breaking news
Market
-
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు తగ్గి 25,538కు చేరింది. సెన్సెక్స్(Sensex) 14 ప్లాయింట్లు పెరిగి 83,713 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏషియన్ పెయింట్స్పై విచారణకు సీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: డెకొరేటివ్ పెయింట్ల తయారీ, విక్రయ మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఏషియన్ పెయింట్స్పై వస్తున్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. 90 రోజుల వ్యవధిలో నివేదికను సమరి్పంచాలని డైరెక్టర్ జనరల్కు సూచించింది.డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలో కొత్త సంస్థల రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ వృద్ధి అవరోధాలు సృష్టించే విధానాలు పాటిస్తోందంటూ ఏషియన్ పెయింట్స్పై గ్రాసిం ఇండస్ట్రీస్ (బిర్లా పెయింట్స్ డివిజన్) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గ్రాసింలాంటి పోటీ సంస్థలతో లావాదేవీలు జరపకుండా డీలర్లకు ఆంక్షలు విధించడం, ముడి సరుకులు..సేవలు అందించకుండా నిరోధించడంలాంటి అంశాలు చూస్తే కొత్త సంస్థలను మార్కెట్లోకి రాకుండా ఆటంకాలు కల్పించడంతో పాటు మార్కెట్లో పోటీపై ఏషియన్ పెయింట్స్ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని సీసీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్లో భాగమైన గ్రాసిం గతేడాది ఫిబ్రవరిలో ’బిర్లా ఓపస్ పెయింట్స్’ పేరిట డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలోకి ప్రవేశించింది. -
పసిడికి కొనుగోళ్ల కళ
న్యూఢిల్లీ: పసిడి ధరల్లో ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి బలమైన సానుకూలతల అండతో స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో పసిడి మంగళవారం ఒక్క రోజే రూ.1,200 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.98,670కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.98,150 స్థాయిని తాకింది. వెండి సైతం కిలోకి రూ.2,000 లాభపడి రూ.1,04,800కు చేరుకుంది.డాలర్ బలహీనత కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా ఆర్థిక గణాంకాలపై అంచనాలతో ఈ వారం పసిడి పట్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 3,362 డాలర్ల స్థాయికి పుంజుకుంది. ‘‘డాలర్ బలహీనపడడం, అమెరికా ద్రవ్యలోటు విస్తరణపై ఆందోళనలతో.. ట్రంప్ ప్రతిపాదిత పన్ను తగ్గింపుల బిల్లుపై మార్కెట్లు దృష్టిపెట్టాయి. దీంతో బంగారం ఆకర్షణీయంగా మారింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 83,874.29 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు (0.11 శాతం) లాభపడి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 24.75 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప లాభంతో 25,541.8 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.10 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో 3,020 షేర్లలో 1,491 షేర్లు లాభాల్లో, 1,452 షేర్లు నష్టాల్లో ముగియగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. 96 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 119కి పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 43 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.01 శాతం క్షీణించి 12.5 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతోన్న బంగారం ధర నేడు (Today Gold Rate) భారీగా ఎగిసింది. బంగారం ధరలు దిగొస్తున్నాయని ఆశించిన కొనుదారులకు నేడు ఊచించని విధంగా షాకిచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 క్యాలెండర్ ఇయర్ ద్వితీయార్ధం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 83,730 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్లాట్గా 25,515 వద్ద ప్రారంభమయ్యాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.24 శాతం, 0.31 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.65 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ 0.18 శాతం నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది.నేటి ఐపీవోలుఎల్లెన్ బారి ఇండస్ట్రియల్ గ్యాస్స్ ఐపీఓ (మెయిన్ లైన్ ), కల్పతరు ఐపీవో (మెయిన్ లైన్ ), గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీవో (మెయిన్ లైన్ ), శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఐరన్ ఐపీవో (ఎస్ ఎంఈ), ఏజేసీ జ్యువెల్ ఐపీవో (ఎస్ ఎంఈ) ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విడుదల కానున్నాయి.వందన్ ఫుడ్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), మార్క్ లోయిర్ ఐపీఓ (ఎస్ఎంఈ), సెడార్ టెక్స్టైల్ ఐపీఓ (ఎస్ఎంఈ), పుష్పా జ్యువెలర్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), సిల్కీ ఓవర్సీస్ ఐపీఓ (ఎస్ఎంఈ) సబ్స్క్రిప్షన్ కోసం తెరవనుండగా, నీతూ యోషి ఐపీఓ (ఎస్ఎంఈ), యాడ్కౌంటీ మీడియా ఐపీఓ (ఎస్ఎంఈ) మూడో రోజుకు ప్రవేశించనున్నాయి.ఇండోగుల్ఫ్ క్రాప్ సైన్సెస్ ఐపీఓ (మెయిన్ లైన్), మూవింగ్ మీడియా ఐపీఓ (ఎస్ ఎంఈ), వాలెన్సియా ఇండియా ఐపీఓ (ఎస్ ఎంఈ), ఏస్ ఆల్ఫా ఐపీవో (ఎస్ ఎంఈ), ప్రో ఎఫ్ ఎక్స్ టెక్ ఐపీవో (ఎస్ ఎంఈ)లకు వీటి కేటాయింపులు ఉంటాయి. -
పరిశ్రమలు.. నేల చూపు!
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి మే నెలలో 1.2 శాతానికి పరిమితమైంది. 2024 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ముందస్తు వర్షాల రాకతో తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు నిదానించడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. 2024 మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6.3 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి ఐఐపీ వృద్ధి రేటు 2.7 శాతంగా కాగా, దీన్ని 2.6 శాతానికి ఎన్ఎస్వో సవరించింది. → తయారీ రంగంలో వృద్ధి మే నెల 2.6%కి పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో వృద్ధి 5.1%. → మైనింగ్ రంగంలో ఉత్పత్తి మైనస్ 0.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగంలో వృద్ధి 6.6 శాతంగా ఉంది. → విద్యుత్ రంగంలో ఉత్పత్తి మైనస్ 5.8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 13.7 శాతం వృద్ధి నమోదైంది. → క్యాపిటల్ గూడ్స్ రంగంలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. 14.1 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది మే నెలలో వృద్ధి కేవలం 2.6 శాతంగానే ఉంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో పనితీరు మైనస్ 0.7 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 12.6 శాతం వృద్ధిని చూసింది. → కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలోనూ ఉత్పత్తి మైనస్ 2.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 7.6 శాతం వృద్ధి కనిపించింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.7 శాతంగా ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నాలుగు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ వేసిన భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. 84,099.53 - 83,482.13 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 452.44 పాయింట్లు లేదా 0.54 శాతం క్షీణించి 83,606.46 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 120.75 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,517.05 వద్ద స్థిరపడింది.అయితే, విస్తృత మార్కెట్ ప్రధాన సూచీలను అధిగమించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.68 శాతం, 0.52 శాతం లాభపడ్డాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. మహారాష్ట్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, హెల్త్కేర్, మీడియా, ఎనర్జీ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
దిగొస్తున్న బంగారం ధరలు.. పుత్తడి ప్రియుల్లో ఆశలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. గరిష్ఠాల నుంచి గత వారం రోజులుగా బంగారం ధరలో క్షీణత కనిపిస్తోంది. సోమవారం కూడా పుత్తడి ధరలు తగ్గాయి. దాంతో ఈ ధరలు ఇంకెంత పడుతాయోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 25,646కు చేరింది. సెన్సెక్స్(Sensex) 3 ప్లాయింట్లు తగ్గి 84,048 వద్ద ట్రేడవుతోంది.దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్వీసు రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ మరింత స్పీడు!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరు చూపవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గత వారం అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను దాటి నిలిచింది. ఈ స్పీడ్ కొనసాగనున్నట్లు అధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్విసుల రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్డర్లరాకతోపాటు పరిశ్రమల రంగ ప్రగతిని తయారీ పీఎంఐ తెలియజేయనున్నట్లు బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పేర్కొంది. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. విదేశీ అంశాలు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ మార్కెట్లకు సానుకూల అంశంకాగా.. 1న జపనీస్ తయారీ రంగ క్యూ1 వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు చైనా తయారీ పీఎంఐ తెలియనుంది. 3న జూన్ నెలకు యూఎస్ ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా 9న యూఎస్ టారిఫ్ల గడువు ముగియనుంది. యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు చల్లబడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నాయిర్ తెలియజేశారు. ఎఫ్పీఐల దన్ను విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత వారం భారీస్థాయిలో రూ. 13,108 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా జూన్లో ఇంతవరకూ నికరంగా రూ. 8,915 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లయ్యింది. ఆర్బీఐ రెపో రేటులో 0.5 శాతం కోతకుతోడు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఉపశమించడం, యూఎస్ టారిఫ్ల ఆందోళనలు సైతం తగ్గడం ఎఫ్పీఐల పెట్టుబడులకు దోహదం చేస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. గతేడాది అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచి్చన ఎఫ్పీఐలు ఏప్రిల్ చివరి నుంచి దేశీ స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. వెరసి ఏప్రిల్లో నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయగా..మే నెలలో రూ. 19,860 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.26,100 పాయింట్లపై కన్ను అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బ్రేకవుట్ నమోదైంది. 5 వారాలుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలిన మార్కెట్లు పరిధిని చేదించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను అధిగమించి నిలిచింది. ఫలితంగా 25,600 పాయింట్లను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ఈ బాటలో మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. వెరసి నిఫ్టీ 25,800 పాయింట్లను దాటి 26,100వరకూ పరుగు తీయవచ్చని భావిస్తున్నారు. మధ్యకాలంలో నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టం 26,277 పాయింట్లవైపు పరుగు తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాకాకుండా బలహీనపడితే 25,300 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. గత వారమిలా ఐదు వారాల కన్సాలిడేషన్ తదుపరి గత వారం చివరి 4 రోజుల్లో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 2,162 పాయింట్లు జంప్చేసింది. దీంతో నికరంగా గత వారం సెన్సెక్స్ 1,651 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుంది. 84,059 వద్ద ముగిసింది. ఈ బాటలో చివరి 4 రోజుల్లో 666 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ నికరంగా 525 పాయింట్లు(2.1 శాతం) లాభపడింది. 25,638 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ మరింత అధికంగా 2.35 శాతం, స్మాల్క్యాప్ 3.6 శాతం చొప్పున జంప్ చేయడం గమనార్హం! -
క్రిజాక్ ఐపీవో జులై 2న
న్యూఢిల్లీ: విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందించే క్రిజాక్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. జులై 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జులై 1న షేర్లను కేటాయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు రూ. 860 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కాగా.. గతేడాది నవంబర్లో రూ. 1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. తాజాగా ఇష్యూ పరిమాణాన్ని రూ. 860 కోట్లకు కుదించింది. తొలుత 2024 మార్చిలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే జులైలో ప్రాస్పెక్టస్ను సెబీ తిప్పిపంపింది. ఆపై నవంబర్లో తిరిగి ఐపీవో చేపట్టేందుకు సెబీ తలుపు తట్టింది. 2025 మార్చిలో అనుమతి పొందింది. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెంట్లకు బీటూబీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయస్థాయిలో విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందిస్తోంది. ఈ కోల్కతా కంపెనీ ద్వారా విద్యార్థులు యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు గ్లోబల్ సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారా గత మూడేళ్లలో 75 దేశాలకుపైగా ఎన్రోల్మెంట్ అప్లికేషన్లకు కంపెనీ ప్లాట్ఫామ్ వీలు కల్పించింది. సుమారు 7.11 లక్షల విద్యార్థుల అప్లికేషన్ల ప్రాసెస్ చేసింది. కాగా.. గతేడాది(2024–25) రూ. 849 కోట్లకుపైగా ఆదాయం, రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో స్ట్రీట్ ...లిస్టింగ్కు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్లో గోప్యతా విధాన పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్ సర్వీసెస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్లో బిజినెస్ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ 2009లో ఇన్వెస్ట్ చేసింది. 2010 నుంచి హెచ్డీఎఫ్సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్క్యాపిటల్ గ్రూప్లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్ సోలార్ స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్ సోలార్ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, మైక్రోటెక్ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ హోమ్ అండ్ ఫరీ్నíÙంగ్స్ కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్తోపాటు, లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్లోని నందెసారి యూనిట్లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్ అంట్ న్యూట్రిషన్లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్టాస్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, మెర్క్ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్తోపాటు ఫ్రెంచ్ దిగ్గజం గ్రూప్ దానోన్ చేరింది. గత క్యాలండర్ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్కార్ట్, మిరాయ్ అసెట్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్వర్క్పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. -
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025 -
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. నాలుగు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా తగ్గాయి. దాంతో ఇంకెంత పడుతుందోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. సెన్సెక్స్ కొత్త మార్క్
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో సెషన్ లోనూ లాభాల బాటలో పయనించి, వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను సానుకూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303.03 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 84,058.90 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ సూచీ 84,089.35 - 83,645.41 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 88.80 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 25,657.80 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.27 శాతం, 0.91 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ లాభాల్లో ముగియగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.19 శాతం లాభపడింది.ఎన్ఎస్ఈలో 2,986 షేర్లలో 1,681 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగియగా, 76 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 86 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 105కు పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 40 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.32 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.60 శాతం క్షీణించి 12.39 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. మూడు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం కూడా తగ్గాయి. దేశంలోని ప్రధానం నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,565కు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 ప్లాయింట్లు పుంజుకుని 83,799 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హాట్రిక్ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గి హాట్రిక్ కొట్టిన పసిడి ధరలకు నేడు (జూన్ 26) బ్రేక్ పడింది. దీంతో ఇంకాస్త తగ్గుతుందనుకున్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,100🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,850ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.👉 వెండి విషయంలో అమ్మో.. ఆయన మాటలు నిజమవుతాయా? 👈వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,18,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్గాట్గా కదులుతున్నాయి.30 షేర్ల సెన్సెక్స్ 243 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 82,998 వద్ద, 50 షేర్ల నిఫ్టీ 83 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 25,327 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.31 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. ఇండియా వీఐఎక్స్ 0.7 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.8 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం లాభపడ్డాయి.నేటి ఐపీవోలుహెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, రమా టెలికాం, సన్టెక్ ఇన్ఫ్రా, సూపర్టెక్ ఈవీ ఐపీఓలు సబ్స్క్రిప్షన్ రెండో రోజులోకి ప్రవేశించనున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ, ఎల్లెన్ బారీ ఇండస్ట్రియల్ ఐపీఓ , కల్పతరు ఐపీఓ, ఐకాన్ ఫెసిలిటేటర్స్ ఐపీఓ, శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐపీఓ, అబ్రామ్ ఫుడ్స్ ఐపీఓ తమ సబ్ స్క్రిప్షన్ లో మూడో రోజుకు, ఏజేసీ జువెల్ మాన్యుఫాక్చరర్స్ ఐపీఓ 4వ రోజుకు ప్రవేశిస్తాయి. -
