breaking news
Market
-
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398.45 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో 82,172.10 వద్ద, నిఫ్టీ 135.65 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 25,181.80 వద్ద నిలిచాయి.జిందాల్ ఫోటో లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎం బ్రూవరీస్, ఆల్కలీ మెటల్స్, వీ విన్ లిమిటెడ్ వంటివి లాభాల జాబితాలో చేరాయి. నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), మోడీ రబ్బర్ లిమిటెడ్, సుమీత్ ఇండస్ట్రీస్, హెడ్స్ అప్ వెంచర్స్ వంటి కంపెనీలు వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి
బంగారంపై పెట్టుబడి పెట్టండి.. అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని చెప్పిన 'రాబర్ట్ కియోసాకి' మాటలు నిజవవుతున్నాయి. ఇప్పుడు ఎవరిదగ్గర బంగారం ఎక్కువ ఉందో వాళ్లే ధనవంతులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజు (అక్టోబర్ 9) 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,24,000 దాటేసింది. ఇలాంటి సమయంలో.. కియోసాకి వెండి గురించి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.పసిడి ధరల మాదిరిగానే.. ''వెండి ధర దాదాపుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. సిల్వర్ రేటు మరింత పెరుగుతుంది. వెండి ధరలు భారీగా పెరగడానికి ముందే.. దయచేసి సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి'' అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.SILVER near time high.Silver is a dollar away from turning into a rocket ship.Please get a few silver coins before the silver rocket leaves the earth.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 1,71,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తుంటే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి బంగారంపైన మాత్రమే కాకుండా.. వెండిపై చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.గతంలో చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ ప్లానర్లు స్టాక్ కొనుగోలు చేయమని, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సలహాలు ఇచ్చారు. అయితే యూఎస్ డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో స్టాక్స్, ఫండ్స్ అంత సురక్షితం కాదని కియోసాకి వాదన. అమెరికా ప్రభుత్వం చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశం అయినప్పుడు.. ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది. దివాలా తీసిన దేశం నుంచి బాండ్లను కొనుగోలు చేసేంత తెలివితక్కువవారు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లునిజం ఏమిటంటే.. కొన్ని సంవత్సరాలుగా బంగారం విలువ, స్టాక్లు.. బాండ్ల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. నేను ఇప్పటికీ బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయడానికే ఇష్టపడతాను. నిజమైన ఆస్తులు ఇవే. మీరు కూడా ఉత్తమైన వాటిలో పెట్టుబడి పెట్టండని కియోసాకి పేర్కొన్నారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
తులం బంగారం రూ.లక్షా 28 వేల 200
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. మంగళవారం తులం బంగారం రూ. 1,25,400 ఉండగా బుధవారం రూ. 1,28,200కు చేరుకొని రికార్డు సృష్టించింది. తులం వెండి ధర రూ.1610కి చేరింది. దీపావళి పండుగ దాటేసరికి బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరుకోవచ్చని బంగారు దుకాణాదారులు అభిప్రాయపడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ప్రజలు ధరల పెరుగుదలతో తక్కువ బంగారంతోనే సరిపుచ్చుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయని దుకాణాదారులు చెప్తున్నారు.రూ.లక్షా 50వేలు దాటుతుంది..ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండడంతోనే బంగారం రేటు పెరుగుతోంది. రానున్న రోజు ల్లో తులం బంగారం ధర రూ. లక్షా50వేలకు దాటేలా కనిపిస్తోంది. ఇలా ఉంటే సామాన్యుడికి చాలా ఇబ్బందే.– లక్ష్మణచారి, వర్తకుడు, నగరవాసి -
ఇలా అయితే ఎలా 'బంగారం': మరింత పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 09) కూడా గరిష్టంగా రూ. 220 పెరిగింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,000 మార్కుపైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,097కు చేరింది. సెన్సెక్స్(Sensex) 107 పాయింట్లు పుంజుకొని 81,871 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అస్థిర సెషన్ తరువాత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు ప్రారంభ లాభాలు కరెక్షన్కు గురై నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,773.66 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 25,046.15 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.73 శాతం, 0.52 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో, నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియాల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1 శాతం వరకు పడిపోయాయి.సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 21 షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా టాప్ లూజర్స్ గా నిలిచాయి. టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,179కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు పుంజుకొని 82,209 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగో రోజూ లాభాలే
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.అయితే ద్వితీయార్ధంలో ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో టెలికం 2.13%, రియల్టీ 1.09%, ఇంధన 0.50%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.28%, ఫైనాన్సియల్ సర్విసెస్ 0.24%, ఐటీ 0.23 శాతం లాభపడ్డాయి. ⇒ లాజిస్టిక్స్ సర్విసు ప్రొవైడర్ గ్లోటిస్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.129)తో పోలిస్తే బీఎస్ఈలో 32% డిస్కౌంటుతో రూ.88 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 37% క్షీణించి రూ.81 కనిష్టాన్ని తాకింది. చివరికి 35% పతనంతో రూ.84 వద్ద నిలిచింది.⇒ ఇష్యూ ధర (రూ.191) వద్దే ఫ్లాటుగా లిస్టయిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ షేరూ మెప్పించలేకపోయింది. ఇంట్రాడేలో 5% పతనమై రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 4.5% నష్టంతో రూ.182 వద్ద స్థిరపడింది. -
బంగారం @ 4,000
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది. ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నట్టు చెప్పారు. దేశీయంగా రూ.1.24 లక్షలు ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది. -
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.ఇదీ చదవండి: మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) -
ప్యాసివ్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల (ఏయూఎం) విలువ 2025 మార్చి నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2019 నాటికి ఉన్న రూ.1.91 లక్షల కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగింది.మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ మూడో ఎడిషన్ ‘ప్యాసివ్ సర్వే 2025’ ఈ వివరాలు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి చూసినా ప్యాసివ్ ఫండ్స్ ఏయూఎం 1.7 రెట్లు పెరిగింది. మూడు వేల మందికి పైగా ఇన్వెస్టర్లు, ఫండ్స్ పంపిణీదారుల నుంచి అభిప్రాయాలను సర్వేలో భాగంగా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తెలుసుకుంది.ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్లు) అన్నవి నిర్దేశిత సూచీల్లోని స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రాబడి కూడా సూచీల స్థాయిలోనే ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్ మెరుగైన రాబడుల అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. యాక్టివ్ ఫండ్స్తో పోల్చి చూస్తే ప్యాసివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. సర్వే అంశాలు..76 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పడం గమనార్హం.68 శాతం ఇన్వెస్టర్లు కనీసం ఒక ప్యాసివ్ ఫండ్లో పెట్టుబడులు పెట్టారు. 2023లో ఇలాంటి వారు 61 శాతంగా ఉన్నారు.ప్యాసివ్ ఫండ్స్కు ఆదరణ పెరిగినప్పటికీ.. యాక్టివ్ ఫండ్స్పైనా కొందరు ఇన్వెస్టర్లలో అమిత విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు యాక్టివ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరికి ప్యాసివ్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియకపోవడం కూడా ఒక కారణం.ప్యాసివ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వ్యయాలు కారణమని 54 శాతం మంది చెప్పారు. సులభత్వం, పారదర్శక గురించి 46 శాతం మంది ప్రస్తావించారు. 29 శాతం మంది పనితీరును కారణంగా పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల్లోనూ 93% మందికి ప్యాసివ్ ఫండ్స్పై అవగాహన ఉంది.సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మూడేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలం కోసం పెట్టుబడుల ధోరణి వారిలో కనిపించింది. ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెట్టుబడులు కొనసాగిస్తున్న వారు 13 శాతంగా ఉన్నారు.57 శాతం మంది ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఒకే విడతలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 26 శాతం మంది కేవలం సిప్లో, 17 శాతం ఒకే విడత పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 61 శాతం మంది చెప్పగా, రిటైర్మెంట్ నిధి కోసం 49 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 136.63 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 81,926.75 వద్ద, నిఫ్టీ 30.65 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 25,108.30 వద్ద నిలిచాయి.ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, మైండ్టెక్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోటిస్ లిమిటెడ్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, కేఐఓసీఎల్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,122కు చేరింది. సెన్సెక్స్(Sensex) 127 పాయింట్లు పుంజుకొని 81,919 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆరు ఐపీవోలకు గ్రీన్సిగ్నల్
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్కార్ట్ సొల్యూషన్స్, వేక్ఫిట్ ఇన్నోవేషన్స్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, కార్డీలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్వేస్ లీజర్ టూరిజం, కాటన్ యార్న్ల తయారీ కంపెనీ శ్రీరామ్ ట్విస్టెక్స్, ఇండ్రస్టియల్ ల్యామినేట్స్ ఉత్పత్తి చేసే లామ్టఫ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి సుమారు రూ. 6,500 కోట్లు పైగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్–జూలై మధ్య ఈ ఆరు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, సెపె్టంబర్ 26 – అక్టోబర్ 3 మధ్య అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. 2025లో 80 కంపెనీలు ఇప్పటికే ఐపీవోల ద్వారా నిధులు సమీకరించుకోగా, ఈ నెలలో మరిన్ని సంస్థలు లైనులో ఉన్నాయి.లెన్స్కార్ట్తాజాగా షేర్ల జారీ ద్వారా లెన్స్కార్ట్ సొల్యూషన్స్ రూ. 2,150 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 13.22 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఐపీవో నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, స్టోర్ల లీజులు–అద్దెలు మొదలైన వాటి చెల్లింపులకు, టెక్నాలజీ–క్లౌడ్ ఇన్ఫ్రాపై ఇన్వెస్ట్ చేసేందుకు, బ్రాండ్ మార్కెటింగ్కు, ఇతర సంస్థ కొనుగోలుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్రూ. 468.2 కోట్ల వరకు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత వాటాదారులు 5.84 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 82 కోట్లను 117 కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (కోకో)–రెగ్యులర్ స్టోర్స్, ఒక కోకో–జంబో స్టోర్ ఏర్పాటుకు; కొత్త పరికరాల కొనుగోలుకు రూ. 15.4 కోట్లు; ప్రస్తుత స్టోర్ల లీజులు, అద్దెల కోసం రూ. 145 కోట్లు; మార్కెటింగ్ కోసం రూ. 108 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియాఇష్యూ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ ఈ షేర్లను విక్రయించనుంది. వాటర్వేస్ లీజర్ టూరిజంకొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.727 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 552.53 కోట్లను తమ అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్కి సంబంధించిన అడ్వాన్స్లు, లీజులు మొదలైన వాటిని చెల్లించేందుకు, మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించుకోనుంది. శ్రీరామ్ ట్విస్టెక్స్1.06 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులను సొంత అవసరాల కోసం 6.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు, 4.2 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం; అలాగే రుణాల చెల్లింపు, ఇతరత్రా నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనుంది.లామ్టఫ్కొత్తగా 1 కోటి షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. తెలంగాణలో తమకున్న తయారీ ప్లాంటు విస్తరణకు, నిర్వహణ మూలధనం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం నిధులను కంపెనీ ఉపయోగించుకుంటుంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు
సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.ఎన్ఎస్ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే
హైదరాబాద్: లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రతిపాదిత ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్లో తొలి స్టోర్ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది.లలితా జ్యువెలరీ మార్ట్ (Lalithaa Jewellery Mart) దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతీయ బ్రాండ్ల్లో ఒకటి. కొన్నేళ్లుగా కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. నాణ్యత, పారదర్శకత, భారీ స్టోర్ల ఏర్పాటు వ్యూహంతో ఈ సంస్థ దేశీయ నగల మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. నాణ్యతకు నిదర్శనంగా అన్ని ఆభరణాలపై BIS హాల్మార్క్ ప్రమాణాలను పాటిస్తూ బంగారం (Gold), వెండి (Silver), వజ్రాల (Diamond) ఆభరణాలను అందిస్తోంది. ఈ సంస్థకు మొత్తం 6.09 లక్షల చదరపు అడుగుల వ్యాపార స్థలం ఉంది. ఇది సంస్థ విస్తృతికి అద్దం పడుతోంది.ఆర్థిక ప్రగతిలో దూకుడులలితా జ్యువెలరీ గత కొంతకాలంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. సంస్థ ఆదాయ వృద్ధి రేటు 43.62%గా ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఈ రంగంలో సంస్థ బలమైన పనితీరును సూచిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,788 కోట్లు ఆదాయం వస్తే రూ.359.8 కోట్లు లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో (9 నెలలు) రూ.12,594 కోట్లు ఆదాయం వస్తే అందులో రూ.262.3 కోట్లు లాభంగా ఉందని కంపెనీ తెలిపింది.భారీ స్టోర్ల వ్యూహం, తయారీ సామర్థ్యంలలితా జ్యువెలరీ దేశంలోనే అతిపెద్ద నగల స్టోర్లను నెలకొల్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన స్టోర్ల పరిమాణం ప్రత్యేకంగా నిలిచింది. విజయవాడలో 1,00,000 చదరపు అడుగులు, సోమాజిగూడ (హైదరాబాద్)లో 98,210 చదరపు అడుగులు, విశాఖపట్నంలో 65,000 చదరపు అడుగులతో స్టోర్లు నెలకొల్పింది.ఈ సంస్థకు తమిళనాడులో రెండు అత్యాధునిక తయారీ కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు) ఉన్నాయి. ఇక్కడ 563 మంది నిపుణులైన కారిగర్లు(బంగారు ఆభరణాల తయారీదారులు) పనిచేస్తున్నారు. వీరు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల డిజైన్లను రూపొందిస్తున్నారు. -
పసిడి హైజంప్!
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్కు తోడయ్యాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. నాన్ స్టాప్ ర్యాలీ...ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 582.95 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 81,790.12 వద్ద.. నిఫ్టీ 183.40 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 25,077.65 వద్ద నిలిచాయి.అట్లాంటా, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఏఏఏ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిగ్మా సాల్వ్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, మాస్టర్ ట్రస్ట్, ప్రోజోన్ రియాల్టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి కొత్త ధరలు: వింటే దడ పుట్టడం ఖాయం!!
దేశంలో బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. విజయదశమి సందర్భంగా కాస్త శాంతించినట్టే కనిపించినా మళ్లీ స్పీడ్ను అమాంతం పెంచేశాయి. ధర వింటేనే పసిడి ప్రియులకు దడ పుడుతోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు పెరిగి 24,916కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 పాయింట్లు పుంజుకొని 81,279 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గణాంకాలు, ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలతో పాటు ఐటీ దిగ్గజం టీఎస్ఎస్తో బోణీ కానున్న రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాలు మన మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వరుసగా మూడు నెలల నుంచి అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలను కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని చెప్పారు. మరోపక్క, జారుడు బల్లపై ఉన్న రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. టీసీఎస్ బోణీ... కార్పొరేట్ల క్యూ3 (జూలై–సెపె్టంబర్) ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలతో బోణీ కొట్టనుంది. ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం, 25 శాతం అదనపు టారిఫ్ల మోత తదితర భారత్ వ్యతిరేక చర్యల నేపథ్యంలో క్యూ2 ఫలితాలపై, కంపెనీల భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. ‘క్యూ2 ఫలితాల సందర్భంగా టారిఫ్ల ప్రభావం, వీసా ఫీజుల పెంపు, డీల్స్, కంపెనీల వ్యయాలు, ఉద్యోగాల కోత, హైరింగ్ అవుట్లుక్ వంటి అంశాలపై టీసీఎస్ యాజమాన్యం చేసే వ్యాఖ్యలు ఐటీ రంగంలో పాటు మార్కెట్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. గణాంకాలపై ఫోకస్.. ‘టీసీఎస్ ఫలితాలకు తోడు హెచ్ఎస్బీసీ సర్వీస్ రంగం పీఎంఐ డేటా, బ్యాంకింగ్ రంగ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు రానున్నాయి. టాటా క్యాపిటల్, ఎల్జీ బడా ఐపీఓలతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు జోరందుకోనున్నాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. కాగా, అమెరికాలో ఫెడర్ రిజర్వ్ ఇటీవలి పాలసీ భేటీ వివరాలు (మినిట్స్), నిరుద్యోగ గణాంకాలు, కన్జూమర్ సెంటిమెంట్ డేటా వంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఫోకస్ చేసే అవకాశం ఉంది. కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా కొన్ని కీలక ఆర్థిక గణంకాలు ఇప్పటికే ఆలస్యమయ్యయాని మిశ్రా పేర్కొన్నారు. గత వారమిలా... వరుసగా 8 రోజుల పాటు నష్టాల బాటలో సాగిన దేశీ మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కాస్త ఊరటనిచి్చంది. గురు, శక్రవారాల్లో ప్లస్లో నిలిచిన సూచీలు లాభాలతో వారాన్ని ముగించాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు (0.97%), నిఫ్టీ 240 పాయింట్లు (0.97%) చొప్పున ఎగబాకాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించినప్పటికీ, రానున్న నెలల్లో రేట్ల కోతకు ఆస్కారం ఉందంటూ ఇచ్చిన సిగ్నల్స్ మార్కెట్ను మెప్పించింది. మరోపక్క, ఐపీఓ ఫైనాన్సింగ్, షేర్ల తనఖా రుణ పరిమితిని భారీగా పెంచడం కూడా ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడంతో పాటు పాలసీ సందర్భంగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. ఇటీవలి కరెక్షన్ నుంచి మార్కెట్లు మళ్లీ సానుకూల పథంలోకి మారాయి’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.మెగా ఐపీఓ వారం..పబ్లిక్ ఆఫర్ల వరదతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లను ఈ వారం మెగా ఐపీఓలు (దాదాపు రూ.27,000 కోట్లు) ముంచెత్తనున్నాయి. టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్ల ఇష్యూతో పాటు (6న ప్రారంభమై 8న ముగుస్తుంది). దీని ప్రైస్ బ్యాండ్ను కంపెనీ రూ.310–326గా నిర్ణయించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కూడా ఈ వారమే ప్రారంభమవుతోంది. దాదాపు రూ.11,607 కోట్ల ఈ ఆఫర్ అక్టోబర్ 7న మొదలై 9న క్లోజవుతుంది. దీని ధరల శ్రేణి రూ.1,080–1,140. ఇవి కాకుండా రూబికాన్ రీసెర్చ్ రూ.1,377 కోట్ల ఇష్యూ అక్టోబర్ 9న షురూ కానుంది. ఇప్పటికే మొదలైన రూ.3,000 కోట్ల వియ్వర్క్ ఆఫర్ 7న ముగియనుంది. 2025లో ఇప్పటికే 78 ఐపీఓలు పూర్తవగా.. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు వరుస కట్టనున్నాయి.ఎఫ్పీఐల రివర్స్ గేర్...సెపె్టంబర్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) అమ్మకాల జోరు పెంచారు. ఈ ఒక్క నెలలోనే రూ.23,885 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా ఈక్విటీ మార్కెట్లో ఎప్పీఐల నికర అమ్మకాలు రూ.1.58 లక్షల కోట్లకు చేరాయి. వరుసగా మూడో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం తాజా కరెక్షన్కు ఆజ్యం పోసింది. ఆగస్ట్లో ఏకంగా రూ.34,990 కోట్లు ఉపసంహరించున్న ఎఫ్పీఐలు, జూలైలో రూ.17,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ‘ఇటీవలి అమ్మకాలకు ప్రధానంగా అమెరికా టారిఫ్ల మోతతో పాటు ఇతరత్రా పాలసీ షాక్లు ప్రధాన కారణం. భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్ల విధింపు, హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు వంటివి ఎగుమతి ఆధారిత రంగాలపై, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ సెంటిమెంట్ను దెబ్బతీసింది. రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం వల్ల తలెత్తుతున్న కరెన్సీ రిస్క్, భారతీయ స్టాక్స్లో అధిక వేల్యుయేషన్లు వంటివి కూడా ఎఫ్ఐపీలను తాత్కాలికంగా ఇతర ఆసియా మార్కెట్ల వైపు (రొటేషన్) దృష్టి సారించేలా చేస్తోంది’ అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. -
మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేసిన ఒక ట్వీట్.. నెట్ఫ్లిక్స్ (Netflix) మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్ 27న 514 బిలియన్ డాలర్లుగా ఉన్న దాని మార్కెట్ విలువ.. 2025 అక్టోబర్ 3 నాటికి సుమారు 25 బిలియన్ డాలర్లు తగ్గిపోయి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నమాట.పిల్లల షోలలో ట్రాన్స్జెండర్ సందేశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మస్క్ స్ట్రీమర్ను విమర్శించారు. ''మీ పిల్లల ఆరోగ్యం కోసం నెట్ఫ్లిక్స్ రద్దు చేయండి'' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్హమీష్ స్టీల్ దర్శకత్వం వహించిన.. నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ 'డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్' లింగ మార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, వోక్ ఎజెండాను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా నెట్ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ మార్కెట్ విలువ భారీ పతనాన్ని చవిచూసింది.Cancel Netflix for the health of your kids https://t.co/uPcGiURaCp— Elon Musk (@elonmusk) October 1, 2025 -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్టైమ్ గరిష్టాలకు చేరిన ధర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా.. పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది. డాలర్ విలువ రోజురోజుకి తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో బిట్కాయిన్ వాల్యూ ఆదివారం ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకొని.. 1,25,000 డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక బిట్కాయిన్ విలువ సుమారు రూ. 1.08 కోట్లు.ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విలువ తాజాగా 1,25,689 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 14న నెలకొల్పిన 1,24,514 రికార్డును సైతం.. ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుత పరిస్థితులు బిట్కాయిన్ విలువను అమాంతం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అమెరికా స్టాక్లలో లాభాలు, బిట్కాయిన్ లింక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోలు పెరిగాయి.ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ షట్డౌన్.. డబ్బును సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టేలా చేసింది. మార్కెట్ వర్గాలు దీనిని 'డీబేస్మెంట్ ట్రేడ్' అని పిలుస్తున్నారు. "ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి సేకరణలతో సహా అనేక ఆస్తులు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. డాలర్ విలువ తగ్గడం.. బిట్కాయిన్ విలువ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్ఎక్స్ మార్కెట్ల కో హెడ్ జాషువా లిమ్ అన్నారు.సాధారణంగా అక్టోబర్ నెల బిట్కాయిన్కు అనుకూలమైనది.. దీనిని "అప్టోబర్" అని మార్కెట్ నిపుణులు పిలుచుకుంటారు. గత కొన్నేళ్లుగా బిట్కాయిన్ పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.బిట్కాయిన్ పెరుగుదలపై విక్రమ్ సుబ్బురాజ్ ఏమన్నారంటే?బిట్కాయిన్ విలువ 125000 డాలర్లు దాటడం అనేది మరో మైలురాయి కాదు. గత కొంతకాలంగా దీని విలువ పెరుగుతూనే ఉంది. పరిస్థితులు కూడా బిట్కాయిన్కు అనుకూలంగా మారుతున్నాయి. దీనికి కారణం రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యం.. స్థిరమైన డిమాండ్ అని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. అంతే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బిట్కాయిన్ ఒక ప్రత్యేక ఆస్తి అని కూడా ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ, బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పండుగ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు (gold price) ఇప్పటికే 10 గ్రాములకు రూ .1,18,000 దాటగా, వెండి కిలోకు రూ .1,44,000 దాటింది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 21 నాటికి బంగారం రూ .1.22 లక్షలు, వెండి (silver price)రూ .1.50 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆజ్యం పోస్తున్న ప్రపంచ పోకడలుఅంతర్జాతీయంగా, బంగారం ఔన్స్ కు 3950– 4000 డాలర్లకు చేరుకుంటుందని, అలాగే వెండి ఔన్స్ కు 49– 50 డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ ధరల వేగానికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డోవిష్ (తక్కువ వడ్డీ రేట్లు, వృద్ధికి ప్రాధాన్యం) వైఖరి, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, బలమైన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, భారతదేశ పండుగ, వివాహ సీజన్ల నుండి బలమైన డిమాండ్.వెండికి పారిశ్రామిక డిమాండ్ సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ర్యాలీకి మద్దతు ఇస్తోంది. సరఫరా పరిమితులు, రూపాయి విలువ తరుగుదల మరింత ఊపందుకుంటోంది.ఇదీ చదవండి: ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి -
లిస్టింగ్ బాటలో మరిన్ని కంపెనీలు
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 77 కంపెనీలు లిస్ట్కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్మెంట్, ఎల్జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది. రూ. 2,000 కోట్లపై కన్ను రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది. 1,500 కోట్ల సమీకరణ .. రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్ సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.జెరాయ్ ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్మెంట్ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఉన్నాయి. -
ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి
దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం పసిడి ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం కలిగింది. కానీ శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టాటా క్యాపిటల్ @ రూ.310–326
ముంబై: టాటా క్యాపిటల్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు రూ.310–326 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుంది. జూలైలో చేపట్టిన రైట్స్ ఇష్యూతో పోలిస్తే ఐపీఓ షేరు ధర 5 శాతం తక్కువేనని, విస్తృత స్థాయిలో భాగస్వామ్యంతో పాటు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ షేరుకు రూ.343 చొప్పున రూ.1,750 కోట్లు సమీకరించింది. అతి పెద్ద ఇష్యూ... ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మార్కెట్ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. ఇష్యూలో భాగంగా టాటా సన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) 3.58 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కంపెనీ 21 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేస్తోంది. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్కు 88.6%, ఐఎఫ్సీకి 1.8 శాతం వాటా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా నిలుస్తున్న టాటా క్యాపిటల్ లోన్ బుక్ రూ.2.3 లక్షల కోట్ల పైమాటే. ఇందులో 88 శాతం రుణాలు రిటైల్ ఖాతాదారులు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచి్చనవే కావడం గమనార్హం. 2023లో నవంబర్లో టాటా టెక్నాలజీస్ అరంగేట్రం తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మరో భారీ ఐపీఓ కానుంది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 223.86 పాయింట్లు లేదా 0.28 శాతం లాభంతో 81,207.17 వద్ద, నిఫ్టీ 57.95 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 24,894.25 వద్ద నిలిచాయి.ఓరియంట్ టెక్నాలజీస్, కేఐఓసిఎల్, ఏఏఏ టెక్నాలజీస్, అట్లాంటా, ఒరిస్సా మినరల్స్ డెవలప్మెంట్ కంపెనీ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. సెంటమ్ ఎలక్ట్రానిక్స్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దసరా డబుల్ ధమాకా.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు
దేశంలో భారీగా పెరుగుతూన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Gold price today) మరి కాస్త క్షీణించాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్ద ప్రారంభమయ్యాయి.బీఎస్ఈలో టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ డ్రాగ్స్గా నిలిచాయి. ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉండగా, మాక్స్ హెల్త్, ఐషర్ మోటార్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.మరోవైపు విస్తృత మార్కెట్లు పెరిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా వరుసగా 0.95 శాతం, 0.48 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి మరో కొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం సైతం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.1,100 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,21,000ను నమోదు చేసింది.వెండి ధర కిలోకి రూ.1,50,500 వద్ద ఫ్లాట్గా ట్రేడయ్యింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కావడం పసిడి ధరలపై ప్రభావం చూపించింది. అమెరికా లేబర్ మార్కెట్లో బలహీనత నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతానికి పైగా పెరిగి 3,895 డాలర్లకు చేరింది. -
స్టాక్ మార్కెట్పై కుటుంబాల ఆసక్తి
న్యూఢిల్లీ: దేశీయంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపట్ల కుటుంబాలలో ఆసక్తి కనిపిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన సర్వే పేర్కొంది. కుటుంబ ఆదాయాలలో 10 శాతం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబీకులలో 63 శాతం కనీసం ఒక మార్కెట్ ప్రొడక్ట్పై అవగాహన ఉన్నట్లు సెబీ ఇన్వెస్టర్ల సర్వే వెల్లడించింది. సెక్యూరిటీలలో పట్టణ ప్రాంతాల నుంచి 15 శాతం పార్టిసిపేషన్ కనిపించగా.. గ్రామీణ ప్రాంతాలలో 6 శాతమే పెట్టుబడులు నమోదయ్యాయి. రాష్ట్రాలలో 20.7 శాతం వాటాతో ఢిల్లీ ఆధిపత్యంవహించగా.. 15.4 శాతం కుటుంబాల పార్టిసిపేషన్తో గుజరాత్ తదుపరి ర్యాంకులో నిలిచింది. అయితే 36 శాతంమంది ఇన్వెస్టర్లకు మాత్రమే సెక్యూరిటీ మార్కెట్లపట్ల ఓమాదిరి అవగాహన ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీంతో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విస్తరించవలసిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడి రక్షణకే ఓటు సెబీ తాజా సర్వే ప్రకారం 80 శాతం కుటుంబీకులు అధిక రిటర్నులకంటే పెట్టుబడి పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి వివిధ వయసులవారు రిస్క్ తీసుకోవడంలో విముఖత చూపుతున్నట్లు సర్వే తెలియజేసింది. నిజానికి జెన్జెడ్ కుటుంబీకులలోనూ 79 శాతంమంది రిస్్కలకు వెనకాడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఫైనాన్షియల్ ప్రొడక్టులలో క్లిష్టత, అవగాహనాలేమి, విశ్వాసరాహిత్యం, నష్టాల భయం వంటి అంశాలు అధికశాతం మందిలో పెట్టుబడులకు అడ్డుతగులుతున్నట్లు వివరించింది. దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ)తోపాటు.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ తదితర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల సర్వే చేపట్టింది. సుమారు 400 పట్టణాలలోని 90,000 కుటుంబాలు, 1,000 గ్రామాలలో సర్వే నిర్వహించింది. -
మల్హోత్రా.. మరో‘సారీ’!
ముంబై: ఒకవైపు అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లతో ఎగుమతులకు ఏర్పడిన అవరోధాలు, హెచ్1బీ వీసా నిబంధనల కట్టడి.. మరోవైపు గతంలో చేపట్టిన రేట్ల తగ్గింపు ఫలితం పూర్తి స్థాయిలో కనిపించాల్సి ఉండడం, ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపు, రూపాయి విలువ పతనం నేపథ్యంలో ఆర్బీఐ వరుసగా రెండో విడత కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను గతంలో వేసిన 6.5% నుంచి 6.8 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం రేట్ల తగ్గింపు పరంగా వెసులుబాటు కలి్పంచినప్పటికీ.. దీనికంటే ముందు గతంలో తీసుకున్న చర్యల తాలూకూ ఫలితంపై పూర్తి స్థాయి స్పష్టత అవసరమని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ భేటీ తర్వాత మీడియాకు తెలిపారు. అమెరికా టారిఫ్ల నుంచి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైతే రానున్న నెలల్లో రేట్ల తగ్గింపుతో మద్దతుగా నిలుస్తామని సంకేతం ఇచ్చారు. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు సైతం రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు, వృద్ధికి విఘాతం ఉండకూడదన్నారు. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. వృద్ధి బలంగా..: ఎగుమతుల డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ.. వర్షాలు సమృద్ధిగా కురవడం, తక్కువ ద్రవ్యోల్బణం, గతంలో రెపో రేటు తగ్గింపు, జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ఏర్పడే సానుకూల ప్రయోజనంతో దేశ వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆగస్ట్ సమీక్షలో ఈ అంచనా 6.5 శాతంగా ఉంది. వాణిజ్యపరమైన అనిశ్చితుల నేపథ్యంలో క్యూ3 (అక్టోబర్–డిసెంబర్), ఆ తర్వాతి కాలానికి వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. 2025–26 క్యూ1లో (జూన్ త్రైమాసికం) జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) 7%, క్యూ3లో 6.4%, క్యూ4లో 6.2 శాతం చొప్పున ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అమెరికా విధించిన టారిఫ్లతో ఎగుమతులు మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఎగుమతిదారులకు అండ.. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతిదారులకు అండగా ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించింది. ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్’ (ఐఎఫ్ఎస్సీ)లోని ఫారిన్ కరెన్సీ అకౌంట్ల నుంచి నిధులను స్వదేశానికి బదిలీ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న నెల గడువును మూడు నెలలకు పొడిగించింది. వస్తు వాణిజ్య లావాదేవీలకు సంబంధించి చెల్లింపుల గడువును నాలుగు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇక చిన్న తరహా ఎగుమతి/దిగుమతిదారులకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే చర్యలను సైతం ప్రకటించింది. రూపాయి అంతర్జాతీయం అంతర్జాతీయంగా రూపాయి ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలను సైతం ఆర్బీఐ ప్రకటించింది. భూటాన్, నేపాల్, శ్రీలంక దేశ వాసులకు ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి మారకంలో రుణాల మంజూరుకు బ్యాంక్లను అనుమతించింది.ముఖ్యాంశాలు..→ రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించేందుకు ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రివర్స్ రెపో రేటు సైతం 3.35 శాతంగా కొనసాగుతుంది. → భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా రేట్లపై ఎటువంటి చర్యను అయినా చేపట్టేందుకు వీలుగా తటస్థ విధానాన్నే కొనసాగించింది. → ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఆర్బీఐ 1 శాతం రెపో రేటును తగ్గించింది. ఆగస్ట్ సమీక్ష నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. → 2025–26 సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతానికి తగ్గించింది. 4 శాతం నిర్దేశిత లక్ష్యం కంటే ఇది తక్కువే. లోగడ ఇది 3.1 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా. ఆగస్ట్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా ఉంది. → సేవల ఎగుమతులు, విదేశాల నుంచి స్వదేశానికి నిధుల బదిలీ (రెమిటెన్స్లు) దన్నుతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోనే ఉంటుంది.→ ఆర్బీఐ తదుపరి సమీక్ష సమీక్ష డిసెంబర్ 3–5 వరకు జరుగుతుంది. -
స్టాక్ మార్కెట్లకు లాభాల కళ.. వీడిన వరుస నష్టాలు
దేశీయ స్టాక్మార్కెట్లను వరుస నష్టాలు వీడాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 5.5 శాతం వద్ద ఉంచుతూ 'తటస్థ' వైఖరిని కొనసాగించడంతో భారత ఈక్విటీలు ఎనిమిది రోజుల నష్టాల పరంపరను విచ్ఛిన్నం చేశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 715.7 పాయింట్లు లేదా 0.9 శాతం పెరిగి 80,983.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.92 శాతం లేదా 225.2 పాయింట్లు పెరిగి 24,836.3 స్థాయిలకు చేరుకుంది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.1 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.89 శాతం పెరిగాయి.నిఫ్టీ బ్యాంక్, ఆటో, రియల్టీ రంగాలు వరుసగా 1.3 శాతం, 0.85 శాతం, 1.1 శాతం పెరిగాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.37 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 4 శాతం వరకు పెరిగాయి.సెన్సెక్స్ లో టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్స్ గా ఉండగా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ అధికంగా నష్టోయిన వాటిలో ఉన్నాయి. -
ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..!
రాయవరం: ‘ఏవండీ దసరా పండుగకు నెక్లెస్ కొంటారా..’ అంటూ గారాలు పోతున్న భార్యల వైపు భర్తలు బేల చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగారం ధర చూస్తే బేర్మనే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల మార్కుకు చేరుకుంది. బంగారం ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తున్నాయి. కదం తొక్కుతున్న కాంచనానికి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పుత్తడితో పాటుగా తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా వెండి ధరలు కూడా విర్రవీగుతున్నాయి. స్వర్ణం వైపు చూడాలంటేనే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్ తిరిగి ప్రారంభం కావడంతో వివాహాలు నిర్వహించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే భయం భయంగా షాపుల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఇంతింతై వటుడింతై అన్నట్లుగా...పసిడి, వెండి ధరలు ఇంతింతై వటుడింతై అన్న చందంగా పెరుగుతున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. జనవరి నెలలో 10 గ్రాముల బంగారం రూ.80 వేల వరకు పలకగా, జూలై నాటికి రూ.లక్షకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతూ ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ.1.20 వేలకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలలో సుమారు 10 గ్రాములకు రూ.20 వేల వరకు పెరిగింది. ఇదిలా ఉంటే వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కేజీ వెండి ధర రూ.92 వేలు పలుకగా, జూన్లో రూ.1.10 లక్షలు, జూలైలో రూ.1.11 లక్షలు, ఆగస్టులో రూ.1.11 లక్షలు ఉన్న కేజీ వెండి ధర నేడు రూ.1.50 లక్షలకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి అదే తరహాలో లాభాలు వచ్చాయి. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పరుగులు తీస్తూనే ఉంది. త్వరలోనే కేజీ రూ.2 లక్షలకు చేరుతుందన్న ఊహాగానాలున్నాయి.మదుపరుల ముందుచూపే కారణమా?పసిడి, వెండి ధరలు పెరుగుదలకు బులియన్ మార్కెట్ విశ్లేషకులు పలు రకాల కారణాలు పేర్కొంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్, గాజా మధ్య జరుగుతున్న యుద్ధంతో పాటుగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో పసిడి ధర రోజు రోజుకు పరుగులు తీస్తోంది. దీనికితోడు బంగారంపై పెట్టుబడి సురక్షితంగా భావిస్తున్న మదుపరులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణంగా వర్తకులు భావిస్తున్నారు.జిల్లాలో పరిస్థితి ఇదీ..కరోనా తర్వాత బంగారం వ్యాపారం బాగా తగ్గిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. అంతకుముందు వారానికి ఆరు రోజులు వ్యాపారం సాగగా, ఇప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే వ్యాపారం సాగుతున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. పెద్ద షాపుల్లో రోజుకు 500 గ్రాముల వరకు అమ్మకాలు జరుగుతుండగా, చిన్న షాపుల్లో 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్నా, పెద్దా కలిపి 2,500 వరకు బంగారం విక్రయాల షాపులున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనాకు ముందు రోజుకు 20 కేజీల చొప్పున బంగారం అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 15 నుంచి 18 కేజీల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. సీజన్ బట్టి ఈ అమ్మకాలు అటూఇటూగా ఉంటాయి. బంగారంతో పాటుగా వెండి అమ్మకాలు కూడా తగ్గాయి. ఆరు నెలల క్రితం వెండి కిలో రూ.50వేలు ఉండగా, ఆరు నెలల కాలంలో రూ.1.50 లక్షలకు చేరింది. చైనా, జపాన్ వంటి దేశాల్లో వెండిని ఎలక్ట్రానిక్స్, సాంకేతిక అవసరాలకు ఉపయోగించడం, ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడంతో బంగారం, వెండి ధరలు ఊహించని పెరుగుదల కన్పించి ఆల్టైమ్ రికార్డుకు వాటి ధరలు చేరుకున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.లాభాలు కళ్ల చూస్తున్న బడాబాబులుబంగారం ధర పెరగడంతో బడా బాబులు లాభాలు కళ్ల జూస్తున్నారు. ధర పెరుగుతుందన్న ముందుచూపుతో పలువురు మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. వడ్డీ వ్యాపారం చేసే వారు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో 100 గ్రాముల వంతున బిస్కెట్లు కొన్నారు. మరికొందరు 50 నుంచి 70 కాసుల మధ్య వడ్డాణం వంటి వస్తువుల్ని తయారు చేయించుకున్నారు. ప్రస్తుతం ధర రూ.లక్ష దాటడంతో వీరందరిలో జోష్ నెలకొంది. పెట్టిన పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం వరకు లాభాలను చూశారు. -
అంతులేకుండా పెరుగుతున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు పెరిగి 24,691కు చేరింది. సెన్సెక్స్(Sensex) 251 పాయింట్లు పుంజుకొని 80,503 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లిస్టింగ్ బాటలో 7 కంపెనీలు
కొద్ది రోజులుగా దుమ్మురేపుతున్న ప్రైమరీ మార్కెట్లు భవిష్యత్లో మరింత దూకుడు ప్రదర్శించనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్వర్క్ ఇండియా ఐపీవోలు వచ్చే వారం ప్రారంభం కానుండగా.. తాజాగా 7 కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. ఇందుకు అనుగుణంగా సెబీకి దరఖాస్తు చేశాయి. వివరాలు చూద్దాం..క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఏడు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హోటల్ పోలో టవర్స్, బాంబే కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్స్, ఏపీపీఎల్ కంటెయినర్స్, బాన్బ్లాక్ టెక్నాలజీస్, ధరీవాల్ బిల్డ్టెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, కుసుమార్గ్ చేరాయి. ఐపీవోలో భాగంగా స్టీల్ ప్రాసెసింగ్ సెంటర్లను నిర్వహించే బాంబే కోటెడ్ 1.5 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. స్టీల్ క్యాయిళ్ల ప్రాసెసింగ్లో ప్రత్యేకతను కలిగిన కంపెనీ ప్రస్తుతం 3,50,411 టన్నుల వార్షిక సామర్థ్యాన్ని అందుకుంది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 1,056 కోట్లను తాకగా, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఆతిథ్య రంగ చైన్ఐపీవోలో భాగంగా మధ్యస్థాయి ఆతిథ్య రంగ కంపెనీ హోటల్ పోలో టవర్స్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 71.2 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను విస్తరణ, ప్రస్తుత ప్రాపరీ్టల ఆధునీకరణ, రుణ చెల్లింపులు తదితర అవసరాలకు వెచి్చంచనుంది. కంపెనీ పోలో, మ్యాక్స్ బ్రాండ్లతో ప్రధానంగా దేశ ఉత్తర, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో మధ్యస్థాయి హోటళ్లు, రిసార్టులను నిర్వహిస్తోంది. త్రిపుర, కోల్కతా, మేఘాలయ, షిల్లాంగ్, ప్రయాగ్రాజ్, జబల్పూర్ తదితర ప్రాంతాలలో 425 గదులతో హోటళ్లను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 118 కోట్లను తాకగా, రూ. 22 కోట్ల నికర లాభం ఆర్జించింది.కంటెయినర్ల తయారీగుజరాత్లోని భావనగర్ కేంద్రంగా ఏర్పాటైన ఏపీపీఎల్ కంటెయినర్స్ ఐపీవోలో భాగంగా 12.5 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు మరో 25.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలతోపాటు.. రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2021లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా కంటెయినర్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 69 కోట్లను తాకగా, రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది.సాస్ సొల్యూషన్స్బ్లాక్చెయిన్, ఐవోటీ, డేటా సైన్స్ ఆధారంగా సాస్ సొల్యూషన్లు అందించే బాన్బ్లాక్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా రూ. 230 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 2020లో ఏర్పాటైన చెన్నై కంపెనీ ప్రమోటర్ బాన్బ్లాక్ ఇంక్ 3 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 136 కోట్లు ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్లాట్ఫామ్స్కు, రూ. 13 కోట్లు ల్యాప్టాప్ల కొనుగోళ్లకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది. కంపెనీ ఏఐ ఆధారిత ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సరీ్వసులు, సాఫ్ట్వేర్ సొల్యూషన్లలో వేగంగా విస్తరిస్తోంది.రూ. 950 కోట్లకు రెడీఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ ధరీవాల్ బిల్డ్టెక్ ఐపీవోలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 203 కోట్లు ఎక్విప్మెంట్ కొనుగోలుకి, రూ. 174 కోట్లు, రూ. 300 కోట్లు సంస్థతోపాటు అనుబంధ కంపెనీ రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా రోడ్లు, హైవేలు, బ్రిడ్జిలు, సొరంగాలు తదితర నిర్మాణాలు చేపడుతోంది. గతేడాది(2024–25) ఆదాయం రూ. 1,153 కోట్లను తాకగా, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.రికవరీ, రీసైక్లింగ్ఇంధన స్టోరేజీ, నాన్ఫెర్రస్ స్కాప్ర్ నుంచి రికవరీ, రీసైక్లింగ్ చేపట్టే ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు మరో 3.76 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 22 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. లెడ్ అల్లాయ్స్, లెడ్ టిన్, లెడ్ సిల్వలర్ తదితర ప్రొడక్టులను రూపొందిస్తోంది. కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో తయారీ ప్లాంటు ఉంది.రూ. 650 కోట్లపై కన్ను ఇంజనీర్డ్ ఫ్యాబ్రిక్ తయారీ సంస్థ కుసుమార్గ్ ఐపీఓ ద్వారా రూ.650 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. 1990లో ఏర్పాటైన కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్, పారిశ్రామిక, ఆటోమోటివ్ రంగాల కోసం ఫ్యాబ్రిక్స్ దస్తులు తయారు చేస్తుంది. కంపెనీకి గుజరాత్లో ఆరు మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో పాటు ఉత్తరప్రదేశ్లో ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది. ఆర్థిక సంవత్సరం 2025 గానూ రూ.779 కోట్ల ఆదాయాన్ని, రూ.112 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం స్వల్ప లాభాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97.32 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో.. 80,267.62 వద్ద, నిఫ్టీ 23.80 పాయింట్లు లేదా 0.097 శాతం నష్టంతో 24,611.10 వద్ద నిలిచాయి.ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, నకోడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఉమియా బిల్డ్కాన్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, భారత్ గేర్స్, వండర్ ఎలక్ట్రికల్స్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
22 కాదు.. 24 కాదు.. 18 వైపే మొగ్గు!
