ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ నుండి వచ్చిన ముఖ్య షరతులలో ఒకటి అని నివేదికలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ ఈ వారాంతంలో చర్చల కోసం సమావేశమవుతున్నాయి. -
బిగ్ రిలీఫ్.. చల్లబడిన బంగారం ధరల వేడి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఊగిసలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు పెరిగి 24,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 101 పాయింట్లు ఎగబాకి 78,085 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.25బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 98.15 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.31 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.36 శాతం పుంజుకుంది.Today Nifty position 17-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. పడిపోయిన బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో షేర్లకు అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు తమ గరిష్టాలను కోల్పోయాయి.బీఎస్ ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 122.56 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 34.55 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,196.75 వద్ద ముగిసింది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.63 శాతం, 0.83 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ లూజర్స్ గా ఉద్భవించాయి. -
కాకమీదున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో పెరిగిన పసిడి ధరలు ఈరోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:45 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు పెరిగి 24,303 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 242 పాయింట్లు ఎగబాకి 78,356 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.93బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.8 శాతం పెరిగింది.నాస్డాక్ 1.59 శాతం పుంజుకుంది.Today Nifty position 16-04-2026(time: 9:45 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50, సెన్సెక్స్ భారీగా ఎగిశాయి.నిఫ్టీ 1.63 శాతం లేదా 388.65 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద, సెన్సెక్స్ 1.64 శాతం లేదా 1,264 పాయింట్లు పెరిగి 78,111.24 వద్ద ముగిశాయి.ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20 శాతం, 2.35 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్ టాప్ గెయినర్గా నిలిచింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచింది. -
ఎన్ఎస్ఈలో రికార్డు స్థాయిలో తగ్గిన యాక్టివ్ ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో క్రియాశీల పెట్టుబడిదారుల (యాక్టివ్ ఇన్వెస్టర్లు) సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోయింది. గడిచిన ఏడాది కాలంలో దాదాపు 35 లక్షల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్కు దూరమయ్యారు. మూడేళ్ల తర్వాత ఇన్వెస్టర్ల బేస్లో తగ్గుదల నమోదు కావడం గమనార్హం.గణనీయంగా తగ్గిన క్లయింట్లుఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో 4.92 కోట్లుగా ఉన్న క్రియాశీల ఇన్వెస్టర్ల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 7 శాతం క్షీణించి 4.58 కోట్లకు చేరుకుంది. ఈ పతనంలో దేశంలోని అగ్రశ్రేణి డిస్కౌంట్ బ్రోకర్లదే ప్రధాన వాటా కావడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం తగ్గుదలలో 70 శాతం వాటా కేవలం మూడు బ్రోకర్ల నుంచే ఉంది.జెరోధా.. అత్యధికంగా 9.95 లక్షల మంది యాక్టివ్ క్లయింట్లను కోల్పోయింది (మొత్తం పతనంలో 29%).ఏంజెల్ వన్.. 8.15 లక్షల మంది ఖాతాదారులు తగ్గారు (23%).అప్ స్టాక్స్.. 7.6 లక్షల మంది ఇన్వెస్టర్లు ట్రేడింగ్కు స్వస్తి చెప్పారు (22%).సాంప్రదాయ బ్రోకరేజీలైన హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, షేర్ఖాన్, మోతీలాల్ ఓస్వాల్ వంటి సంస్థలు కూడా లక్షకు పైగా క్లయింట్లను కోల్పోయాయి.పెట్టుబడిదారుల నిరాశకు కారణాలుయూఎస్-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు, ప్రపంచ వాణిజ్య వివాదాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి.ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడం ద్రవ్యోల్బణ భయాలను పెంచింది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) నిరంతరాయంగా నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీసింది.కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడం, అధిక వాల్యుయేషన్లు ఇన్వెస్టర్లను భయపెట్టాయి.ప్రాథమిక మార్కెట్లో (ఐపీఓ) వచ్చిన కంపెనీలు ఆశించిన స్థాయిలో రిటర్న్స్ ఇవ్వకపోవడంతో కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు వెనకడుగు వేశారు.గ్లోబల్ బ్రోకరేజీల ప్రతికూల రేటింగ్భారత ఈక్విటీ మార్కెట్లపై నోమురా, గోల్డ్మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ రేటింగ్ను ‘తటస్థ’ (న్యూట్రల్) లేదా ‘అండర్ వెయిట్’కు తగ్గించాయి. -
బంగారం ధరలు సలసల!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో పెరిగిన పసిడి ధరలు ఈరోజు కూడా అదే ధోరణిలో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 311 పాయింట్లు పెరిగి 24,153 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1026 పాయింట్లు ఎగబాకి 77,882 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 95.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 1.96 శాతం పుంజుకుంది.Today Nifty position 15-04-2026(time: 9:42 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది. రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్లో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ (మార్పులు, చేర్పులు), రిస్క్ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సీఐవో (డెట్) ఉమేష్ శర్మ చెప్పారు. -
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో తగ్గిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తల్లడిల్లిన దలాల్ స్ట్రీట్!
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనై భారీ నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా మారడంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలువిఫలమైన శాంతి చర్చలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగియడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇరాన్పై అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు, హార్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలవైపు మళ్లుతున్నారు.సెగ పుట్టిస్తున్న క్రూడాయిల్ ధరలుయుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 102 డాలర్ల మార్కును అధిగమించింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న ఆందోళన మార్కెట్ను కుంగదీసింది.ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గడం మరో ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో 2026లో వడ్డీ రేట్ల తగ్గింపు కేవలం ఒక్కసారి మాత్రమే ఉండొచ్చన్న సంకేతాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్ఐఐ) ఆందోళనకు గురిచేశాయి. ఫలితంగా భారత మార్కెట్ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ జరిగింది.నేటి మార్కెట్ గణాంకాలు (క్లోజింగ్ సమయానికి)సూచీముగింపునష్టం (పాయింట్లు)శాతం (%)సెన్సెక్స్76,842-702-0.90%నిఫ్టీ23,842-207-0.86% -
పసిడి ప్రియులకు ఊరట.. బంగారం తగ్గుముఖం
పసిడి ప్రియులకు ఊరట కలిగింది. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు (Today Gold Rate) నేడు కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్మార్కెట్ అలర్ట్: నాలుగు రోజులే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ వారం సెలవుల కారణంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య ట్రేడింగ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, వారాంతపు సెలవుల సందర్భంగా మూడు రోజులు మార్కెట్లకు సెలవు ఉంటుంది.మార్కెట్ సెలవుల వివరాలుఏప్రిల్ 14 (మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పూర్తిగా మూసిఉంటాయి. అలాగే వారాంతపు సెలవులైన ఏప్రిల్ 18 (శనివారం), ఏప్రిల్ 19 (ఆదివారం) మార్కెట్లు యధావిధిగా పనిచేయవు. మంగళవారం విరామం తర్వాత, ఏప్రిల్ 15 (బుధవారం) ఉదయం నుండి ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.ఈ విభాగాల మూసివేతఅంబేడ్కర్ జయంతి నాడు కేవలం ఈక్విటీ మార్కెట్ మాత్రమే కాకుండా.. డెరివేటివ్స్, కరెన్సీ, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O), ఫారెక్స్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా క్రయవిక్రయాలు నిలిచిపోతాయి. అలాగే సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్లకు కూడా సెటిల్మెంట్ హాలిడే కావడంతో లావాదేవీల క్లియరెన్స్లో జాప్యం ఉండవచ్చు.కమోడిటీ మార్కెట్మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ట్రేడింగ్ చేసే వారికి కొంత ఊరట లభించనుంది. ఇక్కడ మార్కెట్ పూర్తిగా మూసిఉండదు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ట్రేడింగ్ ఉండదు. ఈ సమయంలో బంగారం, వెండి, ముడిచమురు వంటి లోహాల వ్యాపారం నిలిచిపోతుంది. సాయంత్రం 5:30 గంటల నుండి ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది. -
కోటక్, యాక్సిస్.. న్యూఫండ్ ఆఫర్స్
కోటక్ మహీంద్రా ఏఎంసీ తాజాగా మల్టీ అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ని ఆవిష్కరించింది. ఇందులో ఏప్రిల్ 22 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000గా ఉంటుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీ ఆధారిత స్కీముల యూనిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిసు్కకు తగ్గట్లుగా మరింత మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యంగా ఉంటుంది. ఒకే ఫండ్ ద్వారా డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యాక్సిస్ డిఫెన్స్ ఫండ్యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ డిఫెన్స్ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ రంగానికి కేంద్రం ఎంతో ప్రా ధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దేశీయంగానే అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి, తయారీ దిశగా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.మారిన ప్రపంచ క్రమంలో రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తోంది. 2013–14 నుంచి చూస్తే రెండున్నర రెట్లు పెరిగి 2025–26 నాటికి రూ.6.8 ల క్షల కోట్లకు కేటాయింపులు పెరిగాయి. దీంతో రక్షణ రంగంలోని కంపెనీలు దీర్ఘ కాలానికి మెరుగైన అవకాశాలు కల్పిస్తుండడంతో ప్రత్యేకంగా డిఫెన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ను ప్రారంభించింది. -
మార్కెట్కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ?
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశి్చమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి డీల్ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్పై దీని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు మొదలై హార్మూజ్ జలసంధిలో తిరిగి ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తే.. క్రూడ్ ధరలు దూసుకెళ్లడంతో పాటు దీని సెగ మార్కెట్కు గట్టిగానే తగలవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం (14న) మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్పశ్చిమాసియాలో చోటుచేసుకునే కీలక పరిణామాలకు తోడు క్రూడ్ ధరల కదలికలు మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య సీజ్ఫైర్... శాంతి ఒప్పందంపై ఆశలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రివ్వుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రూడ్ 100 డాలర్ల కిందికి జారడంతో సూచీలకు బూస్ట్ లభించింది. అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పేందుకు ఇరాన్ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించగా.. యూఎస్ అలవికాని డిమాండ్లే డీల్ కుదరకపోవడానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ పేర్కొనడం విశేషం.చర్చలు విఫలమైన నేపథ్యంలో సమీపకాలానికి మార్కెట్ ముఖచిత్రం మళ్లీ మారిపోయే అవకాశం ఉందని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ ఎనలిస్ట్ హరిప్రసాద్ కె అభిప్రాయపడ్డారు. ’నిఫ్టీ శరవేగంగా తిరిగి 24,000 స్థాయిని అధిగమించిన నేపథ్యంలో సూచీకి ఈ వారం చాలా కీలకంగా మారనుంది. అయితే, ఇరాన్–అమెరికా శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. సోమవారం సూచీలు భారీ గ్యాప్డౌన్తో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తాజా సీజ్ఫైర్ ర్యాలీలో ఆర్జించిన లాభాలు చాలా వరకు ఆవిరయ్యే ప్రమాదం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం డేటా.. ఈ వారంలో విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపనున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఏప్రిల్ 13న, టోకు ధరల ద్రవ్యోల్బణం 14న వస్తుంది. ఆహార ధరల మంటతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకగా.. టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ట స్థాయి అయిన 2.13 శాతానికి చేరింది. రానున్న కాలంలో ఆర్బీఐ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గణాంకాలు కీలక పాత్ర పోషించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ డేటాపై మరింత ఫోకస్ చేయనున్నారు.ఫలితాలపై దృష్టి... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4) ఫలితాల సీజన్ను గతవారంలో టీసీఎస్ బోణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. క్యూ4తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా మార్కెట్కు దిక్సూచిగా నిలుస్తాయని మిశ్రా పేర్కొన్నారు.సాంకేతికంగా చూస్తే... ఇరాన్–అమెరికా చర్చలు విఫలం కావడంతో మార్కెట్ గ్యాప్డౌన్తో మొదలైతే 23,700 వద్ద తొలి మద్దతు లభించచ్చని.. ఆ స్థాయిని కోల్పోతే 23,500 మద్దతు కీలకమని మార్కెట్నిపుణులు చెబుతున్నారు. ఇక సూచీ గనుక పెరిగితే 24,100 వద్ద తొలి నిరోధం, ఆపై 24,300 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉందనేది వారి విశ్లేషణ.గత వారమిలా...ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలోపేతం, క్రూడ్ ధరలు శాంతించడం వంటి పరిణామాలతో దేశీ మార్కెట్లు కూడా భారీగా కోలుకున్నాయి. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,231 పాయింట్లు (5.77%) దూసుకెళ్లగా.. ఎస్ఎస్ఈ నిఫ్టీ 1,338 పాయింట్లు (5.88%) ఎగబాకింది.విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల బాట... దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల తొలి 10 రోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.48,213 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం దీనికి నిదర్శనం. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల నికర పెట్టుబడుల అనంతరం, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో ఇప్పటిదాకా మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను వారు ఉపసంహరించుకున్నారు.పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్ భారీ పతనానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కీలకంగా నిలిచాయి. ‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు భగ్గుమనడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రిస్కులు తీవ్రమయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఎఫ్పీఐల భారీ అమ్మకాలకు పురిగొల్పుతున్నాయి’ అని మార్నింగ్ స్టార్ రీసెర్చ్ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!
భారతదేశంలో బంగారం ధరల మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా వేడెక్కుతున్నాయి. లేటెస్ట్ సిల్వర్ రేటు.. గత ఆదివారం రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ కథనంలో ఏడు రోజుల్లో వెండి ధరల ప్రవాహం ఎలా సాగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి. రేట్లు పెరగడానికి కారణం ఏమిటనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.వెండి ధరలుఏప్రిల్ 5న.. అంటే గత ఆదివారం రోజు 2.55 లక్షల రూపాయల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు శనివారం నాటికి రూ.2.65 లక్షలకు చేరింది. ఈ రోజు (ఆదివారం) వెండి రేటు స్థిరంగా రూ.2.65 లక్షల వద్దనే నిలిచింది. హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో ఈ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వెండి రేటు వారం రోజుల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది.వెండి రేటు పెరగడానికి కారణాలుపారిశ్రామిక వినియోగం: వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరిగితే వెండి ధర కూడా పెరుగుతుంది.పెట్టుబడిదారుల డిమాండ్: ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రజలు సురక్షిత పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తారు. ఇది ధరను అమాంతం పెంచుతుంది.బంగారం ధరల ప్రభావం: బంగారం ధరలు కూడా వెండి రేటును ప్రభావితం చేస్తాయి. పసిడి ధరలు పెరిగితే, కొంతమంది వెండిలో పెట్టుబడి పెడతారు. అందువల్ల వెండి ధర కూడా పెరుగుతుంది.డాలర్ విలువ మార్పులు: అమెరికన్ డాలర్ బలహీనమైతే, వెండి వంటి లోహాల ధరలు సాధారణంగా పెరుగుతాయి.సరఫరా లోపం: ఖనిజ ఉత్పత్తి తగ్గినా లేదా మైనింగ్లో సమస్యలు వచ్చినా, వెండి సరఫరా తగ్గి ధర పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, వెండి వంటి విలువైన లోహాలను నిజమైన ఆస్తులుగా భావిస్తారు. కాబట్టి చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా రేటు పెరుగుతుంది.ప్రభుత్వ విధానాలు, దిగుమతులు: పన్నులు, దిగుమతి సుంకాలు పెరిగితే దేశీయంగా వెండి ధరలు పెరగవచ్చు.ఇదీ చదవండి: IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు! -
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది. -
బంగారం ఈరోజు కొంటే.. ఇదే రేటు!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు (Today Gold Rate) స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.వెండి ధరలువెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారు.. తారుమారు! ధరలు మారాయిలా..
దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రితం రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు మళ్లీ పెరుగుదలను అందుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 23,926 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 458 పాయింట్లు ఎగబాకి 77,122 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరిగింది.నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.Today Nifty position 10-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి, వెండి రివర్స్గేర్
న్యూఢిల్లీ: అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధానికి రెండు వారాల విరామంపై అంగీకారంతో ర్యాలీ చేసిన పసిడి, వెండి ఒక్క రోజు తిరగకుండానే గురువారం అమ్మకాల ఒత్తిడికి నష్టపోయాయి. కాల్పుల విరమణకు విరుద్ధంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసిందంటూ, ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరికలు, హర్మూజ్ను మూసేసిందన్న వార్తలతో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.ఈ ప్రభావంతో ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి ఏకంగా రూ.7,800 నష్టపోయి రూ.2.43 లక్షలకు దిగొచి్చంది. అటు బంగారం 10 గ్రాములకు రూ.1,500 తగ్గి రూ.1,54,900 స్థాయికి పరిమితమైంది. ‘పశి్చమాసియాలో కాల్పుల విరమణపై ఏర్పడ్డ సందేహాలతో బంగారం, వెండి ముందటి రోజు లాభపడిన స్థాయిలో నష్టపోయాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అనిశి్చతులు నెలకొనడం, ట్యాంకర్లు నిలిచిపోయాయన్న సమాచారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపించింది.దీంతో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు తిరిగి నెలకొన్నాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 12 డాలర్లు పెరిగి 4,789 డాలర్ల వద్ద ఉంటే, వెండి 0.74 డాలర్ల నష్టంతో 74.83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎప్పుడు, ఎలా పొందాలనే విషయం వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి ప్రకారం.. మనం జీవితాంతం ఇతరుల కోసం పని చేస్తూ ఉంటే, మనకు తక్షణ అవసరాలు తీరవచ్చు. కానీ.. దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాటల అర్థం ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఉద్యోగం మనకు ఆదాయం ఇస్తుంది, కానీ అది ఒకే మార్గంగా ఉంటే, మనం సంపదను సృష్టించలేము.మనం సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడులుగా మార్చి, మనకోసం పని చేసే ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు.. ఇల్లు అద్దెకు ఇవ్వడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం. ఇవి మనం పని చేయకపోయినా డబ్బు తీసుకువస్తాయి.ఆదాయం కోసం పనిచేయడం అంటే.. ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా లేనట్లే. అంటే మనం పని చేయలేకపోతే, ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆస్తులు ఉంటే.. అవి మనకోసం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాయి. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం.చాలా మంది ''స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు, జీవితం సురక్షితం'' అని భావిస్తారు. కానీ నేటి కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థిక నిర్ణయాలు క్లిష్టమవుతున్నాయి. చాలా మంది నెలాఖరులో డబ్బు మిగలకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రాబర్ట్ కియోసాకి ఈ విధమైన పరిష్కారం చెబుతున్నారు.కియోసాకి మాటలను జీవితంలో అమలు చేయాలంటే?➤ముందుగా మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. ➤ప్రతి నెలలో కొంత మొత్తాన్ని ముందుగా పెట్టుబడిగా పెట్టాలి. ➤ఆర్థిక విషయాలపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.➤మన పని సమయానికి సంబంధం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించాలి.➤పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ముందు.. అది మనకు లాభం తెస్తుందా లేక నష్టమా అనేది ఆలోచించాలి.మొత్తం మీద ''కేవలం కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేసి మనకోసం పని చేసే వ్యవస్థలను నిర్మించాలి''. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం అని కియోసాకి విశ్వసిస్తారు.ఇదీ చదవండి: ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్! -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 23,775.10 వద్ద నిలిచాయి.ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రీతి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్షర్ స్పిన్టెక్స్ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, రుషిల్ డెకార్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు భారీగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు గణనీయంగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా తగ్గుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.51 శాతం పెరిగింది.నాస్డాక్ 2.8 శాతం పుంజుకుంది.Today Nifty position 09-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్–సిల్వర్ జూమ్.. క్రూడ్ క్రాష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్ పడటంతో బంగారం, వెండి ధరలు తిరిగి జోరందుకున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణకు తెరలేవడంతో విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ వివరాల ప్రకారం స్థానిక మార్కెట్లో కేజీ వెండి రూ. 11,000 (5 శాతం) జంప్చేసి రూ. 2,51,000ను తాకింది. ఇక మేలిమి బంగారం సైతం 10 గ్రాములు రూ. 3,200 (2 శాతం) ఎగసి రూ. 1,56,400కు చేరింది. విదేశీ మార్కెట్లోనూ: అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి, బంగారం మెరిశాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 2 శాతంపైగా (97 డాలర్లు) బలపడి 4,803 డాలర్లకు చేరింది. మరోపక్క సిల్వర్ ఔన్స్ 6% జంప్చేసి 77.33 డాలర్లను తాకింది. హార్మూజ్ను తెరిచే వీలున్నట్లు ఇరాన్ సంకేతాలివ్వడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ముడిచమురు 20% క్షీణత కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న క్రూడ్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నౌకల రవాణాకు అడ్డంకులు తొలగనున్న అంచనాలతో చమురు ధరలు తొలుత 20% పతనమయ్యాయి. తదుపరి బ్రెంట్ పీపా 15.5% (17 డాలర్లు) దిగజారి 92 డాలర్లస్థాయిలో ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ పీపా 18% (20 డాలర్లు) పడిపోయి 93 డాలర్ల దిగువకు చేరింది. రూపాయికి జోష్ పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతించడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 1%పైగా బలహీనపడి 98.5కు చేరింది. దీంతోపాటు.. దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేయడం రూపాయికి బలాన్నిచి్చనట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 52 పైసలు పుంజుకుని 92.54 వద్ద ముగిసింది. -
వార్ సీజ్.. బుల్స్ ఫైర్!
ముంబై: ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల పాటు సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. సీజ్ఫైర్తో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు రావడం, ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం, రూపాయి రికవరీ వంటి అంశాలు సూచీల భారీ లాభాలకు దోహదపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,946 పాయింట్లు (3.95%) ఎగసి 77,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78%) పెరిగి 23,997 వద్ద నిలిచింది. గతేడాది(2025) మే 12వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద లాభం. అలాగే వరుసగా అయిదో లాభాల ముగింపు కూడా. భారీ లాభాలతో షురూ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో 74,617 వద్ద, నిఫ్టీ 731 పాయింట్లు పెరిగి 23,855 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆర్బీఐ వరుసగా రెండోసారీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆరంభ ఉత్సాహం ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్ 3,019 పాయింట్లు ర్యాలీ చేసి 77,636 వద్ద, నిఫ్టీ 901 పాయింట్లు దూసుకెళ్లి 24,025 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. గడిచిన అయిదేళ్లలో సూచీలకిదే ఇంట్రాడేలో అతి పెద్ద లాభం. అంతర్జాతీయ మార్కెట్లు రయ్... పశ్చిమాసియాలో శాంతి పవనాలతో ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 6.43%, జపాన్ 5.11%, తైవాన్ 4.41%, ఇండోనేసియా 4.23%, హాంగ్కాంగ్ 3%, చైనా 2.62%, సింగపూర్ 1.39 శాతం లాభపడ్డాయి. యూరప్ ఫ్రాన్స్ 5%, సీఏసీ 4.47%, ఎఫ్టీఎస్ఈ 2.58 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీలు నాస్డాక్ 2.63%, డోజోన్స్ సూచీ 2.49 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 6.76%, ఆటో 6.55%, పీఎస్యూ బ్యాంక్స్ 5.79%, బ్యాంకెక్స్ 5.72%, ప్రైవేటు బ్యాంక్స్ ఇండెక్స్ 5.62%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.48%, సర్వీసెస్ 5.22%, కన్జూమర్ డిస్క్రేషనరీ 5.11 శాతం ర్యాలీ చేశాయి. మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 5%, 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండిగో 8.16%, ఎల్అండ్టీ 7.64%, బజాజ్ ఫైనాన్స్ 7.03%, ఎంఅండ్ఎం 6.79% యాక్సిస్ బ్యాంక్ 6.56 శాతం అత్యధికంగా లాభపడిన టాప్–5 షేర్లుగా నిలిచాయి. టెక్ మహీంద్రా (–1.53%), సన్ఫార్మా(–0.29%), పవర్గ్రిడ్ (–0.20%) మాత్రమే నష్టపోయాయి. → గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్ 11.38%, అదానీ ఎనర్జీ 8.78%, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.62%, అదానీ టోటల్ గ్యాస్ 7.60% ర్యాలీ చేశాయి. → ఎన్డీటీవీ 6.48%, అంబుజా సిమెంట్స్ 6.28%, అదానీ పోర్ట్స్ 5.28 %, ఏసీసీ 5.20%, అదానీ పవర్ 3.55% పెరిగాయి. అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.22 లక్షల కోట్లకు చేరింది. → సీజ్ఫైర్ ఎఫెక్ట్తో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఏవియేషన్ షేర్లు రివ్వున ఎగిశాయి. ఇండిగో షేరు 8.16% లాభపడింది. స్పైస్ జెట్ షేరు 5% లాభపడి రూ.11.14 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.రూ.16.25 లక్షల కోట్ల సంపద సృష్టి సూచీల చరిత్రలో రెండో అతిపెద్ద ర్యాలీతో స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు చేరింది. -
సెప్టెంబర్ వరకూ ఐపీవో గడువు పెంపు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలతోపాటు.. పబ్లిక్కు కనీస వాటా కేటాయింపు గడువును పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ముగిసిపోయే ఐపీవోల అనుమతుల గడువును 2026 సెప్టెంబర్30 వరకూ పొడిగించింది.ఇదేవిధంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే నిబంధనల విషయంలోనూ 2026 సెప్టెంబర్ 30 వరకూ వెసులుబాటు(ఒకేసారి)కు తెరతీసింది. రెండింటికీ విడిగా సర్క్యులర్లను జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు పబ్లిక్కు కనీస వాటా నిబంధనలను అమలు చేయవలసిన లిస్టెడ్ కంపెనీలకు 2026 సెప్టెంబర్ 30వరకూ గడువు లభించింది.గతంలో కరోనా మహమ్మారి తలెత్తిన కాలంలోనూ సెబీ ఇదేతరహా వెసులుబాటును కల్పించిన విషయం విదితమే. పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి, మార్కెట్ ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకుని సెబీ గడువు పెంపునకు నిర్ణయించింది. -
సీజ్ఫైర్ : పాక్ మార్కెట్లు ఫైర్, ట్రేడింగ్ నిలిపివేత!
అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గ్లోబల్ మార్కెట్లను భారీ ఊరట నిచ్చాయి. పెట్టుబడుదారుల సెంటిమెంట్ బలపడటంతో దాదాపు అన్ని మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పేలవంగా ఉన్న పాకిస్తాన్ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం. ఏప్రిల్ 8న ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో పాకిస్తాన్ బెంచ్మార్క్ స్టాక్ సూచీ 12,000 పాయింట్లకు పైగా పెరిగి, ఒకే రోజులో అత్యధిక ర్యాలీని నమోదు చేసింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్న పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లోని అస్థిరత కాలం తర్వాత ఈ భారీ ర్యాలీ చోటు చేసుకుంది. స్థానిక దినపత్రిక డాన్ ప్రకారం, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ KSE-100 సూచీ 8.15 శాతం పెరిగి 164,035.83 పాయింట్లకు చేరుకుంది. KSE-100 సూచీ చరిత్రలో ఒకే రోజులో నమోదైన అత్యధిక పెరుగుదల ఇదే. దీంతో ఏరంగా ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అనుగుణంగా ట్రేడింగ్ను నిలిపివేయడం విశేషం. రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఖరారైన తర్వాత ఈ లాభాలు నమోదయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ప్రపంచంలోని కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని టెహ్రాన్ తిరిగి తెరిస్తే, దానికి బదులుగా వాషింగ్టన్ సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించింది. రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి టెహ్రాన్ అనుమతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ధృవీకరించారు.ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఒక "నిర్ణయాత్మక ఒప్పందం" కుదుర్చుకోవడమే ఈ చర్చల లక్ష్యమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఈ చర్చలు ఇస్లామాబాద్లో జరగవచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధికాగా ఫిబ్రవరి 28న మొదలైన ఇరన్పై యుద్ధం ప్రారంభంలో కూడా ఎక్స్ఛేంజ్ భారీ నష్టాలను చవిచూసింది. ఆ తరువాత ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తల నేపథ్యంలో,మార్చి 2న KSE-100 సూచీ 16,089 పాయింట్లు లేదా 9.57 శాతం మేర పడిపోయి, ఒక్కరోజులో అత్యంత తీవ్రమైన క్షీణతను నమోదు చేసింది.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు! -
కాసుల వర్షం: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ స్థితిని కొనసాగించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఐదు రోజుల లాభాల పరంపరను నమోదు చేశాయి.నిఫ్టీ 3.78 శాతం లేదా 873.70 పాయింట్ల లాభంతో 23,997.35 వద్ద, సెన్సెక్స్ 3.95 శాతం లేదా 2,946.32 పెరిగి 77,562.90 వద్ద ముగిశాయి.ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization) రూ. 16.59 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 446 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 4.03 శాతం, 4.39 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో సహచర రంగాలను అధిగమించాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ తక్కువ లాభాలతో తక్కువ పనితీరు కనబరిచింది.ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ సమీక్షలో బెంచ్మార్క్ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. పర్యవసానంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు కూడా వరుసగా 5 శాతం, 5.5 శాతం వద్ద మారలేదు. -
మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బుల్రన్.. 2600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 761 పాయింట్లు పెరిగి 23,890 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2602 పాయింట్లు ఎగబాకి 77,198 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.9బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 08-04-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని నివారిస్తూ ఇరాన్పై తలపెట్టిన సైనిక చర్యను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి తొలగి పెట్టుబడిదారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 2 శాతంపైగా లాభపడటం భారత మార్కెట్లలో బుల్ రన్కు సంకేతాలు పంపుతోంది.ట్రంప్ వ్యూహాత్మక అడుగుఏప్రిల్ 8, 2026 ఉదయం 4:30(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ల మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంతో సైనిక దాడులను 14 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వినాశకరమైన యుద్ధం కంటే శాంతికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అయితే హార్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరిస్తేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు.చమురు ధరల పతనం..యుద్ధం వాయిదా పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ దాదాపు 18 శాతం తగ్గి 92.60 డాలర్లు వద్దకు చేరింది. బ్రెండ్ క్రూడ్ 6 శాతం తగ్గి 103.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటం వల్ల సరఫరా పునరుద్ధరిస్తారనే ఆశలు చిగురించాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతానికి పైగా ఈ మార్గం నుంచే సాగుతుండటంతో గడిచిన నెల రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు కిందికి దిగివస్తున్నాయి.దలాల్ స్ట్రీట్లో పండగభారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 450 పాయింట్ల పైగా లాభంతో ఉంది. దీని ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు చారిత్రాత్మక గరిష్టాలను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్లో నికాయ్, హాంగ్ సెంగ్ మార్కెట్లు ఇప్పటికే 2-3 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.ఇంతకాలం యుద్ధం వస్తుందేమో అన్న ఆందోళనతో నగదును వెనక్కు తీసుకున్న ఇన్వెస్టర్లకు ఇదొక గొప్ప ఊరట. ఇరాన్ తన 10 సూత్రాల శాంతి ప్రణాళికను అమలు చేస్తే ఈ రెండు వారాల విరామం శాశ్వత శాంతికి దారి తీయవచ్చు. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు చమురు ధరల తగ్గింపు బూస్టర్ డోస్ లాంటిది. అయితే, ఇది కేవలం రెండు వారాల గడువు మాత్రమేనని, మధ్యవర్తిత్వ చర్చల ఫలితాలను బట్టే మార్కెట్ల తదుపరి దిశ ఉంటుందని పెట్టుబడిదారులు గమనించాలి.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 509.73 పాయింట్ల లాభంతో 74,616.58 వద్ద, నిఫ్టీ 155.40 పాయింట్ల లాభంతో 23,123.65 వద్ద నిలిచింది.ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్, ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఉమా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ల్యాండ్మార్క్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్స్) లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 149 పాయింట్లు నష్టపోయి 22,819 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 505 పాయింట్లు దిగజారి 73,694 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.11బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 111 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.44 శాతం పెరిగింది.నాస్డాక్ 0.54 శాతం పుంజుకుంది.Today Nifty position 07-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు!
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 787.30 పాయింట్లు లేదా 1.07 శాతం లాభంతో 74,106.85 వద్ద, నిఫ్టీ 255.15 పాయింట్లు లేదా 1.12 శాతం లాభంతో 22,968.25 వద్ద నిలిచింది.అల్పా లాబొరేటరీస్ లిమిటెడ్, STL గ్లోబల్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్కేఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గీకే వైర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్..
దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. వరుసగా రెండో రోజులు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నాలుగు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 22,707 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 89 పాయింట్లు దిగజారి 73,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.15బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 109.84 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.11 శాతం పెరిగింది.నాస్డాక్ 0.18 శాతం పుంజుకుంది.Today Nifty position 06-04-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రమోటర్ల దారెటు..?
కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్ యుద్ధం. మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్నాయి. గడిచిన ఆరునెలల రికార్డు చూస్తే 90 శాతానికి పైగా స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ 50 శాతానికి పైగా నష్టపోయాయంటే అతిశయోక్తి కాదు. కొందరేమో ఇపుడు కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేయొచ్చని చెబుతున్నారు. మరికొందరేమో ఇంకొన్నాళ్లు ఆగాలని చెబుతున్నారు. ఒకరకంగా ఇది గందరగోళ పరిస్థితే. ఇప్పటికే బాగా నష్టపోయిన వారి పరిస్థితయితే మరీ దారుణం. మరేం చెయ్యాలి? ఈ ప్రశ్నకు జవాబు వెదికే ముందు మరో సంగతి చూద్దాం.. అది.. ప్రమోటర్లు ఏం చేస్తున్నారనేది. ఎందుకంటే ప్రమోటర్లు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా వారి కంపెనీలో వారికున్న షేర్లనూ విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు కొంటుంటారు. షేరు ధర పడిపోతే వారి కంపెనీ విలువతో పాటు వారి షేర్ల విలువా తగ్గిపోయినట్టే. తాజా పతనంలో వారూ నష్టపోయినట్లే. అయితే సొంత కంపెనీ షేర్లను కొంటున్నా, అమ్ముతున్నా అది మిగిలిన ఇన్వెస్టర్లకు వారిస్తున్న సంకేతంగానే భావించాలి. ఎందుకంటే మిగతా వారందరి కన్నా ఫౌండర్స్, మేనేజ్మెంటుకే కంపెనీ వాస్తవ స్థితిగతులు ఎక్కువగా తెలుస్తాయి. వారు స్పెక్యులేషన్ బట్టి కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టే ప్రమోటర్లు తమ షేరును కొనడాన్ని మార్కెట్ కొంత సానుకూల విషయంగా పరిగణిస్తుంది. వారు సొంత డబ్బును మరింతగా ఇన్వెస్ట్ చేయడాన్ని కంపెనీ వ్యాపారంపై వారికి గల ధీమాగా భావిస్తుంది. ప్రమోటర్లు ఇలా కొనుగోళ్లు, అమ్మకాలు జరపడమనేది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? సాధారణ ఇన్వెస్టర్లు వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? సదరు స్టాక్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? ఇందులో పొంచి ఉన్న రిస్కులు ఏమిటి? ఇవన్నీ ఈ వెల్త్ స్టోరీలో చూద్దాం... కొనుగోళ్లకు ఎందుకంత ప్రాముఖ్యత.. ప్రమోటర్లు షేర్లను కొనుక్కోవడమనేది ఒకోసారి స్టాక్ విలువ ఉండాల్సిన స్థాయి కంటే తక్కువే ఉందని (అండర్వేల్యుయేషన్) భావించడానికి సంకేతంగా చూడొచ్చు. అలాగే, దీర్ఘకాలికంగా వ్యాపారంపై వారికున్న నమ్మకాన్ని ప్రతిబింబించవచ్చు. సాధారణంగా ఆదాయాలు మెరుగుపడటానికి, స్టాక్ రీ–రేటింగ్కి ముందు ఇలాంటివి కనిపిస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే.. స్టాక్ తగ్గిందంటే దానిపై మార్కెట్లో నిరాశపూరిత ధోరణికి సిగ్నల్గా, ప్రమోటర్లు కొంటున్నారంటే.. కాని్ఫడెన్సుకి సంకేతంగా పరిగణిస్తుంటారు.ఈ డేటాను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ప్రమోటర్లు కొన్ని త్రైమాసికాలుగా స్థిరంగా కొనుక్కుంటూ ఉండవచ్చు. మార్కెట్లు కరెక్షన్కి లోనైనప్పుడు కొనుక్కుంటూ ఉండొచ్చు. ఇలాంటి వాటిని ట్రాక్ చేయాలి. ప్రమోటర్లు అదనంగా కొంటున్నారేమో చూడాలి. షేర్హోల్డింగ్ ప్యాటర్న్ను ప్రమోటర్ సైకాలజీగా చూడాలి. ఎలా ట్రాక్ చేయొచ్చు..ప్రమోటర్ల యాక్టివిటీని దేశీయంగా ట్రాక్ చేసేందుకు కొన్ని సాధనాలున్నాయి. రియల్ టైమ్ డిస్క్లోజర్స్కి సంబంధించి సెబీ పీఐటీ (ఇన్సైడర్ ట్రేడింగ్) ఫైలింగ్స్లో చాలా తరచుగా, దాదాపు రియల్ టైమ్లో వివరాలు అందుబాటులో ఉంటాయి. అదే వాటాల్లో మార్పులేవైనా చోటు చేసుకుంటే సెబీ ఎస్ఏఎస్టీ ఫైలింగ్స్లో తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఇన్సైడర్ ట్రేడింగ్ డిస్క్లోజర్లు, రెగ్యులేషన్ 10(5) .. 10 (6), ఎస్ఏఎస్టీ థ్రెషోల్డ్ ఫైలింగ్స్ రూపంలో ఉంటాయి.ప్రమోటరు అమ్మడం పూర్తి నెగటివ్ కాదు.. ప్రమోటర్లు అమ్ముతున్నారంటే తప్పకుండా దుర్వార్త ఏదో ఉండే ఉంటుందనే అభిప్రాయం అపోహ మాత్రమే. వివిధ కారణాలరీత్యా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయిస్తుండవచ్చు. వెల్త్ డైవర్సిఫికేషన్, కొత్త వెంచర్లకు నిధులను సమకూర్చుకోవడం, ఫ్యామిలీ లేదా ఎస్టేట్ ప్లానింగ్ కూడా కారణం కావచ్చు. ఇలాంటివేవీ కాకపోయి ఉంటే ప్రమోటర్ల విక్రయాలు కొన్ని సార్లు నిర్దిష్ట సంకేతాలు ఇస్తాయి. ర్యాలీ తర్వాత వేల్యుయేషన్ భారీ స్థాయికి చేరిపోయి ఉండొచ్చు. ఎరి్నంగ్స్, ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ట్రేడవుతూ ఉండొచ్చు. లేదా వ్యూహాత్మకంగా లాభాల స్వీకరణ కోసం కూడా ప్రమోటర్లు కొంత వాటాలు అమ్ముకోవచ్చు. గుర్తుంచుకోవాల్సినది.. ప్రమోటర్లు కొనడమనేది కంపెనీ సామర్థ్యాలకు సంబంధించి శక్తివంతమైన సంకేతమే. కానీ దీని వెనుక ఉద్దేశాలను బట్టి రిస్కులు ఉండొచ్చు. కొనుక్కోవడమనేది స్టాక్ పతనాన్ని అడ్డుకునేందుకు కావొచ్చు, వేల్యూ ట్రాప్ చేసేందుకు కావొచ్చు, ధీమా ముసుగు వేసి బలహీన ఫండమెంటల్స్ని అధిగమించేందుకు కావచ్చు. ఇలా ఏదైనా కారణం కావచ్చు. కాబట్టి ప్రమోటర్లు కొనుగోళ్ల వ్యవహారాన్ని ఆర్థిక అంశాల విశ్లేషణ, క్యాష్ ఫ్లో, కార్పొరేట్ గవర్నెన్స్, తీసుకున్న రుణాలు.. తనఖా స్థాయులతో కలిపి అధ్యయనం చేస్తే అసలు విషయంపై మరికాస్త మెరుగైన అవగాహన ఏర్పడవచ్చు. ప్రమోటర్లు చాలా స్మార్ట్ ఇన్సైడర్స్. వారు తీసుకునే చర్యలనేవి నమ్మకాన్ని, వ్యూహాన్ని ప్రతిబింబిస్తాయి. వేల్యుయేషన్ని సూచిస్తాయి. అయితే, ఇన్సైడర్ సంకేతాలతో పాటు ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రయోజనం చేకూరుతుంది. ఇలాంటి సందర్భాల్లో గందరగోళానికి లోను కాకుండా దీర్ఘకాలిక దృష్టి కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. ప్రమోటర్ సిగ్నల్ అనేది దిక్సూచి మాత్రమే తప్ప మ్యాప్ కాదు.– సాక్షి వెల్త్ -
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.గత ఆదివారం అంటే.. మార్చి 29న కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ.2.50 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. శనివారం (ఏప్రిల్ 4) నాటికి రూ.2.55 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో ధర పెరుగుతూ.. తగ్గుతూ కొత్త మార్కుకు చేరిందన్నమాట. ఈ ధరలు గత నెలతో పోలిస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. ఇదే ధరలు బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో మాత్రం వారం రోజుల్లో సిల్వర్ రేటు రూ.2.45 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు చేరింది. నిజానికి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే రాజధాని నగరంలో కొంత తక్కువగానే ఉంటుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలుడిమాండ్ పెరగడం: వెండి నగలు (జ్యువెలరీ), ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిశ్రమలలో వినియోగం పెరిగితే వెండి డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి.సరఫరా తగ్గడం: గనుల్లో ఉత్పత్తి తగ్గడం లేదా సరఫరాలో అంతరాయం కలిగితే మార్కెట్లో వెండి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బును భద్ర పెట్టుబడులలో పెట్టాలని చూస్తారు. అప్పుడు వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరుగుతుంది.కరెన్సీ విలువ తగ్గడం: ముఖ్యంగా డాలర్ విలువ పడిపోతే, వెండి ధరలు పెరుగుతాయి.పెట్టుబడిదారుల ఆసక్తి: స్టాక్ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు వెండి వంటి ఆస్తులలో పెట్టుబడి పెడతారు.జియోపాలిటికల్ పరిస్థితులు: యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ప్రజలు సురక్షిత పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కాబట్టి వెండి ధరలు పెరుగుతాయి.ప్రభుత్వ విధానాలు: దిగుమతి సుంకాలు, పన్నులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. -
త్వరలో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహం!
ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్)తో స్టాక్ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో మదుపరుల రక్షణార్థం గూగుల్, మెటా తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఆర్థిక నియంత్రణ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు.త్వరలోనే మరోసారి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహానికి వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి మార్కెట్లో వాటాదారులందరికీ రక్షణ కల్పింపంచవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 14 కోట్లను తాకినట్లు వెల్లడించారు. మరోపక్క మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 423 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేశారు. వెరిఫైడ్ యాప్ లేబుల్ను గూగుల్ ప్రవేశపెట్టిన సందర్భంగా పాండే ఈ అంశాలను ప్రస్తావించారు. -
బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా..