అంబానీ.. అదానీ ఇంధన బంధం!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మరో భారీ వ్యాపార వెంచర్ కోసం చేతులు కలిపారు. ఒకరి ఇంధన రిటైల్ నెట్వర్క్లో మరొకరి ఇంధనాలను విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అదానీ టోటల్ గ్యాస్ (ఏటీజీఎల్) సీఎన్జీ రిటైల్ ఔట్లెట్స్లో జియో–బీపీ తమ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను విక్రయిస్తుంది. అలాగే, జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ తమ సీఎన్జీ పంపులను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతమున్న, భవిష్యత్లో రాబోయే ఔట్లెట్స్ అన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జియో–బీపీ అనేది అంబానీకి చెందిన జియో, బ్రిటన్ సంస్థ బీపీ మధ్య జాయింట్ వెంచర్. ఇక, ఏటీజీఎల్ అనేది అదానీ గ్రూప్, ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీస్ కలిసి ఏర్పాటు చేసిన జేవీ సంస్థ. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ బంకులు ఉండగా, ఏటీజీఎల్కి 659 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఇరు సంస్థల పటిష్టమైన నెట్వర్క్ను ఉపయోగించుకుని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జియో–బీపీ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. ఈ డీల్ ద్వారా ఔట్లెట్స్లో అత్యంత నాణ్యమైన, వివిధ రకాల ఇంధనాలను అందించాలనేది తమ ఉమ్మడి లక్ష్యమని ఏటీజీఎల్ ఈడీ సురేష్ పి. మంగ్లానీ చెప్పారు. పీఎస్యూలకు పోటీ..: ప్రస్తుతం ఇంధనాల రిటైలింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఆధిపత్యం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 97,366 పెట్రోల్ బంకులు ఉండగా మూడు పీఎస్యూలకు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)) ఏకంగా 90% వాటా ఉంది. సిటీ గ్యాస్ పంపిణీ వ్యాపారంలో కూడా అవి ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ, అంబానీ చేతులు కలపడం వల్ల వాటి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏటీజీఎల్ సంస్థ గృహాలు, పరిశ్రమలు, వాహనదారులు, ఇతరత్రా కస్టమర్లకు గ్యాస్ను, ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు మొదలైనవి అందిస్తోంది. మరోవైపు, జియో–బీపీ ఇంధనాల రిటైలింగ్తో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలు, కనీ్వనియెన్స్ స్టోర్స్ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్టులో.. ఇరువురు కుబేరులు వ్యాపార అవసరాలరీత్యా జట్టు కట్టడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని ఓ విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటా కొనుగోలు చేసింది.పోటాపోటీ.. గుజరాత్కే చెందిన అంబానీ, అదానీ ఇద్దరికీ బడా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నులుగా నిలవడంలో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. అంబానీ ఓవైపు ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికం తదితర రంగాల్లో విస్తరించగా అదానీ మరోవైపు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్ తదితర మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తరించారు. పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులను మినహాయిస్తే ఇద్దరూ ఒకరి రంగంలోకి మరొకరు అడుగుపెట్టలేదు. అదానీ మెగా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్లు, సోలార్ మాడ్యూల్స్ .. విండ్ టర్బైన్ల తయారీపై దృష్టి పెట్టారు. అటు అంబానీకి చెందిన రిలయన్స్ గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తోంది. ఇక 2014 నుంచి సీఎన్బీసీ–టీవీ18, సీఎన్ఎన్–న్యూస్18, కలర్స్లాంటి టీవీ చానళ్ల ద్వారా అంబానీ మీడియా రంగంలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా అదానీ కూడా ఇటీవలే ఈ విభాగంలోకి ప్రవేశించారు. -
నా జీవితంలో అతిపెద్ద రిస్క్.. జియో: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఏమన్నారంటే.. → ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్ 1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం. → రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే.. ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా. → డీప్–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్ లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. నాన్నకు మాటిచ్చాను.. ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్ అంబానీ చెప్పారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించడంతో మీడియా, టెక్ షేర్లలో లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలను ఆర్జించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 700.4 పాయింట్లు లేదా 0.85 శాతం పెరిగి 82,755.51 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా 200.40 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 25,244.75 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగాయి.నిఫ్టీ మీడియా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు వరుసగా 1.99 శాతం, 1.64 శాతం, 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ 3.6 శాతం వరకు లాభపడ్డాయి. బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి, మార్కెట్ అస్థిరతను అంచనా వేయడానికి ఉపయోగించే భయ సూచిక ఇండియా వీఐఎక్స్ దాదాపు 5 శాతం పడిపోయి 12.96 పాయింట్లకు పడిపోయింది. -
బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) మంగళవారంతో పోలిస్తే బుధవారం వినియోగదారులకు ఊరట కల్పించింది. ఇటీవల రూ.1లక్ష దాటిన బంగారం ధరలు తిరిగి బూమరాంగ్లా గతంలోని రేట్లను చేరుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్
కొత్త ఆర్థిక సంవత్సరంలో జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మూడు కంపెనీలు అనుమతులు పొందాయి. జాబితాలో ఎల్రక్టానిక్స్ బజార్ కంపెనీ జీఎన్జీ ఎల్రక్టానిక్స్, లాజిస్టిక్స్ సర్వీసుల సంస్థ గ్లోటిస్, ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్కేర్ చేరాయి. ఈ మూడు కంపెనీలు సెబీకి 2025 ఫిబ్రవరి–మార్చిలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటికి తాజాగా గ్రీన్సిగ్నల్ లభించింది.జీఎన్జీ ఎల్రక్టానిక్స్పబ్లిక్ ఇష్యూలో భాగంగా జీఎన్జీ ఎల్రక్టానిక్స్ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 51 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఎల్రక్టానిక్స్ బజార్ బ్రాండుతో పు నరుద్ధరించిన ల్యాప్లాప్లు, డెస్్కటాప్లను విక్రయిస్తోంది. వారంటీతో పునరుద్ధరించిన ప్రొడక్టుల పూర్తిస్థాయి వేల్యూ చైన్ నిర్వహిస్తోంది. కంపెనీ భారత్సహా యూరప్, ఆఫ్రికా, యూఏఈలలో కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా మైక్రోసాఫ్ట్ అ«దీకృత పునరుద్ధరణ ప్రొడక్టుల సంస్థగా నిలుస్తోంది.గ్లోటిస్చెన్నైకు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ గ్లోటిస్ ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.45 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిదులను వాణిజ్య వాహనాలు, కంటెయినర్ల కొనుగోలు తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సమీకృత మలీ్టమోడల్ లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ గ్లోటిస్ ప్రధానంగా ఎనర్జీ సరఫరా సొల్యూషన్లు అందిస్తోంది.అమంతా హెల్త్కేర్ 1994లో ఏర్పాటైన ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అహ్మదాబాద్కు చెందిన కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలతోపాటు.. రోగులు నోటి ద్వారా ఔషధాలు తీసుకునేందుకు వీలులేనప్పుడు వినియోగించే స్టెరైల్ లిక్విడ్, పేరంటల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా 113 ప్రొడక్ట్ రిజిసే్ట్రషన్లను కలిగి ఉంది.కల్పతరుకు యాంకర్ నిధులురూ.708 కోట్లు సమీకరణరియల్టీ అభివృద్ధి సంస్థ కల్పతరు పబ్లిక్ ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.708 కోట్లు సమీకరించింది. షేరుకి రూ.414 ధరలో 9 సంస్థలకు 1.71 కోట్ల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో జీఐసీ, బెయిన్ క్యాపిటల్, సింగపూర్ సావరిన్ వెల్త్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ తదితరాలున్నాయి. మంగళవారం(24న) ప్రారంభమైన కంపెనీ ఐపీవో గురువారం(26న) ముగియనుంది. షేరుకి రూ. 387–414 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. హౌసింగ్, కమర్షియల్ ఆస్తులకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో గతేడాది(2024–25) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 2,727 కోట్ల విలువైన ప్రాపర్టీలను కంపెనీ విక్రయించింది. -
Stock Market Updates: గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 140 పాయింట్లు పెరిగి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 492 ప్లాయింట్లు పుంజుకుని 82,549 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సీజ్ఫైర్ ఉల్లంఘన.. స్వల్ప లాభాలతో సరి
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటంతో దేశీయ స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మంగళవారం ఇంట్రాడేలో 1,121 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ ఆఖరికి 158 పాయింట్ల స్వల్ప లాభంతో 82,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ప్రథమార్థంలో కొనుగోళ్ల జోరు కనిపించింది ఒక దశలో సెన్సెక్స్ 1,121 పాయింట్లు ర్యాలీ చేసి 83,018 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు దూసుకెళ్లి 25,318 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అయితే ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ క్షిపణులతో దాడులు చేస్తూందంటూ ఇజ్రాయెల్ ఆరోపణలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు – 2–3% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2%, టెలికమ్యూనికేషన్, మెటల్, ఫైనాన్షియల్ సర్విసెస్, బ్యాంకెక్స్ ఇండెక్సులు ఒకశాతం పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75%, 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.సూచీలకు అదానీ షేర్ల దన్ను...అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి. వివిధ వ్యాపారాలపై వచ్చే అయిదేళ్లలో 15–20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ లభించింది. అంబుజా సిమెంట్స్ 4%, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, అదానీ పోర్ట్స్ 2.60%, ఏసీసీ, అదానీ ఎనర్జీ 2% లాభపడ్డాయి.⇒ బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఆయిల్ మార్కెట్ కంపెనీలు, ఏవియేషన్, పెయింట్స్, అడెషివ్స్ షేర్లకు కలిసొచ్చింది. హెచ్పీసీఎల్ 3%, ఐఓసీ, బీపీసీఎల్ 2% లాభపడ్డాయి. ఇండిగో ఏవియేషన్ 2.5%, స్పైస్జెట్ 2.15% పెరిగాయి. కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, షాలీమార్ పెయింట్స్ 2% లాభపడ్డాయి. -
పసిడి రూ.900 డౌన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో.. సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. అమ్మకాల ఒత్తిడితో బంగారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) ఢిల్లీ మార్కెట్లో రూ.900 నష్టపోయి రూ.98,900 స్థాయికి దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 నష్టపోయి రూ.98,300 స్థాయిలో ట్రేడ్ అయ్యింది.మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,04,200 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్కు 46 డాలర్లు క్షీణించి 3,323 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయ్యింది. ‘‘ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందంటూ యూఎస్ ప్రకటించడంతో బంగారం ధరలు ఒత్తిడి ని ఎదుర్కొన్నాయి. మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయన్న అంచనాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు. -
యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణత
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారంతో పోలిస్తే మంగళవారం వినియోగదారులకు ఊరట కల్పించింది.ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభంఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్ యూఎస్కు వ్యతిరేకంగా యుద్ధంలో ముందుకు వెళ్తుందా? అనే అనుమానంతో బంగారం ధరలు క్షీణించాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు పెరుగుతున్న తరుణంలో బంగారంలోని పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 192 పాయింట్లు పెరిగి 25,171కు చేరింది. సెన్సెక్స్(Sensex) 620 ప్లాయింట్లు పుంజుకుని 82,526 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీన్ని ఇరాన్ ఖండించింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్రూడాయిల్ ధరలూ అయిదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ, టెక్, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు నెలకొన్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత తగ్గాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమని, కాస్త చల్లారాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్ రంగాల షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్ట సూచీలు.. పడిపోయిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలలో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించడం, ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ ను నష్టాలతో ముగించాయి.82,169.67 - 81,476.76 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 511.38 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 81,896.79 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 140.50 పాయింట్లు (0.56 శాతం) క్షీణించి 24,971.90 వద్ద స్థిరపడింది. సోమవారం ఈ సూచీ 25,057 - 24,824.85 శ్రేణిలో ట్రేడ్ అయింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 21 నష్టాలలో ముగియగా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు 2.28 శాతం నుంచి 1.21 శాతం మధ్య నష్టపోయాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ 3.39 శాతం - 0.58 శాతం మధ్య లాభపడ్డాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.70 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ లను అధిగమించాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా స్థిరపడ్డాయి, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.48 శాతం నష్టపోయింది, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నష్టపోయాయి. ఇతర రంగాల సూచీల్లో బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ సూచీలు నష్టపోగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, మీడియా సూచీలు లాభాల్లో ముగిశాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,995 షేర్లలో 1,545 షేర్లు నష్టాలలో స్థిరపడగా, 1,364 షేర్లు లాభాలను అందుకున్నాయి. 86 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.13 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.74 శాతం లాభంతో 14.05 పాయింట్ల వద్ద ముగిసింది. -
పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా! -
యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 270 పాయింట్లు నష్టపోయి 24,841కు చేరింది. సెన్సెక్స్(Sensex) 901 ప్లాయింట్లు తగ్గి 81,507 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై దాడికి పాల్పడడమే అందుకు కారణమని చెబుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుసుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లలో ఈ వారం బ్రేకవుట్!
సుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గత వారాంతాన సాంకేతికంగా పరివర్తన స్థాయి(25,112)కి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా 25,200 పాయింట్ల ఎగువకు చేరి నిలదొక్కుకుంటే సాంకేతికంగా బ్రేకవుట్కు వీలున్నట్లు అంచనా వేశారు. దీంతో సమీప కాలంలో 25,600–25,800 పాయింట్లను తాకవచ్చని విశ్లేíÙంచారు. ఇలాకాకుండా బలహీనపడితే సైడ్వేస్లో కదలవచ్చని పేర్కొన్నారు. పశి్చమాసియాలో యుద్ధం ముదిరితే మార్కెట్లు క్షీణించవచ్చని తెలియజేశారు. దీంతో గత వారం మాదిరే 24,700 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. రుతుపవనాలకు ప్రాధాన్యత దేశీయంగా నైరుతి రుతుపవన కదలికలు కీలకంగా మారనున్నాయి. మే నెలలోనే దేశంలోకి ప్రవేశించడం ద్వారా ఆశలు రేపినప్పటికీ తదుపరి మందగించిన సంగతి తెలిసిందే. అయితే రెండు, మూడు రోజుల్లో తిరిగి ఊపందుకుని పలు ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో సెంటిమెంటు బలపడనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల పరిణామమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ కొనసాగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, వాటర్ఫీల్డ్ అడ్వయిజర్స్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ అభిప్రాయపడ్డారు. ఫెడ్పై చూపు గత వారం పాలసీ సమీక్షలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేసేందుకే ఓటేసింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన సమావేశమైన ఎఫ్వోఎంసీ వరుసగా నాలుగోసారి ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇంతక్రితం 2024 డిసెంబర్లో 0.25 శాతం వడ్డీ రేటును తగ్గించిన ఫెడ్ తదుపరి నిర్వహించిన సమావేశాలలో యథాతథ పాలసీ అమలుకే ఓటు వేస్తూ వస్తోంది. అయితే ఈ నిర్ణయాలతోపాటు.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలపై ఫెడ్ అభిప్రాయాలను పావెల్ కాంగ్రెస్కు వివరించనున్నారు. మంగళవారం(24న) ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమిటీముందు, బుధవారం(25న) సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఫెడ్ అంచనాలను వెల్లడించనున్నారు. మరోపక్క యూఎస్ క్యూ1 జీడీపీ తుది గణాంకాలు గురువారం(26న) వెల్లడికానున్నాయి. 2025 జనవరి–మార్చిలో యూఎస్ జీడీపీ 0.2 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.చమురు ధరలు కీలకం ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసే వీలున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇది జరిగితే చమురు ధరలకు రెక్కలురానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తలెత్తిన వెంటనే బ్రెంట్ చమురు ధర ఒక్కో బ్యారల్కు 78 డాలర్ల గరిష్టానికి ఎగసిన విషయం విదితమే. ఫలితంగా యుద్ధ ప్రభావం ప్రధానంగా ముడిచమురు ధరలపై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా అధిక శాతం చమురు అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో యుద్ధ సెగలు దేశీ మార్కెట్లను దెబ్బతీయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారమిలా.. గత వారం(16–20) ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత క్షీణపథంలో ట్రేడయినప్పటికీ వారం చివర్లో జోరందుకున్నాయి. దీంతో నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 1,290 పాయింట్లు(1.6 శాతం) ఎగసింది. 82,408 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 394 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 25,112 వద్ద నిలిచింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లలో అమ్మకాలదే పైచేయి అయ్యింది. వెరసి బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ దాదాపు 2 శాతం పతనమైంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సెబీ నిబంధనల్లో వెసులుబాటు
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులకు (ఆర్ఏలు) సెబీ నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది. తమ డిపాజిట్ అవసరాలకు అనుగుణంగా వారు ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్డీలకు అదనంగా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్కు సైతం సెబీ అనుమతించింది.ఏదేనీ షెడ్యూల్డ్ బ్యాంకులో ఎఫ్డీ చేసి, అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఏఎస్బీ) పేరిట లీన్మార్క్డ్ (హక్కులు కల్పించడం) చేయాల్సి వచ్చేది. ఎఫ్డీ ఖాతాల ప్రారంభం విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు సెబీ దృష్టికి తీసుకెళ్లారు.ఎఫ్డీకి ప్రత్యామ్నాయంగా ఏఎస్బీకి అనుకూలంగా మార్క్ చేసిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కూడా అనుమతించవచ్చని వారు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సెబీ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఈ ప్రతిపాదనను ఆమోదించిన సెబీ బోర్డు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లను తక్కువ రిస్క్, తక్కువ అస్థిర సాధనాలుగా పరిగణించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ పై కూడా లైను మార్క్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై లీన్ నిర్వహణ, లీన్ అమలు సెక్యూరిటీస్ మార్కెట్ ఎకోసిస్టమ్ పరిధిలోనే ఉందని, ఇది మరింత సమర్థతను తీసుకువస్తుందని సెబీ తెలిపింది. -
ఇన్వెస్టర్లూ.. కొంటారా కొత్త షేర్లు?
ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 700–740 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 25న ప్రారంభంకానున్న ఇష్యూ 27న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది.ఇష్యూ ద్వారా రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 20 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం హెచ్డీబీ ఫైనాన్షియల్లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. అనుబంధ సంస్థ విలువను రూ. 61,400 కోట్లుగా బ్యాంక్ మదింపు చేసింది.కాగా.. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు హెచ్డీబీ కేటాయించనుంది. తద్వారా బిజినెస్ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. జులై 2న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కావచ్చు.సంభవ్ స్టీల్ ట్యూబ్స్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్(ఈఆర్డబ్ల్యూ) స్టీల్ పైపుల తయారీ కంపెనీ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూకి రూ. 77–82 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.ఇష్యూ ద్వారా మొత్తం రూ. 540 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశీయంగా ఈఆర్డబ్ల్యూ స్టీల్ పైపులు, స్ట్రక్చురల్ ట్యూబుల(హాలో సెక్షన్) తయారీలోని కీలక కంపెనీలలో ఒకటిగా సంభవ్ స్టీల్ నిలుస్తోంది.ఐకాన్ ఫెసిలిటేటర్స్ చిన్న, మధ్యతరహా కంపెనీ(ఎస్ఎంఈ).. ఐకాన్ ఫెసిలిటేటర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 85–91 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 26న ముగియనుంది. ఐపీవోలో భాగంగా 21 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా టెక్నికల్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసులందించే కంపెనీ రూ. 19.1 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్కానుంది.ఐపీవో నిధుల్లో రూ. 16 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎలక్ట్రికల్, క్యాప్టివ్ పవర్, బిల్డింగ్ మేనేజ్మెంట్తోపాటు వాటర్ ట్రీట్మెంట్ సర్వీసులు సమకూర్చుతోంది. అంతేకాకుండా ఫైర్ అండ్ సేఫ్టీ పరికరాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్ల నిర్వహణను సైతం చేపడుతోంది. 2025 మార్చి31కల్లా కంపెనీ 2,000 మందికిపైగా ఆయా విభాగాలలో నిపుణులైన ఉద్యోగులను కలిగి ఉంది. -
బంగారం ధరలు మళ్లీ పైకి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర(Today Gold Rate) శుక్రవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫండ్స్ కోసం పబ్లిక్ ఇష్యూ బాట
సాస్(ఎస్ఏఏఎస్) సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.83 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ సంబంధ రీసెర్చ్, డిజైనింగ్, డెవలప్మెంట్కు రూ. 152 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రూ.10 కోట్లు కంప్యూటర్ సిస్టమ్స్ కొనుగోలుకి, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇంతక్రితం 2021 డిసెంబర్లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి లభించలేదు. కంపెనీ ప్రధానంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు ఏఐ ఆధారిత క్లౌడ్నేటివ్ సాస్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 598 కోట్లను తాకింది. టర్న్అరౌండ్ సాధించి రూ. 13 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ. 59 కోట్ల నష్టాలు ప్రకటించింది.పీఎన్జీఎస్ రెవా డైమండ్ సెబీకి దరఖాస్తున్యూఢిల్లీ: రిటైల్ జ్యువెలరీ కంపెనీ పీఎన్జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 289 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. 2028కల్లా కొత్తగా 15 స్టోర్లను తెరిచే ప్రణాళికల్లో ఉంది. ఈ బాటలో ప్రధాన బ్రాండు ‘రెవా’ మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రూ. 35 కోట్లకుపైగా వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుప్రమోటర్ పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ స్లంప్ సేల్ ద్వారా డైమండ్ బిజినెస్ను విక్రయించడంతో కంపెనీ ఆవిర్భవించింది. దీంతో పీఎన్జీఎస్ రెవా ప్రత్యేక కంపెనీగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 మార్చి31కల్లా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో 33 స్టోర్లను కలిగి ఉంది. గతేడాది(2024–25) ఆదాయం 32 శాతం ఎగసి రూ. 258 కోట్లను తాకగా.. నికర లాభం 40 శాతం జంప్చేసి రూ.59 కోట్లను అధిగమించింది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 43 పాయింట్లు లాభపడి 24,836కు చేరింది. సెన్సెక్స్(Sensex) 173 ప్లాయింట్లు పెరిగి 81,528 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడా ఐపీవోలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇష్యూ ద్వారా ఎన్బీఎఫ్సీ మొత్తం రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం హెచ్డీబీ ఫైనాన్షియల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా బిజినెస్ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. అప్పర్ లేయర్లో ఉన్న ఎన్బీఎఫ్సీలు మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కావలసి ఉన్నట్లు 2022 అక్టోబర్లో ఆర్బీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కంపెనీ ఐపీవోకు వస్తోంది. కాగా.. గతేడాది ఇందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కల్పతరు @ రూ. 387–414 ఈ నెల 24–26 మధ్య రియల్టీ కంపెనీ ఐపీవోముంబై, హైదరాబాద్, నోయిడాలో ప్రాజెక్టులురియల్టీ రంగ కంపెనీ కల్పతరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 387–414 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 1,590 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా విద్యుత్ ప్రసారం, పంపిణీ దిగ్గజం కల్పతరు గ్రూప్ కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ విలువ రూ. 8,500 కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజన్(ఎంఎంఆర్)తో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ పుణే(మహారాష్ట్ర), హైదరాబాద్(తెలంగాణ), నోయిడా(ఉత్తరప్రదేశ్)లోనూ ప్రాజెక్టులు చేపడుతోంది. లగ్జరీ, ప్రీమియం, మధ్యాదాయ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 36 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఎలెన్బరీ @ రూ. 380–400 ఈ నెల 24–26 మధ్య పబ్లిక్ ఇష్యూ రూ. 853 కోట్ల సమీకరణకు రెడీవిభిన్న తరహా గ్యాస్ల తయారీ కంపెనీ ఎలెన్బరీ ఇండ్రస్టియల్ గ్యాసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 380–400 చొప్పున ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు దాదాపు రూ. 453 కోట్ల విలువైన 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 853 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 37 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో రూ. 210 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 105 కోట్లు పశి్చమబెంగాల్లోని ఉలుబేరియా–2 ప్లాంటులో సెపరేషన్ యూనిట్ ఏర్పాటుకు, మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ విభిన్న ఇండస్ట్రియల్ గ్యాస్ల తయారీ, సరఫరాలను చేపడుతోంది. డ్రై ఐస్, సింథటిక్ ఎయిర్, ఫైర్ఫైటింగ్ గ్యాస్, మెడికల్ ఆక్సిజన్, ఎల్పీజీ, వెల్డింగ్ మిక్సర్స్సహా పలు స్పెషాలిటీ గ్యాస్లను అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 312 కోట్లను అధిగమించగా.. నికర లాభం 84 శాతం జంప్చేసి రూ. 83 కోట్లను తాకింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆటో షేర్లు మాత్రం అదుర్స్!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర దాడులు, ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు విధించడానికి గడువు సమీపిస్తుండటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ప్రతికూలంగా పయనించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 82.79 పాయింట్లు (0.10 శాతం) క్షీణించి 81,361.87 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,583.94 - 81,191.04 శ్రేణిలో ట్రేడ్ అయింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 కూడా 18.80 పాయింట్లు (0.08 శాతం) క్షీణించి 24,793.25 వద్ద స్థిరపడింది.అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు 2.50 శాతం నుంచి 1.28 శాతం మధ్య క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ అండ్ టుబ్రో 1.57-0.32 శాతం మధ్య లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.63 శాతం, 1.99 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్ లలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ మొత్తం మార్కెట్ ధోరణులను అధిగమించి, పాజిటివ్ గా క్లోజ్ అయిన ఏకైక సెక్టోరల్ ఇండెక్స్ గా అవతరించింది. ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో లాభాలతో సూచీ 0.52 శాతం లాభపడింది.మరోవైపు నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.04 శాతం నష్టంతో ముగిసింది. ఆ తర్వాత నిఫ్టీ మెటల్, మీడియా, రియల్టీ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిగిలిన అన్ని రంగాల సూచీలు కూడా గురువారం నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.14 శాతం క్షీణించి 14.26 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,954 షేర్లలో 2,363 నష్టాల్లో ముగియగా, 516 లాభపడ్డాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.ఈ నేపథ్యంలో ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాటలపై అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు సామాన్య జనంలోనూ చర్చ సాగుతోంది. అమ్మో బంగారం అంత పెరిగింది... ఇంత పెరిగింది.. అని చర్చించుకుంటున్న జనం ఇప్పుడు పెరుగుతున్న వెండి ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు.👉 ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది! ఇటీవలి ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ "నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం" అని అభివర్ణించారు. అంటే వెండి ఇప్పుడే కొనుక్కోండి.. రాబోయే రోజుల్లో కొనడం కష్టమవుతుందున్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంసీఎక్స్లో కిలో వెండి ధర రూ.1.06 లక్షలుగా ఉండగా, వెండి ఇప్పటికే గత ఏడాదిగా అద్భుతమైన లాభాలను చవిచూసింది.ఆర్థిక విశ్లేషకులు ఆచితూచి ఆశావహంగా ఉన్నారు. కొంతమంది కియోసాకి అంచనాను తీవ్రమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలలో పెరిగిన వెండి వినియోగం, అలాగే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎత్తి చూపుతున్నారు. వెండి జోరు నిజమే కానీ ఏకంగా రూ.2 లక్షలకు చేరుతుందా అన్నదానిపై ‘దీనికి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు' అని ముంబైకి చెందిన కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే అన్నారు. -
పుత్తడి ఈ పూట రేటెంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు లాభపడి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 ప్లాయింట్లు పెరిగి 81,497 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.54 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.03 శాతం తగ్గిందినాస్డాక్ 0.13 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 24,812.05 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.27 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ, ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు 1.6 శాతం వరకు నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ 4.4 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.89 శాతం క్షీణించి 14.27 పాయింట్ల వద్ద స్థిరపడింది.ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం తీవ్రతరం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాటాంజ్ వద్ద ఇరాన్ భూగర్భ యురేనియం కర్మాగారం దెబ్బతిన్నదన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు ఐదో రోజు కూడా కొనసాగాయి.దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, భవిష్యత్తులో రేట్ల కోత, ముడిచమురు ధరలు పెరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాలపై చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి! మళ్లీ పెరిగిన పసిడి ధరలు
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. రెండు రోజులుగా క్రమంగా తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు లాభపడి 24,942కు చేరింది. సెన్సెక్స్(Sensex) 259 ప్లాయింట్లు పెరిగి 81,836 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీఓలకు సెబీ లైన్ క్లియర్
కొత్త ఏడాదిలో తిరిగి జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. ఈ ప్రభావంతో తాజాగా మూడు కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిపొందాయి. జాబితాలో సన్షైన్ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎంఅండ్బీ ఇంజినీరింగ్ చేరాయి. ఈ మూడు కంపెనీలు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..విపుల్ షా సంస్థటీవీ, సినిమాల నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్షైన్ పిక్చర్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవోలో 83.75 లక్షల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో ప్రధానంగా విపుల్ అమృత్లాల్ షా 23.69 లక్షల షేర్లు, షెఫాలీ విపుల్ షా 10 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. వీటితోపాటు రూ. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి, కార్యకలాపాల నిర్వహణకు వెచ్చించనుంది.ఈపీసీ కంపెనీప్రధానంగా ఈపీసీ కార్యకలాపాలు నిర్వహించే కోల్కతా కంపెనీ లూమినో ఇండస్ట్రీస్ ఐపీవో బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రూ. 15 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.పీఈబీ సేవలు ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ)తోపాటు సెల్ఫ్సపోర్టెడ్ రూఫింగ్ సర్వీసులందించే ఎంఅండ్బీ ఇంజినీరింగ్ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గుజరాత్ కంపెనీ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 328 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో ద్వారా రూ. 653 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచి్చంచనుంది. రూ. 60 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 110 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కేటాయించయనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.గ్లోబ్ ప్రాజెక్ట్స్ @ రూ. 67–71మౌలిక సదుపాయాల అభివృద్ధి కంపెనీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 67–71 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 1,67,60,560 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 119 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 14 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన 9 నెలల కాలానికి దాదాపు రూ. 255 కోట్ల ఆదాయం, రూ. 18 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 మార్చి31కల్లా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 669 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990స్టార్బిగ్బ్లాక్ ఐపీవో బాటస్టార్బిగ్బ్లాక్ బిల్డింగ్ మెటీరియల్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు వాటాదారులు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. బీఎస్ఈ లిస్టెడ్ బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్కు పూర్తి అనుబంధ సంస్థఇది. ఐపీవో ద్వారా సంస్థకు సరైన విలువను వెలికితీయడం, విస్తరణకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ తదితరాలకు వీలుంటుందని మాతృ సంస్థ బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్ పేర్కొంది. అయితే నియంత్రణ సంస్థల అనుమతులు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితులు, ఇతర క్లియరెన్స్లపై ఆధారపడి ఐపీవో చేపట్టనున్నట్లు వివరించింది. 2015లో ఏర్పాటైన బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్ దేశీయంగా ఏఏసీ బ్లాకు తయారీలో ఏకైక లిస్టెడ్ కంపెనీగా నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలలోగల ప్లాంట్ల ద్వారా వార్షికంగా 1.3 మిలియన్ ఘనపు మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 225 కోట్ల ఆదాయం సాధించింది. -
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు మెటల్, ఫార్మా, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 81,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 24,853 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 369 పాయింట్లు కోల్పోయి 81,427 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 24,814 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.ఆసియాలో కొరియా, జపాన్ నికాయ్ ఇండెక్సులు లాభాల్లో.., చైనా, హాంగ్కాంగ్ ఇండెక్సులు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి 30 పైసలు బలహీనపడి 86.34 వద్ద స్థిరపడింది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.96 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.96 – 86.28 శ్రేణిలో ట్రేడైంది.ఓస్వాల్ పంప్స్ ఐపీఓకు 34 రెట్ల స్పందన ఓస్వాల్ పంప్స్ పబ్లిక్ ఇష్యూకు 34.42 రెట్ల అధిక స్పందన లభించింది. క్యూఐబీ కోటా 88.08 రెట్లు, రిటైల్ కోటా 3.60 రెట్లు, నాన్ ఇన్స్టి ట్యూషనల్ కోటా 36.7 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. -
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ రేసు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోనే జరుగుతుంటుంది. ఇటీవల నగదు విభాగంలోనూ టర్నోవర్ భారీగా పెరిగినప్పటికీ ఎఫ్పీఐలు, డీఐఐలు అధికంగా పొజిషన్స్ తీసుకునే డెరివేటివ్స్దే ఆధిపత్యం. అయితే కొన్నేళ్లుగా ఎన్ఎస్ఈలో ఎఫ్అండ్వో కాంట్రాక్టుల గడువు ప్రతి నెలా చివరి గురువారం ముగుస్తుంటే.. బీఎస్ఈలో వీటికి చివరి మంగళవారం తెరపడుతోంది.ఈ నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఒకే రోజు ఈక్విటీ డెరివేటివ్స్ ముగింపు ప్రయోజనకరంగా ఉంటుందంటూ గత నెల(మే)లో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సూచించింది. కానీ.. బీఎస్ఈ గడువుకు ఎన్ఎస్ఈ, ఎన్ఎస్ఈ గడువుకు బీఎస్ఈ తాజాగా సెబీ నుంచి అనుమతులు పొందడం విశేషం! అటూఇటూ మార్పు(స్వాప్) ఇలా.. ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రతి నెలా చివరి మంగళవారం ముగించేందుకు సెబీ అనుమతించినట్లు ఒక ప్రకటనలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి నెలా చివరి గురువారం ఎఫ్అండ్వో ముగింపును చేపడుతోంది. మరోపక్క బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సైతం డెరివేటివ్ కాంట్రాక్టుల గడువును ప్రతి నెలా చివరి మంగళవారం నుంచి గురువారానికి మార్చుకునేందుకు సెబీ అనుమతించినట్లు తెలియజేసింది.వెరసి ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ ప్రతీ నెలా చివరి మంగళవారం, బీఎస్ఈ కాంట్రాక్టులు ప్రతి నెలా చివరి గురువారం ముగియనున్నాయి. ఎఫ్అండ్వో గడువు మార్పును రెండు ఎక్స్ఛేంజీలు సర్క్యులర్లో పేర్కొన్నాయి. వెరసి 2025 సెపె్టంబర్ 1 నుంచి డెరివేటివ్ కాంట్రాక్టులకు కొత్త షెడ్యూల్ అమలుకానుంది. -
పసిడికి అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి పసిడి నష్టపోయింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,200 నష్టంతో రూ.1,00,170 స్థాయికి (పన్నుతో కలిపి) దిగొచ్చింది. అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణుల మధ్య జ్యుయలర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడంతో బంగారం నష్టపోయినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,100 నష్టంతో రూ.99,450 స్థాయికి పడిపోయింది. ‘‘ఇరాన్ దౌత్య పరిష్కారం కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన వార్తలతో, అప్పటి వరకు ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న అంచనాలను ట్రేడర్లు సమీక్షించుకున్నారు.యుద్ధ విరమణకు అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారం ట్రేడర్లలో బేరిష్ సెంటిమెంట్ ఏర్పడింది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.100 పెరిగి రూ.1,07,200 స్థాయిని (పన్నుతో కలిపి) తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఔన్స్కు 10 డాలర్ల నష్టంతో 3,400 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ అధిక ధరల వద్ద పసిడి పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి వివరించారు. యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు వెండి ధరలు సైతం రోజులో గరిష్ట స్థాయిల నుంచి కిందకు దిగొచ్చినట్టు చెప్పారు. -