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు వైఖరిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా భారతీయులు 22 క్యారెట్ల (ఆభరణాలు), 24 క్యారెట్ల (బార్లు, కాయిన్స్) బంగారాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపేవారు. అయితే ధరల పెరుగుదలతో ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల్లో కొనుగోలు నిర్ణయాలు ప్రభావితమవుతున్నాయి.కొనుగోలు వైఖరిలో మార్పులు18 క్యారెట్ వైపు మొగ్గుబంగారం అధిక ధరల కారణంగా కొంతమంది వినియోగదారులు 22 క్యారెట్ల బంగారానికి బదులుగా తక్కువ క్యారెట్ (ఉదాహరణకు 18 క్యారెట్) ఆభరణాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. 18K బంగారంలో స్వచ్ఛత తక్కువగా (75% బంగారం) ఉన్నప్పటికీ దాని ధర తక్కువగా ఉంటుంది. దీనితో అత్యవసరాలకు, శుభకార్యాలకు ముందుగా కేటాయించిన బడ్జెట్లో ఆభరణాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.ఆభరణాల డిమాండ్లో స్వల్ప తగ్గుదలపెళ్లిళ్లు, పండుగల సీజన్లో డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరల వల్ల ఆభరణాల మొత్తం డిమాండ్లో స్వల్ప మందగమనం కనిపిస్తోంది. వినియోగదారులు ఆభరణాల బరువును తగ్గించుకోవడం లేదా తేలికపాటి, రోజువారీ వినియోగానికి సరిపోయే డిజైన్లను ఎంచుకోవడం చేస్తున్నారు.బంగారంపై మోజు ఎందుకంటే..బంగారం రికార్డు ధరలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల భౌతిక బంగారం (బార్లు, కాయిన్స్) రూపంలో పెట్టుబడులు పెరిగాయి. చాలామంది భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన ఆస్తి (సేఫ్ హెవెన్ అసెట్)గా భావిస్తారు. కొంతమంది భౌతిక బంగారం కొనుగోలు, నిల్వ సమస్యలు, అధిక ధరలు, మేకింగ్ ఛార్జీలను నివారించడానికి గోల్డ్ ఈటీఎఫ్లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడి సాధనాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరల పెరుగుదల కేవలం దేశీయ డిమాండ్ పైనే కాకుండా, ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావించే అంతర్జాతీయ పెట్టుబడిదారులు మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు ఈ రంగంలో పెట్టుబడులు పెంచుతారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions)ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, రాజకీయ అస్థిరత పెట్టుబడిదారుల్లో అభద్రతా భావాన్ని పెంచుతాయి. ఈ అనిశ్చితి కారణంగా వారు స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం వైపు మళ్లుతారు.ద్రవ్యోల్బణం (Inflation) భయాలుద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుంది. అయితే అలాంటి సమయంలో బంగారం విలువ అంతర్జాతీయంగా నిలకడగా ఉండటమే కాకుండా పెరుగుతుంది కూడా. అందుకే ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు పెట్టుబడిదారులు తమ కొనుగోలు శక్తిని కాపాడుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తారు.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లుప్రపంచవ్యాప్తంగా చైనా, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు (Central Banks) ఇటీవల తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. ఇవి మార్కెట్లో భారీ కొనుగోలుదారులుగా ఉండటం వల్ల పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలుయూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నప్పుడు డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ బలహీనపడటం వల్ల ఇతర కరెన్సీల వారికి బంగారం చౌకగా లభిస్తుంది. ఫలితంగా డిమాండ్ పెరుగుతుంది.గ్లోబల్ ఆర్థిక మాంద్యం భయాలుప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం లేదా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందనే అంచనాలు పెట్టుబడిదారులను రిస్క్ లేని బంగారం వంటి ఆస్తుల వైపు మళ్లేలా చేస్తాయి.ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం! -
బిగ్షాక్: పండగపూట దారుణంగా పెరిగిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు దారుణంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:31 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్(Sensex) 72 పాయింట్లు పుంజుకొని 80,443 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ను వీడని నష్టాలు
ముంబై: బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 80,365 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 24,635 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది వరుసగా ఏడో రోజూ నష్టాల ముగింపు.ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా లాభ, నష్టాల మధ్య ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 80,249 వద్ద కనిష్టాన్ని, 80,851 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 49 పాయింట్లు పతనమై 24,606 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆసియాలో జపాన్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% వరకు పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.33%, ఇండ్రస్టియల్స్ 0.32%, ఆటో 0.12%, క్యాపిటల్ గూడ్స్ 0.09 శాతం నష్టపోయాయి. మరోవైపు ఆయిల్అండ్గ్యాస్ 2%, ఇంధన 1.10%, రియల్టీ 1%, విద్యుత్ 0.46%, సర్విసెస్ 0.41%, మెటల్ 0.39% లాభపడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్సు 0.34% పెరిగింది. స్మాల్ క్యాప్ సూచీ 0.17% నష్టపోయింది. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.75 వద్ద స్థిరపడింది.⇒ అట్లాంటా ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.754)తో పోలిస్తే బీఎస్ఈలో 14% ప్రీమియంతో రూ.858 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 14.50% పెరిగి రూ.864 గరిష్టాన్ని తాకింది. చివరికి 9% లాభంతో రూ.823 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.6,331 కోట్లుగా నమోదైంది. ⇒ గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.322)తో పోలిస్తే 8.38% డిస్కౌంటుతో రూ.295 వద్ద లిస్టయ్యింది. చివరికి 9% నష్టంతో రూ.294 వద్ద ముగిసింది. -
వెండి @ రూ. 1,50,000
న్యూఢిల్లీ: వెండి ధర తారాజువ్వలా దూసుకుపోతోంది. ఢిల్లీ మార్కెట్లో సోమవారం కిలోకి మొదటిసారి రూ.1.5 లక్షలు పలికింది. ఒకే రోజు రూ.7,000 లాభపడింది. మరోవైపు పసి డి ధర సైతం (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ. 1,500 పెరిగి రూ.1,19,500 వద్ద సరికొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ ధర (స్పాట్ మార్కెట్) 2 శాతం పెరిగి 47.18 డాలర్లకు చేరింది.కామెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 46 డాలర్లు పెరిగి 3,855 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. విదేశీ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీ మార్కెట్లో వెండి, బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయిలకు చేరినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ‘‘స్పాట్ గోల్డ్ ధరలు వరుసగా ఆరో వారంలో నూ కొత్త రికార్డులకు చేరా యి. వాణిజ్య అనిశ్చితులకు తోడు ఫెడ్ రేటు కోత అంచనాలు, ఈటీఎఫ్ల్లోకి బలమైన పెట్టుబడుల రాక ఇందుకు మద్దుతుగా నిలిచాయి’’అని మిరే అస్సెట్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ చెప్పారు. వెండి 67 శాతం రాబడి.. ఈ ఏడాది వెండి, పసిడి ధరల పెరుగుదల ఇన్వెస్టర్లు, విశ్లేషకుల అంచనాలకు మించి ఉండడం గమనార్హం. వెండి కిలోకి నికరంగా రూ.60,300 పెరిగింది. 2024 డిసెంబర్ చివరికి ఉన్న రూ.89,700 నుంచి చూస్తే 67% రాబడిని ఇచ్చింది. పసిడి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 10 గ్రాములకు రూ.40,550 పెరిగింది. గత డిసెంబర్ చివరికి ఉన్న రూ.78,950 నుంచి చూస్తే 51 శాతం ర్యాలీ చేసింది. -
'ఇందులో మీ పెట్టుబడి ఐదు రెట్లు పెరుగుతుంది'
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఒక కేజీ సిల్వర్ రేటు ఈ రోజు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000 వద్దకు చేరింది. ఈ సమయంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. బిట్కాయిన్, గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను పొందవచ్చని, పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా వెండిపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా లాభాలను పొందవచ్చని వెల్లడించారు.''నా దగ్గర 100 డాలర్లు ఉంటే.. వెండి నాణేలను (Silver Coins) కొనుగోలు చేస్తాను. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. మీరు 100 డాలర్లు పెట్టుబడి పెడితే.. ఏడాదికి అదే 500 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. కాబట్టి నేను మరిన్ని వెండి నాణేలను కొనుగోలు చేస్తాను. మీరు కూడా వెండిపై ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ షేర్ చేశారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక2025 సెప్టెంబర్ 1వ తేదీ ఒక కేజీ వెండి ధర రూ. 1,36,000 వద్ద ఉండేది. ఈ రేటు ఇప్పుడు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000కు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఒక్క నెలరోజుల వ్యవధిలోనే కేజీ సిల్వర్ రేటు రూ. 24,000 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.IF I HAD $100 WHAT WOULD I INVEST IN?I WOULD BUY MORE SILVER COINS.Silver has been manipulated for years.In September 2025 Silver is about to explode. I predict your $100 in silver will be $500 in a year.I am buying more tomorrow.Please do not miss silvers explosion.…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 28, 2025 -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 61.52 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 80,364.94 వద్ద, నిఫ్టీ 19.80 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో.. 24,634.90 వద్ద నిలిచాయి.వాస్కాన్ ఇంజనీర్స్, వోకార్డ్, కొఠారి ప్రొడక్ట్స్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. కృష్ణ ఫోస్చెమ్, గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, వండర్లా హాలిడేస్, కెంప్లాస్ట్ సన్మార్, డీసీఎక్స్ సిస్టమ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరలు: దూసుకెళ్లిన పసిడి.. ఈరోజు ఏకంగా..
దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు (Today Gold Rate) ఆదివారంతో పోలిస్తే సోమవారం మరింత ఎగిశాయి. వెండి ధరలూ (Today Silver Rate) పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
24,700 వద్దకు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 24,709కు చేరింది. సెన్సెక్స్(Sensex) 166 పాయింట్లు పుంజుకొని 80,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్బీఐ పాలసీపై దృష్టి
దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా యూఎస్ టారిఫ్లు, వీటిపై భారత్తో చర్చలు తదితర అంశాలు ఈ వారం ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయదశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం(2న) మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం.. హెచ్1బీ వీసా ఫీజు పెంపుతోపాటు.. గత వారం ఫార్మా ప్రొడక్టులపై తాజాగా టారిఫ్లు విధించినప్పటికీ యూఎస్తో భారత్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారత్ దిగుమతులపై విధించిన అదనపు టారిఫ్ల తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడ్డాయి. అయితే ఈ వారం ఇతర పలు అంశాల ఆధారంగా మార్కెట్లు స్పందించనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నేడు(29న) ఆర్బీఐ పరిపతి సమావేశం ప్రారంభంకానుంది. బుధవారం( అక్టోబర్ 1న) వడ్డీ రేట్లపై నిర్ణయాలు వెలువడనున్నాయి. ఆగస్ట్లో నిర్వహించిన సమావేశంలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.5 శాతంవద్దే కొనసాగించేందుకు ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) నిర్ణయించింది. జూన్లో 0.5 శాతం రేపోను తగ్గించినప్పటికీ ఈసారి యథాతథ పాలసీ అమలు లేదా 0.25 శాతం కోతకు వీలున్నట్లు ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎఫ్అండ్వో ముగింపు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ గడువు ముగింపును ప్రతీ నెల చివరి గురువారం నుంచి మంగళవారానికి మార్చడంతో 30న సెప్టెంబర్ సిరీస్ ముగియనుంది. దీంతో మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క బీఎస్ఈ సైతం మంగళవారం నుంచి గురువారానికి ఎఫ్అండ్వో ముగింపు గడువును సవరించిన సంగతి తెలిసిందే. యూఎస్ టారిఫ్లు, వీటిపై చర్చలు, ఆర్బీఐ నిర్ణయాలు తదితర అంశాలన్నీ సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. మరోపక్క ఆటో, వైట్గూడ్స్ తదితరాలపై పండుగల అమ్మకాల ప్రభావం, ఐఐపీ గణాంకాలపై సైతం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. యాక్సెంచర్ దెబ్బ ఓపక్క ఐటీ దిగ్గజం యాక్సెంచర్ నిరుత్సాహకర ఔట్లుక్ను ప్రకటించగా, మరోవైపు హెచ్1బీ వీసా వ్యయభరితంకానుండటంతో దేశీ ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశమున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ అభిప్రాయపడ్డారు. యూఎస్ తాజా టారిఫ్లు సెంటిమెంటును దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. లార్జ్క్యాప్స్తో పోలిస్తే గత వారం మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా క్షీణించినట్లు తెలియజేశారు. ఈ ప్రభావం మార్కెట్లపై మరోసారి కనిపించవచ్చని అంచనా వేశారు. ఇతర అంశాలు ఆగస్ట్లో ఐఐపీ గణాంకాలు నేడు వెలువడనున్నాయి. జూలైలో పారిశ్రామికోత్పత్తి 3.5 శాతం పుంజుకుంది. అంతకుముందు నెలలో నమోదైన 1.5 శాతంతో పోలిస్తే భారీగా బలపడింది. సెపె్టంబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ అక్టోబర్ 1న విడుదలకానుంది. ఆగస్ట్లో ఈ ఇండెక్స్ 59.3గా నమోదైంది. విదేశీ అంశాలలో చైనా తయారీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల ద్రవ్యోల్బణం, ఆ్రస్టేలియా వడ్డీ రేట్ల సమీక్షసహా సెపె్టంబర్లో యూఎస్ నిరుద్యోగ రేటు గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ అంశాలకూ ఈ వారం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత వారమిలా వరుసగా ఆరు రోజులపాటు మార్కెట్లు క్షీణ పథంలో సాగడంతో సెంటిమెంటు బలహీనపడింది. దీంతో గత వారం సెన్సెక్స్ 2,200 పాయింట్లు(2.66 శాతం) పతనమై 80,426 వద్ద ముగిసింది. నిఫ్టీ 672 పాయింట్లు(2.65 శాతం) క్షీణించి 24,655 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 2 శాతం చొప్పున నీరసించాయి.రూపాయి క్షీణతవిదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) అమ్మకాలు, డాలరుతో మారకంలో రూపాయి భారీ క్షీణత, యూఎస్ వాణిజ్య టారిఫ్ల కారణంగా గత వారం మార్కెట్లు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతుండటంతో రక్షణాత్మక పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పుంజుకోగా.. ఈక్విటీలు క్షీణిస్తున్నట్లు తెలియజేశారు. టారిఫ్లపై యూఎస్తో ప్రభుత్వ చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు వంటి అంశాలు స్వల్ప కాలానికి మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అక్కడ బంగారం ధర రూ.2.23 లక్షలు..!
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 3,759 డాలర్ వద్ద ట్రేడవుతోంది.భారత్కు సరిహద్దున ఉన్న నేపాల్లోనూ బంగారానికి మంచి డిమాండే ఉంటుంది. దీంతో ఇక్కడ బంగారం ధర ప్రస్తుతం టోలాకు (11.66 గ్రాములు) రూ.2,23,200 (నేపాలీ రూపాయలు) లకు చేరింది. భారత రూపాయితో పోలిస్తే నేపాలీ రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. ఒక్క భారత రూపాయి 1.6 నేపాలీ రూపాయలకు సమానం.ఇక భారత్ విషయానికి వస్తే బంగారం ధరలు (Gold Rate) గత వారం రోజులుగా స్థిరమైన పెరుగుదలను చూశాయి. కాలానుగుణ డిమాండ్, స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా విస్తృత జాతీయ, ప్రపంచ ధోరణికి అనుగుణంగా పసిడి ధరలు ఎగిశాయి.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ .11,548 వద్ద ఉంది. ఇది వారం క్రితం ఉన్న రూ .11,215 తో పోలిస్తే రూ .333 పెరిగింది. అంటే తులానికి (10 గ్రాములు) రూ.3300 పెరిగి రూ.1,15,480 కి చేరింది.మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.305 పెరిగి రూ.10,280 నుంచి రూ.10,585కు చేరుకుంది. వారం రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ.3050 పెరిగి రూ.1,05,850 లకు ఎగిసింది. -
కొత్త పంథాలో ‘డబ్బా ట్రేడింగ్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆహార ఉత్పత్తులు, బంగారం, వెండి, ముడిచమురు తదితరాలకు సంబంధించిన కమోడిటీ ట్రేడింగ్కు సమాంతరంగా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతూ అక్రమార్కులు సాగించే ‘డబ్బా ట్రేడింగ్’ (Dabba trading ) ఇప్పుడు కొత్త పంథాలో సాగుతున్నట్లు నిఘా, ఆదాయపు పన్ను శాఖ వర్గాలు గుర్తించాయి. హవాలా, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగే ఈ అక్రమ వ్యవహారాల వెనుక మాఫియా హస్తం ఉన్నట్లూ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.క్రిప్టోతో పాటు హవాలా, నగదు రూపంలో లావాదేవీలు జరుగుతుండటంతో పెద్ద మొత్తంలో నల్లధనం మార్పిడి జరుగుతున్నట్లు తేల్చాయి. ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్న ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచాల్సిందిగా నిఘా, పోలీసు వర్గాలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించి ఇటీవల నగరంలోని బంజారాహిల్స్, అబిడ్స్, కళాసీగూడల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.అధికారికంగా షేర్ల క్రయవిక్రయాలు నిర్వహించడానికి స్టాక్ ఎక్సేంజ్లు ఉంటాయి. ఇదే రకంగా కమోడిటీస్కు సంబంధించిన లావాదేవీలు నెరపడానికి ప్రత్యేక ఎక్సేంజ్ వంటి వ్యవస్థ ఉంది. వీటిలో జరిగే లావాదేవీలన్నీ పాదర్శికంగా, ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి సాగుతుంటాయి. ప్రతి క్రయవిక్రయం పైనా ప్రభుత్వానికి నిర్దేశిత శాతం పన్ను కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సమాంతరంగా లావాదేవీలను అధికారికంగా ఎక్కడా నమోదు చేయకుండా నిర్వహించే లావాదేవీలనే డబ్బా ట్రేడింగ్ అంటారు.ప్రస్తుతం బంగారం, వెండికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే ఈ డబ్బా ట్రేడింగ్ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృతంగా జరిగే ఈ వ్యవహారాలు అటు షేర్ మార్కెట్లోనూ, ఇటు కమోడిటీ మార్కెట్లోనూ జోరుగా సాగుతున్నాయి. లావాదేవీల రుసుం మిగుల్చుకోవడానికి నిర్వాహకులు, పన్ను భారం తప్పించుకోవడంతో పాటు నల్లధనంతో కూడిన లావాదేవీలను నెరపడానికి వినియోగదారులు వీటిని ప్రోత్సహిస్తున్నారు.కమోడిటీస్ డబ్బా ట్రేడింగ్లో చక్కెర, ముడిచమురు, వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వెండి వంటి వస్తువులను ధర తక్కువగా ఉన్నప్పుడు కొని, డిమాండ్ వచ్చేదాకా వేచి ఉండి విక్రయిస్తుంటారు. సాధారణంగా షేర్లు, కమోడిటీస్కు సంబంధించిన క్రయ విక్రయాలన్నీ పక్కా పత్రాలతో కంప్యూటర్ల ఆధారంగా ఆన్లైన్లో జరుగుతుంటాయి. అతి తక్కువ సందర్భాల్లోనే మాత్రమే వాస్తవంగా వస్తుమార్పిడి జరుగుతుంది.డబ్బా ట్రేడింగ్ మాత్రం బ్యాంకు లావాదేవీలు, డీ మ్యాట్ అకౌంట్లతో సంబంధం లేకుండా పూర్తి ఆఫ్లైన్లో జరిగిపోతుంది. ఏళ్లుగా హవాలా మార్గంలో సాగుతుండగా... ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ రూపంలోనూ జరుగుతున్నట్లు తేలింది. ఆదాయం భారీగా ఉండటంతో మాఫియా శక్తులు డబ్బా ట్రేడింగ్లో అడుగుపెట్టాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్, జార్జియాల్లోనూ ఈ డబ్బా ట్రేడింగ్ నెట్వర్క్ నడుస్తోందని అధికారులు గుర్తించారు.గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్లతో పాటు మహారాష్ట్రలోని ముంబైల్లో మాఫియాలతో సంబంధాలున్న వ్యక్తులు వ్యవస్థీకృతంగా ఈ డబ్బా ట్రేడింగ్, హవాలా రూపంలో నగదు మారి్పడి నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరహా ట్రేడింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులు దేశ వ్యాప్తంగా ఏజెంట్లు, సబ్–ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హవాలా రాకెట్లు సైతం వీరి చేతుల్లోనే ఉండటంతో చిన్న చిన్న స్లిప్పులు, కొన్ని కరెన్సీ నెంబర్లను కోడ్వర్డ్స్గా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ద్రవ్య మార్పిడి చేసేస్తున్నారు.హవాలా లింకులు ఉండటం కూడా మాఫియా హస్తానికి సంబంధించిన అనుమానాల్ని బలపరుస్తున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో అప్రమత్తమైన నిఘా, పోలీసు అధికారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు ట్రేడింగ్ లావాదేవీలు జరిగే ప్రాంతాలపై డేగకన్ను వేశారు. -
పసిడి మరింత పైకి.. వామ్మో వెండి ధర వింటే..