దేశంలో గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు పసిడి ధరలు (Today Gold Rate) వరుసగా రెండో రోజూ నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరల్లో (Today Silver Rate) కూడా ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలకు దెబ్బ
ముంబై: దేశీయంగా శుద్ధి చేసిన పొద్దుతిరుగుడుపువ్వు(సన్ఫ్లవర్) నూనె అమ్మకాల పరిమాణం 10 శాతం నీరసించనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సరఫరా సమస్యలకుతోడు.. పెరుగుతున్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వెరసి వినియోగదారులు ఇతర చౌక నూనెలవైపు దృష్టి సారించనున్నట్లు నివేదికలో క్రిసిల్ తెలియజేసింది. దీంతో డిమాండ్ మందగించి ఈ ఏడాది సన్ప్లవర్ ఆయిల్ అమ్మకాల పరిమాణం 10 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది. లాజిస్టిక్స్ వ్యయాలు పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే సరఫరా సవాళ్లు తలెత్తగా.. పెరుగుతున్న లాజిస్టిక్స్ వ్యయాలు అధిక ధరలకు దారితీస్తున్నట్లు నివేదికలో క్రిసిల్ వివరించింది. ఫలితంగా వినియోగదారులు తవుడు నూనె, సోయాబీన్ ఆయిల్ తదితరాలవైపు మళ్లనున్నట్లు పేర్కొంది. అయితే సన్ఫ్లవర్ అమ్మకాల ఆదాయం మాత్రం యథాతథంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. అధిక ధరల కారణంగా అమ్మకాల పరిమాణం వెనకడుగు వేయనున్నట్లు తెలియజేసింది. కాగా.. తక్కువ వ్యయాలలో గతంలో కొనుగోలు చేసిన నిల్వల కారణంగా సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైనరీల లాభదాయకత నిలకడను చూపనున్నట్లు విశ్లేషించింది. దీంతో అమ్మకాల పరిమాణం నీరసించినప్పటికీ చౌక వ్యయాల నిల్వలతో లాభాలపై ప్రభావం పడకపోవచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా 2.5–2.6 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగంలో సన్ఫ్లవర్ ఆయిల్ 12–14 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. వంట నూనెల పరిశ్రమ ముడిసన్ఫ్లవర్ ఆయిల్ కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ప్రపంచ వాణిజ్య విఘాతాలు, రాజకీయ భౌగోళిక అంశాలు పరిశ్రమను ప్రభావితం చేయనున్నట్లు వివరించింది. ఉక్రెయిన్, రష్యా నుంచి అత్యధికంగా దిగుమతులు నమోదవుతుంటాయి. అయితే హ ర్ముజ్ జల రవాణాకు విఘాతం ఏర్పడితే కేప్ఆఫ్ గుడ్హోప్ తదితర దూర తీరాల నుంచి వీటిని సమకూర్చుకోవలసి వస్తుందని తెలియజేసింది. -
వీసీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రైవేట్ క్యాపిటల్ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ, భారత్లో వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు మాత్రం గతేడాది జోరుగానే వచ్చాయి. 2025లో 16 బిలియన్ డాలర్ల మేర వీసీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికం. వివిధ స్థాయుల్లో 1,300 పైగా లావాదేవీలు జరిగాయి. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా వెంచర్ క్యాపిటల్ రిపోర్ట్ 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, లిక్విడిటీ కఠినతరం కావడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులు వృద్ధి చెందడం గమనార్హం. 2023లో రీసెట్ అయిన తర్వాత దేశీ వెంచర్ క్యాపిటల్ వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని బెయిన్ అండ్ కంపెనీ అసోసియేట్ పార్ట్నర్ ఆదిత్య మురళీధర్ తెలిపారు. మెరుగైన గవర్నెన్స్, సమర్ధవంతంగా పెట్టుబడుల వినియోగం, నిష్క్రమించేందుకు అవకాశాల పునాదులతో ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → 50 మిలియన్ డాలర్ల లోపు డీల్స్ గణనీయంగా నమోదయ్యాయి. → భారీ డీల్స్ కూడా పుంజుకున్నాయి. 250 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య నాలుగు నుంచి రెట్టింపై ఎనిమిదికి చేరింది. యూనిట్ ఎకనామిక్స్ పటిష్టంగా ఉండి, మానిటైజేషన్పై స్పష్టత ఉన్న కంపెనీల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. తీరుతెన్నూ లేని విస్తరణ కన్నా వ్యాపార నాణ్యతకే ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → కన్జూమర్ టెక్ సంస్థలకు నిధులు నెమ్మదించాయి. అయితే దీర్ఘకాలిక సత్తాను ప్రదర్శిస్తూ, ఈ విభాగంలోకి పెట్టుబడులు 2023 నుంచి వార్షికంగా 25 శాతం స్థాయిలో పెరిగాయి. → అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్ట ప్రోడక్టులను మాత్రమే సత్వరం డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చాయి. → టెక్నాలజీ ఆధారిత రంగాలు ఫండింగ్ రికవరీలో కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఫిన్టెక్ రంగం ప్రత్యేకంగా నిల్చింది. ఈ విభాగంలో డీల్స్ విలువ వార్షికంగా సుమారు 2.2 రెట్లు పెరిగింది. పెట్టుబడుల్లో పేమెంట్స్ కేటగిరీ అత్యధిక వాటా దక్కించుకోగా, డిజిటల్ వినియోగం, కుటుంబాల పొదుపు మొత్తాల పెరుగుదలతో వెల్త్టెక్ డీల్స్ విలువ అయిదు రెట్లు పెరిగింది. → సాఫ్ట్వేర్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) ఫండింగ్ 1.5 రెట్లు పెరిగింది. ఓ స్థాయికి చేరుకున్న ప్రస్తుత సంస్థలు కూడా మళ్లీ నిధుల బాట పట్టాయి. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ–నేటివ్ బీ2బీ కంపెనీలకు, ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్కేర్ రంగాల్లో వాటికి ఆదరణ లభిస్తోంది. → దీర్ఘకాలిక ఇన్వెస్టర్లలో ధీమాని ప్రతిఫలిస్తూ, భారత్పై ఫోకస్ చేసే వీసీలు, గ్రోత్ ఈక్విటీ ఫండ్స్ సమీకరించిన నిధులు వార్షికంగా రెట్టింపై 5.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకుని వైదొలిగేందుకు కూడా గత ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. మొత్తం ఎగ్జిట్ విలువలో పబ్లిక్ మార్కెట్ల మార్గంలో జరిగినది 65 శాతంగా నమోదైంది. -
గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?
వారం రోజులుగా బంగారం ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వారాంతంలో గోల్డ్ రేటు స్థిరంగా ఉంది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో ఎలాంటి మార్పులు జరిగాయి, ధరలు ఎక్కడకు చేరాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 29న 1,48,090 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ రోజుకి (శనివారం) 1,50,930 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 2840 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. 22 క్యారెట్ల తులం రేటు 1,35,750 రూపాయల దగ్గర నుంచి 1,38,350 రూపాయల (రూ.2600 పెరిగింది) వద్ద నిలిచింది.చెన్నైలో స్వచ్ఛమైన తులం బంగారం (24 క్యారెట్స్) ధర 1,49,020 రూపాయల దగ్గర నుంచి రూ.1,52,180 వద్ద (రూ.3160 పెరిగింది) నిలిచింది. 22 క్యారెట్ల రేటు ఏడు రోజుల్లో 1,36,600 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,500 (రూ.2900 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వారం రోజుల్లో అమాంతం పెరిగాయి. మార్చి 29న 1,48,220 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు.. ఏప్రిల్ 4 నాటికి 1,51,080 రూపాయలు (రూ.2860 పెరిగింది) పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 135900 రూపాయల నుంచి 138500 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే బంగారం ధరలు వారం రోజుల్లో భారీగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
పసిడి ప్రియులకు అలర్ట్.. నేటి బంగారం ధరలు ఇలా..
దేశంలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున మోస్తరుగా పెరిగిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక: తొలి ఆరు నెలల్లో..
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి (2026–27 ఏప్రిల్-సెప్టెంబర్) రూ.8 లక్షల కోట్ల రుణాలను మార్కెట్ నుంచి సమీకరించే ప్రణాళికతో ఉంది. ఆదాయం లోటును పూడ్చుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మేరకు నిధులను సమకూర్చుకోనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.17.20 లక్షల కోట్లను మార్కెట్ నుంచి నిధుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది.బడ్జెట్ సమర్పణ అనంతరం, ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్) మార్పిడి ప్రక్రియలు నిర్వహించడంతో స్థూల మార్కెట్ రుణాలు రూ. 16.09 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. ‘‘రూ.16.09 లక్షల కోట్లకు గాను రూ.8.20 లక్షల కోట్లను (మొత్తం లక్ష్యంలో 51%) మొదటి ఆరు నెలల్లో డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సమీకరించనున్నాం.ఇందులో రూ.15,000 కోట్లు సావరీన్ గ్రీన్ బాండ్ల జారీ కూడా ఉంటుంది. 2026–27లో వాస్తవ ద్రవ్యలోటు రూ.16.9 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల జారీ ద్వారా మార్కెట్ నుంచి నికర రుణ సమీకరణ రూ.11.7 లక్షల కోట్లుగా ఉంటుంది. మిగిలిన మొత్తం చిన్న మొత్తాల పొదుపు నిధులు, ఇతర వనరుల రూపంలో సమకూర్చుకోనున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. -
బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.గోల్డ్-సిల్వర్ రేషియోఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.బంగారం విలువను కోల్పోదు!ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.సమతుల్యత ఉత్తమం!పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం! -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్ సెషన్లో పడిపోయిన బంగారం ధరలు, ఇవ్వాళ మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
క్రాష్ టు బౌన్స్బ్యాక్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి అనూహ్యంగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. ఐటీ, బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గణనీయమైన రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇంట్రాడేలో 1,588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 185 పాయింట్ల లాభంతో 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం నుంచి 530 పాయింట్లు కోలుకుంది. ఆఖరికి 34 పాయింట్లు పెరిగి 22,713 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా 4.67%, జపాన్ 2.43%, ఇండోనేసియా 2.24%, తైవాన్ 1.85% క్షీణించాయి. చైనా, హాంగ్కాంగ్ 1%, సింగపూర్ అరశాతం నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ ఇండెక్సులు అరశాతం పతనమయ్యాయి. బ్రిటన్ సూచీ 1% పెరిగింది. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ క్రాష్: రానున్న 2–3 వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ హెచ్చరికలు, క్రూడాయిల్ ధరలు ఎగసిపడటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1,588 పాయింట్లు కుప్పకూలి 71,546 వద్ద, నిఫ్టీ 497 పాయింట్లు క్షీణించి 22,183 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. రికవరీ కారణాలు ఇవే: ఆర్బీఐ నియంత్రణ చర్యలతో డాలర్ మారకంలో రూపాయి విలువ గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 152 పైసలు బలపడింది. మిడ్ సెషన్ నుంచి ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన లార్జ్క్యాప్ షేర్లలో వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం (71,546) నుంచి 2023 పాయింట్లు ఎగసి 73,569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్టం (22,183) నుంచి 600 పాయింట్లు ర్యాలీ చేసి 22783 వద్ద గరిష్టాన్ని అందుకుంది.సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ సక్సెస్ఫార్మాస్యూటికల్ కంపెనీ సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.392)తో పోలిస్తే బీఎస్ఈలో 3% ప్రీమియంతో రూ.405 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 6.17% పెరిగి రూ.416 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 3.67% లాభంతో రూ.406 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,795.44 కోట్లుగా నమోదైంది.→ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పవరికా లిస్టింగ్లో నిరాశపరిచింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.395)తో పోలిస్తే 7.34% డిస్కౌంటుతో రూ.366 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 365 – 397 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 2.53% నష్టంతో రూ.385 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,872 కోట్లుగా నమోదైంది.→ బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్పోర్ట్స్) పేలవంగా లిస్టయింది. బీఎస్లో ఇష్యూ ధర (రూ.212)తో పోలిస్తే 8% డిస్కౌంటుతో రూ.195 వద్ద లిస్టయ్యింది. రోజంతా నష్టాల్లో ట్రేడవుతూ చివరికి 11% పతనంతో రూ.189 వద్ద ముగిసింది. -
అమాంతం తగ్గిన గోల్డ్ రేటు.. ఒక్కరోజులోనే ఇలా..
నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు! -
నష్టాల నుంచి లాభాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్!