గరిష్ఠాల నుంచి పడిన పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) మంగళవారం కాస్త ఊరటనిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:58 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు నష్టపోయి 24,876కు చేరింది. సెన్సెక్స్(Sensex) 233 ప్లాయింట్లు తగ్గి 81,562 వద్ద ట్రేడవుతోంది.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం పెరిగిందిమధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ చమురు బ్యారల్ 74 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరుగుతోంది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ప్చ్.. టాటా మోటర్స్ మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ఉండి, వేగంగా పుంజుకున్నాయి. బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి.ఇంట్రాడేలో 81,865.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 677.55 పాయింట్లు (0.84 శాతం) పెరిగి 81,796.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 అయితే ఏకంగా 227.9 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగిసి 24,946.50 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.93 శాతం, 0.95 శాతం లాభాలతో ముగిశాయి.రంగాల వారీగా చూస్తే అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సూచీలు వరుసగా 1.57 శాతం, 1.32 శాతం, 1.11 శాతం, 1.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు 2.4 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ మాత్రమే నష్టపోయాయి. టాప్ లూజర్ గా నిలిచిన టాటా మోటార్స్ 3.76 శాతం నష్టపోయింది.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 1.6 శాతం క్షీణించి 14.83 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక క్రూడాయిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.6 శాతం తగ్గుదలతో 72.56 డాలర్లకు క్షీణించింది. -
బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం కాస్తా ఊరటనిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.93,050 (22 క్యారెట్స్), రూ.1,01,510 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. క్రితం రోజు ముగింపు ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.170 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.93,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,510 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 దిగి రూ.93,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.170 తగ్గి రూ.1,01,660 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు సోమవారం తగ్గినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా వినియోగదారులకు కొంత ఊరట కల్పించాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే కేజీ వెండి ధరపై రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,19,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు.. స్థిరంగా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు లాభపడి 24,729కు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 ప్లాయింట్లు పెరిగి 81,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.08 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.13 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.3 శాతం దిగజారింది.అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్
ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు (ఏఐఎఫ్/ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్) ఆదరణ పెరుగుతోంది. వీటి నిర్వహణలోని ఆస్తులు 2025 మార్చి త్రైమాసికం చివరికి రూ.5.38 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం చివరికి ఉన్న రూ.4.07లక్షల కోట్లతో పోల్చి చూస్తే 32 శాతం పెరిగినట్టు సెబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ధనవంతులు, ఫ్యామిలీ ఆఫీస్ల అస్సెట్ అలోకేషన్లో (పెట్టుబడుల కేటాయింపులు) స్పష్టమైన మార్పును ఈ గణంకాలు సూచిస్తున్నాయి.ఈక్విటీ మార్కెట్లో అస్థిరతలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టబుడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడమే ఏఐఎఫ్ ఆస్తుల వృద్ధికి దోహదపడినట్టు పెట్టుబడి సలహా సేవల సంస్థ ‘మల్టీ యాక్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్’ వెల్లడించింది. సంప్రదాయ ఈక్విటీ, డెట్ పెట్టుబడులకే పరిమితం కావడం నుంచి ఇతర సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంది.ముఖ్యంగా హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు/ధనవంతులు), అల్ట్రా హెచ్ఎన్ఐలు ఏఐఎఫ్ విభాగం వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలిపింది. ఏఐఎఫ్ ఫండ్స్ కిందకు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్రెడిట్, ఇతర సంప్రదాయేతర పెట్టుబడి సాధనాలు వస్తాయి. మార్కెట్లు అస్థిరతలకు గురైన సందర్భాల్లో ఏఐఎఫ్ పెట్టుబడులు స్థిరత్వంతోపాటు, అధిక రాబడులు అందించడం వీటి పట్ల ఆసక్తి పెరగడానికి కారణంగా మల్టీ యాక్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?వైవిధ్యం–హెడ్జింగ్‘ఫ్యామిలీ ఆఫీసులు పెట్టుబడులను దీర్ఘకాల దృష్టిలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే ప్రైవేటు పెట్టుబడుల్లో వీరి భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది’ అని ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వైవిధ్యంతోపాటు ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు హెడ్జింగ్ వంటివి ఏఐఎఫ్ పెట్టుబడుల వృద్ధికి కారణాలుగా పేర్కొంది. సాధారణంగా ఏఐఎఫ్లను కేటగిరీ –1, 2, 3లుగా విభజిస్తుంటారు. ఆరంభ స్థాయి వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ, ప్రైవేటు క్రెడిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్–షార్ట్ హెడ్జ్ వ్యూహాలతో ఏఐఎఫ్లు పనిచేస్తుంటాయి. ఈ భిన్నమైన అవకాశాల ద్వారా ఈక్విటీ, డెట్ మార్కెట్లలోని అస్థిరతలను హెచ్ఎన్ఐలు అధిగమించగలుగుతారని, రిస్క్ను మెరుగ్గా నిర్వహించగలరని ఈ నివేదిక వివరించింది. భిన్న మార్కెట్ సైకిల్స్ను సమర్థవంతంగా అధిగమించే విధంగా వారి పోర్ట్ఫోలియో నిర్మాణం ఉంటుందని తెలిపింది. భారత్లో 10 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగిన వారు 85,698 మంది ఉన్నట్టు నైట్ఫ్రాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 ఇటీవలే వెల్లడించింది. -
ఒక్కటే ఫండ్.. అన్ని చోట్లా పెట్టుబడులు
పెట్టుబడులు ఎప్పుడూ కూడా తగినంత వైవిధ్యంతో ఉండాలి. దీనివల్ల అస్థిరతలను మెరుగ్గా ఎదుర్కోవచ్చు. ఇలా పెట్టుబడులకు మంచి వైవిధ్యాన్ని ఇచ్చేవే మల్టీ అస్సెట్ ఫండ్స్ ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ పనితీరు విషయంలో నంబర్ 1గా కొనసాగుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఇటీవలి కాలంలో భారీ దిద్దుబాటును చూశాం.మరీ ముఖ్యంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో స్టాక్స్ విలువల పతనం లార్జ్క్యాప్ కంటే మరింత అధికంగా ఉంది. ఇలా ప్రతీ పెట్టుబడుల విభాగంలోనూ వివిధ కాలాల్లో ఆటుపోట్లు ఉంటుంటాయి. అందుకే పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట ఉంచేయకూడదు. రాబడులు, రిస్్కకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. నిపుణుల సాయంతో ఈ పనిని మల్టీ అస్సెట్ ఫండ్స్ సులభతరం చేస్తాయి. కనుక అన్ని రకాల ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు. రాబడులు.. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 14.53 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల కాలంలో పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 22 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ ఏటా 27.23 శాతం, ఏడేళ్లలో 17.18 శాతం, పదేళ్లలో 15.69 శాతం చొప్పున వార్షిక రాబడిని ఈ పథకం డైరెక్ట్ ప్లాన్ అందించింది. మల్టీ అస్సెట్ ఫండ్ విభాగం సగటు రాబడి గత ఏడాది కాలంలో 12 శాతంగా, మూడేళ్లలో 17.55 శాతం, ఐదేళ్లలో 19.89 శాతం, ఏడేళ్లలో 11.53 శాతం, పదేళ్లలో 10.78 శాతం చొప్పునే ఉండడం గమనించొచ్చు.అంటే మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంతో పోల్చితే ఈ పథకమే వివిధ కాలాల్లో 7 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకం 2002లో ప్రారంభం అయింది. మొదట్లో రెగ్యులర్ ప్లాన్ ఒక్కటే అందుబాటులో ఉండేది. రెగ్యులర్ప్లాన్లో ఆది నుంచి చూస్తే వార్షిక రాబడి 21 శాతంగా ఉంది. రెగ్యులర్ ప్లాన్లో ఫండ్స్ సంస్థలు మధ్యవర్తులకు కమీషన్ చెల్లిస్తాయి. డైరెక్ట్ ప్లాన్లో అలాంటివేమీ ఉండవు. కనుక దీర్ఘకాలంలో ఒక శాతం వరకు డైరెక్ట్ప్లాన్లోనే అధిక రాబడి అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టు ఈ పథకం ఒకటికి మించిన అస్సెట్లలో (పెట్టుబడి సాధనాలు) ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈక్విటీలకు 10 నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్లకు 0–10 శాతం వరకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇని్వట్)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్ ఫండ్స్ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ పథకం అన్ని ముఖ్య సాధనాల్లోనూ ఎక్స్పోజర్కు వీలు కల్పిస్తోంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 57,485 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీల్లో 49 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాలకు 14.17 శాతం కేటాయించింది. కమోడిటీల్లో (బంగారం, వెండి) 11.3 శాతం, రియల్ ఎస్టేట్ సాధనాల్లో 1.45 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. 23.95 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉండడం గమనార్హం. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండే లార్జ్క్యాప్ కంపెనీల్లో 84 శాతం పెట్టుబడులు పెట్టింది. మిడ్క్యాప్లో 13.39 శాతం, స్మాల్క్యాప్లో 1.63 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్లో అధిక శాతం రిస్క్ తక్కువ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
ఆటుపోట్లకే అధిక చాన్స్
అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. మరోపక్క ఫైనాన్షియల్ మార్కెట్లలో అత్యంత కీలకమైన బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు చేపట్టనున్నాయి. దేశీయంగా చూస్తే రుతు పవన కదలికలు, టోకు ధరల గణాంకాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు. వడ్డీ రేట్లపై కన్ను బ్యాంక్ ఆఫ్ జపాన్ రేపు(17న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. మే నెల సమావేశంలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. 2008 తదుపరి గరిష్ట స్థాయిలో వడ్డీ రేట్లు కదులుతున్నాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సైతం బుధవారం(18న) పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. గత నెలలో చేపట్టిన సమీక్షలో ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతం వద్దే కొనసాగించేందుకు ఎఫ్వోఎంసీ నిర్ణయించింది.వాణిజ్య సుంకాల నేపథ్యంలో తలెత్తిన గ్లోబల్ అనిశ్చితి, యూఎస్ ఆర్థిక మందగమనం, ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రేట్ల కోతకు తొందరపడబోమని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత గల కేంద్ర బ్యాంకుల రేట్ల నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్, ఆల్మండ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సేల్స్ హెడ్ కేతన్ వికమ్ తెలియజేశారు. గణాంకాల తీరు మే నెలకు చైనా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు నేడు(16న) విడుదలకానున్నాయి. మార్చిలో నమోదైన 7.7 శాతం నుంచి ఏప్రిల్లో 6.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు 5.9 శాతం నుంచి 5.1 శాతానికి నీరసించాయి. యూఎస్ మే రిటైల్ అమ్మకాలు 17న వెల్లడికానున్నాయి. మార్చిలో నమోదైన 1.7 శాతం నుంచి తగ్గి ఏప్రిల్లో 0.1 శాతానికి పరిమితమయ్యాయి.జపాన్ మే వాణిజ్య గణాంకాలు 18న వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో వాణిజ్య లోటు 116 బిలియన్ జపనీస్ యెన్లకు దిగివచి్చంది. ఏప్రిల్లో జపాన్ ద్రవ్యోల్బణం 3.6 శాతంకాగా.. మే వివరాలు 20న తెలియనున్నాయి. దేశీయంగా మే టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 16న వెలువడనున్నాయి. ఏప్రిల్లో డబ్ల్యూపీఐ 2.05 శాతం నుంచి వెనకడుగువేసి 0.85 శాతానికి పరిమితమైంది. ఇతర అంశాలు దేశీయంగా రుతుపవన కదలికలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, టోకు ధరలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్తోపాటు.. రంగాలవారీగా వెలువడే వార్తలు దేశీయంగా ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా...ఆర్బీఐ లిక్విడిటీ పెంపు చర్యలు, గ్లోబల్ ఆందోళనల మధ్య గత వారం(9–13) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,070 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 81,119 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 284 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,719 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.1 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. సాంకేతికంగా... సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 24,600 పాయింట్ల వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి 24,500 దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చని అంచనా. 24,450 వద్ద మరోసారి మద్దతు లభించవచ్చు. ఎగువముఖంగా చూస్తే 25,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,600వరకూ బలపడవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ ‘డివినిటీ సిఫ్’
హైదరాబాద్: ఐటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ‘డివినిటీ సిఫ్’ పేరుతో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) కోసం కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించింది. ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్స్డ్ ఇన్కమ్ వ్యాప్తంగా వినూత్నమైన పెట్టుబడి పరిష్కారాలను డివినిటీ సిఫ్ అందిస్తుందని ఐటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ తెలిపింది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్/ఏఐఎఫ్ల మధ్య వారధిగా ఇది ఉంటుందని ఐటీఐ మ్యూచువల్ ఫండ్స్ సీఈవో జతిందర్ పాల్ సింగ్ పేర్కొన్నారు.మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనగుణంగా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కాలను అందిస్తుందన్నారు. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ఇటీవలే ప్రత్యేక పెట్టుబడుల విభాగం ‘సిఫ్’ను అనుమతించడం తెలిసిందే. ఇందులో కనీసం రూ.10 లక్షల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.93,200 (22 క్యారెట్స్), రూ.1,01,680 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.250, రూ.280 పెరిగింది.చెన్నైలో శుక్రవారంతో పోలిస్తే శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.280 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.93,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,680 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 పెరిగి రూ.93,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.280 పెరిగి రూ.1,01,830 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.1,20,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మోతీలాల్ ఓస్వాల్పై సెబీ జరిమానా
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రూ.3 లక్షల జరిమానా విధించింది. స్టాక్ బ్రోకర్ నిబంధనలు అతిక్రమించినందుకు విధించిన జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించవలసిందిగా ఆదేశించింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జనవరి కాలంలో సెబీ నిర్దిష్ట పరిశోధన చేపట్టింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా13 ఎన్ఎస్ఈ ట్రేడింగ్ టెర్మినళ్లు అదీకృత ప్రదేశాల్లో లేనట్లు ఈ సందర్భంగా గుర్తించింది. 13 టెర్మినళ్లకుగాను 5 టెర్మినళ్ల నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. 9 బీఎస్ఈ టెర్మినళ్లు సంబంధిత ప్రాంతాల్లో లేవని తెలియజేసింది. లావాదేవీలు 1 టెర్మినల్ నుంచే జరిగినట్లు వెల్లడించింది. నాలుగు ఎన్ఎస్ఈ, 4 బీఎస్ఈ టెర్మినళ్లలో అనుమతించిన వ్యక్తులుకాకుండా ఇతరులు నిర్వహిస్తున్నట్లు సెబీ దర్యాప్తులో గుర్తించింది. -
ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబులు.. ప్రపంచ మార్కెట్లు కుదేలు
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడితో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ శుక్రవారం 573 పాయింట్లు పతనమై 81,119 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 24,719 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే 1,337 పాయింట్లు క్షీణించి 80,355 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కుప్పకూలి 24,473 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. అయితే దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. ఆసియా యూరప్ దేశాల స్టాక్ సూచీలు 1%–1.5% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 1.5% నష్టాలతో ట్రేడవుతున్నాయి.ఫార్మా, రియల్టీ షేర్లకు మాత్రమే స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2.06%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎఫ్ఎంసీజీ, మెటల్, విద్యుత్ 1.01 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం నష్టపోయాయి.భారత్కు ఎక్కువగా దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ ధరల అనూహ్య ర్యాలీతో దేశీయంగా చమురు ఆధారిత రంగాలైన ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్, పెయింట్స్, అడెటివ్స్, టైర్స్ కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. బీపీసీఎల్ 2%, ఐఓసీ 1.78%, హెచ్పీసీఎల్ 1.41% షేర్లు నష్టపోయాయి. ఇండిగో ఎయిర్లైన్స్ 4%, స్పైస్జెట్ 2% పతనమయ్యాయి. ట్రేడింగ్లో 6% కుప్పకూలాయి. ఇండిగో పెయింట్స్ 3%, బెర్జర్ పెయింట్స్ 0.59%, ఏషియన్ పెయింట్స్ 0.14% నష్టపోయాయి. సియట్ 1.35%, అపోలో టైర్స్ 1.13 శాతం పతనమయ్యాయి.ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ సోనా కమ్స్టర్ కంపెనీ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ జే కపూర్(53) అకాల మరణంతో కంపెనీ షేరు షేరు 2% నష్టపోయి రూ.502 వద్ద స్థిరపడింది. లండన్లో జూన్ 12న సంజయ్ గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలారూ.8.35 లక్షల కోట్లు ఆవిరి...స్టాక్ మార్కెట్ వరుస పతనంతో రెండురోజుల్లో రూ.8.35 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ రూ.447 లక్షల కోట్లు (5.19 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. గడిచిన 2 రోజుల్లో సెన్సెక్స్ 1,396 పాయింట్లు నష్టపోయింది. -
బంగారం భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు, పసిడి ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా పసిడి మరో సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో ఒక దశలో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 పెరిగి రూ.1,01,540 స్థాయిని తాకింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.1,900 పెరిగి రూ.1,00,700 స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,01,600 ఇప్పటివరకు దేశీ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ట స్థాయిగా కొనసాగుతోంది. దీని ప్రకారం సరికొత్త రికార్డుకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు ఆ తర్వాత కొంత దిగొచ్చాయి. మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,100 పెరగడంతో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,08,100కు చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ డెలివరీ కాంట్రాక్టు పసిడి ధర రూ.2,011 పెరిగి రూ.1,00,403కు చేరుకుంది. ‘‘బంగారం ధరలు రూ.లక్ష మార్క్ను దాటి కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 3,440 డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం వైపు మొగ్గుచూపించారు’’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టు చెప్పారు. -
స్టాక్ మార్కెట్లు.. వరుస నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి.ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.92,950 (22 క్యారెట్స్), రూ.1,01,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.1,950, రూ.2,120 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,120 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.92,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,950 పెరిగి రూ.93,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,120 పెరిగి రూ.1,01,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.91 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 0.24 శాతం పుంజుకుంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ సూచీలు నిన్నటి సెషన్లో ఒకశాతం నష్టపోయాయి. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో క్రూడాయిల్ ధరలు పెరుగుదల, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు, వారాంతపు ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు అంశాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సూచీల ఒక శాతం పతనంతో రూ.5.98 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449 లక్షల కోట్లు (5.26 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిధులు సమీకరణకు ప్రభుత్వ సంస్థ రెడీ