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజూ ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారంతో పోలిస్తే శనివారం మరింత పెరిగాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) అయితే రికార్డుల మోత మోగించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వెండి.. రికార్డుల మోత!
వెండి ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.1,900 పెరిగి రూ.1,41,900 స్థాయికి చేరింది. ఇది మరో నూతన గరిష్ట స్థాయి కావడం గమనార్హం. పండుగల సీజన్ నేపథ్యంలో స్టాకిస్టుల నుంచి డిమాండ్ కనిపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. భౌతిక మార్కెట్లో పెట్టుబడులకు బలమైన డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. గురువారం ఢిల్లీ మార్కెట్లో వెండి రూ.1,40,000 వద్ద ముగిసింది.మరోవైపు పసిడి 20 గ్రాములకు రూ.330 లాభపడి 1,17,700కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ఔన్స్కు పెద్దగా మార్పు లేకుండా 3,745 డాలర్ల వద్ద, పసిడి ఔన్స్కు 0.35 శాతం తగ్గి 45 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ పండుగల కొనుగోళ్లకు తోడు, దేశీ డిమాండ్ స్థిరంగా కొనసాగడం ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ -
'ఉద్యోగ భద్రత ఒక జోక్': రాబర్ట్ కియోసాకి
ఎప్పుడూ బిట్కాయిన్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి', ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది ఒక జోక్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రభుత్వం మూతపడిందా?, ఉద్యోగాల తొలగింపు ఉంటుందా?, మీరు ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారా?, ఈ మెసేజ్ అర్థమైందా? అంటూనే.. ఉద్యోగ భద్రత ఒక జోక్ అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఉద్యోగిగా కాకుండా వ్యవస్థాపకుడిగా మారడం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.మార్కెట్లో అనుకోని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. 1976 నుంచి అమెరికా వివిధ స్థాయిలలో 22 షట్డౌన్లను ఎదుర్కొంది. 2018లో 34 రోజులు మార్కెట్ అత్యల్ప స్థాయిలో కొనసాగింది. ఆ తర్వాత స్టాక్లు, బిట్కాయిన్ రెండూ కోలుకోవడం ప్రారంభించాయి.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికచరిత్ర ప్రకారం.. షట్డౌన్లు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. సగటున 2-4 వారాల పాటు ఉంటాయి. ఎలాంటి సమయంలో అయినా.. బిట్కాయిన్ బలంగా ఉంటుంది. గత సంవత్సరం మార్చిలో పరిస్థితులు కొంచెం అనిశ్చితంగా కనిపించినప్పుడు, గడువుకు ముందు వారంలో బిట్కాయిన్ 16% పెరిగి 62,700 డాలర్ల నుంచి 73600 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం దీని విలువ ఊహకందని రీతిలో భారీగా పెరిగింది.సొంతంగా వ్యాపారాన్ని ప్రారభించడం లేదా బిట్కాయిన్ వంటివాటిలో పెట్టుబడి వంటివి మీకు ఆర్ధిక స్వేచ్ఛను ఇస్తుందని కియోసాకి సందేశం చెబుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.GOVERNMENT SHUT DOWN? MASS FIRINGS?ARE YOU IN LINE TO BE FIRED?Got the message?Job security is a joke.May be time to consider being an entrepreneur….not an employee.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) September 25, 2025 -
స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్లు..
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్లను అధిగమించింది. గత 8 నెలల్లోనే కోటిమంది జత కలిసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. కాగా.. ప్రతీ నలుగురిలో ఒకరు మహిళా ఇన్వెస్టర్ అని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్లను దాటింది.నిజానికి ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభమైన 14ఏళ్ల తదుపరి ఇన్వెస్టర్ల సంఖ్య కోటికి చేరింది. తదుపరి కోటిమంది ఏడేళ్లలో జత కలవగా.. ఆపై మూడున్నరేళ్లలోనే ఈ సంఖ్యకు మరో కోటి జమయ్యింది. ఈ బాటలో ఆపై.. ఏడాదికి అటూఇటుగా మరో కోటిమంది జత కలిసినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. వెరసి ఎన్ఎస్ఈ ఆవిర్భవించిన 25ఏళ్లకు అంటే 2021 మార్చికల్లా ఇన్వెస్టర్ల (Stock market investors) సంఖ్య 4 కోట్ల మైలురాయిని తాకింది. ఆపై వేగం పెరిగి 6–7 నెలల్లోనే మరో కోటి మంది ఇన్వెస్టర్లు తోడయ్యారు.ఈ స్పీడుకు ప్రధానంగా డిజిటైజేషన్, ఫిన్టెక్ సేవల అందుబాటు, మధ్యతరగతి పెరగడం, ప్రభుత్వ పాలసీల మద్దతు సహకరించాయి. 2025 సెపె్టంబర్ 23కల్లా ఎన్ఎస్ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల సంఖ్య 23.5 కోట్లకు చేరింది. అన్ని రకాల క్లయింట్ రిజిస్ట్రేషన్లతో కలిపి ఈ సంఖ్యకాగా.. క్లయింట్లు ఒక సభ్యునికంటే అధికంగా కూడా రిజిస్టరయ్యేందుకు వీలుంది.రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లలో 12 కోట్లమంది సగటు వయసు 33 ఏళ్లుకాగా.. 1.9 కోట్లమంది ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 1.4 కోట్లమంది రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లరీత్యా ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకును పొందగా, 1.03 కోట్లతో గుజరాత్ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది. -
స్టాక్ మార్కెట్లు క్రాష్.. సూచీల భారీ పతనం
రిటైల్ పెట్టుబడిదారులలో భయాందోళనల అమ్మకం, విదేశీ పెట్టుబడిదారుల విపరీత ఆఫ్ లోడ్లతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అక్టోబర్ 1 నుండి తమ దేశంలోకి ప్రవేశించే "ఏదైనా బ్రాండెడ్ లేదా పేటెంట్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి" పై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో దలాల్ స్ట్రీట్ ‘బేరు’మన్నది.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఈరోజు 733 పాయింట్లు లేదా 0.9 శాతం క్షీణించి 80,426.5 వద్ద ముగిసింది. ఇది ఇంట్రాడే ట్రేడ్ లో 80,332 కనిష్టాన్ని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 236 పాయింట్లు లేదా 0.95 శాతం క్షీణించి 24,655 వద్ద ముగిసింది. ఇది 24,629 వద్ద పడిపోయింది. దీంతో, ఈ బెంచ్ మార్క్ ఏడు వారాలలో అత్యంత చెత్త వారపు క్షీణతను నమోదు చేసింది.ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 1 శాతం నుంచి 3.6 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్లో ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ మాత్రమే లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.3 శాతం, నిఫ్టీ ఫార్మా 2.2 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోయాయి. -
‘ఇండియన్ ఐటీ కంపెనీలు మేల్కోకపోతే మునిగిపోతాయ్’
భారతీయ ఐటీ కంపెనీలు ముప్పులో ఉన్నాయని, వాస్తవ పరిస్థితిని తెలుసుకుని మేల్కోకపోతే మునిగిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీలు తమ ఏఐ (AI) సామర్థ్యాలను పెంచుకోవడంలో విఫలమైతే మసకబారే ప్రమాదం ఉందని గ్లోబల్ ఈక్విటీస్ రీసెర్చ్లో ఈక్విటీ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిప్ చౌదరి హెచ్చరించారు.ఏఐకి సంబంధించి మన ఐటీ కంపెనీలు (Indian IT companies) తీవ్రంగా వెనుకబడి ఉన్నాయని, ఏఐ సమర్థవంతమైనవి కావని త్రిప్ చౌదరి ఎన్డీటీవీ ప్రాఫిట్ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ప్రతి ఐటీ కంపెనీ కొత్త వాస్తవికతను తెలుసుకుని మేల్కొనాలని, లేకుంటే అవి ఎప్పటికీ అదృశ్యమవుతాయని హెచ్చరించారు. లెగసీ సేవలు, అప్లికేషన్ నిర్వహణ, ఖర్చు నియంత్రణపై ఎక్కువగా ఆధారపడే భారతీయ ఐటీ కంపెనీలు, ప్రపంచ కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ స్వీకరణను వేగవంతం చేయాలని సూచించారు.భవిష్యత్తు చిన్న ఐటీ కంపెనీలదే..దేశీయ ఐటీ కంపెనీల వృద్ధి అవకాశాలపై ఫండ్ మేనేజర్, సోవిలో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఎల్ఎల్పీ సహ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో పెద్ద ఐటీ కంపెనీలు బలమైన వృద్ధిని చూస్తాయని తాను ఆశించడం లేదన్నారు. లార్జ్, మిడ్-క్యాప్ ఐటీ కంపెనీల కంటే చిన్న ఐటీ కంపెనీలపై తాము సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. యాక్సెంచర్ ఆదాయాలు భారత ఐటీ రంగం ప్రస్తుతం వృద్ధి లేమిని సూచిస్తున్నాయన్నారు. ఐటీ కంపెనీల స్టాక్స్ను డివిడెండ్ కోసం కొనుగోలు చేయవచ్చు, కానీ వృద్ధి లేదు అన్నారు.ఇదీ చదవండి: పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్! -
పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్!
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండు రోజులు తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆశలు పెంచాయి. అయితే ఒక్కసారిగా రివర్స్ కావడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు (Today Gold Rate) గురువారంతో పోలిస్తే శుక్రవారం పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 94 పాయింట్లు నష్టపోయి 24,799కు చేరింది. సెన్సెక్స్(Sensex) 331 పాయింట్లు పడిపోయి 80,828 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అయిదో రోజూ అదే పతనం
ముంబై: హెచ్1–బీ ఫీజు పెంపు ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ మార్కెట్ అయిదో రోజూ నష్టపోయింది. సెన్సెక్స్ 556 పాయింట్లు క్షీణించి 81,160 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 25 వేల స్థాయి దిగువన 24,891 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, డాలర్తో పోలిస్తే రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం అంశాలు మరింత ఒత్తిడి పెంచాయి. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ గడిచే కొద్దీ మరింత నష్టాలు చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 623 పాయింట్లు కోల్పోయి 81,093 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు నష్టపోయి 24,878 వద్ద కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ మినహా అన్ని దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతం పతనమయ్యాయి. యూఎస్ స్టాక్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా ఇండెక్సుల్లో రియల్టీ 2%, విద్యుత్ 1.38%, ఐటీ 1.23%, యుటిలిటీస్ 1.21%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.41% పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 0.75%, మిడ్క్యాప్ ఇండెక్సు 0,72% నష్టపోయాయి. నష్టాల మార్కెట్లోనూ టెలికమ్యూనికేషన్, మెటల్ షేర్లు రాణించాయి. ⇒ కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్ల పెంపుతో దేశీయ ఐటీ కంపెనీల షేర్లు నాలుగోరోజూ డీలా పడ్డాయి. ఇన్ఫోబీన్స్ 2.64%, టీసీఎస్ 2.50%, హెక్సావేర్ టెక్ 2%, హెచ్సీఎల్ టెక్ 1.31%, విప్రో 1.06%, ఇన్ఫోసిస్ 0.64%, టెక్ మహీంద్రా 0.61% పతనయ్యాయి. ⇒ గడిచిన నాలుగు రోజుల్లో టెక్ మహీంద్రా షేరు 7% నష్టపోవడంతో రూ.10,729 కోట్ల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది. టీసీఎస్ (–6.6%) రూ.75,799 కోట్లు, విప్రో (–5.5%) రూ.14,799 కోట్లు, ఇన్ఫోసిస్(–3.6%) రూ.23,119 కోట్లు, హెచ్సీఎల్(–3%) రూ.11,940 కోట్ల మార్కెట్ విలువ కోల్పోయాయి. వెరసి ఈ 5 కంపెనీలకు 4 సెషన్లలో రూ.1.36 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ⇒ ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.299)తో పోలిస్తే 4.68% డిస్కౌంటుతో రూ.285 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 8.34% క్షీణించి రూ.274 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టపోయి రూ.282 వద్ద నిలిచింది. -
వెండి.. మరో రికార్డ్
న్యూఢిల్లీ: వెండి ధర గురువారం దేశీయంగా సరికొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరిగి రూ.1,40 లక్షలకు చేరింది. మరోవైపు కొన్ని రోజులుగా రికార్డుల బాటలో నడిచిన పసిడి (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.630 నష్టపోయింది. రూ.1,17,370 స్థాయి వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ మార్కెట్లో వెండి ధర ఔన్స్కు 2 శాతానికి పైనే పెరిగి 45 డాలర్లకు చేరుకుంది.దేశీయంగా ఎంసీఎక్స్ (ఫ్యూచర్స్) మార్కెట్లో డిసెంబర్ కాంట్రాక్టు వెండి ధర రూ.3,528 పెరిగి రూ.1,37,530 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. 10 గ్రా. బంగారం కాంట్రాక్టు ధర రూ.223 పెరిగి రూ.1,12,778కు చేరింది. రేట్ల తగ్గింపుపై ఫెడ్ సానుకూల వైఖరి, 2025లోనూ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు ధరల పెరగుదలకు కారణమైనట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.అంతర్జాతీయంగా అనిశి్చతులకుతోడు డాలర్పై ఆధారపడడం తగ్గించుకోవడం అన్నవి బంగారం, వెండిలో కొనుగోళ్లకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్కు 8 డాలర్ల నష్టంతో 3,760 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
స్టాక్ మార్కెట్లు వరుస పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం ఐదో రోజూ భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) ఇండెక్స్ 556 పాయింట్లు నష్టపోయి 81,160 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 24,891 వద్ద ముగిసింది.పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ట్రెంట్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, టైటాన్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్ 3 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ50 (Nifty) లో శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ స్టాక్లకూ నష్టాలు తప్పలేదు.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.57 శాతం క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ వరుసగా రెండో రోజు 1.65 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా 0.9 శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగి లాభపడింది. -
బంగారం ధరలు: మరింత గుడ్న్యూస్!
దేశంలో బంగారం ధరలు మళ్లీ దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రితం రోజున తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) బుధవారంతో పోలిస్తే గురువారం మరింత తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు పెరిగి 25,072కు చేరింది. సెన్సెక్స్(Sensex) 59 పాయింట్లు పుంజుకొని 81,775 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్ల నాడి మాకు తెలుసు
అస్సెట్ మేనేజ్మెంట్ విభాగంలో జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్ల అవసరాలను తాము మెరుగ్గా అర్థం చేసుకోగలమని, పోటీ ధరలపైనే ఉత్పత్తులను అందించగలమని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. కొత్త సంస్థల రాకతో మార్కెట్ మరింత విస్తరిస్తుందన్న అభిప్రాయాన్ని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జాయింట్ సీఈవో డీపీ సింగ్ వ్యక్తం చేశారు. దీంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సైతం లబ్ధి పొందుతుందన్నారు.‘వారు విజయవంతం కావాలనుకుంటారు. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో మాకు అనుభవం ఉంది. ఇన్వెస్టర్ల స్పందన, నాడి మాకు తెలుసు. ఇవన్నీ కొత్త సంస్థకు తెలియాలంటే కొంత సమయం పడుతుంది’అని సింగ్ పేర్కొన్నారు. జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ మొదటిసారి ఫ్లెక్సీక్యాప్ ఫండ్ను, కేవలం 0.50 శాతం ఎక్స్పెన్స్ రేషియోకి తీసుకురావడంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సైతం ఇదే మాదిరి లేదా ఇంతకంటే తక్కువ ధరపైనే ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియోని పరిశీలిస్తే ఇది తెలుస్తుందన్నారు.మాగ్నం సిఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) విభాగంలో ‘మాగ్నం సిఫ్’ పేరుతో ఎస్బీఐ తొలి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 15,000 మంది ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెడతారని అంచనా వేస్తున్నట్టు సింగ్ తెలిపారు. రిటైర్మెంట్ తీసుకున్నవారు, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి దీన్ని ఆఫర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మాగ్నం సిఫ్ అక్టోబర్ 1న ప్రారంభం అవుతుందని, అదే నెల 15న ముగుస్తుందని తెలిపారు. కనీసం రెండేళ్ల పాటు పెట్టుబడులు కొనసాగిస్తే మెరుగైన రాబడులు వస్తాయన్నారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
నాలుగో రోజూ పడిపోయిన సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా నాల్గవ రోజు అమ్మకాల ఒత్తిడిలో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ( Sensex) 386 పాయింట్లు లేదా 0.47 శాతం తగ్గి 81,716 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty50) సూచీ 113 పాయింట్లు లేదా 0.45 శాతం పడిపోయి 25,057 వద్ద స్థిరపడ్డాయి.టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), విప్రో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, టెక్ ఎం షేర్లు 1 శాతం నుంచి 2.6 శాతం వరకు పడిపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం క్షీణించాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 2.5 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ (1.15 శాతం), నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ (0.8 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే.. -
బిగ్రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు తగ్గి 25,065కు చేరింది. సెన్సెక్స్(Sensex) 331 పాయింట్లు నష్టపోయి 81,748 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘కనక’ వర్షం!