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 182.26 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 73,316.58 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 22,713.10 వద్ద నిలిచాయి.రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఓరియంటల్ ట్రైమెక్స్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్పోర్ట్) లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గుడ్ న్యూస్.. బంగారం రేటు తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరలు దిగివచ్చాయి. కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 431 పాయింట్లు నష్టపోయి 22,247 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1411 పాయింట్లు దిగజారి 71,741 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.16 శాతం పుంజుకుంది.Today Nifty position 02-04-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త ఆర్థిక సంవత్సరం బుల్ స్టార్ట్!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని(2026–27) దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో మొదలుపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 2–3 వారాల్లో ముగిస్తుందనే ఆశలు సూచీలను పరుగులు పెట్టించాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చిది. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,187 పాయింట్లు పెరిగి 73,134 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 348 పాయింట్లు బలపడి 22,679 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,017 పాయింట్లు ఎగసి 73,964 వద్ద, నిఫ్టీ 610 పాయింట్లు బలపడి 22,941 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్ చివరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా సూచీల లాభాలు సగానికి తుడిపెట్టుకుపోయాయి. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ. 422.01 లక్షల కోట్లకు చేరింది. → ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 8%, జపాన్ 5%, తైవాన్ 4% ర్యాలీ చేశాయి. ఇండోనేíÙయా, హాంగ్కాంగ్, సింగపూర్ 2%, చైనా, థాయ్లాండ్ 1.55% పెరిగాయి. యూరప్ మార్కెట్లు 1.5% – 2% లాభపడ్డాయి. అమెరికా స్టాక్ సూచీలు 1% లాభంతో ట్రేడవుతున్నాయి. → ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. రంగాల వారీ ఇండెక్సుల్లో సరీ్వసెస్ 5%, పీఎస్యూ బ్యాంక్ 3.66%, ఇండ్రస్టియల్స్ 3.40%, క్యాపిటల్ గూడ్స్ 3.29%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.79%, కమోడిటీస్ 2.72%, ఐటీ 2.40% పెరిగాయి. సెన్సెక్స్లో ఎన్టీపీసీ (–1.64%), సన్ఫార్మా (–1.64%), పవర్గ్రిడ్ (–1.13%), అ్రల్టాటెక్ (–0.29%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లూ లాభపడ్డాయి. బుల్ పరుగులు ఎందుకంటే ..ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరాన్ యుద్ధాన్ని 2–3 వారాల్లో ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగవని హామీ ఇస్తే యుద్ధం ముగింపునకు సిద్ధమేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. దీంతో భారత్తో సహా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 4% క్షీణించి 100 డాలర్ల దిగువకు దిగివచ్చాయి. మూడునెలల గరిష్టానికి చేరిన అమెరికన్ బాండ్లపై రాబడులు అనూహ్యంగా దిగివచ్చాయి. దలాల్ స్ట్రీట్ మార్చిలో 11% భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. → జెట్ ఫ్యూయెల్ ధరలు పరిమితంగానే పెరగడంతో ఏవియేషన్ రంగానికి చెందిన ఇండిగో షేరు 6%, స్పైస్జెట్ 2% పెరిగాయి. -
గంటల్లోనే రెచ్చిపోయిన బంగారం రేట్లు
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. బుధవారం ఉదయం మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత రెచ్చిపోయాయి.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం రూ.1800 పెరిగి రూ.1,38,850 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.3150 పెరిగి రూ.1,40,200 లకు ఎగిసింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం ఉదయం రూ.1970 పెరిగి రూ.1,51,480 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మొత్తం రూ.3440 పెరిగి రూ. 1,52,950 లకు ఎగబాకింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.15000 పెరిగి రూ.2,65,000 వద్దకు ఎగిసింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్లు ముగిశాయిలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. యూఎస్-ఇరాన్ యుద్ధం ముగింపు వార్తల నేపథ్యంలో ఉదయం అత్యంత భారీ లాభాలలో పయనించాయి. అయితే ప్రారంభ ఉత్సాహం మసకబారడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెషన్ ద్వితీయార్ధంలో రోజు గరిష్ట స్థాయి నుండి లాభాలు క్షీణించాయయి.ముగింపు సమయానికి నిఫ్టీ 1.56 శాతం లేదా 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద, సెన్సెక్స్ 1,186.77 పాయింట్లు లేదా 1.65 శాతం పెరిగి 73,134.34 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ట్రెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.24 శాతం, 3.24 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది. నిఫ్టీ కెమికల్, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా నష్టాల్లో నిలిచాయి. -
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
1850 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 567 పాయింట్లు పెరిగి 22,901 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1874 పాయింట్లు ఎగబాకి 73,833 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.19 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.91 శాతం పెరిగింది.నాస్డాక్ 3.83 శాతం పుంజుకుంది.Today Nifty position 01-04-2026(time: 9:27 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎఫ్అండ్వోపై లావాదేవీల పన్ను అప్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు నిబంధనల భారం తగ్గనుంది. ఇందుకు వీలు కల్పిం చే కొత్త ఆదాయపన్ను చట్టం– 2025 నేటి నుంచి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తోంది. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని సులభతరంగా తీర్చిదిద్దినట్టు కేంద్రం చెబుతోంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) పెరగనుంది. విదేశీ పర్యటనలు, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపే నిధులపై మూలం వద్దే పన్ను కోత (టీసీఎస్) తగ్గనుంది. అలాగే, భారత్ నుంచి డేటా సెంటర్ సేవలను పొందే విదేశీ కంపెనీలపై 20 ఏళ్ల వరకు పన్ను భారం ఉండదు. ⇒ కొత్త చట్టానికి మారే క్రమంలో.. ఈ–ఫైలింగ్ పోర్టల్ పాత, కొత్త పన్ను చట్టాల్లోని నిబంధనల అమలుకు వీలు కల్పించనుంది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయి. ⇒ అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుంది. ⇒ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపులు జూన్ నుంచి ప్రారంభం కానుండగా, అవి కొత్త చట్టం కిందే అమలు కానున్నాయి. ⇒ గతంలో అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనేవి ఉండేవి. ఇకపై ‘పన్ను సంవత్సరం’ అమల్లోకి రానుంది. ⇒ ఐటీఆర్లను గడువు తర్వాత దాఖలు చేసినప్పటికీ టీడీఎస్ రిఫండ్ కోరవచ్చు. ⇒ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి పెరగనుంది. ఆప్షన్ల ప్రీమియంపై ఎస్టీటీ 0.1 శాతం నుంచి 0.15 శాతానికి, ఆప్షన్ల ఎక్సర్సైజ్పై 0.125 శాతం నుంచి 0.15 శాతానికి పెరగనుంది. తద్వారా ఎఫ్అండ్వోలో స్పెక్యులేషన్ తగ్గుతుందన్నది ప్రభుత్వం అంచనా. చిన్న ఇన్వెస్టర్లు నష్టపోకుండా చూడొచ్చని కేంద్రం భావిస్తోంది. ⇒ విదేశీ పర్యాటక ప్యాకేజీల కోసం చేసే చెల్లింపులపై 20 శాతంగా ఉన్న టీసీఎస్ 18 శాతానికి తగ్గనుంది. ⇒ విదేశాల్లో వైద్యం, విద్య కోసం చేసే నగదు తరలింపులపై 5 శాతం స్థానంలో 2 శాతం టీసీఎస్ చెల్లిస్తే చాలు. ⇒ 20 ఏళ్ల పన్ను రహిత ప్రయోజనంతో డేటా సెంటర్ కంపెనీలు ప్రయోజనం పొందనున్నాయి. భారత డేటా సెంటర్ల నుంచి సేవలు పొందే విదేశీ కంపెనీలు ఇకపై పన్ను చెల్లించక్కర్లేదు. ఇది పరోక్షంగా భారత డేటా సెంటర్ కంపెనీలకు మేలు చేయనుంది. సొంతంగా భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకూ ఈ ప్రయోజనం దక్కనుంది. ⇒ ఐటీ సేవలకు సంబంధించి ‘సేఫ్ హార్బర్’ విధానం కింద అర్హత పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంచారు. ఐటీ, ఐటీఈఎస్, కేపీవో, కాంట్రాక్ట్ ఆర్అండ్డీ సేవలన్నీ ఐటీ సేవల కిందే పరిగణించనున్నారు. ⇒ బ్యాంకుల్లో రూ.50 వేలు మించిన జమలపై కాకుండా.. ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలు మించినప్పుడు పాన్ ఇస్తే సరిపోతుంది. ⇒ ఇల్లు లేదా భూమి కొనుగోలు, విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే ఇకపై పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలు. ⇒ ఇకపై ఏ వాహన కొనుగోలు అయినా విలువ రూ.5 లక్షలకు మించితే పాన్ ఇవ్వాల్సిందే. ⇒ హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు లక్ష రూపాయలు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. ⇒ జీవిత బీమా పాలసీ కొనుగోలుకు పాన్ ఇవ్వడం తప్పనిసరి. -
బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!
ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుకేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది. -
పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీఓకు ఆరు కంపెనీలు
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దేశీయ ఈక్విటీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. అయినప్పటికీ ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనేందుకు సంకేతంగా సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. యుద్ధ అస్థిరతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే పబ్లిక్ ఇష్యూలకు ఆమోదం రావడం ఆసక్తికర పరిణామం. వృద్ధి ప్రణాళికలతో ముందుకొస్తున్న ఈ ఆరు కంపెనీలు సమీకరించనున్న నిధుల వినియోగం, ఆర్థిక స్థితి, భవిష్యత్ వ్యూహాలు తదితర వివరాలు ఇలా ఉన్నాయి. విభిన్న రంగాలకు చెందిన ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్, ప్రాసోల్ కెమికల్స్, నోపేపర్ఫామ్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, షా ఇన్వెస్టర్స్ హోమ్ లిమిటెడ్లు గతేడాది సెపె్టంబర్–డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మార్చి 25–27 మధ్య దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.4,575 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ.3,750 కోట్ల విలువైన ఈక్విటీలను కొత్తగా జారీ చేనుంది. అదనంగా రూ. 550 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారు ‘నార్త్ఫండ్’ ఆఫర్ చేయనుంది. సమీకరించే నిధులను తన అనుబంధ సంస్థలు ఎస్ఏఈఎల్ సోలార్ పీ5 ప్రైవేటు లిమిటెడ్, ఎస్ఏఈఎల్ సోలార్ పీ4 ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్నీటి శుద్ధి, మురుగు నీటి నిర్వహణ రంగానికి చెందిన ఈ సంస్థ ఐపీఓలో భాగంగా రూ.1,250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదనంగా రూ.1,000 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ ప్రీమియర్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఆఫర్ చేయనుంది. మొత్తంగా ఇష్యూ ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. సమీకరించే నిధుల ద్వారా తన అనుబంధ సంస్థల రుణాల చెల్లింపులు, అడ్వాన్స్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, సోలార్ పవర్ ప్రాజెక్టుల మూలధన వ్యయాలకు వినియోగించనుంది. సింబయోటెక్ ఫార్మాల్యాబ్ఫార్మా, బయోటెక్ రంగంలో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఐపీఓలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు రూ.2,030 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. దీంతో మొత్తం రూ.2,180 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను వ్యాపార అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. ఫార్మా రంగంలో గ్లోబల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. ప్రాసోల్ కెమికల్స్స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.80 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.420 కోట్ల షేర్లను విక్రయించనుంది. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. షా ఇన్వెస్టర్స్ హోమ్బ్రోకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ పరిమాణాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే 54 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించే నిధులను వ్యాపార విస్తరణ, టెక్నాలజీ అప్గ్రేడ్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. నోపేపర్ఫామ్స్ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రహస్య విధానంలో (కాని్ఫడెన్షియల్ ఫైలింగ్) ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. తాజాగా సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూకు అనుమతి లభించింది. అయితే ఇష్యూ పరిమాణాన్ని ఇంకా వెల్లడించలేదు.లిస్టింగ్ బాటలో..రెంటోమోజో: ఆన్లైన్ రెంటల్, సబ్్రస్కిబ్షన్ ప్లాట్ఫామ్ రెంటోమోజో ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు సమరి్పంచింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.150 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.83 కోట్ల ఈక్విటీలను విక్రయానికి పెట్టినట్లు ముసాయిదా పత్రాల ద్వారా తెలిసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, గిడ్డంగులు ఎక్స్పీరియన్స్ స్టోర్లు, సాధారణ కార్పొరేట్, లీజు అద్దెలు లేదా లైసెన్స్ ఫీజుల చెల్లింపు అవసరాలకు వినియోగించుకుంటామని వెల్లడించింది.భారత్ పెట్ సమీకృత ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందించే భారత్ పెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 120 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 640 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులు, రూ. 36 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1998లో ఏర్పాటైన కంపెనీ కంపెనీ పోర్ట్ఫోలియోలో పెట్ బాటిళ్లు, జార్లు, టిన్ కంటెయినర్లు, క్యాప్లు తదితర రిజిడ్ ప్యాకేజింగ్ ప్రొడక్టులున్నాయి.గతేడాది(2024–25) ఆదాయం రూ. 412 కోట్లకు చేరగా.. 51 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
రూపీ @ 95
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సోమవారం డాలరుతో పోలిస్తే ఒక దశలో ఏకంగా 95 మార్కును దాటేసి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 95.22ని తాకింది. ఇంట్రాడేలో 165 పైసల శ్రేణిలో తిరుగాడింది. చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం నాడు 89 పైసలు పతనమై 94.85 వద్ద క్లోజయిన రూపాయి, రిజర్వ్ బ్యాంక్ సానుకూల చర్యల దన్నుతో, సోమవారం నాడు ట్రేడింగ్లో కాస్త పుంజుకుని 128 పైసల లాభంతో 93.62 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డాలరు ఇండెక్స్, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి ఉంటోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 92–97 శ్రేణిలో రూపాయి తిరుగాడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ బాగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పదా్నలుగేళ్లలో భారీ క్షీణత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో.. 2012 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 4.2 శాతానికి పెరిగిపోయిన తరుణంలో దేశీ కరెన్సీ 12.4 శాతం పతనమైంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, డాలరు బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు లాంటి అంశాలు ఇప్పటి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 28న పశి్చమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చూస్తే రూపాయి విలువ 4.1 శాతం పడిపోయింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు దాదాపు 55.073 బిలియన్ డాలర్లను విక్రయించింది. డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా కరెన్సీలు కూడా గణనీయంగా క్షీణించాయి. జపాన్ యెన్ 6 శాతం, ఫిలిప్పీన్ పెసో 5.74 శాతం, దక్షిణ కొరియా వాన్ 2.88 శాతం తగ్గాయి. -
2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్ బాజా!
ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ రెండోరోజూ ‘బేర్’ మంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,636 పాయింట్లు కుప్పకూలి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 22,331 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,809 పాయింట్లు 71,774 పాయింట్లు వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు క్షీణించి 22,284 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ 3%, దక్షిణ కొరియా 3%, తైవాన్ 2%, హాంకాంగ్ 1% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1–0.5% లాభపడ్డాయి. అమెరికా సూచీలు అర శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, దేశీ స్టాక్ మార్కెట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7% పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 5,467 పాయింట్లు, నిఫ్టీ 1,188 పాయింట్లు పడ్డాయి. → రంగాల వారీ బీఎస్ఈ ఇండెక్సుల్లో పీఎస్యూ బ్యాంక్ 4.60%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 3.50%, ఫైనాన్సియల్ సర్వీసెస్ 3.46%, టెలికమ్యూనికేషన్ 3.09%, రియల్టీ 3.03% క్షీణించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.13%, 2.14% పతనమయ్యాయి. సెన్సెక్స్ సూచీలో పవర్గ్రిడ్ (0.27%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ (–5.09%), ఎస్బీఐ (–3.95%), ఇండిగో (–3.80%), బజాజ్ఫిన్సర్వ్ (–3.71%) అత్యధికంగా నష్టపోయాయి. కీలక దశలోకి పశ్చిమాసియా యుద్ధంఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కని్పంచకపోవడంతో అమెరికా ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి సిద్ధమైంది. దాడులు జరిపేందుకు 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలించారు. యూఎస్ భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకోవడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలుఆర్బీఐ విధించిన ఫారెక్స్ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ నికర ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను రోజువారీ ట్రేడింగ్ ముగిసే సరికి 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బిట్రాజ్ పొజిషన్ల అన్వైండింగ్ నేపథ్యంలో డాలర్ విక్రయాలు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రూపాయికి తాత్కాలిక ఊరట ఇచ్చినా, బ్యాంకింగ్ షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ పీఎస్యూ ఇండెక్స్ 4.60 క్షీణించగా, ప్రైవేట్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.50% పతనమైంది. ఎక్స్పైరీ ఒత్తిడితో తీవ్ర ఊగిసలాటనిఫ్టీ నెలవారీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లలో మార్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. సాధారణంగా నెలవారీ ఎక్స్పైరీ నెల చివరి మంగళవారం జరుగుతుంది. అయితే మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ సోమవారం నిర్వహించారు. ఆగని ఎఫ్ఐఐల విక్రయాలుపశ్చిమాసియా యుద్ధం అయిదో వారంలోకి ప్రవేశించడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఊపందుకుంది. గడిచిన 20 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఒక్క రోజే రూ.11,163 కోట్లు అమ్మకాలకు పాల్పడటం పతనం తీవ్రతకు నిదర్శనం.సీఎంపీడీఐ.. లిస్టింగ్ నిరాశకోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ) షేరు లిస్టింగ్లో నిరాశపరించింది. ఇష్యూ ధర (రూ.172)తో పోలిస్తే 5.43 శాతం డిస్కౌంటుతో రూ.163 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ఒక దశలో 11.45% క్షీణించి రూ.152 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 10.43% నష్టంతో రూ.154 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,999 కోట్లుగా నమోదైంది.2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల ఆవిరిబేర్ ఎటాక్తో రెండు రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.41 లక్షల కోట్లకు దిగివచి్చంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) సెన్సెక్స్ 9,339 పాయింట్లు (11.48%) క్షీణించింది. -
'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్బాల్ క్రీడాకారుడు.. బేస్బాల్లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్ను కొనాల్సిన అవసరం లేదు.Warren Buffett’s greatest lesson: NEVER CHASE. In the market, you have time. If an exceptional company trades at insane prices, don’t buy it.Wait for an exceptional company at a reasonable price. When you find it, invest heavily. If you don’t, wait. pic.twitter.com/s2Aax4wCj6— R (@AlphaWizarDD) March 29, 2026బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు. -
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.వెండి ధరఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యారో గ్రీన్టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, సెక్మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.గమనిక: రేపు (మార్చి 31) మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు ఇలా.. ఆనందంగా కొనేలా!!
దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మూడు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా! -
భారీ పతనంలో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50, సెన్సెక్స్ గణనీయంగా క్షీణించాయి.ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 0.86 శాతం లేదా 195 పాయింట్లు తగ్గి 22,624 వద్ద, సెన్సెక్స్ 0.97 శాతం లేదా 720 పాయింట్లు తగ్గి 72,862 వద్ద ట్రేడ్ అవుతోంది.సెన్సెక్స్లో బీఈఎల్, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.95 శాతం, 2.31 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అతిపెద్ద డ్రాగర్లు. నిఫ్టీ మెటల్ మెరుగైన పనితీరు కనబరిచింది.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
యుద్ధ పరిస్థితులే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ఎఫెక్ట్ ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చమురు, రూపాయి ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్కవరింగ్కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.భారీ అమ్మకాలు.. ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతిగత 4 రోజుల్లో..నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. ఈ వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.స్టాక్స్ వ్యూఇండిగో పెయింట్స్బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్ఖాన్ , కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.ఎంఎం ఫోర్జింగ్స్బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చుప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్హెచ్సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.గమనిక: ఈ కాలమ్లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.2030 నాటికి గోల్డ్ రేటుఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
నిన్న భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఇలా..
దేశంలో పసిడి ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రెండు రోజులు పెరుగుతున్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి ఊరటని చెప్పవచ్చు.అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.వెండి ధరలువెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే! -
ట్రేడింగ్ బ్రేక్.. స్టాక్ మార్కెట్ సెలవులు
స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వచ్చే వారం తమ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం, వచ్చే వారంలో ఒక ప్రభుత్వ సెలవు దినం, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మార్కెట్లు పనిచేయవు.వచ్చే వారం సెలవుల వివరాలువచ్చే వారం మార్చి 31, మంగళవారం నాడు మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీనికి తోడు సాధారణ వారాంతపు సెలవులైన ఏప్రిల్ 4 (శనివారం), ఏప్రిల్ 5 (ఆదివారం) తేదీల్లో కూడా మార్కెట్ మూసి ఉంటుంది.ఈ సెలవు దినాల్లో ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB), కరెన్సీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGR) వంటి అన్ని విభాగాల్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు.2026లో రానున్న సెలవులు ఎన్ఎస్ఈ అధికారిక క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శని, ఆదివారాలు కాకుండా మొత్తం 16 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. రాబోయే ముఖ్యమైన సెలవులు ఇవే..మార్చి 31 - శ్రీ మహావీర్ జయంతిఏప్రిల్ 3 - గుడ్ ఫ్రైడేఏప్రిల్ 14 - డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిమే 1 - మహారాష్ట్ర దినోత్సవంమే 28 - బక్రీద్ సెప్టెంబర్ 14 - గణేష్ చవితిఅక్టోబర్ 2 - మహాత్మా గాంధీ జయంతిఅక్టోబర్ 20 - దసరాడిసెంబర్ 25- క్రిస్మస్ముహూర్త ట్రేడింగ్నవంబర్ 8 (ఆదివారం) సెలవు దినమైనప్పటికీ, దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా ప్రత్యేక 'ముహూర్త ట్రేడింగ్' కోసం కొద్దిసేపు మార్కెట్ తెరుస్తారు. దీని సమయాలను ఎక్స్ఛేంజీలు విడిగా ప్రకటిస్తాయి.మార్కెట్ రెగ్యులర్ టైమింగ్స్సాధారణ రోజుల్లో స్టాక్ మార్కెట్ పనివేళలు కింది విధంగా ఉంటాయి..ప్రీ-ఓపెన్ సెషన్: ఉదయం 9:00 నుండి 9:08 వరకు (ఆర్డర్ ఎంట్రీ).రెగ్యులర్ ట్రేడింగ్: ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు.ముగింపు సెషన్: మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 4:00 వరకు.బ్లాక్ డీల్ విండో: ఉదయం: 8:45 – 9:00 మధ్యాహ్నం: 2:05 – 2:20మార్కెట్ పరిస్థితులను బట్టి లేదా అత్యవసర సమయాల్లో పైన పేర్కొన్న పనివేళలను మార్చే లేదా సెలవులను సవరించే అధికారం ఎక్స్ఛేంజీలకు ఉంటుంది. -
పసిడి కెరటం.. అమాంతం పైకి లేచిన ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి మళ్లీ వెనక్కి
న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు. -
మళ్లీ బేర్ ఎటాక్!
ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్ స్ట్రీట్ మళ్లీ బేర్ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్కాంగ్, సింగపూర్ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. రోజంతా అమ్మకాలు...బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్ఫాల్ టాక్స్’ విధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది. -
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!
భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.ఎన్ఎస్ఈ వెబ్సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.శుక్రవారం మార్కెట్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఆర్ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.నేటి స్టాక్ మార్కెట్శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా? -
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు వంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్కాయిన్లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
జియో ఐపీవో ఎప్పుడంటే?
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లోని టెలికం నిర్వాహక హోల్డింగ్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కొత్త ఏడాదిలో ఐపీవో బాట పట్టిన తొలి కంపెనీగా నిలిచే వీలుంది.దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చైర్మన్గా 2016లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ.. ఆయన తనయుడు ఆకాశ్ అంబానీ నాయకత్వంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. 125 బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయించే వీలుంది.దీంతో ఐపీవో పరిమాణం 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 28,000 కోట్లు)గా సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2022 మే నెలలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ 2.5 బిలియన్ డాలర్ల ఐపీవో చేపట్టింది. ఇది రికార్డుకాగా.. తదుపరి 2024 అక్టోబర్లో ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ 2.97 బిలియన్ డాలర్ల సమీకరణతో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. తద్వారా రికార్డును సవరించింది. -
పండగపూట పెరిగిన పసిడి.. అలసిన వెండి!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 243 పాయింట్లు నష్టపోయి 23,063 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 841 పాయింట్లు పడిపోయి 74,445 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.84బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 107.06 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.74 శాతం నష్టపోయింది.నాస్డాక్ 2.38 శాతం పడిపోయింది.Today Nifty position 27-03-2026(time: 9:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు మణిపాల్ హెల్త్
ఆసుపత్రుల దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 4,32,27,668 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.పీఈ దిగ్గజం టెమాసెక్కు పెట్టుబడులున్న సంస్థ ఈక్విటీ జారీ నిధుల్లో మణిపాల్ హాస్పిటల్స్కు చెందిన రుణ చెల్లింపులకు రూ. 5,378 కోట్లు వెచ్చించనుంది. అనుబంధ కంపెనీ సహ్యాద్రి హాస్పిటల్స్లో మైనారిటీ వాటా కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 574 కోట్లు వినియోగించనుంది.ఐపీవోకంటే ముందుగా రూ. 1,600 కోట్ల షేర్ల విక్రయ యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవోలో ఈక్విటీ జారీ పరిమాణాన్ని కుదించనుంది. కార్డియాలజీ, అంకాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, కిడ్నీ మార్పిడి తదితర పలు స్పెషాలిటీలు కలిగిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను దేశవ్యాప్తంగా కంపెనీ నిర్వహిస్తోంది. 2025 సెప్టెంబర్కల్లా 38 ఆసుపత్రుల ద్వారా 10,761 పడకలను కలిగి ఉంది. గతేడాది(2024–25)లో ఆదాయం రూ. 8,242 కోట్లను అధిగమించగా.. దాదాపు రూ. 1,082 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
నకిలీ ట్రేడింగ్ యాప్లకు సెబీ చెక్
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్లోని స్టాక్ ట్రేడింగ్ యాప్ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.ముంచుకొస్తున్న ముప్పుఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్లు అచ్చం ఒరిజినల్ ప్లాట్ఫారమ్ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్లకు మాత్రమే ‘వెరిఫైడ్ బ్యాడ్జ్’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్లకు కూడా ఈ ఫీచర్ను విస్తరించనున్నారు.‘ఫిన్ఫ్లుయెన్సర్ల’పై నిఘాఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.సెబీ బ్రోకర్ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.యాప్లో గ్రాఫ్లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు. -
బంగారం కాస్త కొత్త ధరలు.. మారాయిలా..
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం
రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి పతనమవుతోంది. డాలర్ మారకంలో 20 పైసలు బలహీనపడి తాజా జీవితకాల కనిష్టం 93.96 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, నెలాఖరున డాలర్లకు డిమాండ్ నెలకొనడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 93.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 93.86 – 94.13 శ్రేణిలో ట్రేడైంది. -
బైబ్యాక్లో షేర్లు అమ్ముకుంటే 12 శాతం సర్చార్జీ
న్యూఢిల్లీ: వ్యక్తిగత లేదా కార్పొరేట్ వాటాదారులు ఎవరైనా బైబ్యాక్లో భాగంగా విక్రయించే షేర్లపై ఆర్జించే లాభాలకు 12% సర్చార్జీ వర్తించనుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఫైనాన్స్ బిల్లులో సవరణలకు తాజాగా లోక్సభ ఆమోదముద్ర వేసింది.2026 ఫైనాన్స్ బిల్లులో 32 సవరణలకు ప్రభుత్వం ప్రతిపాదించగా.. లోక్సభ ఆమోదముద్ర వేసింది. రేపు(శుక్రవారం) రాజ్యసభలో ఆమో దం కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే రూ. 50 లక్షలవరకూ ఆదాయంగల వారిపై ఎలాంటి సర్చార్జీ లేదు.రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకూ పన్నువర్తించే ఆదాయంగల వారికి బైబ్యాక్లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించే లాభాలపై 10% సర్చార్జీ అమలు చేస్తున్నారు. అయితే ఫ్లాట్ 12% సర్చార్జీ విధింపుతో ఆయా పన్ను చెల్లింపుదారులపై భారం పడనుంది. -
సిల్వర్ హిట్.. బంగారం ధగధగలు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన పసిడి, వెండి బుధవారం దేశీ మార్కెట్లో మంచి ర్యాలీని చూశాయి. వెండి కిలోకి ఏకంగా రూ.11,250 ర్యాలీ చేసి రూ.2.41 లక్షలకు చేరుకుంది. బంగారం వరుసగా రెండో రోజూ కొనుగోళ్లతో మెరిసింది. 10 గ్రాములకు రూ.4,900 పెరిగి రూ.1,49,700 స్థాయిని అందుకుంది.భౌగోళిక రాజకీయ సెంటిమెంట్ కాస్త మెరుగుపడడం ఫలితంగా చమురు ధరలు దిగిరావడం బంగారం, వెండి ధరలు కోలుకునేందుకు దోహదపడినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 2 శాతం పెరిగి 4,556 డాలర్లకు, స్పాట్ వెండి ఔన్స్కు 2 శాతం లాభపడి 72.67 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!
దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రరత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.50 వేల టన్నుల బంగారం నిల్వలునేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.అడ్డంకిగా 3% జీఎస్టీభౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.తప్పనిసరి హాల్మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లు మాత్రం డీలా
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్డిఎఫ్సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా పడిన పసిడి, వెండి ధరలు ఈరోజు మార్కెట్లో తిరిగి పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కాకుండా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు, అమ్మకాల ర్యాలీలో పాల్గొంటేనే ధరలు అధికంగా ప్రభావితం అవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 295 పాయింట్లు పెరిగి 23,207 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 888 పాయింట్లు పుంజుకొని 74,962 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.28బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 99.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.84 శాతం పడిపోయింది.Today Nifty position 25-03-2026(time: 9:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కోలుకున్న పసిడి... అక్కడే వెండి
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో 4 రోజుల వరుస నష్టాల నుంచి పసిడి బయటపడింది. మంగళవారం 10 గ్రాములకు రూ.1,200 పెరిగి రూ.1.44లక్షలకు (పన్నులు సహా) చేరుకుంది. వెండి ధర మాత్రం పెద్దగా మార్పు లేకుండా కిలోకి రూ.2.30 లక్షల వద్దే ఉన్నట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో రికవరీకితోడు, కనిష్ట స్థాయిల్లో కొనగోళ్ల మద్దతుతో బంగారం ధర పెరిగినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్స్కు 17 డాలర్ల వరకు పెరిగి 4,423 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. వెండి సైతం 1% పుంజుకుని ఔన్స్కు 69.86 డాలర్ల స్థాయిని చేరుకుంది. ‘9 రోజుల క్షీణత తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్కు 4,420 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అప్రమత్తతతో కూడిన ఆశావహధోరణి కనిపించింది’ అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
వార్కు బ్రేక్.. బుల్కు జోష్!