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్) ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పీఎస్యూ.. ఇరెడా రూ. 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 5–10 మధ్య చేపట్టిన క్విప్నకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది. బీమా రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) ఆసక్తి చూపినట్లు వెల్లడించింది. ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ. 1,500 కోట్లుకాగా.. 1.3 రెట్లు అధికంగా రూ. 2,006 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపును చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 165.14 ధరలో 12.15 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ. 10 ముఖ విలువగల వీటిని రూ. 155.14 ప్రీమియంతో కేటాయిస్తున్నట్లు వివరించింది. ఫ్లోర్ ధర రూ. 173.83తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో రూ. 165.14 చొప్పున షేర్లను జారీ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంక్విప్ నిధుల సమీకరణతో కంపెనీ టైర్–1 మూలధనంసహా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) మరింత పటిష్టమైనట్లు పేర్కొంది. దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగ విస్తరణకు నిధులు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. 2023 నవంబర్లో ఐపీవో చేపట్టిన కంపెనీ తక్కువ సమయంలోనే క్విప్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరెడా చైర్మన్, ఎండీ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. -
విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్
ఎయిరిండియా విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లు కూడా కుప్పకూలాయి. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.ఏఐ-171 అనే విమానం లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ముగ్గురు చిన్న పిల్లలు సహా 242 మంది ఉన్నారు. రన్ వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ పోర్టు వెలుపల కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కాగా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.బోయింగ్ 737 మ్యాక్స్, 787 మోడళ్లకు సంబంధించిన ఇటీవలి భద్రతా సమస్యల కారణంగా కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ, పెట్టుబడిదారుల ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన బోయింగ్ పై కొత్త పరిశీలనను పెంచింది. గురువారం బోయింగ్ షేరు ధర భారీగా పడిపోవడం మరో హైప్రొఫైల్ క్రాష్ వల్ల కలిగే నష్టాలపై ఇన్వెస్టర్ల ఆందోళనను ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: ఊహించని ఘోరం.. విమాన ప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి -
స్టాక్ మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. నిఫ్టీ 50 ఎఫ్ అండ్ ఓ వారాంతపు గడువు ముగియడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం, ట్రంప్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపించడం వంటి అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి.ఇంట్రాడేలో 81,523.16 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 823.16 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 81,691.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 253.2 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణించి 24,888.2 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.73 శాతం, 1.90 శాతం నష్టపోయాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2.02 శాతం క్షీణించగా, ఫీనిక్స్, గోర్డెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్, డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, మాక్రోటెక్ డెవలపర్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 27 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.54 శాతం పెరిగి 14.01 పాయింట్ల వద్ద స్థిరపడింది.ㅤ ㅤ ㅤ -
పసిడి మళ్లీ పైపైకి.. తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,000 (22 క్యారెట్స్), రూ.99,280 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.800, రూ.880 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.880 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,280 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.91,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.880 పెరిగి రూ.99,430 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా గురువారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే రూ.100 క్షీణించింది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,18,900గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.36 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం లాభపడింది. నాస్డాక్ 0.5 శాతం పుంజుకుంది.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎలక్ట్రిసిటీ ఎఫ్అండ్వోకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఇకపై నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హెడ్జింగ్ టూల్స్గా వీటిని మార్కెట్ వర్గాలు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా విద్యుత్ రంగంలో తగిన ధరల సంకేతాలతోపాటు.. పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలు కలగనున్నట్లు తెలియజేసింది. విద్యుదుత్పత్తితోపాటు.. ప్రసారం, పంపిణీ, రిటైల్ తదితర విభాగాలలో పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు వివరించింది. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించేందుకు తాజా అనుమతి సహకరించగలదని, ఇందుకు ఇది తొలి అడుగు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగా త్రైమాసిక, వార్షిక తదితర దీర్ఘకాలిక కాంట్రాక్టులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు గత వారం ఎంసీఎక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త యూపీఐ విధానం ఇన్వెస్టర్ల పరిరక్షణ లక్ష్యంగా సెబీ కొత్త యూపీఐ మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే అన్ని రిజిస్టర్డ్ ఇంటరీ్మడియరీలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక లావాదేవీలకు వీలు, వీటి భద్రత లక్ష్యంగా తాజా యూపీఐ మెకనిజంకు తెరతీసినట్లు సెబీ తెలియజేసింది. వెరసి 2025 అక్టోబర్ 1నుంచి యూపీఐ చెల్లింపుల మెకనిజం అమల్లోకి రానున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. ఇటీవల కాలంలో అన్రిజిస్టర్డ్ సంస్థలు ఇన్వెస్టర్లను మోసగించడం ఎక్కువైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు చేపట్టింది. ధృవీకరించిన, భద్రతతోకూడిన చెల్లింపుల చానల్కు తెరతీయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నట్లు పాండే వివరించారు. -
గోల్డ్ ఈటీఎఫ్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మే నెలలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అవగాహన తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్ డినామినేషన్లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్ఫోలియో హెడ్జింగ్కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అయ్యే డిజిటల్ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఊరించి.. ఉసూరుమనిపించి! మళ్లీ పెరిగిన పసిడి ధరలు
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,200 (22 క్యారెట్స్), రూ.98,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.750, రూ.820 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.820 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.750 పెరిగి రూ.90,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.820 పెరిగి రూ.98,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉంది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,19,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నాలుగు కంపెనీలు రెడీ
ఇటీవల తిరిగి కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్వైపు చూస్తున్నాయి. విభిన్న పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుండగా.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా అనుమతి పొందాయి. జాబితాలో కెంట్ ఆర్వో, కరమ్టరా ఇంజినీరింగ్, మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, విద్యా వైర్స్ చేరాయి.వాటర్ ప్యూరిఫయర్ కంపెనీ కెంట్ ఆర్వో సిస్టమ్స్తోపాటు.. ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, వైండింగ్, కండక్టివిటీ ప్రొడక్టుల కంపెనీ విద్యా వైర్స్, కరమ్టరా ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ నాలుగు సంస్థలు సెబీకి జనవరిలో ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. ఈ నెల 3–6 మధ్య గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఈ సంస్థలు ఉమ్మడిగా కనీసం రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సాయి ఇన్ఫినియం ఈ నెల 4న సెబీ నుంచి ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. కోటి షేర్ల విక్రయంఐపీవోలో భాగంగా కెంట్ ఆర్వో సిస్టమ్స్ కోటి ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కరమ్టరా ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకింద రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,750 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,050 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. రూ. 450 కోట్లపై కన్నుఐపీవోలో ద్వారా మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ రూ. 450 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 120 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరో రూ. 120 కోట్లు రాజస్తాన్లోని శికార్ యూనిట్ విస్తరణతోపాటు జైపూర్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులకు వినియోగించనుంది. మిగిలిన నిధులలో రూ. 96 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కాగా.. విద్యా వైర్స్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు కోటి షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఏఎల్సీయూలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్లో ఐటీ నోటీసులు!ఓస్వాల్ పంప్స్ @ రూ.584–614సబ్మెర్సిబుల్, మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ షేరుకి రూ. 584–614 ధరల శ్రేణిలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 13న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 890 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 497 కోట్ల విలువైన మరో 81 లక్షల షేర్లను ప్రమోటర్ వివేక్ గుప్తా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 1,387 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్ సోలార్లో పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా హర్యానాలోని కర్ణాల్లో కొత్తగా తయారీ యూనిట్లను ఏర్పాటుతోపాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు లాభపడి 25,134కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 ప్లాయింట్లు పెరిగి 82,467 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.16 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 0.63 శాతం పుంజుకుంది.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఐదో నెలలోనూ చోటు చేసుకుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో చేసే పెట్టుబడులు బలంగా నమోదయ్యాయి. ఏప్రిల్లో సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.26,688 కోట్లకు పెరిగాయి. ఈ మేరకు మే నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈక్విటీ ఫండ్స్ డీలా..!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు క్షీణించడం వరుసగా ఐదో నెలలోనూ చోటు చేసుకుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో చేసే పెట్టుబడులు బలంగా నమోదయ్యాయి. ఏప్రిల్లో సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లుగా ఉంటే, మే నెలలో రూ.26,688 కోట్లకు పెరిగాయి. ఈ మేరకు మే నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి (ఈక్విటీ, ఈక్విటీయేతర) మే నెలలో రూ.29,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్లో ఇలా వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ.2.77 లక్షల కోట్లుగా ఉంది. ⇒ మే చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.72.2 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ⇒ ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ⇒ లార్జ్క్యాప్ పథకాలు రూ.1,250 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఏప్రిల్లో వచ్చిన రూ.2,671 కోట్లతో పోల్చితే సగంపైనే తగ్గాయి. ⇒ మిడ్క్యాప్ ఫండ్స్లోకి ఏప్రిల్లో రూ.3,313 కోట్లు రాగా, మే నెలలో రూ.2,808 కోట్లకు పరిమితమయ్యాయి. ⇒ స్మాల్క్యాప్ పథకాలు రూ.3,214 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఏప్రిల్లో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.3,999 కోట్లుగా ఉన్నాయి. ⇒ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.2,656 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,518 కోట్లు, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్లోకి రూ.5,712 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ⇒ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి రూ.678 కోట్లు, వ్యాల్యూ/కాంట్రా ఫండ్స్ నుంచి రూ.92 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ⇒ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల్లోకి 73 శాతం తక్కువగా రూ.5,525 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్లో ఈ రెండు ప్యాసివ్ ఫండ్స్ విభాగాల్లోకి రూ.20,229 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ⇒ మే నెలలో మొత్తం 19 ఎన్ఎఫ్వోలు మార్కెట్లోకి రాగా, ఇవి ఉమ్మడిగా రూ.4,170 కోట్లను సమీకరించాయి. ⇒ గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.292 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్లో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను ఉపసంహరించుకున్నారు. ⇒ డెట్ ఫండ్స్ నుంచి మే నెలలో నికరంగా రూ.15,908 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఏప్రిల్ నెలలో ఇదే విభాగం రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. ⇒ డెట్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ విభాగం రూ.11,983 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.11,223 కోట్ల చొప్పున మెరుగ్గా పెట్టుబడులను ఆకర్షించాయి. ⇒ లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.40,205 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ⇒ ఈక్విటీ, డెట్లో పెట్టుబడులు పెట్టే హైబ్రిడ్ ఫండ్స్ 46 శాతం అధికంగా రూ.20,765 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ⇒ ఆర్బిట్రేజ్ ఫండ్స్లోకి రూ.15,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రిస్క్ ధోరణి తగ్గింది.. ‘‘ఈక్విటీ ఫండ్సలోకి పెట్టుబడులు తగ్గడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ముందటి నెలలతో పోల్చిచూస్తే మే నెలలో ఈక్విటీలు మంచి పనితీరు చూపించాయి. స్థిరీకరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉంటారు. పాకిస్థాన్పై ఆపరేషన్ సింధూర్ అనంతరం భౌగోళిక ఉద్రి క్తతలు పెరగడం, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బ ణం పట్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సెంటిమెంట్ బలహీనపడి ఉంటుంది’’అని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈవో జతీందర్ పాల్ సింగ్ తెలిపారు. మారి్నంగ్ స్టార్ రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ సై తం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేవా రు. అంతర్జాతీయంగా ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉంటారని పేర్కొన్నారు. -
ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఇంధన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల నాలుగు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–0.69%), హెచ్డీఎఫ్సీ బ్యాంకు(–0.64%), ఐసీఐసీఐ బ్యాంకు(–0.85%) షేర్ల పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో 82,392 వద్ద స్థిరపడింది.నిఫ్టీ ఒక పాయింటు స్వల్ప లాభంతో 25,104 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 236 పాయింట్లు బలపడి 82,681 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు ఎగసి 25,199 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. విదేశీ పెట్టుబడుల పునరాగమనంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు బలపడి 85.57 స్థాయి వద్ద ముగిసింది. మెరికా చైనాల మధ్య లండన్లో జరుగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీగా రియల్టీ 1%, టెలికం 0.55%, ఫైనాన్సియల్ 0.46%, సర్విసెస్ 0.21%, కన్జూమర్ డిస్క్రిషనరీ 0.16 శాతం నష్టపోయాయి. నష్టాల మార్కెట్లోనూ ఐటీ, వినిమయ, విద్యుత్, టెక్, హెల్త్కేర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
పసిడి ప్రియులకు ఊరట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మంగళవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,450 (22 క్యారెట్స్), రూ.97,580 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.100, రూ.110 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,580 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 దిగి రూ.89,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.110 తగ్గి రూ.97,730 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు(Silver Price) పెరిగాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే మంగళవారం కేజీ వెండి ధర రూ.1,000 పెరిగింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,19,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 14 పాయింట్లు లాభపడి 25,114కు చేరింది. సెన్సెక్స్(Sensex) 28 ప్లాయింట్లు దిగజారి 82,415 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.24 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.09 శాతం లాభపడింది. నాస్డాక్ 0.31 శాతం పుంజుకుంది.బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు లలితా జ్యువెలరీ
న్యూఢిల్లీ: బంగారు ఆభరణ వర్తక దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఎం.కిరణ్ కుమార్ జైన్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అర్హతగల సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్లో షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,015 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. 1985లో చెన్నైలోని టీనగర్లో తొలి స్టోర్ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ కార్యకలాపాలున్నాయి. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల్లో రూ.12,595 కోట్ల ఆదాయం, రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
కొనసాగుతున్న వెండి వెలుగులు
న్యూఢిల్లీ: వెండి రికార్డు ర్యాలీ కొనసాగుతోంది. అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం వెండి కేజీ ధర మరో రూ. 1,000 పెరిగి కొత్త గరిష్ట స్థాయి రూ. 1,08,100ని తాకిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటం, అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాలు.. సౌర విద్యుత్ పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం తదితర అంశాలు ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు. వెండి అంతర్జాతీయంగా 13 ఏళ్ల గరిష్టం, దేశీయంగా లైఫ్టైమ్ గరిష్టాలను తాకినట్లు మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. యూరప్లో ద్రవ్యోల్బణం నెమ్మదించడం, వాణిజ్య వివాదాలు సమసిపోవడంపై ఆశావహ భావం నెలకొనడం లాంటి అంశాలతో వెండి ధర కన్సాలిడేషన్ శ్రేణి నుంచి బైటపడిందని, ఔన్సు (31.1 గ్రాములు) రేటు 36 డాలర్లను అధిగమించిందని పేర్కొన్నారు. మరోవైపు, న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 280 మేర తగ్గి రూ. 97,780కి (పన్నులు సహా) పరిమితమైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛ త గల బంగారం ధర రూ. 250 క్షీణించి రూ. 97,350కి తగ్గింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య సానుకూల సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో ఆశాభావం నెలకొన్న నేపథ్యంలో బంగారంలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాలకు డిమాండ్ కాస్త నెమ్మదించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. బ్యాంక్ షేర్లదే హవా...
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. లండన్ లో యూఎస్-చైనా వాణిజ్య చర్చలకు ముందు సానుకూల ప్రపంచ సెంటిమెంట్, బలమైన యూఎస్ ఉద్యోగాల డేటా, యూఎస్-ఇండియా వాణిజ్య చర్చల పురోగతి వంటి అంతర్జాతీయ అంశాలతో పాటు ఆర్బీఐ బలమైన ద్రవ్య విధాన చర్యల మద్దతుతో భారతీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సానుకూలంగా చలించాయి. ఇంట్రాడేలో 82,669 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 256.22 పాయింట్లు (0.31 శాతం) పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 100.15 పాయింట్లు లేదా 0.4 శాతం లాభపడి 25,103.20 వద్ద ముగిసింది. రంగాలవారీగా చూస్తే రియల్టీ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనార్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటీ, ఎనర్జీ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్లో కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదేసమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.13 శాతం, 1.57 శాతం లాభాలతో ముగిశాయి. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.43 శాతం పెరిగి 14.69 వద్ద స్థిరపడింది. -
మోతీలాల్ ఓస్వాల్ నుంచి కొత్త ఫండ్..