ఆభరణ ప్రియులకే కాదు, ఇన్వెస్టర్లు, చివరికి సెంట్రల్ బ్యాంకులకు సైతం పసిడిపై మక్కువ పెరిగింది. ఫలితంగా ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్న రీతిలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా 2025లోనే పసిడి ధర 50 శాతం, వెండి ధర 55 శాతం చొప్పున పెరిగాయి. బంగారం ధర గత డిసెంబర్ చివరికి ఉన్న రూ.78,950 నుంచి చూస్తే 10 గ్రాములపై నికరంగా రూ.39,950 ర్యాలీ చేసింది. వెండి సైతం కిలోకి నికరంగా రూ.49,900 మేర ఈ ఏడాది పెరిగింది. ఈక్విటీ, డెట్.. ఇలా ఏ ఇతర సాధనంతో పోల్చి చూసినా గడిచిన ఏడాది కాలంలో బంగారం, వెండి ముందు వెలవెలబోయాయి. గత ఐదేళ్లలో ఎంసీఎక్స్ మార్కెట్లో 24క్యారట్ బంగారం 112 శాతం ర్యాలీ చేసింది. 2020 సెపె్టంబర్ 19న రూ.51,169 వద్ద ఉంటే, ఇప్పుడు రూ.1,09,388కి చేరుకుంది. ఈ ర్యాలీ చూసి మరింత మంది ఇన్వెస్టర్లు బంగారం, వెండిలో పెట్టుబడులకు ముందుకు వస్తుండడం, సెంట్రల్ బ్యాంకులు సైతం డాలర్ స్థానంలో బంగారానికి వెయిటేజీ పెంచడం ధరలకు మరింత ఆజ్యం పోస్తోంది. గత ఏడాది కాలంలో డాలర్తో రూపాయి విలువ 83.48 నుంచి 88.73కు (6 శాతానికి పైన) పడిపోయింది. బంగారం దిగుమతులపై ఆధారపడడంతో రూపాయి బలహీనత దేశీయంగా అధిక ధరలకు కారణమవుతోంది. పసిడి @ రూ.1,18,900 ఢిల్లీ మార్కెట్లో పసిడి, వెండి సరికొత్త జీవిత కాల గరిష్టాలను నమోదు చేశాయి. సోమవారం 10 గ్రాములకు పసిడి (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 లాభపడగా, మంగళవారం మరో రూ.2,700 పెరిగి రూ.1,18,900 స్థాయికి చేరింది. డాలర్తో రూపాయి బలహీనత నేపథ్యంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్ పెరిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు. ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.3,220 పెరిగి రూ.1,39,600 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ ఫ్యూచర్స్లో పసిడి ఔన్స్కు 36 డాలర్ల వరకు పెరిగి 3,811 డాలర్లకు చేరుకుంది. టార్గెట్ 2 లక్షలు!వచ్చే ఏడాది కాలంలో బంగారం ధరలు 15–20 శాతం మేర పెరగొచ్చని త్రివేష్ అంచనా వేశారు. ‘‘ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే, డాలర్ బలహీన పడుతుంది. ఇది బంగారం ధరలు పెరిగేందుకు మద్దతునిస్తుంది’’అని పేర్కొన్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం కొనసాగితే, ఈటీఎఫ్ల్లో పెట్టుబడులకు డిమాండ్ సంస్థాగతంగా కొనసాగుతుందని, అటువంటి పరిస్థితుల్లో వచ్చే ఐదేళ్లలో 10 గ్రాముల పసిడి ధర రూ.1.7 లక్షలకు చేరుకోవచ్చని మనీష్ శర్మ అంచనా వేశారు. 2026 మధ్య నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,000 డాలర్లను అధిగమించొచ్చన్నారు. 2–5 ఏళ్లలో 5,000 డాలర్లకు వెళ్లొచ్చని (రూ.1,50,000–1,70,000) చెప్పారు. జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్ సైతం బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింత పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఔన్స్కు 6,600 డాలర్లకు చేరుకోవచ్చని (ఇక్కడి నుంచి 70 %కి పైన, అంటే మన దగ్గర రూ. 2 లక్షలు) అంచనా వేశారు.అంతర్జాతీయ అనిశి్చతుల ఆజ్యం..కరోనా విపత్తు నుంచి పుత్తడి ధరల పెరుగుదల మొదలైంది. ఆ తర్వాత ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలు పెట్టడం, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్–పాలస్తీనా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ భౌగోళికంగా అనిశ్చితులను రాజేశాయి. గతేడాది రెండో పర్యాయం అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన డోనాల్డ్ ట్రంప్ సుంకాల పోరుకు తెరతీయడం విలువైన లోహాలకు డిమాండ్ను మరింత పెంచింది. సంప్రదాయ డెట్, ఈక్విటీల స్థానంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలోకి పెట్టుబడులను పెంచుతూ రావడం ధరలకు మద్దతుగా నిలుస్తోంది. అమెరికా రుణ భారం భారీగా పెరిగిపోయిన తరుణంలో డాలర్కు బదులు సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో పసిడి ధరలు దిగొస్తాయన్న అంచనాలు తలకిందులవుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు ధరలకు ప్రేరణనిస్తున్నట్టు ఆనంద్రాఠి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ కమోడిటీ విభాగం ఏవీపీ మనీష్ శర్మ చెప్పారు. ‘2005లో 24క్యారట్ బంగారం ధర (10 గ్రాములు) రూ.7,000 వద్ద ఉంది. 2010 నాటికి రూ.18,500కు పెరిగింది. 2015లో రూ.26,300 వద్ద ఉంది. 2025 సెపె్టంబర్లో రూ.1,18,000కు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్ట్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 36 శాతం పెరిగాయి. ఈ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే దీర్ఘకాలంలో బంగారం బలంగా నిలబడుతుంంది’ అని చెప్పారు. యూఎస్లో లిస్టెడ్ గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు 215 బిలియన్ డాలర్లకు చేరినట్టు శర్మ తెలిపారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గంటల వ్యవధిలో తారుమారైన బంగారం ధరలు
మంగళవారం ఉదయం గరిష్టంగా రూ. 1,260 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2,620లకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోయింది, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఈ కథనంలో తాజా గోల్డ్, సిల్వర్ ధరలను చూసేద్దాం..👉హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,620 పెరిగి.. రూ.1,15,690 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ. 1,06,050 వద్దకు చేరింది.👉ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు.. రూ.2,620 పెరిగి రూ.1,15,840 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,400 పెరిగి.. రూ.1,06,200 వద్దకు చేరింది.👉చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.2,300 పెరిగి రూ.1,16,080 వద్దకు, 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ.2,100 పెరిగి రూ.1,06,400 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..వెండి ధరలువెండి ధర రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 1,50,000కు చేరింది. ఉదయం రూ. 1000 పెరిగిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి మరో వెయ్యి రూపాయలు (మొత్తం రూ. 2000) పెరిగింది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 57.87 పాయింట్లు లేదా 0.070 శాతం నష్టంతో.. 82,102.10 వద్ద, నిఫ్టీ 32.85 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 25,169.50 వద్ద నిలిచాయి.ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, బనారస్ బీడ్స్, బ్రాండ్ కాన్సెప్ట్స్, రెఫెక్స్ ఇండస్ట్రీస్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ టోటల్ గ్యాస్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, షా మెటాకార్ప్, ఎల్టీ ఫుడ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బిగ్షాక్: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,150 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 37 పాయింట్లు తగ్గి 25,165కు చేరింది. సెన్సెక్స్(Sensex) 105 పాయింట్లు నష్టపోయి 82,051 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.29బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.15 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.44 శాతం పెరిగింది.నాస్డాక్ 0.7 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండుగల ముందు పసిడి పరుగు
న్యూఢిల్లీ: పండుగల ముందు పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.2,200 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,16,200కి చేరుకుంది. వెండి సైతం రూ.4,380 ర్యాలీ చేసి కిలోకి రూ.1,36,380 స్థాయిని (కొత్త ఆల్టైమ్ గరిష్టం) తాకింది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న బుల్లిష్ ధోరణికి అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిల్లో ట్రేడయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు రేట్ల కోతలు ఉంటాయంటూ సంకేతం ఇవ్వడం డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటాన్ని అడ్డుకుంది. ఇది పసిడి, వెండి ధరలకు మద్దతిచి్చంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే బంగారం ధర 50 డాలర్లకు పైగా పెరిగి 3,760 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. ఈ ఏడాది ఇప్పటి దాకా దేశీ మార్కెట్లో పసిడి ధరలు 47%, వెండి ధరలు 52% పెరగడం గమనార్హం. అక్టోబర్ 21న మూరత్ ట్రేడింగ్ ముంబై: దీపావళి సందర్భంగా స్టాక్ ఎక్సే్చంజీలు అక్టోబర్ 21న గంట పాటు ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ నిర్వహించనున్నాయి. మధ్యాహ్నం 1.45 గంటలకు మొదలై 2.45 గంటలకు ట్రేడింగ్ ము గుస్తుందని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తెలిపాయి. ఈ దీపావళి నుంచి సంవత్ 2082 ఆరంభం కానుంది. ఈ పర్వదినం రోజు ట్రేడింగ్ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాలు వరిస్తాయనే నమ్మకంతో చాలా మంది మూరత్ ట్రేడింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. గతేడాది(2024) ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించాయి. -
స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు
అమెరికా నుంచి ప్రతికూలతలు ఎదురవుతున్నా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా... భారత మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటానికి కారణం దేశీ ఇన్వెస్టర్లకు మార్కెట్లపై ఉన్న నమ్మకమేనని, కొన్నేళ్లుగా వారు కళ్లజూస్తున్న లాభాలే వారిని ఇన్వెస్ట్మెంట్కు ప్రేరేపిస్తున్నాయని ఎడిల్వీజ్ ఏఎంసీ ఎండీ– సీఈఓ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. వినూత్న ఉత్పత్తులతో ఎడిల్వీజ్ను దేశవ్యాప్తంగా విస్తరించి... దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్ఫండ్ కంపెనీల్లో ఒకటిగా మార్చిన రాధికా గుప్తా... నిరంజన్ అవస్థితో కలిసి ‘మ్యాంగో మిలియనీర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ 200 లక్షల కోట్లకు చేరుతుందంటున్న రాధికాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) → అంతర్జాతీయంగా ఇబ్బందులెదురవుతున్నా భారత మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకోవటానికి కారణం? యువత ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మరోవంక ఇన్వెస్ట్మెంట్కు మరీ ఎక్కువ ప్రత్యామ్నాయాలేవీ లేవు. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లు చేశారనుకుందాం. పన్నులు పోతే మిగిలేది తక్కువే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకిది సరిపోదు. అందుకని సహజంగానే జనం ఈక్విటీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. నేను ఎంఎఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ‘సిప్’ ద్వారా వచ్చే మొత్తం 4 వేల కోట్లుగా ఉండేది. ఇపుడది 28వేల కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక భాగం దీర్ఘకాలికం. అదే ఇక్కడ కీలకం. ప్రత్యేకించి గడిచిన రెండేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇన్వెస్టర్లకు మంచి లాభాలొస్తున్నాయి. → అయితే ఈ ర్యాలీ చల్లారిపోయేది కాదని, బుడగలేవీ లేవని అంటున్నారా? స్మాల్క్యాప్ కంపెనీలు... కొన్ని థీమ్స్..., కొన్ని కంపెనీల రూపంలో ఈ బబుల్స్ ఉండొచ్చు. పాలపై నురుగు ఓ 20 శాతం తప్పదు. ఏ బుల్ ర్యాలీకైనా ఇది వర్తిస్తుంది. దానర్థం మొత్తం మార్కెట్ ఇలానే ఉందని కాదుకదా? పునాదులు గట్టిగా ఉన్నాయన్నదే నా పాయింట్. → మరి ఇలాంటి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు మీరేం చెబుతారు? అన్నిటికన్నా ముఖ్యం... అతిగా ఆశించకపోవటం. నా పుస్తకంలో కూడా అదే చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్లు గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటూ 30–40 శాతం రాబడి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. అది సరికాదు. రెండోది... హైబ్రిడ్ ఫండ్లు, మల్టీ అసెట్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వంటి మధ్యస్త ఆదాయాన్నిచ్చే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి మరీ సంప్రదాయకంగా కాకుండా... మరీ దూకుడుగా కాకుండా మధ్యస్తంగా ఇన్వెస్ట్చేస్తాయి. స్థిరంగా నిలకడైన రాబడులనిస్తాయి. సంపద సృష్టించాలంటే అలానే సాధ్యం. → డిఫెన్స్ థీమ్, ప్రభుత్వ బ్యాంకుల థీమ్ అంటూ రకరకాల స్టోరీలను ఈ మధ్య చూస్తున్నాం. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని నమ్ముతున్నారు కదా? నిజమే!. రిటైలర్లు ఇలాంటి స్టోరీల వెంటనే పరిగెడతారు. చివరకు దురదృష్టకరంగా ఎగ్జిట్ అవుతారు. నేనైతే ఈ థీమ్లను నమ్మను. ఏ ఒక్క రంగం వల్లనో దేశం ముందుకెళ్లదు. హోటల్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, క్యాపిటల్ మార్కెట్స్, టెక్నాలజీ.. ఇలాంటి రంగాలన్నీ దేశాభివృద్ధితో ముడిపడి ముందుకెళతాయి. → మార్కెట్లో ఏ ఒక్క రంగమైనా మరీ అతిగా పెరిగినట్లు భావిస్తున్నారా? అలాగని చెప్పలేం. అయితే కొన్ని అన్లిస్టెడ్ కంపెనీలు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో మాత్రం ఆందోళన ఉంది. లిస్టింగ్లోనే లాభాలొస్తాయి కదా అని చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ పూర్వాపరాలేవీ పట్టించుకోకుండా అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పేరు చెప్పలేను కానీ... ఈ మధ్య ఒక ఐపీవోలో దెబ్బతిన్నారు. కొన్ని ఎస్ఎంఈ కంపెనీలూ అంతే. వీటిలో పెద్ద లిక్విడిటీ ఉండదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ. అందుకే నేనెప్పుడూ రిటైల్ ఇన్వెస్టర్లను ఇండెక్స్ ఫండ్లలో గానీ, ఏవైనా ఇతర మ్యూచువల్ ఫండ్లలో గానీ పెట్టుబడి పెట్టమని చెబుతాను. → కానీ కొన్ని కంపెనీలు ఏడాదిలో 50 శాతం... రెండుమూడు రెట్లు పెరగటం చూస్తున్నారు కదా? ఇవి రిటైలర్లను ఆకర్షిస్తాయి కదా? ఇలా పెరిగిన రెండుమూడు గురించే అంతా చెబుతారు. కానీ కుదేలైన షేర్ల గురించి చెప్పరు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించిన వారిని తప్ప నష్టపోయిన వారి స్టోరీలు బయటకు రావు. ఇలా ఒక షేర్లో పెట్టి లాభపడ్డ వారు కూడా మిగిలిన షేర్లలో రాబడి గురించి చెప్పరు. ఆ షేర్ను ఎంచుకోవటం వెనక వారి శ్రమ, సమయం కూడా ఉంటాయి కదా? ఏడాదికి 10–12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు బోరింగ్గా అనిపించవచ్చు. కానీ ఆ రాబడి స్థిరంగా ఉంటుంది. సురక్షితం కూడా. → చిన్న పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్కృతి పెరుగుతోందా? చాలా. ఎడిల్వీజ్ను 5 నగరాల్లో ఆరంభించాం. ఇపుడు 60 పట్టణాల్లో ఉన్నాం. త్వరలో 200 పట్టణాలకు విస్తరిస్తాం. స్థానిక భాషల్లో ఆర్థిక పాఠాల లభ్యత.. వారికి సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉండటమన్నదే ప్రధానం. → పాసివ్ (ఇండెక్స్) ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది కదా.. మరి యాక్టివ్ ఫండ్లకు వీటితో పోటీ ఉంటుందా? అలాంటిదేమీ లేదు. చాలామంది ఇన్వెస్టర్లు రెండింట్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. బాగా రాబడులనిచి్చన యాక్టివ్ ఫండ్లలోకి పెట్టుబడులొస్తాయి. లేదంటే పాసివ్ ఫండ్లలోకి వెళతాయి. రెండూ పెరుగుతున్నాయనేది మనం గమనించాలి. → ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎడిల్వీజ్ ప్రణాళికలేంటి? టెక్నాలజీ, చైనా సహా కొన్ని గ్లోబల్ ఫండ్లను మేం నడిపిస్తున్నాం. కాకుంటే వీటికి ఆర్బీఐ పరిమితులున్నాయి. వీటిని గిఫ్ట్ సిటీ ద్వారా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గిఫ్ట్సిటీలో కార్యాలయాన్ని ఆరంభించాం. → ఐదు పదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ ఎలా ఉండొచ్చు? 2030 నాటికి ఇది 200 లక్షల కోట్లకు చేరుతుందన్నది నా అంచనా. దీన్లో 130–140 లక్షల కోట్లు ఈక్విటీలోనే ఉంటాయి. సిప్ పెట్టుబడులు నెలకు రూ. లక్ష కోట్లను చేరుతాయి. దేశంలో 30–40 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటమే వికసిత భారత్కు అర్థమన్నది నా భావన.→ యువత చాలామంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నారు. మీరేమంటారు? అదో దుర్మార్గం. ఎఫ్ అండ్ ఓ అనేది సంస్థలు రిస్్కను తగ్గించుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం. అంతేతప్ప అప్పులు తెచ్చి ట్రేడింగ్ చేసే యువత కోసం కాదు. విద్యార్థులు, చిన్నచిన్న వర్కర్లు, డ్రైవర్లు రుణాలు తీసుకుని ట్రేడింగ్ చేస్తున్న వ్యవహారాన్ని నేనూ విన్నా. ఇది గ్యాంబ్లింగ్. ప్రమాదకరం. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్, మ్యూచువల్ ఫండ్ల ద్వారా తేలిగ్గా సంపద సృష్టించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ అవసరం లేదు. → భారత్ బాండ్ ఫండ్ మాదిరి ఎడిల్వీజ్ నుంచి కొత్త ఉత్పత్తులేమైనా వస్తున్నాయా? అక్టోబర్ 1న మేం దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ స్పెషల్ ఇన్వెస్ట్మెండ్ ఫండ్ను (ఎస్ఐఎఫ్) ఆరంభించబోతున్నాం. సెబీ ఇటీవలే దీనికి అనుమతిచి్చంది. దీన్లో కనీస పెట్టుబడి సైజు రూ.10 లక్షలు. దీన్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. -
మరో ఐదేళ్లలో బంగారం రూ.2 లక్షలకు!: కారణాలు ఇవే..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ సుంకాలు వంటి అంశాలు బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1,13,070 వద్దకు చేరింది. అయితే ఈ ధర ఐదేళ్లకు ముందు.. 2020లో రూ. 51,000 మాత్రమే అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.బంగారం ధర ఐదేళ్లలో (2020 - 2025 మధ్య) డబుల్ అయింది. గోల్డ్ డిమాండ్ తగ్గే సూచనలు కనిపించకపోవడంతో.. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇది రూ. 2 లక్షలకు చేరుకుంటుందా?, దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేటు పెరుగుదలకు కారణమవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని.. బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో ఈటీఎఫ్ రూపంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని ట్రేడ్జీనీ సీఓఓ త్రివేష్ పేర్కొన్నారు.సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ డాలర్ ధర, ద్రవ్యోల్బణం వంటివన్నీ కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడతాయని ఇన్క్రెడ్ మనీ సీఈఓ విజయ్ కుప్పా పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధర పెరిగినా.. డిమాండ్ తగ్గదు!ఇప్పుడు రూ.1,13,070 వద్ద ఉన్న 10 గ్రామ్స్ గోల్డ్ రేటు.. మరో ఐదేళ్లలో రూ. 1.70 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. కారణాలు ఎన్ని ఉన్నా.. 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4000 డాలర్లు దాటవచ్చని చెబుతున్నారు. దీంతో భారతదేశంలో కూడా పసిడి ధర గణనీయంగా పెరుగుతుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 466.26 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో.. 82,159.97 వద్ద, నిఫ్టీ 125.50 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో.. 25,201.55 వద్ద నిలిచాయి.ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరెస్, కెరీర్ పాయింట్ ఎడ్యుటెక్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, డీఆర్సీ సిస్టమ్స్ ఇండియా, క్రిజాక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం క్యారెట్ల విలువ!
మీకు తెలుసా.. బంగారం(Gold) కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బంగారం నాణ్యతను గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం(24 karat gold) అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్(Biscuit) రూపంలోనే ఉంటుంది. 22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. 18 క్యారెట్లు: 75 శాతం బంగారం, మిగతా 25 శాతం ఇతర లోహాలు 14 క్యారెట్లు: 58.5శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహాలు 12క్యారెట్లు: 50 శాతం మాత్రమే బంగారం, మిగతా 50 శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది. 10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. బంగారం ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్జరింగ్ చేయడాన్ని కేడీఎం అంటారు. ఇవి 91.6 నాణ్యతతో ఉంటాయి. ఆభరణం చిన్నదైనా, పెద్దదైనా హాల్మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్తోపాటు ఆ వస్తువు సరి్టపై చేసిన హాల్మార్క్ సెంటర్ వివరాలు తెలిపే హెచ్యూఐడీ హాల్మార్క్ యూనిక్ ఐడీ నంబరు విధిగా ఉండాలి. ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది.షాకింగ్ ధరలు: ఎగిసిన బంగారం.. దూసుకెళ్లిన వెండి! -
పండుగకు కొత్త బండి
మెదక్జోన్: జీఎస్టీ 2.0 (GST 2.0)సోమవారం నుంచి అమలులోకి రానుంది. దీంతో కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. వీటిపై 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు ధరలు తగ్గనున్నాయి. జిల్లాలో 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన షోరూంలు సుమారు 50కి పైగా ఉన్నాయి. వీటితో పాటు ఈ– ఎలక్ట్రానిక్ షోరూంలు విరివిగా ఉన్నాయి. ఏటా జిల్లాలో దసరాకు(Dassahra) సుమారు 1,500 బైకులు, 350 కార్ల కొనుగోళ్లు జరుగుతాయని పలు షోరూంల నిర్వాహకులు చెబుతున్నారు. అయి తే ఈసారి జీఎస్టీ స్లాబులు తగ్గటంతో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.సామాన్య, మధ్య తరగతికి ఊరటజీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు కొంతమేర తగ్గుతాయి. ద్విచక్ర వాహనంపై రూ. 8,000 నుంచి రూ. 20,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అదే కార్ల ధరల్లో రూ. 60,000 నుంచి రూ.1.50 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో జిల్లాలో ఈ ఏడాది వాహనాల కొనుగోలుదారులకు మొత్తంగా రూ. 5 నుంచి రూ. 6 కోట్ల వరకు ఆదా అవుతుందని షోరూంల నిర్వాహకులు పేర్కొంటున్నారు.పెరిగిన ఈ– వాహనాల వినియోగంకేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ శ్లాబులతో సహజంగా అన్ని వాహనాలకు 10 శాతం మేర ధరలు తగ్గుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగి పెట్రోల్ వాహనాలు తగ్గితే కాలుష్యాన్ని నియంత్రించవచ్చనే ఉద్దేశంతో కేంద్రం మొదటి నుంచి ఈ– వాహనాలకు సుమారు 20 శాతం మేర సబ్సిడీని ఇస్తోంది. ప్రస్తుతం వీటి వినియోగం సైతం జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వీటిలో బైక్, స్కూటీలు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే ఈ– కార్లు సైతం 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేవి ఉన్నాయి. ఆయా కంపెనీలు వీటి బ్యాటరీలను బట్టి సర్వీ స్ ఇస్తుండటంతో వినియోగం పెరిగింది.భారీగా విక్రయాలు జరిగే అవకాశంసాధారణంగా దసరా పండుగ వేళ కొత్త వాహనాలు కొనుగోళ్లు చేయడం ఆనవాయితీ. ఈ సెంటిమెంట్ ఉన్న వారు కార్లు, ద్విచక్ర వాహనాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకొని మరీ దసరా పండుగ రోజు పొందుతుంటారు. ఈ పండుగ నాటికి తగ్గించిన జీఎస్టీ అమలులోకి రానుంది. దీంతో ఆయా వాహనాల ధరలు తగ్గనున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలు చూస్తున్నారు. ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అదే రీతిలో కొనుగోళ్లు సైతం పెరగనున్నట్లు విక్రయ కేంద్రాల నిర్వాహకులు అనుకుంటు న్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు కొనుగోళ్లను పెంచేందుకు షోరూంల నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.కొత్త జీఎస్టీ అమలు.. వైఎస్ జగన్ స్పందన -
షాకింగ్ ధరలు: ఎగిసిన బంగారం.. దూసుకెళ్లిన వెండి!