ముంబై: ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో దలాల్ స్ట్రీట్లో రిలీఫ్ ర్యాలీ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడం... క్రూడ్ ధర దిగిరావడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,372 పాయింట్లు పెరిగి 74,068 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 400 పాయింట్లు బలపడి 22,912 వద్ద నిలిచింది. సూచీల 2% ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.422.78 లక్షల కోట్లకు చేరింది. అదిరిపోయే ఆరంభం: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,793 పాయింట్లు ఎగసి 74,489 వద్ద, నిఫ్టీ 544 పాయింట్లు బలపడి 23 వేల స్థాయిపైన 23,057 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. ట్రేడింగ్ అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్లు లభించడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో పవర్గ్రిడ్ (–0.81%), సన్ఫార్మా (–0.20%), ఎస్బీఐ(–0.09%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లూ లాభడ్డాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో సర్వీసెస్ 3.46%, ఇండ్రస్టియల్స్ 3%, ప్రైవేటు బ్యాంక్స్ 2.63%, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.46%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.39%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34%, ఆటో 2.30%, కమోడిటీస్ 2.19 శాతం పెరిగాయి. ‘ఇరాన్ ఇంధన సదుపాయాలపై అమెరికా దాడులు తాత్కాలికంగా నిలివేయడం పశి్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత తగ్గే అవకాశానికి సంకేతంగా భావించవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. అయినప్పట్టకీ.., హర్మూజ్ జలసంధి చుట్టూ జరిగే రాజకీయ, భౌగోళిక పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీస్తున్నాయి. దౌత్య సంబంధాలు ఏ మాత్రం బెడిసికొట్టినా మార్కెట్లపై మళ్లీ బేర్స్ పట్టుబిగించే వీలుంది. భారీ పతనం తర్వాత షార్ట్ కవరింగ్, వేల్యూ బయింగ్ కారణంగా ర్యాలీ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితిని ఇన్వెస్టర్లు తక్కువ ధరల్లో నాణ్యమైన షేర్లను కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలి’ అని లైవ్ లాంగ్ వెల్త్ రీసెర్చ్ విశ్లేషకుడు హరిప్రసాద్ తెలిపారు.ప్రపంచ మార్కెట్లు..నష్టాల్లోంచి లాభాల్లోకియుద్ధంపై చర్చలకు సంబంధించి అమెరికా నుంచి సంకేతాలు అందాయంటూ ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పష్టం చేయడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోంచి పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో హాంగ్కాంగ్ 3%, దక్షిణ కొరియా 2.67%, చైనా 1.75%, జపాన్ 1.41%, థాయిలాండ్ 1%, సింగపూర్ అరశాతం పెరిగాయి. ఇంట్రాడేలో 2% పతనమైన యూరప్ మార్కెట్లు నష్టాలను దాదాపు భర్తీ చేసుకున్నాయి. జర్మనీ డాక్స్ 0.25% స్వల్ప నష్టంతో ముగిసింది. ఫ్రాన్స్ సీఏసీ సూచీ 0.1% లాభపడగా, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ ఇండెక్సు 0.5% పెరిగింది. యూఎస్ ప్రధాన సూచీల్లో నాస్డాక్ 0.45% నష్టాల్లో ట్రేడవుతోంది. డోజోన్స్ 0.25%, ఎస్అండ్పీ–500 సూచీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి.సరికొత్త కనిష్టానికి రూపాయి... 23 పైసలు బలహీనపడి 93.76 వద్దకు.. డాలర్ మారకంలో రూపాయి విలువ 23 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 93.76 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, క్రూడాయిల్ ధరల రికవరీ, పశి్చమాసియా సంక్షోభంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు తదితర అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 93.66 వద్ద మొదలైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరికి ఇంట్రాడే కనిష్టం(93.76) వద్ద స్థిరపడింది. రానున్న రోజుల్లో 93.65 – 94.25 శ్రేణిలో ట్రేడవొచ్చని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ మార్చిలో రూపాయి 4.5 శాతం కరిగిపోయింది. జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ సక్సెస్ ఆగ్రోకెమికల్ కంపెనీ జీఎస్పీ క్రాప్ సైన్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర రూ.320తో పోలిస్తే బీఎస్ఈలో 4% ప్రీమియంతో రూ.332 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఒకదశలో 14% ఎగిసి రూ.364 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభంతో రూ.356 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,656.53 కోట్లుగా నమోదైంది. -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
ట్రంప్ యూటర్న్ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం, ఇరాన్ ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపింది. అయితే ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు ట్రంప్ తీసుకున్న యూ టర్న్కు ముందు ఏం జరిగింది అనేది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ట్రంప్ సోమవారం ఉదయం తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వార్కు బ్రేక్ ప్రకటించడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు జరిగిన ఒక రహస్య ట్రేడింగ్ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరిగింది?20 నిమిషాల్లో రూ. 840 కోట్ల లాభం: మిస్టరీ ట్రేడ్ఇరాన్ ఇంధన వనరులపై దాడులను తాత్కాలికంగా ఆపుతున్నామని ట్రంప్ ప్రకటనకు కేవలం 15 నిమిషాల ముందే మార్కెట్లో భారీ ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు సమాచారం. ఈచెయిన్ రియాక్షన్ కేవలం 20 నిమిషాల్లోనే సుమారు రూ. 840 కోట్ల లాభాన్ని అందించిందని విశ్లేషకులు అంటున్నారు.న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:50 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:20 గంటలకు). ఎవరో గుర్తుతెలియని వ్యక్తి/సంస్థ ఒక్కసారిగా రూ. 12,600 కోట్ల విలువైన S&P 500 ఫ్యూచర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దాదాపు రూ. 1,615 కోట్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్లను విక్రయించారు.ట్రంప్ వార్ బ్రేక్ ప్రకటన రాగానే చమురు ధర భారీగా పడిపోయింది. అలాగే మార్కెట్ ప్రారంభానికి ముందే ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.5 శాతం లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ 109 డాలర్ల నుండి 92 డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ దాదాపు 6 శాతం పడిపోయి, బ్యారెల్కు 88.70 డాలర్లను తాకింది.ఇరాన్పై దాడులు ఆగిపోవడంతో చమురు సరఫరాకు ఢోకా ఉండదని భావించిన ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో, బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 109 డాలర్ల నుండి 92 డాలర్లకు పడిపోయింది.ఫలితంగా కేవలం ఆయిల్ ధరల మార్పు వల్లే ఆ వ్యక్తికి 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు (100 మిలియన్ డార్లు) లాభం వచ్చింది. ఇక షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభం దీనికి అదనం.'అన్యూజువల్ వేల్స్' అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రకారం, ఈ ట్రేడ్లను నిర్వహించిన వారు రెండు సమన్వయ పందాలు వేశారు. మొదటిది ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్ పుంజుకుంటుందనే అంచనాతో, వారు సుమారు రూ. 12,600 కోట్లు లేదా 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్&పి 500 ఫ్యూచర్స్ను కొనుగోలు చేశారు.రెండో బెట్ సరఫరా భయాలు తొలగిపోతే ముడి చమురు ధరలు తగ్గుతాయని అంచనాతో సుమారు రూ. 1,615 కోట్లు లేదా 192 మిలియన్ డాలర్ల విలువైన ఆయిల్ ఫ్యూచర్స్ను విక్రయించారు. కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో, దాదాపు 580 మిలియన్ డాలర్లు లేదా సుమారు రూ. 4,870 కోట్ల విలువైన 6,200 బ్రెంట్ మరియు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు చేతులు మారాయి. ఇది ఆ గంటలో ట్రేడ్ అవుతున్న మిగతా వాటి కంటే నాలుగు నుండి ఆరు రెట్లు ఎక్కువ.ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలుట్రంప్ నిర్ణయం గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా, అంత భారీ మొత్తంలో (రూ. 14,000 కోట్లకు పైగా) పక్కా టైమింగ్తో పెట్టుబడి పెట్టడం చూస్తుంటే.. ప్రభుత్వ నిర్ణయం ముందే ఎవరికైనా తెలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తన 25 ఏళ్ల మార్కెట్ అనుభవంలో ఇలాంటి వింతైన ట్రేడింగ్ పద్ధతిని ఎప్పుడూ చూడలేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్ మాట్ విలియం ఎక్స్లో పేర్కొన్నారు. ఒక యూ.ఎస్. బ్రోకరేజ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ కూడా ఇలాంటి ఆందోళనలనే వ్యక్తం చేశారు. కారణాన్ని నిరూపించడం సులభం కానప్పటికీ, ట్రంప్ పోస్ట్ వెలువడటానికి 15 నిమిషాల ముందు ఏం జరిగింది అనేదానిపై కచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.నికోలస్ మదురో అరెస్ట్కు ముందు కూడాఅలాగే గతంలో వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ విషయంలో కూడా ఇలాగే 'పాలీమార్కెట్'లో ముందే బెట్టింగ్ జరిగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు జనవరి నాటికి అమెరికా వెనిజులాపై దాడి చేస్తుందని సుమారు 34వేల డాలర్ల పందెం వేశారు. దీంతో వీరికి అంతర్గత సమాచారం అంది ఉంటుందనే అనుమానాలు ట్రేడర్లలో తలెత్తాయి.కాగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ విచారణ జరిగితే దీని వెనుక ఎవరున్నారు అనేది నిగ్గు తేలే అవకాశం ఉంది. ఇదీ చదవండి : ఫోన్ లాక్ కోడ్ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్ మిస్టరీ -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో సూచీలు!
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు లేదా 1.89 శాతం లాభంతో 74,068.45 వద్ద, నిఫ్టీ 412.25 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 22,924.90 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, DCX సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
950 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 305 పాయింట్లు పెరిగి 22,818 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 956 పాయింట్లు పుంజుకొని 73,651 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.21 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.15 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 24-03-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎంసీఎక్స్లో 10% పైగా డౌన్
నిన్నమొన్నటిదాకా ఆకాశమే హద్దుగా ఎగబాకి కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బంగారం.. ఇప్పుడు భారీ పతనంతో ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించిన పసిడి ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది. సోమవారం ఎంసీఎక్స్ కమోడిటీ మార్కెట్లో ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 10 గ్రాముల రేటు ఏకంగా 10.3 (రూ.14,897) పతనమై.. రూ.1,29,595కు పడిపోయింది.ఈ ఏడాది జనవరి 29న నమోదైన రూ.1,93,096 ఆల్టైమ్ గరిష్టం నుంచి చూస్తే 33 శాతం (రూ.63,501) క్షీణించడం గమనార్హం. మరోపక్క, వెండి కూడా వెలవెలబోతోంది. ఏప్రిల్ కాంట్రాక్టు కేజీ ధర సోమవారం ఒకానొకదశలో రూ.27,248 దిగజారి రూ.,2,04,500 తాకింది. కాగా, ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాములు మేలిమి బంగారం ధర రూ.9,050 పడిపోయి రూ.1,43,600కు చేరింది. వెండి కేజీ రూ.10,500 నష్టంతో రూ.2,30,000కు తగ్గింది.అంతర్జాతీయంగా తీవ్ర హెచ్చుతగ్గులు..క్రూడ్ సెగలు, యుద్ధ ప్రకంపనలతో అంతర్జాతీయంగానూ బంగారం క్రాష్ అయింది. నైమెక్స్ ఏప్రిల్ ఫ్యూ చర్స్ ఔన్స్ ధర ఒక దశలో 10.4 శాతం (474.9 డాలర్లు) కుప్పకూలి 4,100 డాలర్ల కనిష్టాన్ని తాకింది. అలాగే వెండి ఔన్స్ రేటు సైతం 12 శాతం పైగా నష్టపోయి 61.23 డాలర్లకు దిగొచ్చింది. కాగా, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు అయిదు రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పసిడి, వెండి ధరలు భారీగా కోలుకున్నాయి. పసిడి ఔన్స్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో 2 శాతం నష్టంతో 4,550 డాలర్ల వద్ద, వెండి 1 శాతం లాభంతో 70.1 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికవరీతో ఎంఎసీఎక్స్లోనూ బంగారం ధర రూ.1,41,388కి (నష్టం 2 శాతం) పుంజుకుంది. వెండి మళ్లీ లాభాల్లోకి వచ్చింది. అర శాతం పెరిగి రూ.2,34,155కు చేరింది.ఎందుకీ పతనం..పశ్చిమాసియాలో యుద్ధం దెబ్బకు క్రూడ్ భగభగలు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర తాజాగా 119 డాలర్లను తాకడం, హార్మూజ్ జలసంధిని దాదాపు మూసివేయడంతో ఇంధన సరఫరాలకు తీవ్ర ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలతో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. యూఎస్ ఫెడ్తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. వెరసి డాలరు విలువ పుంజుకోవడంతో బాండ్ ఈల్డ్లు ఎగబాకుతున్నాయి. ఈ అంశాలన్నీ బంగారం ధర వెలవెలబోయేలా చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ‘తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో బడా సంస్థాగత ఇన్వెస్టర్లు, ముఖ్యంగా అరబ్ గల్ఫ్ ప్రాంతానికి చెందిన ఇన్వెస్టర్లు బంగారం, ఇతరత్రా లిక్విడ్ అసెట్లను అమ్మేసుకుని, నగదు జమ చేసుకుంటున్నారు’ అని ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాని విశ్లేషించారు.వార్ బ్రేక్.. క్రూడ్ కూల్..ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో క్రూడ్ రేట్లు చప్పున చల్లారాయి. నైమెక్స్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా 10 శాతం మేర దిగజారి 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ రేటు సైతం 10 శాతం పడి 96 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో నైమెక్స్ 101 డాలర్లను, బ్రెంట్ 109 డాలర్లను తాకింది. ఇరాన్తో చర్చల్లో కాస్త పురోగతి నెలకొందని, అందుకే దాడులకు బ్రేక్ ఇస్తున్నామంటూ ట్రంప్ తాజా ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు నెలకొన్నాయని, దీంతో క్రూడ్ ధరలు శాంతించాయని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
సాయి పేరెంటరల్స్ ఐపీవో నేడు
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూ నేడు(24న) ప్రారభమై శుక్రవారం(27న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 372-392కాగా.. తద్వారా రూ. 409 కోట్లవరకూ సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు తాజాగా షేర్లను కేటాయించింది. ఒక్కో షేరుకీ రూ. 392 ధరలో 31,28,485 షేర్లు విక్రయించింది. తద్వారా దాదాపు రూ. 123 కోట్లు సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో కొటక్ లైఫ్ సైన్సెస్ ఫండ్, క్వాంట్ ఎంఎఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా(సింగపూర్) పీటీఈ, ఇండియా ఎమర్జింగ్ జెయింట్స్ ఫండ్ ఉన్నాయి. దేశీ మ్యూచువల్ ఫండ్స్సహా.. బీమా కంపెనీలు, తదితర విభిన్న సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు యాంకర్ పెట్టుబడుల జాబితాలో చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 38 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 2కల్లా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానుంది. యాంకర్ పెట్టుబడులు.. కంపెనీ బిజినెస్ మోడల్, వృద్ధి అవకాశాలు, నిర్వహణా సామర్థ్యాలపట్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కుమార్ కె. పేర్కొన్నారు. కంపెనీ ప్రధానంగా ఇంజెక్టబుల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. బ్రాండెడ్ జనరిక్స్తోపాటు.. కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ(సీడీఎంవో) సర్వీసులు సైతం అందిస్తోంది. కార్డియోవాస్కులర్, యాంటీబయోటిక్స్, డయాబెటిస్ తదితర వివిధ థెరప్యూటిక్ విభాగాలలో ఇంజెక్టబుల్స్, ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ తదితర డోసేజీలు రూపొందిస్తోంది.ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్ -
మార్కెట్లో వార్ విధ్వంసం