బీఎస్ఈలో నమోదైన టాప్–1000 కంపెనీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ.. బీఎస్ఈ 1000 ఇండెక్స్ ఫండ్ పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ను ప్రారంభించింది. ఈ నెల 19 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500. అభిరూప్ ముఖర్జీ ఈ పథకానికి మేనేజర్గా వ్యవహరించనున్నారు. మార్కెట్ విలువ పరంగా టాప్100 లార్జ్క్యాప్ కంపెనీల్లో, తదుపరి మార్కెట్ విలువ పరంగా 150 మిడ్క్యాప్ కంపెనీలలో, ఆ తదుపరి 400 స్మాల్క్యాప్ కంపెనీల్లో, వీటి తర్వాత మార్కెట్ విలువ పరంగా 350 టాప్ మైక్రోక్యాప్ కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. టాప్250 కంపెనీలు మినహా మిగిలిన 750 కంపెనీలు స్మాల్, మైక్రోక్యాప్ కనుక అస్థిరతల రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్లు గమనించాలి.ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎస్ఎంఐడీ క్యాప్ ఫండ్ ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సంస్థ తాజాగా ఎస్ఐఎండీ క్యాప్ గ్రోత్ ఇంజిన్ ఫండ్ను ఆవిష్కరించింది. 2025–26లో రూ. 500–1,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్ పరిమాణం) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఫండ్ ప్రధానంగా స్మాల్, మిడ్క్యాప్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ద్రవ్యోల్బణం .. వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, కుటుంబాల ఆదాయం మెరుగుపడుతూ, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలన్నీ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సానుకూలంగా నిలుస్తున్నాయని సంస్థ డైరెక్టర్ మనీష్ సంతాలియా తెలిపారు. వచ్చే 3–5 ఏళ్లలో ఈ షేర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు ఉన్నందున, ఇన్వెస్టింగ్కు అనువైనవిగా కనిపిస్తున్నాయని వివరించారు. -
దిగొస్తున్న పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) రూ.లక్షకు చేరువైంది. కానీ ఇటీవలి కాలంలో ఇది క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారం పసిడి ధరలు కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,550 (22 క్యారెట్స్), రూ.97,690 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.250, రూ.280 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.280 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,550 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,690 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 దిగి రూ.89,700కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.280 తగ్గి రూ.97,840 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే సోమవారం వెండి ధరలు(Silver Price) తగ్గాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే సోమవారం కేజీ వెండి ధర రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,17,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు లాభపడి 25,094కు చేరింది. సెన్సెక్స్(Sensex) 316 ప్లాయింట్లు ఎగబాకి 82,504 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.47 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.03 శాతం లాభపడింది. నాస్డాక్ 1.2 శాతం పుంజుకుంది.బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెబీ పేరుతో మోసాలు
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తన పేరిట జరుగుతున్న మోసాల విషయంలో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసింది. సెబీ అధికారులమని చెప్పుకుంటూ కొందరు మోసగాళ్లు రెగ్యులేటర్ పేరు, లోగో, లెటర్హెడ్ను వాడుకుని, అమాయక ఇన్వెస్టర్లకు నకిలీ నోటీసులు పంపిస్తూ, మోసగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఆర్బీఐ బాటలోనే బ్యాంక్లుఇన్వెస్టరు నిర్దిష్ట ఉల్లంఘనకు పాల్పడినందున చర్యలు తీసుకోకుండా ఉండాలంటే పెనాల్టీ కట్టాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫాం ద్వారా మోసగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు ఇలాంటి సమాచారం వస్తే, సెబీ జారీ చేసిందా లేదా అనేది ధృవీకరించుకోవాలని తెలిపింది. తాము ఇచ్చే ప్రతి ఆర్డరుపైనా, పంపించే అన్ని లెటర్లు, నోటీసులు, షోకాజ్ నోటీసులు, సమన్లపైనా ఒక విశిష్ట రిఫరెన్స్ నంబరు ఉంటుందని సెబీ తెలిపింది. అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు, ఆర్డర్లు, రికవరీ సర్టిఫికెట్లు అన్నీ తమ వెబ్సైట్లో ఉంటాయని పేర్కొంది. -
ఎఫ్పీఐల యూటర్న్
దేశీ స్టాక్స్పట్ల గత నెల(మే)లో ఆసక్తి ప్రదర్శించిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెల(జూన్) తొలి వారంలో యూటర్న్ తీసుకుని నికరంగా రూ.8,749 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో ఎఫ్పీఐలు నికరంగా రూ.19,860 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. అంతకుముందు ఏప్రిల్(చివర్లో కొనుగోళ్లవైపు మళ్లి) నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.ఇదీ చదవండి: చదువు కొంటున్నారా?ప్రస్తుతం యూఎస్ బాండ్ల ఈల్డ్స్ బలపడటం, యూఎస్, చైనా వాణిజ్య చర్చలపై ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్ నుంచి 2025 మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ.34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి 2025లో ఇప్పటివరకూ నికరంగా రూ. 1.01 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం. -
వర్షపాతంపై మార్కెట్ల దృష్టి
గత వారం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తూ ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. అంతేకాకుండా బ్యాంకుల నగదు లభ్యతను పెంచుతూ సీఆర్ఆర్ను 1 శాతం తగ్గించింది. దీంతో వారాంతాన మార్కెట్లకు జోష్ వచ్చింది. పాలసీ నిర్ణయాల ప్రభావానికితోడు పలు ఇతర అంశాలు ఈ వారం దేశీ స్టాక్మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా వర్షాల ఆధారంగా పంటల సాగు, వ్యవసాయ పురోగతి నమోదుకానున్న సంగతి తెలిసిందే. ఇవి గ్రామీణ ప్రాంతాలలో డిమాండును ప్రభావితం చేయగలవని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. రిటైల్ ధరలుగత నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు గురువారం(12న) తెలియనున్నాయి. వార్షిక సీపీఐ 2025 ఏప్రిల్లో 3.16 శాతంగా నమోదైంది. 2019 జులై తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మార్చిలో 3.34 శాతానికి చేరింది. ఈ బాటలో మే నెలకు వాణిజ్య గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. 2025 ఏప్రిల్లో దేశీ వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్లను తాకింది. ఏప్రిల్లో దిగుమతులు 64.91 బిలియన్ డాలర్లకు చేరగా.. ఎగుమతులు 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024 ఏప్రిల్లో నమోదైన 19.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. యూఎస్, భారత్ మధ్య తొలి దశ వాణిజ్య చర్చలపై నిర్ణయాలు వెలువడే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ రేట్ల కోత, నిలకడైన జీడీపీ ఔట్లుక్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ గణాంకాలు నేడు(9న) మే నెలకు చైనా వాణిజ్య, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో చైనా వినియోగ ధరలు 0.1 శాతానికి చేరగా.. వాణిజ్య మిగులు 96.18 బిలియన్ డాలర్లను తాకింది. 2024 ఏప్రిల్లో నమోదైన 72 బిలియన్ డాలర్లతో పోలిస్తే చైనా వాణిజ్య మిగులు భారీగా ఎగసింది. ఇక మే నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 12న విడుదలకానున్నాయి. 2025 ఏప్రిల్లో 2.3 శాతంగా నమోదైంది. 2021 ఫిబ్రవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. పీపీఐ ఏప్రిల్లో 0.5 శాతంగా నమోదైంది. ఇవికాకుండా గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు, యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు వివరించారు. గత వారమిలా అంచనాలను మించుతూ ఆర్బీఐ.. రెపో రేటులో 0.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో 1 శాతం చొప్పున కోత పెట్టడంతో గత వారం(2–6) దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 738 పాయింట్లు(0.9 శాతం) పెరిగి 82,189 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 252 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 25,003 వద్ద ముగిసింది. వెరసి ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 82,000, 25,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించి స్థిరపడ్డాయి. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 2 శాతం స్థాయిలో ఎగశాయి. సాంకేతికంగా సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీ 25,150 వద్ద అవరోధాన్ని(రెసిస్టెన్స్) ఎదుర్కొనే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,350వరకూ బలపడవచ్చని అంచనా వేశారు. అయితే లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు ఊపందుకుంటే 24,850కు వెనకడుగు వేయవచ్చని తెలియజేశారు. ఈ స్థాయిలో నిఫ్టీకి సాంకేతికంగా మద్దతు(సపోర్ట్) లభించే వీలున్నట్లు విశ్లేషించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అమెరికా స్టాక్మార్కెట్లో ఇండియన్ కంపెనీ
న్యూఢిల్లీ: దేశీ మెడికల్ టెక్నాలజీ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ తాజాగా అమెరికాలోని నాస్డాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా ఓపెనింగ్ బెల్ మోగించే కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు సు«దీర్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.కంపెనీ రూపొందించిన ఎస్ఎస్ఐ మంత్ర సర్జికల్ రోబోటిక్ సిస్టం ప్రస్తుతం దేశీయంగా 75 ప్రాంతాల్లోని 80 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. వీటితో 100 పైగా సర్జికల్ ప్రొసీజర్లకు సంబంధించి 4,000 పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.అటు అంతర్జాతీయంగా నేపాల్, కొలంబియా, ఉక్రెయిన్, ఈక్వెడర్ తదితర దేశాల్లోనూ కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. 2024 డిసెంబర్తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ ఆదాయం 3.5 రెట్లు వృద్ధి చెంది 5.9 మిలియన్ డాలర్ల నుంచి 20.6 మిలియన్ డాలర్లకు పెరిగింది. స్థూల మార్జిన్లు 12.3 శాతం నుంచి 40.9 శాతానికి ఎగిశాయి. -
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1500, రూ.1630 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1630 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1500 దిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1630 తగ్గి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు శనివారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. శుక్రవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,18,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీ ర్యాలీని చవిచూశాయి.ఇంట్రాడేలో 82,299.89 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 746.95 పాయింట్లు (0.92 శాతం) పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 252.15 పాయింట్లు లేదా 1.02 శాతం లాభపడి 25,003.05 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.92 శాతం పెరిగాయి.ఆర్బీఐ ఎంపీసీ 50 బేసిస్ పాయింట్ల రేట్ల కోతను ప్రకటించి, అంతర్జాతీయ వృద్ధి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని 'న్యూట్రల్' నుంచి 'న్యూట్రల్'కు మారుస్తూ రెపో రేటు కోతను ప్రకటించింది. అయితే వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ ఎంపీసీ నాలుగు విడతల్లో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)లో 100 బేసిస్ పాయింట్ల కోత విధించింది. అయితే పాలసీ ప్రసంగం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్తులో రేట్లను తగ్గించే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. ఎంపీసీ సభ్యులందరూ రేట్ల వైఖరితో ఏకీభవించారని ఆయన స్పష్టం చేశారు.ప్రతిపాదిత గోల్డ్ లోన్ నిబంధనలను సడలించవచ్చని ఆర్బీఐ చెప్పడంతో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్ ఫైనాన్షియర్ల షేర్లు శుక్రవారం పెరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ 6.6 శాతం, మణప్పురం ఫైనాన్స్ 3 శాతం పెరిగాయి.ఈ ప్రకటనతో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం లాభంతో 56,650 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. రంగాలవారీగా చూస్తే రేట్ సెన్సిటివ్ రంగాలు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ దాదాపు 5 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం, నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.4 శాతం పెరిగాయి. -
ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్థిరంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,300 (22 క్యారెట్స్), రూ.99,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేవు. చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.91,300, రూ.99,600గా ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధరలో నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.91,450గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.99,750గా ఉంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అందరిచూపు ఆర్బీఐ వైపు.. ఫ్లాట్గా మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 21 పాయింట్లు నష్టపోయి 24,727కు చేరింది. సెన్సెక్స్(Sensex) 158 ప్లాయింట్లు దిగజారి 81,293 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.83 శాతం దిగజారింది.ఈ రోజు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో నిన్న మార్కెట్లు పుంజుకున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈసారి రెపో రేటులో ఆర్బీఐ కోత విధిస్తే ఇది వరుసగా మూడోసారి అవుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీరేట్లును తగ్గించారు. తర్వాత ఏప్రిల్లోనూ కుదించారు. డిసెంబర్లో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వడ్డీరేట్లును తగ్గిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెండి వెలుగులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వరుసగా నాలుగో రోజు పరుగును కొనసాగిస్తూ న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కేజీ ధర మరో రూ. 2,000 పెరిగి రూ. 1,04,100 (పన్నులు కలిపి) పలికింది. చివరిసారిగా మార్చి 19న వెండి రేటు ఆల్ టైమ్ గరిష్టమైన రూ. 1,03,500 స్థాయిని తాకింది. పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. అటు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో సిల్వర్ ఫ్యూచర్స్ జూలై కాంట్రాక్టు ధర ఒక దశలో సుమారు రూ. 3,833 పెరిగి రూ. 1,05,213 వద్ద ట్రేడయ్యింది. పసిడి పరుగు.. డాలరు బలహీనత, అమెరికా రుణభారంపై ఆందోళనలు, అనిశ్చితిలో సురక్షితమైన సాధనంగా పసిడికి పేరుండటం వంటి అంశాల కారణంగా బంగారం ధర కూడా పరుగు తీస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 99,690 వద్ద (పన్నులు కలిపి) ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 400 పెరిగి రూ. 99,100 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 3,395 డాలర్ల పైకి చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 98,450 వద్ద ట్రేడయినట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.దీపావళి నాటికి దీపావళి నాటికి వెండి ధర రూ. 1,14,000 – రూ. 1,20,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగా భౌగోళిక రాజకీయ పరిణామాలేమైనా తలెత్తితే మరింత అనిశ్చితికి ఆజ్యం పోసినట్లవుతుందని, దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపవచ్చని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా చెప్పారు. -
దూసుకెళ్తున్న బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,300 (22 క్యారెట్స్), రూ.99,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.400, రూ.430 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,600 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.91,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.430 పెరిగి రూ.99,750 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే గురువారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:06 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 24,747కు చేరింది. సెన్సెక్స్(Sensex) 406 ప్లాయింట్లు ఎగబాకి 81,408 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం లాభపడింది. నాస్డాక్ 0.32 శాతం పుంజుకుంది.ప్రధానంగా బ్లూచిప్ కౌంటర్లలో నిన్నటి మార్కెట్లో కొనుగోళ్ల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అంచనాలను మించిన యూఎస్ ఉపాధి గణాంకాలకుతోడు టారిఫ్లపై యూఎస్, చైనా వాణిజ్య చర్చలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిన్నటి మార్కెట్లో ఎన్ఎస్ఈలో మెటల్, ఆయిల్ రంగాలు 0.6 శాతం పుంజుకోగా.. రియల్టీ 0.7 శాతం నీరసించింది.రూపాయి నేలచూపుదేశీ కరెన్సీ రెండో రోజు డీలా పడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 26 పైసలు క్షీణించి 85.87 వద్ద నిలిచింది. రూపాయి 85.69 వద్ద ప్రారంభమై 86.05 వరకూ పతనమైంది. మంగళవారం సైతం రూపాయి 22 పైసలు కోల్పోయి 85.61 వద్ద ముగిసిన విషయం విదితమే. వెరసి రెండు రోజుల్లో 48 పైసలు నష్టపోయింది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99.11కు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు 6 కంపెనీలు రెడీ
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీవో ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్సహా డార్ఫ్–కెటల్ కెమికల్స్, విక్రమ్ సోలార్ తదితరాలు చేరాయి. ఈ ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లకుపైగా సమీకరించాలని ప్రణాళికలు వేశాయి. 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. సెబీ అనుమతి పొందిన జాబితాలో ఏవన్ స్టీల్స్ ఇండియా, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ సైతం ఉన్నాయి. గత నెలలో వచి్చన ఐదు ఐపీవోలతో కలసి 2025లో ఇప్పటివరకూ 16 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగడం గమనార్హం!రూ. 12,500 కోట్లపై కన్నుఐపీవోలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు వెచ్చించనుంది.రూ. 5,000 కోట్లకు రెడీ డార్ఫ్–కెటల్ కెమికల్స్ ఐపీవోలో రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. మరో రూ. 3,500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ మెనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 829 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 333 కోట్లు అనుబంధ సంస్థలో పెట్టుబడికి వెచ్చించనుంది. సోలార్ మాడ్యూల్ సంస్థ ఐపీవోలో విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 17.45 మిలియన్ షేర్లను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయించనున్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 793 కోట్లు అనుబంధ సంస్థ వీఎస్ఎల్ గ్రీన్ పవర్ పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. తద్వారా 3,000 మెగావాట్ల సోలా ర్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది.లాజిస్టిక్స్ సొల్యూషన్ల సంస్థ షిప్పింగ్, లాజిస్టిక్స్సొల్యూషన్లు అందించే శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ ఐపీవోలో భాగంగా 2 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ప్రధానంగా డ్రై బల్క్ కార్గోకు సేవలందించే కంపెనీ ఇష్యూ నిధుల్లో రూ. 289 కోట్లు సూపర్మ్యాక్స్ విభాగంలో సెకండరీ మార్కెట్ నుంచి డ్రై బల్క్ క్యారియర్స్ కొనుగోలుకి వెచ్చించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. ఏవన్ స్టీల్స్ ఇండియా సై ఐపీవోలో భాగంగా ఏవన్ స్టీల్స్ ఇండియా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ వన్యా స్టీల్స్లో పెట్టుబడులకు వినియోగించనుంది. తద్వారా మెషీనరీ కొనుగోలు, తయారీ సామర్థ్య విస్తరణ, విద్యుత్ యూనిట్ ఏర్పాటు, రుణ చెల్లింపులు చేపట్టనుంది.బంగారు ఆభరణ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ 1.8 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 46 కోట్లు జైపూర్ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. మరో రూ. 190 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. -
ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,900 (22 క్యారెట్స్), రూ.99,170 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,170 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.91,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.260 పెరిగి రూ.99,320 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,900 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 50 పాయింట్లు పెరిగి 24,590కు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 ప్లాయింట్లు ఎగబాకి 80,895 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్ సూచీలు నిన్న ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
81,000 దిగువకు సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.ఇంధన, ఫైనాన్స్, ఐటీ షేర్లలో భారీగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 799 పాయింట్లు క్షీణించి 80,575 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 24,502 వద్ద కనిష్టాన్ని తాకాయి. అమెరికా తయారీ రంగం వరుసగా మూడోనెలా తగ్గుముఖం పట్టడంతో పాటు చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎనిమిది నెలల్లో తొలిసారి క్షీణించినట్లు డేటా రావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు బలహీనపడి 86.61 వద్ద స్థిరపడింది.⇒అదానీ గ్రూప్ ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్ ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు సహకరించిందనే ఆరోపణల నేపథ్యంలో గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజస్ 2.50% – 2% క్షీణించాయి. ⇒ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.105)తో పోలిస్తే 19% ప్రీమియంతో రూ.125 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 24% ఎగసి రూ.130 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 20% లాభంతో రూ.126 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.743 కోట్లకు చేరింది. -
లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు గడిచిన రెండు రోజులుగా పడిపోయాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,800 (22 క్యారెట్స్), రూ.99,060 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,060 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.90,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.70 పెరిగి రూ.99,060 వద్దకు చేరింది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై రూ.100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,100 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు తగ్గి 24,634కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 ప్లాయింట్లు దిగజారి 81,044 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.96 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.67 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రేటెక్కిన బంగారం.. ఇప్పుడు తులం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులు నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు (జూన్ 2) పెరుగుదల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 2 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది. ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 పెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉక్కు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల ఆందోళనల మధ్య భారత బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్బీఐ ద్రవ్య విధాన ఫలితాలకు ముందు భయాందోళనలు సోమవారం సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 581 పాయింట్లు లేదా 0.71 శాతం క్షీణించి 80,870 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 165 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 24,586 వద్ద ప్రారంభమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్సీసీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1.7 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్బీఐ నష్టాల నుంచి తప్పించుకున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున క్షీణించాయి. ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ ప్రారంభ డీల్స్ లో 8 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.9 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.16 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్పీఐ పెట్టుబడులు, యూఎస్ టారిఫ్ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ గత(ఏప్రిల్) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.గణాంకాలు కీలకం మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకులు యాక్టివ్గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. ఇతర అంశాలు గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల విధింపునకు యూఎస్ ఫెడరల్ కోర్టు చెక్ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.పెట్టుబడులకే ఎఫ్పీఐల మొగ్గు మే నెలలో రూ. 19,860 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! -