దేశంలో బంగారం, వెండి ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు(Today Gold Rate) ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం భారీగా ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 11 పాయింట్లు తగ్గి 25,315కు చేరింది. సెన్సెక్స్(Sensex) 91 పాయింట్లు నష్టపోయి 82,837 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హెచ్1బీ, జీఎస్టీ ఎఫెక్ట్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వారాంతాన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును ఎకాఎకిన లక్ష డాలర్ల(రూ. 88 లక్షలు)కు పెంచేయడం, గత వారం 0.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించిన యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్ విధానాలపై ప్రసంగించనుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..దేశీయంగా స్టాక్ మార్కెట్లకు ఈ వారం కీలకంగా నిలవనుంది. గత వారం జూలై తదుపరి ప్రధాన ఇండెక్సులు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ గరిష్టాలకు చేరాయి. అయితే ఇకపై వీటి పరుగును దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా ఈ(సెపె్టంబర్) నెలకు హెచ్ఎస్బీసీ కాంపోజిట్, తయారీ, సర్వీసుల పీఎంఐ ఫ్లాష్ అంచనాలు వెలువడనున్నాయి. ఇక గత వారాంతాన ఉన్నట్టుండి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును 3,000–5,000 డాలర్ల నుంచి ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేయడం ఐటీ పరిశ్రమలో సంచలనానికి తెరతీసింది. దీంతో యూఎస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన దేశీ ఐటీ దిగ్గజాల షేర్లు(ఏడీఆర్లు) అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం నేడు(సోమవారం) కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఐటీ పరిశ్రమలో కొన్నేళ్లుగా పెరిగిపోయిన ఆన్సైట్ సర్వీసులపై ఈ ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరిగి ఆఫ్షోర్ విధానానికి ప్రాధాన్యత పెరగవచ్చని అంచనా వేశారు. 285 బిలియన్ డాలర్ల విలువైన దేశీ ఐటీ పరిశ్రమలో ఆన్షోర్ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. ఇప్పటికే ఎగుమతి ఆధారిత రంగాలు ట్రంప్ విధించిన అదనపు టారిఫ్లతో డీలాపడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. హెచ్1బీ వీసాల జారీలో భారత నిపుణుల వాటా 70 శాతంకాగా.. దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోకు సెగ తగిలే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ వివరించారు. జీఎస్టీ దన్ను నేటి నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు అమల్లోకిరానుండటంతో ఆటోమొబైల్, వైట్గూడ్స్, ఎఫ్ఎంసీజీసహా పలు రంగాలలోని కంపెనీలకు జోష్ లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొనుగోళ్లు పెరిగి వ్యవస్థలో డిమాండ్ బలపడే వీలున్నట్లు అంచనా వేశాయి. ఇది పెట్టుబడులకు, ఉద్యోగాలకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రధానంగా జీఎస్టీని రెండు శ్లాబులు 5 శాతం, 18 శాతంగా క్రమబదీ్ధకరించడంతో పట్టణ ప్రాంతాలలోనూ డిమాండ్ ఊపందుకోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 40 శాతం శ్లాబులోకి మరికొన్ని ప్రొడక్టులను చేర్చినప్పటికీ జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీని రద్దు చేయడం, 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వినియోగానికి దారి చూపనున్నట్లు తెలియజేశారు. కాగా.. వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ఈ నెల 22 నుంచి యూఎస్తో వాణిజ్య టారిఫ్లపై చర్చలు ప్రారంభంకానున్నట్లు దేశీ ప్రభుత్వం వారాంతాన వెల్లడించింది. ఇతర అంశాలు కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్లోనూ మరిన్ని కంపెనీలు ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు క్యూ కట్టనున్నట్లు పీఎల్ క్యాపిటల్ అడ్వయిజరీ హెడ్ విక్రమ్ కసట్ పేర్కొన్నారు. ఇక దేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు వివరించారు. గత వారమిలా గత వారం మార్కెట్లు వరుసగా మూడోసారి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 722 పాయింట్లు(0.9 శాతం) బలపడి 82,626 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 213 పాయింట్లు(0.85 శాతం) పుంజుకుని 25,327 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5–2 శాతం చొప్పున ఎగశాయి.సాంకేతికంగా గత వారం అంచనాలనకు అనుగుణంగా మార్కెట్లు బ్రేకవుట్ బాటలో సాగాయి. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,350 సమీపంలో ముగిసింది. అయితే ఈ వారం నిఫ్టీకి 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఆపై ఇటీవలి గరిష్టం 25,669 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చు. ఒకవేళ బలహీనపడితే తొలుత 25,000 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. తదుపరి 24,650 వద్ద మరోసారి సపోర్ట్ లభించవచ్చు.వెనకడుగులోనే ఎఫ్పీఐలుఈ నెలలో రూ. 7,945 కోట్ల అమ్మకాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 7,945 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఆగస్ట్లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.38 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. టారిఫ్లు, యుద్ధాలు తదితర ప్రపంచ అనిశి్చతులు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే గత వారం యూఎస్ ఫెడ్ 0.25 శాతం వడ్డీ రేటు కోత పెట్టడంతో ఎఫ్పీఐలు నికరంగా రూ. 900 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం ధర పెరిగినా.. డిమాండ్ తగ్గదు!
భారతీయులకు బంగారంపై మక్కువ కొంత ఎక్కువే. ఈ కారణంగానే పెళ్లిళ్లకు, పండుగలకు గోల్డ్ కొనేస్తూ ఉంటారు. దీంతో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారులలో ఒకటిగా అవతరించింది. భారతీయ కుటుంబాలు సుమారు 24,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నట్లు అంచనా. ఇది ప్రపంచ కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం నిల్వల కంటే ఎక్కువ. అయితే ప్రస్తుతం ధరలు భారీగా పెరిగాయి?. రాబోయి దసరా, దీపావళి సమయంలో పసిడి కొనుగోళ్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు.భారతదేశంలో పండుగ సీజన్ మొదలైంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఒక గ్రామ్ 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 11,000 దాటింది. కాగా గత సంవత్సరం ఇదే సమయంలో.. బంగారం ధర రూ.7,500 మాత్రమే!. దీన్ని బట్టి చూస్తే 12 నెలల్లో పసిడి ధర ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ధరలు పెరిగినా.. డిమాండ్ తగ్గదు!మనదేశంలో మొదటిసారి 10 గ్రాముల బంగారం ధరలు లక్ష రూపాయలు దాటేసింది. ధర ఎంత పెరిగినా.. పండుగ సీజన్లో బంగారానికి డిమాండ్ పెరిగే సంకేతం ఉందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రానున్నాయి. ఇది ప్రజల బడ్జెట్లో కొంత మిగులును మిగిల్చే అవకాశం ఉంది. ఈ మిగులు బడ్జెట్ బంగారం కొనుగోలుకు దారితీసే అవకాశం ఉంది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలకు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయాలు కొంత అస్తవ్యస్తంగా మారడం వల్ల.. ప్రపంచ దేశాల్లో భయం, అనిశ్చితి ఏర్పడింది. దీంతో కేంద్ర బ్యాంకులు మరింత బంగారం కొనుగోలు చేయడం ఆరంభించాయి.ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో గోల్డ్ కొనుగోలుచేసేవారి సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచేసాయి. -
ఏడిపించిన బంగారం.. వారంలో ఎంత పెరిగిందంటే..
దేశంలో బంగారం ధరలు గత వారం రోజులుగా స్థిరమైన పెరుగుదలను చూశాయి. కాలానుగుణ డిమాండ్, స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా విస్తృత జాతీయ, ప్రపంచ ధోరణికి అనుగుణంగా పసిడ ధరలు ఎగిశాయి.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ .11,215 వద్ద ఉంది. ఇది వారం క్రితం ఉన్న రూ .11,117 తో పోలిస్తే రూ .98 పెరిగింది. అంటే తులానికి (10 గ్రాములు) రూ.980 పెరిగి రూ.1,12,150 కి చేరింది.మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.90 పెరిగి రూ.10,190 నుంచి రూ.10,280కు చేరుకుంది. వారం రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ.900 పెరిగి రూ.1,02,800 లకు ఎగిసింది.పండుగ డిమాండ్ పెరుగుదలకు కారణంనవరాత్రి సీజన్ ప్రారంభం కావడంతో, దీపావళి కేవలం వారాల దూరంలో ఉండటంతో, స్థానిక ఆభరణాల వ్యాపారులు సాంప్రదాయ కొనుగోళ్లు లేదా పెట్టుబడులు పెట్టే వినియోగదారుల నుండి ఆసక్తి పెరిగినట్లు నివేదిస్తున్నారు. వివాహ సంబంధిత కొనుగోళ్లు, సాధారణంగా ఈ సమయంలో ప్రారంభమవుతాయి. ఇది కూడా డిమాండ్ ను పెంచుతుంది.అంతర్జాతీయ, దేశీయ కారకాలుఈ ధరల పెరుగుదల తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు. జాతీయంగా, ప్రధాన నగరాల్లో బంగారం పెరిగింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, కరెన్సీ హెచ్చుతగ్గుల మధ్య అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్ అస్థిరత మధ్య సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా బంగారాన్ని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
23 నుంచి ట్రూ కలర్స్ ఐపీఓ.. షేర్ల ధరలు ఎంతంటే..
ముంబై: డిజిటల్ టెక్స్టైల్ ప్రింటర్ల దిగుమతి, పంపిణీదారు ట్రూ కలర్స్ కంపెనీ ఐపీఓకి సిద్ధమైంది. మార్కెట్ నుంచి రూ.128 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ.181–191గా నిర్ణయించింది. సబ్స్క్రిప్షన్ మంగళవారం (సెప్టెంబర్ 23న) ప్రారంభమై... గురువారం ముగిస్తుంది. యాంకర్ ఇన్వె స్టర్లకు సెప్టెంబర్ 22నే బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది.సమీకరించిన నిధుల్లో మూలధన అవసరాలకు రూ.48.90 కోట్లు, రుణ చెల్లింపులకు రూ.40.40 కోట్లు మిగిలిన ధనాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ బుకింగ్ రన్నింగ్ మేనేజర్గా, బిగ్షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి. 2021 అక్టోబర్లో ఏర్పాటైన ట్రూ కలర్స్ సంస్థ కోనికా మినోల్టా, హోప్టెక్, ఐటెన్, పెంగ్డా, స్కైజెట్ వంటి బ్రాండ్ల నుండి డిజిటల్ టెక్స్టైల్ ప్రింటర్లను దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తోంది. -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఎస్ఎస్ఈలో మరిన్ని ట్రస్ట్లకు చోటు
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ) ప్లాట్ఫామ్ను మరింత విస్తృతపరిచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎస్ఎస్ఈ ద్వారా నిధుల సమీకరణకు మరిన్ని చారిటబుల్ ట్రస్ట్లను అనుమతించనుంది. ఈ బాటలో లిస్టింగ్ పరిధిని పెంచుతూ సర్క్యులర్ను జారీ చేసింది. ఇందుకు లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. దీంతో ఎస్ఎస్ఈ లిస్టింగ్ పరిధిలోకి మరిన్ని సంస్థలు చేరనున్నాయి.ఇందుకు అనుగుణంగా 1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం, సంబంధిత రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1956 కంపెనీల చట్టంలో భాగంగా సెక్షన్ 25కింద రిజిస్టరైన కంపెనీలను తాజా మార్గదర్శకాలలోకి చేర్చింది. అయితే ఈ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతూ సంబంధిత నిబంధనలను సైతం ప్రకటించింది. ఎలాంటి సెక్యూరిటీలను లిస్ట్చేయని ఎన్పీవోలు ఏఐఆర్ నివేదికను సొంతంగా రూపొందించి దాఖలు చేయవలసి ఉంటుంది. తద్వారా ఎన్పీవో ప్రధాన కార్యకలాపాలతోపాటు ఏడాది పొడవునా చేపట్టిన ప్రోగ్రామ్లు, మధ్యవర్తిత్వాలు, ప్రాజెక్టులను వివరణలతో తెలియజేయవలసి ఉంటుంది. ఆయా సంస్థల ప్రాధాన్యతను గుర్తించేలా వీటిని రూపొందించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్! -
ఐపీవో రష్..!
వచ్చే వారం (22–26) ప్రైమరీ మార్కెట్లలో సందడే సందడి.. మెయిన్బోర్డులో 6 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు మార్కెట్లను పలకరించనుండగా.. మరో 3 ఇష్యూలు ముగియనున్నాయి. ఇప్పటికే నిధుల సమీకరణ పూర్తి చేసుకున్న మరో 4 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నాయి. వెరసి వచ్చే వారం ఐపీవో నామవారంగా నిలవనుంది. వివరాలు చూద్దాం..రానున్న సోమవారం(22) నుంచి శుక్రవారం(26) మధ్యలో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. ఇటీవల జోరందుకున్న పబ్లిక్ ఇష్యూలు మరింతగా వెల్లువెత్తనున్నాయి. రూ. 560 కోట్ల సమీకరణకు ఈ వారం ప్రారంభమైన ఐవేల్యూ ఇన్ఫో 22న ముగియనుండగా.. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ(రూ. 900 కోట్లు), జీకే ఎనర్జీ(రూ. 465 కోట్ల సమీకరణ) 23న పూర్తికానున్నాయి. ఇక 22–24 మధ్య అట్లాంటా ఎలక్ట్రికల్స్(రూ. 687 కోట్లు), గణేశ్ కన్జూమర్ ప్రొడక్ట్స్(రూ. 409 కోట్లు), 23–25 మధ్య ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్(రూ. 745 కోట్లు), శేషసాయి టెక్నాలజీస్(రూ. 480 కోట్లు), సోలార్ వరల్డ్(రూ. 490 కోట్లు), జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్స్(రూ. 450 కోట్లు), 24–26 మధ్య జైన్ రిసోర్స్ రీసైక్లింగ్(రూ. 1,250 కోట్లు), ఈప్యాక్ ప్రీఫ్యాబ్(రూ.504 కోట్లు) ఇన్వెస్టర్లకు జోష్నివ్వనున్నాయి. ఈ కంపెనీలు ఉమ్మడిగా దాదాపు రూ. 7,000 కోట్లు సమీకరించనున్నాయి. కొద్ది నెలలుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 60 కంపెనీలు లిస్టింగ్కు రావడం ద్వారా రూ. 78,000 కోట్లకుపైగా సమీకరించడం గమనార్హం! లిస్టింగ్కు 5 కంపెనీలు రెడీ ఇప్పటికే విజయవంతంగా ఐపీవోలు చేపట్టిన 5 కంపెనీలు వచ్చే వారం మెయిన్బోర్డులో లిస్ట్కానున్నాయి. జాబితాలో యూరో ప్రతీక్ సేల్స్ (23న), వీఎంఎస్ టీఎంటీ (24న), ఐవేల్యూ ఇన్ఫో (25న), సాతి్వక్ గ్రీన్, జీకే ఎనర్జీ(26న) చేరాయి. ఎస్ఎంఈల దూకుడు చిన్న, మధ్యతరహా కంపెనీ(ఎస్ఎంఈ)ల నిధుల సమీకరణకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక ప్లాట్ఫామ్లను తీసుకువచి్చన నేపథ్యంలో కొన్నేళ్లుగా ఐపీవోలు క్యూ కడుతున్నాయి. ఈ బాటలో ఈ వారం పబ్లిక్ ఇష్యూలు పూర్తి చేసుకున్న 4 ఎస్ఎంఈలు వచ్చే వారం లిస్ట్కానుండగా.. ఏకంగా 16 కంపెనీలు ఐపీవోలకు రానుండటం విశేషం! జాబితాలో ప్రైమ్ కేబుల్, సాల్వెక్స్ ఎడిబుల్స్, భారత్రోహన్ ఎయిర్బోన్, ఆప్టస్ ఫార్మా, ట్రూ కలర్స్, మ్యాట్రిక్స్ జియో, ఎన్ఎస్బీ బీపీవో సొల్యూషన్స్, ఎకోలైన్ ఎగ్జిమ్, సిస్టమాటిక్ ఇండస్ట్రీస్, జస్టో రియల్ఫిన్టెక్, రిద్ధీ డిస్ప్లే, గురునానక్ అగ్రికల్చర్, ప్రరూహ్ టెక్ తదితర కంపెనీలు చేరాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ముగించాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అధిక స్థాయిలో లాభాల బుకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో బలహీనత ఈ క్షీణతకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 387.73 పాయింట్లు లేదా 0.47 శాతం నష్టపోయి 82,626.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 96.55 పాయింట్లు లేదా 0.38 శాతం తగ్గి 25,327.05 వద్ద ముగిసింది.సెన్సెక్స్ కాంపోనెంట్ లలో, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీ ఎయిర్ టెల్, ఎన్టిపిసి, ఏషియన్ పెయింట్స్ 1.13 శాతం లాభాలను నమోదు చేశాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా 1.52 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.04 శాతం, 0.15 శాతం స్వల్ప లాభాలతో ముగిశాయి. రంగాలపరంగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.28 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టీ మెటల్, ఫార్మా, రియల్టీ సూచీలు లాభాలు పొందాయి. ఎఫ్ఎంసిజి, ఐటి, ఆటో, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.65 శాతం వరకు క్షీణించాయి.మొత్తంగా మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన 3,133 స్టాక్స్ లో 1,601 లాభాలను అందుకోగా 1,427 క్షీణించాయి. 105 మారలేదు. శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి, ఎన్ఎస్ఈ-లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.24 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
చిన్న బ్రేక్.. మళ్ళీ మొదలైన బంగారం ధరల మోత!
రెండు రోజుల తగ్గుదల తరువాత బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. దీంతో ధరల్లో మళ్లీ మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గత రెండు రోజులుగా లాభాల్లో ఉన్న మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు తగ్గి 25,364కు చేరింది. సెన్సెక్స్(Sensex) 243 పాయింట్లు నష్టపోయి 82,773 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.25 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 83,013.96 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లు లేదా 0.36 శాతం లాభంతో 25,421.00 వద్ద నిలిచాయి.టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్, దీపక్ బిల్డర్స్ & ఇంజనీర్స్ ఇండియా, షాలిమార్ పెయింట్స్, జీటీఎల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, ఎక్స్ప్రో ఇండియా, బ్రాండ్ కాన్సెప్ట్స్, రుషిల్ డెకర్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు..