ముంబై: ఒకపక్క ‘ఇరాన్ వార్, మరోపక్క ‘చమురు ధరల బాంబ్’తో దలాల్ స్ట్రీట్ మరోసారి దద్దరిల్లింది. డాలర్ మారకంలో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి నమోదుచేస్తోంది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలూ మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,837 పాయింట్లు(2.46%) క్షీణించి 72,696 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 602 పాయింట్లు(2.60%) కుప్పకూలి 22,513 వద్ద నిలిచింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ట్రేడింగ్ సమయంలో అమ్మకాల సునామీ వాతావరణం నెలకొంది. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,975 పాయింట్లు క్షీణించి 72,558 వద్ద, నిఫ్టీ 644 పాయింట్లు పతనమై 22,471వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి.ఇండెక్సులన్నీ నష్టాల్లోనేఅన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 5%, మెటల్ 4.76%, సరీ్వసెస్ 4.70%, ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.39%, కమోడిటీస్ 4.35%, ఇండ్రస్టియల్స్ 4.05%, క్యాపిటల్ గూడ్స్ 3.99 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 3.82%, 3.66 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో హెచ్సీఎల్టెక్ 1.83%, పవర్గ్రిడ్ 1.39%, ఇన్ఫోసిస్ 0.28% మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లూ నష్టపోయాయి.యుద్ధం మొదలయ్యాక రూ.48.29 లక్షల కోట్లు ఆవిరి పశి్చమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) ఇన్వెస్టర్లు మొత్తం 15 ట్రేడింగ్ సెషన్లలో రూ.48.29 లక్షల కోట్లు కోల్పోయాయి. సెన్సెక్స్ 8,591 పాయింట్లు (10.56%), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58%) నష్టపోయాయి. తాజా గా సోమవారం ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.414.77 లక్షల కోట్లకు దిగివచి్చంది.నష్టాలు ఎందుకంటేహార్మూజ్ జలసంధి అంశంపై అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో తాజా యుద్ధ భయాలు మార్కెట్లను కుదిపేశాయి. జలసంధి మూసివేత హెచ్చరికలతో క్రూడ్ బ్యారెల్ 110 డాలర్లపైకి చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరగడమే కాకుండా, వృద్ధి మందగమన ఆందోళనలు తలెత్తాయి. చమురు దిగుమతుల భారం, ఎఫ్ఐఐల భారీ అమ్మకాలతో రూపాయి సరికొత్త కనిష్టాలను తాకింది. యుద్ధం మొదలైన తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల భారీ విక్రయాలు మార్కెట్ను మరింత బలహీనపరిచింది.ఆసియా మార్కెట్లు డౌన్..లాభాల్లోకి యూరప్, యూఎస్పశి్చమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చనే ఆందోళనలతో ఆసియా మార్కెట్ల పతనం కొనసాగింది. ఫలితంగా దక్షిణ కొరియా 7%, చైనా 4%, జపాన్ 3.60%, హాంగ్కాంగ్ 3.54%, తైవాన్ 2.50%, సింగపూర్ 2.22 శాతం క్షీణించాయి. మన మార్కెట్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో పరిస్థితులు తారుమారయ్యాయి. పశి్చమాసియాలో నెలకొన్న ఘర్షణలకు ‘సంపూర్ణ, శాశ్వత పరిష్కారం’ కనుగొనే దిశగా ‘ఫలప్రదమైన చర్చలు’ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై చేయాలనుకున్న ‘అన్ని రకాల దాడులను అయిదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు’ ట్రంప్ ప్రకటించారు. దీంతో యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్బ్యాక్ అయ్యాయి. జర్మనీ డాక్స్ ఇండెక్స్ 3%, జర్మనీ సూచీ సీఏసీ సూచీ 2%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 1% పెరిగాయి. అమెరికా నాస్డాక్ ఇండెక్స్ 2.25%, డోజోన్స్ 2.50%, ఎస్అండ్పీ–500 సూచీ 2% లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది.సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.స్టాక్ల విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్క్యాప్100, నిఫ్టీ మిడ్క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి. -
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్! -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.Something very strange is happening in precious metals right now:In just 3 hours, gold and silver just erased a combined -$2 TRILLION in market cap.Meanwhile, oil prices have erased their gains on the day and US stock market futures are nearly green.Since the Iran War… pic.twitter.com/zP43wSr9wE— The Kobeissi Letter (@KobeissiLetter) March 23, 2026ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. -
జాక్పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి జాక్పాట్ తగిలినట్లయింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా అమాంతం పతనమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లపై బేర్ పంజా.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 411 పాయింట్లు తగ్గి 22,711 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1269 పాయింట్లు నష్టపోయి 73,268 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 112.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.51 శాతం పడిపోయింది.నాస్డాక్ 2.01 శాతం నష్టపోయింది.Today Nifty position 23-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పశ్చిమాసియాపైనే ఫోకస్!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక ఆర్థిక అంశాలు కొరవడిన నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులే దారి చూపనున్నాయి. దీంతో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, రూపాయి మారకం తదితర అంశాలు కీలకంగా నిలవనున్నాయి. గురువారం(26న) శ్రీరామ నవమి సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం... రోజులు గడిచేకొద్దీ పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముదురుతోంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన తదుపరి పరిస్థితులు మరింత వికటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో ఆసియా మొదలు అమెరికా వరకూ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలే ప్రధానంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి(26న) సెలవుతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గణాంకాల విడుదల దేశీయంగా ఈ వారం మార్చి నెలకు రేపు(24న) హెచ్ఎస్బీసీ ఫ్లాష్ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. తయారీ, సర్వీసులు, కాంపోజిట్ వివరాలు వెల్లడికానున్నాయి. తద్వారా బిజినెస్ యాక్టివిటీ ముందస్తు అంచనాలకు వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఈ బాటలో 28న ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మ్యాన్యుఫాక్చరింగ్ గణాంకాలు విడుదలకానున్నాయి. హార్ముజ్పై ఫోకస్ కొద్ది రోజులుగా హార్ముజ్ ద్వారా జల రవాణా దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు కీలకంగా మారినట్లు ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని అంచనా వేశారు. బ్రెంట్ చమురు 100 డాలర్ల ఎగువన కదులుతుండటం దేశీయంగా వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. చమురు ధరలతో పలు దేశాలలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తుండటంతో కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలవైపు చూపు సారించవచ్చని వివరించారు. గత వారం అక్కడక్కడే తీవ్ర ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 31 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,533 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 37 పాయింట్లు క్షీణించి 23,115 వద్ద స్థిరపడింది.సాంకేతికంగా ఈ వారంయుద్ధ భయాల నుంచి గత వారం నెమ్మదిగా రికవరీ బాట పట్టిన దేశీ స్టాక్ మార్కెట్లను ప్రయివేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దెబ్బకొట్టింది. మరోపక్క ముడిచమురు ధరల మంట సెంటిమెంటుకు షాకివ్వడం దీనికి జత కలసింది. దీంతో చివరికి మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగిశాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం పశ్చిమాసియా ప్రకంపనల ఆందోళనలతో బలహీనపడటానికే అధిక వీలుంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో విక్రయాలకు పాల్పడుతుండటం బ్లూచిప్స్ను పడగొడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. → నిఫ్టీకి తొలుత 22,900 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి 22,300–22,200 స్థాయిలో కొనుగోళ్లకు వీలుంది. ఒకవేళ తొలి మద్దతుస్థాయి నుంచి బలపడితే.. 23,800–24,000 వరకూ పుంజుకోవచ్చు. సమీప కాలంలో 22,900– 24,000 శ్రేణిలో కదిలేందుకు వీలుంది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలు.. యుద్ధ భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఇటీవల దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నగదు విభాగంలో ఏకంగా రూ. 88,180 కోట్ల(9.6 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ధరల పెరుగుదలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఆందోళనలు వ్యక్తం చేయడానికితోడు.. డాలరుతో మారకంలో రూపాయి పతనంకావడం సైతం కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరలతో కార్పొరేట్ ఫలితాలు నీరసించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. అంతకుముందు నెల(ఫిబ్రవరి)లో గత 17 నెలల్లోనే అత్యధికంగా ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..
ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.బంగారం ధరలు తగ్గుతాయా?బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు. -
పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.పతనానికి ప్రధాన కారణాలుసాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్ను తగ్గిస్తున్నాయి.ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.1983లో ఏం జరిగిందంటే.. 1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.నేటి బంగారం, వెండి ధరలు నేడు (మార్చి 22, 2026) దేశీయంగా ఎంసీఎక్స్ (MCX) మార్కెట్కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. -
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది. -
గుడ్న్యూస్.. బంగారం బాగా తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
విదేశీ ఇన్వెస్టర్లకు ఇదో అద్భుత అవకాశం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటుచేసుకున్న ఇటీవలి మార్పులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా మారాయని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్నే పేర్కొన్నారు. ప్రస్తుత కరెక్షన్ వల్ల షేర్ల విలువ ఆకర్షణీయంగా మారాయని, ఇది భారత్లో పెట్టుబడులు పెంచుకోవడానికి సరైన సమయమని విశ్లేషించారు.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా జరిగిన ‘రష్యా-ఇండియా క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రేషన్’ ఫోరంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వర్ష్నే తెలిపారు. అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా ఉన్నారు. కేవలం మార్చి మొదటి 15 రోజుల్లోనే సుమారు రూ.77,000 కోట్ల నిధులు బయటకు వెళ్లడం గమనార్హం. రష్యా ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న సాంకేతిక, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి సెబీ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.‘భారతీయ మార్కెట్లలోని అనుబంధ సంస్థల విలువ, విదేశాల్లోని వారి మాతృ సంస్థల కంటే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రష్యా కంపెనీలు భారత మార్కెట్లలో లిస్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు’ అని తెలిపారు. భారతీయ మార్కెట్లు కేవలం పెట్టుబడితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానానికి వేదికగా మారుతున్నాయని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) అంతలోనే ధర పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే సుమారు రూ.7 వేలు తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం తగ్గుముఖంలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రూడ్ బాంబ్.. మార్కెట్ క్రాష్
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో దలాల్ స్ట్రీట్లో అన్ని రంగాల షేర్లు దగ్ధమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం పేకమేడలా కూలిపోయింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ తారస్థాయికి చేరుకోవడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం తదితర అంశాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 2,497 పాయింట్లు(3.26%) క్షీణించి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 776 పాయింట్లు కుప్పకూలి 23,002 వద్ద నిలిచింది. 2024 జూన్ 24 తర్వాత ఇరు సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ మూడు శాతానికిపైగా పతనంతో ఒక్కరోజే రూ.12.87 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆసియా మార్కెట్లు 3%, యూరప్ మార్కెట్లు 2.50% పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అమ్మకాల సునామీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,753 పాయింట్లు క్షీణించి 73 వేల స్థాయి దిగువన 73,951 వద్ద, నిఫ్టీ 848 పాయింట్లు పతనమై 22,930 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. → బీఎస్ఈ ఇండెక్సుల్లో ఆటో 4.07%, రియల్టీ 3.79%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 3.66% పతనయమ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 3.34%, 2.77% పడ్డాయి. సెన్సెక్స్లో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్(5.6%), బజాజ్ ఫైనాన్స్(5.4%), ఎంఅండ్ఎం(5.2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(5.1%), ఎల్అండ్టీ (4.7%) అత్యధికంగా నష్టపోయాయి.పతనానికి ‘పంచ’ కారణాలు → భగ్గుమన్న చమురు ధరలు: ఇరాన్ దాడులు తీవ్రం చేయడంతో గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ పూర్తి గా స్తంభించిపోయింది. దీంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ 119 డాలర్ల స్థాయికి తాకింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. → విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు: యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ వారంలో కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.24 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలు విక్రయించారు. గురువారం ఒక్క రోజే రూ.7,558 కోట్లు అమ్మకాలకు పాల్పడ్డారు. గడిచిన 14 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. → ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాలను కారణాలుగా చూపుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు.→ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ల అమ్మకాలు: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామాతో బ్యాంకు షేరు ఇంట్రాడేలో బ్యాంక్ షేర్లు 8.7 శాతం మేర పతనమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన స్టాక్ కావడంతో సూచీలపై ఆ ప్రభావం కనిపించింది.→ లాభాల స్వీకరణ: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా... దేశీ సూచీలు గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ మొత్తం 2,140 పాయింట్లు(2.87%) ఎగసింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. -
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో చేతులు కలిపిన స్టాక్ బ్రోకర్లపై పెండింగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్మెంట్ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్ బ్రోకర్ సంస్థలకు 2025 జూన్ 16 నుంచి సెపె్టంబర్ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్వరకూ గడువును పొడిగించింది. -
నక్కతోక తొక్కినట్లు.. గంటల్లోనే పడిపోయిన బంగారం!
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లు మరింత ఊరట లభించింది.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.2550 తగ్గి రూ.1,42,750 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.7140 క్షీణించి రూ.1,37,750 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.6550 కరిగి రూ. 1,50,280 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.10000 క్షీణించి రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.మార్కెట్ను ముంచేసిన 5 ప్రధాన కారణాలుపతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభంఅమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.భగ్గుమన్న ముడిచమురుయుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో కుదుపుదేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్ను షాక్కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ను భారీగా కిందకు లాగింది.అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరిఅమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.రూపాయి పతనం- ఎఫ్ఐఐల అమ్మకాలుఅంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 11 శాతం పెరిగింది. -
బిగ్రిలీఫ్.. పండగపూట బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