రిటర్నుల దాఖలుకు రెడీనా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్ 1, 4లో మార్పులు ఐటీఆర్ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్–1 ఫారమ్కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్మన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది. ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ఐటీఆర్ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ కాలమ్ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు. వ్యాపారులైతే అదనపు వివరాలు వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్ 10–ఐఈఏ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్ 10–ఐఈఏ గత ఫైలింగ్ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు. టీడీఎస్ వివరాలు ఈ ఏడాది ఐటీఆర్ 1, 2, 3, 5లో టీడీఎస్ కాలమ్లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా తెలిపారు. మూలధన నిబంధనల్లో మార్పులు 2024 బడ్జెట్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై లాభం అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. బైబ్యాక్ సైతం డివిడెండే2024 అక్టోబర్ 1 నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మాత్రం బైబ్యాక్లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు. 80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ 80డీడీ లేదా సెక్షన్ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్ 10–ఐఏతోపాటు (మెడికల్ సర్టీ ఫికెట్) డిజేబిలిటీ సర్టిఫికెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (వైకల్య సర్టిఫికెట్ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఎవరికి ఏ ఫారమ్? ఐటీఆర్–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్–1 వర్తించదు. ఐటీఆర్–2: వ్యక్తులు లేదా హెచ్యూఎఫ్లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే, అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: ఐటీఆర్–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్ ఇన్కమ్ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఐటీఆర్–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, పార్ట్నర్íÙప్ ఫర్మ్లు (ఎల్ఎల్పీలు కాకుండా).. ఐటీఆర్–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్ ఇన్కమ్ (టర్నోవర్పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5: ఎల్ఎల్పీలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు (ఏవోపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐలు), ఆర్టీఫీషియల్ జ్యురిడికల్ పర్సన్ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది. ఐటీఆర్–6: సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–7: సెక్షన్ 139(4ఏ), లేదా సెక్షన్ 139(4బి) లేదా సెక్షన్ 139(4సి), లేదా సెక్షన్ 139(4డి), లేదా సెక్షన్ 139(4ఈ), లేదా సెక్షన్ 139(4ఎఫ్)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్–7 వర్తిస్తుంది. డిజిటల్ ఫారమ్ 16 ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారమ్ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్) ఫారమ్ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫారమ్ 16 డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్ ఫారమ్ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి. ఇవి గమనించాలి.. → వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. → ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ 31. → సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. → రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31 వరకు బిలేటెడ్/లేట్ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది. → అప్డేటెడ్ రిటర్నులను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
పసిడి పలుకు: బంగారం మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున కాస్త పెరిగిన పసిడి ధరలు నేడు (మే 31) నిలకడగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 31 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,460🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,350ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,10,900 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
జీడీపీ వృద్ధి 7.4%
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో (2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ4) 7.4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది తొలి మూడు నెలల్లో నమోదైన వృద్ధి రేటు 8.4 శాతంతో పోల్చితే ఒక శాతం క్షీణించింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) 9.2 శాతంగా ఉంది. క్యూ4తోపాటు గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తయారీ రంగం డీలా పడడం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. అదే సమయంలో వ్యవసాయ రంగం బలమైన పనితీరు నమోదు చేయడం ఊరటనిచ్చే అంశం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 330.68 లక్షల కోట్లు (3.9 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమమైంది. ‘‘రియల్ జీడీపీ (ప్రామాణిక) లేదా స్థిరమైన ధరల ఆధారిత జీడీపీ 2024–25లో 187.97 లక్షల కోట్లుగా ఉంది. 2023–24 సంవత్సరానికి జీడీపీ సవరించిన అంచనాల ప్రకారం 176.51 లక్షల కోట్లుగా ఉంది. అంటే 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. నామినల్ జీడీపీ (వస్తు సేవల తుది ధరల ఆధారంగా) 2024–25లో రూ.330.68 లక్షల కోట్లుగా వచ్చింది. 2023–24 సంవత్సరానికి రూ.301.23 లక్షల కోట్లుగా ఉంది. అంటే 9.8 శాతం వృద్ధి రేటు నమోదైంది’’ అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. 2024 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటే, 2024 జూలై–సెపె్టంబర్ క్వార్టర్కు 5.6 శాతం, 2024 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చైనా జీడీపీ 5.4 శాతం వృద్ధిని సాధించింది. డీలా పడిన తయారీ రంగం → ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఎక్కువ క్షీణతను చవిచూసింది. ఈ రంగం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12.3 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి పరిమితమైంది. → ఇదే కాలంలో వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధితో ఆదుకుంది. 2023–24 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 2.7 శాతమే కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి పుంజుకున్నది. → గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో తయారీ రంగం వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన 11.3 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. ఈ గణాంకాల ఆధారంగా తయారీ రంగం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. → ఇక వ్యవసాయ రంగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లోనూ మెరుగైన పనితీరు చూపించింది. వృద్ధి రేటు 5.4 శాతానికి చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్కు ఇది 0.9 శాతంగా ఉంది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 8.7 శాతంగా ఉంది. → విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 5.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంది. → క్యూ4లో సేవల రంగంలో (ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు) జీవీ ఏ వృద్ధి (స్థూల విలువ జోడింపు) రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఉన్న 8.8 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. → ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవల పరంగా వృద్ధి క్యూ4లో 7.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 9 శాతంగా ఉంది. అంచనాల మేరకే ద్రవ్యలోటు2024–25లో 4.8 శాతం గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీలో ద్రవ్యలోటును 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించింది. రూ.15,77,270 కోట్లుగా నమోదైనట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్కు ప్రభుత్వం సమరి్పంచిన సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.15,69,527 కోట్ల కంటే కేవలం రూ.7వేల కోట్ల మేర (లక్ష్యంలో 105 శాతం) అదనంగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.30.36 లక్షల కోట్లుగా ఉంది. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 98.3 శాతానికి సమానం. 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.46.55 లక్షల కోట్లుగా ఉందని, సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 98.7 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 5.63 శాతంగా ఉండడం గమనార్హం. నాలుగో ఏడాది వేగవంతమైన వృద్ధిభారత్ వరుసగా నాలుగో ఏడాదీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన వృద్ధి క్రమాన్ని కొనసాగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలు వెలువడడంతో ఆమె స్పందించారు. క్యూ4లో తయారీ రంగం చక్కని పనితీరు చూపించడం జీడీపీ వృద్ధి రేటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5% చేరడానికి దారితీసినట్టు చెప్పారు. ‘‘భారత్ నాలుగో ఏడాది వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కృషి వల్లే ఇది సాధ్యమైంది. మన తయారీ, సేవల సామర్థ్యాలు చురుగ్గానే ఉన్నాయి. వ్యవసాయం సైతం స్థిరమైన వృద్ధిని చూపిస్తోంది’’అని మంత్రి చెప్పారు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ, మెటల్, ఆటో రంగాల్లో విస్తృత స్థాయి అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి సెషన్ లో నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 182.01 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 81,451.01 వద్ద ముగిసింది. ఈ సూచీ 81,698.21 - 81,286.45 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 82.90 పాయింట్లు (0.33 శాతం) క్షీణించి 24,750.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,863.95 వద్ద, ఇంట్రాడే కనిష్ట స్థాయి 24,717.40 వద్ద నమోదయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.06 శాతం, 0.06 శాతం నష్టంతో ముగియగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్ నేతృత్వంలో 2.88 శాతం లాభంతో స్థిరపడింది.నిఫ్టీ మీడియా, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మినహా ఎన్ఎస్ఈలోని మిగతా సెక్టోరల్ ఇండెక్స్లలన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా దాదాపు ఒక శాతం (0.98 శాతం) నష్టపోయింది.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,955 షేర్లలో 1,581 నష్టాల్లో ముగియగా, 1,299 షేర్లు లాభాలను అందుకున్నాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది.2025 మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ ఆదాయాల తుది సెట్ను ఇన్వెస్టర్లు అంచనా వేయడం, క్యూ4 జీడీపీ గణాంకాల కోసం వేచి ఉండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య పరిణామాలను ట్రాక్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉంది. -
బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
పడి లేచిన పసిడి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు గడిచిన రెండు రోజులుగా పడిపోయాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు తిరిగి రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,200 (22 క్యారెట్స్), రూ.97,310 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,310 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 పెరిగి రూ.89,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.270 పెరిగి రూ.97,460 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో కేజీ వెండి ధర రూ.1,10,900 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 20 పాయింట్లు తగ్గి 24,821కు చేరింది. సెన్సెక్స్(Sensex) 57 ప్లాయింట్లు దిగజారి 81,579 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.39 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్చి త్రైమాసిక ఫలితాలు
ద్విచక్ర ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రెట్టింపై రూ. 870 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. అయితే ఈ ఏడాది(2025–26) టర్న్అరౌండ్ సాధించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1,598 కోట్ల నుంచి రూ. 611 కోట్లకు క్షీణించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా పెరిగి రూ. 2,276 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 1,584 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5,010 కోట్ల నుంచి రూ. 4,514 కోట్లకు డీలా పడింది.సుజ్లాన్ ఎనర్జీ లాభం దూకుడుక్యూ4లో రూ. 1,181 కోట్లుపవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ కన్సాలిడేటెడ్ నికర లాభం గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(క్యూ4)లో 5 రెట్లు దూసుకెళ్లి రూ. 1,181 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,207 కోట్ల నుంచి రూ. 3,825 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 660 కోట్ల నుంచి రూ. 2,072 కోట్లకు జంప్చేసింది. మొత్తం ఆదాయం రూ. 6,568 కోట్ల నుంచి రూ. 10,993 కోట్లకు పెరిగింది.బజాజ్ ఆటో లాభం డౌన్ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10%నీరసించి రూ. 1,802 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,011 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,555 కోట్ల నుంచి రూ. 12,646 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 11,02,934 వాహనాలు విక్రయించింది. అంతక్రితం క్యూ4లో 10,68,576 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 210 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం నీరసించి రూ. 7,325 కోట్లకు చేరింది. 2023–24లో రూ.7,708 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 44,870 కోట్ల నుంచి రూ. 50,995 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన విక్రయాలు 7% పుంజుకుని 46,50,966 యూనిట్లను తాకాయి.పోకర్ణ లాభం రూ.59 కోట్లుగత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్ నికర లాభం సుమారు 280 శాతం వృద్ధి చెంది రూ. 59 కోట్లకు ఎగిసింది. ఆదాయం 62 శాతం వృద్ధి చెంది రూ. 263 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 115 శాతం పెరిగి రూ. 186 కోట్లకు, ఆదాయం 35 శాతం వృద్ధి చెంది రూ. 930 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ 30 శాతం డివిడెండ్ ప్రకటించింది. అంతర్జాతీయంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పటిష్టమైన పనితీరు సాధించగలిగామని సంస్థ చైర్మన్ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
చిన్న పట్టణాల్లోకి నిప్పన్ ఇండియా విస్తరణ
కోల్కతా: నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ చిన్న పట్టణాల్లోకి సేవలను విస్తరించడం ద్వారా మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ కావాలని చూస్తోంది. తద్వారా రానున్న 7–8 ఏళ్లలో తమ ఇన్వెస్టర్ల బేస్ను రెట్టింపు చేసుకోవాలన్న (5 కోట్లకు) లక్ష్యంతో ఉన్నట్టు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో సందీప్ సిక్కా తెలిపారు. ముఖ్యంగా తూర్పు భారత్లో మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, దాంతో ఈ ప్రాంతంపై ఎక్కువ బుల్లిష్ ధోరణితో (సానుకూలం) ఉన్నట్టు చెప్పారు. ‘‘తూర్పు భారత్లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా 20 శాతం వృద్ధి ఉంటే నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023–24లో ఈ ప్రాంతంలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు 38 శాతం వృద్ధిని చూస్తే.. నిప్పన్ ఇండియా సిప్ పెట్టుబడులు 55 శాతం పెరిగాయి. అదే ఏడాది జాతీయ సిప్ సగటు వృద్ధి 34 శాతంగా ఉంది. రిటైల్ మార్కెట్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోవడమే మా వ్యూహం. ముఖ్యంగా ఫండ్స్ సేవలు పెద్దగా విస్తరణకు నోచుకోని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తాం. అక్కడే వృద్ధి అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో యూనిక్ ఇన్వెస్టర్ల బేస్ 6 కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం మా ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్ల మేర ఉంది’’అని సంస్థ ప్రణాళికలను సిక్కా వివరించారు. అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ నిప్పన్ ఇండియా భారత్లో అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ సంస్థ అని (జపాన్కు చెందిన నిప్పన్ లైఫ్).. టాప్ 5 సంస్థల్లో బ్యాంకింగ్ స్పాన్సర్ లేకుండా ఎక్కువ వృద్ధిని తాము నమోదు చేసినట్టు సందీప్ సిక్కా తెలిపారు. 2023–24లో 27 శాతం అధికంగా 82 లక్షల ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 269 శాఖలు ఉంటే.. తూర్పున 11 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో శాఖలు కలిగి ఉన్నట్టు తెలిపారు. ఇన్వెస్టర్లలో పెరుగుతున్న అవగాహనతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అసంఘటిత రంగం నుంచి పొదుపులు సంఘటిత రంగం వైపు మళ్లుతున్నట్టు వెల్లడించారు. తాము కొత్త పథకాల ఆవిష్కరణ కంటే ప్రస్తుత పథకాల రూపంలో మెరుగైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. -
బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. భారతీయులు బంగారాన్ని ఆభరణాలుగా, పెట్టుబడికి ఉత్తమ మార్గంగా భావించి.. ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దేశంలో బంగారు ఆభరణాల వినియోగం 2026 ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 12-14 శాతం గణనీయంగా పెరుగుతుందని ''ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్'' (ICRA) వెల్లడించింది.2025 ఆర్ధిక సంవత్సరంలో బంగారం ధరలు 33 శాతం పెరిగాయి, 2026లో ధరలు పెరుగుతూనే ఉంటాయని ICRA తెలిపింది. సాధారణంగా గోల్డ్ రేటు పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. కానీ భారతదేశంలో శుభకార్యాలకు, శుభదినాలకు బంగారం కొనుగోలు పెరుగుతోంది. ధరలు మరింత పెరగడానికి ఇది ప్రధాన కారణమవుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినియోగం విలువలో గణనీయమైన 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా బంగారం ఆభరణాల వినియోగం అదే తరహాలో పెరుగుతుంది. ధరలు కూడా గత ఆర్ధిక సంవత్సరం కంటే.. 20 శాతం ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..2024 ఆర్థిక సంవత్సరం, 2025 ఆర్థిక సంవత్సరాలలో గోల్డ్ బార్లు, నాణేల వినియోగం వరుసగా 17 శాతం, 25 శాతం పెరిగింది.దీనికి ప్రధాన కారణం ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, పెరిగిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలే. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల చాలామంది.. పసిడి కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ బార్లు, నాణేలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.70 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 81,633.02 వద్ద, నిఫ్టీ 128.35 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 24,880.80 వద్ద నిలిచింది.మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంటీసీ), వీటో స్విచ్గేర్స్ అండ్ కేబుల్స్, ఎన్టీఎల్ గ్లోబల్, నేచురల్ క్యాప్సూల్స్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్, సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరస్, ఆల్పా లాబొరేటరీస్, లాసా సూపర్జెనరిక్స్, డీసీ ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
గోల్డ్ హాట్రిక్.. మరోసారి తగ్గిన బంగారం ధర..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు (మే 29) వరుసగా మూడో రోజూ దిగివచ్చాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 29 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,190🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,100ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,040🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.88,950బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 తగ్గి రూ.1,10,900 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించి రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.56 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం పడిపోయింది.పరిమిత శ్రేణి ట్రేడింగ్లో స్టాక్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు నిన్నటి మార్కెట్ సెషన్లో 3% పడి సూచీల పతనానికి ప్రధాన కారణమైంది. నిన్న సూచీలు ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. మే నెల వారీ ఎక్స్పైరీ గడువు ముగింపు(నేడు), దేశీయ క్యూ4 జీడీపీ, ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరిస్తున్నారు. నిన్నటి సెషన్లో ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. పీఎస్యూ బ్యాంకులు, మీడియా, ఇంధన షేర్లు రాణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
హీరో ఫిన్కార్ప్ ఐపీవోకు వచ్చేస్తోంది..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం హీరో ఫిన్కార్ప్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.వీటికి జతగా మరో రూ. 1,568 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 3,668 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. లిస్టింగ్కు వీలుగా 2024 ఆగస్ట్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ మూలధన అవసరాలకు ఎన్బీఎఫ్సీ హీరో ఫిన్కార్ప్ వినియోగించనుంది. తద్వారా రుణ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 2024 మార్చికల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 51,281 కోట్లుగా నమోదయ్యాయి. -
ఇండస్ఇండ్ బ్యాంక్ కథ్పాలియాపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన ఆరోపణలపై సంస్థ మాజీ సీఈవో సుమంత్ కథ్పాలియాతో పాటు మరో నలుగురికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 19.78 కోట్ల జరిమానా విధించింది. అలాగే వారు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సెక్యూరిటీస్ను కొనడం, అమ్మడం లేదా ఇతరత్రా ఏ విధమైన లావాదేవీలు జరపరాదని స్పష్టం చేసింది. నిషేధం ఎదుర్కొంటున్న మిగతావారిలో అప్పటి డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా, ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్ సుశాంత్ సౌరవ్, జీఎంజీ ఆపరేషన్స్ హెడ్ రోహన్ జఠన్న, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ మార్కో రావు ఉన్నారు. కీలక హోదాల్లో ఉన్న ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకి, సంస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, బైటికి రావడానికి ముందే తెలుస్తాయి. ఆ వివరాలను ఉపయోగించుకుని వీరు బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ చేసి లబ్ధి పొందారని సెబీ విచారణలో వెల్లడైంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 239.31 పాయింట్లు (0.29 శాతం) క్షీణించి 81,312.32 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 81,613.36 నుంచి 81,244.02 మధ్య ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 73.75 పాయింట్లు (0.30 శాతం) క్షీణించి 24,752.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 నేడు 24,864.25 నుంచి 24,737.05 మధ్యలో కదలాడింది. నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, నెస్లే ఇండియా షేర్లు 1.93-1.62 శాతం మధ్య నష్టపోయాయి.మరోవైపు హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.51 - 0.63 శాతం మధ్య లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,940 షేర్లలో 1,462 లాభాల్లో ముగియగా, 1,395 షేర్లు నష్టాలను చవిచూశాయి. 83 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.విస్తృత మార్కెట్ సూచీల్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్వల్పంగా 0.02 శాతం నష్టపోగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.33 శాతం లాభంతో ముగిసింది. రంగాలవారీగా చూస్తే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.49 శాతం నష్టపోయింది.బ్రిటిష్ అమెరికన్ టొబాకో పీఎల్సీ (బీఏటీ) కంపెనీలో 2.5 శాతం వాటాను విక్రయించడంతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ 1.17 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో, మెటల్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ సూచీలు 0.68 శాతం వరకు నష్టపోయాయి.మరోవైపు నిఫ్టీ మీడియా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు మార్కెట్ ట్రెండ్ను అధిగమించి వరుసగా 1.04 శాతం, 0.97 శాతం లాభాలతో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.79 శాతం క్షీణించి 18.02 పాయింట్ల వద్ద ముగిసింది. -
ఆగిన ధరలు: బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!
దేశంలో బంగారం దాగుడుమూతలాడుతున్నట్లు.. ఒకసారి తగ్గుతూ, మరోసారి తగ్గుతూ ఉన్నాయి. నేడు (మే 28) మాత్రం గోల్డ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 89,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,480 వద్ద నిలిచాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు స్థిరంగా ఉండిపోయాయి. కాబట్టి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు, నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగాయియు. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నగరంలో పసిడి ధరలు వరుసగా రూ. 89,350 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 97480 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిదేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 89,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 97,600 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. మొత్తం మీద దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు (బుధవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 40 పాయింట్లు తగ్గి 24,781కు చేరింది. సెన్సెక్స్(Sensex) 152 ప్లాయింట్లు పడిపోయి 81,388 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.75 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 2.05 శాతం లాభపడింది. నాస్డాక్ 2.47 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: టర్కీ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసిన చెన్నై ఎయిర్పోర్ట్ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ ఇటీవల మార్కెట్ సూచీలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చేవిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
హమారా.. స్కూటర్!
మన రోడ్లపై స్కూటర్లు టాప్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గుముఖంతో మందగమనాన్ని ఎదుర్కొంటున్న టూవీలర్ల మార్కెట్కు ఇప్పుడు స్కూటర్లే దన్నుగా నిలుస్తున్నాయి. బైక్ అమ్మకాలతో పోలిస్తే గతేడాఇ స్కూటర్ల విక్రయాల్లో భారీగా వృద్ధి నమోదవడం దీనికి నిదర్శనం. ఈ ఏడాది కూడా ఇదే జోరు కొనసాగుతుందని పరిశ్రమ నిఫుణులు పేర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్తో పాటు నెమ్మదిగా ద్విచక్ర వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ)కు మారుతుండటం కూడా స్కూటర్ దూకుడుకు దోహదం చేస్తోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్స్కూటర్ల అమ్మకాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ‘టాప్’లేపాయి. ఏకంగా 68.5 లక్షల విక్రయాలతో కోవిడ్ ముందు (2018–19)లో నమోదైన 67 లక్షల రికార్డును బ్రేక్ చేశాయి. అప్పుడు కూడా స్కూటర్ల జోరు కారణంగానే మొత్తం టూవీలర్ విభాగం దేశీ అమ్మకాలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిని (2.12 కోట్ల వాహనాలు) తాకడం గమనార్హం. కాగా, ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ గణాంకాల ప్రకారం గతేడాది స్కూటర్ల విక్రయాలు 17.36 శాతం ఎగబాకాయి. మొత్తం టూవీర్ల అమ్మకాలు 9% పెరగ్గా... బైక్ల సేల్స్ 5 శాతం మాత్రమే పుంజుకున్నాయి. పట్టణాల్లో ఫుల్ డిమాండ్... గత కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం ఇతరత్రా సమస్యలకు తోడు.. కుటుంబంలో అందరూ నడపడానికి అనువుగా ఉండటం వంటి సానుకూలతల కారణంగా స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ‘గేర్లెస్ కావడంతో పాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ పద్మవ్యూహంలో నడపడం ఈజీగా ఉండటం వల్ల నిత్యం ఆఫీసులకు వెళ్లొచ్చేవారు, ముఖ్యంగా మహిళలు, నవతరం వాహనదారులు స్కూటర్లకే జై కొడుతున్నారు. పటిష్టమైన అర్బన్ డిమాండ్కు తోడు ఈవీలకు మారుతున్న వారు పెరుగుతుండటం వల్ల కూడా బైక్లతో పోలిస్తే స్కూటర్ల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదవుతోంది’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. వాటా పైపైకి... టూవీలర్ విభాగంలో ఇప్పటికీ బైక్లదే పైచేయి. మొత్తం అమ్మకాల్లో 60 శాతం పైగా మెజారిటీ వాటాను కొల్లగొడుతున్నాయి. అయితే, గత నాలుగైదేళ్లుగా స్కూటర్ మార్కెట్ వాటా క్రమంగా పుంజుకుంటోంది. వాహన తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం 2019–20లో టూవీలర్ అమ్మకాల్లో 66 శాతంగా ఉన్న మోటార్సైకిళ్ల వాటా.. 2024–25 నాటికి 62%కి దిగొచి్చంది. మరోపక్క, స్కూటర్ల వాటా 30 శాతం నుంచి 35 శాతానికి జంప్ చేసింది. దీని ప్రకారం చూస్తే... çట్రెండ్ మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.‘ఎలక్ట్రిక్’ వేగం...ఇటీవలి కాలంలో ఈవీల జోరు పెరగడం.. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవడంతో టూవీలర్ విభాగం పుంజుకోవడానికి దోహదపడుతోందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 2025–26లో అమ్ముడైన మొత్తం టూవీలర్లలో ఈవీల వాటా 6 శాతానికి పైగా నమోదైంది. ‘రాబోయే కాలంలో ఈవీల ధరలు దిగొచ్చే అవకాశం ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలతో స్కూటర్ పరిశ్రమలో ఈవీల వాటా మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది’ అని టీవీఎస్ మోటార్స్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ తాజాగా పేర్కొన్నారు. 2024–25లో తొలిసారి ఈ–టూవీలర్లు 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటాయి. మొత్తం 11.4 లక్షలకు పైగా సేల్స్తో ఈ–టూవీలర్ విభాగంలో ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది.టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటో వంటి టూవీలర్ దిగ్గజాలతో పాటు నవతరం ఎలక్ట్రిక్ వాహన సంస్థలైన ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటివి కొంగొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్లో వాటా కోసం పోటీపడుతున్నాయి. స్కూటర్లలో విభిన్న వర్గాల అవసరాలకు, విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండడం కూడా ఎకానమీ బైక్లకు మించి స్కూటర్ అమ్మకాలు పుంజుకోవడానికి మరో ముఖ్య కారణమని రాధాకృష్ణన్ చెప్పారు. 2021–22లో టీవీఎస్ టూవీలర్ సేల్స్లో స్కూటర్ల వాటా 25 శాతం ఉండగా.. 2024–25లో ఇది 40 శాతానికి దూసుకెళ్లింది. గతేడాది కంపెనీ మొత్తం 47.4 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించింది. ఇదిలాఉంటే, టీవీఎస్ స్కూటర్ విక్రయాల్లో 15 శాతం ఎలక్ట్రిక్ ఐక్యూబ్దే కావడం మరో విశేషం! -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 591.52 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో.. 81,584.94 వద్ద, నిఫ్టీ 174.95 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 24,826.20 వద్ద నిలిచాయి.నూపూర్ రీసైక్లర్స్, బోరానా వీవ్స్ లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్, కామ్లిన్ ఫైన్ సైన్సెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, బజాజ్ హెల్త్కేర్, పార్శ్వనాథ్ డెవలపర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
స్థిరపడుతున్న ఇండెక్స్ ఆప్షన్స్ మార్కెట్
నియంత్రణ నిబంధనలు కఠినతరం కావడంతో వరుసగా మూడు నెలల పాటు క్షీణించిన ఇండెక్స్ డెరివేటివ్స్, ఆప్షన్స్ మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. మార్కెట్ వర్గాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయనడానికి వాల్యూమ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంది. గతేడాది నవంబర్ నుంచి కఠినతర నిబంధనల అమలు కారణంగా ఇండెక్స్ ఆప్షన్లలో ట్రేడింగ్ లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.ఇదీ చదవండి: జెప్టో కేఫ్ల మూసివేత..?2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంతో పోలిస్తే 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి మధ్య సగటున రోజువారీ ప్రీమియం టర్నోవరు 18 శాతం క్షీణించింది. ఆప్షన్స్ కాంట్రాక్టుల సంఖ్య 60 శాతం పడిపోయింది. రూ. 10,000 లోపు నెలవారీ ప్రీమియం టర్నోవరు ఉండే ఇన్వెస్టర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2025 మార్చిలో 49 శాతం తగ్గింది. 2024–25 నాలుగో త్రైమాసికంలో తొమ్మిది సెక్యూరిటీస్ బ్రోకింగ్ సంస్థలపై నిర్వహించిన సర్వే ప్రకారం వాటి ఆదాయం 19 శాతం, లాభదాయకత 26 శాతం తగ్గిపోయాయి. అయితే, ఇప్పటికీ ట్రేడింగ్ కార్యకలాపాలు చారిత్రక స్థాయుల కన్నా అధికంగానే ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. -
అంతకంతకూ పెరుగుతున్న పసిడి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,950 (22 క్యారెట్స్), రూ.98,130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.450, రూ.490 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,130 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.90,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.98,280 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల వరుస లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 220 పాయింట్లు తగ్గి 24,783కు చేరింది. సెన్సెక్స్(Sensex) 743 ప్లాయింట్లు పడిపోయి 81,431 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63.95 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.67 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1 శాతం పడిపోయింది.ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్ స్ట్రీట్ సోమవారం అరశాతానికిపైగా లాభపడింది. కేంద్రానికి ఆర్బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటన, జపాన్ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చాయి. అమెరికా కరెన్సీ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూలతలు కలిసిరావడంతో నిన్నటి మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలపడి 85.10 వద్ద స్థిరపడింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు.. స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
గెట్.. సెట్.. గ్రో!
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ బిలియన్ డాలర్ల(రూ. 8,500 కోట్లు)వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రో బ్రాండుతో కంపెనీ రిటైల్ బ్రోకింగ్ సర్వీసులందించే సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీసహా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రోలో ఇప్పటికే పీక్ ఎక్స్వీ, టైగర్ క్యాపిటల్, సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్ సీఈవో) తదితరులు ఇన్వెస్ట్ చేశారు. ఇష్యూ నిధులను టెక్నాలజీ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రస్తుత విలువ 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60,000 కోట్లు)కు చేరుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వేగంగా విస్తరించిన కంపెనీ 2025 మార్చికల్లా 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం గతేడాది(2024–25) 34 లక్షల మంది కొత్త కస్టమర్లను జత చేసుకుంది. మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 95 లక్షల నుంచి 1.29 కోట్లకు ఎగసింది. 2023లో కంపెనీ టర్న్అరౌండ్ సాధించి రూ. 449 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,277 కోట్లను తాకింది. 2024కల్లా ఆదాయం రూ. 3,145 కోట్లకు ఎగసింది. రూ. 535 కోట్ల నిర్వహణ లాభం సాధించినప్పటికీ రూ. 1,340 కోట్ల వన్టైమ్ పన్ను చెల్లింపుల కారణంగా రూ. 805 కోట్ల నికర నష్టం ప్రకటించింది. -
'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా బిట్కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేస్తుందో వివరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిట్కాయిన్ ఎంత సులభంగా ధనవంతులను చేసిందో నేను నమ్మలేకపోతున్నాను. ఇది చాలా సులభం. అయితే ప్రతి ఒక్కరూ ఎందుకు బిట్కాయిన్ కొనుగోలుచేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మరో రెండేళ్లలో 0.01 బిట్కాయిన్ కూడా చాలా అమూల్యమైందిగా మారుతుందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.బిట్కాయిన్ విలువ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులుగా మారడానికి, ఆర్థికంగా స్వేచ్ఛను పొందటానికి సులభమైన మార్గాన్ని ఎంచుకోండి.. అని కియోసాకి అన్నారు. బిట్కాయిన్ విలువ మాదిరిగానే.. బంగారం విలువ కూడా భారీగా పెరుగుతుందని చాలా రోజుల నుంచి ఆయన చెబుతూనే ఉన్నారు.ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకిబిట్కాయిన్ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 0.57 శాతం పెరిగి రూ.93.38 లక్షలకు చేరింది. పెరుగుతోంది. అమెరికా సెనేట్లో స్టేబుల్కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని విలువ మరింత పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చెబుతున్నారు.I cannot believe how easy Bitcoin has made getting rich…so easy.Why everyone is not buying and holding Bitcoin is beyond me.Even .01 of a Bitcoin is going to be priceless in two years…. and maybe make you very rich.Sure Bitcoin goes up and down….but so does real life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 26, 2025 -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 455.38 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 82,176.45 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 25,001.15 వద్ద నిలిచాయి.శ్రేయాన్స్ ఇండస్ట్రీస్, ఖైతాన్ (ఇండియా), ఎక్సారో టైల్స్, ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్స్, వాక్స్టెక్స్ కాట్ఫ్యాబ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఫేజ్ త్రీ, సాల్జర్ ఎలక్ట్రానిక్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, పిక్స్ ట్రాన్స్మిషన్స్, ఎమ్బి ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు?
రాబోయే బోర్డు సమావేశంలో మార్కెట్లో సులభతర వ్యాపారాన్ని పెంపొందించడానికి సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 18న జరిగే ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అందులోని కొన్నింటి గురించి కింద తెలియజేశాం.పేపర్ వర్క్ను తగ్గించడానికి, కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్(క్యూఐపీ)ల నిబంధనలు క్రమబద్ధీకరించడం.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులను (ఇన్వీట్లు) ఈక్విటీలతో అనుసంధానం చేయడం వల్ల ఈ రంగాల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని మెరుగుపరచడం.కో-ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్స్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లను సులభతరం చేయడం.ప్రభుత్వ బాండ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) నిబంధనలను సడలించడం.చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నిబంధనలను బలోపేతం చేయడం.క్లియరింగ్ కార్పొరేషన్ల స్వతంత్రతను ఖరారు చేయడం.ఇదీ చదవండి: 5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలుఈ ప్రతిపాదనలను మెరుగుపరచడానికి స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సహా పరిశ్రమ వాటాదారులతో సెబీ సంప్రదింపులు జరుపుతోంది. మార్కెట్ పారదర్శకత, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని అంచనా. -
గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఇప్పుడు...
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజుల క్రితం గణనీయంగా పెరిగిన పసిడి ధరలు నేడు (మే 26) కాస్త దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.440, రూ.400 చొప్పున క్షీణించాయి. వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు వచ్చింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 క్షీణించిపెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)