న్యూఢిల్లీ: జీవిత కాల గరిష్ట స్థాయిల వద్ద పసిడి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి మంగళవారం కొత్త గరిష్ట స్థాయి రూ.1,15,100 స్థాయికి చేరుకోగా.. బుధవారం రూ.1,300 నష్టపోయి రూ.1,13,800కు పరిమితమైంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో.. సేల్స్ పెరిగాయి.‘‘యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మెగ్గు చూపించడంతో బంగారం బలహీనంగా ట్రేడయ్యింది. కీలకమైన సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకున్నారు. కేవలం ఫెడ్ రేట్ల కోతపైనే కాకుండా, తదుపరి రేట్ల సవరణ దిశగా ప్రకటించే అంచనాల కోసం మార్కెట్లు వేచి చూస్తున్నాయి.ఇదీ చదవండి: కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటుతటస్థ విధానం లేదా తదుపరి రేట్ల కోతకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ లోపిస్తే బంగారం ధరలు ఇక్కడి నుంచి కొంత శాతం తగ్గొచ్చు’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. మరోవైపు వెండి సైతం అమ్మకాల ఒత్తిడితో కిలోకి రూ.1,670 నష్టపోయి రూ.1,31,200 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం తగ్గి 3,665 డాలర్ల వద్ద, కామెక్స్ ఫ్యూచర్స్లో పావు శాతం తగ్గి 3,717 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ బిట్కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటుయూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025 -
కొంటే ఇప్పుడు కొనండి!.. తగ్గిన గోల్డ్ రేటు
బంగారం ధరలు చాన్నాళ్ల తరువాత తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు గరిష్టంగా.. రూ.550 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. పసిడి ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది. కాగా ఈ రోజు (సెప్టెంబర్ 18) పసిడి ధరలు ఏ నగరంలో ఎలా ఉన్నాయో ఇక్కడ వివరంగా చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,400 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:23 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 25,407కు చేరింది. సెన్సెక్స్(Sensex) 288 పాయింట్లు పుంజుకొని 82,981 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 96.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.76 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.07 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.1 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.33 శాతం పడిపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏఎంసీ షేర్ల హవా
దేశీ స్టాక్ మార్కెట్లను మించుతూ గత ఆరు నెలలుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 10 శాతం పుంజుకోగా.. లిస్టెడ్ కంపెనీల షేర్లు 50–30 శాతం మధ్య పురోగమించాయి. ప్రధానంగా దేశీ పెట్టుబడులు జోరందుకోవడం ఇందుకు సహకరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. కుటుంబ ఆదాయాలు బలపడటం, పెట్టుబడి అవకాశాలపట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటలైజేషన్తోపాటు.. మార్కెట్లో సరళతర లావాదేవీలకు వీలు ఏర్పడటం వంటి అంశాలు కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా పొదుపునకు వెచ్చించగల ఆదాయాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వివిధ పెట్టుబడి విభాగాలపై దృష్టిపెడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారం, రియల్టీ తదితర ఫిజికల్ ఆస్తుల నుంచి పొదుపు ఆలోచన ఆర్థిక మార్గాలవైపు మళ్లుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు దేశీయంగా రిటైలర్లు ఈక్విటీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్త్మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బత్తిని పేర్కొన్నారు. ఫలితంగా విభిన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. వెరసి మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)కు చెందిన క్రమానుగత పెట్టుబడి(సిప్) పథకాలు, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు) తదితరాలకు పెట్టుబడులు తరలివస్తున్నట్లు వివరించారు. సిప్ల దన్నుబీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆస్తుల నిర్వహణా పరిశ్రమలోని లిస్టెడ్ దిగ్గజాలలో అత్యధికంగా నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ స్టాక్స్ గత ఆరు నెలల్లో 53 శాతానికిపైగా దూసుకెళ్లాయి. ఈ బాటలో యూటీఐ ఏఎంసీ 48 శాతం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 40 శాతం జంప్చేయగా.. శ్రీరామ్ ఏఎంసీ 23 శాతం, కేఫిన్ టెక్నాలజీస్ 22 శాతం చొప్పున ఎగశాయి. ప్రధానంగా పసిడి, వెండిపై ఇన్వెస్ట్ చేసే కుటుంబ ఆదాయాలు విభిన్న పెట్టుబడి పథకాలవైపు ప్రయాణిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎఫ్లకు తరలి వస్తున్న పెట్టుబడులు, నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ భారీగా మెరుగుపడటం, సిప్ల ద్వారా రిటైలర్ల నిరవధిక పెట్టుబడులు ఏఎంసీ కంపెనీల షేర్లకు జోష్నిస్తున్నట్లు తెలియజేశారు.పెట్టుబడుల తీరిలా నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం గత నెల(ఆగస్ట్)లో ఈక్విటీలలోకి నికర పెట్టుబడులు నెలవారీగా చూస్తే 25 శాతం క్షీణించి రూ. 42,360 కోట్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రపంచస్థాయిలో భౌగోళిక, రాజకీయ అస్థిరతలు కొంతమేర ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే సిప్ పథకాలకు నిలకడగా రూ. 28,270 కోట్లు ప్రవహించడం రిటైల్ ఇన్వెస్టర్ల కట్టుబాటును సూచిస్తున్నట్లు ప్రస్తావించారు! ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో ఎంఎఫ్ల ఏయూఎం 11 శాతం బలపడి రూ. 74.41 లక్షల కోట్లను తాకాయి. ఇందుకు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ దన్నునిచ్చాయి. ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ వివరాల ప్రకారం ఈ కాలంలో ఏయూఎం రూ. 7 లక్షల కోట్లమేర పుంజుకుంది. నికరంగా రూ. 4.18 లక్షల కోట్ల పెట్టుబడులు జమయ్యాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వస్తున్నాయ్ కొత్త ఐపీవోలు.. కొనుక్కోండి షేర్లు
సోలార్ ఫొటొ వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 442–465 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. కంపెనీ లిస్టయితే రూ. 5,910 కోట్ల మార్కెట్ విలువను అందుకునే వీలుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 477 కోట్లు సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేయనుంది. ఒడిషాలోని గోపాల్పూర్ ఇండ్రస్టియల్ పార్క్లో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. మరో రూ. 166.5 కోట్లు అనుబంధ సంస్థ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. 2025 జూన్30కల్లా 3.8 గిగావాట్ల సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టుఎండ్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ సంబంధ సర్వీసులను కంపెనీ సమకూర్చుతోంది.జీకే ఎనర్జీ @ రూ. 145–153 సౌర విద్యుత్(సోలార్ పవర్) ఆధారిత వ్యవసాయ నీటి పంప్ సిస్టమ్స్ అందించే జీకే ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 145–153 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 19న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 65 కోట్ల విలువైన 42 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి 23న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 465 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను విక్రయించనుంది.ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 323 కోట్లు కంపెనీ దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సోలార్ పవర్ వ్యవసాయ పంప్ సిస్టమ్స్కు కంపెనీ పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కమిషనింగ్(ఈపీసీ) సేవలు సమకూర్చుతోంది. తద్వారా రైతులకు వీటికి సంబంధించిన సర్వే, డిజైన్, సప్లై, అసెంబ్లీ, ఇన్స్టలేషన్, టెస్టింగ్, నిర్వహణ తదితర ఏకీకృత సర్వీసులు అందిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 98 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
బ్యాంక్, ఐటీ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరుతుందన్న ఆశాభావంతో భారత ఈక్విటీ సూచీలు సానుకూలంగా కదిలాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, టైటాన్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్ వెనుకబడి ఉన్నాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.08 శాతం, స్మాల్ క్యాప్ 0.68 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.61 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.5 శాతం నష్టపోయింది. -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారు ధర.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరిగాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,300 పాయింట్ల వద్ద నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:27 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,307కు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు పుంజుకొని 82,589 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెండు నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలం కావొచ్చనే ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి బలోపేతం, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 82,381 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు బలపడి 25,239 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి సూచీలకి రెండు నెలల గరిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి.ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణలు, పండుగ డిమాండ్ రికవరీపై ఆశలతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు సఫలమవ్వొచ్చనే ఆశలతో ఐటీ షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 658 పాయింట్లు బలపడి 82,443 వద్ద, నిఫ్టీ 192 పాయింట్లు ఎగసి 25,261 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు 1% పెరిగాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ అధిక వెయిటేజీ ఎల్అండ్టీ(2%), కోటక్ మహీంద్రా(2.50%), మహీంద్రా (2.2%), మారుతీ (2%), టీసీఎస్ (1%) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఆర్జించిన మొత్తం పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 352 పాయింట్లు కావడ విశేషం. -
సరికొత్త శిఖరాలకు పసిడి
న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త రికార్డును సృష్టించాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.1,800 పెరిగి రూ.1,15,100 స్థాయికి చేరింది. ఇదొక సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి. డాలర్ బలహీనత, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండడంతో ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదవుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం కొత్త గరిష్టానికి చేరింది.కిలోకి రూ.570 పెరిగి రూ.1,32,870 స్థాయిని నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ సెపె్టంబర్ భేటీలో భారీ రేట్ల కోత దిశగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తీసుకురావడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ డాలర్ బలహీనతకు తోడు, ఫెడ్ ఒకటికి మించిన రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలతో మంగళవారం బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరినట్టు చెప్పారు.పది వారాల కనిష్టానికి డాలర్ ఇండెక్స్ బలహీనపడినట్టు తెలిపారు. రేట్ల కోత దిశగా ఫెడ్ సానుకూల వైఖరి, భారత్, చైనాతో అమెరికా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన పరిణామాలతో ట్రేడర్లు బంగారంలో లాంగ్ పొజిషన్లను కొనసాగిస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం లాభాలతో కొనసాగుతూ 3,739 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది. -
నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్
డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్లో మాట్లాడుతూ.. తన పోర్ట్ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబిట్కాయిన్ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్కాయిన్ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్కాయిన్, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 594.95 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో.. 82,380.69 వద్ద, నిఫ్టీ 169.90 పాయింట్లు లేదా 0.68 శాతం లాభంతో 25,239.10 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. కొఠారి ప్రొడక్షన్, రవీందర్ హైట్స్, రెడింగ్టన్, లక్ష్మీ డెంటల్, పావ్నా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు చేరాయి. శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, మాగ్నమ్ వెంచర్స్, థెమిస్ మెడికేర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
82,000 మార్కు చేరిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 25,128కు చేరింది. సెన్సెక్స్(Sensex) 216 పాయింట్లు పుంజుకుని 82,002 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
7 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఊగిసలాడుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సెబీ తాజాగా 7 కంపెనీలను అనుమతించింది. జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్,కెనరా రొబెకో, హీరో మోటర్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 55 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా సుమారు రూ. 75,000 కోట్లు సమీకరించాయి. మరో 12 కంపెనీలు రెండు, మూడు వారాల్లో ఐపీవోకు రానున్నాయి. తాజా వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇటీవల జోరుగా లిస్టవుతున్న పలు కంపెనీల బాటలో మరో 7 కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు దారి ఏర్పడింది. సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల సమీకరణ బాటలో సాగనున్నాయి. ఐపీవోకు అనుమతి పొందిన కంపెనీల జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రొబెకో ఏఎంసీ, హీరో మోటార్స్సహా ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, పైన్ ల్యాబ్స్, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఎంటీఆర్ ఫుడ్స్ చేరాయి. ఈ ఏడాది(2025) ఏప్రిల్–జూలై మధ్య ఈ కంపెనీలన్నీ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వెరసి ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మర్చంట్ వర్గాలు తెలియజేశాయి. అత్యధిక శాతం కంపెనీలు ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. మరోవైపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులకు తమ పెట్టుబడులు విక్రయించేందుకు సైతం వీలు కల్పించనున్నాయి. జీవిత బీమా సంస్థ పీఎస్యూ దిగ్గజం కెనరా బ్యాంక్ బీమా అనుబంధ సంస్థ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా సంస్థ 23.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు, ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ సైతం 47 లక్షల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ను కెనరా బ్యాంక్, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ గ్రూప్ ప్రమోట్ చేశాయి. 2024 మార్చికల్లా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం)రీత్యా మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.ఫిన్టెక్ కంపెనీపీఈ దిగ్గజాలు టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఫిన్టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 2,600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు మరో 14.78 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లోక్వీర్ కపూర్సహా.. టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్, యాక్టిస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 870 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 760 కోట్లు క్లౌడ్, డిజిటల్ చెక్ఔట్ పాయింట్లు తదితర ఐటీ మౌలికసదుపాయాలపై వెచి్చంచనుంది.రూ. 1,200 కోట్లపై కన్నుపబ్లిక్ ఇష్యూలో భాగంగా హీరో మోటార్స్ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రమోటర్ సంస్థలలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ. 390 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్లోగల యూనిట్ విస్తరణకు రూ. 237 కోట్లు(పరికరాల కొనుగోలుకి) వెచి్చంచనుంది.అసెట్ మేనేజ్మెంట్ఐపీవోలో భాగంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ).. కెనరా రొబెకో ఏఎంసీ 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని సంస్థ ప్రమోటర్లు కెనరా బ్యాంక్(2.59 కోట్ల షేర్లు), ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్వీ(2.39 కోట్ల షేర్లు) ఆఫర్ చేయనున్నాయి. వెరసి ఐపీవో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి.సోలార్ పరికరాలుఐపీవో ద్వారా సోలార్ పరికరాల తయారీ కంపెనీ ఎమ్వీ ఫొటొవోల్టాయిక్ పవర్ రూ. 3,000 కోట్లు అందుకోవాలని ప్రణాళికలు వేసింది. వీటిలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 2,144 కోట్లు, ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 856 కోట్లు చొప్పున సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,608 కోట్లు అనుబంధ సంస్థలతోపాటు కంపెనీ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఒర్క్లా ఇండియాఎంటీఆర్ ఫుడ్స్, ఈస్టర్న్ బ్రాండ్లతో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు విక్రయించే ఒర్క్లా ఇండియా(మాతృ సంస్థ) ఐపీవో ద్వారా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లతోపాటు.. ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. మణిపాల్ పేమెంట్బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ కార్ట్ తయారీ కంపెనీ మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఐపీవో బాటలో మెడికవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్కేర్ సేవల దిగ్గజం మెడికవర్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుత రుణభారం సుమారు రూ.1,000 కోట్లుగా ఉంది. సంస్థ సీఎండీ అనిల్ కృష్ణ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. కొత్తగా రెండు ఆస్పత్రులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. గ్రూప్లో 24వదైన సికింద్రాబాద్ హాస్పిటల్ను మంగళవారం (నేడు) ప్రారంభించనుండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో మరొకటి (500 బెడ్స్ సామర్థ్యం) అందుబాటులోకి వస్తుందని కృష్ణ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం సుమారు రూ. 1,850 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇక కొత్త ఆస్పత్రితో కలిపి నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) పడకల సామర్థ్యం 5,800గా ఉంటుందని కృష్ణ చెప్పారు. హైదరాబాద్ చందానగర్లో 150 పడకల విస్తరణతో మొత్తం బెడ్స్ సంఖ్య 6,400కి చేరుతుందన్నారు. ఐపీవోకి సంబంధించి వంద కోట్ల డాలర్ల దాకా వేల్యుయేషన్ అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ ... ప్రస్తుతం తమకు కార్యకలాపాలున్న ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కృష్ణ తెలి పారు. బెంగళూరు, పుణేల్లాంటి నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించారు. అవకాశం వస్తే 300 –350 బెడ్స్ సామర్థ్యాలు ఉండే ఇతర ఆస్పత్రుల కొనుగోలు అంశాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. సాధా రణంగా లీజు ప్రాతిపదికన ప్రాంగణాలను తీసుకుంటున్న తాము ఇకపై తమ కార్యకలాపాల కోసం పూర్తి స్థాయిలో ప్రాపర్టీని కొనుగోలు చేయడంపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రతిభావంతులైన వైద్యుల కొరత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అధునాతన టెక్నాలజీ గల పరికరాల దిగుమతి వ్యయాలు పెరిగిపోవడమనేది, చికిత్స వ్యయాల పెరుగుదలకు దారితీస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన, కచి్చతమైన చికిత్సను అందించడంలో కృత్రిమ మేథ (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని కృష్ణ చెప్పారు. -
ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్లు
వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే ‘ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’ను ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) సెప్టెంబర్ 24న ప్రారంభమై అక్టోబర్ 8న ముగుస్తుంది. ఇది తమ తొలి ఫండ్ అని సంస్థ ఎండీ మధు లూనావత్ తెలిపారు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని, నిఫ్టీ 500 టీఆర్ఐ దీనికి బెంచ్మార్క్గా ఉంటుందని పేర్కొన్నారు.ప్రైవేట్ ఈక్విటీ సంస్థల తరహాలో కూలంకషంగా అధ్యయనం చేసి ఫండమెంటల్స్, వేల్యుయేషన్లు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని మధు వివరించారు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పాంటోమత్ గ్రూప్లో ది వెల్త్ కంపెనీ భాగంగా ఉంది. పలు ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్ (ఏఐఎఫ్)ను కూడా నిర్వహిస్తోంది.హెచ్డీఎఫ్సీ ‘డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్’ ఎఫ్వోఎఫ్ .. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్క్యాప్లవ్యాప్తంగా దేశీయంగా ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.పలు ఫండ్ మేనేజర్ల అనుభవం, వివిధ రకాల పెట్టుబడుల ధోరణులు, క్రమశిక్షణతో కూడుకున్న రీబ్యాలెన్సింగ్ ప్రయోజనాలన్నింటినీ ఈ ఒక్క ఫండ్తో పొందవచ్చని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. ఎన్ఎఫ్వో వ్యవధిలో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ తొలి ఫండ్.. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఎటువంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు మందగించాయి. అయితే ఈ వారం చివర్లో రానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై ట్రేడర్లు దృష్టి సారించారు. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 118.96 పాయింట్లు లేదా 0.15 శాతం స్వల్పంగా తగ్గి 81,785.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 44.8 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టపోయి 25,069.2 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్ లో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, టైటాన్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్ లో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, బజాజ్ ఫైనాన్స్, ఎటర్నల్ (జొమాటో), అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.అయితే, విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.44 శాతం, 0.76 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 2.41 శాతం పెరిగి టాప్ గెయినర్ గా ఉంది. ఫ్లిప్ సైడ్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.64 శాతం క్షీణించాయి. -
జియో బ్లాక్రాక్ తొలి ఫండ్..
జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ తొలి యాక్టివ్ ఈక్విటీ ఫండ్ ‘జియోబ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్’ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 23న ప్రారంభం కానుంది. ‘‘ఇది మాకు తొలి యాక్టివ్ ఫండ్ అవుతుంది. మరో మూడు నాలుగు యాక్టివ్ ఈక్విటీ ఫండ్స్ కూడా త్వరలో రానున్నాయి. ఈటీఎఫ్లను సైతం తీసుకొస్తాం’’అని జియోబ్లాక్రాక్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రిషి కోహ్లీ ప్రకటించారు.అంతర్జాతీయంగా నిరూపితమైన ఎస్ఏఈ ప్లాట్ఫామ్పై దీన్ని నిర్మించామని, 400 సంకేతాల ఆధారంగా, టెక్నాలజీ సాయంతో పెట్టుబడులు పెట్టనున్నట్టు, దీనివల్ల వ్యక్తుల ప్రమేయానికి సంబంధించి రిస్క్ తగ్గుతుందని జియోబ్లాక్రాక్ తెలిపింది.నష్టాల రిస్క్ను పరిమితం చేయడం, స్థిరమైన రాబడిని తెచ్చిపెట్టడం జియోబ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లక్ష్యమని పేర్కొంది. జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ అన్నది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్రాక్ ఆధ్వర్యంలోని జాయింట్ వెంచర్ కంపెనీ కావడం గమనార్హం. -
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు (సెప్టెంబర్ 15) తెలుగు రాష్ట్రాల్లో సహా చెన్నై, ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,092కు చేరింది. సెన్సెక్స్(Sensex) 31 పాయింట్లు నష్టపోయి 81,869 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.38 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.06 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.45 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్వైపు ఇన్వెస్టర్ల చూపు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపించగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. దీంతో ఫైనాన్షియల్ మార్కెట్లతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు సైతం ఫెడ్ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నాయి. మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక టెక్నికల్ అంశాల ప్రకారం మార్కెట్లు ఈ వారం బ్రేకవుట్ సాధించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.దేశీయంగా నేడు(15న) ఆగస్ట్ నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 2025 జూలైలో డబ్ల్యూపీఐ మైనస్ 0.45 శాతంగా నమోదైంది. అయితే గత నెలలో 0.45 శాతం పెరిగే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఇతర కీలక విభాగాలలో ధరల పెరుగుదల కారణంకానున్నట్లు అంచనా వేశారు. కాగా.. గత వారాంతాన విడుదలైన వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 2.07 శాతానికి చేరింది. జూలైలో 1.61 శాతం కాగా, గత నెలలో కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్లు, నూనెలు, కొవ్వు ఉత్పత్తుల ధరలు పెరగడం ప్రభావం చూపింది. ఇవికాకుండా యూఎస్తో వాణిజ్య వివాదాలకు చెక్ పడటంపై సానుకూల సంకేతాలు వెలువడితే దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. కనీసం పావు శాతం ఫెడరల్ రిజర్వ్ చైర్పర్శన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఈ నెల 16 నుంచి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) రెండు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించనుంది. యూఎస్ ఉపాధి మార్కెట్ నీరసించిన నేపథ్యంలో 17న ఫెడరల్ ఫండ్స్(కీలక వడ్డీ) రేటులో కోత పెట్టనున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సీపీఐ జూలైలో 0.2 శాతంకాగా.. ఆగస్ట్లో 0.4 శాతానికి ఎగసింది. దీంతో వార్షిక ద్రవ్యోల్బణం 2.9 శాతంగా నమోదైంది. దీంతో ఈసారి పాలసీ సమావేశంలో ఉద్యోగ కల్పనకు దన్ను, ధరల తగ్గింపును ఫెడ్ కీలక లక్ష్యాలుగా ఎంచుకునే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. కనీసం పావు శాతం కోతకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేటు 4.25–4.5% గా ఉంది. ఈ నేపథ్యంలో అటు యూఎస్, ఆసియా మార్కెట్లతోపాటు దేశీయంగానూ ఫెడ్ వడ్డీ రేట్ల కోత బలమివ్వనున్నట్లు ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. అయితే ఫెడ్ వడ్డీ కోత పెడితే దేశీ మార్కెట్లో పెట్టుబడులు పుంజుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల(ఆగస్ట్)లో దేశీ స్టాక్స్ నుంచి ఎఫ్పీఐలు రూ. 34,900 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. జూలైలోనూ రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఈ నెలలో సైతం తొలి వారంలో రూ. 12,257 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం గమనార్హం! కాగా.. డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టాలకు చేరుతోంది. దీంతో అటు పసిడి, ఇటు ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. రూపాయి బలహీనతతో దిగుమతుల బిల్లు పెరిగి మరింత వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. అయితే ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో వినియోగం ఊపందుకోనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా.. జీఎస్టీ సంస్కరణలు, భారత్, యూఎస్ మధ్య టరిఫ్ వివాద పరిష్కారంపై ఆశలతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 1,117 పాయింట్లు(1.4%) జంప్చేసి 81,905 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 314 పాయింట్లుపైగా(1.4%) ఎగసి 25,114 వద్ద స్థిరపడింది.బ్రేకవుట్కు చాన్స్యూఎస్, భారత్ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో కోతపై అంచనాలు, జీఎస్టీ సంస్కరణలతో పలు రంగాలలో ఊపందుకోనున్న వినియోగం వంటి సానుకూల అంశాలు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చాయి. తాజా సానుకూలతల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లలో బ్రేకవుట్కు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. కొద్దిరోజులుగా బీఎస్ఈ సెన్సెక్స్ 79,750–82,250 పాయింట్ల శ్రేణిలో కదులుతోంది. 82,250ను అధిగమిస్తే.. 83,500–83,650 పాయింట్లకు బలపడే వీలుంది. ఒకవేళ దిగువకు చేరితే.. 81,450–81,200 స్థాయిలో మద్దతు లభించవచ్చు. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ పుంజుకుంటే 25,250ను అధిగమించవలసి ఉంటుంది. ఆపై 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. బలహీనపడితే 24,900 వద్ద తొలుత, ఆపై 24,700 వద్ద తదుపరి మద్దతు అందుకునే వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీగా పెరిగిన బంగారం: పెట్టుబడికి ఓ మంచి మార్గం!
