breaking news
Market
-
వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది. అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది. -
అవునా.. నిజమా!.. ఇది సాధ్యమా?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,780 వద్ద ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.''1990లో ఒక కేజీ బంగారంతో.. మారుతి 800 వచ్చేది. 2000లో మారుతి ఎస్టీమ్, 2005లో ఇన్నోవా, 2010లో ఫార్చ్యూనర్, 2019లో బీఎండబ్ల్యు ఎక్స్1, 2025లో డిఫెండర్, 2030 నాటికి రోల్స్ రాయిస్ కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఒక కేజీ బంగారం కొని 2040 వరకు వేచి ఉండండి.. మీరు ఒక ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేయగలుగుతారు'' అని వివరించారు.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకిఈ రోజు రేటు ప్రకారం.. ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ రూ. 1,43,78,000. ఈ ధరలో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. ధరలు ఇలాగే కొనసాగితే.. 2040 నాటికి ఒక కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఒకవేళా గోల్డ్ రేటు తగ్గితే.. అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.Interesting Economics & Observation:1990 .....1KG gold = Maruti 8002000......1KG gold = Esteem2005......1KG Gold = Innova2010......1KG Gold = Fortuner2019.....1KG Gold = BMW X12025…..1Kg #Gold = Defender2030….. 1kg #Gold = Rolls RoyceKeep 1 KG #gold & wait till…— A K Mandhan (@A_K_Mandhan) January 15, 2026 -
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు సెషన్ల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
'వెండి దొరకడం కష్టం': కియోసాకి
సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.TESLA cannot get silver.This Monday silver will gap upfrom $91 an ounce to $107 an ounce.Yay— Robert Kiyosaki (@theRealKiyosaki) January 15, 2026ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్! -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 187.64 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 83,570.91 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,694.90 వద్ద నిలిచాయి.అజ్మీరా రియాల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రామా ఫాస్ఫేట్స్ లిమిటెడ్, HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,693 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 146 పాయింట్లు నష్టపోయి 83,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగింది.నాస్డాక్ 0.25 శాతం పుంజుకుంది.Today Nifty position 16-01-2026(time: 9:19 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇన్ఫోసిస్కూ తప్పలేదు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 2 శాతం క్షీణించి రూ. 6,654 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో రూ. 1,289 కోట్లమేర వన్టైమ్ కేటాయింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,806 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం ఎగసి రూ. 45,479 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 41,764 కోట్ల టర్నోవ ర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 9.6 శాతం క్షీణించగా.. ఆదాయం 2.2 శాతం పుంజుకుంది. ఏఐలో ముందంజ ఎంటర్ప్రైజ్ ఏఐలో ప్రత్యేకత కలిగిన విలువ ఆధారిత సరీ్వసులను టోపజ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీకున్న నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు, పటిష్ట డెలివరీ సామర్థ్యాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. దీంతో ఇన్ఫోసిస్ను తమ భాగస్వామిగా ఎంచుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించి షేర్ల బైబ్యాక్తో పాటు వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ను సైతం చెల్లించింది. గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు సీఎఫ్వో జయేష్ ఎస్. పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే 18,000 మందికి ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. ఇతర విశేషాలు → తాజా సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ 4.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. వీటిలో 57 శాతం కొత్తగా సాధించిన ఆర్డర్లు కావడం గమనార్హం! → యూకే నేషనల్ హెల్త్ సరీ్వస్తో 1.6 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ అందుకుంది. → మార్చితో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 3–3.5 శాతానికి మెరుగుపరచింది. ఇంతక్రితం 2–3 శాతం ఆదాయ వృద్ధిని ప్రకటించిన సంగతి తెలిసిందే. → 2025 డిసెంబర్ 31కల్లా 5,043 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,37,034కు చేరింది. → కంపెనీ సీఈవో పరేఖ్కు రూ. 3 కోట్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాల(ఆర్ఎస్యూలు) కేటాయిం చేందుకు బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. → కొత్త కారి్మక చట్టాల ప్రభావంతో ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్ రూ. 2,128 కోట్లు, హెచ్సీ ఎల్ టెక్నాలజీస్ రూ. 719 కోట్లు చొప్పున క్యూ3 లో కేటాయింపులు చేపట్టిన విషయం విదితమే. ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 1,599 వద్ద ముగిసింది.Infosys (755691)third quarter (774541)consolidated (755785)net profit (75578 -
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది. బ్యాంకింగ్ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి. డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. బ్యాంక్ షేరు బీఎస్ఈలో 8 శాతం జంప్చేసి రూ. 180 వద్ద ముగిసింది. -
పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు తగ్గి 25,692 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 155 పాయింట్లు నష్టపోయి 83,468 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.16బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం తగ్గింది.నాస్డాక్ 0.1 శాతం నష్టపోయింది.Today Nifty position 14-01-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రికార్డు మీద రికార్డు.. రెండు రోజుల్లో రూ.21000 జంప్
గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది. అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిలకడగా నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. దాంతో ఇటీవలి వరుస నష్టాలకు ఈరోజుతో బ్రేక్ పడినట్లయింది. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,832 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 101 పాయింట్లు పుంజుకొని 83,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.94బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.07 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.16 శాతం పెరిగింది.నాస్డాక్ 0.26 శాతం పుంజుకుంది.Today Nifty position 13-01-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇంకా మించి పోలేదు: వెండి ధరలపై కియోసాకి
బంగారం, వెండి లోహాలపై ఎప్పుడూ బుల్లిష్గా ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ( Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి వెండిపై బలమైన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘యేయ్.. వెండి 80 డాలర్లు దాటిందోచ్’ అంటూ ధరల పెరుగుదల ఇంకా ముగిసిపోలేదని స్పష్టం చేశారు.ఇటీవల వెండి ధరలు ఔన్సుకు 80 డాలర్లు దాటడంతో ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోతుందా అనే పెట్టుబడిదారుల సందేహాలకు కియోసాకి (Robert Kiyosaki ) సమాధానమిచ్చారు. ‘వెండి కొనడానికి ఇప్పటికే ఆలస్యమైందా?’ అనే ప్రశ్నకు ఆయన స్పష్టంగా “లేదు” అని చెప్పారు. ధరలు 100 డాలర్ల స్థాయికి (ఔన్స్కు) చేరుకునే వరకు వెండిని కొనుగోలు చేస్తూనే ఉంటానని, ఆ తర్వాత పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు.కఠిన ఆస్తులు (హార్డ్ అసెట్స్), ఫియాట్ కరెన్సీ విలువ క్షీణత, ద్రవ్యోల్బణ ప్రమాదాలపై తరచూ హెచ్చరికలు చేసే కియోసాకి.. పెట్టుబడిలో క్రమశిక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ “పందులే బలుస్తాయి. మాంసం కోసం వాటినే వధిస్తారు” అనే ప్రసిద్ధ నానుడిని ప్రస్తావించారు. అంటే, దురాశతో కాకుండా నియంత్రిత రిస్క్తో లాభాలు సాధించాలన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు.ఈ వ్యాఖ్యలు ఆయన గత అంచనాలకు కొనసాగింపుగానే వచ్చాయి. 2025 చివర్లో వెండి ఔన్సుకు 72 డాలర్లు దాటినప్పుడు, దానిని “బంగారం, వెండి పోగు చేసేవారికి గొప్ప వార్త”గా అభివర్ణించిన కియోసాకి, అదే సమయంలో డబ్బును పొదుపుపైనే ఆధారపడే పెట్టుబడిదారులకు ఇది “చెడు వార్త” అని హెచ్చరించారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 2026 నాటికి వెండి ధర ఔన్సుకు 200 డాలర్లు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. పారిశ్రామిక డిమాండ్, సేఫ్-హేవెన్ పెట్టుబడులు, అలాగే గ్లోబల్ ఆర్థిక అస్థిరత కలయికే వెండి ధరలను పైకి నడిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.10-11-2026Silver over $80…..yayIs it too late to buy silver?I say “No.”I would buy silver up to $100…. Then wait and see.Always remember:“Pigs get fat. Hogs get slaughtered.”— Robert Kiyosaki (@theRealKiyosaki) January 11, 2026 -
అంతులేని ధరల పెంపు ఆగేదెప్పుడో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన సెషన్లోనూ నష్టాల్లోకి జారుకున్న సూచీలు ఈరోజు ఉదయం 9:58 సమయానికి నిఫ్టీ(Nifty) 116 పాయింట్లు తగ్గి 25,567 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 425 పాయింట్లు నష్టపోయి 83,151 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.95బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.16 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.65 శాతం పెరిగింది.నాస్డాక్ 0.82 శాతం పుంజుకుంది.Today Nifty position 12-01-2026(time: 9:59 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రాబడులకు మెరుగైన దారి
న్యూఢిల్లీ: పెట్టుబడి ద్వారా సంపద సృష్టించుకోవాలని భావించే వారు రిస్క్ తీసుకునేందుకు సైతం సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్లో రాబడులు ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా 10–15–20 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి పెద్ద మొత్తంలో సమకూర్చుకోవాలని భావించే వారికి ఈక్విటీ ఫండ్స్ ఎంతో అనుకూలం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం దిశగా కేంద్ర సర్కారు పనిచేస్తోంది. కనుక రానున్న ఒకటి రెండు దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరిస్తుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈక్విటీల్లో.. అందులోనూ లార్జ్క్యాప్తోపాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్కు తప్పక చోటు కలి్పంచుకోవాలి. మిడ్క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వైట్ఓక్ క్యాపిటల్ మిడ్క్యాప్ ఫండ్ గురించి విశ్లేషణ ఇది. రాబడులు ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు అయింది. 2022 సెప్టెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కానీ, మొదటి మూడేళ్లలో మిడ్క్యాప్ విభాగంలో దిగ్గజ ఫండ్స్ పథకాల మించి బలమైన పనితీరు నమోదు చేసింది. ఏడాది కాలంలో పెట్టుబడులపై 5.28 శాతం రాబడిని ఇవ్వగా.. మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడి 28 శాతం వరకు ఉంది. కానీ, బీఎస్ఈ మిడ్క్యాప్ 150 టీఆర్ఐ మూడేళ్లలో ఏటా ఇచి్చన రాబడి 23.51 శాతంగానే ఉంది. ఇక మిడ్క్యాప్ ఫండ్స్ విభాగం సగటు రాబడి 22.97 శాతంతో పోల్చినా వైట్ఓక్ క్యాపిటల్ మిడ్క్యాప్ ఫండ్ అదనపు రాబడిని తెచ్చిపెట్టు తెలుస్తోంది. మిడ్క్యాప్ విభాగంలో హెచ్డీఎఫ్సీ మిడ్క్యాప్ ఫండ్, కోటక్ మిడ్క్యాప్ ఫండ్, నిప్పన్ ఇండియా మిడ్క్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్ను రాబడి పరంగా అధిగమించింది. బలమైన రాబడులు ఒక్కటే ప్రామాణికం కాదు. స్థిరమైన పనితీరు, అస్థిరతల్లో స్థిరత్వాన్ని చూడాల్సి ఉంటుంది. ఆ విధంగానూ ఈ పథకానికి మంచి మార్కులే పడతాయి. 110 వారాల్లో ఈ పథకం రాబడులు నికర సానుకూలంగా ఉన్నట్టు డేటా తెలియజేస్తోంది. పెట్టుబడుల విధానం భవిష్యత్తులో దిగ్గజాలు కాగల కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఇప్పటికే ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన కొన్ని స్మాల్క్యాప్ స్టాక్స్ మిడ్క్యాప్గా, మిడ్క్యాప్ స్టాక్స్ లార్జ్క్యాప్గా అవతరించాయి. పెట్టుబడుల్లో మిడ్క్యాప్ స్టాక్స్కు ఎక్కువ కేటాయింపులు చేస్తుంటుంది. ఆ తర్వాత లార్జ్క్యాప్ స్టాక్స్కు ప్రాధాన్యం ఇస్తుంది. పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.4,346 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 97 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. వీటిని పరిశీలిస్తే మిడ్క్యాప్ స్టాక్స్లో 56.36 శాతం ఎక్స్పోజర్ కలిగి ఉంది. లార్జ్క్యాప్ కంపెనీలకు 32.61 శాతం కేటాయించింది. స్మాల్క్యాప్స్లో 9.53 శాతం ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో ఏకంగా 120 స్టాక్స్ను కలిగి ఉంది. పైగా టాప్ 10 స్టాక్స్లో పెట్టుబడులు 29 శాతం మించి లేవు. అంటే పెట్టుబడుల్లో ఏకీకృత రిస్క్ను తగ్గించే విధంగా పెట్టుబడులున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్లో 25.4 శాతం ఇన్వెస్ట్ చేసింది. హెల్త్కేర్ కంపెనీలకు 15.48 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 15.24 శాతం, ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 13.45 శాతం, కన్జూమర్ డి్రస్కీíÙనరీ కంపెనీలకు 12 శాతం చొప్పున కేటాయించింది. -
ఐపీఓలంటే అద్భుతాలు కావు!
స్టాక్ మార్కెట్లలోని కంపెనీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్ ఇష్యూకు వచ్చినవే. కాకపోతే వాటిలో అగ్రశ్రేణి కంపెనీలుగా (లార్జ్క్యాప్) మారినవి కొన్నే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలో.. వద్దో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపీఓలంటే అద్భుతాలు కావు. ఆటోమేటిగ్గా సంపదను సృష్టించే సాధనాలూ కావు. అవి అవకాశాలతో పాటే రిస్కులనూ మన ముందుంచుతాయి. అలాగని ఐపీఓలకు దూరంగా ఉండమని కాదు. ఐపీఓ అంటే... మార్కెట్లు పంపే ఆహ్వాన పత్రికలు. దేన్ని స్వీకరించాలో... దేన్ని తిరస్కరించాలో మనమే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో.. 2025లో ఐపీఓకు వచి్చన కంపెనీల పరిస్థితేంటో... 2026లో ఎలా వ్యవహరించాలో సమగ్రంగా వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...ప్రస్తుతం ప్రైమరీ (ఐపీఓ) మార్కెట్ మంచి దూకుడు మీదుంది. దాదాపు 200కు పైగా కంపెనీలు లిస్టింగ్లకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో ఫిన్టెక్ యూనికార్న్లు, గ్రీన్ ఎనర్జీ వెంచర్ల నుంచి కన్జూమర్ బ్రాండ్లు, ఇన్ఫ్రా రంగ దిగ్గజాల వరకు చాలా ఉన్నాయి. జీడీపీ ఏడు శాతానికి పైగా కొనసాగుతుందనే సానుకూల అంచనాలు, డీమ్యాట్ ఖాతాలు 15 కోట్ల స్థాయిని దాటిపోవడం, ప్రతి నెలా సిప్ల ద్వారా రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తుండటం వంటి పరిణామాలు కంపెనీలకు మంచి ఊపునిస్తున్నాయి.ఐపీవోలు ఎందుకు..కంపెనీలు వివిధ కారణాలరీత్యా పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. అవేంటంటే.. → కార్యకలాపాలను విస్తరించడానికి, కొత్త టెక్నాలజీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటానికి → రుణాలుంటే తీర్చెయ్యడానికి... → ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, అలాగే ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించుకోవటానికి → బ్రాండ్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి అవసరాలకు సంబంధించి ఐపీవోలనేవి కంపెనీకి సహాయకరంగానే ఉంటాయి. అయితే, షేరు ధర అదే పనిగా పెరుగుతూనే ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు లిస్టింగ్లో మంచి లాభాలే ఇవ్వొచ్చు. మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ వేళ నిరాశపర్చినా, ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ పుంజుకుని మెరుగైన రాబడులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా మటుకు కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనలేక చతికిలబడి, షేర్లు కనుమరుగైపోతుంటాయి కూడా.రిటైల్ ఇన్వెస్టర్ల తప్పులివీ...ఆ ఐపీవో బాగా లిస్టయ్యింది.. ఈ ఇష్యూ బాగా లాభాలు తెచ్చిందనే అత్యుత్సాహంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొందరు గ్రే మార్కెట్లను ఫాలో అవుతూ అక్కడ ప్రీమియం రేటు పలికే వాటి వెంటబడుతుంటారు. ఇంకొందరు భారీగా ఓవర్సబ్్రస్కయిబ్ అయ్యింది కదా కచి్చతంగా లాభాలొచ్చేస్తాయనుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు లిస్టింగ్ రోజున భలే ఎగ్జైటింగ్గా ఉంటుందని పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ఈ అత్యుత్సాహంలో కొన్ని విషయాలు విస్మరిస్తుంటారు. వ్యాపారం మోడల్ నిజంగా బలమైనదేనా? దీర్ఘకాలికంగా నిలబడేదేనా? ప్రమోటర్ల ట్రాక్ రికార్డు బాగుందా లేదా? ఐపీవో ద్వారా తీసుకున్న డబ్బును కంపెనీ ఏ అవసరాల కోసం వాడుకుంటోంది? ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. 2025లో ఏం జరిగిందంటే... గతేడాది ఐపీవోలు తీపి, చేదు జ్ఞాపకాలు రెండింటినీ ఇచ్చాయి. దాదాపు 373 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో 103 మెయిన్ బోర్డ్ ఇష్యూ లు కాగా 270 కంపెనీలు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై లిస్టయ్యాయి. టాటా క్యాపిటల్ (రూ.15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ.12,500 కోట్లు) వంటి దిగ్గజాలు భారీగా నిధులు సమీకరించాయి. కొత్త తరం సంస్థలు మీషో రూ. 5,421 కోట్లు సమీకరించగా, గ్రో క్యాపిటల్ రూ.6,632 కోట్లు రాబట్టుకుంది. వీటిలో లిస్టింగ్ నాడు ఏకంగా 136 శాతం లాభాన్నిచి్చన స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లాంటి కంపెనీలతో పాటు తొలిరోజే 56 శాతం నష్టాన్నిచ్చిన గ్లోటిస్ లిమిటెడ్ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద ఇష్యూల్లో మీషోనే తీసుకుంటే ఇష్యూ ధర రూ.111 అయితే దాదాపు 46 శాతం అధికంగా రూ.162.50 వద్ద లిస్టయ్యింది. అలాగని అన్నీ ఇదే రీతిలో లిస్టింగ్ లాభాలిచ్చాయనుకోవడానికి లేదు. గతేడాది సగటున లిస్టింగ్ లాభాలు చూస్తే 8 శాతం స్థాయికే (అంతకు ముందటి సంవత్సరాలకన్నా తక్కువగా) పరిమితమయ్యాయి. వీటిలో దాదాపు సగ భాగం లిస్టింగ్లో ఏడాది చివరి నాటికి లాభాల్లోనే ఉండగా, మిగతావి ఇష్యు రేటు కన్నా కిందికి పడిపోయాయి. ఇక ఎస్ఎంఈ ఐపీవోలైతే మరీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని మలీ్టబ్యాగర్లుగా మారినప్పటికీ మిగతావి భారీగా పడిపోయాయి. హైప్ అనేది ఎల్లకాలం ఉండదని, వాస్తవంగా వ్యాపారానికి ఉండే బలమే కీలకమనే పాఠాన్ని 2025 మరోసారి నేరి్పంది.2026 ప్రత్యేకత ఏంటి.. ఈసారి 200 పైగా కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి రూ. 2.5 లక్షల కోట్లకు మించి సమీకరించవచ్చనే అంచనాలున్నాయి. వీటిలో పలు కంపెనీలు భారీ వేల్యుయేషన్లతో రాబోతున్నాయి. ఉదాహరణకు రూ. 11– 12 లక్షల కోట్ల వేల్యుయేషన్తో రిలయన్స్ జియో ఐపీవో దేశంలోనే అతి పెద్ద ఇష్యూగా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇది 2026 ప్రథమార్ధంలోనే రావచ్చు. అలాగే ఎన్ఎస్ఈ, ఫోన్పే, ఫ్లిప్కార్ట్, ఓయో, జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్... ఇలా బోలెడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను విక్రయించుకుని ని్రష్కమించనున్నాయి. డీమ్యాట్ ఖాతాలు పెరుగుతుండటం, సిప్ పెట్టుబడుల వెల్లువతో వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. వెరసి ఈసారి కూడా స్టాక్ మార్కెట్లు సందడిగానే ఉండనున్నాయి.ఏం చేయాలంటే... ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే... ఇవి మీ పోర్ట్ఫోలియోలో స్మార్ట్ భాగంగా ఉండొచ్చు. సముచిత రేటులో లభిస్తున్న బలమైన కంపెనీల ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ పెట్టుబడులకు సంబంధించి అదొక్కటే వ్యూహంగా మాత్రం పెట్టుకోవద్దు. → మంచి అవకాశాల కోసం కాస్త వేచి చూడండి. ఇలాంటివి ఏడాదిలో 4– 6 వరకు వస్తుంటాయి. → బాగుందనిపించగానే ఇన్వెస్ట్ చేసేయొద్దు. వ్యాపార ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు ప్రాస్పెక్టస్ని కూడా కాస్త తిరగేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. → పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులను మీ దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్లూ–చిప్ స్టాక్స్కి అనుబంధంగానే ఉంచుకోవడం మంచిది. చివరిగా చెప్పేదేమిటంటే పబ్లిక్ ఇష్యూలంటే లాటరీలు కావు! యుఫోరియాకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. లిస్టింగ్కి వచ్చిన కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంటే కేవలం లిస్టింగ్ రోజునే కాదు దీర్ఘకాలికంగా కూడా మంచి రాబడులను అందుకోవచ్చని గుర్తుంచుకోవాలి. -
2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!
బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.బంగారం రేటు పెరగడానికి కారణాలు!భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
వెండి స్పీడు.. పసిడి దూకుడు.. భారీ ధరలు
బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త రేటును నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పసిడి, వెండి ధరలు గడిచిన వారం రోజుల్లో ఎలా మారాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. జనవరి 4 నుంచి జనవరి 11 వరకు బంగారం తో పాటు వెండి ధరల్లో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.బంగారం ధరల పెరుగుదల ఇలా..24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 4న రూ.1,35,820 ఉండగా జనవరి 11 నాటికి రూ.1,40,460 లకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4640 పెరిగింది. ఇక జనవరి 4న రూ.1,24,500 ఉన్న 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 11 నాటికి రూ.1,28,750 లను తాకింది. ఏడు రోజుల్లో రూ.4250 ఎగిసింది.వెండి దూకుడుఇక వెండి ధరలు అయితే బంగారాన్ని మించి అమిత వేగంతో దూసుకెళ్లాయి. వారం రోజుల్లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.18 వేలు పెరిగింది. జనవరి 4న రూ.2,57,000 ఉన్న కేజీ వెండి ధర జనవరి 11 నాటికి రూ.2,75,000 లకు చేరింది.ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బలపడటం, డాలర్ మారకం విలువల్లో మార్పులు, అలాగే వివాహాలు, శుభకార్యాల నేపథ్యంలో నగలపై డిమాండ్ పెరగడం కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. వెండిపై పరిశ్రమల నుంచి కూడా డిమాండ్ పెరగడం ధరలపై ప్రభావం చూపిందని అంటున్నారు. -
పసిడి దూకుడు.. రూ.5400 పెరిగిన గోల్డ్ రేటు!
2025లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. 2026లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభమై 10 రోజులు కావొస్తుంది. ఈ సమయంలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 5400 పెరిగింది. దీంతో పసిడి ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి.జనవరి 1న హైదరాబాద్, విజయవాడలలో 1,35,060 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. నేటికి (జనవరి 10) రూ. 1,40,460 వద్దకు చేరింది. అంటే 10 రోజుల్లో గోల్డ్ రేటు 5,400 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,800 నుంచి రూ. 1,28,750 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.చెన్నైలో జనవరి మొదటి రోజు రూ. 1,36,140 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకు (జనవరి 10) 1,39,560 రూపాయల వద్దకు చేరింది. ఈ లెక్కన 10 రోజుల్లో రూ. 3420 పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,400 నుంచి రూ. 1,29,000 వద్దకు (రూ.4600 పెరిగింది) కదిలింది.ఢిల్లీలో 135210 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు పది రోజుల్లో రూ. 5400 పెరిగి.. 1,40,610 రూపాయలకు ఎగిసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,950 నుంచి రూ. 1,28,900 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.సిల్వర్ రేటువెండి ధరల విషయానికి వస్తే.. జనవరి 1న కేజీ సిల్వర్ రేటు రూ. 2.56 లక్షల దగ్గర ఉంది. జనవరి 10 నాటికి రూ. 2.75 లక్షల వద్దకు చేరింది. అంటే కేజీ సిల్వర్ రేటు జనవరి ప్రారంభం నుంచి రూ.19,000 పెరిగిందన్నమాట. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా? -
హోమ్ లోన్ ఏ వయసులో బెస్ట్?
ఈరోజుల్లో బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అసాధ్యమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో అపార్ట్మెంట్ల ధరలు రూ.కోట్లలో ఉంటున్నాయి. దీంతో పొదుపు చేసిన సొమ్ముతో పాటు గృహ రుణం తీసుకుంటే తప్ప ఇల్లు సొంతమయ్యేలా లేదు. అయితే ఏ వయసులో హోమ్ లోన్ తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయో ముందుగానే కొంత అవగాహన కలిగి ఉండటం బెటర్. రుణానికి అర్హత ఉంది కదా అని ఏ వయసులో పడితే ఆ వయసులో గృహ రుణం తీసుకుంటే లేనిపోని చికాకులు, మానసిక ఒత్తిళ్లకు లోను కావాల్సి వస్తోందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పైసా పైసా కూడబెడుతుంటారు. ఖర్చులను ఆదుపులో పెట్టుకొని పొదుపుపై దృష్టి పెడుతుంటారు. అయితే మన సొంతింటి కలకు బ్యాంక్లు లోన్ రూపంలో సహకారం అందిస్తుంటాయి. వడ్డీ రేట్లు కూడా అందుబాటులోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తుంటారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 2.0 అమలులోకి వచ్చాక పన్ను విధానం సరళతరమైంది. స్టీల్, శానిటరీ ఉత్పత్తులు, రంగులు వంటి నిర్మాణ సామగ్రిపై పన్ను శ్లాబ్లు తగ్గాయి. ఇది గృహ కొనుగోలుదారులకు డిస్కౌంట్గానే కాకుండా దీర్ఘకాలంలో పొదుపుగా మారుతుంది. 30 ఏళ్ల వయసులో రుణం.. సాధారణంగా ఇంటి యాజమాన్యానికి దాదాపు 30 సరైన వయసు. ఈ వయస్సులో చాలా మంది తమ కెరీర్ మార్గాలు, స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు ఖర్చుల గురించి బాగా అర్థం చేసుకుంటారు. అలాగే కుటుంబాలతో స్థిరపడాలని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి గృహ రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కెరీర్ ప్రారంభంలోనే అంటే 25–30 ఏళ్ల వయస్సులోనే గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జేబుకు అధిక భారం కాకుండా తక్కువ ఈఎంఐ చెల్లించే వీలుంటుంది. కెరీర్ ప్రారంభంలోనే ఉండటంతో సిబిల్ స్కోర్కు కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎక్కువ రుణం తీసుకునే వీలుతో పాటు కొంత వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. 750కు మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడే బ్యాంక్ రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్ స్కోర్ 800 దాటితే వడ్డీలోనూ 0.5 శాతం వరకూ తగ్గింపులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. నలభైలో ఒత్తిళ్లు.. ఉద్యోగ విరమణ లేదా జీవితంలో చివరి దశలో 40– 50 ఏళ్ల వయసు ప్రారంభంలో ఇల్లు కొనడమనేది కొంత సవాళ్లతో కూడుకున్న అంశం. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి 20 సంవత్సరాలకు మించి ఉంటుంది కాబట్టి జీవితంలోని ఈ దశలో నెలవారీ వాయిదా(ఈఎంఐ) భారం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ఇతర బాధ్యతలు వంటి అధిక ఖర్చులుండే వయసులో ఈఎంఐ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏమైనా అనుకోని ఘటన జరిగితే సొంతిల్లుని బ్యాంక్ జప్తు చేసుకుంటుంది. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. అద్దెకూ వయసుందీ.. ఇల్లు కొనడమనేది వ్యక్తి ఆర్థిక సంసిద్ధత, స్థిరత్వం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సొంతిల్లు ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపును, హోదాను తీసుకొస్తుంది. భవిష్యత్తుకు భద్రతా భావాన్ని అందిస్తుంది. అయితే ప్రాపరీ్టని కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అనువైన సమయం ఎక్కువగా వ్యక్తి వ్యక్తిగత పరిస్థితులు లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల వయసు ప్రారంభంలో అద్దెకు తీసుకోవడం ఆచరణాత్మకమైంది. ఎందుకంటే యువ నిపుణులు స్థిరమైన ఆదాయం కోసం పలు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయతి్నస్తుంటారు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలను మారుతుంటారు. అందుకే ఆర్థికంగా సిద్ధంగా ఉన్నవారు ఈ దశలో ఇల్లు కొనడాన్ని ఎంచుకోవచ్చు.ఉమ్మడి రుణం.. తగ్గును భారం.. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవచ్చు. దీంతో ఇంటి కొనుగోలుకు అధిక మొత్తంలో బ్యాంక్ లోన్ లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు సంబంధించి అధిక మొత్తంలో బ్యాంక్ లోన్ అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీంతో నెలవారి చెల్లించే ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది. -
మళ్లీ పసిడి పిడుగు! భారీగా మారిపోయిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. కొనుగోలుదారుల పాలిట పిడుగులా మారుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా ఎగిశాయి. వెండి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సిప్ సూపర్ హిట్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి డిసెంబర్లో నికరంగా రూ.28,054 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో రూ.29,911 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్లో వచి్చన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ, గోల్డ్ ఈటీఎఫ్లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించగా, డెట్ ఫండ్స్లో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.66,591 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. డివిడెండ్ ఈల్డ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) తప్ప మిగిలిన అన్ని ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ చివరికి ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.80.80 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి రూ.80.23 లక్షల కోట్లకు తగ్గాయి. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. సిప్ ద్వారా రికార్డు స్థాయి పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు డిసెంబర్లో సరికొత్త గరిష్టానికి చేరాయి. రూ.31,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో సిప్ పెట్టుబడులు రూ.29,445 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.3.34 లక్షల కోట్లకు చేరాయి. విభాగాల వారీ పెట్టుబడులు.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి రూ.10,019 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.8,135 కోట్లుగానే ఉన్నాయి. → మిడ్క్యాప్ ఫండ్స్ రూ.4,176 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.4,094 కోట్లు వచ్చాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.3,824 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.1,567 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → వ్యాల్యూ ఫండ్స్ రూ.1,088 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.2,255 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,057 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)లోకి పెద్ద మొత్తంలో రూ.11,647 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. -
వెంచర్ క్యాపిటల్కు బై ఐపీఓకు.. హాయ్
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు లిస్టింగ్వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్కు ప్రాధాన్యమిస్తున్నాయి. వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం! బ్రాండ్ బిల్డింగ్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్తోపాటు.. టాలెంట్ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్లకు జోష్నిస్తున్నట్లు వివరించాయి.జాబితా ఇలా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్ల జాబితాలో స్క్రిప్బాక్స్, మైగేట్, ఫ్యాబ్హోటల్స్, క్లాస్ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్లు సైతం అధికంగా లిస్టింగ్కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు. ఇదీ తీరు తొలి, మలి దశ స్టార్టప్లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్వెంచర్, ఫండ్ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్లు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పడిలేచిన పసిడి.. ఒక్కసారిగా పెరిగిన రేటు!
శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే మరింత పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,27,150 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మరో 550 రూపాయలు పెరిగింది. దీంతో రేటు రూ. 1,27,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 600 పెరగడంతో రూ. 1,39,310 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,000 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,640 వద్ద ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. సాయంత్రానికే పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,27,850 వద్ద (1200 రూపాయలు పెరిగింది) .. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,460 వద్ద (1310 రూపాయలు పెరిగింది)కు చేరింది. -
వరుస నష్టాలు.. స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 604.72 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 83,576.24 వద్ద, నిఫ్టీ 193.55 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 25,683.30 వద్ద నిలిచాయి.ఆసోమ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎలెకాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రాజ్రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
తారుమారైన బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి ధరలలో మిశ్రమ మార్పులు చోటుచేసుకున్నాయి. పసిడి ధరలు తగ్గుదలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ పుంజుకున్నాయి. వెండి ధరల్లో మాత్రం క్షీణత కొనసాగింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) ఎగిశాయి. వెండి ధరలు మరోసారి గణనీయంగా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: నష్టాల్లో నిఫ్టీ.. సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ప్రారంభమై నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు తగ్గి 25,862 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 44 పాయింట్లు నష్టపోయి 84,136 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.9బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.17 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25% తగ్గిందినాస్డాక్ 0.93 శాతం తగ్గిందిToday Nifty position 09-01-2026(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారత్ కోకింగ్ కోల్కు యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ కంపెనీ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 273 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన ప్రధాన సంస్థలలో మ్యూచుకల్ ఫండ్స్.. బంధన్, నిప్పన్ ఇండియా, యూటీఐసహా, ఎల్ఐసీ, సిట్రీన్ ఫండ్, సొసైటీ జనరాలి ఓడీఐ, మేబ్యాంక్ సెక్యూరిటీస్ తదితరాలున్నాయి.నేడు(9న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 21–23 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 13న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 23 ధరలో 11.87 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. ఇష్యూలో భాగంగా మాతృ సంస్థ కోల్ ఇండియా 46.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా రూ. 1,071 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ లిస్టింగ్లో రూ. 10,700 కోట్ల విలువ సాధించే అవకాశముంది.వెరసి కొత్త కేలండర్ ఏడాదిలో తొలి ఐపీవోగా బీసీసీఎల్ నిలవనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ నెల 16న లిస్ట్కానుంది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక ప్రకారం కోకింగ్ కోల్ ఉత్పత్తిలో గతేడాది(2024–25) బీసీసీఎల్ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ఈ కాలంలో ఆదాయం రూ. 13,802 కోట్లుకాగా.. రూ. 1,204 కోట్ల నికర లాభం ఆర్జించింది.కార్యకలాపాల విస్తరణ 1972లో ఏర్పాటైన బీసీసీఎల్ ప్రధానంగా స్టీల్, విద్యుత్ పరిశ్రమల్లో వినియోగించే కోకింగ్ కోల్, నాన్కోకింగ్ కోల్, వాష్డ్ కోల్ ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ తొలుత ఝరియా(జార్ఖండ్), రాణిగంజ్(పశి్చమ బెంగాల్) గనుల నుంచి కోకింగ్ కోల్ సరఫరా కోసం ఏర్పాటైంది. తదుపరి కాలంలో భారీస్థాయిలో కార్యకలాపాలు విస్తరించింది. 2025కల్లా 40.50 మిలియన్ టన్నుల కోల్ను ఉత్పత్తి చేసింది.2022లో సాధించిన 30.51 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 33 శాతం వార్షిక వృద్ధి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి ఆరు నెలల్లో 15.75 మిలియన్ టన్నుల కోల్ను ఉత్పత్తి చేసింది. అయితే గతేడాది ఇదే కాలం(ఏప్రిల్–సెపె్టంబర్)లో ఉత్పత్తి చేసిన 19.09 మిలియన్ టన్నులతో పోలిస్తే క్షీణత నమోదైంది. 2025 సెపె్టంబర్కల్లా 34 గనులను నిర్వహిస్తోంది. వీటిలో 4 భూగర్భంలోనివికాగా.. 26 ఓపెన్కాస్ట్ గనులు. -
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్
వరుస నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద, నిఫ్టీ 263.90 పాయింట్ల నష్టంతో 25,876.85 వద్ద నిలిచాయి.ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్, జిందాల్ ఫోటో లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఏడాది చివరికల్లా 93,918 పాయింట్లకు సెన్సెక్స్
బీఎస్ఈ ఎక్స్ఛేంజ్లోని బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 2026 డిసెంబర్ నాటికి 93,918 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ క్లయింట్ అసోసియేట్స్ అంచనా వేసింది. అంటే సెన్సెక్స్ ప్రస్తుత స్థాయి (84,961)తో పోలిస్తే 11% పెరిగే వీలుందని అభిప్రాయపడింది.‘‘దేశీయ స్థూల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. కార్పొరేట్ ఆదాయాల అవుట్లుక్ మెరుగ్గానే ఉన్నాయి. అయితే షేర్ల వాల్యుయేషన్లు అధికంగా ఉండటం, అంతర్జాతీయ అనిశి్చతుల కారణంగా ఇన్వెస్టర్లు ‘క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి’ వ్యూహాన్ని అనుసరించవచ్చు. దీంతో ఈ ఏడాది భారతీయ మార్కెట్ విస్తృత స్థాయి ర్యాలీలకు స్వస్తి పలికి.., ఎంపిక చేసుకున్న, ఫండమెంటల్ ఆధారిత అవకాశాల దిశగా అడుగులు వేయోచ్చు’’ అని సంస్థ రీసెర్చ్ హెడ్ నితిన్ అగర్వాల్ తెలిపారు.రిస్క్ అంచనాలను మెరుగుపరుచుకుంటూ.., సరైన డైవర్సిఫికేషన్ విధానాలను అనుసరిస్తే ధీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు ప్రధాన వనరులుగా కొనసాగుతాయని అగర్వాల్ పేర్కొన్నారు.ఇంకా 2026కి సంబంధించిన క్లయింట్ అసోసియేట్స్ వార్షిక ఈక్విటీ అంచనా నివేదికలో.... పోర్ట్ఫోలియో వైవిద్యీకరణలో బంగారం, వెండి కీలకం. డాలర్ బలహీనత, భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాల్లో మార్పుల కారణంగా గతేడాదిలో విలువైన లోహాలు భారీ రాబడులు ఇచ్చాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం డిమాండి పెరిగి, వ్యూహాత్మక పెట్టుబడి సాధనగా పసిడి ప్రాధాన్యం మరింత పెరిగింది. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, అమెరికా–చైనా ఉద్రిక్తతలు, వెండిని కూడా కీలక లోహంగా గుర్తించే చర్చల నేపథ్యంలో వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్ వృద్ధి అవుట్లుక్ మెరుగ్గానే ఉంది. బలమైన డిమాండ్, తయారీ–సేవల రంగ విస్తరణ, స్థిరమైన జీఎస్టీ వసూళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదవ్వొచ్చు. -
పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. గంటల వ్యవధిలో మరింత దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. వెండి ధరలు గణనీయంగా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 46 పాయింట్లు తగ్గి 26,094 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు నష్టపోయి 84,840 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.58బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.16 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3% తగ్గిందినాస్డాక్ 0.2 శాతం పెరిగిందిToday Nifty position 08-01-2026(time: 9:48 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మారిన గోల్డ్ రేట్లు.. లేటెస్ట్ ధరలు ఇలా..
బుధవారం ఉదయం.. పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో రూ. 127850 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికే 500 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 126750 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 550 తగ్గడంతో రూ. 138270 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ. 300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 330 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) తగ్గింది. కొత్త ధరలు రూ. 1,28,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,39,640 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్). అయితే ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది.వెండి ధరలు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రూ. 2.83 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి 2.77 లక్షల రూపాయల వద్దకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. సంక్రాంతి నాటికి వెండి రేటు రూ. 3 లక్షలకు చేరుతుందని కొందరు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత? -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మాదిరిగానే.. బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 92.45 పాయింట్ల నష్టంతో.. 84,970.90 వద్ద, నిఫ్టీ 35.15 పాయింట్ల నష్టంతో 26,143.55 వద్ద నిలిచాయి.జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్, ఎన్ఐబిఎల్ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్జీ జవేరి లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఓరియంట్ సెరాటెక్ లిమిటెడ్, ఇన్క్రెడిబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఇవేం ధరలు బాబోయ్.. హ్యాట్రిక్ కొట్టేసిన పసిడి, వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజూ ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) మరింతగా పెరిగాయి. వెండి ధరలు అయితే అత్యంత భారీగా దూసుకెళ్లాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: 26,150 దిగువన నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు కరిగి 26,141 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 75 పాయింట్లు క్షీణించి 84,988 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.79 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.6 శాతం పెరిగింది.నాస్డాక్ 0.6 శాతం పెరిగింది.Today Nifty position 07-01-2026(time: 9:33 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘అదానీ’ బాండ్లు: నిమిషాల్లోనే మొత్తమన్నీ సేల్..
డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ మూడోసారి ఆఫర్ చేసిన మార్పిడికివీలుకాని లిస్టెడ్ డిబెంచర్ల(ఎన్సీడీలు)కు భారీ డిమాండ్ నెలకొంది. ఆఫర్ ప్రారంభమైన 45 నిముషాల్లోనే బాండ్లు విక్రయమైనట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) డేటా వెల్లడించింది. నిజానికి తొలుత రూ. 500 కోట్ల విలువైన ఎన్సీడీలను ఆఫర్ చేయగా.. 10 నిముషాలలోనే అంతకుమించిన సబ్స్క్రిప్షన్ లభించింది.వార్షికంగా 8.9 శాతం ఈల్డ్(వడ్డీ ఆర్జన)తో వీటిని ఆఫర్ చేసింది. అయితే భారీ డిమాండ్ నేపథ్యంలో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా మరో రూ. 500 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం విక్రయించింది. వెరసి 45 నిముషాల్లోనే రూ. 1,000 కోట్లు సమీకరించింది. ఇష్యూ పరిమాణం 50 లక్షలుకాగా.. 2.19 కోట్ల ఎన్సీడీలకు బిడ్స్ దాఖలయ్యాయి. ఇవి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. 6న ఓపెన్ అయిన ఇష్యూ 19న ముగియనుంది. వీటిని తొలుత వచ్చినవారికి తొలుత ప్రాతిపదికన జారీ చేయనున్న సంగతి తెలిసిందే.75 శాతం చెల్లింపులకేఅదానీ ఎంటర్ప్రైజెస్ ఆఫర్ చేసిన ఎన్సీడీలకు రేటింగ్ దిగ్గజాలు ఇక్రా, క్రిసిల్ వీటికి స్థిరత్వ ఔట్లుక్తో కూడిన ఏఏమైనస్ రేటింగ్ను ప్రకటించాయి. నిధులలో 75 శాతాన్ని ప్రస్తుత రుణాల చెల్లింపునకు అదానీ గ్రూప్ దిగ్గజం వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ఇంతక్రితం 2025 జూలైలో ఎన్సీడీల జారీ ద్వారా రెండోసారి రూ. 1,000 కోట్లు సమీకరించింది.తాజాగా విక్రయించిన ఎన్సీడీలను 24, 36, 60 నెలల కాలావధితో ఆఫర్ చేసింది. వీటికి త్రైమాసిక, వార్షిక పద్ధతిలో వడ్డీని చెల్లించనుంది. గత నెలలో ప్రారంభమైన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సహా.. కంపెనీ వైజాగ్లో గూగూల్ అదానీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్, దేశవ్యాప్తంగా వివిధ రహదారుల ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్న విషయం విదితమే. -
బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్ను సెంటిమెంట్గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.లిథియంకు డిమాండ్ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్టాప్లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ! -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 376.27 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల నష్టంతో 26,175.60 వద్ద నిలిచాయి.శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, గోయల్ అల్యూమినియంస్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిస్టమ్మాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
20 నిమిషాల్లో కోటీశ్వరుడైన ట్రేడర్!
బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖాతాదారుల ఖాతాల్లో భారీ నగదు జమ చేసేస్తుంటాయి. జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ.. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక లోపం కారణంగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ గజానన్ రాజ్గురు ఖాతాలోకి రూ. 40 కోట్లు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని చూసిన ట్రేడర్ కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి 20 నిమిషాల్లో ఏకంగా రూ. 2.38 కోట్ల లాభాన్ని గడించారు. ఆ తరువాత ఇందులో రూ. 54 లక్షల నష్టం వచ్చింది. ఆ తరువాత మరోసారి ట్రేడ్ చేసి.. చివరకు రూ. 1.74 కోట్ల లాభాన్ని పొందాడు.విషయం తెలుసుకున్న.. కోటక్ సెక్యూరిటీస్, ట్రేడర్ నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా, అతడు ట్రేడ్ చేసి సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తీసుకుంది. దీనిపై ట్రేడర్ కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను కోర్టు కూడా రెండు సార్లు తిరస్కరించినప్పటికీ.. అతడు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండడంతో.. చివరికి బాంబే హైకోర్టు రూ.1.75 కోట్ల లాభాన్ని తన వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.ఇదీ చదవండి: సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!ట్రేడర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి రిస్క్ చేశారని, అందులో వచ్చిన లాభం తనకే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 40 కోట్ల రూపాయలు కోటక్ సెక్యూరిటీస్ తీసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు.. ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. -
బంగారం, వెండి ధరలు.. డబుల్ షాక్!
దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు ఆపలేదు. వరుసగా రెండో రోజూ దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తక్కువగా అయినా గణనీయంగానే పెరిగాయి. వెండి ధరలు కూడా అదేస్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 26,211 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 263 పాయింట్లు నష్టపోయి 85,176 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.5బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.6% పైగా పెరిగిందినాస్డాక్ 0.9 శాతం పెరిగిందిToday Nifty position 06-01-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
8 కంపెనీల లిస్టింగ్కు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రెండేళ్లుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ కేలండర్ ఏడాది(2026)లోనూ దూకుడు చూపనున్నాయి. ఇప్పటికే పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిస్టింగ్ బాట పట్టగా.. హిందుస్తాన్ ల్యాబొరేటరీస్ ఐపీవోకు దరఖాస్తు చేసింది. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం..కొత్త ఏడాదిలో విభిన్న రంగాలకు చెందిన 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందాయి. జాబితాలో ఆర్కేసీపీఎల్ లిమిటెడ్, చార్టర్డ్ స్పీడ్, గ్లాస్ వాల్ సిస్టమ్స్(ఇండియా), జెరాయ్ ఫిట్నెస్, శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీ, టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్(ఇండియా), ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూలై– సెపె్టంబర్ మధ్య కాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలన్నీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. ప్రధానంగా ఫెర్టిలిటీ సర్వీసులందించే ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసి అనుమతి పొందాయి.ఆర్కేసీపీఎల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కంపెనీ ఆర్కేసీపీఎల్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 550 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కార్యకలాపాలు, బ్యాలెన్స్షీట్ పటిష్టతకు వినియోగించనుంది. రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 130 కోట్లు నిర్మాణ సంబంధ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 188 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.చార్టర్డ్ స్పీడ్ ప్రయాణికుల చేరవేత కంపెనీ చార్టర్డ్ స్పీడ్ లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీ ని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 855 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుండగా, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్ బస్సులపై ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. గ్లాస్ వాల్ ఫ్యాసేడ్ సిస్టమ్స్ తయారీ, ఇన్స్టలేషన్ కంపెనీ గ్లాస్ వాల్ సిస్టమ్స్(ఇండియా) లిమిటెడ్ ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.02 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. శ్రీరామ్ ఫుడ్ ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యం ఎగుమతి చేసే శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీ ఐపీవోలో భాగంగా 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 52 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2014లో ఏర్పాటైన కంపెనీ బీ2బీ పద్ధతిలో బియ్యం ఎగుమతులను చేపడుతోంది.జెరాయ్ ఫిట్నెస్ ఫిట్నెస్ పరికరాల తయారీ కంపెనీ జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు ఐపీవోలో భాగంగా 43.92 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లకు చేరనున్నాయి. కంపెనీ కస్టమర్లలో కమర్షియల్ జిమ్స్, హోటళ్లు, కార్పొరేషన్లు, దేశ, విదేశాలలోని రియల్టీ ప్రాజెక్టులున్నాయి. జిమ్ పరికరాలను జపాన్, యూఏఈ, ఆ్రస్టేలియా, స్వీడన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది. టెంప్సెన్స్ థర్మల్ ఇంజినీరింగ్, కేబుళ్ల తయారీ కంపెనీ టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 118 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.79 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ ఫెర్టిలిటీ సేవల కంపెనీలు ఇందిరా ఐవీఎఫ్, రేస్ ఆఫ్ బిలీఫ్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందాయి. ఇందిరా ఐవీఎఫ్ మెయిన్ బోర్డులో లిస్ట్కానున్నట్లు 2025 జూలైలో ప్రకటించింది. గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడం ద్వారా కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ వివరాలను రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది. పబ్లిక్ ఇష్యూకి వచ్చే ముందు వివరాలు వెల్లడించే సంగతి తెలిసిందే.గత రెండేళ్ల రికార్డులిలా 2025 కేలండర్ ఏడాదిలో ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 102 కంపెనీలు లిస్టయ్యాయి. తద్వారా రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. దీంతో 2024లో 90 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా సమీకరించిన రూ. 1.6 లక్షల కోట్ల రికార్డ్ వెనుకబడింది. అంతకుముందు 2023లో 57 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చి రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి. -
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. ఈ రోజు (డిసెంబర్ 5) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 2400 పెరిగింది. నిజానికి ఉదయం 1580 రూపాయలు పెరిగిన రేటు.. సాయంత్రానికి రూ. 2400కు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు మరో 820 రూపాయలు పెరిగింది. ఇక దేశంలోని వివిధ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల విషయానికి వస్తే..హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం 1,37,400 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,38,220 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటల వ్యవధి పూర్తి కాకుండానే బంగారం రేటు భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల రేటు 2200 రూపాయలు పెరిగి కూడా రూ. 1,26,700 వద్దకు చేరింది.చెన్నైలో తాజా బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,39,200 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 127600 వద్ద ఉంది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,38,370 వద్ద, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,26,850 వద్దకు చేరింది. పసిడి ధరలు మాత్రమే కాకూండా.. వెండి రేటు కూడా గణనీయంగా పెరిగింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నిఫ్టీ(Nifty) 90.60 పాయింట్లు నష్టంతో 26,237.95 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 351.07 పాయింట్లు క్షీణించి 85,410.94 వద్ద నిలిచాయి.రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్ లిమిటెడ్, బిపిఎల్ లిమిటెడ్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్రితి న్యూట్రియంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్యుపిడ్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్డెకో హౌసింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు -
వెండిపై అస్సలు తగ్గని కియోసాకి
అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరాయి. అయితే బంగారం, వెండి వంటి ఆస్తులపై పెట్టుబడులను ప్రోత్సహించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై రోజుకో సంచలన అంచనా ప్రకటిస్తున్నారు.తాజాగా సోషల్ మీడియాలో మరో సరికొత్త అంచనాను వదిలారు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). ‘వెండి ధర రేపు ఔన్స్కు 100 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమై, ఆల్టైమ్ గరిష్టాలకు చేరుకుంటుంది’ అంటూ తన ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? అంటూ యూజర్లలో చర్చను రేకెత్తించారు.ఈ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకుల మధ్య సందేహాలు రేకెత్తించాయి. ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్గా ట్రేడ్ అయ్యే కమోడిటీ అయిన వెండి ధర ఒక్క రోజులో ఈ స్థాయికి చేరుకోవాలంటే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లేదా సరఫరా అంతరాయం వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తితేనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.కియోసాకి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ రుణాలు, ద్రవ్యోల్బణం, ఫియాట్ కరెన్సీల విలువ తగ్గుదలపై హెచ్చరిస్తూ వస్తున్నారు. బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి హార్డ్ అసెట్లలో పెట్టుబడులు పెట్టాలని ఆయన తరచుగా సూచిస్తుంటారు. అయితే, ఆయన అంచనాలు ఎక్కువగా దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలపై దృష్టి సారిస్తాయని, తక్షణ ధరల అంచనాలుగా భావించరాదని విమర్శకులు అంటున్నారు.I PREDICT:Silver opens tomorrow at $100 and goes to all time highs.What do you think?— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026 -
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దౌడు తీశాయి. ఒక్కసారిగా భారీ స్థాయిలో ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) రూ.1500 పైగా పెరిగాయి. వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: ఫ్లాట్గా సెన్సెక్స్.. నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 9 పాయింట్లు నష్టంతో 26,318 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 117 పాయింట్లు క్షీణించి 85,644 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.5బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 60.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడింది.నాస్డాక్ 0.03 శాతం పెరిగింది.Today Nifty position 05-01-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారు గృహాల భారతదేశం
ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ డీ బియర్స్ వజ్రాలను ‘‘స్త్రీలకు అత్యంత ప్రియమైనవిగా’’ ప్రచారం చేసినా, భారత మహిళల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నది మాత్రం బంగారమే. ఆభరణాలుగా అలంకరణకు మాత్రమే కాకుండా, విలువ తగ్గని ఆస్తిగా (ఖరీదైన కారు లేదా తాజా ఐఫోన్ లాగా కాదు) బంగారం భారతీయులకు సంపద సృష్టిలో విప్లవాత్మక పాత్ర పోషించింది.బిలియన్ డాలర్ల సంపద సృష్టి 2011 నుంచి 2024 మధ్య భారత్ భారీగా బంగారం దిగుమతి చేసుకుంది. దీనివల్ల వాణిజ్య లోటు పెరిగిందనే విమర్శలు వచ్చాయి. కానీ నేటి ధరలతో చూసుకుంటే, ఈ బంగారం భారత కుటుంబాలకు అసాధారణమైన సంపదను సృష్టించింది.ఈ కాలంలో దిగుమతి చేసిన బంగారం విలువ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.దాదాపు 175% పెరుగుదల. భారతదేశ ప్రస్తుత విదేశీ మారక నిల్వలకంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అప్పట్లో వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన విశ్లేషకులు, దీర్ఘకాల సంపద సృష్టిని అంచనా వేయలేకపోయారు.ఆభరణాల రీ–ఎగుమతులు – గ్లోబల్ జువెలరీ హబ్గా భారత్ దిగుమతి చేసిన బంగారంలో కొంత భాగం ఆభరణాల రూపంలో మళ్లీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇది ప్రపంచ ఆభరణాల తయారీ, వ్యాపార కేంద్రంగా భారతదేశానికి ఉన్న స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే దేశీయంగా నిల్వ ఉన్న అపారమైన బంగారం సంపద ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించదు.భారత కుటుంబాల వద్ద 25,000–30,000 టన్నుల బంగారం అంచనాల ప్రకారం భారత కుటుంబాల వద్ద 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వలలో ఒకటి. ప్రస్తుత ధరలతో దీని విలువ 3.4 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.1 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది భారత గృహ సంపదలో బంగారం ఎంత కీలక భాగమో స్పష్టం చేస్తోంది.2025లో బంగారం బ్లాక్బస్టర్, 2026పై అంచనాలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇవన్నీ కలిసి 2025లో బంగారాన్ని బ్లాక్బస్టర్ ఆస్తిగా మా ర్చాయి. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కారణంగా డిమాండ్ నిలకడగా కొనసాగింది. అయితే 2026కి చూస్తే, బంగారంపై దృక్పథం సానుకూలంగానే ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పులు బంగారం ధర విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే బంగారం కొనుగోలు శక్తిని కాపాడే కీలక రక్షణగా నిలుస్తుంది. వడ్డీ రేట్లు తీవ్రంగా పెరిగినా, దీర్ఘకాలంలో బంగారం విలువ నిలకడగా ఉంటుంది.పోర్ట్ఫోలియోలో బంగారం ఆర్థిక నిపుణులు సాధారణంగా పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 5–10% బంగారానికి కేటాయించమని సూచిస్తారు. ఇది ఈక్విటీల వృద్ధితో సమతుల్యతను కలిగిస్తుంది. ఇప్పటికే భౌతిక బంగారం ఎక్కువగా కలిగి ఉన్నవారు, లిక్విడిటీ కోసం గోల్డ్ ఫండ్స్ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కొత్త ఏడాదిలో బంగారంలో పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి మార్గాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.ఇటీవల ప్రభుత్వ నిబంధనల మార్పులతో, ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు బంగారం వంటి కమోడిటీల్లో పెట్టుబడి పెట్టే కొత్త ఫండ్స్ను ప్రారంభించనున్నాయి. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ కేంద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, భౌతిక బంగారం ఆధారిత, ప్రొఫెషనల్గా నిర్వహించే గోల్డ్ ఫండ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవి రెసిడెంట్ ఇండియన్లు, ప్రవాస భారతీయులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి.ముగింపు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, 2026లో కూడా బంగారం భారత పెట్టుబడిదారుల వ్యూహాత్మక ఆస్తిగా కొనసాగనుంది. ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే అయినా, సంస్కృతి, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, అపారమైన నిల్వ విలువ ఇవన్నీ బంగారాన్ని సంపద రక్షణలో అనివార్య భాగంగా నిలుపుతున్నాయి. సంప్రదాయ బంగారంతో పాటు ఆధునిక పెట్టుబడి సాధనాలను కూడా వినియోగించుకుంటే, పెట్టుబడిదారులు లాభాలను పొందుతూనే ఆర్థిక ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కొగలరు. -
బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్పై భారీ దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన సంఘటన (US attack on Venezuela) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ ఆస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.బంగారం, వెండి ధరలపై ప్రభావంభౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతారు. ఈ దాడి కారణంగా అనిశ్చితి పెరిగి, సేఫ్ హెవెన్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.ప్రస్తుత ధరలు (జనవరి 4 నాటికి భారత మార్కెట్లో) 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.1,35,800 నుంచి రూ.1,37,000 వరకు (MCX ఫ్యూచర్స్ ప్రకారం) ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,24,500. ఇక వెండి కిలోకు సుమారు రూ.2,40,000 నుంచి రూ.2,46,000 వరకు ఉంది.మరింత పెరిగే అవకాశంనిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు 4,380 నుంచి 4,500 డాలర్లకు చేరవచ్చు. భారత్లో 10 గ్రాముల ధర రూ.1,40,000 స్థాయిని తాకే అవకాశం ఉంది.వెండి ధరలు మరింత గణనీయంగా పెరిగి, అంతర్జాతీయంగా ఔన్స్కు 75-78 డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది సప్లై చైన్ డిస్టర్బెన్స్ (వెనెజువెలా ప్రాంత షిప్పింగ్ రూట్లు ప్రభావితం) కారణంగా కూడా జరుగవచ్చు. అయితే, ఈ పెరుగుదల తాత్కాలికమే కావచ్చు. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు స్థిరపడవచ్చు లేదా కొద్దిగా పడిపోవచ్చు. 2026లో మొత్తంగా బంగారం ధరలు ఔన్స్కు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఉద్యోగం కంటే.. అదే అవసరం: కియోసాకి సలహా..
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ''ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఒకప్పుడు బాగా చదివితే.. మంచి ఉద్యోగం వచ్చేది.. జీవితాంతం భద్రత ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నా.. ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలియదు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తులకైనా.. ఊహకందని విధంగా లేఆఫ్ నోటీసులు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.2025లో కంపెనీలు తొలగించిన ఉద్యోగులు➤యూపీఎస్: 48,000 ఉద్యోగాలు➤అమెజాన్: 30,000 ఉద్యోగాలు➤ఇంటెల్: 20,000 ఉద్యోగాలు➤వెరిజోన్: 15,000 ఉద్యోగాలు➤మైక్రోసాఫ్ట్: 6,000 ఉద్యోగాలు➤సేల్స్ఫోర్స్: 4,000 ఉద్యోగాలు➤జీఎం: 3,420 ఉద్యోగాలు➤ఐబీఎం: 2,700 ఉద్యోగాలు➤బోయింగ్: 2,500 ఉద్యోగాలు➤వాల్మార్ట్: 1,500 ఉద్యోగాలుఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో చాలావరకు హైటెక్ కంపెనీలే ఉన్నాయి. ఇంకెక్కడ ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగం కంటే.. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి. డబ్బు ఆదా చేయవద్దు. దీనికి బదులుగా బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం వంటిని ఆదా చేయడి. అవే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని కియోసాకి పేర్కొన్నారు.ఇక్కడ కియోసాకి భావన ఏమిటంటే.. ఇంతపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా మీకు ఉద్యోగ భద్రత కల్పించదు. కాబట్టి ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పనిచేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోండి. “డబ్బు సేవ్ చేయకండి” అని ఎందుకు అంటున్నారంటే.. డబ్బును బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గిపోతుందని (ద్రవ్యోల్బణం వల్ల) కియోసాకి అభిప్రాయం. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువులలో పెట్టుబడిగా పెట్టాలి.ఇదీ చదవండి: అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అనే విషయానికి వస్తే.. దీని అర్థం చదువు అవసరం లేదు అని కాదు. ధనవంతులు అవ్వడానికి కేవలం చదువే సరిపోతుంది అన్న ఆలోచనకు సంబంధించింది. అంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం. అప్పుడే సంపన్నులవుతారు.WHY GOING TO SCHOOL for job security is an obsolete idea:LAY OFFS 20251: UPS 48,000 jobs2: AMAZON 30,000 jobs3: INTEL 20,000 jobs4: VERIZON 15,000 jobs5: MICROSOFT 6,000 jobs6: SALES FORCE: 4,000 jobs7: GM: 3,420 jobs8: IBM: 2,700 jobs9: BOEING…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026 -
బంగారం లాంటి వారం! ఏడు రోజుల్లో ఎంత తేడా!!
పసిడి, వెండి ప్రియులకు గత వారం బాగా కలిసొచ్చింది. 2025 డిసెంబర్ చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి 4 వరకు గడిచిన ఏడు రోజుల్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి.బంగారం ధరలు ఎంత తగ్గాయంటేగత డిసెంబర్ 28న రూ.1,42,420 ఉన్న 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములకు) ధర.. ఈ జనవరి 4 నాటికి రూ.1,35,820కు పడిపోయింది. అంటే వారం రోజుల్లో 6,600 తగ్గింది.అలాగే 22 క్యారెట్ బంగారం (పది గ్రాములకు) డిసెంబర్ 28న రూ.1,30,550 ఉన్న ధర, జనవరి 4 నాటికి రూ.1,24,500కు వచ్చింది. ఇక్కడ కూడా వారంలో 6,050 తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల మధ్యలో కొన్ని రోజులు ధరలు కొద్దిగా పెరిగినా, మొత్తంగా గత వారం చివరి నుంచి భారీ క్షీణతే కనిపించింది.వెండి ధరల్లో క్షీణతవెండి ధరలు కూడా ఈ వారంలో గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్లో ఒక కిలో వెండి ధర డిసెంబర్ 28న రూ.2,85,000 ఉండగా, జనవరి 4 నాటికి రూ.2,57,000కు తగ్గింది. అంటే కేజీకి రూ.28,000 తగ్గింది. మధ్యలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మొత్తంమీద వారంలో భారీ పతనమే నమోదైంది.ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణాలు2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయులకు చేరుకున్న నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో భారీ కరెక్షన్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు ఇవే..రికార్డు ధరల నుంచి ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడంతో భారీ అమ్మకాలు జరిగాయి.అమెరికాలోని కమోడిటీ ఎక్స్చేంజ్ (CME) సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై మార్జిన్ అవసరాలను పెంచడంతో చిన్న ట్రేడర్లు పొజిషన్లు మూసివేయడం లేదా లిక్విడేషన్ జరగడం.డిసెంబర్ చివరి రోజుల్లో మార్కెట్ లిక్విడిటీ తక్కువగా ఉండటంతో ధరలు మరింత అస్థిరంగా మారాయి.ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఇన్ఫ్లేషన్ కూలింగ్ సిగ్నల్స్ వంటివి కూడా ప్రభావం చూపాయి.ఈ తగ్గుదల పసిడి ప్రియులకు, ముఖ్యంగా వివాహాలు, పండుగల సీజన్లో కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఊరట కలిగించింది. అయితే మార్కెట్ నిపుణులు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోళ్లు చేసేవారు మార్కెట్ను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బంగారం రూ.2 లక్షలు.. వెండి రూ.3 లక్షలు?
గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ ఈ విలువైన లోహాలపై పడింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడులుగా భావించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో 2026 నాటికి బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.2 లక్షలకు, వెండి కిలో ధర రూ.3 లక్షలకు చేరుతాయా? అనే ప్రశ్న మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇప్పటికే రికార్డు స్థాయులకు దగ్గరగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1.35 లక్షల నుంచి రూ.1.40 లక్షల మధ్య ట్రేడవుతోంది. అదే విధంగా వెండి ధర కిలోకు సుమారు రూ.2.3 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంది. ఈ ధరలు గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు భవిష్యత్ ధరలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం 2026 వరకు బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొందరు ఊహిస్తున్నట్లుగా అత్యధిక స్థాయిలైన రూ.2 లక్షలు, రూ.3 లక్షలను తాకడం మాత్రం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా కొనసాగితే 2026 చివరి నాటికి బంగారం 10 గ్రాముల ధర రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా వెండి ధర కిలోకు రూ.2.3 లక్షల నుంచి రూ.2.6 లక్షల పరిధిలోనే స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.బంగారం, వెండి ధరలు పెరగడానికి పలు అంతర్జాతీయ కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న అనిశ్చితి, కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటం, అమెరికన్ డాలర్ బలహీనపడే సూచనలు కనిపించడం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయి.మరోవైపు వెండికి సంబంధించిన డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల అవసరాల కోసం వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ కారణాల వల్ల వెండి ధరలు బలంగా నిలబడుతున్నాయి. మొత్తంగా చూస్తే బంగారం, వెండి భవిష్యత్తులో పెట్టుబడిదారులకు స్థిరమైన లాభాలు అందించే అవకాశాలు ఉన్నప్పటికీ, అతిగా అంచనాలు వేసుకోవడం కంటే మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
న్యూ ఇయర్లో మొదటిసారి తగ్గిన గోల్డ్ రేటు: కొత్త ధరలు ఇలా..
వరుసగా రెండు రోజులు ధరలు తగ్గిన తరువాత.. బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోచు చేశాయి. వెండి రేటు కూడా అదే బాటలో పయనించింది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు నూతన సంవత్సరంలో మొదటిసారి తగ్గాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఎల్ఐసీకి రూ. 11, 500 కోట్లు నష్టం, ఎందుకో తెలుసా?
సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకం రాష్ట్ర బీమా సంస్థలభారీ సెగ తగిలింది. సిగరెట్లపై ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం భారీగా పెంచడంతో గత రెండు రోజుల్లో ఐటీసీ షేర్లు 14 శాతం పడిపోయాయి. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)భారీగా నష్టపోయింది.ఐటీసీ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా ఎల్ఐసీ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థల రూ.13,740 కోట్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ఒక్క ఎల్ఐసీ రూ.11,468 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తుంది. డిసెంబర్ 31 ముగింపు స్థాయిలో రూ.80,028 కోట్ల నుండి రికార్డు స్థాయిలో టోటల్వాల్యూలో రూ.68,560 కోట్లకు చేరింది. అలాగే ఐటీసీ అమ్మకం కారణంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసీ) కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.1,254 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రూ.1,018 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.2026 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఐటీసీ వాటాదారుల సంఖ్యపై డేటా ప్రకారం, కంపెనీలో మొత్తం 100 శాతం వాటాను పబ్లిక్ వాటాదారులు కలిగి ఉన్నాయి. ఐటీసీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 15.86 శాతం వాటాను కలిగి ఉండగా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసీ) 1.73 శాతం వాటాను, ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇదీ చదవండి: దుబాయ్లో గ్రాండ్గా తల్లి బర్త్డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్జనవరి 2న ఐటీసీ షేర్లు 5 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయి రూ.345.25కి చేరాయి. 2026లో కేవలం రెండు ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ 14 శాతానికి పైగా కుప్పకూలాయి. ఈ భారీ అమ్మకాల వల్ల కేవలం రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి రూ.72,000 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఇది దాదాపు రూ.4,38,639 కోట్ల వద్ద ఉంది. జనవరి 2న 4 శాతం నష్టంతో రూ.350.10 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 13 శాతానికి పైగా పడిపోయింది. గత ఆరు నెలల్లో 15 శాతానికి పైగా నష్టపోయింది.(ప్రియుడిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్పై దాడి)అయితే LIC షేర్లు ముగింపులో దాదాపు 1 శాతం పెరిగి రూ.861 వద్ద , జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు సెషన్లో రూ.380 వద్ద స్వల్ప లాభాలతో ముగిశాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573.41 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో 85,762.01 వద్ద, నిఫ్టీ 182.00 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 26,328.55 వద్ద నిలిచాయి.రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్, బీపీఎల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్, కృతి న్యూట్రియంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, క్యుపిడ్, వివిమెడ్ ల్యాబ్స్, కిరి ఇండస్ట్రీస్, ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు: రెండో రోజూ..
జనవరి 1న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు (జనవరి 2) అమాంతం దూసుకెళ్లాయి. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా 1140 రూపాయలు పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. వెండి రేటు కూడా అదే బాటలో అడుగులు వేస్తూ రూ. 4000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 2.60 లక్షలకు చేరింది.ఈ కథనంలో బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 333.44 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 85,522.04 వద్ద, నిఫ్టీ 105.60 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 26,252.15 వద్ద కొనసాగుతున్నాయి.స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్, సింటర్కామ్ ఇండియా, కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, లాసా సూపర్జెనరిక్స్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వివిమెడ్ ల్యాబ్స్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఒసియా హైపర్ రిటైల్ లిమిటెడ్, నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, కిరి ఇండస్ట్రీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బిలియన్ల బిడ్ వార్
సాధారణంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్బుక్ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్కు తెరతీస్తూ గత వారం మిడ్టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ఎన్కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
న్యూ ఇయర్ వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..
వరుసగా మూడు రోజులు తగ్గిన తరువాత.. బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. నేడు (2026 జనవరి 1) గరిష్టంగా హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో 170 రూపాయలు పెరిగింది. చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల రేటు రూ. 400 తగ్గింది. వెండి రేటు మాత్రం రూ. 1000 తగ్గింది. దీంతో దేశంలోని గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉదయం కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 209.55 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 85,430.15 వద్ద, నిఫ్టీ 63.95 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 26,193.55 వద్ద కొనసాగుతున్నాయి.కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పనామా పెట్రోకెమ్, లాసా సూపర్జెనరిక్స్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, టెంబో గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, వివిమెడ్ ల్యాబ్స్, ఐటీసీ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఐపీవోకు ఓయో
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ సంస్థ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ప్రైమరీ మార్కెట్లో ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్కు అనుగుణంగా ఓయో బ్రాండ్ కంపెనీ సైతం గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్ సమరి్పంచింది. ఐపీవో ద్వారా రూ. 6,650 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 7–8(సుమారు రూ. 72,000 కోట్లు) బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2025 డిసెంబర్ 20న నిర్వహించిన అసాధారణ సమావేశం(ఈజీఎం)లో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారుల నుంచి అనుమతి పొందిన విషయం విదితమే. కంపెనీ ఇంతక్రితం 2021లో తొలుత రూ. 8,430 కోట్ల సమీకరణ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. తదుపరి 2023లో తాజా ఫైనాన్షియల్, నిర్వహణ సంబంధ సమాచారంతో ఫైలింగ్ చేసినప్పటికీ అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవో యోచనను విరమించుకుంది. 2012లో రితేష్ అగర్వాల్ ఏర్పాటు చేసిన కంపెనీలో పీఈ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. -
2026లో స్టాక్ మార్కెట్ హాలిడేస్: ఫుల్ లిస్ట్ ఇదే..
2025 డిసెంబర్ 31న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక రేపటి నుంచి (2026 జనవరి 1) కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వచ్చే సంవత్సరం మార్కెట్ సెలవుల జాబితాను విడుదల చేసింది.➤26 జనవరి (సోమవారం): గణతంత్ర దినోత్సవం➤3 మార్చి (మంగళవారం): హోలీ➤26 మార్చి (గురువారం): రామనవమి➤31 మార్చి (మంగళవారం): మహావీర్ జయంతి➤3 ఏప్రిల్ (శుక్రవారం): గుడ్ ఫ్రైడే➤14 ఏప్రిల్ (మంగళవారం): అంబేద్కర్ జయంతి➤1 మే (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం➤28 మే (గురువారం): బక్రీద్➤26 జూన్ (శుక్రవారం): మొహర్రం➤14 సెప్టెంబర్ (సోమవారం): గణేష్ చతుర్థి➤2 అక్టోబర్ (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి➤20 అక్టోబర్ (మంగళవారం): దసరా➤10 నవంబర్ (మంగళవారం): దీపావళి-బలిప్రతిపాద➤24 నవంబర్ (మంగళవారం): గురునానక్ జయంతి➤25 డిసెంబర్ (శుక్రవారం): క్రిస్మస్2026 NSE సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ 15 రోజులు మూసివేయబడుతుంది. ఇవి కాకుండా శని, ఆదివారాలు మార్కెట్ సెలవు.శని & ఆదివారాల్లో వచ్చే పండుగ సెలవులు➤15 ఫిబ్రవరి (ఆదివారం): మహాశివరాత్రి➤21 మార్చి (శనివారం): రంజాన్➤15 ఆగస్టు (శనివారం): స్వాతంత్య్ర దినోత్సవం➤8 నవంబర్ (ఆదివారం): దీపావళి -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544.66 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 85,219.74 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 26,136.35 వద్ద నిలిచింది.కేఎస్ఆర్ ఫుట్వేర్ లిమిటెడ్, ఆస్పిన్వాల్ అండ్ కంపెనీ, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్, కిరి ఇండస్ట్రీస్, ఓరియంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
దిగొచ్చిన కనకం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ 26,000 మార్కుపైకి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 69 పాయింట్లు పెరిగి 26,009 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు పుంజుకొని 84,877 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 31-12-2025(time: 9:23 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెండి మెరుపులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి ధరలు మంగళవారం సరికొత్త రికార్డు స్థాయిని తాకాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు రూ. 1,000 పెరిగి రూ. 2.41 లక్షలకు చేరింది. అయితే బంగారం ధర వరుసగా రెండో రోజున క్షీణించింది. 99.9%స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 2,800 తగ్గి రూ. 1,39,000కు పరిమితమైంది. ఎంసీఎక్స్ లో మార్చి వెండి కాంట్రాక్టు రూ. 9,590 పెరిగి రూ. 2,34,019 పలికింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో సిల్వర్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 3.72 డాలర్లు పెరిగి 75.85 డాలర్లకు చేరింది. బంగారం సైతం ఔన్సుకి 69.61 డాలర్లు పెరిగి 4,401.59 డాలర్లు పలికింది. -
'బంగారం'లాంటి ఛాన్స్.. పసిడి ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వరుస పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 6000తగ్గింది. దీంతో పసిడి ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.6220 తగ్గి, రూ. 1,36,200 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 5700 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ.1,24,850 వద్దకు చేరింది.ఢిల్లీ నగరంలో ధరలు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా పెరిగినప్పటికీ.. రేట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,36,350 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ. 1,25,000 వద్ద ఉంది.చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రెండు రోజుల్లో 5450 రూపాయలు తగ్గడం వల్ల.. 10గ్రాముల ధర రూ. 137460 వద్ద ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 5000 తగ్గింది. కాబట్టి రేటు రూ. 1,26,000 వద్ద నిలిచింది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం.. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలబాట పట్టాయి. సెన్సెక్స్ 103.16 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 84,798.70 వద్ద, నిఫ్టీ 27.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,969.85 వద్ద నిలిచాయి.ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, ఓరియంట్ టెక్నాలజీస్, ఓరియంట్ సెరాటెక్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పావ్నా ఇండస్ట్రీస్, మోదీ రబ్బర్ లిమిటెడ్, ప్రకాష్ స్టీలేజ్, నందని క్రియేషన్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు నష్టంతో 25,895 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 పాయింట్లు తగ్గి 84,549 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.04బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 61.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.11 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.35 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.5 శాతం తగ్గింది.Today Nifty position 30-12-2025(time: 9:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మెటల్స్.. క్రాష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండటం, ఎగుమతులపై చైనా ఆంక్షలు తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి, రాగి తదితర కమోడిటీల ధరలు సోమవారం కుదేలయ్యాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు కొనసాగిన వెండి ర్యాలీకి బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, గరిష్ట స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్) ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్టు ఒక దశలో సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,26,275 (కిలోకి) వద్ద ట్రేడయ్యింది. సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సిల్వర్, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టం రూ. 2,54,174ని తాకినప్పటికీ రూ. 2,25,500కి కూడా క్షీణించింది. ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు రూ. 28,674 మేర పతనమైంది. గత వారంలో సిల్వర్ ఏకంగా రూ. 31,348 (15.04 శాతం) ఎగిసిన సంగతి తెలిసిందే. పసిడి 3%, రాగి 13 శాతం డౌన్ .. అటు పసిడిలో కూడా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరి కాంట్రాక్టు పది గ్రాముల బంగారం ధర ఒక దశలో రూ. 4,946 మేర (3.54 శాతం) క్షీణించి రూ. 1,34,927కి తగ్గింది. ఇంట్రాడేలో రూ. 1,40,444 గరిష్ట స్థాయిని చూసింది. అంతక్రితం సెషన్లోనే (శుక్రవారం) పుత్తడి ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,40,465ని తాకిన సంగతి తెలిసిందే. ఇక, రాగి విషయానికొస్తే, జనవరి కాంట్రాక్టు 13 శాతం క్షీణించి రూ. 1,211.05 (కిలోకి) పడిపోయింది. ఇంట్రాడేలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 1,392.95ని తాకింది. రికార్డ్ స్థాయి ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి, పసిడి రేట్లు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. భారీగా కొనుగోళ్ల వల్ల ఈ రెండూ ప్రస్తుతం ఓవర్బాట్ స్థితిలో ఉండటమనేది అప్రమత్తత వహించాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తదుపరి ర్యాలీకి ముందు కొంత కరెక్షన్ మంచిదని చెప్పారు. అటు అంతర్జాతీయంగా కామెక్స్లో 2026 మార్చి నెల వెండి కాంట్రాక్టు ఔన్సుకి (31.1 గ్రాములు) 8 శాతం పైగా నష్టపోయి ఒక దశలో 70.56 డాలర్లకు తగ్గింది. ఇంట్రాడేలో 82.61 డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది. అటు పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు అయిదు శాతం పైగా క్షీణించి ఒక దశలో 4,323.20 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇంట్రాడేలో నమోదైన 4,580.70 డాలర్ల స్థాయితో పోలిస్తే 257.5 డాలర్ల మేర పతనమైంది. తర్వాత కొంత కోలుకుని 4,344.50 వద్ద ట్రేడయ్యింది. ఫ్యూచర్స్ రేట్ల ప్రభావం మంగళవారం దేశీయంగా స్పాట్ మార్కెట్లో కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కారణాలు ఇవి.. వడ్డీ రేట్ల కోతలు, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా కమోడిటీల్లో ర్యాలీ మొదలైందని, ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడుతున్న దాఖలాలు కనిపిస్తుండటంతో లాభాల స్వీకరణ జరుగుతోందని భావించవచ్చని జేఎం ఫైనాన్షియల్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఉద్దేశించిన శాంతి చర్చలు తుది దశకు చేరాయన్న సంకేతాలు కూడా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావం కలిగిస్తున్నాయని యూబీఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సీఎంఈ, కామెక్స్లాంటి ప్రధాన డెరివేటివ్స్ ఎక్సే్చంజీలను నిర్వహించే సీఎంఈ గ్రూప్.. వెండి డెరివేటివ్స్ కాంట్రాక్టులపై మార్జిన్లను 20,000 డాలర్ల నుంచి 25,000 డాలర్లకు పెంచేయడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగి ఉంటారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పాట్లో వెండి అప్.. ఫ్యూచర్స్ మార్కెట్లో పతనమైనప్పటికీ.. సోమవారం స్పాట్ మార్కెట్లో వెండి రేటు మరో కొత్త రికార్డును తాకింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ట్రేడర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలోకి రూ.3,650 పెరిగి రూ. 2,40,000 స్థాయిని తాకింది. మరో వైపు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి రేటు పది గ్రాములకు రూ.500 క్షీణించి రూ. 1,41,800 వద్ద క్లోజయ్యింది. -
రూ.3170 తగ్గిన గోల్డ్ రేటు!: గంటల్లో మారిపోయిన ధరలు
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 29న గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3170 తగ్గి.. పసిడి ప్రియుల మదిలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 650 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2900 తగ్గింది. అంటే గంటల వ్యవధిలోనే 650 రూపాయలు కాకుండా.. అదనంగా మరో 2,250 రూపాయలు (మొత్తం 2,900 రూపాయలు తగ్గింది) తగ్గింది.24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా మరింత తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,39,250 వద్దకు చేరింది. అంతకు ముందు రోజు రేటు రూ. 1,42,420 వద్ద ఉండేది. దీనిబట్టి చూస్తే ఈ రోజు రూ. 3,170 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3170 రూపాయలు తగ్గి.. రూ. 1,39,400 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 2950 తగ్గి, రూ. 1,27,800 వద్ద నిలిచింది.వెండి ధరలువెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది. -
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారీగా దిగి వచ్చింది.వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలురష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. అంతే కాకుండా శాంతి ఒప్పందానికి అటు పుతిన్ కూడా సుముఖత చూపిస్తున్నారని ట్రంప్ పేర్కొనడంతో, యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇది వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.సుమారు రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ వెండి ధరలు.. ఏడాది పూర్తి కాకముందే 181 శాతం పెరిగింది. ధర అమాంతం పెరుగుతున్న సమయంలో కొందరు వెండిని కొనడానికి ఆలోచించారు. ఇది కూడా సిల్వర్ రేటు తగ్గడానికి ఒక కారణం.వెండి ధరలు ఇంకా తగ్గుతాయా?వెండికి ప్రస్తుతం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సిల్వర్ రేటు తప్పకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 345.91 పాయింట్లు, లేదా 0.41 శాతం నష్టంతో 84,695.54 వద్ద, నిఫ్టీ 100.20 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 25,942.10 వద్ద నిలిచాయి.ప్రకాష్ స్టీలేజ్, రాజనందిని మెటల్, కంట్రీ కాండోస్ లిమిటెడ్, ఓరియంట్ బెల్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోడీ రబ్బరు, బ్రూక్స్ లాబొరేటరీస్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కొత్త మార్క్కు సిల్వర్!: కియోసాకి ట్వీట్
వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.SILVER BREAKS $ 80.00$200 NEXt ?— Robert Kiyosaki (@theRealKiyosaki) December 28, 2025భారతదేశంలో వెండి రేటుహైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.🚨🇨🇳 CHINA'S SILVER EXPORT RESTRICTIONS COULD SHAKE GLOBAL INDUSTRYStarting January 1, 2026, China will require government licenses for all silver exports. The timing couldn't be worse.Silver prices have nearly doubled since May, surging from around $38 to over $74 per… https://t.co/foCggFkNpm pic.twitter.com/arZuhvKJhX— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025 -
మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం అనేది ప్రస్తుతం ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందుతున్న అంశం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే తక్కువ ధరకు ఈ కంపెనీల షేర్లు కొని, ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత అధిక లాభాలు సంపాదించవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అయితే, మెరిసేదంతా బంగారం కాదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల సెబీ సైతం అన్రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం అత్యవసరం.‘గ్రే మార్కెట్’ ఉచ్చులో పడకండి!అన్లిస్టెడ్ షేర్లు సాధారణంగా అధికారిక స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లభించవు. వీటిని ‘గ్రే మార్కెట్’ లేదా కొన్ని ప్రైవేట్ యాప్స్ ద్వారా విక్రయిస్తుంటారు. అయితే, వీటిలో ధరను పారదర్శకంగా నిర్ణయించరనే వాదనలున్నాయి. ఒక యాప్లో ఒక ధర ఉంటే, మరో చోట మరో ధర ఉండే అవకాశం ఉంది. సెబీ ఇప్పటికే ఇలాంటి అనధికారిక ప్లాట్ఫామ్ల పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే అన్లిస్టెడ్ కంపెనీల్లో ఎంత లాభం ఉందో అంతే రిస్క్ కూడా ఉందని గమనించాలి.అన్లిస్టెడ్ కంపెనీలు అంటే ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE)లో నమోదు కాని కంపెనీలను అన్లిస్టెడ్ కంపెనీలు అంటారు. ఇవి సాధారణంగా స్టార్టప్లు కావచ్చు లేదా పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న పెద్ద కంపెనీలు కావచ్చు. వీటి షేర్లను ‘ప్రీ-ఐపీఓ (Pre-IPO) షేర్లు’ అని కూడా అంటారు.ఎలా పెట్టుబడి పెడుతారంటే..అన్లిస్టెడ్ మార్కెట్లో షేర్లు కొనడానికి నేరుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉండవు. దీనికోసం కొన్ని మార్గాలను అనుసరిస్తారు. ప్రస్తుతం అన్లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ కోసం Precise, UnlistedZone, Altius Investech.. వంటి చాలా డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది స్టాక్ బ్రోకర్లు పర్సనలైజ్డ్ సర్వీసుల ద్వారా అన్లిస్టెడ్ షేర్లను విక్రయిస్తుంటారు. ఇంకో మార్గం ఏమిటంటే.. కంపెనీ ఉద్యోగులు తమకు వచ్చిన షేర్లను బయటి వ్యక్తులకు విక్రయించినప్పుడు వాటిని కొనుగోలు చేయవచ్చు.ఇన్వెస్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలులిస్టెడ్ షేర్లను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. కానీ అన్లిస్టెడ్ షేర్లకు కొనుగోలుదారులు దొరకడం కష్టం. మీరు అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు అవి అమ్ముడుపోకపోవచ్చు.లిస్టెడ్ కంపెనీల వలె ఇవి ప్రతి త్రైమాసిక ఫలితాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కాబట్టి కంపెనీ ఫైనాన్షియల్ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత, అంతకుముందు కొన్న అన్లిస్టెడ్ షేర్లపై 6 నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే లిస్ట్ అయిన వెంటనే మీరు వాటిని అమ్మలేరు.ఈ షేర్ల ధర డిమాండ్, సప్లై ఆధారంగా మారుతుంటుంది. అధికారిక ధర అంటూ ఏదీ ఉండదు కాబట్టి ఇతర ప్లాట్ఫామ్లతో ధరను సరిపోల్చుకోవాలి.లిస్టింగ్ అయ్యే విధానంఅన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అవ్వాలంటే సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాలి. కంపెనీ ముందుగా ఐపీఓ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను నియమించుకుంటుంది. కంపెనీ తన పూర్తి వివరాలతో కూడిన డీఆర్హెచ్పీను సెబీకి సమర్పిస్తుంది. సెబీ ఈ నివేదికను పరిశీలించి అన్నీ బాగున్నాయని భావిస్తే అనుమతి ఇస్తుంది. కంపెనీ తన షేర్ ధరను నిర్ణయించి పబ్లిక్ ఇష్యూ తేదీలను ప్రకటిస్తుంది. ఐపీఓ సక్సెస్ అయ్యాక షేర్లు ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్కు అందుబాటులోకి వస్తాయి. దాంతో అన్లిస్టెడ్గా ఉన్న షేర్లు లిస్టెడ్ కేటగిరీలోకి మారతాయి.ఇదీ చదవండి: ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం -
బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26 వేల మార్కు వద్దే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు లాభంతో 26,056 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 17 పాయింట్లు పెరిగి 85,061 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 29-12-2025(time: 9:24)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పోర్ట్ఫోలియోకి దన్నుగా హైబ్రిడ్ ఫండ్స్
అంతర్జాతీయంగా వృద్ధి తీరుతెన్నులు, వడ్డీ రేట్ల అంచనాలు, లిక్విడిటీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి షాక్లనైనా తట్టుకుంటూ, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా పెట్టుబడుల పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్కం సాధనాలను ఒకే దాంట్లో మేళవించి అందించే హైబ్రిడ్ ఫండ్స్, మీ పోర్ట్ఫోలియోకి దన్నుగా నిలబడగలవు. వీటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మార్కెట్లో ఎలాంటి పరిస్థితులెదురైనా దీర్ఘకాలిక ప్రణాళిక దెబ్బతినకుండా, ఇవి మీ ఆర్థిక ప్రణాళికకు వెన్నెముకగా నిలుస్తాయి.శక్తివంతమైన ఫీచర్లు..ఈ హైబ్రిడ్ ఫండ్స్లో పలు శక్తివంతమైన ఫీచర్లు ఉంటాయి. మొదటిది పరిశీలిస్తే, ఇందులోని ఈక్విటీ భాగం దీర్ఘకాలికంగా అధిక వృద్ధి, ద్రవ్యోల్బణానికి మించి రాబడులు అందించగలుగుతుంది. అదే సమయంలో డెట్ భాగమనేది పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని, రాబడిని అందిస్తూనే పతనాల వేళ ఆదుకుంటుంది. ఇక రెండో అంశమేమిటంటే, ఇది ఎమోషనల్ ‘షాక్ అబ్జర్బర్’లాగా కూడా పని చేస్తుంది. ఫిక్సిడ్ ఇన్కం భాగమనేది మార్కెట్ భారీగా ఎగిసినప్పుడు ఉన్నప్పుడు ఈక్విటీల్లో అతిగా ఇన్వెస్ట్ చేయాలన్న అత్యుత్సాహాన్ని కాస్త నెమ్మదింపచేస్తుంది. మార్కెట్లు కరెక్షన్కి లోనైనప్పుడు పోర్ట్ఫోలియో మరీ పతనమైపోకుండా కాపాడుతుంది. పెట్టుబడులను కొనసాగించే శక్తినిస్తుంది. మూడో విషయం చూస్తే.. నిర్వహణపరంగా ఇది చాలా సరళంగా, క్రమశిక్షణను పెంపొందించే విధంగా ఉంటుంది. వివిధ స్కీములవ్యాప్తంగా ఈక్విటీ, డెట్, క్యాష్ పొజిషన్లను చూసుకుంటూ ఉండాలంటే బోలెడంత సమయం, రీబ్యాలెన్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చాలా మటుకు ఇన్వెస్టర్లు తరచుగా పోర్ట్ఫోలియోను పరిస్థితికి తగ్గట్లు సత్వరం సరిచేసుకోలేరు. తీరా చేసే సరికి సమయం మించిపోతుంది. హైబ్రిడ్ ఫండ్స్ అలా జరగకుండా, పరిస్థితికి అనుగుణంగా పెట్టుబడులను వివిధ సాధనాలకు తగిన రీతిలో కేటాయించి రీబ్యాలెన్స్ చేస్తాయి. తద్వారా ప్రాక్టికల్గా, సైకలాజికల్గా మీపై ఒత్తిడి తగ్గించే విధంగా ఉంటాయి. ఇవి చాలా సరళంగా ఉండటం వల్ల తప్పిదాలు, లావాదేవీల వ్యయాలు, ట్యాక్స్ల భారంలాంటివి తక్కువగా ఉంటాయి. రిస్కు సామర్థ్యాలను బట్టి ఎంపిక..ఇన్వెస్టర్లు వివిధ మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా ప్రతి త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను అన్వేíÙంచాల్సిన పని లేకుండా వివిధ రకాల రిస్కు సామర్థ్యాలున్నవారికి అనువైనవిగా హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. వీటిలో అంతర్గతంగా పలు రకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక మోస్తరు రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులతో పాటు స్థిరత్వం కూడా కోరుకునే వారి కోసం మధ్యేమార్గంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. ఒడిదుడుకులను ఎక్కువగా ఇష్టపడని వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఇక కాస్త ఎక్కువ రిస్కు సామర్థ్యాలు కలిగి ఉండి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారి కోసం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. అయితే, దేన్ని ఎంచుకున్నా హైబ్రిడ్ ఫండ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఇవి స్వల్పకాలిక ట్రేడింగ్ సాధనాలు కావు. దీర్ఘకాలికంగా క్రమశిక్షణతో వీటిలో పెట్టుబడులను కొనసాగిస్తేనే సిసలైన ప్రయోజనాలు పొందవచ్చు. స్కీమ్ లక్ష్యం గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫండ్ని బట్టి ఈక్విటీ, డెట్లకు కేటాయింపుల్లో గణనీయంగా వ్యత్యాసాలు ఉంటాయి. ఫండ్ మెథడాలజీని తెలుసుకుంటే మీ రిస్కు సామర్థ్యాలను బట్టి ఎంచుకునేందుకు వీలుంటుంది. స్వల్పకాలికంగా నగదు అవసరాల కోసం హైబ్రిడ్ ఫండ్స్ను ఉపయోగించుకోవడం తప్పిదమవుతుంది. మన ఆర్థిక లక్ష్యాలకు నిర్దిష్ట గడువు, నిర్దిష్ట నగదు అవసరాలు ఉంటాయి. కాబట్టి, స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాల మేళవింపుగా పోర్ట్ఫోలియో ఉంటే, మనం నిర్దేశించుకున్న లక్ష్యం గడువు నాటికి మార్కెట్లు ఎలా ఉన్నప్పటికీ, నిధులు చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా, హైబ్రిడ్ ఫండ్స్ని పెట్టుబడుల కేటాయింపులకు ఒకానొక మూలస్తంభంగా మార్చుకోవడం ద్వారా ఇన్వెస్టర్లు వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, సంక్షోభాలు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు, తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుందనిగుర్తుంచుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్!ఇదీ చదవండి: మధ్యతరగతి మదుపు.. ప్రశ్నలు.. సమాధానాలు -
గణాంకాలే గేమ్ ఛేంజర్స్
దేశీ స్టాక్ మార్కెట్లకు ఈ వారం దేశ, విదేశీ అంశాలు కీలకంగా నిలవనున్నాయి. నూతన సంవత్సరం తొలి రోజు యూరోపియన్, యూఎస్ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్ల యాక్టివిటీ తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక ఆటుపోట్లకు అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం ఈ వారం భారత్సహా యూఎస్, చైనా ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా నేడు(29న) గత నెల(నవంబర్)కు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్లో ఐఐపీ వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం పుంజుకుంది. 30న ఎన్ఎస్ఈ డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుంది. 31న నవంబర్ చివరికి బడ్జెట్ లోటు వివరాలు వెల్లడికానున్నాయి. కొత్త ఏడాది తొలి రోజు వాహన విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి 2న డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ ఇండెక్స్, విదేశీ మారక నిల్వల స్థితి డేటా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురికావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా.. అంతర్జాతీయంగా చూస్తే డిసెంబర్ నెలకు చైనా తయారీ, తయారీయేతర పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. యూఎస్ తయారీ ఇండెక్స్తోపాటు.. అక్టోబర్ నెలకు వాణిజ్య ముందస్తు అంచనాలు విడుదలకానున్నాయి. ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా సమావేశ వివరాలు(మినిట్స్) 31న వెల్లడికానున్నాయి. చివరి వారానికి నిరుద్యోగ క్లెయిమ్ల గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాల ఎఫెక్ట్ → ఈ కేలండర్ ఏడాది ముగియడానికి 3 రోజులే గడువున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) లావాదేవీలు మందగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. → డిసెంబర్ ఎఫ్అండ్వో కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో కొత్త సిరీస్(2026 జనవరి)కు జరిగే రోలోవర్లకు ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఈ వారం సైతం ఆటుపోట్లు కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. అంచనాలు అందుకున్నప్పటికీ నాలుగు రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు టెక్నికల్ అంశాలు అంచనా వేసినట్లు బ్రేకవుట్ సాధించినప్పటికీ తిరిగి డీలా పడ్డాయి. అయితే చివరికి స్వల్ప లాభాలతో ముగియడం గమనార్హం! వెరసి బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్లు పుంజుకుని 85,041 వద్ద నిలవగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 26,042 వద్ద స్థిరపడింది.బుల్లిష్ ధోరణిలోనే.. రెండు వారాల నష్టాల ధోరణికి అడ్డుకట్టవేస్తూ గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ వారం సైతం హెచ్చుతగ్గుల మధ్య బలాన్ని పుంజుకునేందుకే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,060 పాయింట్లను దాటి 26,236కు ఎగసింది. వెరసి ఈ వారం నిఫ్టీకి 25,920– 25,800 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిల నుంచి పుంజుకునేందుకు వీలుంది. ఇలా జోరందుకుంటే 26,450 పాయింట్లవరకూ బలపడే అవకాశముంది. స్వల్ప కాలంలో 27,000 పాయింట్లస్థాయికి చేరడానికీ వీలుంది. → గత వారం అంచనాలకు అనుగుణంగా సెన్సెక్స్ 85,350 పాయింట్లను దాటి 85,738కు ఎగసింది. వెరసి ఈ వారం 84,600– 84,200 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ కనిపించవచ్చు. ఇక్కడినుంచి బలపడితే.. 85,800, 86,200 పాయింట్ల గరిష్టాలను తాకవచ్చు. ఈ బాటలో సమీప కాలంలో 87,000 పాయింట్ల మైలురాయికి చేరే అవకాశముంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జెప్టో రూ.11వేల కోట్ల ఐపీఓ.. సెబీకి పత్రాలు
క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను కాన్ఫిడెన్షియల్ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించింది. దీని ప్రకారం కంపెనీ సుమారు రూ. 11,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాదిలో కంపెనీ లిస్టయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఐపీవో సజావుగా సాగితే కార్యకలాపాలు ప్రారంభించిన అత్యంత తక్కువ వ్యవధిలోనే లిస్టయిన యువ అంకుర సంస్థగా జెప్టో నిలుస్తుంది.అలాగే పోటీ సంస్థలు జొమాటో, స్విగ్గీ సరసన కూడా చోటు దక్కించుకుంటుంది. 10 నిమిషాల్లో డెలివరీ సర్వీసుల పేరిట ప్రారంభమైన జెప్టో 7 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ఇప్పటివరకు ఇన్వెస్టర్ల నుంచి రూ. 16,000 కోట్లు సమీకరించింది. 2023 ఆగస్టులో 200 మిలియన్ డాలర్ల సమీకరణ ద్వారా యూనికార్న్ (బిలియన్ డాలర్ల కంపెనీ) హోదా దక్కించుకుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్అవుట్స్ అయిన ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా కలిసి దీన్ని నెలకొల్పారు. 2025 సెపె్టంబర్ నాటికి కంపెనీకి 900 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. -
బంగారం ధరలు.. ఒక్క రోజూ తగ్గలేదు!
దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయి. వారంలో ఒక్క రోజూ తగ్గకుండా వరుసగా భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఏడు రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరిగిన తీరు తెన్నుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బంగారం ధరలు24 క్యారెట్ బంగారం తులం (10గ్రాములు) ధర డిసెంబర్ 21న రూ.1,34,180 ఉండగా సరిగ్గా వారం తిరిగేసరికి డిసెంబర్ 28 నాటికి రూ.1,41,220 లకు చేరింది. అంటే వారంలో ఏకంగా రూ.7,040 ఎగిసింది.ఇక 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.. డిసెంబర్ 21న రూ.1,23,000 ఉన్న తులం ధర డిసెంబర్ 28 నాటికి రూ.1,29,450 లకు చేరింది. అంటే వారంలో రూ.6,450 పెరిగింది.వెండి ధరలుగత వారం వెండి ధరల పెరుగుల వేగం బంగారాన్ని మించిపోయింది. డిసెంబర్ 21న రూ.2,26,000 ఉన్న కేజీ వెండి ధర డిసెంబర్ 28 నాటికి రూ.2,74,000లను తాకింది. మొత్తంగా ఏడు రోజుల్లో రూ.48,000 దూసుకెళ్లింది.పెరుగుదలకు కారణాలివే..అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలుసేఫ్‑హేవెన్ డిమాండ్: పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెంచారుఎంసీఎక్స్/కామెక్స్ ధరల ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేశాయి.దేశీయ వినియోగం, కొనుగోలు:భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక కొనుగోలు పెరగడం.ఇది చదివారా? వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా? -
కొత్త ఏడాదిలో.. ఫిన్టెక్ ఐపీవోల జోరు
వచ్చే ఏడాది కూడా పబ్లిక్ ఇష్యూల జోరు కొనసాగనుంది. కొత్త సంవత్సరంలో సుమారు పది దిగ్గజ ఫిన్టెక్ కంపెనీలు సైతం లిస్టింగ్పై కసరత్తు చేస్తున్నాయి. ఫోన్పే, రేజర్పే, పేయూ, అయ్ ఫైనాన్స్, ఇన్క్రెడ్ హోల్డింగ్స్, ఇన్నోవిటీ, పేనియర్బై తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఇన్సూరెన్స్ ప్లాట్ఫాంలు ఎకో, టరి్టల్మింట్, ట్రావెల్ బ్యాంకింగ్ సంస్థ నియోలాంటివి కూడా ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ముసాయిదా ప్రాస్పెక్టస్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచగా, మరికొన్ని సంస్థలు బ్యాంకర్లను నియమించుకునే పనిలో ఉన్నాయి. ఇంకొన్ని తమ లిస్టింగ్ ప్రణాళికలను ప్రకటించాయి. అయ్ ఫైనాన్స్, టరి్టల్మింట్ సంస్థలకు నియంత్రణ సంస్థ అనుమతి కూడా లభించింది. అయ్ ఫైనాన్స్ దాదాపు రూ. 1,450 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 885 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో మరిన్ని షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఇక రుణాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించే ఇన్క్రెడ్ హోల్డింగ్స్ కూడా తమ ఐపీవో పత్రాలను సెబీకి సమరి్పంచింది. వీటి ప్రకారం కంపెనీ దాదాపు రూ. 3,000–4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్పే కూడా ముసాయిదా పత్రాలను నియంత్రణ సంస్థకు సమరి్పంచినట్లు సెపె్టంబర్లో ప్రకటించింది. డీల్ వివరాలను వెల్లడించనప్పటికీ, దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది రాబోయే అతి పెద్ద ఐపీవోల్లో ఇది కూడా ఒకటి కానుంది. దీనితో టైగర్ గ్లోబల్, జనరల్ అట్లాంటిక్, రిబిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్లాంటి ప్రారంభ దశ ఇన్వెస్టర్లు ని్రష్కమించేందుకు అవకాశం లభిస్తుంది. అటు ఇన్నోవిటి, పేయూ, పేనియర్బై, నియో సంస్థల మేనేజ్మెంట్లు కూడా తమ లిస్టింగ్ ప్రణాళికలను ధృవీకరించాయి. అయితే, ఇంకా ముసాయిదా పత్రాలను సమరి్పంచాల్సి ఉంది. ఎకో సంస్థ 2026–27లో లిస్టింగ్ ద్వారా 300–400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,700 కోట్లు – రూ. 3,600 కోట్ల వరకు) సమీకరించే దిశగా బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. స్టార్టప్లలో పెట్టుబడుల వెల్లువ .. గత రెండేళ్లుగా అంకుర సంస్థల్లోకి స్థిరంగా పెట్టుబడులు వస్తున్నాయ. అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంస్థల్లో ఈ–కామర్స్ తర్వాత ఫిన్టెక్ కంపెనీలు రెండో స్థానంలో ఉన్నాయ. పరిశ్రమ డేటా ప్రకారం 2025లో ఫిన్టెక్ కంపెనీలు 120 డీల్స్ ద్వారా 1.87 బిలియన్ డాలర్ల పైగా నిధులను సమీకరించాయి. 2024లో 140 డీల్స్ ద్వారా 1.61 బిలియన్ డాలర్లు సేకరించాయి. వ్యాపారాన్ని విస్తరిస్తూ, నష్టాలను తగ్గించుకుంటూ ఉండటం ద్వారా పలు ఫిన్టెక్ కంపెనీలు క్రమంగా లాభాల బాట పడుతున్నాయి. దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రో, పైన్ ల్యాబ్స్, మొబిక్విక్లాంటి కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. దీంతో మరిన్ని కంపెనీలు కూడా లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇక ఫిన్టెక్లే కాకుండా 2026లో వివిధ విభాగాలకు చెందిన అంకురాలు కూడా పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఫ్లిప్కార్ట్, ఓయో, రెంటోమోజో, బోట్, క్యూర్ఫుడ్స్, జెట్వెర్క్, షిప్రాకెట్, షాడోఫ్యాక్స్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి. -
ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!
2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్ -
బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్
బంగారం, వెండి ధరలు నువ్వా నేనా అని పోటీపడుతున్న సమయంలో.. ప్లాటినం ధర ఆల్టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. ఈ ఏడాది భారతదేశం ఏకంగా 125 శాతం పెరిగింది. దీంతో పదిగ్రాముల ప్లాటినం రేటు సుమారు రూ. 70వేలకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఇందులో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు.ప్లాటినం ధరలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల ప్లాటినం రేటు రూ.4,320 పెరిగి.. రూ. 68,950 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో ఈ లోహానికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్లాటినం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ప్లాటినం రేటు పెరగడానికి కారణాలుడిమాండుకు తగిన సరఫరా లేకపోవడమే. డాలర్ విలువ బలహీనపడటం, కొత్త టెక్నాలజీల్లో ప్లాటినం అవసరం పెరగడంప్రపంచ దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంబంగారం, వెండి ధరలతో పోలిస్తే.. ప్లాటినం రేటు కొంత తక్కువ కావడంఆటోమొబైల్ క్యాటలిటిక్ కన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల్లో కూడా ప్లాటినం వినియోగం ఎక్కువ కావడం -
సిల్వర్ సునామీ.. మళ్లీ వచ్చేశాడు కియోసాకి
వెండి ధర మళ్లీ రికార్డ్ యిలో ఎగిసింది. భారత్లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.అంతకు ముందు ఈ వైట్ మెటల్పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్టైమ్ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.SILVER To Break $80.Happy New Year ….smart silver stackers.Your patience has paid off.Now we get richer.Happy 2026Silver is hotter than gold.— Robert Kiyosaki (@theRealKiyosaki) December 27, 2025 -
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
దేశంలో బంగారం, వెండి ధరలు లావాలా ఎగిశాయి. వరుసగా ఆరో రోజూ ధరలు అంత ఎత్తున ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
స్టాక్ మార్కెట్.. నష్టాల ముగింపు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాలలో ముగిశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి, సెన్సెక్స్ గడువు ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మందగించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 367.25 పాయింట్లు లేదా 0.43 శాతం నష్టపోయి 85,041.45 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 99.80 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 26,042.30 వద్ద స్థిరపడింది.టైటాన్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ బీఎస్ఈలో టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్.ఎన్ఎస్ఈలో టైటాన్, హిండాల్కో, నెస్లే ఇండియా టాప్ విన్నర్లుగా ఉండగా, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు కూడా ప్రతికూలంగానే ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.23 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.08 శాతం నష్టపోయాయి. సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.03 శాతం, ఆటో 0.52 శాతం నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ మెటల్ 0.59 శాతం లాభంతో ముగిసింది. -
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ క్రమంలో రజతం రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని, లేదు సర్దుబాటు ఉంటుందని ఇలా.. మార్కెట్ విశ్లేషకులు తలో అంచనా చెబుతున్నారు. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర గురించి సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ చేస్తున్నారు.వెండి ఔన్సుకు 70 డాలర్లను దాటిపోయిన నేపథ్యంలో ఈ వైట్ మెటల్పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సమాధానమిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్టైమ్ హై అని అనుకుంటే పొరపడినట్టేనని రాసుకొచ్చారు. ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.వెండి ధర 2026లో అనూహ్యంగా 200 డాలర్లను (ఔన్స్కు) దాటిపోతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఇది అతి శయోక్తి కాదని, సాధ్యకావడానికి చాలా కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. కావాలంటే యూట్యూబ్ మొత్తం వెతికి సాధ్యసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.ఒక్క డాలరు కన్నా తక్కువున్నప్పుడే..1965లో వెండి ధర ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువున్నప్పటి నుంచే తాను వెండి కొనడం ప్రారంభించానన్న రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు 70 డాలర్లు దాటిపోయినా సిల్వర్ కొనుగోలును ఆపనన్నారు. ధనవంతులు కావడానికి ఉత్తమ మార్గం ఎవరికి వారు సొంతంగా పరిశీలించుకోవడమేనన్నారు.‘చిన్నగా ప్రారంభించండి.... సంపద ఇక మీ బుర్రలో.. మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో పొరపాట్లు చేసినప్పటికీ, ఊరికే మాటలు చెప్పేవారి కంటే మీరు ధనవంతులు అవుతారు ’ అంటూ తనను అనుసరించేవారికి హితవు పలికారు సిల్వర్ మ్యాస్ట్రో..Silver is over $70 USD an ounce.Q: IS IT TOO LATE TO BUY SILVER?A: It depends.If you think silver is at an all time high then you’re too late.I believe silver is just getting started and I believe $70- $200 silver could be an outside reality in 2026.There are many…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 25, 2025 -
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
దేశంలో బంగారం, వెండి ధరల దూకుడు తగ్గడం లేదు. వరుసగా ఐదో రోజూ ధరలు అమాంతం ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26,000 మార్కు వద్దకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 56 పాయింట్లు నష్టంతో 26,086 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు దిగజారి 85,209 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 26-12-2025(time: 9:50am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లిస్టింగ్కు శాంసంగ్ నో
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టింగ్ యోచన లేదని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎల్రక్టానిక్స్ తాజాగా స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది. వివిధ ప్రొడక్టులలో ఏఐను మరింత వినియోగించనున్నట్లు పేర్కొంది. కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశీ మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకు వీలుగా కన్జూమర్ ఫైనాన్స్ విభాగాన్ని విస్తరించనున్నట్లు తెలియజేసింది. భారత్లో తయారీ కార్యకలాపాలను మరింత లోతుగా విస్తరించే యోచనలో ఉన్నట్లు శాంసంగ్ నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ తెలియజేశారు. దేశీయంగా మొబైల్ ఫోన్ డిస్ప్లేల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(పీఎల్ఐ) దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ తయారీకి నోయిడాలో అతిపెద్ద ప్లాంటును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది కీలక ఎగుమతుల కేంద్రంగా ఆవిర్భవించింది. కాగా.. దేశీయంగా ఐపీవో చేపట్టడంపై స్పందిస్తూ పార్క్ ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలులేవని స్పష్టం చేశారు. అయితే ఇతర దక్షిణ కొరియా దిగ్గజాలు హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇటీవల పబ్లిక్ ఇష్యూతో నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. తద్వారా దేశీ కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు పార్క్ తెలియజేశారు. అవసరమైతే కార్పొరేట్ బాండ్ల జారీ లేదా సంస్థాగత రుణాలు తదితర మార్గాలలో నిధులు సమకూర్చుకోనున్నట్లు వివరించారు. -
2025లో అహో 2026లో ఒహో
ఈ కేలండర్ ఏడాది(2025) దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి ప్రైమరీ మార్కెట్లు లిస్టింగ్లతో సెంచరీ కొట్టాయి. మరోపక్క సెకండరీ మార్కెట్లు సైతం సరికొత్త గరిష్టాలను చేరడం ద్వారా చరిత్ర సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా రిటైలర్లు, దేశీ ఫండ్స్ కనీవినీ ఎరుగని రీతిలో చేపడుతున్న భారీ పెట్టుబడులు తోడ్పాటునిస్తున్నాయి. దీంతో కొత్త ఏడాది(2026)లోనూ ప్రైమరీ మార్కెట్లు సుప్రసిద్ధ కంపెనీల ఐపీవోలతో కదం తొక్కేందుకు సిద్ధపడుతున్నాయి. వివరాలు చూద్దాం.. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 2025 జనవరి–డిసెంబర్ కాలంలో 103 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఇంతక్రితం ఎన్నడూలేని విధంగా రూ. 1.75 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. నిజానికి గతేడాది(2024)లోనూ ప్రైమరీ మార్కెట్లు సందడి చేశాయి. రూ. 27,870 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తదితర ఇష్యూలతో 91 కంపెనీలు రూ. 1,59,784 కోట్లు అందుకున్నాయి. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఈ రికార్డును టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ తదితరాల లిస్టింగ్తో 2025 అధిగమించింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, డిజిటల్ సేవల దిగ్గజం రిలయన్స్ జియోసహా.. ఫ్లిప్కార్ట్, ఫోన్పే, జెప్టో, ఓయో, బోట్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తదితరాలు ఐపీవోకు క్యూ కట్టడం ద్వారా 2026లోనూ ప్రైమరీ మార్కెట్లు దుమ్మురేపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 84 కంపెనీలకు సెబీ సై ఈ ఏడాదిలో మార్కెట్ చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 86,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. మరోపక్క ఇప్పటివరకూ 103 కంపెనీలు రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించి లిస్ట్కావడం ద్వారా సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. ఈ బాటలో 2026 కొత్త ఇష్యూలతో మరింత కళకళలాడనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే 84 కంపెనీల ప్రాస్పెక్టస్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సహకరించనుంది. తద్వారా రూ. 1.14 లక్షల కోట్లు సమకూర్చుకునేందుకు తెరలేవనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుమించి మరో 108 కంపెనీలు సెబీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా రూ. 1.46 లక్షల కోట్ల నిధుల సమీకరణపై కన్నేశాయి. వెరసి 190 కంపెనీలు రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు అందుకోవడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఎదురుచూస్తున్నాయి. కొన్నేళ్లుగా విదేశీ ఇన్వెస్టర్లకు మించి దేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం! దీనికి కార్పొరేట్ పెట్టుబడులు సైతం జత కలుస్తుండటం విశేషమని విశ్లేషకులు తెలియజేశారు. కంపెనీలు విస్తరణ ప్రణాళికలు లేదా వృద్ధి ఆధారిత పెట్టుబడుల ప్రణాళికలు పక్కనపెట్టినప్పుడు ఆదాయ మార్గంగా మ్యూచువల్ ఫండ్ పథకాలలో అధికంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. వెరసి విదేశీ పెట్టుబడులను దేశీ ఇన్వెస్టర్లు తోసిరాజంటున్నట్లు వివరించారు. పెట్టుబడుల విక్రయంఐపీవో ద్వారా పలు దిగ్గజాలు నిధుల సమీకరణ చేపడుతుండటం పెట్టుబడుల విక్రయానికి దారి చూపుతోంది. తొలి దశ ఇన్వెస్టర్లు లేదా ప్రమోటర్లు కొంత వాటా విక్రయించడం ద్వారా నిధుల సమీకరణతోపాటు పెట్టుబడులపై లాభాలను ఆర్జిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2025లో లిస్టయిన దిగ్గజాలను తీసుకుంటే.. ఉమ్మడిగా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీని పక్కనపెడితే ప్రమోటర్లు లేదా ముందస్తు ఇన్వెస్టర్లు రూ. 1.1 లక్షల కోట్లను అందుకున్నారు. టాటా క్యాపిటల్ ఐపీవోలో టాటా మోటార్స్(రూ. 15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(రూ. 12,500 కోట్లు) భారీగా నిధులు సమకూర్చుకున్నాయి. ఇక ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ద్వారా యూకే భాగస్వామ్య సంస్థ రూ. 10,603 కోట్లు సమకూర్చుకుంది. ఈ బాటలో ఎల్జీ ఎల్రక్టానిక్స్(రూ. 11,607 కోట్లు), కేఎస్హెచ్ ఇంటర్నేషనల్(రూ. 290 కోట్లు)తో పాటు 2024లో స్విగ్గీ(రూ. 6,828 కోట్లు) అందుకోవడం ప్రస్తావించదగ్గ అంశం!--సాక్షి బిజినెస్ డిస్క్ -
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది. -
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో తనదైన శైలిలో స్పందించారు.‘వెండి 70 డాలర్లు దాటింది.బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.ఫేక్ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్’ అంటూ పోస్టును ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.‘నష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్ డాలర్ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం. SILVER over $70.GREAT NEWS for gold and silver stackers.BAD NEWS for FAKE MONEY savers.I am concerned $70 silver may signal hyper-inflation in 5 years as the fake $ keeps losing value. Don’t be a loser. Fake $ will continue to lose purchasing power as silver goes to…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 23, 2025 -
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
దేశంలో బంగారం, వెండి ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ ధరలు పైకే ఎగబాకాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) అదే స్థాయిలో పెరిగాయి. వెండి ధరలు వేగాన్ని కాస్త తగ్గించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లిస్టింగ్పై 3 కంపెనీల కన్ను
ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్ ర్యాలీలోనూ ఆటుపోట్లను చవిచూస్తుంటే మరోవైపు ఈ కేలండర్ ఏడాది(2025) అధిక ఇష్యూలు, అత్యధిక నిధుల సమీకరణతో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు తెరతీశాయి. ఈ బాటలో ప్రైమరీ మార్కెట్లు ఏడాది చివరిలోనూ సందడి చేస్తున్నాయి. తాజాగా 3 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ తాజాగా లిస్ట్కాగా.. ఈ వారం గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీసహా.. 4 ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు ప్రైమరీ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇందుకు సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. ఈ జాబితాలో ధారివాల్ బిల్డ్టెక్, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, బీఎల్ఎస్ పాలిమర్స్ చేరాయి. ఈ మూడు కంపెనీలు లిస్టింగ్కు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య ప్రాస్పెక్టస్లు దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఈ సంస్థలన్నీ ఐపీవో ద్వారా కొత్తగా ఈక్విటీ జారీతో నిధుల సమీకరణను చేపట్టనున్నాయి. ఐపీవో తదుపరి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కన్స్ట్రక్షన్ కంపెనీ ధారివాల్ బిల్డ్టెక్ రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 203 కోట్లు నిర్మాణ రంగ పరికరాల కొనుగోలుకి, రూ. 174 కోట్లు ముందస్తు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, పీఎంజీఎస్వై రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ఓవర్బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు నిర్మించే కంపెనీ రైల్వే, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. క్లౌడ్ ఇన్ఫ్రా సేవలు క్లౌడ్, మేనేజ్డ్ సర్వీసుల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 481 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుతోపాటు డేటా సెంటర్ల మౌలికసదుపాయాల ఏర్పాటుకు వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఐఏఏఎస్, ఎస్ఏఏఎస్ ఆధారిత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సర్వీసులు, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందిస్తోంది. కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అవసరాలకుతగిన(కస్టమ్) పాలిమర్ కాంపౌండ్స్ రూపొందించే బీఎల్ఎస్ పాలిమర్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీక రించిన నిధుల్లో రూ. 70 కోట్లు కొన్ని ప్రొడక్టుల తయారీ సౌకర్యాల విస్తరణకు, రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ టెలికం, విద్యుత్, రైల్వే, చమురు–గ్యాస్ తదితర రంగాలకు కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అందిస్తోంది. సెబీకి టన్బో ఇంజినీరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు గ్లోబల్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ ప్రధాన కంపెనీ(ఓఈఎం) టన్బో ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1,80,85,246 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. అయితే కొత్తగా ఈక్విటీ జారీ చేయబోదు. 2003లో ఏర్పాటైన కంపెనీ తొలిదశలో యూఎస్ రక్షణ శాఖ, సర్నాఫ్ కార్పొరేషన్తో కలసి పనిచేసింది. ఆపై 2012లో ప్రస్తుత ప్రమోటర్ల ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధానంగా సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్ సిస్టమ్స్ను రూపొందిస్తోంది. విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మల్టీసెన్సార్ ఇమేజింగ్ టెక్నాలజీలతోకూడిన టాక్టికల్, ప్లాట్ఫామ్ సిస్టమ్స్ తయారు చేస్తోంది. ప్రపంచస్థాయిలో రక్షణ రంగ దళాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. 2025 సెపె్టంబర్30కల్లా దాదాపు రూ. 267 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. గత రెండు నెలల్లోనూ రూ. 72 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది. -
వెండికి ‘బంగారు’ కాలం
ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అసాధారణ మైలురాయిని చేరాయి. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ లోహం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకవైపు విశ్లేషకులు ధరల దిద్దుబాటు(Correction)పై హెచ్చరిస్తున్నప్పటికీ, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాత్రం వెండి భవిష్యత్తుపై అత్యంత ధీమాతో ఉన్నారు.గతంలో వెండి ఎప్పుడూ బంగారం ధరల గమనాన్నే అనుసరిస్తూ ఉండేది. కానీ 2025లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లుగా.. ధరలు తాత్కాలికంగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ వెండి మెరుపు కొనసాగుతుంది. వెండి కథ ఇప్పుడే ప్రారంభమైందని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాదిలో వెండి ధర ఏకంగా 125 శాతం పెరిగింది. బంగారం కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, దాని వృద్ధి 63 శాతం మాత్రమే. అంటే బంగారం కంటే వెండి రెట్టింపు రాబడిని అందించింది. వెండి అటు విలువైన ఆభరణంగానూ, ఇటు కీలకమైన పారిశ్రామిక లోహంగానూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో వెండి పాత్ర ఎంతో కీలకంగా మారింది.సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. డేటా సెంటర్ల విస్తరణ, ఎలక్ట్రికల్ వాహనాల విద్యుదీకరణలో దీని డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యాధునిక రక్షణ పరికరాల్లో వెండి కీలక అంశంగా ఉంది. భారతదేశంలో వెండి ఉత్పత్తిదారుగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ద్వారా ఈ పెరుగుతున్న పారిశ్రామిక అవసరాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరిగాయి. వరుసగా మూడో రోజూ ఎగిసి పసిడి ధరలు హ్యాట్రిక్ కొట్టాయి. వెండి ధరలు రెండు రోజుల్లో పెరిగిన దానికి మించి దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) మోస్తరుగా పెరిగాయి. వెండి ధరలు అయితే రికార్డు స్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. గడిచిన సెషన్తో పోలిస్తే స్వల్ప లాభాలలో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 31 పాయింట్లు లాభంతో 26,208 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 63 పాయింట్లు పెరిగి 85,588 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.15 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది.నాస్డాక్ 0.6 శాతం పుంజుకుంది.Today Nifty position 24-12-2025(time: 9:35)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అయిదు పాయింట్లు పెరిగి 26,177 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 85,343 – 85,705 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 26,119 వద్ద కనిష్టాన్ని, 26,234 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.71%, రియల్టీ 0.21%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.10% నష్టపోయాయి. మరోవైపు కమోడి టీస్ 0.68%, వినిమయ 0.59%, మెటల్ 0.52%, విద్యుత్ 0.40%, ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఇంధన 0.36% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.38%, 0.07% పెరిగాయి. ⇒ తన అనుబంధ సంస్థలు ఏసీసీ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్ కంపెనీల విలీనానికి అంబుజా సిమెంట్స్ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ షేరు 4.40% పెరిగి రూ.171 వద్ద ముగిసింది. ఒక దశలో 10% పెరిగి రూ.180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంబుజా సిమెంట్స్ షేరు 1.25% పెరిగి రూ.547 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.30% లాభపడి రూ.563 వద్ద గరిష్టాన్ని తాకింది. ఏసీసీ షేరు 1.21% నష్టపోయి రూ.1,754 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.50% పతనమై రూ.1,802 కనిష్టాన్ని తాకింది. ⇒ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.384)తో బీఎస్ఈలో 3.50% డిస్కౌంటుతో రూ.370 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% క్షీణించి రూ.350 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 8% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్లు లేదా 0.024 శాతం నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి.ఓమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్, ప్రిజం జాన్సన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ష్రెనిక్ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే! -
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు నష్టంతో 26,144 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 128 పాయింట్లు దిగజారి 85,434 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 23-12-2025(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి @ 1.38 లక్షలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పుత్తడి, వెండి రేట్లు కొత్త రికార్డు స్థాయిలకు దూసుకెళ్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,685 మేర పెరిగింది. రూ. 1,38,200కి ఎగిసింది. అటు వెండి ధర కూడా కిలోకి రూ. 10,400 మేర పెరిగి మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 2,14,500కి చేరింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతుండటం, అక్కడి ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మరింతగా పసిడి, వెండివైపు మళ్లుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇటు పరిశ్రమల నుంచి అటు ఇన్వెస్ట్మెంట్ కోణం నుంచి డిమాండ్ నెలకొనడంతో వెండి రేట్లు పరుగులు తీస్తున్నట్లు కోటక్ మ్యూచువల్ ఫండ్కి చెందిన ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) ఒక దశలో 80.85 డాలర్లు పెరిగి 4,420.35 డాలర్లకు ఎగిసింది. వెండి సైతం 2.31 డాలర్లు పెరిగి ఔన్సుకి 69.45 డాలర్లు తాకింది. -
రూ.1.4 లక్షలకు చేరువలో బంగారం!: ఇక కొనేదెలా..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం గరిష్టంగా రూ. 1100 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,24,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,800 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 800 పెరిగిందన్న మాట. (ఉదయం 1000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 800 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1800 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,36,150 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1100 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 870 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1970 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల ధర రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,36,300 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1800 పెరిగి.. 1 24,950 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1850 పెరగడంతో రూ. 1,37,130 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1700 పెరిగి.. 1,25,700 రూపాయల వద్దకు చేరింది. -
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 85,567.48 వద్ద, నిఫ్టీ 195.20 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 26,161.60 వద్ద నిలిచాయి.క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, జూపిటర్ వ్యాగన్స్, ష్రెనిక్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, సద్భావ్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఆర్వీ లాబొరేటరీస్, మీషో లిమిటెడ్, రిలయన్స్ పవర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రెండు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఒక్కసారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగానే పెరిగాయి. వెండి ధరలు అయితే విరుచుకుపడ్డాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26,100 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు లాభంతో 26,128 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 484 పాయింట్లు పుంజుకొని 85,408 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 22-12-2025(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
శాంట క్లాజ్ ర్యాలీకి చాన్స్!
సుమారు 3 వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు మద్దతు స్థాయిలనుంచి రికవర్ అవుతూ వస్తున్నాయి. తొలుత అమ్మకాలు.. తదుపరి కొనుగోళ్లతో నిఫ్టీ 26,000, సెన్సెక్స్ 85,000 పాయింట్లకు అటూఇటుగా కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు మరోసారి సైడ్వేస్లో కదలనున్నాయా లేక శాంటా ర్యాలీకి దారి ఏర్పడుతుందా చూడవలసి ఉంది! క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మరోపక్క యూఎస్ సహా.. పలు యూరోపియన్ మార్కెట్లకు కొత్త ఏడాది సెలవులు సైతం జత కలవనుండటంతో దేశీయంగానూ ట్రేడింగ్ పరిమాణం నీరసించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఆటు పోట్ల మధ్య మార్కెట్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో కదులుతున్నాయి. దీంతో ఈ వారం కూడా హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నచందాన ట్రేడ్కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోపక్క ఇదే సమయంలో ఈ వారం శాంట క్లాజ్ ర్యాలీకి బీజం పడవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో? పరిశీలించదగ్గ అంశాలు → దేశీయంగా నేడు(22న) నవంబర్ నెలకు మౌలిక రంగ పురోగతి వివరాలు వెల్లడికానున్నాయి. 2025 అక్టోబర్లో దాదాపు యథాతథంగా 3.3 శాతం వృద్ధి నమోదైంది. 14 నెలల తదుపరి ఎలాంటి పురోగతి నమోదుకాకపోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్లు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. → డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టం 91 స్థాయి నుంచి భారీ రికవరీ సాధించింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకపు విలువ వారాంతాన 89.67 వద్ద స్థిరపడింది. → దేశీ మార్కెట్లలో పటిష్ట లిక్విడిటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు పలు ఐపీవోలతో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్లలో రిటైలర్లతోకలసి దేశీ ఫండ్స్ పెట్టుబడులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. విదేశీ ఎఫెక్ట్ → ఈ వారం(23న) యూఎస్ మూడో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ వృద్ధిపై ద్వితీయ అంచనాలు వెలువడనున్నాయి. క్యూ2(ఏప్రిల్–జూన్)లో యూఎస్ జీడీపీ వార్షికంగా 3.8%పుంజుకుంది. 3.3% అంచనాలను అధిగమించింది. → ఇదే రోజు యూఎస్ ప్రయివేట్ రంగ ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 24న నిరుద్యోగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. → ద్రవ్యోల్బణం, ఉపాధి గణాంకాల ప్రభావంతో యూఎస్ ఫెడ్ మరోసారి వడ్డీ రేట్ల కోత అమలు కు మొగ్గు చూపవచ్చని అంచనాలు పెరిగాయి.సాంకేతిక అంచనాలు ఇలా గత వారం అంతక్రితం వారంలాగే మార్కెట్లు రెండో సపోర్ట్ లెవల్స్వద్ద నుంచి రికవరీ సాధించాయి. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ వారం శాంట ర్యాలీకి తెరతీయవచ్చని అంచనా. నిఫ్టీ 26,060కు ఎగువన నిలదొక్కుకుంటే 26,450 వరకూ బలపడవచ్చు. 25,700 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. బలహీనపడి 25,600కు చేరితే మరింత నీరసించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇన్వెస్టర్లకు శుభవార్త.. సెబీ కొత్త రూల్స్ వచ్చేశాయ్
భారతదేశంలో చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అందరికీ లాభాలు వస్తాయని గానీ.. అందరూ నష్టపోతారని గానీ కచ్చితంగా చెప్పలేము. కాబట్టి కొన్నిసార్లు లాభాలు, మరికొన్ని సార్లు నష్టాలు ఉంటాయి.లాభ, నష్టాలు ఉన్నప్పటికీ.. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో.. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొన్ని కీలక ప్రకటనలు చేసింది. దేశీయ మ్యూచువల్ ఫండ్లు బ్రోకరేజ్లకు చెల్లించే రుసుము మాత్రమే కాకుండా.. మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో ప్రాథమిక నిర్వహణ ఛార్జీని కూడా తగ్గించింది.SEBI బోర్డు సమావేశం తర్వాత, విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నగదు లావాదేవీలపై స్టాక్ బ్రోకర్లకు చెల్లింపును 8.59 బేసిస్ పాయింట్ల నుంచి 6 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ గతంలో ఆస్తి నిర్వాహకులు చెల్లించే రుసుముపై 2 బేసిస్ పాయింట్ల రుసుమును ప్రతిపాదించింది.కొత్త రూల్స్➤కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న పెద్ద వాటాదారులను మినహాయించి, పబ్లిక్ ఇష్యూలలో ఉన్న వాటాదారులకు లాక్ ఇన్ అవసరాలను రెగ్యులేటర్ చేసింది.➤కొత్త నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ పబ్లిక్గా విడుదల కావడానికి ముందు, షేర్లకు లాక్-ఇన్ అవసరాలు స్వయంచాలకంగా అమలు చేయబడతాయి. ఇది లిస్టింగ్ ప్రక్రియలో ఆలస్యాలను పరిష్కరిస్తుందని సెబీ తెలిపింది.➤ఐపీఓకు ముందు షేర్ల లాక్-ఇన్ నిబంధనల సవరణకు సెబీ ఆమోదం తెలపడంతో, అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యాచరణ సవాలు ఇప్పుడు పరిష్కారమైందని.. కార్పొరేట్ కంప్లైయన్స్ సంస్థ MMJC అసోసియేట్స్ వ్యవస్థాపక భాగస్వామి మకరంద్ జోషి అన్నారు.➤పెట్టుబడిదారుల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, జారీ చేసే కంపెనీలు పబ్లిక్ ఆఫర్ పేపర్లలో భాగంగా కీలక సారాంశాన్ని అప్లోడ్ చేయాలని కూడా సెబీ స్పష్టం చేసింది.➤మహిళలు, రిటైల్ & సీనియర్ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలను అందించడానికి.. రుణ ఇష్యూలలో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ చర్యలను ఆమోదించింది.➤రిస్క్ మేనేజ్మెంట్ చర్యలకు లోబడి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అన్లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలను రేట్ చేయడానికి అనుమతించబడతాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే రెగ్యులేటర్ బోర్డు సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. టేకోవర్ కోడ్ నిబంధనలను సవరించడానికి నియంత్రణ సంస్థ కూడా కృషి చేస్తోందని ఆయన అన్నారు.ఖర్చులను తగ్గించి.. మ్యూచువల్స్ ఫండ్స్లో పారదర్శకతను పెంచడానికి సెబీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఈ ఏడాది (2025) చాలామంది ఇన్వెస్టర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. దీంతో ఊహకందని నష్టాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇన్వెస్టర్లు నిపుణుల సలహా లేదా బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. -
'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం
తొమ్మిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 10 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎలా ధనవంతులు కావాలి? అనే విషయం గురించి ప్రస్తావించారు.మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు.పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ.. దాన్ని ఎలా సాదించగలను అనే విషయం గురించి ఆలోచించాలి. ఇది మన మెదడును ఆలోచింపజేస్తుంది, పరిష్కారాలు వెతకమంటుంది, కొత్త మార్గాలు, అవకాశాలు చూపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలను పరిష్కరించడం నేర్చుకుని మరింత ధనవంతులవుతారని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో.. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, బంగారం, వెండి అన్నీ అమ్మకానికి వచ్చాయి. ఆ సమయంలో భయపడిన వాళ్లు అమ్మేశారు. సాహసం చేసిన వాళ్లు కొనేశారు. కొన్నవాళ్లే తర్వాత ధనవంతులయ్యారు. ఇప్పుడు ధనవంతులు కావడానికి ఇది మంచి అవకాశం, కానీ మీ మాటలను నియంత్రించగలిగితేనే.. అని కియోసాకి స్పష్టం చేశారు.LESSON #10 How to get richer as the economy crashes:CONTROL YOUR WORDS: In Sunday School I learned: “The word became flesh and dwelt amongst us.”In other words “You become your words.”My rich dad forbid his son and from saying “I can’t afford it.”Rich dad said: “Poor…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 21, 2025 -
రూ. 16వేలు పెరిగిన వెండి రేటు: వారంలోనే ఇంతలా
బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది. -
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.ధరల మార్పు ఇలా..డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుబంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.డిసెంబర్లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది. -
బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!
ఈ ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బంగారం మార్కెట్లో చరిత్రాత్మక ఏడాదిగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో తులం (10 గ్రాములు) బంగారం ధర సుమారు రూ.80 వేల స్థాయిలో ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.30 లక్షలకుపైగా చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత, భారతీయ రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం ధరలను కొత్త రికార్డుల వైపు నడిపించాయి. 2025లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయి.. కొత్త మార్కులను ఎలా దాటాయి.. చూద్దాం ఈ కథనంలో..జనవరి: స్థిరమైన ఆరంభం2025 జనవరిలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.80 వేలు – రూ.82 వేల మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ పెద్దగా కదలికలు చూపకపోయినా, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.మార్చి: వేగం పుంజుకున్న ధరలుమార్చి నాటికి బంగారం ధరలు రూ.88,000–రూ.90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం బంగారాన్ని ‘సేఫ్ హేవన్’గా మార్చాయి.ఏప్రిల్: చరిత్రాత్మక మైలురాయిఏప్రిల్ నెల బంగారం మార్కెట్లో కీలక మలుపు. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది. ఒకే రోజులో వేల రూపాయల పెరుగుదల నమోదై, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.మే–జూన్: స్వల్ప ఊగిసలాటమే, జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ రూ.95,000– రూ.98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా, పెట్టుబడి డిమాండ్ మాత్రం కొనసాగింది.సెప్టెంబర్: మళ్లీ జోరుసెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని రూ.1.08 లక్షల నుంచి రూ.1.10 లక్షల స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం మార్కెట్పై ప్రభావం చూపింది.అక్టోబర్: పండుగ సీజన్ రికార్డులుదసరా–దీపావళి సీజన్లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరి కొత్త ఆల్టైమ్ హైని నమోదు చేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కలసి ధరలను ఆకాశానికి చేర్చాయి.డిసెంబర్: స్వల్ప తగ్గుదలడిసెంబర్ చివర్లో ధరలు కొంత సర్దుబాటు చెంది రూ.1.28 లక్షలు – రూ.1.30 లక్షల పరిధిలో కొనసాగాయి. ఏదేమైనప్పటికీ, ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్ని ఇచ్చిన ఆస్తిగా నిలిచింది. -
2026లో బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. బంగార ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది (2025) ప్రారంభంలో రూ.78,000 ఉన్న గోల్డ్ రేటు.. ప్రస్తుతం రూ.1.3 లక్షలకు చేరుకుంది. దీంతో 2026లో పసిడి ధరలు ఇంకెలా ఉండబోతున్నాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 14% పెరిగి 4,900 డాలర్లకు చేరుకుంటుందని.. గోల్డ్మన్ సాచ్స్ (Goldman Sachs) అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు వంటివి గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరుగుతుందని నివేదికలో గోల్డ్మన్ సాచ్స్ వెల్లడించింది.భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు 61 శాతం పెరిగింది. ఈ విధంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ట్రంప్ టారిఫ్స్ ప్రకటనలు. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిన సమయంలో చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా గోల్డ్ రేటు గణనీయంగా పెరగడానికి ఓ కారణమైంది.ప్రస్తుతం బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఎందుకంటే అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం సమయంలో పెట్టుబడిదారులకు గోల్డ్ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం బంగారంపై పెట్టే పెట్టుబడి.. మిమ్మల్ని ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. కాబట్టి చాలామంది పసిడిపై పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి రేటు కూడా పెరుగుతుందని స్పష్టంగా అవగతం అవుతోంది.నేటి ధరలువరుస హెచ్చుతగ్గుల మధ్య ఈ రోజు (డిసెంబర్ 20) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,34,180 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,23,000 వద్ద నిలిచాయి. చెన్నైలో మాత్రమే ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
దేశంలో వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. మరో కొత్త మార్కును దాటేశాయి. బంగారం ధరలు నిలకడగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 447.55 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 84,929.36 వద్ద, నిఫ్టీ 150.85 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 25,966.40 వద్ద నిలిచాయి.ఆర్వీ లాబొరేటరీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్, జీ లెర్న్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఉగార్ షుగర్ వర్క్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, భగీరధ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ & ఎనర్జీ, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.LESSON # 9: How to get richer as the world economy crashes.The FED just let the world know their plans for the future.The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025 -
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి ధరల్లో మార్పులు కూడా పసిడి ధరలు తగ్గేందుకు కారణంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 147 పాయింట్లు లాభంతో 25,961 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 488 పాయింట్లు పుంజుకొని 84,976 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.46బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 59.68 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.13 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.79 శాతం పెరిగింది.నాస్డాక్ 1.38 శాతం పుంజుకుంది.Today Nifty position 19-12-2025(time: 09:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అందరికీ అనుకూలంగా ఫండ్స్ కొత్త నిబంధనలు
మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సంబంధించి సెబీ సవరించిన నిబంధనలు సమతుల్యంగా ఉన్నాయని, ఇన్వెస్టర్లతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నట్టు అయిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (యాంఫి) చైర్మన్ సందీప్సిక్కా తెలిపారు. కొత్త నిబంధనలతో ఫండ్స్ పరిశ్రమకు సైతం స్పష్టత ఏర్పడినట్టు చెప్పారు.మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు చెల్లిస్తున్న ఫీజుల్లో మార్పులు ప్రతిపాదిస్తూ కొత్త కార్యాచరణను సెబీ బుధవారం ప్రకటించడం తెలిసిందే. ఏడేళ్ల నుంచి ఫండ్స్ సంస్థలు పెట్టుబడిదారుల నుంచి 0.05 శాతం అదనంగా వసూలు చేస్తున్న ఎగ్జిట్ లోడ్ నిబంధనకు ముగింపు పలకడం గమనార్హం. ఫండ్స్ సంస్థల నుంచి ఈక్విటీ పెట్టుబడులపై బ్రోకరేజీ సంస్థలు వసూలు చేస్తున్న చార్జీల గరిష్ట పరిమితిని 0.12 శాతం నుంచి 0.06 శాతానికి, డెరివేటివ్స్ చార్జీని 0.05 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించింది.ఈ ఏడాది ఆరంభంలో ఫండ్స్కు సంబంధించి సెబీ ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. అయితే, భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, తుది నిబంధనలను ఖరారు చేసినట్టు సెబీ చైర్మన్ తుహిన్కాంత పాండే చెప్పారు. దీంతో ఆరంభంలో అంత కఠినంగా తుది నిబంధనల్లేవన్నారు. సెబీ కొత్త నిబంధనలతో స్పష్టత ఏర్పడి, దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించేందుకు అనుకూలిస్తుందని సిక్కా అభిప్రాయపడ్డారు. సెబీ నిర్ణయాల నేపథ్యంలో గురువారం అస్సెట్ మేనేజ్మెంట్ (ఏఎంసీ) కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ర్యాలీ చేశాయి.ఇదీ చదవండి: భారత్లో చాట్జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు -
పసిడి ఇంకా పైకి.. వెండి మరో‘సారీ’..
దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఎగిశాయి.ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) మోస్తరుగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు నష్టంతో 25,795 వద్ద, సెన్సెక్స్(Sensex) 66 పాయింట్లు నష్టపోయి 84,492 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-12-2025(time: 9:38)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆయుధాలుగా మారుతున్న వాణిజ్య సుంకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం టారిఫ్లు, ఇత ర రూపాల్లో ఆయుధాలు గా మారుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ కేవలం టారిఫ్లను ఎలా ఎదుర్కోవాలన్న దానికే పరిమితం కాకుండా, ఈ విషయమై జాగ్రత్తగా సంప్రదింపులు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం మనకు అనుకూలమని ఒక జాతీయ దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ‘‘స్వీయ ప్రయోజనాల ధోరణితో ఉందంటూ భారత్కు పాఠాలు బోధించొచ్చు. సుంకాల రాజుగా అభివరి్ణ ంచొచ్చు. కానీ, టారిఫ్ ఆయుధంగా మారిపోయింది. వీటిని ఆయుధాలుగా మార్చు కోకూడదన్నది భారత్ ఉద్దేశం. పోటీ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వరుస∙కట్టినప్పుడే దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు భారత్ రక్షణాత్మక చర్యలను అనుసరిస్తుంది’’అని మంత్రి స్పష్టం చేశారు. -
బంగారం ధర మరింత పెరిగేలా ప్రభుత్వం చర్యలు!
భారతదేశంలో బంగారం వినియోగానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, ఇటీవల మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ను పెంచడంపై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు, దీనివల్ల కలిగే పర్యవసానాలను చూద్దాం.ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడానికి ప్రధాన కారణాలుభారత ప్రభుత్వం సాధారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్(ద్రవ్యలోటు) నియంత్రించడానికి, రూపాయి విలువను కాపాడటానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి (దాదాపు రూ.91 మార్కుకు) పడిపోవడం ఆందోళనగా మారింది. రూపాయి పతనమైతే దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు పెరుగుతుంది. బంగారం దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలు హరించుకుపోకుండా చూసేందుకు ట్యాక్స్ను ఆయుధంగా వాడుతున్నారు.పెరుగుతున్న వాణిజ్య లోటుదేశం నుంచి అయ్యే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది. భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంది. దిగుమతులు తగ్గించడం ద్వారా ఈ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది మన దిగుమతి బిల్లును మరింత పెంచుతోంది.దిగుమతి సుంకం రేట్లు (ప్రస్తుతం)గతంలో (2024 బడ్జెట్లో) ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిపుణులు ఈ సుంకాన్ని మళ్లీ పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అంశంప్రస్తుత రేటుగత రేటు (2024 జులైకి ముందు)బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)5%10%అగ్రికల్చర్ సెస్ (AIDC)1%5%మొత్తం సుంకం6%15% పర్యవసానాలువినియోగదారులపై భారంసుంకం పెరగడం వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనడం భారంగా మారుతుంది. ఇప్పటికే 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలకు చేరడంతో అదనపు పన్ను కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.స్మగ్లింగ్ పెరిగే ప్రమాదందిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే దేశీయ మార్కెట్ ధరలకు, అంతర్జాతీయ ధరలకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఈ గ్యాప్ను సొమ్ము చేసుకునేందుకు అక్రమ మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారాన్ని తరలించే ముఠాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) హెచ్చరిస్తోంది.జ్యువెలరీ పరిశ్రమపై ప్రభావంపెరిగిన ధరల వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఆభరణాల తయారీ రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుంది. అలాగే, భారత్ నుంచి జరిగే ఆభరణాల ఎగుమతులు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది.ప్రత్యామ్నాయ మార్గాలుప్రభుత్వం కేవలం పన్నుల మీదనే ఆధారపడకుండా భౌతిక బంగారం దిగుమతిని తగ్గించడానికి కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సాధానాలుగా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ల ద్వారా ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా చెలామణిలోకి తీసుకురావాలి. ఇప్పటికే ఈ పని చేస్తున్నా దీన్ని మరింతగా పెంచాలి.బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు అనేది ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం. రూపాయి విలువను కాపాడటం, వాణిజ్య లోటును తగ్గించడం దీని వెనుక ఉన్న సానుకూల ఉద్దేశ్యాలు అయినప్పటికీ దీనివల్ల దేశీయంగా ధరలు పెరగడం, జ్యువెలరీ రంగం మందగించడం వంటి సవాళ్లు తప్పవని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ప్రజలు భౌతిక బంగారం వైపు కాకుండా డిజిటల్ బంగారం లేదా బాండ్ల వైపు దృష్టి సారిస్తేనే దిగుమతుల భారం తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారీగా జీతాల పెంపు ఈ రంగాల్లోనే.. -
ఒక్కరోజే ఊరట.. మారిపోయిన బంగారం, వెండి రేట్లు
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా ఎగిశాయి. ఒక్క రోజు ఊరటనిచ్చి అమాంతం దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగా పెరిగాయి. వెండి ధరలు అయితే రికార్డు స్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా ప్రారంభమై స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 35 పాయింట్లు లాభంతో 25,895 వద్ద, సెన్సెక్స్(Sensex) 115 పాయింట్లు లాభపడి 84,795 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 17-12-2025(time:9:37 )(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
534 పాయింట్లు డౌన్
ముంబై: వాణిజ్య లోటు పెరుగుతుండటం, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత తదితర అంశాల కారణంగా రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా ఇంట్రాడేలో 91 మార్కును దాటేసింది. చివరికి డాలరుతో పోలిస్తే మరో 15 పైసలు క్షీణించి 90.93 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే ఇంట్రాడేలో 36 పైసల క్షీణతతో 91.14 స్థాయిని కూడా తాకింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలోనే రూపాయి మారకం విలువ 90 నుంచి 91కి పడిపోయింది. గత అయిదు సెషన్లలో ఏకంగా 1 శాతం పతనమైంది. ఈ నెలలోనే 92 మార్కును కూడా దాటేయొచ్చని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఈడీ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు. ఈ ఏడాది 5.1 శాతం డౌన్.. రాజ్యసభలోనూ ఈ అంశం చర్చకు రాగా, డేటా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3 వరకు రూపాయి విలువ 5.1 శాతం క్షీణించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. వాణిజ్య లోటు, అమెరికా–భారత్ ఒప్పందానికి సంబంధించిన పరిణామాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. అయితే, రూపాయి పతనంతో ఎగుమతులపరంగా పోటీతత్వం మెరుగుపడొచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. డేటా ప్రకారం డాలరుతో పోలిస్తే రూపాయి 2015లో 4.5 శాతం, 2016లో 2.6 శాతం క్షీణించగా, 2017లో 6.4 శాతం పెరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం క్షీణత కొనసాగింది. 91కి జారిన రూపాయిముంబై: విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ డీలాపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేమి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 91 స్థాయిని బ్రేక్ చేయడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 84,680 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్లు కోల్పోయి 25,860 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు, అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో రోజంతా నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 592 పాయింట్లు క్షీణించి 84,621 వద్ద, నిఫ్టీ 193 పాయింట్లు పతనమై 25,834 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈలో టెలికమ్యూనికేషన్, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు మాత్రమే రాణించాయి. రియల్టీ 1.36%, బ్యాంకెక్స్ 1.03%, కమోడిటీస్ 0.91%, ఐటీ 0.90%, ఐటీ 0.86%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83%, మెటల్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ ఇండెక్సు 0.78%, స్మాల్క్యాప్ సూచీ 0.69% పతనమయ్యాయి. ∙యాక్సిస్ బ్యాంకు షేరు 5% పతనమై రూ.1,220 వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ వరకూ నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి కొనసాగొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటి ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ షేరు పడింది. -
తగ్గిన బంగారం దిగుమతులు: నవంబర్లో 60 శాతం..
దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం నవంబర్లో 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2024) నవంబర్లో 9.8 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయి.2025 అక్టోబర్లో మూడు రెట్లు ఎగసి 14.72 బిలియన్ డాలర్లను తాకిన పసిడి దిగుమతులు ఈ ఏడాది(2025) ఏప్రిల్–నవంబర్ కాలంలో 3.3 శాతం పెరిగి 45.26 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 43.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. పసిడి దిగుమతులు క్షీణించడంతో గత నెలలో దేశ వాణిజ్య లోటు తగ్గి 24.53 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. దిగుమతులు నీరసించడంతో దిగుమతుల బిల్లు సైతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. -
రెండోరోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 533.50 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 84,679.86 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 25,860.10 వద్ద నిలిచాయి.అసహి సాంగ్వాన్ కలర్స్, అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్, అగ్రి టెక్ ఇండియా, ఈప్యాక్ డ్యూరబుల్స్, న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సలోనా కాట్స్పిన్, ఆర్వీ లాబొరేటరీస్, విపుల్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్జీ రబ్బరు వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:12 సమయానికి నిఫ్టీ(Nifty) 138 పాయింట్లు తగ్గి 25,890కు చేరింది. సెన్సెక్స్(Sensex) 464 పాయింట్లు నష్టపోయి 84,748 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-12-2025(time: 10:12 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!
వారెన్ బఫెట్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే.. బెర్క్షైర్ హాత్వే చైర్పర్సన్ & దిగ్గజ పెట్టుబడిదారుడుగా ప్రపంచంలోని లక్షలాదిమంది ప్రజలకు సుపరిచయమే. ఈయన స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి సులభమైన నియమాలను వెల్లడించారు. విజయవంతమైన పెట్టుబడికి.. మార్కెట్ అంచనాలతో సంబంధం లేదని, క్రమశిక్షణ, స్వీయ అవగాహన, మీ ఆలోచనలతో ఎక్కువ సంబంధం ఉందని పేర్కొన్నారు.వారెన్ బఫెట్ ప్రకారం.. పెట్టుబడి విషయంలో వాస్తవికంగా ఉండటం గురించి చెబుతారు. మీరు అర్థం చేసుకున్నది తెలుసుకోవడమే కాకుండా, మీకు తెలియనిది తెలుసుకోవడం.. దానికి ప్రలోభపడకుండా ఉండటం ముఖ్యమని, ఇది స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని అంటారు.తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ.. అదుపులేని దురాశ, దీర్ఘకాలిక రాబడికి అతిపెద్ద శత్రువులలో ఒకటి బఫెట్ హెచ్చరించారు. మీరు చాలా దురాశపరులైతే, అది విపత్తు అవుతుందని ఆయన అంటారు.పెట్టుబడి అంటే అది క్లిష్టమైన ప్రక్రియ కాదంటారు బఫెట్. అయితే దీనికి ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం అని స్పష్టం చేశారు.బఫెట్ తన పెట్టుబడి తత్వశాస్త్రంలో ఎక్కువ భాగాన్ని బెంజమిన్ గ్రాహం బోధనలకు ఆపాదించారు. దశాబ్దాల మార్కెట్ పరిణామం తర్వాత కూడా అతని ఆలోచనలు సాటిలేనివిగా ఉన్నాయని అతను నమ్ముతారు. ఈ ప్రాథమిక విధానం ప్రకారం.. మీరు స్టాక్లను వ్యాపారాలుగా భావించి, ఆపై మంచి వ్యాపారాన్ని ఏది చేస్తుందో అంచనా వేయాలని ఆయన అన్నారు. ఈ పద్దతిలో ప్రధానమైనది భద్రతా మార్జిన్ అని బఫెట్ అన్నారు. -
బంగారం డబుల్: గంటల్లో తారుమారైన ధరలు!
కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.వెండి రేటు ఇలాబంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 84.00 పాయింట్లు లేదా 0.099 శాతం నష్టంతో 85,183.66 వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్లు లేదా 0.075 శాతం నష్టంతో 26,027.30 వద్ద నిలిచాయి.కరోనా రెమెడీస్ లిమిటెడ్, తైన్వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ (ఇండియా), టీవీ విజన్, రిఫెక్స్ ఇండస్ట్రీస్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మనీబాక్స్ ఫైనాన్స్ లిమిటెడ్, వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్, G-Tec Jainx ఎడ్యుకేషన్, ఎంబసీ డెవలప్మెంట్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!
బంగారం ధర రూ. 1.30 లక్షలు (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) దాటితే.. కేజీ వెండి రేటు రూ. 2.13 లక్షలకు చేరింది. సిల్వర్ రేటు మరింత పెరిగి 2026కు సుమారు రూ. 2.40 లక్షలకు చేరుకుంటుందని స్టాక్ బ్రోకర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కంపెనీ 'యాక్సిస్ సెక్యూరిటీస్' వెల్లడించింది.యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. వెండి రేటు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతూనే ఉంది. 2025 ప్రారంభంలో రూ. 80వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఇప్పుడు గణనీయంగా పెరిగి, రెండు లక్షల రూపాయలు దాటేసింది. దీనికి కారణం మార్కెట్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ అని స్పష్టమవుతుంది.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడం, దీంతో డిమాండ్ ఎక్కువ కావడం వల్ల కూడా సిల్వర్ రేటు ఊహకందని విధంగా పెరిగింది. సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో మాత్రమే వెండి వినియోగం నాలుగేళ్లలో రెండింతలు పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా వెండికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు వెండి ధరలుడిసెంబర్ 14న రూ. 2.10 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. ఈ రోజు రూ. 2.13 లక్షలకు చేరింది. అంటే ఈ ఒక్క రోజులోనే సిల్వర్ టు రూ. 3000 పెరిగిందన్నమాట. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో సిల్వర్ రేటు ఒకేలా ఉన్నా.. ఢిల్లీలో మాత్రం కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 2,00,900. దీన్నిబట్టి చూస్తే.. దేశంలో ఢిల్లీలోనే సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం.. -
రూపాయికి ఏమైంది?? మళ్లీ రికార్డ్ పతనం..
భారత రూపాయి విలువ మళ్లీ పతనాన్ని చూసింది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ రూ .90.57 వద్ద తాజా రికార్డు కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం ముగిసిన రూ .90.41 తో పోలిస్తే భారత కరెన్సీ 14 పైసలు తగ్గింది.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, నిరంతర విదేశీ నిధుల ప్రవాహంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిన్న కారణంగా గత శుక్రవారం కూడా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 90.49 వద్ద ముగిసింది.రూపాయి పతనానికి ముఖ్యమైన కారణాలుయూఎస్‑భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితిఇప్పటివరకు అమెరికా తో వ్యాపార ఒప్పందం పై స్పష్టత రావకపోవడంతో పెట్టుబడిదారుల్లో చాలా అనిశ్చితి నెలకొంది. అత్యధిక టారిఫ్స్, ఒప్పందం ఆలస్యంతో డాలర్‑డిమాండ్ పెరిగింది.విదేశీ నిధుల అవుట్ఫ్లోవివిధకాలపు విదేశీ పెట్టుబడి సంస్థలు భారత మార్కెట్ల నుండి పెద్దగా నిధులు ఉపసంహరించుకోవడంతో రూపాయి పనితీరు మీద ఒత్తిడి పెరిగింది. ఈ అవుట్ఫ్లోల కారణంగా డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గడం జరిగింది.భారీ దిగుమతులుభారతదేశంలో క్రూడ్ ఆయిల్, ఇతర దిగుమతులు పెరగడం కూడా డాలర్ డిమాండ్కు కారణమైంది. ముఖ్యంగా ద్రవ్యమార్కెట్లో సరిపడా డాలర్లు లేనప్పుడు సహజంగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది.