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2024 సెప్టెంబర్లో దాదాపు రూ.73,200 వద్ద ఉండేది. అదే ఇప్పుడు (2025 సెప్టెంబర్) రూ.1,11,000కు చేరింది. అంటే రేటు సుమారు 54 శాతం పెరిగిందన్నమాట. గోల్డ్ ధరలు మాత్రమే కాకుండా.. గోల్డ్ ఈటిఎఫ్లు కూడా 50% వరకు రాబడిని అందించాయి. ఇది ఈటిఎఫ్లలో పెట్టుబడులను పెంచడానికి దోహదపడింది.2025 ఆగస్టులో గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు రూ.2,189.5 కోట్లు అని తెలుస్తోంది. ఏఎంఎఫ్ఐ ప్రకారం.. గోల్డ్ ఈటిఎఫ్లలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ.72,495 కోట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని స్పష్టమవుతోంది.గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏమిటి?గోల్డ్ ఈటీఎఫ్లు అనేవి.. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. పెట్టుబడిదారులకు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించే మ్యూచువల్ ఫండ్ వంటిది అన్నమాట. పెట్టుబడిదారులు షేర్ల మాదిరిగానే డీమ్యాట్ ఖాతాల ద్వారా ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు, తద్వారా వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటి విలువ బంగారం ధరలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి.పెట్టుబడిదారులు గోల్డ్ ఈటిఎఫ్లను ఎందుకు ఇష్టపడతారు●గోల్డ్ ఈటీఎఫ్లను స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు.●సాధారణ బంగారం మాదిరిగా.. గోల్డ్ ఈటిఎఫ్లనుప్రత్యేకంగా భద్రపరచాల్సిన అవసరం లేదు.●గోల్డ్ ఈటీఎఫ్లను చిన్న మొత్తంలో.. అంటే రూ. 500 లేదా రూ. 1000 కి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.●గోల్డ్ ఈటీఎఫ్లకు మంచి లిక్విడిటీ ఉంటుంది. వీటిని తొందరగా అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.బంగారంపై పెట్టుబడికి మార్గాలు●గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: ప్రధానంగా గోల్డ్ ఈటిఎఫ్లలో పెట్టుబడి●సావరిన్ గోల్డ్ బాండ్లు: వడ్డీతో పాటు, పెరిగిన ధరలను అందుకోవచ్చు●భౌతిక బంగారం: ఆభరణాలు, నాణేలు, కడ్డీలుబంగారం ధరలు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ కదలికలు, భౌగోళిక రాజకీయ సంఘటనలు వంటివన్నీ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి బంగారంపై సురక్షితమైనదని నిపుణులు చెబుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారుడే నిర్ణయం తీసుకోవాలి. -
పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారగా పెరిగాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూ నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా విషయంలో వెసులుబాటును కల్పించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితినీ సవరించనుంది. వీటితో పాటు పలు తాజా ప్రతిపాదనలను శుక్రవారం(12న) నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..ముంబై: అతి భారీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడంలో దన్నునిస్తూ సెబీ తాజాగా పలు వెసులుబాట్లకు తెరతీస్తోంది. ప్రధానంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే అంశంలో గడువును సవరించేందుకు నిర్ణయించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తదితర మెగా అన్లిస్టెడ్ కంపెనీలు లబ్ది పొందే వీలుంది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే దిగ్గజ కంపెనీలు లిస్టింగ్లోనే భారీగా వాటాను విక్రయించవలసిన అవసరం ఉండదు. పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో తగినంత గడువుకు వీలు చిక్కనుంది. 10 శాతం నుంచి తగ్గింపు కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల కంపెనీలు ఐపీవోలో ప్రస్తుత 10 శాతానికి బదులుగా 8 శాతం వాటాను విక్రయించేందుకు అనుమతిస్తారు. వీటికి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించడంలో ఐదేళ్ల గడువునిస్తారు. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా అమలవుతోంది. రూ. లక్ష కోట్లకుపైన మార్కెట్ విలువతో ఐపీవోకు వచ్చే కంపెనీలు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2.75 శాతం వాటాను ఆఫర్ చేయవచ్చు. రూ. 5 లక్షల కోట్లకు మించిన అతిభారీ కంపెనీలైతే ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయానికీ వీలుంటుంది. ఇలాంటి భారీ కంపెనీలు 10ఏళ్లలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐదేళ్లు గడువును అనుమతిస్తోంది. వెరసి అతితక్కువ స్థాయిలో వాటా విక్రయించడం ద్వారా కంపెనీలు లిస్టయ్యేందుకు వీలు చిక్కుతుంది. తదుపరి దశలవారీగా పబ్లిక్ వాటాకు తెరతీయవచ్చు. దీంతో ఓకేసారి భారీస్థాయిలో వాటా విక్రయించవలసిన అవసరం తప్పుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా భారీ ఐపీవోలకు లిక్విడిటీ సమస్య తలెత్తకుండా నివారించవచ్చని తెలియజేశారు. రిటైల్ పరిమాణం ఓకే రూ. 5,000 కోట్లకు మించిన ఐపీవోల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులను 35 శాతంగానే కొనసాగించనున్నట్లు పాండే తెలియజేశారు. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) వాటాను సైతం 50 శాతం నుంచి పెంచే ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐపీవోలలో మరింత చోటు కల్పించేందుకు వీలుగా యాంకర్ కేటాయింపులను సవరిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ప్రకారం యాంకర్ వాటా రూ. 250 కోట్లుదాటితే ఇన్వెస్టర్ల సంఖ్యను ప్రస్తుత 10 నుంచి 15కు పెంచనుంది. కనీసం 5 నుంచి గరిష్టంగా 15వరకూ అనుమతిస్తారు. ఆపై ప్రతీ రూ. 250 కోట్ల కేటాయింపులకు అదనంగా 15మంది ఇన్వెస్టర్లకు వీలుంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్కు కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడికి వీలుంటుంది. ఇదేవిధంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపుల వాటా ప్రస్తుత 33 శాతం నుంచి 40 శాతానికి పెరగనుంది. దీనిలో ఎంఎఫ్లకు 33 శాతం, జీవిత బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లకు మిగిలిన వాటాను రిజర్వ్ చేయనున్నారు. రీట్, ఇన్విట్లలో బీమా, పెన్షన్ ఫండ్స్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ నిబంధనలను సెబీ సవరించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్)సహా కొన్ని కేటగిరీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు)ను ఇందుకు అనుమతించనుంది. అంతేకాకుండా రీట్ను ఈక్విటీగా గుర్తించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రత్యేక పెట్టుబడులకు వీలుగా ఇన్విట్ను హైబ్రిడ్గా కొనసాగించనుంది. ఇన్విట్, రీట్ నిబంధనల సవరణ ద్వారా ఇన్వెస్టర్ల పరిధి మరింత విస్తరించనుంది. దీంతో రీట్, ఇన్విట్ల వ్యూహాత్మక పెట్టుబడిదారుల కేటగిరీలో విభిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వీలు చిక్కనుంది. ఇది రీట్, ఇన్విట్లకు జోష్నివ్వడంతోపాటు.. సులభ వ్యాపార నిర్వహణకు దారి ఏర్పడనున్నట్లు పాండే పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా ఫండ్స్ తదితర పలు భారీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లకు ప్రస్తుత నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపే ఆయా సంస్థలకు రీట్, ఇన్విట్లు అత్యుత్తమ అవకాశాలని సెబీ పేర్కొంది. ఎగ్జిట్ లోడ్ కుదింపు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే వ్యూహంలో భాగంగా సెబీ బోర్డు ఎంఎఫ్ పంపిణీ సంస్థలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మరింత పారదర్శక, నిలకడైన ప్రోత్సాహకాలకు దన్నునిస్తూ గరిష్ట ఎగ్జిట్ లోడ్ను ప్రస్తుత 5 శాతం నుంచి 3 శాతానికి కోత పెట్టింది. టాప్–30 పట్టణాలను దాటి ఫండ్స్లోకి కొత్తగా మహిళా ఇన్వెస్టర్లను చేర్చుకుంటే పంపిణీదారులకు అధిక ప్రోత్సాహకాలు అందేటట్లు నిబంధనలు సవరించింది.లోరిస్క్ ఎఫ్పీఐలకు సపోర్ట్ తక్కువ రిస్్కగల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను సింగిల్ విండో ద్వారా దేశీ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించనున్నారు. ఇందుకు వీలుగా సెబీ బోర్డు నిబంధనలను సవరించింది. తద్వారా ఎఫ్పీఐలకు దేశీయంగా సులభతర పెట్టుబడులకు వీలు చిక్కనుంది. లోరిస్క్ ఎఫ్పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో సులభంగా పెట్టుబడులు చేపట్టేందుకు స్వాగత్–ఎఫ్ఐ పేరుతో తెరతీయనున్న సింగిల్ విండో దారి చూపనుంది. దీంతో యూనిఫైడ్ రిజి్రస్టేషన్ విధానం ద్వా రా విభిన్న పె ట్టుబడి మార్గాలలో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని పాండే తెలియజేశారు. ఫలితంగా పెట్టుబడుల విష యంలో ఎఫ్పీఐలకు పదేపదే ఎదురయ్యే నిబంధనలు, భారీ డాక్యుమెంటేషన్ వంటి అవరోధాలు తొలగిపోనున్నట్లు వివరించారు. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ సొంత ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యంత నియంత్రణలతోకూడిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ చేరనున్నట్లు వెల్లడించారు. స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాల ను ఎఫ్ఫీఐలతోపాటు.. విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్వీసీఐలు)కు వర్తించనున్న ట్లు పేర్కొన్నారు. 2025 జూన్30కల్లా దేశీయంగా 11,913 మంది ఎఫ్పీఐలు రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించింది. రూ. 80.83 లక్షల కోట్ల ఆస్తులను హోల్డ్ చేస్తున్నట్లు తెలియజేసింది. -
బంగారం @ 1,13,800
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం ఈ విలువైన లోహాలు సరికొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.700 పెరగడంతో రూ.1,13,800 స్థాయిని నమోదు చేసింది. వెండి కిలోకి ఏకంగా రూ.4,000 పెరిగి 1,32,000ను తాకింది. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘‘ఇటీవలి యూస్ ఆర్థిక డేటాతో ఫెడ్ 2025లోనే ఒకటికి మించిన విడతల్లో రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో బంగారంలో కొనుగోళ్లు పెరిగాయి’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పారిశ్రామిక డిమాండ్కు తోడు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి బలమైన పెట్టుబడుల ప్రవాహంతో వెండి ధరలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి లాభాన్నిచ్చాయి. ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు రూ.34,850 (44 శాతం), వెండి ధర కిలోకి రూ.42,300 (47 శాతం) చొప్పున పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 3,683 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 25,107.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్టైల్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం వంటి కంపెనీలు చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ. లక్ష.. కోటి రూపాయలైంది..!
స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర 2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది. అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ది. 2025 జూన్ 30 నాటికి ఈ కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.ఒలెక్ట్రా గురించి.. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్2, టైర్3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్ బస్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.) -
పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారం మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,054కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 పాయింట్లు పుంజుకుని 81,691 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.83 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.85 శాతం పెరిగింది.నాస్డాక్ 0.72 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్ఫీ18,000 వేల కోట్ల రికార్డ్ బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి అంగీకరించింది. గురువారం (11న) సమావేశమైన బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్ఈలో ముగింపు ధర రూ. 1,510తో పోలిస్తే బైబ్యాక్కు 19 శాతం ప్రీమియంను నిర్ణయించింది. కంపెనీ 2025 జూన్ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల (రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్ ఫ్లోను ప్రకటించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 2021లో 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టింది. ఇన్ఫోసిస్ షేరు 1.5% క్షీణించి రూ. 1,510 వద్ద ముగిసింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 123.58 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 81,548.73 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,005.50 వద్ద నిలిచాయి.స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్, గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గుడ్ లక్ ఇండియా, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైనమిక్ ప్రొడక్ట్స్(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడుల జోరు ఆగస్ట్లో కొంత తగ్గింది. రూ.33,430 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. జూలైలో రూ.42,702 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్లో రూ.23,587 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2024 ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.38,239 కోట్లుగా ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,980 కోట్లు నికరంగా బయటకు వెళ్లాయి. జూలైలో రూ.1.06 లక్షల కోట్ల నికర డెట్ పెట్టుబడులతో పోల్చి చూస్తే భిన్నమైన పరిస్థితి కనిపించింది. దీంతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.75.20 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఈ మొత్తం రూ.75.36 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు నీరసించడం వెనుక కొత్త పథకాల (ఎన్ఎఫ్వో) ఆవిష్కరణ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘గత ధోరణుల ఆధారంగా ఆగస్ట్ నెలలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు అధికంగా నమోదవుతాయని ఆశించాం. కానీ, అవి ఫ్లాట్గా రూ.28,265 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నప్పటికీ, ఎఫ్పీఐలు విక్రయాలు కొనసాగిస్తున్నా కానీ, భారత ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. మార్కెట్లకు ఇంది ఎంతో అనుకూలం’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. విభాగాల వారీగా..ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి అధికంగా రూ.7,679 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,330 కోట్లను ఆకర్షించాయి.స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.4,993 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.3,893 కోట్ల పెట్టుబడులతో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ తర్వాతి స్థానంలో నిలిచాయి. మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.3,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లో రూ.2,835 కోట్లను ఆకర్షించాయి. 23 న్యూ ఫండ్ ఆఫర్లు (కొత్త పథకాలు) ఆగస్ట్లో రాగా, ఇవన్నీ కలసి రూ.2,859 కోట్లను సమీకరించాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ రూ.2,316 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ డెట్ కలయికతో కూడిన)లోకి పెట్టుబడులు జూలైతో పోలి్చతే ఆగస్ట్లో 27 శాతం తగ్గి రూ.15,293 కోట్లుగా ఉన్నాయి. డెట్ విభాగం నుంచి నికరంగా రూ.7,890 కోట్లను ఇన్వెస్టర్లు ఉపహరించుకున్నారు. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,350 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఓవర్నైట్ ఫండ్స్ రూ.4,950 కోట్లను ఆకర్షించాయి. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,189 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ఆగస్ట్ మాసంలో నికరంగా రూ.52,443 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. జూలైలో వచి్చన రూ.1.8 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 24.89 కోట్లకు చేరాయి. జూలై చివరికి ఇవి 24.13 కోట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్.. కారణం..
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలుక్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
బంగారం స్పీడ్కు బ్రేకులు.. పసిడి ప్రియులకు ఉపశమనం
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త శాంతించి ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,000 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 113 పాయింట్లు పుంజుకుని 81,528 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూల నోట్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ లో ర్యాలీతో లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 323.83 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,425.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 104.50 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24,973.10 వద్ద ముగిసింది.భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4.50 శాతం లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్ షేర్లు 2.46 శాతం వరకు పడిపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.83 శాతం, 0.73 శాతం లాభంతో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 2.63 శాతం, 2.09 శాతం లాభంతో స్థిరపడ్డాయి. ఎంఆర్ఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.28 శాతం నష్టంతో స్థిరపడింది.మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఎన్ఎస్ఈలో 3,128 ట్రేడెడ్ స్టాక్స్ లో 1,835 గ్రీన్లో ముగిశాయి. 1,210 రెడ్లో ముగిశాయి. మరోవైపు 83 షేర్లలో మార్పులేదు. ఎన్ఎస్ఈలో లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.14 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధర రికార్డు స్థాయిలకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:19 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్(Sensex) 327 పాయింట్లు పుంజుకుని 81,436 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ చైర్పర్సన్గా శ్రీనివాస్ ఇంజేటి
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) గవర్నింగ్ బోర్డు చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి శ్రీనివాస్ ఇంజేటి నియమితులయ్యారు. 1960 మే 26న జన్మించిన శ్రీనివాస్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీఏ ఎకనామిక్స్ (ఆనర్స్), ఆ తర్వాత బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లో ఎంబీయే చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి (ఒరిస్సా కేడర్) అయిన శ్రీనివాస్కి కార్పొరేట్ రెగ్యులేషన్, ఆర్థిక సేవలు, గవర్నెన్స్, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుభవం ఉంది.2017 నుంచి 2020 వరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, కంపెనీల చట్టం తదితర సంస్కరణలకు సారథ్యం వహించారు. 2020 నుంచి 2023 వరకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్విసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) వ్యవస్థాపక చైర్మన్గా వ్యవహరించారు. అంతకు ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఖేలో ఇండియా ప్రోగ్రాంనకు శ్రీకారం చుట్టారు. అటు నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీకి కూడా సారథ్యం వహించడంతో పాటు సెబీ, ఎల్ఐసీ తదితర బోర్డుల్లో కూడా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో...
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 81,181 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు 24,892 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీతో పాటు ఫార్మా, టెక్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.22%, 0.20 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్అండ్గ్యాస్, రియల్టి, ఇంధన, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఆటో, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా స్టాక్ సూచీలు 0.50%–2% నష్టపోయాయి. జపాన్ నికాయ్ తొలిసారి 44,000 స్థాయిని అధిగమించి 44,186 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. తదుపరి లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.42% నష్టపోయి 43,459 వద్ద స్థిరపడింది. హాంకాంగ్, కొరియా, థాయ్లాండ్ స్టాక్ సూచీలు 1.50% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్స్ 0.50% నష్టపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.25% పెరిగాయి. అమెరికా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు 5% పెరిగి రూ.1,505 వద్ద స్థిరపడింది. డైరెక్టర్ల బోర్డు ఈ నెల 11న సమావేశమై ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తుందని తెలపడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 5.18% లాభపడి రూ.1,507 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.29,967 కోట్లు పెరిగి రూ.6.25 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. -
వెండి.. భవిష్యత్తు బంగారం!
న్యూఢిల్లీ: బంగారం మాదిరే వెండికి సైతం డిమాండ్ బలపడుతోంది. ఫలితంగా వెండి ధర కిలోకి రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. బలమైన పారిశ్రామిక డిమాండ్, డాలర్ బలహీనత, సురక్షిత సాధనంగా పెట్టుబడుల డిమాండ్ ధరలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర 37 శాతం పెరిగినట్టు గుర్తు చేసింది.‘‘వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చే ఆరు నెలల్లో కిలోకి రూ.1,35,000కు చేరుకోవచ్చు. 12 నెలల్లో రూ.1,50,000కు చేరొచ్చు. డాలర్తో రూపాయి మారకం 88.5 శాతం స్థాయిలో ఉంటుందని భావిస్తూ వేసిన అంచనా ఇది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ తొలుత ఔన్స్కు 45 డాలర్లు, తర్వాత 50 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. బలమైన డిమాండ్ 2025లో వెండి మొత్తం ఉత్పత్తిలో 60 శాతం డిమాండ్ పారిశ్రామిక రంగం నుంచి వచ్చినట్టు యూఎస్కు చెందిన సిల్వర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు, 5జీ ఇన్ఫ్రా రంగాల నుంచి వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు వెండికి డిమాండ్ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ధరలు ఎగిసేందుకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బంగారానికి తోడు వెండిని సైతం తమ రిజర్వుల్లోకి చేర్చుకోవడానికి కొన్ని సెంట్రల్ బ్యాంక్లు ఆసక్తి చూపిస్తుండడం, వెండి మెరుపులకు తోడవుతోంది. వచ్చే మూడేళ్లలో 535 మిలియన్ డాలర్ల విలువైన వెండిని తమ దేశ రిజిర్వుల్లోకి చేర్చుకోనున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది 40 మిలియన్ డాలర్ల మేర సిల్వర్ ఈటీఎఫ్లను కొనుగోలు చేయనుంది. 3,000 టన్నుల దిగుమతిదేశీయంగానూ వెండికి డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,000 టన్నుల వెండి దిగుమతి అయింది. పారిశ్రామిక రంగం నుంచే కాకుండా, పెట్టుబడులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘‘జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత ఫెడ్ సెప్టెంబర్ సమావేశంలో పావు శాతం మేర రేట్లను తగ్గించడం తప్పనిసరి అని తెలుస్తోంది. తక్కువ రేట్లు, యూఎస్ ఈల్డ్స్ క్షీణిస్తుండడం విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా స్వల్పకాలంలో లాభాల స్వీకరణను కొట్టిపారేయలేమని పేర్కొంది. ప్రస్తుత స్థాయి నుంచి, రేట్లు తగ్గిస్తే రూ.1,18,000– 1,15,000 స్థాయి వరకు వెండిని కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
బంగారం ఆల్టైమ్ రికార్డ్ ధర: ఒక్కసారిగా పెరగడానికి కారణాలు
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర మంగళవారం 10 గ్రాములకు రూ.723 పెరిగి రూ.1,10,312కు చేరుకుంది. ఎంసీఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .723 లేదా 0.65% పెరిగి రూ .1,10,312 వద్ద కొత్త గరిష్టానికి చేరుకుంది.అంతర్జాతీయంగా డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్కు 3,698.02 డాలర్ల కొత్త ఆల్-టైమ్ గరిష్టానికి పెరిగింది. స్పాట్ గోల్డ్ కూడా ఔన్స్కు 3,658.38 డాలర్ల రికార్డు స్థాయికి పెరిగింది. బంగారం ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి నిపుణులు పలు కారణాలను పేర్కొంటున్నారు.బంగారం ధర ఆకాశాన్ని తాకడానికి ముఖ్య కారణాలుఅమెరికా ఫెడ్ రేటు తగ్గింపు ఆశలుట్రేడర్లు ఫెడ్ రేట్ల తగ్గింపుపై మరింత ఆశాభావంతో ఉన్నారు. మనీ మార్కెట్లు ఇప్పటికే 25-బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును పూర్తిగా అంచనా వేశాయి. అంతేకాక సీఎంఈ ఫెడ్వాచ్ టూల్ ప్రకారం.. 50-బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు అవకాశాలు కూడా దాదాపు 12% వరకు పెరిగినట్లు తెలుస్తోంది.బలహీనమైన అమెరికన్ డాలర్జపనీస్ యెన్ తో పోలిస్తే డాలర్ 0.2 శాతం తగ్గి 147.21 వద్ద ఉండగా, బ్రిటీష్ పౌండ్ 0.1% పెరిగి 1.3558 డాలర్లకు చేరుకుంది. జూలై 24 నుండి క్లుప్తంగా గరిష్ట స్థాయిని తాకిన తరువాత యూరో 1.1752 డాలర్లకు పడిపోయింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంఉక్రెయిన్ పై మాస్కో ప్రతీకార దాడి తరువాత రష్యాపై అమెరికా అదనపు ఆంక్షల సంభావ్యత సురక్షిత-స్వర్గధామ ఆస్తుల డిమాండ్ ను మరింత పెంచిందని కమోడిటీస్ మార్కెట్ నిపుణులు గుర్తించారు.సుంకం మినహాయింపులునికెల్, బంగారం, వివిధ లోహాలు, అలాగే ఫార్మాస్యూటికల్ కాంపౌండ్స్, రసాయనాలతో సహా పారిశ్రామిక ఎగుమతులపై ఒప్పందాలను కుదుర్చుకునే వాణిజ్య భాగస్వాములకు సెప్టెంబర్ 8 నుంచి సుంకం మినహాయింపులను మంజూరు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు.