breaking news
Market
-
రికార్డు స్థాయికి చేరిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..
ఆగస్టు ప్రారంభంలో కొంత తగ్గిన బంగారం ధరలు.. ఇప్పటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు గరిష్టంగా రూ. 760 పెరిగి పసిడి ప్రియులకు మళ్లీ షాకిచ్చింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
250 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 65 పాయింట్లు తగ్గి 24,529కు చేరింది. సెన్సెక్స్(Sensex) 256 ప్లాయింట్లు నష్టపోయి 80,367 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.13బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 66.41 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.35 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సిప్.. సిప్.. హుర్రే!
మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడులు పెరగడం కొనసాగుతోంది. జూన్ త్రైమాసికంలో కొత్త సిప్ ఖాతాలు 1.67 కోట్ల మేర నమోదయ్యాయి. క్రితం క్వార్టర్లో నమోదైన 1.41 కోట్లతో పోలిస్తే ఇది అధికం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 41.9 లక్షల కొత్త సిప్లు, 25 శాతం మార్కెట్ వాటాతో గ్రో సంస్థ అగ్రగామిగా నిలిచింది. నెలవారీగా చూస్తే జూన్లో గ్రోలో కొత్త సిప్లు 15.7 లక్షలుగా రిజిస్టరయ్యాయి. విలువపరంగా చూస్తే కొత్త సిప్లు 32 శాతం పెరిగి రూ. 1,116 కోట్లకు చేరాయి. మరోవైపు, ఏంజెల్ వన్లో కొత్తగా 15 లక్షల సిప్లు, ఎన్జే ఇండియాఇన్వెస్ట్లో 5.9 లక్షలు, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్లో 3.8 లక్షలు, డిజిటల్ ప్లాట్ఫాం ఫోన్పేలో 5.9 లక్షల సిప్లు నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ మ్యూ చువల్ ఫండ్స్పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి మెరుగ్గానే ఉంటోంది.మరిన్ని వివరాలు..మ్యూచువల్ ఫండ్స్లో జూన్లో రికార్డు స్థాయిలో రూ. 27,269 కోట్ల మేర సిప్ పెట్టుబడులు వచ్చాయి. సిప్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) గతేడాది జూన్ 30 నాటి గణాంకాలతో పోలిస్తే ఈసారి జూన్ 30 నాటికి రూ. 15.3 లక్షల కోట్లకు చేరింది. 2025లో మ్యూచువల్ ఫండ్ విశిష్ట ఇన్వెస్టర్ల సంఖ్య 5.4 కోట్లకు చేరింది. 2023లో 3.8 కోట్లతో పోలిస్తే 42 శాతం, 2024లోని 4.5 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగింది. 2025 జూన్ ఆఖరు నాటికి పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రికార్డు స్థాయిలో 74.4 లక్షల కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 63.2 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది.రిటైల్ ఇన్వెస్టర్లు సంప్రదాయ పొదుపు విధానాల నుంచి పెట్టుబడుల మైండ్సెట్ వైపు మళ్లుతున్నారు. మ్యుచువల్ ఫండ్స్ను దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనాలుగా భావిస్తున్నారు.సులభతరంగా ఇన్వెస్ట్ చేసే విధానాలను డిజిటల్–ఫస్ట్ ప్లాట్ఫాంలు మరింతగా అందుబాటులోకి తేవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే యాంఫీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ప్రోత్సహించడంలో, మ్యుచువల్ ఫండ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే! -
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ఐటీ, ఫార్మా స్టాక్స్ నేతృత్వంలో భారత్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ రికవరీని సాధించాయి. సెన్సెక్స్ 811.97 పాయింట్లు పుంజుకుని రోజు కనిష్ట స్థాయి (79,811.29) నుంచి 80,623.26 వద్ద (0.10 శాతం లేదా 79.27 పాయింట్లు) ముగిసింది. నిఫ్టీ కూడా 252 పాయింట్లు పుంజుకుని 24,344.15 పాయింట్ల వద్ద (21.95 పాయింట్లు లేదా 0.09 శాతం) 24,596.15 వద్ద ముగిసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. గత వారం భారత దిగుమతులపై సంతకం చేసిన 25 శాతం సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా ప్రకటించిన టారిఫ్ లు 21 రోజుల నోటీసు పీరియడ్ తర్వాత ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.బీఎస్ఈలో టెక్ మహీంద్రా, ఎటర్నల్ (జొమాటో), హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ టాప్ గెయినర్స్గా నిలవగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత సూచీలు కూడా కోలుకుని పాజిటివ్ గా ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.17 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా 0.75 శాతం, ఐటీ 0.87 శాతం, మీడియా 0.99 శాతం, ఆటో 0.25 శాతం, పీఎస్ యూ బ్యాంక్ 0.29 శాతం, మెటల్ 0.13 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 0.13 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. -
బాబోయ్ బంగారం!.. వరుసగా నాలుగో రోజు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 220 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (గురువారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ట్రంప్ టారిఫ్లు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,501కు చేరింది. సెన్సెక్స్(Sensex) 253 ప్లాయింట్లు నష్టపోయి 80,288 వద్ద ట్రేడవుతోంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
5 కంపెనీలు ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ కంపెనీలు సెబీకి ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ ఐపీవో ద్వారా రూ. 2,700 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ విక్రయానికి ఉంచనుంది. ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకింగ్ సరీ్వసుల విభాగం ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఐపీవోలో భాగంగా రూ. 745 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న రూ. 745 కోట్లలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయ నున్నారు. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్లోని అల్వార్లోగల జిలోత్ ఇండ్రస్టియల్ ఏరియాలో తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోగల ప్లాంటు విస్తరణతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది. గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అహ్మదాబాద్లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుసహా.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు, వడోదరలో రోబోటిక్స్ పరికరాలతోపాటు కొత్త ఆసుపత్రి ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. -
ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్, ఇతర పెట్టుబడుల గురించి సూచనలు చేసే అమెరికా వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు అంటూ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బిట్కాయిన్ ఎవరినైనా ధనవంతులను చేస్తుంది. ఎలాంటి గందరగోళం లేదు, ఒత్తిడి లేదు. దాన్ని (బిట్కాయిన్) సెట్ చేసి మర్చిపో. నువ్వు ధనవంతుడైపోతావని అంటారు కియోసాకి. బిట్కాయిన్తో కోటీశ్వరులుగా మారడం చాలా సులభం అని మీరు చెబితే.. ఇన్ని లక్షల మంది పేదలు ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నకు.. నేనే దానికి ఉదాహరణ అంటూ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..నేను (రాబర్ట్ కియోసాకి) నా మొదటి మిలియన్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా రిస్క్ తీసుకున్నాను, చాలా సమయం పట్టింది. మొదటి మిలియన్ సంపాదించినా తరువాత.. బిట్కాయిన్ గురించి కొంత అధ్యయనం చేసి, అందులో కొంత పెట్టుబడి పెట్టి మర్చిపోయాను. అదే మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మిలియన్స్ సంపాదిస్తున్నాను, మీకు కూడా అదే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను. అయితే జాగ్రత్తగా ఉండాలని అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.ANYONE CAN BECOME a MILLIONAiRE: I can’t believe how Bitcoin makes becoming rich so essy. Bitcoin is Pure Genius asset design. No mess no stress. Just set it and forget it. I made my first million in real estate. That took hard work, lots of risk, lots of money, lots of…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 6, 2025 -
ఆగని పరుగు.. దూసుకెళ్తున్న రేటు: నేటి బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు అమాంతం పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 110 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (బుధవారం) బంగారం ధరల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 24,656కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు పుంజుకొని 80,783 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వెంటాడిన టారిఫ్ భయాలు
ముంబై: రిజర్వ్ బ్యాంకు ద్రవ్య పాలసీ ప్రకటన(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ బ్యాంకులు, చమురు షేర్లలో అమ్మకాలకు పాల్పడ్డారు. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా–భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించకలేపోతున్నాయి.ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 80,710 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు పతనమై 24,650 వద్ద నిలిచింది.⇒ తొలి త్రైమాసిక నికర లాభం 56% వృద్ధి నమోదుతో గాడ్ఫ్రై ఫిలిప్స్ షేరుకు డిమాండ్ లభించింది. బీఎస్ఈలో 10% పెరిగి రూ.9887 వద్ద లోయర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.జీవితకాల కనిష్టాన్ని తాకిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు నష్టపోయి 87.88 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2025 ఫిబ్రవరి 10 నాటి జీవితకాల కనిష్టం 87.95 స్థాయిని తాకింది. రష్యన్ చమురు కొనుగోలు కారణంగా భారత్పై సుంకాలను మరింత పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన కరెన్సీ కోతకు ప్రధాన కారణంగా నిలిచాయి. దేశీ స్టాక్ మార్కెట్ పతనం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది.ఆదిత్య ఇన్ఫోటెక్ అరంగేట్రం అదుర్స్ సీపీ ప్లస్ బ్రాండ్ కింద నిఘా పరికరాలను విక్రయించే ఆదిత్య ఇన్ఫోటెక్ షేరు ఎక్సే్చంజీల్లోకి అదిరిపోయే అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర(రూ.675)తో పోలిస్తే బీఎస్ఈలో 51% ప్రీమియంతో రూ.1,018 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 64% ఎగసి రూ.1,104 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 61% లాభంతో రూ.1,084 వద్ద ముగిసింది. లక్ష్మి ఇండియా ఫైనాన్స్ నిరాశఎన్బీఎఫ్సీ లక్ష్మి ఇండియా ఫైనాన్స్ లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.158)తో పోలిస్తే బీఎస్ఈలో 14 శాతం డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి రూ.133 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 15% నష్టంతో రూ.134 వద్ద నిలిచింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 308.47 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో.. 80,710.25 వద్ద, నిఫ్టీ 73.20 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టంతో 24,649.55 వద్ద నిలిచాయి.ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఎక్స్టిగ్లోబల్ ఇన్ఫోటెక్, తాన్లా ప్లాట్ఫారమ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్, త్రివేణి టర్బైన్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, శీతల్ కూల్ ప్రొడక్ట్స్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
బంగారం ధరలు రయ్ రయ్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. ఇటీవల వరుసగా పడిన పసిడి ధరలు తిరిగి పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు దూసుకుపోయాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
300 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 77 పాయింట్లు నష్టపోయి 24,643కు చేరింది. సెన్సెక్స్(Sensex) 302 ప్లాయింట్లు దిగజారి 80,707 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మరోమారు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (ఆగస్ట్ 04) 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 50 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో.. పసిడి ధరల్లో స్వల్ప కదలికలు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 199.77 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో.. 80,799.68 వద్ద, నిఫ్టీ 71.85 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో.. 24,637.20 వద్ద ముందుకు సాగుతున్నాయి.సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్, మీర్జా ఇంటర్నేషనల్, సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్, ఆర్ఫిన్ ఇండియా, కాప్స్టన్ సర్వీసెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ZIM లాబొరేటరీస్, PSP ప్రాజెక్ట్స్, కాబ్రా ఎక్స్ట్రూషన్ టెక్నిక్, AMJ ల్యాండ్, అడ్వాన్స్డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఆర్బీఐ వైపు మార్కెట్ చూపు
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ పరపతి నిర్ణయాలవైపు దృష్టి సారించనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే జోరందుకున్న ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక గణాంకాలు సైతం కీలకంకానున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారాంతాన ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. వీటికితోడు మరిన్ని దిగ్గజాలు ఈ వారం ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరును వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో బాష్, శ్రీసిమెంట్స్, మారికో, ఏబీ క్యాపిటల్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, ట్రెంట్, పిడిలైట్ ఇండస్ట్రీస్, పీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, బీహెచ్ఈఎల్, ఎల్ఐసీ, టైటన్ కంపెనీ, హెచ్పీసీఎల్, స్టేట్బ్యాంక్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. నేడు(సోమవారం) ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత పాలసీలో స్పీడ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) గత సమీక్షలో అనూహ్యంగా కీలక వడ్డీ రేటు రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో మే నెలలో రెపో రేటు 5.5 శాతానికి దిగివచి్చంది. ఆర్థికవేత్తలు 0.25 శాతం తగ్గింపు అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రెపో రేటు 1 శాతం తగ్గింది. ఫలితంగా 2022 ఆగస్ట్ తదుపరి వడ్డీ రేట్లు కనిష్టానికి చేరాయి. నేడు ప్రారంభంకానున్న ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశాలు బుధవారం(6న) ముగియనున్నాయి. యూఎస్ టారిఫ్ల విధింపు, 3 శాతానికంటే దిగువకు చేరిన ద్రవ్యోల్బణం, ఈ ఏడాది ద్వితీయార్థంలో జీడీపీ నెమ్మదించవచ్చన్న అంచనాలు మరో 0.25 శాతం రేట్ల కోతకు వీలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే గత రేట్ల కోత, ఈ ఏడాది తొలి 3 నెలల్లో జీడీపీ 7.4 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో యథాతథ రేట్ల అమలుకే కట్టుబడవచ్చని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్వెస్టర్లు పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. విదేశీ గణాంకాలు జులై నెలకు చైనా సరీ్వసుల రంగ గణాంకాలు మంగళవారం(5న) వెలువడనున్నాయి. గురువారం(7న) వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. జూన్లోనే చైనా వాణిజ్య మిగులు దాదాపు 115 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం 99 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. జులై నెలకు యూఎస్ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం సోమ, మంగళవారాల్లో వెలువడనున్నాయి. ఇక ఈ వారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) వడ్డీ రేట్ల సమీక్షను చేపట్టనుంది. ఇతర అంశాలు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారత్పై 25 శాతం టారిఫ్లను విధించడంతో 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, రత్నాభరణాలు, ఆక్వా, ఫుట్వేర్, కెమికల్స్ తదితర పలు రంగాలకు సవాళ్లు ఎదురుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇవి మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. మరోపక్క గత నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచి్చనట్లు వివరించారు. జూలైలో నికరంగా రూ.17,741 కోట్ల విలువైన షేర్లను నికరరంగా విక్రయించారు.గత వారం డీలా.. శుక్రవారం(ఆగస్ట్ 1)తో ముగిసిన గత వారం స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో వారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్(బీఎస్ఈ) 863 పాయింట్లు(1.1 శాతం) క్షీణించి 80,560 వద్ద నిలిచింది. నిఫ్టీ(ఎన్ఎస్ఈ) 272 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,565 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ 2.5 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. యూఎస్ టారిఫ్ల విధింపు, ఎఫ్పీఐల అమ్మకాలకుతోడు గత వారాంతాన ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. వీటి ప్రకారం సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,900 స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఒక దశలో 24,550 దిగువకు చేరింది. దీంతో ఈ వారం 24,450 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 24,900–25,000కు తిరిగి చేరవచ్చు. ఇలాకాకుండా మరింత నీరసిస్తే 24,300కు, ఆపై 24,000 పాయింట్లస్థాయికి క్షీణించే వీలుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారీగా పెరిగిన బంగారం ధరలు
ధరలు తగ్గుతున్నాయని సంబరపడేలోపే.. బంగారం రేట్లు అమాంతం పెరిగిపోయాయి. నేడు గరిష్టంగా రూ. 1530 పెరిగిన ధరలు పసిడి ప్రియులను అవాక్కయేలా చేసింది. శుక్రవారం ధరలతో పోలిస్తే.. ఈ రోజు (శనివారం) పసిడి రేటు తారాజువ్వలా పైకి లేచింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock market: భారీ నష్టాలు.. నెత్తురు కక్కిన ఫార్మా షేర్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. వివిధ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను ప్రతికూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 585.67 పాయింట్లు (0.72 శాతం) క్షీణించి 80,599.91 వద్ద స్థిరపడింది. ఈ రోజు సూచీ 81,317.51 -80,495.57 శ్రేణిలో ట్రేడ్ అయింది.ఇక 24,784.15 -24,535.05 రేంజ్లో కదలాడిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 203 పాయింట్లు లేదా 0.82 శాతం క్షీణించి 24,565.35 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ 4.43 నుంచి 2.41 శాతం మధ్య నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.33 శాతం, 1.66 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లో టాప్లో ఉండి 3.33 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్లో అరబిందో ఫార్మా, గ్రాన్యూల్స్ ఇండియా వరుసగా 5.17 శాతం, 4.89 శాతం నష్టపోయాయి. అస్థిరత సూచీ, ఇండియా (విఐఎక్స్) 3.74 శాతం పెరిగి 11.98 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
సీఈవో రాజీనామా.. కుప్పకూలిన షేర్లు
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో 17 శాతం పడిపోయాయి. బీఎస్ఈలో రూ.819.25 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గిరిష్ కౌస్గీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఈ పతనం చోటుచేసుకుంది. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశ, స్థిరత్వంపై పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగించింది.నాయకత్వ శూన్యం2022 అక్టోబర్లో నాలుగేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన గిరీష్ కౌస్గీ 2025 అక్టోబర్ 28న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ తన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయడం వల్ల వారసత్వ ప్రణాళిక, నాయకత్వ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.అయితే కంపెనీ మాత్రం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార దృష్టి, వృద్ధి మార్గం యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇస్తోంది. కొత్త సీఈవో కోసం బోర్డు అనుభవజ్ఞుడైన వ్యక్తిని అన్వేషించడం ప్రారంభించింది.గత పనితీరు అమోఘంకౌస్గీ నాయకత్వంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 200 శాతం వృద్ధి చెందింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లలో అమ్మకాలు 50-రోజుల సగటు కంటే 1,176 శాతం అధికంగా నమోదయ్యాయి. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకాలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి.బలమైన క్యూ1 ఫలితాలుపీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జూలై 21న బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం రూ.2,082 కోట్లుగా నివేదించింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.1,980 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.760 కోట్లు.ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ, సీఈవో రాజీనామా, టెక్నికల్ బ్రేక్డౌన్ కారణంగా తాత్కాలిక అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేచి చూడాలనే దృక్పథాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సీఈవో ఎవరు అవుతారు, మార్కెట్ భావన ఎలా మారుతుంది అన్నది స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు. -
పసిడి ప్రియులకు వరుస ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి మార్కెట్ సెషన్లో తగ్గిన పసిడి ధరలు ఈరోజు కూడా కాస్త దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ సూచీలు నేలచూపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:36 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు నష్టపోయి 24,713కు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 ప్లాయింట్లు దిగజారి 81,001 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి డిమాండ్కు ధరాఘాతం!
ముంబై: పసిడి ధరలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరడంతో డిమాండ్ (పరిమాణం పరంగా) తగ్గుముఖం పట్టింది. జూన్ త్రైమాసికంలో భారత్లో బంగారం డిమాండ్ 134.9 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్ 149.7 టన్నుల కంటే ఇది 10 శాతం తక్కువ. ధరలు రికార్డు స్థాయిలకు చేరడం కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. ధరలు పెరిగిన ఫలితంగా పుత్తడి కొనుగోలుపై భారతీయులు అధికంగా వెచ్చించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. విలువ పరంగా పసిడి డిమాండ్ రూ.1,21,800 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.93,850 కోట్ల కంటే 30% పెరిగింది. బంగారు ఆభరణాల కొనుగోలు డిమాండ్ పరిమాణం పరంగా 17 శాతం తగ్గి 88.8 టన్నులకు పరిమితమైంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 106.5 టన్నులుగా ఉంది. విలువ పరంగా బంగారు ఆభరణాల డిమాండ్ 20 శాతం పెరిగి రూ.80,150 కోట్లకు చేరింది. ధరలు పెరగడం ఫలితంగా ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, అదనంగా ఖర్చు చేయాల్సి రావడం విలువ పెరిగేందుకు దారితీసింది. పెట్టుబడి పరంగా డిమాండ్.. పెట్టుబడి పరంగా బంగారం డిమాండ్ 7 శాతం పెరిగి 46.1 టన్నులుగా జూన్ త్రైమాసికంలో నమోదైంది. విలువ పరంగా చూస్తే డిమాండ్ 54 శాతం పెరిగి రూ.41,650 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలానికి విలువ పెరిగే సాధనంగా బంగారాన్ని చూస్తున్నారనడానికి ఇది నిదర్శమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. బంగారం దిగుమతులు 34 శాతం తగ్గి 102.5 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 150 టన్నులుగా ఉన్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది మరోపక్క, బంగారం రీసైక్లింగ్ (పునర్వినియోగపరిచిన) డిమాండ్ ఒక శాతం పెరిగి 23.1 టన్నులకు చేరుకుంది. 6 నెలల్లో 253 టన్నులు..జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు ఔన్స్కు సగటున 3,280 డాలర్లుగా ఉంటే, 10 గ్రాముల ధర భారత్లో రూ.90,307 స్థాయిలో ఉన్నట్టు సచిన్ జైన్ తెలిపారు. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యం కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది తొలి 6 నెలల్లో (జనవరి–జూన్) భారత్లో బంగారం డిమాండ్ 253 టన్నులుగా ఉండగా, పూర్తి ఏడాదికి 600–700 టన్నుల మధ్య ఉండొచ్చని సచిన్జైన్ తెలిపారు. ధరల్లో స్థిరత్వం ఏర్పడితే డిమాండ్ గరిష్ట స్థాయిలో 700 టన్నులకు చేరుకోవచ్చన్నారు. ధరల పెరుగుదల కొనసాగితే డిమాండ్ 600 టన్నులకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు గురువారం అస్థిర సెషన్ లో ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 296.28 పాయింట్లు (0.36 శాతం) క్షీణించి 81,185.58 వద్ద స్థిరపడింది. గురువారం ఈ సూచీ 81,803.27 నుంచి 80,695.15 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 86.70 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 24,768.35 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ షేర్లలో టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.70-1.34 శాతం రేంజ్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ షేర్లు 3.61 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.05 శాతం, 0.93 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మార్కెట్ ధోరణులను అధిగమించి ఇమామీ, హిందుస్థాన్ యూనిలీవర్ నేతృత్వంలో 1.44 శాతం లాభాలతో స్థిరపడింది. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సూచీలు 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,153 షేర్లలో 2,418 రెడ్లో, 1,598 గ్రీన్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు నిన్నటి మార్కెట్ సెషన్లో పెరిగాయి. తిరిగి ఈ రోజు మళ్లీ ధరలు తగ్గాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
200 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 11:39 సమయానికి నిఫ్టీ(Nifty) 61 పాయింట్లు నష్టపోయి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 ప్లాయింట్లు దిగజారి 81,261 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈలో ఇన్వెస్టర్ ఖాతాలు 23 కోట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ ఖాతాల సంఖ్య జూలైలో 23 కోట్ల స్థాయిని దాటింది. అకౌంట్ల సంఖ్య ఏప్రిల్లో 22 కోట్ల మార్కును దాటగా కేవలం మూడు నెలల్లోనే మరో 1 కోటి అకౌంట్లు జతయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 4 కోట్ల ఖాతాలు (మొత్తం అకౌంట్లలో 17 శాతం) ఉండగా, తర్వాత స్థానాల్లో ఉత్తర్ప్రదేశ్ (2.5 కోట్లు, 11 శాతం వాటా), గుజరాత్ (2 కోట్లకు పైగా, 9 శాతం వాటా), పశ్చిమ బెంగాల్..రాజస్థాన్ (చెరి 1.3 కోట్లు, 6 శాతం వాటా) ఉన్నాయి. మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లలో దాదాపు సగ భాగం వాటా ఈ అయిదు రాష్ట్రాలదే ఉంది. టాప్ 10 రాష్ట్రాల వాటా నాలుగింట మూడొంతులు ఉందని ఎన్ఎస్ఈ వెల్లడించింది. విశిష్ట ఖాతాదారుల సంఖ్య 11.8 కోట్లుగా ఉంది. సాధారణంగా ఒకే ఇన్వెస్టరు పలు బ్రోకరేజీ సంస్థల్లో అకౌంట్లు తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లలో యువత, మొదటిసారిగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్ఎస్ఈ వివరించింది. డిజిటలీకరణ వేగవంతం కావడం, మొబైల్ ఆధారిత ట్రేడింగ్ సొల్యూషన్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడానికి కారణమని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. -
స్టాక్ మార్కెట్లో 10 రోజులు నో ట్రేడింగ్!
దేశంలో స్టాక్ మార్కెట్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేవారు నిరంతరం మార్కెట్ను గమనిస్తుంటారు. ఆగస్టు నెలలో వారాంతాలు మినహా రెండు రోజులు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉంటుంది. శని, ఆదివారాలతో సహా మొత్తం పది రోజుల పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లకు సెలవు ఉంటుంది. అంటే ఆయా రోజుల్లో ట్రేడింగ్ జరగదు.ఎన్ఎస్ఈ ట్రేడింగ్ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. 2025లో రాబోయే మార్కెట్ సెలవు ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తదుపరిది ఆగస్టు 27న వినాయక చవితి రోజున ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్), కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఆగస్టు 15, 27 తేదీల్లో మూసి ఉంటాయి.ఈ ఏడాది ఇక రానున్న స్టాక్ మార్కెట్ సెలవులుఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవంఆగష్టు 27 - వినాయక చవితిఅక్టోబర్ 2 - మహాత్మాగాంధీ జయంతి/ దసరాఅక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజఅక్టోబర్ 22 - బలిప్రతిపాదనవంబర్ 5 - ప్రకాశ్ గురుపూర్ శ్రీ గురునానక్ దేవ్డిసెంబర్ 25 - క్రిస్మస్ -
మార్కెట్ ముగిసిందిలా.. టాప్ గెయినర్స్ ఇవే..
భారత ఈక్విటీలు ఈ రోజు క్యూ1 ఫలితాలతో నడిచాయి. 2025 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన తర్వాత సెన్సెక్స్లో ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన నిర్ణయం ఇన్వెస్టర్లను పక్కకు నెట్టి స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు లోనయ్యాయి.సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143.9 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద ముగిసింది. అదేసమయంలో ఎల్అండ్టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ (0.96 శాతం), నిఫ్టీ ఆటో (0.6 శాతం) అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకుల అంచనాలను కొలిచే ఇండియా వీఐఎక్స్ 2.77 శాతం నష్టంతో 11.21 వద్ద ముగిసింది. -
బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా గడిచిన ఐదు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:21 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 24,866కు చేరింది. సెన్సెక్స్(Sensex) 138 ప్లాయింట్లు పుంజుకుని 81,479 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.75బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.62 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.38 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లెన్స్కార్ట్.. ఐపీఓ రూట్
ఓమ్నిచానల్ ఐవేర్ రిటైలర్ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 13.22 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 273 కోట్లు దేశీయంగా సొంత స్టోర్ల ఏర్పాటు(పెట్టుబడి వ్యయాలు)కు, లీజ్, అద్దె, లైసెన్స్ ఒప్పందాల చెల్లింపులకు రూ. 591.5 కోట్లు, టెక్నాలజీపై రూ. 213.4 కోట్లు, బ్రాండ్ మార్కెటింగ్పై మరో రూ. 320 కోట్లు చొప్పున వెచ్చించనుంది.2008లో షురూ: దేశీయంగా 2008లో ఏర్పాటైన లెన్స్కార్ట్.. 2010లో ఆన్లైన్ ద్వారా బిజినెస్కు తెరతీసింది. 2013లో న్యూఢిల్లీలో తొలి రిటైల్ స్టోర్ను తెరిచింది. కంపెనీ ఐవేర్ విభాగంలో డిజైనింగ్, తయారీ, బ్రాండింగ్, రిటైలింగ్ను చేపడుతోంది. 2025 మార్చికల్లా దేశీయంగా నెలకొలి్పన 2,067 స్టోర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 2,723 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’రాజస్తాన్లోని భివాడీ, హర్యానాలోని గురుగ్రామ్లలో ప్లాంట్లు ఉన్నాయి. జాన్ జాకబ్స్, విన్సెంట్ చేజ్, హూపర్ కిడ్స్ తదితర బ్రాండ్లతో బిజినెస్ నిర్వహిస్తోంది. 2024–25లో నష్టాల నుంచి బయటపడి రూ. 297 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 6,652 కోట్లను తాకింది. -
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్ల నుంచి తగ్గుతున్న పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు పెరిగి 24,694కు చేరింది. సెన్సెక్స్(Sensex) 19 ప్లాయింట్లు పుంజుకుని 80,906 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమ్మకాల ఒత్తిడి.. బేర్మన్న మార్కెట్లు
బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 572.07 పాయింట్లు (0.70 శాతం) క్షీణించి 80,891 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.10 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 24,680.90 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ అనుబంధ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ మాత్రమే 1.23 శాతం వరకు లాభపడగా, మిగతావి నష్టాల్లో స్థిరపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు 1.14 శాతం నుంచి 7.31 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.26 శాతం, 0.84 శాతం నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ రెడ్లో స్థిరపడగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4.26 శాతం నష్టంతో ముగిసింది. -
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 24,832కు చేరింది. సెన్సెక్స్(Sensex) 65 ప్లాయింట్లు దిగజారి 81,397 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ పాలసీ, ఫలితాలు కీలకం
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం యూఎస్ కేంద్ర బ్యాంకు రేట్ల సమీక్ష, జీడీపీ, ఉపాధి గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా నేడు(28న) జూన్ పారిశ్రామికోత్పత్తి వివరాలు తెలియనున్నాయి. అంతేకాకుండా ఈ వారం మరిన్ని కంపెనీల క్యూ1 ఫలితాల వెల్లడికానున్నాయి. వివరాలు చూద్దాం.. దేశీయంగా నేడు జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. మే నెలలో ఐఐపీ వార్షికంగా 1.2 శాతం పుంజుకుంది. ఇక మరోవైపు ఇప్పటికే జోరందుకున్న కార్పొరేట్ల తొలి త్రైమాసిక(క్యూ1) ఫలితాల సీజన్ కొనసాగనుంది. ఈ వారం క్యూ1(ఏప్రిల్–జూన్) పనితీరు ప్రకటించనున్న జాబితాలో 28న ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, టోటల్ గ్యాస్సహా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టొరెంట్ ఫార్మా, గెయిల్ ఇండియా, మజగావ్ డాక్ షిప్, వారీ ఎనర్జీస్, ఉన్నాయి. ఇదే విధంగా 29న ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హ్యుందాయ్ మో టార్స్, ఇండస్ టవర్స్, కేన్స్ టెక్నాలజీ, కేపీ ఐటీ టె క్, 30న హెచ్యూఎల్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, మారుతీ సుజుకీ, కోల్ ఇండియా, అంబుజా సిమెంట్స్, ఐషర్, టీవీఎస్ మోటార్, స్విగ్గీ, డాబర్ ఇండి యా, ఆగస్ట్ 1న ఐటీసీ, టాటా పవర్, గోద్రెజ్ ప్రా పరీ్టస్, జీఎస్కే ఫార్మా, ఎంసీఎక్స్, హనీవెల్ ఆటోమేషన్, ఎల్ఐసీ హౌసింగ్ జాబితాలో చేరాయి. ఎఫ్అండ్వో ముగింపు జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారం(31న) ముగియనుంది. ఇవికాకుండా జూన్ నెలకు ఆటో అమ్మకాలు, టెలికం సబ్స్క్రయిబర్ల వివరాలు తదితర గణాంకాలు సైతం ఈ వారం వెలువడనున్నాయి. ఇటీవల దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నికరంగా అమ్మకాలు చేపడుతున్నారు. వీటితోపాటు థాయ్లాండ్, కాంబోడియా వివాదాలు, ప్రపంచ మార్కెట్ల తీరు.. తదితర అంశాలన్నిటిపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొనవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ట్రేడ్ డీల్స్పై కన్ను భారత్సహా పలు దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు వాణిజ్య సుంకాలను విధించిన విషయం విదితమే. వీటిపై సస్పెన్షన్ గడువు ఆగస్ట్ 1న ముగియనున్న నేపథ్యంలో యూఎస్తో వాణిజ్య ఒప్పందాలు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేశ్ గౌర్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ నిర్ణయాల ఎఫెక్ట్ యూఎస్ ఫెడ్ 29న పాలసీ సమీక్ష చేపట్టనుంది. ఉపాధి సంబంధ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 30న క్యూ2(ఏప్రిల్–జూన్) జీడీపీ ముందస్తు గణాంకాలు వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్ యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. ఈసారి కూడా రేట్లలో మార్పులు చేపట్టకపోవచ్చని, సెప్టెంబర్కు వాయిదా వేయవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సాంకేతికంగా.. 2024 అక్టోబర్ తదుపరి ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ వరుసగా నాలుగో వారమూ నష్టాలతో ముగిసిన నేపథ్యంలో ఈ వారం సైతం మార్కెట్లు మరింత క్షీణించవచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. నిఫ్టీ బలహీనపడితే 24,790, 24,620 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. ఇంతకంటే నీరసిస్తే 24,480 వద్ద సపోర్ట్ ఉందని పేర్కొన్నారు. ఒకవేళ బలపడితే.. స్వల్ప కాలానికి 25,200, 25,300 పాయింట్లస్థాయిలో అవరోధాలు ఎదురుకావచ్చని విశ్లేíÙంచారు.గత వారమిలా.. గత వారం(21–25) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోసారి నికరంగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 295 పాయింట్లు(0.4 శాతం) డీలాపడి 81,463 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 131 పాయింట్లు(0.5 శాతం) నీరసించి 24,837 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 1.5% స్థాయిలో నష్టపోయాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ. 353 కోట్ల ఐపీవోకి హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట డయాలసిస్ సేవలందించే హైదరాబాదీ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా నెఫ్రోప్లస్ రూ. 70.6 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్ట్కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టూ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనవి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను దేశీయంగా కొత్తగా డయాలసిస్ క్లినిక్లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్కి దేశవ్యాప్తంగా 269 నగరాల్లో 447 క్లినిక్లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్తో పాటు ఇటీవలే సౌదీ అరేబియా ద్వారా మధ్యప్రాచ్య మార్కెట్లోకి కూడా విస్తరించింది. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద 5,000 పైగా డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 755.8 కోట్ల ఆదాయం, రూ. 67 కోట్ల లాభం ఆర్జించింది. -
కురిసిన చినుకుల్లా బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. వరుసగా రెండు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరల్లో ఈ రోజు కూడా ఊరట లభించింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కుప్పకూలిన బజాజ్ షేర్లు
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇతర హెవీవెయిట్ షేర్ల బలహీనత మధ్య భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం గణనీయంగా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 721 పాయింట్లు (0.88 శాతం) నష్టపోయి 81,463.09 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 225 పాయింట్లు (0.9 శాతం) క్షీణించి 24,837 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో బజాజ్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ట్రెంట్ షేర్లు టాప్ లూజర్స్గా నిలవగా సన్ ఫార్మా మాత్రమే లాభపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా (0.54 శాతం) మినహా అన్ని కౌంటర్లలో అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ ఆటో 1.27 శాతం, నిఫ్టీ ఐటీ 1.42 శాతం, నిఫ్టీ మెటల్ 1.64 శాతం, నిఫ్టీ రియల్టీ 0.99 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం నష్టపోయాయి.దేశీయ మార్కెట్లో మార్కెట్ అస్థిరతకు కొలమానమైన ఇండియా వీఐఎక్స్ 5.15 శాతం లాభంతో 11.28 వద్ద ముగిసింది. -
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్నటి బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతోపాటు, ఈ రోజు కూడా ఊరట లభించింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:55 సమయానికి నిఫ్టీ(Nifty) 134 పాయింట్లు నష్టపోయి 24,932కు చేరింది. సెన్సెక్స్(Sensex) 395 ప్లాయింట్లు దిగజారి 81,794 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బిట్చాట్... నెట్ అవసరం లేదు!
ట్విట్టర్ కో–ఫౌండర్ జాక్ డోర్సె ‘బిట్చాట్’ అనే కొత్త మెసేజింగ్ యాప్ను లాంచ్ చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్లాగా దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదు. మెసేజ్ను రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ చేయడానికి బ్లూటూత్ను ఉపయోగిస్తుంది బిట్చాట్. ప్రస్తుతం ఇది యాపిల్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నట్లు చెబుతున్నాడు డోర్సె. క్రౌడెడ్ ఏరియాలలో, ఇంటర్నెట్ యాక్సెస్ను బ్లాక్ చేసిన చోట బిట్చాట్ బాగా ఉపయోగపడుతుంది. -
మళ్లీ ఐపీవో హవా..!
ఓవైపు సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు సందడి చేస్తున్నాయి. వెరసి ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య ఐపీవోల ద్వారా అన్లిస్టెడ్ కంపెనీలు రూ. 45,350 కోట్లు సమీకరించాయి. ఇది 45 శాతం వృద్ధికాగా.. మరో 118 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ బాటలో వచ్చే వారం 3 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. తద్వారా రూ. 6,200 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 30న ప్రారంభంకానుంది. ఆగస్ట్ 1న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ధరల శ్రేణి ప్రకటించవలసి ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 29న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా 5.01 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. వీటిని సంస్థలో ప్రధాన వాటాదారులైన స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈతోపాటు.. బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సూటీ(ఎస్యూయూటీఐ) విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో నిధులు ప్రస్తుత వాటాదారుల సంస్థలకు చేరనున్నాయి. 2017లోనే ఐపీవోకు వచ్చిన సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) ఇప్పటికే ఎన్ఎస్ఈలో లిస్టయిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా డిపాజిటరీ సరీ్వసులందించే రెండో సంస్థగా ఎన్ఎస్డీఎల్ లిస్ట్కానుంది. 1996 నవంబర్లో డీమెటీరియలైజేషన్కు తెరతీయడంతో కంపెనీ డీమ్యాట్ సేవలలో భారీగా విస్తరించిన విషయం విదితమే. 2024–25లో కంపెనీ ఆదాయం 12% పైగా ఎగసి రూ. 1,535 కోట్లను తాకింది. నికర లాభం 25% జంప్చేసి రూ. 343 కోట్లకు చేరింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పడేసిన ఐటీ, రియల్టీ షేర్లు
ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఈఎక్స్, కోఫోర్జ్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు స్పందించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 542.47 పాయింట్లు (0.66 శాతం) క్షీణించి 82,184.17 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 157.8 పాయింట్లు లేదా 0.63 శాతం క్షీణించి 25,062.1 వద్ద ముగిశాయి.ఎటర్నల్ (జొమాటో), టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్స్గా లాభపడగా, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ వరుసగా 0.58 శాతం, 1.09 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 2.21 శాతం, నిఫ్టీ రియల్టీ 1.04 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.24 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం లాభపడ్డాయి. -
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 36 పాయింట్లు నష్టపోయి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 ప్లాయింట్లు దిగజారి 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లు ర్యాలీ.. రయ్మన్న ఆటో షేర్లు
ప్రపంచ మార్కెట్ల బలాన్ని ట్రాక్ చేస్తూ భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్ను లాభాలతో ముగించాయి. దీనికి తోడు జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై26) ఫలితాలకు సంబంధించి కొనసాగుతున్న త్రైమాసిక రాబడుల సీజన్ మధ్య స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా సెంటిమెంట్కు దిశానిర్దేశం చేసింది.బీఎస్ఈ సెన్సెక్స్ 539.83 పాయింట్లు (0.66 శాతం) లాభంతో 82,726.64 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 159 పాయింట్లు లేదా 0.63 శాతం లాభంతో 25,219.9 వద్ద సెషన్ను ముగించాయి. టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ టాప్ గెయినర్స్గా నిలవగా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్ టాప్ లూజర్స్గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.34 శాతం లాభంతో, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫ్లాట్ గా ముగిశాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.85 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.76 శాతం, నిఫ్టీ మెటల్ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ 2.6 శాతం నష్టపోయింది. -
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా జరిగే ట్రేడింగ్ సర్వీసుల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దని సూచించింది. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించవలసిందిగా పేర్కొంది.స్టాక్ మార్కెట్లకు సమాంతరంగా నియంత్రణలులేని ఆఫ్మార్కెట్లో నిర్వహించే అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండమంటూ హెచ్చరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధం లేకుండా నిర్వహించే ఇలాంటి లావాదేవీలు భారీ రిస్క్లతో కూడి ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనకు సైతం దారితీస్తాయని హెచ్చరించింది. వెరసి డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమేకాకుండా.. రిస్క్లను సైతం ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. నియంత్రణ, అవగాహన, చట్టబద్ధ సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాఏమిటీ డబ్బా ట్రేడింగ్..సెబీ నిర్వచించిన విధంగా డబ్బా ట్రేడింగ్ అనేది చట్టవిరుద్ధమైన, క్రమబద్ధీకరించని ఆఫ్ మార్కెట్ ట్రేడింగ్. ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో ఉండదు. సెబీ గుర్తింపు పొందిన ఏ ఎక్స్ఛేంజ్లోనూ ఈ ట్రేడులు నమోదు అవ్వవు. వ్యాపారులు, డబ్బా ఆపరేటర్ల మధ్య నగదు రూపంలో సెటిల్మెంట్లు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ ధర కదలికలపై బెట్టింగ్ వేస్తారు. సెక్యూరిటీల వాస్తవ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు. వీటిని అనుసరించడం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1956, సెబీ యాక్ట్ 1992, భారతీయ న్యాయ్ సంహిత 2023ను ఉల్లంఘించడం అవుతుందని గుర్తుంచుకోవాలి. -
జీసీసీల నిర్వహణకు కోవాసెంట్ ‘ఎనేబ్లర్’ సేవలు
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల నిర్వహణకు ఉపయోగపడేలా ‘ఎనేబ్లర్’ పేరిట కొత్త సర్వీస్ల విభాగాన్ని ప్రారంభించినట్లు కోవాసెంట్ టెక్నాలజీస్ వెల్లడించింది. కంపెనీలు జీసీసీలను ఏర్పాటు చేయడం, నిర్వహించుకోవడం, కార్యకలాపాలను మెరుగుపర్చుకోవడానికి సంబంధించి కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించి ఎనేబ్లర్ తగు వ్యూహాలను అందిస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాసరైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకోవడం నుంచి ఆటోమేషన్, అనలిటిక్స్ను ఉపయోగించుకోవడం వరకు ఇది అన్ని రకాల సేవలను అందిస్తుందని వివరించింది. కేవలం కంపెనీల కార్యకలాపాల నిర్వహణ పరమైన పనులకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు, వ్యూహాల్లో కూడా భాగస్వాములుగా జీసీసీలు ఎదిగేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోవాసెంట్ టెక్నాలజీస్ తెలిపింది. వచ్చే అయిదేళ్లలో హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 150 జీసీసీల ఏర్పాటుపై ఎనేబ్లర్ దృష్టి పెట్టినట్లు సంస్థ వివరించింది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,121కు చేరింది. సెన్సెక్స్(Sensex) 196 ప్లాయింట్లు పుంజుకుని 82,382 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి.. మళ్లీ రూ.లక్ష పైకి!
న్యూఢిల్లీ: పుత్తడి మరోసారి జిగేల్మంది. కొనుగోళ్ల మద్దతుతో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మంగళవారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 లాభపడి రూ.1,00,020 స్థాయికి చేరింది. స్టాకిస్టుల నుంచి బలమైన కొనుగోళ్లు జరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,000 పెరిగి రూ.99,550 స్థాయిని చేరుకుంది.అటు వెండిలోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో రూ.3,000 లాభపడి కిలోకి రూ.1,14,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో (కామెక్స్ ఫ్యూచర్స్) ఔన్స్ బంగారం 35 డాలర్లకు పైగా లాభంతో 3,440 డాలర్ల స్థాయిని చేరుకుంది. వెండి ధర ఔన్స్కు 39.50 డాలర్ల వద్ద ఉంది. పరపతి విధానంపై యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు.చైనా లోన్ ప్రైమ్ రేటుపై నిర్ణయం, యూఎస్ ఆర్థిక డేటా (పీఎం, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు), వడ్డీ రేట్లపై నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారంలో తదుపరి ర్యాలీని నిర్ణయిస్తాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ అభిప్రాయపడ్డారు. -
రిలయన్స్, ఐటీ షేర్లు పడేశాయ్..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 82,187 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,061 వద్ద నిలిచింది. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆరంభంలోనే ఓ మోస్తారు లాభాలు గడించాయి. ఒక దశలో సెన్సెక్స్ 338 పాయింట్లు పెరిగి 82,538 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,182 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి.అయితే భారత్ – యూఎస్వాణిజ్య ఒప్పందానికి తుది గడువు ఆగస్టు 1 సమీపిస్తున్నా.. డీల్పై ఎలాంటి స్పష్టత రాకపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఇండెక్సుల వారీగా బీఎస్ఈలో రియల్టీ 1%, టెలీకమ్యూనికేషన్, ఆటో, ఐటీ, టెక్ షేర్లు అరశాతం నష్టపోయాయి.⇒ అంచనాలకు మించి క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటనతో డెలివరీ దిగ్గజం ఎటర్నల్ షేరు రెండో రోజూ రాణించింది. బీఎస్ఈలో 11% పెరిగి రూ.300 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% ఎగసి రూ.312 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లో కంపెనీ మార్కెట్ విలువ రూ.41,013 కోట్లు పెరిగి రూ.2.89 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. శాంతి గోల్డ్ @ రూ. 189–199న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 189–199 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. దీనిలో భాగంగా 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 360 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా విభిన్న బంగారు ఆభరణాల డిజైన్, తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం వార్షికంగా 2,700 కేజీల బంగారు ఆభరణాల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు పెరిగి 25,109కు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 ప్లాయింట్లు పుంజుకుని 82,324 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ.99,020కు చేరిన బంగారం ధర
న్యూఢిల్లీ: స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధరలు సానుకూలంగా ట్రేడయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.99,020 స్థాయిని చేరింది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి సైతం ఇంతే మేర లాభపడి రూ.98,550 స్థాయిని తాకింది. మరోవైపు వెండి ధర కిలోకి రూ.500 పుంజుకోవడంతో రూ.1,11,000 స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 16 డాలర్ల వరకు పెరిగి 3,365 డాలర్ల స్థాయి వద్ద ట్రేడయ్యింది. ‘‘యూఎస్ టారిఫ్లకు సంబంధించి అనిశ్చితులు కొనసాగడంతో బంగారం ధరలు గరిష్టాల వద్ద ట్రేడయ్యాయి. డాలర్ బలపడడం విలువైన లోహాల ధరలకు మద్దతుగా నిలిచింది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
బ్యాంకు షేర్లకు డిమాండ్
ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు మెటల్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 443 పాయింట్లు పెరిగి 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 25,091 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 516 పాయింట్లు పెరిగి 82,274 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు బలపడి 25,111 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా.. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలహీనపడి 86.31 వద్ద స్థిరపడింది.బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్ గూడ్స్ 1.33%, బ్యాంకెక్స్ 1.28%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 1.26%, మెటల్, కమోడిటీస్ 1%, ఆటో, కన్జూమర్ డిస్క్రేషనరీ 0.5% చొప్పున పెరిగాయి.అంచనాలకు మించి తొలి త్రైమాసిక నికరలాభం రూ.16,258 కోట్ల నమోదుతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% పెరిగి రూ.2,000 వద్ద స్థిరపడింది. క్యూ1 ఆరి్థక ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్, తొలిసారి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీతో పాటు బ్రోకరేజ్ సంస్థలు షేరుకు ‘బై’ రేటింగ్ కేటాయింపు అంశాలు కలిసొచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేరు 3% లాభపడి రూ.1,466 వద్ద స్థిరపడింది. తొలి త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించడంతో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3% నష్టపోయి రూ.1428 వద్ద నిలిచింది. తొలి త్రైమాసికంలో ఆయిల్–కెమికల్స్(ఓ2సీ), రిటైల్ విభాగాల పనితీరు నిరాశపరచడంతో పాటు ఇటీవలి ర్యాలీతో షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీవెయిట్స్ నుంచి బలమైన క్యూ1 రాబడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం పెరిగి 82,200.34 స్థాయిలలో స్థిరపడగా, నిఫ్టీ 50 122.3 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,090.7 స్థాయిలలో ముగిసింది.నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.66 శాతం లాభపడగా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, యూపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, బీఎస్ ఈ, బీడీఎల్, పాలసీబజార్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సుజ్లాన్, అశోక్ లేలాండ్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ప్రతికూల ప్రభావంతో ఫ్లాట్ గా స్థిరపడింది.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, మెటల్ 1 శాతానికి పైగా లాభపడి టాప్ గెయినర్స్గా నిలిచాయి. బ్యాంక్ షేర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.7 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ, ఆటో, ఎనర్జీ, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, మీడియా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 18 షేర్లు గ్రీన్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ 5.4 శాతం వరకు లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.67 శాతం క్షీణించి 11.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
బంగారం ఇంకెంత పెరుగుతుంది?
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తులం (10 గ్రాములు) పసిడి ధర రూ.లక్ష దాటేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3,350 డాలర్ల వద్ద ఉంది. అయితే రాబోయే రోజుల్లో పుత్తడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బులియన్ ధరను నడిపించే అనేక అంశాలు రానున్న రోజుల్లో ఉన్నాయని చెబుతున్నారు.ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఏం మాట్లాడతారు.. అమెరికా, బ్రిటన్, యూరోజోన్ సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థల గ్లోబల్ పీఎంఐ డేటా వంటి అంశాలను ట్రేడర్లు నిశితంగా పరిశీలించనున్నారు. బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయనేదానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటిలో ఏ అంశాలు బంగారం ధరకు అనుకూలంగా పనిచేసినా పసిడి రేటు పెరుగుతుంది.అమెరికా ప్రకటించినా ప్రతీకార సుంకాల అమలు తేదీ ఆగస్టు 1 డెడ్లైన్ సమీపిస్తుండటంతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి బంగారం సేఫ్ హెవెన్ డిమాండ్కు ఊతమిచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దేశీయ పండుగల డిమాండ్ కూడా బంగారం ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ - కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు.వెంచురా కమోడిటీ అండ్ సీఆర్ఎం హెడ్ ఎన్ఎస్ రామస్వామి ప్రకారం.. బలహీనమైన యూఎస్ డాలర్, భౌగోళిక రాజకీయ నష్టాలు, బలమైన పెట్టుబడిదారుల డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కొనసాగడం వంటి సరైన ఉత్ప్రేరకాలు కార్యరూపం దాలిస్తే, 2025 ప్రథమార్ధంలో బలమైన 26 శాతం పెరుగుదల తర్వాత ద్వితీయార్ధంలోనూ బంగారం మరో 4-8 శాతం లాభపడవచ్చు. -
ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ధరలు స్పలంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వారంలో 4 పబ్లిక్ ఇష్యూలు.. 1 లిస్టింగ్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో మరోసారి ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానుండగా.. మరోవైపు ఇప్పటికే ఐపీవో పూర్తి చేసుకున్న ఏంథమ్ బయోసైన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. గత వారం మెయిన్బోర్డ్లో ఇష్యూ పూర్తి చేసుకున్న ఏంథమ్ బయోసైన్స్ కౌంటర్లో నేడు(21న) ట్రేడింగ్కు తెరలేవనుంది. ఇష్యూ ధర రూ. 570కాగా.. 64 రెట్లు అధికంగా స్పందన లభించడం గమనార్హం! కాగా.. వర్క్స్పేస్ సొల్యూషన్స్ సమకూర్చే ఇండిక్యూబ్ స్పేసెస్తోపాటు.. డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైళ్లు తదితర ప్రొడక్టుల పునరుద్ధరణ కంపెనీ జీఎన్జీ ఎల్రక్టానిక్స్ ఐపీవోలు 23న ప్రారంభంకానున్నాయి.ఇదీ చదవండి: రిటైర్మెంట్ కోసం స్మాల్క్యాప్ బెటరా?25న ముగియనున్న ఇష్యూల ద్వారా ఇండిక్యూబ్ రూ. 700 కోట్లు, జీఎన్జీ రూ. 460 కోట్లకుపైగా సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. రెండు సంస్థలు ఒకే విధంగా రూ. 225–237 ధరల శ్రేణిని ప్రకటించాయి. ఈ బాటలో ఆతిథ్య రంగ సంస్థ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవో 24న ప్రారంభంకానుంది. 28న ముగియనున్న పబ్లిక్ ఇష్యూ ద్వారా హోటళ్ల చైన్ సంస్థ రూ. 750 కోట్ల వరకూ సమీకరించే యోచనలో ఉంది. బెంగళూరు, చైన్నై, కొచ్చి తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 9 హోటళ్ల ద్వారా 1,604 గదులను నిర్వహిస్తోంది. బంగారు ఆభరణ తయారీ సంస్థ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఐపీవో 25న ప్రారంభంకానుంది. దీనిలో భాగంగా కంపెనీ 1.8 కోట్ల షేర్లు కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు సంస్థలు ధరల శ్రేణిని ప్రకటించవలసి ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు నష్టపోయి 24,906కు చేరింది. సెన్సెక్స్(Sensex) 159 ప్లాయింట్లు దిగజారి 81,593 వద్ద ట్రేడవుతోంది.యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్టు 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు కొంత మొత్తాన్ని కేటాయించుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల మార్కెట్ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఇవి పనిచేస్తుంటాయి. స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ కంపెనీల్లో మెరుగైన అవకాశాలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో రిస్్కను సమతుల్యం చేస్తూ.. మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో దశాబ్దాలుగా పనిచేస్తూ మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ముందుంది. రాబడులు.. గత పదేళ్ల కాల పనితీరును గమనించినట్టయితే వార్షిక రాబడి 16 శాతం చొప్పున ఉంది. ఏడేళ్లలో 20 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 30 శాతం, మూడేళ్లలో 27.43 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గత ఏడాది కాల రాబడి 8.43 శాతంగా ఉంది. 1995లో ఈ పథకం మార్కెట్లోకి వచి్చంది. అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 18.92 శాతం చొప్పున ఉంది. ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. మార్కెట్ పతనాలు, రంగాలు, కంపెనీల వారీ పరిణామాలను గమనించి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమైన పని. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరు. కనుక సంపద సమకూర్చుకోవాలని భావించే వారు ఈక్విటీ ఫండ్స్కు తగినంత కేటాయించుకోవడం అవసరం. సిప్ ద్వారా కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడుల విధానం.. చురుకైన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల విధానం ఈ పథకంలో గమనించొచ్చు. భవిష్యత్తులో గొప్పగా వృద్ధి చెందే బలాలున్న కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్ఫోలియోలో తగినంత వైవిధ్యాన్ని నిర్వహిస్తుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో పోటీ పథకాలతో పోల్చి చూసినప్పుడు హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ స్టాక్స్ నాణ్యత మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం పోర్ట్ఫోలియో పీఈ 17.68గా ఉంది. సగటున కంపెనీల వార్షిక వృద్ధి 27.42 శాతం చొప్పున ఉంది. క్వాలిటీ, వ్యాల్యూ వ్యూహాలను సైతం ఈ పథకం అమలు చేస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో ఈ పథకంతోపాటు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ టాప్–2గా ఉన్నాయి. పోర్ట్ఫోలియో.. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.79,585 కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఇందులో 87 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 0.66 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.62 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. 9.72 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే పెట్టుబడులకు వీలుగా నగదు నిల్వలు అధికంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 87 శాతం లార్జ్క్యాప్లోనే ఉండడం గమనార్హం. మిడ్ క్యాప్ స్టాక్స్లో 9 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్లో 3.91 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.లార్జ్క్యాప్ వ్యాల్యూషన్లు సహేతుక స్థాయిలో ఉండడంతో ఎక్కువ పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 51 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 40 శాతం వరకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డి్రస్కీషినరీ కంపెనీలకు 16.99 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 8.64 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.55 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
ఫలితాలు, వాణిజ్య చర్చలపై దృష్టి
ప్రధానంగా తొలి త్రైమాసిక ఫలితాలే ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాతాన పలు దిగ్గజాలు ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరు వెల్లడించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో మరిన్ని బ్లూచిప్స్ క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్గత వారాంతాన ప్రకటించిన క్యూ1 ఫలితాలలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డ్కు తెరతీసింది. ఒక త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 26,994 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వాటాదారులకు సంస్థ చరిత్రలోనే తొలిసారి అదికూడా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ప్రకటించింది. ఇక మరో దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ సైతం పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ1లో 16% వృద్ధితో రూ. 13,558 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి నేడు ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లు సందడి యనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రెడీ..: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ మరింత జోరందుకోనుంది. ఈ వారం డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఎంఅండ్ఎం, ఏసీసీ, కాల్గేట్, డిక్సన్, తదితర బ్లూచిప్స్ క్యూ1 పనితీరు వెల్లడించనున్నాయి. అంతేకాకుండా ఎటర్నల్, జీల్, ఎంఫసిస్, కెనరా బ్యాంక్, ఎస్ బీఐ లైఫ్ తదితరాలు సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫలితాలపై అత్యధికంగా దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. వాణిజ్య డీల్స్..: యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే బాటలో దేశీ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరితే సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమవుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇది విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపే వీలున్నట్లు తెలియజేశారు. వడ్డీ రేట్లపై యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత వారం భారత్, యూఎస్ బృందాలు నాలుగు రోజులపాటు వాషింగ్టన్లో నిర్వహించిన ఐదో రౌండ్ చర్చలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆగస్ట్ 1కల్లా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావానికి చెక్ పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్లలో అనిశ్చితికి కారణమవుతున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. సాంకేతికంగా చూస్తే.. గత వారం నిఫ్టీ 25,000 మైలురాయి దిగువన 24,900కు క్షీణించింది. దీంతో సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం ఈ వారం ఆటుపోట్ల మధ్య మరింత బలహీనపడి 24,500వరకూ నీరసించే వీలుంది. అయితే మార్కెట్లు బలపడితే నిఫ్టీకి 25,250 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.ఎఫ్పీఐల వెనకడుగుజులైలో రూ. 5,524 కోట్లు వెనక్కిన్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నగదు విభాగంలో ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 5,524 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో 2025 తొలి 7 నెలల్లో రూ. 83,245 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. అయితే జూన్లో రూ. 14,590 కోట్లు, మే నెలలో రూ. 19,860 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్ మధ్య నుంచి అమ్మకాల బాటను వీడి రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతకుముందు మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. గత వారమిలా వరుసగా మూడో వారం దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 743 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 81,758 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ 181 పాయింట్లు తగ్గి 24,968 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు 1–1.5 శాతం చొప్పున నష్టపోయాయి. -
అన్లిస్టెడ్ షేర్లు.. చేతులు కాలుతాయ్!
పేరున్న కంపెనీ ఐపీవోకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వస్తోందంటే ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగిపోతుంది. అదృష్టాన్ని పరీక్షించుకుందామని పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తుంటారు. ఐపీవోలో షేర్లు దక్కని వారు లిస్టింగ్ తర్వాత కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇవన్నీ కలసి స్టాక్ వ్యాల్యూయేషన్లను అమాంతం పెంచేస్తుంటాయి. లిస్టింగ్లోనే లాభాలు కురుస్తుండడంతో ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎగబాగుతోంది.కొందరు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకుని మరీ.. ఐపీవోకు రావడానికి ముందుగానే ఆయా కంపెనీల షేర్లను అన్లిస్టెడ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధోరణి ఇటీవల విస్తరిస్తోంది. కానీ, అందరికీ ఇది అనుకూలం కాదు. రెగ్యులర్ మార్కెట్లకు మించి అన్లిస్టెడ్ మార్కెట్లో రెట్టింపు రిస్క్ ఎదురుకావొచ్చు. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్వన్97 కమ్యూనికేషన్స్ నుంచి స్విగ్గీ వరకు.. అంతెందుకు తాజాగా లిస్టయిన హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ సైతం అన్లిస్టెడ్ మార్కెట్లో మంచి డిమాండ్ పలికినవే. ముందుగా ఇన్వెస్ట్ చేసినట్టయితే లిస్టింగ్ సమయానికి మంచి లాభాలు కళ్లజూడొచ్చన్న ఉద్దేశంతో కొందరు అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ లిస్టింగ్ సమయానికి కంపెనీల విలువలు పెరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. పడిపోవడం కూడా జరగొచ్చు. ఇందుకు నిదర్శనం హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్. చేదు అనుభవాలు..! అన్లిస్టెడ్ మార్కెట్లో కోట్ అయ్యే షేర్ల ధరలు కంపెనీ వాస్తవ విలువలను ప్రతిబింబించవు. ఎందుకంటే అక్కడ షేర్ల సరఫరా పరిమితంగా ఉంటుంది. కొద్ది డిమాండ్కే ధరలు అమాంతం ఎగబాకొచ్చు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్టెడ్ కంపెనీల విలువలు వాటి ఆరి్థక మూలాలను ప్రతిఫలిస్తుంటాయి. బుల్ర్యాలీలో అతిగా పెరిగినప్పటికీ తర్వాత దిద్దుబాటుతో దిగొస్తుంటాయి. రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంటుంది. అన్లిస్టెడ్ మార్కెట్ అలా కాదు. కేవలం కొద్దిపాటి సరఫరా ధరలను నిర్ణయిస్తుంటుంది. ఆ సరఫరా కూడా కొద్ది మంది బ్రోకర్ల పరిధిలోనే ఉంటే వారికి నచ్చిన విధంగా మానిప్యులేషన్ చేసే అవకాశం లేకపోలేదు.అధిక ధరల్లో కొనుగోలు చేస్తే, రాబడుల సంగతేమో కానీ, పెట్టుబడిని రాబట్టుకోవడానికే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావచ్చు. వన్97 కమ్యూనికేషన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్, రిలయన్స్ రిటైల్ షేర్లు అన్లిస్టెడ్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మిగిల్చిన చేదు అనుభవాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎన్బీఎఫ్సీ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐపీవో ఇటీవలే ముగిసింది. ఒక్కో షేరును రూ.740కే కేటాయించింది. కానీ, ఐపీవో ముందు వరకు అన్లిస్టెడ్ మార్కెట్లో ఒక్కో షేరు రూ.1400 ధర పలికింది. లిస్టింగ్కు ఏడాది ముందు కాలంలో రూ.700–1,400 మధ్య కదలాడింది.రూ.1,400 ధరపై కొనుగోలు చేసిన వారు తాజా ఐపీవో ధర ప్రకారం 40% నష్టపోయినట్టు తెలుస్తోంది. కంపెనీ మంచి పనితీరు చూపిస్తే కొంత కాలానికి షేరు ధర కోలుకుంటుందని ఆశించొచ్చు. అన్లిస్టెడ్ ధర కంటే తక్కువకే ఇప్పుడు ఎక్సే్ఛంజ్ల్లో లభిస్తుండడాన్ని ఇన్వెస్టర్లు ఒక గుణపాఠంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో విషయంలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. 2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరు ధరను రూ.475–500గా ఖరారు చేసింది. కానీ, అప్పటికి అన్లిస్టెడ్ మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.1,010–1,100 స్థాయిలో ట్రేడయ్యింది.పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ విషయంలో ఇన్వెస్టర్లకు చేదు అనుభవమే ఎదురైంది. 2021లో వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవోకి రాగా.. ఒక్కో షేరును రూ.2,150కు కేటాయించింది. లిస్టింగ్ రోజే కాదు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ధరకే చేరుకోలేదు. ఐపీవోకి ముందు అన్లిస్టెడ్ మార్కెట్లో రూ.2,800 వరకు ట్రేడయ్యింది. ఇక అన్లిస్టెడ్ మార్కెట్లో అధిక ధర పెట్టి రిలయన్స్ రిటైల్ షేర్లను కొనుగోలు చేసిన వారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద షాకిచ్చింది. 2023లో మైనారిటీ షేర్ హోల్డర్ల వద్దనున్న వాటాలను ఒక్కోటీ రూ.1,362 చొప్పున కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.అన్లిస్టెడ్ మార్కెట్లో అప్పటికి ఒక్కో షేరు రూ.2,700 ధర వద్ద ట్రేడవుతోంది. దీన్ని బట్టి అన్లిస్టెడ్ మార్కెట్లో ధరలు సహేతుక స్థాయిలో ఉండవన్న విషయం సుస్పష్టం. అన్లిస్టెడ్ మార్కెట్లో ధరల ఆధారంగా కంపెనీలు ఐపీవో ధరను నిర్ణయించవ ని అర్థం చేసుకోవాలి. అప్పటి మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్లలో ఆసక్తికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, లీడ్ మేనేజర్లు షేర్ల ధరల శ్రేణిని నిర్ణయిస్తుంటాయి. కనుక ఐపీవోకి ముందే కొనుగోలు చేయడం ద్వారా లాభం పొందుతామన్న గ్యారంటీ ఉండదని ఈ నిదర్శనాలను చూసి అర్థం చేసుకోవాలి.రిస్క్ లను పరిశీలించాలి.. అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు చిక్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ‘అన్లిస్టెడ్ మార్కెట్లో షేర్ల ధరలు పారదర్శకంగా ఉండవు. సెంటిమెంట్, కంపెనీకి సంబంధించి ప్రచారం, అంతర్గత సమాచారం ఆధారంగా మానిప్యులేషన్ (కృత్రిమంగా ధరలను ప్రభావితం చేయడం)కు అవకాశం ఉంటుంది. లిక్విడిటీ మరో పెద్ద సమస్య. అవసరమైనప్పుడు సులభంగా కొనుగోలు, విక్రయం సాధ్యపడదు. లావాదేవీలను ఎక్సే్ఛంజ్ ద్వారా కాకుండా మధ్యవర్తుల సాయంతో చేయాల్సి ఉంటుంది. ఇందులో పారదర్శకత ఉండదు. పెట్టుబడి మొత్తాన్ని ముందుగానే చెల్లించినప్పటికీ షేర్లను డెలివరీ చేయకపోవచ్చు. ఇంతటితో రిస్క్ లు ముగియలేదు. కంపెనీల విలువలను మదింపు వేయడం కూడా కష్టమే.అన్లిస్టెడ్ కంపెనీలు లిస్టెడ్ కంపెనీల మాదిరి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించవు. కనుక ఆయా కంపెనీల వ్యాపారం, నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం. పైగా సంబంధిత కంపెనీ ఎప్పటికీ లిస్టింగ్కు రాకపోతే అందులో పెట్టుబడి నిలిచిపోవచ్చు. ని ధుల సమీకరణ కోసం మరిన్ని షేర్లను జారీ చే స్తూ వెళుతుంటే అప్పటికే ఉన్న షేర్ల ధరల్లో సర్దుబాటు ఉంటుంది’ అని ఆనంద్రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి వివరించారు. పైగా వీటిపై సెబీ పర్యవేక్షణ ఉండదన్న విషయాన్ని గుర్తు చేశారు. జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ సైతం ఎక్స్ వేదికగా ఇటీవలే దీనిపై ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు లిస్టింగ్తో లాభాలు పొందొచ్చన్న ధోరణితో కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐపీవోను ప్రస్తావించారు. పారదర్శకత లేమి, తక్కువ లిక్విడిటీ (షేర్ల లభ్యత), నియంత్రణల మధ్య పనిచేయకపోవడం వల్ల రెగ్యులర్ స్టాక్ మార్కెట్తో పోల్చితే అన్లిస్టెడ్ మార్కెట్లో రిస్క్ ఎంతో ఎక్కువని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని, పెట్టుబడికి ముందు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ విషయమై ఇన్వెస్టర్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అన్లిస్టెడ్ సెక్యూరిటీలు లేదా అన«దీకృత ఎల్రక్టానిక్ ప్లాట్ఫామ్ల్లో లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించింది. ఆయా ప్లాట్ఫామ్లలో సెక్యూరిటీల లావాదేవీలకు సెబీ అనుమతి లేదని.. సెక్యూరిటీల చట్టం 1956కు విరుద్ధంగా అవి నడుస్తున్నట్టు పేర్కొంది.విలువలు కీలకం..రిలయన్స్ రిటైల్ ఉద్యోగులకు కేటాయించిన స్వల్ప వాటాలను వారు అన్లిస్టెడ్ మార్కెట్లో విక్రయించడంతో.. సరఫరా పరిమితంగా ఉండి ధర విపరీతంగా పెరిగిపోయింది. 2019లో రూ.400 వద్దనున్న షేరు 2021 నాటికే రూ.4,000కి పెరిగిపోవడం గమనార్హం. చివరికి 2023లో ఒక్కో షేరుకు రిలయన్స్ కట్టిన ధర రూ.1,362. ఆరంభంలో కొనుగోలు చేసి ఉంటే, ఈ ధరపైనా మంచి లాభమే వచ్చి ఉండేది. కంపెనీ ఆరి్థక మూలాలను అనుసరించి, సహేతుక ధరల వద్ద అన్లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చు.కానీ, అన్లిస్టెడ్ మార్కెట్లో డిమాండ్ లేని షేర్లే సహేతుక ధరల వద్ద లభిస్తుంటాయి. క్రేజీ షేర్లు ఎప్పుడు అసాధారణ ధరలపైనే ట్రేడవుతుంటాయి. వారీ ఎనర్జీస్ ఒక్కో షేరు ధర అన్లిస్టెడ్ మార్కెట్లో రూ.2,500 ఉంటే కంపెనీ ఐపీవోలో నిర్ణయించిన ధర రూ.1,500. కానీ, ఒక్కో షేరు రూ.2,500 వద్ద లిస్ట్ అయింది. ఇప్పుడు రూ.3,000కు పైనే ట్రేడవుతోంది. ఇలా ఒక్కో కంపెనీకి సంబంధించి అనుభవం వేర్వేరుగా ఉంటుంది. కనుక మంచి యాజమాన్యం, వ్యాపారపరమైన బలాలు, పటిష్టమైన ఆరి్థక మూలాలు కలిగి, ఆకర్షణీయమైన విలువల వద్ద లభిస్తేనే అన్లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఆల్టీయస్ ఇన్వెస్టెక్, ఇన్క్రెడ్ మనీ, అన్లిస్టెడ్ జోన్ ఇలా పదుల సంఖ్యలో బ్రోకర్లు అన్లిస్టెడ్ మార్కెట్లో కీలకంగా పనిచేస్తున్నారు.ధరల్లో అస్థిరతలురెగ్యులర్ స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీ కొనుగోలు, విక్రయ లావాదేవీలను సులభంగా నిర్వహించుకోవచ్చు. సెబీ పర్యవేక్షణ లేని అన్లిస్టెడ్ మార్కెట్లో లావాదేవీల పూర్తికి కొన్ని రోజుల సమయం పడుతుంది. సంప్రదాయ స్టాక్ బ్రోకర్లు సెబీ నియంత్రణల కింద పనిచేస్తుంటారు. కనుక ముందస్తుగా చేసే చెల్లింపులకు భరోసా ఉంటుంది. అన్లిస్టెడ్ మార్కెట్లో కొనుగోలుకు సరిపడా మొత్తాన్ని ముందుగానే మధ్యవర్తుల ఖాతాలకు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు షేర్లను డెలివరీ చేస్తారు. షేర్లు విక్రయించాలనుకుంటే ముందుగా షేర్లను వారి ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత నగదు బదిలీ చేస్తారు. బ్రోకర్ విశ్వసనీయతపైనే లావాదేవీల సాఫల్యత ఆధారపడి ఉంటుంది. బ్రోకర్ చేతులెత్తేస్తే న్యాయపరంగా పోరాడడం మినహా మరో మార్గం ఉండదు. పైగా అమ్మకం, కొనుగోలు ధరకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఈ వ్యత్యాసమే బ్రోకర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.ఆరు నెలలు వెయిటింగ్..ఐపీవోకి ముందు అన్లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లిస్టింగ్ తర్వాత విక్రయించి లాభం పోగేసుకుందామని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే లిస్టింగ్ అయిన నాటి నుంచి ఆరు నెలల తర్వాతే వారు విక్రయించుకోగలరు. ఆరు నెలల లాకిన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఐపీవోకి ముందు ఇన్వెస్ట్ చేసిన వారు అంతకాలం ఆగిన తర్వాతే సెక్యూరిటీలను విక్రయించుకోగలరు. అప్పటికి స్టాక్ ధర ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఓయో కంపెనీ గత రెండేళ్లుగా ఐపీవో సన్నాహాలతో ఉంది. ఎప్పటికప్పుడు ఐపీవో వాయిదా పడుతోంది. కనుక త్వరలో ఐపీవోకి వస్తే విక్రయించుకోవచ్చన్న ఆశయంతో పెట్టుబడులు పెట్టేయడం సరికాదు.డిమాండ్ ఉన్న షేర్లలో చెన్నై సూపర్ కింగ్స్ షేరు ఒకటి. కానీ ఎప్పుడు ఐపీవోకి వస్తుందో తెలియని పరిస్థితి. ‘వ్యాపార పరంగా నిరూపించుకుని, స్టాక్ మార్కెట్లో సహేతుక వ్యాల్యుయేషన్ల వద్ద ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉండగా, క్రేజీ వ్యాల్యుషన్లతో అన్లిస్టెడ్ మార్కెట్లో తక్కువ లిక్విడిటీతో ట్రేడ్ అవుతున్న వాటి జోలికి పోవడం ఎందుకు?’ అని స్ట్రేజీ స్టార్టప్ సీఈవో మోహిత్ భండారీ ప్రశి్నంచారు. ఆరంభ స్థాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, అందుకు ఏంజెల్ ఇన్వెస్టింగ్ మంచి మార్గమని సూచించారు. -
మ్యూచువల్ ఫండ్స్లోకి మరో కొత్త కంపెనీ.. సెబీ నుంచి లైసెన్స్
ద వెల్త్ కంపెనీ అస్సెట్ మేనేజ్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (పాంటోమ్యాథ్ గ్రూప్ సంస్థ) మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెబీ నుంచి తుది ఆమోదం పొందినట్టు ప్రకటించింది. దీంతో రూ.74 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ‘ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్’ పేరుతో అధికారికంగా ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్టు తెలిపింది.సెబీ నుంచి సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18న మంజూరైనట్టు పేర్కొంది. సాధారణంగా ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో కనిపించే డేటా ఆధారిత పరిశోధన, వినూత్నమైన బోటమ్ అప్ విధానాలను తమ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం జూమ్ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 748 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 604 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం జంప్చేసి రూ. 968 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 775 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ నిర్వహణలోని సగటు ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 6.71 లక్షల కోట్ల నుంచి రూ. 8.3 లక్షల కోట్లకు బలపడింది. -
మళ్లీ లకారం దాటిన బంగారం!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల ప్రక్షాళన!
న్యూఢిల్లీ: బంగారం, వెండి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) నిర్వహణలోని భౌతిక బంగారం, వెండి విలువ మదింపునకు సెబీ నడుం బిగించింది. మరింత పారదర్శకతకు తోడు, స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా స్థిరత్వం కోసం కీలక ప్రతిపాదనలు చేసింది. అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్లు ప్రకటించే స్పాట్ ధరలను ఈటీఎఫ్ల నిర్వహణలోని బంగారం, వెండి విలువ మదింపునకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తన ముసాయిదా నిబంధనల్లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్లు తమ నిర్వహణలోని భౌతిక బంగారం విలువ మదింపునకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్బీఎంఏ) ధరలను అనుసరిస్తున్నాయి. ట్రాయ్ ఔన్స్ బంగారం ధర యూఎస్ డాలర్ల రూపంలో ఉంటుండగా.. మారకం రేటు ఆధారంగా బంగారం, వెండి విలువను నిర్ణయిస్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్లకు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎల్బీఎంఏ స్థానంలో దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్లు ప్రకటించే బంగారం, వెండి ధరలను అనుసరించేలా సెబీ ప్రతిపాదించింది. స్పాట్ ధరల విషయంలోనూ పోలింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే బెంచ్మార్క్ ఉండేలా చూడనుంది. దీనిపై ఆగస్ట్ 6 వరకు సలహా, సూచనలను అందించాలని సెబీ కోరింది. -
బంగారం ధరలు మళ్లీ ఇలా.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు ఈరోజూ అంతే స్థాయిలో పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదులుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీ వంటి సంస్థలు ప్రకటించిన జూన్ త్రైమాసికం (Q1FY26) ఫలితాలకు ఇన్వెస్టర్లు స్పందించడంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. మరోవైపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను మదుపర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారత్పై అమెరికా 10-15 శాతం సుంకం విధించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.ఉదయం 9.34 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 161.82 (0.20%) పాయింట్లు క్షీణించి 82,097.4 వద్ద, నిఫ్టీ 50 36.85 (0.15%) పాయింట్లు క్షీణించి 25,099 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.02 శాతం నష్టపోయాయి.నేటి క్యూ1 ఫలితాలురిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ జింక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎల్టీ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, అతుల్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, ఇండియామార్ట్ ఇంటర్మేష్, మాస్టెక్, ఎంపీఎస్, ఆర్తి డ్రగ్స్, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్, శివ సిమెంట్, కేరళ ఆయుర్వేద, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్, అసోసియేటెడ్ స్టోన్ ఇండస్ట్రీస్ (కోటా) తదితర కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. -
వంట నూనెల కంపెనీలకు సవాళ్లు!
ముంబై: వంట నూనెల రిఫైనరీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా వాటి ఆదాయం 2–3 శాతం మేర తగ్గి, రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అమ్మకాలు మాత్రం 2024–25తో పోల్చి చూస్తే 2.8–3 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ మార్జిన్ 0.30–0.50 శాతం వరకు తగ్గి 3.3–3.5 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. మూలధన అవసరాలు, వ్యయాలు తక్కువగా ఉండడం కారణంగా వాటి పరపతి ప్రొఫైల్ స్థిరంగా ఉంటుందని తన నివేదికలో క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మన దేశ వంట నూనెల వినియోగంలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. నూనెల దిగుమతుల్లో 50 శాతం పామాయిల్ కాగా, సోయాబీన్, సన్ఫ్లవర్ ఇతర నూనెల వాటా మిగిలిన 50 శాతంగా ఉంటోంది. సోయాబీన్ మినహా మిగిలిన ప్రధాన వంట నూనెలు అయిన సన్ఫ్లవర్, పామాయిల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీల ఆదాయం కొంత క్షీణతను చూడనున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. బయోడీజిల్ తయారీ డిమాండ్ కారణంగా సోయాబీన్ నూనెల ధరలు పెరిగినట్టు తెలిపింది. బ్రాండెడ్ కంపెనీల మార్జిన్లపై అధిక ప్రభావం‘‘ఈ ఏడాది అమ్మకాలు స్థిరంగా 2.8–3% మేర వృద్ధి చెందొచ్చు. 25.5–26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండొచ్చు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి 2.7 శాతం కంటే ఎక్కువే. గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర విభాగాల నుంచి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ జయశ్రీ నందకుమార్ పేర్కొన్నారు. అమ్మకాలు పెరగడం వల్ల ఆదాయ క్షీణత 2–3 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. కంపెనీలు సాధారణంగా 40–50 రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు నిర్వహిస్తుంటాయి కనుక, ధరలు తగ్గడం వాటి మార్జిన్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. నాన్ బ్రాండెడ్ కంపెనీలతో పోలి్చతే బ్రాండెడ్ కంపెనీలు ఎక్కువ ఇన్వెంటరీలు (నిల్వలు) కలిగి ఉంటాయని, కనుక వాటి మార్జిన్లపై ఎక్కవ ప్రభావం పడుతుందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఫలితంగా రవాణా వ్యయాలు అధికమైతే.. అది నూనెల ధరలు ఎగిసేందుకు దారితీయొచ్చని అంచనా వేసింది.చౌక దిగుమతుల నుంచి రక్షణ ముడి నూనెలు, రిఫైనరీ నూనెల (శుద్ధి చేసిన) దిగుమతులపై భిన్నమైన సుంకాలతో పరిశ్రమకు ప్రభుత్వం మద్దతుగా నిలిచినట్టు క్రిసిల్ నివేదిక గుర్తు చేసింది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించగా, అదే సమయంలో రిఫైనరీ నూనెలపై 35.75 శాతం కస్టమ్స్ డ్యూటీని కొనసాగించడాన్ని ప్రస్తావించింది. ఈ చర్య చౌక దిగుమతుల నుంచి దేశీ నూనె రిఫైనరీ సంస్థలకు రక్షణ నివ్వడమే కాకుండా, నూనెల ధరలు 5 శాతం వరకు తగ్గడానికి దారితీసినట్టు తెలిపింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయంగా జూన్ త్రైమాసిక రాబడులు మందకొడిగా ప్రారంభం కావడం, ప్రపంచవ్యాప్తంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 375.24 పాయింట్లు లేదా 0.45 శాతం క్షీణించి 82,259.24 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 100.6 పాయింట్లు లేదా 0.4 శాతం క్షీణించి 25,111.45 వద్ద స్థిరపడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ 1.39 శాతం నష్టంతో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో ఎల్టీఐ, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఎంఫాసిస్, కోఫోర్జ్, హెచ్సీఎల్ టెక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ అన్నీ రెడ్లోనే ముగిశాయి. నిఫ్టీ రియల్టీ 1.24 శాతం లాభపడగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు నష్టాలలో ముగిశాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్అండ్టీ, టీసీఎస్ షేర్లు 2.8 శాతం వరకు నష్టపోయాయి. అదేసమయంలో టాటా స్టీల్, ట్రెంట్, టైటాన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ స్వల్పంగా పెరిగి 0.02 శాతం పెరిగి 11.24 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్న తగ్గిన పసిడి ధరలు బుధవారంతో పోలిస్తే గురువారం మళ్లీ స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:54 సమయానికి నిఫ్టీ(Nifty) 17 పాయింట్లు నష్టపోయి 25,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 52 ప్లాయింట్లు దిగజారి 82,578 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు ఐవీఎఫ్ హాస్పటల్
ఫెర్టిలిటీ సర్వీసుల దిగ్గజం ఐవీఎఫ్ హాస్పిటల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇటీవల కొంతకాలంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్టీ) రంగంపట్ల దేశీయంగా ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇందిరా ఐవీఎఫ్ ప్రాస్పెక్టస్కు ప్రాధాన్యత ఏర్పడింది.ఈ రంగంలో సుప్రసిద్ధమైన మరో సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ ఉమన్ హెల్త్ సైతం లిస్టింగ్ యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఇందిరా ఐవీఎఫ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఐపీవోకు ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే మార్చిలో డాక్యుమెంట్స్ను వెనక్కి తీసుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ ముర్డియాపై బాలీవుడ్ బయోపిక్ రిలీజ్ నేపథ్యంలో వెనకడుగు వేసింది. తద్వారా పరోక్షంగా కంపెనీ సొంత ప్రమోషన్కు అవకాశమున్నట్లు సెబీ అభిప్రాయపడటంతో ఇందిరా ఐవీఎఫ్ ఐపీవోను విరమించుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..అయితే కంపెనీ ప్రతినిధి ఒకరు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాస్పెక్టస్ను ఉపసంహరించినట్లు తెలియజేశారు. సెబీ ఆదేశాలతో అన్నది సరికాదని స్పష్టం చేశారు. ఇటీవల ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్సహా.. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్ కంపెనీ షాడోఫాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్రాకెట్, ఫిజిక్స్వాలా, బోట్ బ్రాండ్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ సైతం గోప్యతా విధానంలోనే సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేయడం గమనార్హం! -
దిగొస్తున్న బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు మంగళవారంతో పోలిస్తే బుధవారం మళ్లీ తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:54 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు నష్టపోయి 25,161కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 ప్లాయింట్లు దిగజారి 82,482 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు మన మార్కెట్కు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీల 4 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 317 పాయింట్లు పెరిగి 82,571 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 25,196 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 490 పాయింట్లు బలపడి 82,744 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు ఎగసి 25,245 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఆసియాలో కొరియా, జపాన్, హాంగ్కాంగ్ సూచీలు 1% లాభపడ్డాయి. యూరప్ సూచీలు అరశాతం నష్టపోయాయి. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.⇒ వినిమయ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ ఇండెక్సుల్లో ఆటో 1.50%, ఫార్మా 1.14%, వినిమయ, ఎఫ్ఎంసీజీ, 1%, రియల్టి, సర్విసెస్ అరశాతం చొప్పున పెరిగాయి.⇒ తొలి త్రైమాసిక నికర లాభం 10% క్షీణత నమోదుతో హెచ్సీఎల్ టెక్ షేరు 3% నష్టపోయి రూ.1,566 వద్ద నిలిచింది. -
ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం పసిడి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు పెరిగి 25,094కు చేరింది. సెన్సెక్స్(Sensex) 37 ప్లాయింట్లు ఎగబాకి 82,297 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొండెక్కిన వెండి!
న్యూఢిల్లీ: వెండి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సోమవారం ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.5,000 పెరగడంతో రూ.1,15,000 స్థాయిని నమోదు చేసింది. డాలర్ బలహీనతకు తోడు పెట్టుబడుల మద్దతు ర్యాలీకి దారితీసింది. గత శనివారం సైతం వెండి కిలోకి రూ.4,500 పెరగడం గమనార్హం. 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.200 లాభపడి రూ.99,570కు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత పసిడి సైతం ఇంతే మేర పెరగడంతో రూ.99,000 స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు 1.71 డాలర్లు పెరిగి 39 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,353 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. ‘‘వెండి ధరలు దేశీ మార్కెట్లో సరికొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో 14 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బంగారానికి ప్రత్యామ్నాయ సాధనంగా వెండి పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడమే ఇందుకు దారితీసింది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఎంసీఎక్స్లో సిల్వర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ రూ.2,135 పెరిగి రూ.1,15,136 స్థాయికి చేరుకుంది. -
ఒక్క బిట్ కాయిన్.. రూ.కోటి నాలుగు లక్షలు
పర్సనల్ ఫైనాన్సింగ్ కేటగిరీలో బిట్కాయిన్ సరికొత్త పెట్టుబడి ఎంపికగా మారిపోయింది. దీంతో క్రిప్టో కాయిన్ రేటు తన సుదీర్ఘ ప్రయాణంలో 1లక్ష 20వేల డాలర్ల జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. అయితే ఇన్వెస్టర్లలో వచ్చిన అవగాహన, క్రిప్టోల వైపు వారి అడుగులు పెద్ద మార్పుగా పరిగణిస్తున్నట్లు ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ జియోటస్ సంస్థ పేర్కొంది.ఒకప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం క్రిప్టోల్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం దానిని ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక అసెట్ క్లాస్ కింద పరిగణిస్తున్నట్లు వాలెట్ చేరికల్లో పెరుగుదల సూచిస్తోందని క్రిప్టో ఎక్స్ఛేంజీ వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన మార్పులు బిట్కాయిన్ వేగంగా సంపద సృష్టికి పునాది స్తంభంగా మారుతుందనే లోతైన మార్కెట్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఇటీవల బిట్కాయిన్ తన టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్ లక్ష 10వేల డాలర్ల మార్కును అధిగమించటం మరింత ర్యాలీకి కారణంగా మారింది.దీనికి తోడు ఎథెరియం, సోలానా, కార్డానో, సుయి వంటి ఇతర కాయిన్స్ కూడా క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. డేటా ప్రకారం ఈ ఏడాది బలమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని ఊహించబడింది. ఈ క్రమంలో చిన్నచిన్న ఒడిదొడుకులు ఉన్నప్పటికీ క్రిప్టోల ప్రాభల్యం పెట్టుబడుల ప్రపంచంలో సుస్థిరంగా ముందుకు సాగుతుందని జియోటస్ భావిస్తోంది.ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లలో ఉండే అనుమానం బిట్కాయిన్ ర్యాలీ ఇంకెంత వరకు చేరుకుంటుంది అన్నదే. దీనికి జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అంచనాలను చూస్తే ఇకపై బిట్కాయిన్ ధర లక్షా 35వేల డాలర్ల రేటు వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో క్రిప్టో ఈటీఎఫ్ పెట్టుబడులు పెరిగితే ఒక్కో బిట్కాయిన్ రేటు ఏకంగా లక్షా 50వేల డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని విక్రమ్ చెబుతున్నారు. మార్కెట్లలో ఓలటాలిటీ, ఫ్రాఫిట్ బుక్కింగ్, ఇతర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా మంది తమ పోర్ట్ ఫోలియోలో క్రిప్టోలకు కొంత సముచిన మెుత్తాన్ని కేటాయించి ముందుకు సాగటానికి ఇది సరైన సమయంగా జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడుతున్నారు. -
వామ్మో రూ.లక్ష! మళ్లీ రికార్డ్ రేటుకు బంగారం
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఈరోజైనా పుత్తడి ధరలు కిందకి చూస్తాయా అని ఆశించినా కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది. తులం (10 గ్రాములు) మేలిమి బంగారం ధర ఏకంగా రూ.లక్ష మార్కును దాటింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.👉 ఇదీ చదవండి: బంగారం ధరలు తగ్గనున్నాయా?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. యూరోపియన్ యూనియన్, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 30 శాతం సుంకం విధించడంతో బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు జూన్ త్రైమాసికం రాబడుల సీజన్లో నెలకొన్న ఆందోళన కూడా సెంటిమెంటును అదుపులో ఉంచింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 231 పాయింట్లు (0.28 శాతం) క్షీణించి 82,269 వద్ద, నిఫ్టీ ఇండెక్స్ 68 పాయింట్లు (0.27 శాతం) క్షీణించి 25,100 పాయింట్ల మార్కును అధిగమించి 25,082 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. అదేసమయంలో సన్ఫార్మా, ట్రెంట్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం షేర్లు 0.7 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం, నిఫ్టీ మీడియా ఇండెక్స్ 0.75 శాతం, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. -
క్యూ1 ఫలితాలే దిక్సూచి
(క్యూ1) ఫలితాలతోపాటు.. ఇటు ఆర్థిక గణాంకాల ఆధారంగా కదిలే వీలుంది. ఈ వారం పలు టెక్ దిగ్గజాల క్యూ1 పనితీరు వెల్లడికానుండగా.. టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... గత వారం చివర్లో డీలా పడిన దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్ బాటలో సాగే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు ఆల్మండ్ గ్లోబల్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ నిపుణులు సిమ్రన్జీత్ సింగ్ భాటియా తెలియజేశారు. గత వారం ఐటీ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 పనితీరుతో సీజన్కు తెరతీసింది. ఫలితాలు, అంచనాలు నిరాశపరచడంతో వారాంతాన టీసీఎస్సహా ఇతర ఐటీ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ వారం హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రోతోపాటు.. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్, మెటల్ రంగ బ్లూచిప్ జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితరాలు క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో మార్కెట్ ఆటుపోట్ల మధ్య ఫలితాల ఆధారంగా కొన్ని కౌంటర్లు వెలుగులో నిలవవచ్చని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ధరల గణాంకాలు.. గత(జూన్) నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(14న) విడుదలకానున్నాయి. మే నెలకు డబ్ల్యూపీఐ 0.39 శాతం పెరిగింది. ఏప్రిల్లో నమోదైన 0.85 శాతంతో పోలిస్తే తగ్గింది. ఈ బాటలో జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం 15న ప్రకటించనుంది. మే నెలలో సీపీఐ 2019 ఫిబ్రవరి తదుపరి కనిష్టంగా 2.82 శాతానికి చేరింది. ఏప్రిల్లో నమోదైన 3.16 శాతంతో పోలిస్తే వెనకడుగు వేసింది. ధరల గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ చేపట్టే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. దీంతో వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దేశీయంగా క్యూ1 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనుండగా.. ధరల గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ట్రేడ్ డీల్పై దృష్టి యూఎస్, భారత్ మధ్య ఇటీవల ప్రారంభమైన వాణిజ్య టారిఫ్ల చర్చలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా తదితర పలు దేశాల దిగుమతులపై వివిధ స్థాయిల్లో టారిఫ్లను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్, భారత్ వాణిజ్య ఒప్పందంతోపాటు.. ఇతర దేశాలతో ట్రంప్ టారిఫ్ చర్చలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ల కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పెట్టుబడులు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వారం యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా జీడీపీ వివరాలు వెల్లడికానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య టారిఫ్ల అనిశి్చతులకుతోడు.. రాజకీయ, భౌగోళిక వివాదాలు కొనసాగుతుండటం సెంటిమెంటును దెబ్బతీయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అభిప్రాయపడ్డారు.సాంకేతికంగా చూస్తే..గత వారం ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కీలకమైన ఇంటర్మీడియెట్ మద్దతులను కోల్పాయాయి. నిజానికి మొదటి మూడు రోజులు స్థిరంగా కదిలినప్పటికీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలు, టారిఫ్లపై అనిశి్చతి, ఎఫ్పీఐల అమ్మకాలు దెబ్బతీసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంచనా వేసినట్లు నిఫ్టీ బ్రేకవుట్ సాధించి 25,500కు చేరినప్పటికీ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. వారాంతాన 25,150కు క్షీణించింది. దీంతో స్వల్ప కాలంలో 24,800–24,700కు నీరసించే వీలుంది. వెరసి 25,400–25,500 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఇదేవిధంగా సెన్సెక్స్ 82,500కు జారింది. దీంతో 81,500–81,000 స్థాయిలో సపోర్ట్ తీసుకునే అవకాశముంది. 82,800–83,050 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చునని నిపుణలు విశ్లేíÙంచారు.గత వారమిలా.. గత వారం(7–11) దేశీ స్టాక్ మార్కెట్లు తొలి అర్ధభాగంలో బలపడినప్పటికీ చివర్లో డీలా పడ్డాయి. వాణిజ్య టారిఫ్ వివాదాలు, నిరుత్సాహకర టీసీఎస్ ఫలితాలు ప్రభావం చూపాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 932 పాయింట్లు(1.1 శాతం) క్షీణించింది. 82,500 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 311 పాయింట్లు(1.2 శాతం) నీరసించింది. 25,150 వద్ద స్థిరపడింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారం ధరలు తగ్గనున్నాయా?
రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బేజారవుతున్నారు. తులం (10 గ్రాములు) పసిడి ఇప్పటికే లక్ష రూపాయాలకు అటు ఇటుగా ధర పలుకుతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చల్లని కబురు చెప్పింది. రానున్న నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య ప్రమాదాలు తగ్గితే బంగారం ధర మధ్యంతర బలహీనతను అనుభవించవచ్చు లేదా యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పెరిగితే అధిక అవకాశాల వ్యయాలను అనుభవించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు, రిటైల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మందగించడం కూడా మధ్యకాలిక బంగారం ధర సర్దుబాటుకు దారితీస్తుందని డబ్ల్యూజీసీ తెలిపింది.రూ.లక్షకు అంచున బంగారందేశంలో ప్రస్తుతం బంగారం 10 గ్రాముల ధర (24 క్యారెట్లు) రూ.99,860 వద్ద కొనసాగుతోంది. ఇటీవలి గోల్డ్ బుల్ రన్ విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న పడిపోయిన తరువాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది. ఔన్సుకు 1,429 డాలర్ల నుండి 3,287 డాలర్లకు ఎగిసింది. అంటే ఏడాదికి 30% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఓ వైపు కేంద్ర బ్యాంకు కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి వాణిజ్య అనిశ్చితులు దీనికి కారణమవుతున్నాయి.బంగారం ధర ఎప్పకప్పుడు కొత్త గరిష్టాలను తాకుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో బంగారం ధరల్లో మునుపటి ఒడిదుడుకులను అధ్యయనం చేసిన మీదట మధ్య లేదా ధీర్ఘకాలిక క్షీణతకు దారితీసిన సందర్భాలు కనిపించాయి. అయితే "మేము వీటిని పరిగణనలోకి తీసుకోనప్పటికీ, దీర్ఘకాలిక ఉపసంహరణలు మరింత స్థిరమైన, నిర్మాణాత్మక డిమాండ్ మార్పుల నుండి రావచ్చు. ఇది సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారుల నుండి బంగారం పెట్టుబడి డిమాండ్లో గణనీయమైన క్షీణతకు, సరఫరాలో వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది" అని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది. -
స్టాక్మార్కెట్లో కొత్త ఇండెక్స్ ప్రారంభం
బీఎస్ఈ అనుబంధ సంస్థ అయిన ఏషియా ఇండెక్స్ తాజాగా బీఎస్ఈ ఇన్సూరెన్స్ పేరిట కొత్త సూచీని ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని బీమా రంగం కింద వర్గీకరించిన సంస్థలు ఈ సూచీలో ఉంటాయి. దీని బేస్ వేల్యూ 1000గా, తొలి వేల్యూ డేట్ 2018 జూన్ 18గా ఉంటుంది. వార్షికంగా రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ సూచీలో మార్పులు, చేర్పులు చేస్తారు. ప్యాసివ్ వ్యూహాలను పాటించే ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్లకు ఇది ప్రామాణికంగా ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ పోర్టల్ పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించేందుకు సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్) తాజాగా ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్లాట్ఫాంను ప్రా రంభించింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ తదితర 12 భాషల్లో కంటెంట్ ఉంటుంది.తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు పెట్టుబడులు పెట్టాలనే అలోచనతో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భావి ఇన్వెస్టర్లకు కూడా ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీడీఎస్ఎల్ఐపీఎఫ్డాట్కామ్లోని ఈ కంటెంట్ను ఉచితంగా పొందవచ్చని సంస్థ సెక్రటేరియట్ సుధీష్ పిళ్లై తెలిపారు. -
ఇన్వెస్టర్లూ.. జాగ్రత్త! స్టాక్ ఎక్స్ఛేంజీల హెచ్చరికలు
ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడర్లపట్ల అప్రమత్తత అవసరమని స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఇటీవల ఇలాంటి ప్లాట్ఫామ్స్ వెలుగులో నిలుస్తున్న నేపథ్యంలో ఎక్స్ఛేంజీల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటి ద్వారా వివిధ రకాల నిర్ధారిత ఆదాయ బాండ్ల (ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్) కొనుగోలు సులభతరమవుతున్న కారణంగా జాగ్రత్త వహించమని తెలియజేశాయి.వీటి ద్వారా పెట్టుబడులు చేపట్టేముందు పలు కీలక అంశాలను పరిశీలించవలసి ఉన్నదంటూ రెండు ఎక్స్ఛేంజీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. బాండ్ల క్రెడిట్ రేటింగ్, తిరిగి చెల్లింపుల్లో బాండ్ల జారీదారుల ట్రాక్ రికార్డ్, బాండ్ల లిక్విడిటీ, సెటిల్మెంట్ గడువు, పన్ను ప్రభావం తదితర పలు అంశాలను పరిగణించమంటూ సూచించాయి.ప్రధానంగా బాండ్ పాల్ట్ఫామ్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరైనదీ లేనిదీ తప్పనిసరిగా పరిశీలించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. నిజానికి క్రెడిట్ రేటింగ్ ఆధారంగా బాండ్లలో పెట్టుబడులపై రిసు్కలు, రిటర్నులు నమోదవుతాయని వివరించాయి. -
పుత్తడి ప్రియుల నడ్డి విరిసేలా ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం పసిడి ధరలు పెరిగాయి. వెండి ఏకంగా కేజీపై రూ.4000 పెరిగి ఆల్టైమ్హై చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాలను అద్దెకిచ్చే అగ్కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 94 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.ఇదీ చదవండి: వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 168 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 84 కోట్లు పరికరాల కొనుగోళ్లకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2003లో ఏర్పాటైన హర్యానా కంపెనీ ప్రధానంగా మౌలిక రంగ కంపెనీలకు పరిశ్రమ సంబంధిత పరికరాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చుతుంది. గతేడాది(2024–25) ఆదాయం 20 శాతం ఎగసి రూ. 164 కోట్లను తాకగా.. నికర లాభం 36 శాతం జంప్చేసి రూ. 31 కోట్లకు చేరింది. -
ఐటీ షేర్లు టపటప.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
టీసీఎస్ త్రైమాసిక (క్యూ1) రాబడులు ఆశించిన దానికంటే బలహీనంగా ఉండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ఐటీ షేర్లలో అమ్మకాలతో నష్టాల్లో ముగిశాయి. దీనికి తోడు కెనడాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వాణిజ్య సుంకాలు విధించిన తర్వాత పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 689.81 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 82,500.47 స్థాయిలలో ముగియగా, నిఫ్టీ 50 కూడా 205.4 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 25,149.85 స్థాయిలలో స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.88 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.02 శాతం చొప్పున నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో దాదాపు 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 రాబడులు ఊహించిన దానికంటే తక్కువగా ఉండటంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎనర్జీ, బ్యాంక్, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 23 షేర్లు రెడ్లోనే ముగిశాయి. టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టైటాన్ షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.24 శాతం లాభపడి 11.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
అమాంతం ఎగిసిన బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు అమాంతం ఎగిశాయి. క్రితం రోజున ఫ్లాట్గా ఉన్న పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గోల్డ్ ఈటీఎఫ్లు.. జిగేల్! ఏకంగా రూ.2,081 కోట్లు
బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు జూన్లో బలమైన డిమాండ్ కనిపించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను మరింతంగా ఆకర్షిస్తోంది. జూన్ నెలలో ఏకంగా రూ.2,081 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఈ ఏడాది మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.292 కోట్లతో పోల్చి చూస్తే జూన్లో ఏడింతలైనట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.6 కోట్లు, మార్చిలో రూ.77 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ కాలాన్ని పరిశీలించి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.8,000 కోట్లుగా ఉన్నాయి.ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్లు రూ.3,751 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత తిరిగి జూన్లోనే గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం గమనించొచ్చు. జూన్లో రెండు గోల్డ్ ఈటీఎఫ్లు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి (ఎన్ఎఫ్వోలు) ఇన్వెస్టర్ల నుంచి రూ.41 కోట్లను సమీకరించాయి. జూన్ చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ మే చివరితో పోల్చి చూసినప్పుడు 4%పెరిగి (మే చివరి నుంచి) రూ.64,777 కోట్లకు చేరింది.స్థిరమైన ధరలు, అనిశ్చిత పరిస్థితులు..‘‘జూన్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి బలమైన పెట్టుబడులు రావడం సెంటిమెంట్లో మార్పునకు నిదర్శనం. ధరలు స్థిరంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఈక్విటీ, డెట్ సాధనాల్లో అస్థిరతలు ఇందుకు కారణమై ఉండొచ్చు’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. కొత్త పథకాల ద్వారా నిధుల సమీకరణ కూడా మెరుగ్గానే ఉన్నట్టు చెప్పారు.గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. గోల్డ్ ఈటీఎఫ్లకు సంబంధించి ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) జూన్లో 2.85 లక్షలు పెరిగాయి. మొత్తం ఫోలియోలు 76.54 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ధరలు బంగారం మార్కెట్ ధరలనే ప్రతిఫలిస్తుంటాయి. ఒక ఈటీఎఫ్ యూనిట్ గ్రాము బంగారంతో సమానం. కానీ, కొన్ని ఫండ్స్ సంస్థలు ఇంతకంటే తక్కువ పరిమాణంలోనూ పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
టీసీఎస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) షేరు ధర బలహీనమైన జూన్ త్రైమాసిక ఫలితాల మధ్య బిఎస్ఇలో ప్రారంభ ఒప్పందాలలో 2 శాతం పడిపోయింది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ సహా ఇతర ఐటీ షేర్లు కూడా 3 శాతం వరకు క్షీణించాయి.ఉదయం 9.46 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్లు లేదా 0.23% నష్టపోయి82,996.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు లేదా 0.22% నష్టంతో 25,299.55 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, టెక్ ఎం, ఎటర్నల్ (జొమాటో), బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్ నష్టాల్లో కొనసాగుతుండగా హెచ్యూఎల్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.03 శాతం, 0.14 శాతం క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.8 శాతం, నిఫ్టీ ఆటో 0.15 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 0.57 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు, జూన్ త్రైమాసికం (క్యూ1 ఎఫ్వై 26) రాబడులపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తుండటంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ1 త్రైమాసిక ఫలితాలు నేడు ప్రకటించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 345.8 పాయింట్లు లేదా 0.41 శాతం క్షీణించి 83,190.28 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 కూడా 120.85 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,355.25 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.32 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.3 శాతం నష్టపోయాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఐటీ 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూడడంతో ఐటీ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 22 షేర్లు ఎడ్లో ముగిశాయి. అదేసమయంలో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు 2.6 శాతం వరకు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.24 శాతం క్షీణించి 11.6 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 22 పాయింట్లు తగ్గి 25,452కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 ప్లాయింట్లు దిగజారి 83,473 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్లీ ఈక్విటీ ఫండ్స్ జోరు..
న్యూఢిల్లీ: గత ఐదు నెలలుగా దిగజారుతూ వస్తున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడుల ప్రతికూల ట్రెండ్కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. జూన్లో ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా రూ.23,587 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. మే నెలలో వచ్చిన రూ.19,013 కోట్లతో పోలిస్తే 24 శాతం జంప్ చేశాయి. స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడంతో అన్ని ఫండ్ విభాగాలకూ దన్నుగా నిలుస్తోంది. కాగా, ఈక్విటీ ఫండ్స్ విభాగంలోకి వరుసగా 52వ నెలలోనూ నికర పెట్టుబడులు నమోదయ్యాయి. మరోపక్క, ఇన్వెస్టర్ల సానుకూల ధోరణితో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు కూడా జోరుందుకున్నాయి. జూన్లో వివిధ పథకాల్లోకి రూ. 27,269 కోట్లు సిప్ రూపంలో వచ్చి చేరాయి. మే నెలలో ఈ మొత్తం రూ.26,688 కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలివీ... → గతేడాది నవంబర్లో రూ.35,943 కోట్ల నుంచి డిసెంబర్లో రూ.41,156 కోట్లకు ఎగబాకిన ఈక్విటీ ఎంఎఫ్ పెట్టుబడులు... ఆ తర్వాత నెల నుంచి అంతకంతకూ పడిపోతూనే వచ్చాయి. మే నెలలో ఏకంగా రూ.20,000 కోట్ల దిగువకు చేరాయి. జూన్లో దీనికి అడ్డుకట్టపడటం మార్కెట్లో సానుకూల ధోరణికి నిదర్శనం. → ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోకి జూన్లో రికార్డు స్థాయిలో రూ.5,733 కోట్లు వచ్చి పడ్డాయి, తర్వాత స్థానాల్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ (రూ.4,024 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ.3,754 కోట్లు), లార్జ్ క్యాప్ ఫండ్స్ (రూ.1,694 కోట్లు) నిలిచాయి. → ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లోకి జూన్లో రూ.566 కోట్ల నిధులు వచ్చాయి. → ఈక్విటీల మాదిరిగానే హైబ్రిడ్ ఫండ్స్లోకి కూడా దండిగానే పెట్టుబడులు ప్రవహించాయి. రూ.23,223 కోట్లు లభించాయి. మే నెలలో ఇది రూ.20,765 కోట్లుగా నమోదైంది. → మొత్తంమీద మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు జూన్లో రూ.49,000 కోట్ల నిధులు లభించాయి. మే నెలలో ఈ మొత్తం రూ.29,000 కోట్లుగా ఉంది. → బంగారం ధరల పటిష్ట ధోరణికి అద్దం పడుతూ గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదారణ భారీగా పెరిగింది. మే నెలలో కేవలం రూ.292 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్లలోకి రాగా... జూన్లో ఏకంగా రూ. 2,081 కోట్ల నికర పెట్టుబడులు వచ్చిపడ్డాయి. జనవరి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో నిధులు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. → మరోపక్క, డెట్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ వేగం కూడా తగ్గింది. జూన్లో రూ.1,711 కోట్లు బయటికెళ్లాయి. మే నెలలో ఈ మొత్తం రూ.15,908 కోట్లుగా ఉంది. దీనికి ముందు ఏప్రిల్లో డెట్ ఫండ్స్ ఏకంగా రూ.2.2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. → తాజా నిధుల జోరుతో జూన్ చివరి నాటికి ఎంఫ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 74.4 లక్షల కోట్లకు ఎగబాకింది. మే చివరికి ఏయూఎం రూ.72.2 లక్షల కోట్లుగా నమోదైంది.సిప్ దన్ను... ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) వృద్ధి పథంలో పయనించడానికి రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యమే కారణం. సిప్ పెట్టుబడులు స్థిరంగా నమోదవుతుండటం ఫండ్ పథకాలకు దన్నుగా నిలుస్తోంది. – వెంకట్ చలసాని, యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్పరిశ్రమకు సానుకూలం... ఈక్విటీ ఫండ్స్లోకి నిధుల ప్రవాహం క్రమంగా పుంజుకోవడం... ఇన్వెస్టర్లలో మళ్లీ విశ్వాసం నెలకొందనడానికి నిదర్శనం. ఎంఎఫ్ పరిశ్రమకు, దేశీ స్టాక్ మార్కెట్లకు ఇది అత్యంత సానుకూలాంశం. – అఖిల్ చతుర్వేది, మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఈడీ, సీబీఓస్టాక్ మార్కెట్ జోరుతో దేశీయంగా స్టాక్ మార్కెట్లు మళ్లీ పరుగులు పెడుతుండటంతో అన్ని విభాగాలూ కళకళలాడుతున్నాయి. నిఫ్టీ50తో పాటు మిడ్, స్మాల్ క్యాప్ సూచీలూ పటిష్టమైన ర్యాలీ చేశాయి. ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మళ్లీ ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. – హిమాన్షు శ్రీవాస్తవ, మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ -
ఐటీ అంతంత మాత్రమే!
వివిధ విభాగాలవ్యాప్తంగా డిమాండ్ నెమ్మదించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీ ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, మధ్య స్థాయి కంపెనీలు మాత్రం మెరుగ్గా రాణించవచ్చని విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు లెక్కలు వేస్తున్నాయి. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటమనేది సీక్వెన్షియల్గా 100–200 బేసిస్ పాయింట్ల మేర ఆదాయాల వృద్ధికి కలిసి రావచ్చనే అభిప్రాయం నెలకొంది. ఐటీ దిగ్గజాల ఆర్థిక ఫలితాల సీజన్ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. జూలై 10న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), 14న హెచ్సీఎల్ టెక్, 16న టెక్ మహీంద్రా.. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే జూలై 17న ఎల్టీఐమైండ్ట్రీ, 23న ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు వస్తాయి. ‘క్యూ2లో ఐటీ రంగం ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండొచ్చు. ప్రథమ శ్రేణి సంస్థల ఆదాయ వృద్ధి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చు. అదే సమయంలో మధ్య స్థాయి కంపెనీలు పటిష్టమైన వృద్ధి సాధించవచ్చు’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2026 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు గతంలో ప్రకటించిన గైడెన్స్నే కొనసాగించే అవకాశం ఉందని వివరించింది. అమెరికా టారిఫ్లు, స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు మొదలైన అంశాలు క్లయింట్ల వ్యయాలపై ప్రభావం చూపవచ్చని, కాకపోతే త్రైమాసికం ప్రారంభంలో భావించినంతగా డిమాండ్ పడిపోలేదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ‘చేసే ఖర్చుకు తగ్గట్లుగా పనితీరును మెరుగుపర్చుకోవడం, మౌలిక సదుపాయాలను ఆధునీకరించుకోవడం, ఏఐ తదితర అంశాలకు సంబంధించిన డీల్స్ గణనీయంగానే ఉన్నాయి’ అని వివరించింది. 90 రోజుల విరామం సానుకూలం.. టారిఫ్ల వడ్డనకు అమెరికా 90 రోజులు విరామం ప్రకటించడమనేది, ఐటీ కంపెనీలకు అతి పెద్ద మార్కెట్పై గల భయాలను కాస్త తగ్గించిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. గత రెండు నెలలుగా నిఫ్టీ ఐటీ 10 శాతం పైగా ర్యాలీ చేయడం ఇందుకు నిదర్శనమని వివరించింది. అయినప్పటికీ కొత్త డీల్స్కి పెద్దగా ఊతం లభించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోఫోర్జ్, పర్సిస్టెంట్ మినహా ఐటీ కంపెనీలు, ఈఆర్అండ్డీ (ఇంజనీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్) సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. డాలర్ల మారకంలో ఆదాయం కొంత మెరుగ్గా ఉంటుందని వివరించింది. ఆదాయాల వృద్ధిపరంగా మిడ్–క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. ‘కన్జూమర్, తయారీ, ఆటో, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో డిమాండ్ నెమ్మదించింది’ అని తెలిపింది.ఇతర బ్రోకరేజీల అంచనాలు.. మోతీలాల్ ఓస్వాల్: భౌగోళిక రాజకీయ పరిస్థితులు, టారిఫ్లపరంగా అనిశ్చితి వల్ల కొత్తగా భారీ డీల్స్ కుదుర్చుకోవడంపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ, ప్రస్తుత ఒప్పందాలు యథాప్రకారంగానే అమలవుతున్నాయి. క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడం, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పరిధిని కుదించడం గానీ చేయలేదు. క్యూ1 ఫలితాల్లో ఇది ప్రతిఫలించవచ్చు. లార్జ్–క్యాప్స్కి సంబంధించి త్రైమాసికాలవారీగా ఆదాయాలు, కాంట్రాక్టుల విలువ పెద్ద ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. త్రైమాసికాలవారీగా లార్జ్ క్యాప్స్ వృద్ధి ‘మైనస్ 2.5% నుంచి ప్లస్ 1.5%’ మధ్యలో ఉండొచ్చు. ‘మైనస్ 2.0% నుంచి ప్లస్ 7% మధ్య వృద్ధి’తో మిడ్–క్యాప్స్ మరోసారి ఆకర్షణీయమైన పనితీరు కనపర్చవచ్చు. బలహీన డాలరు వల్ల 100–200 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం లభించవచ్చు. ప్రభుదాస్ లీలాధర్: టారిఫ్లపరమైన అనిశ్చితి కాస్త తగ్గినప్పటికీ, వాటి ప్రభావం పడే విభాగాల్లో డిమాండ్ పుంజుకోలేదు. ప్ర స్తుత పరిస్థితులరీత్యా ఆదాయాల వృద్ధి బలహీనంగానే ఉండొచ్చు. -
లిస్టింగ్కి రెడీ.. ఆరు కంపెనీలకు సెబీ ఓకే
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్ సన్నాహాలకు ఓకే చెప్పింది. జాబితాలో రైట్ వాటర్ ల్యూషన్స్(ఇండియా), వీడా క్లినికల్ రీసెర్చ్, ఎల్సీసీ ప్రాజెక్ట్స్, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, సీడ్వర్క్స్ ఇంటర్నేషనల్ చేరాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు వీలుగా 2025 జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. మరోపక్క ఈ ఏడాది మార్చిలో వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఇష్యూపై నిర్ణయాన్ని పక్కనపెట్టిన సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఆరు కంపెనీల నిధుల సమీకరణకు లైన్ క్లియరైంది. వివరాలు చూద్దాం.. ఎంబసీ గ్రూప్ దన్ను ప్రీమియం, ఫ్లెక్సిబుల్ కార్యాలయాల నిర్వహణ సంస్థ వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూకి అనుమతి లభించింది. ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా 4.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. క్లీన్ టెక్ కంపెనీ వాటర్ యాక్సెస్ యాక్సెలరేషన్ ఫండ్ ఎస్ఎల్పీకి పెట్టుబడులున్న క్లీన్ టెక్ సంస్థ రైట్ వాటర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 445 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 745 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 225 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఆభరణాల తయారీ జ్యువెలరీ తయారీ కంపెనీ శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీవోకు సెబీ అనుమతించడంతో 2.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. ఈ బాటలో సీడ్వర్క్స్ ఇంటర్నేషనల్ సైతం లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు 5.19 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే యోచనలో ఉన్నాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు ఈపీసీ కంపెనీ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించడంతో లిస్టింగ్ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు సైతం 2.29 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.క్లినికల్ రీసెర్చ్ సంస్థ ప్రధానంగా క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు సమకూర్చే గుజరాత్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ ఐపీవోకు రెడీ అవుతోంది. ఇందుకు వీలుగా రూ. 185 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్, ఇతర వాటాదారులు ఆఫర్ చేస్తారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ కొనుగోలుతోపాటు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి.రేంజిబౌండ్ సెషన్ తర్వాత దిశా సంకేతాలు లేకపోవడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు నష్టాల వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 176.43 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 83,536.08 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46.4 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 25,476.10 వద్ద ముగిశాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.13 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.59 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 1.49 శాతం, 1.4 శాతం, 1.25 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, ఐటీ, మీడియా, పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికాకు చెందిన వైస్రాయ్ రీసెర్చ్ తన మాతృసంస్థ రుణభారం తగ్గించుకోవడంతో మైనింగ్ దిగ్గజం వేదాంత షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. అదేసమయంలో హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2 శాతం వరకు నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.09 శాతం క్షీణించి 11.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) నిన్నటి సెషన్లో పెరిగి తిరిగి ఈరోజు మళ్లీ ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర పడిపోయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)ఇదీ చదవండి: వయసు 34.. 10 ఏళ్లు ఉద్యోగం.. రూ.4 కోట్లు సంపద -
నేడే టారిఫ్ డెడ్లైన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు తగ్గి 25,481కు చేరింది. సెన్సెక్స్(Sensex) 177 ప్లాయింట్లు దిగజారి 83,522 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చివర్లో కొనుగోళ్లు
ముంబై: ట్రేడింగ్ చివర్లో బ్యాంకులు, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. ఫలితంగా సెన్సెక్స్ 270 పాయింట్లు పెరిగి 83,713 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు బలపడి 25,523 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. అమెరికా–భారత్ వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 491 పాయింట్ల పరిధిలో 83,321 వద్ద కనిష్టాన్ని, 83812 వద్ద గరిష్టాన్ని తాకింది.నిఫ్టీ 25,424 – 25,548 శ్రేణిలో కదలాడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఆరు ప్రధాన కరెన్సీ విలువలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు బలపడి 85.73 వద్ద స్థిరపడింది. యూరప్ మార్కెట్లు అరశాతం లాభాల్లో ముగిశాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ కంపెనీ తొలి త్రైమాసిక వ్యాపార అప్డేట్ ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో టైటాన్ కంపెనీ షేరు 6% నష్టపోయి రూ.3,441 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఆరున్నర శాతం క్షీణించి రూ.3,435 వద్ద కనిష్టాన్ని తాకింది. షేరు పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.20,086 కోట్లు కోల్పోయి రూ.3.05 లక్షల కోట్లకు దిగివచి్చంది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా నష్టపోయి షేరు ఇదే. -
రూ.100తో చోటాసిప్!
బజాజ్ ఫిన్సర్వ్ అస్సెట్ మేనేజ్మెంట్ చోటాసిప్ను తీసుకువచ్చే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఇందులో సాధ్యా సాధ్యాలను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఎండీ గణేష్ మోహన్ తెలిపారు. ఈ దిశగా టెక్నాలజీ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..చోటాసిప్ అన్నది ఆసక్తికరమైన చొరవగా గణేష్ మోహన్ పేర్కొన్నారు. తగినంత అధ్యయనం అనంతరం దీన్ని ప్రారంభించేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుందన్నారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా సెబీ ఈ ఏడాది ఆరంభంలో మైక్రోసిప్ను ఆవిష్కరించడం గమనార్హం. ఎస్బీఐ, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే రూ.100 సిప్ను అందిస్తున్నాయి. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పుంజుకుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రేపే టారిఫ్ డెడ్లైన్.. ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,479కు చేరింది. సెన్సెక్స్(Sensex) 76 ప్లాయింట్లు పుంజుకుని 83,522 వద్ద ట్రేడవుతోంది.ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జులై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెన్షన్ పథకాలకు పీవోపీలుగా మ్యూచువల్ ఫండ్స్
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లేదా వాటి సబ్సిడరీలు ఎన్పీఎస్ మాదిరి పెన్షన్ స్కీమ్లకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) సేవలు అందించేందే దిశగా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. అలాగే, ఏఎంసీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్కు సంబంధించి అంతర్జాతీయ డి్రస్టిబ్యూటర్లు లేదా అడ్వైజర్లుగానూ సేవలు అందించొచ్చన్న ప్రతిపాదన తీసుకొచి్చంది. ప్రస్తుతం ఏఎంసీలు, వాటి సబ్సిడరీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్కు సంబంధించి మాత్రమే నిర్వహణ, అడ్వైజరీ సేవలు అందించేందుకు అనుమతి ఉంది. ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్ ఫండ్ మేనేజర్లుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా.. పీవోపీ సేవలను ఆఫర్ చేస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నుంచి కొంత పరిహారం అందుకోవచ్చని సెబీ తన తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. అయితే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏఎంసీలు చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్ ఫండ్కు డైరెక్ట్ ప్లాన్ రూపంలోనే పీవోపీలుగా పనిచేసేందుకు అనుమతి ఉంది. దీనివల్ల పెన్షన్ ఫండ్ అడ్వైజరీ సేవలపై వాటికి ఎలాంటి కమీషన్ లభించడం లేదు. దీంతో సెబీ కొత్త ప్రతిపాదనలు తీసుకొచి్చంది. ఇక అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ సేవలతోపాటు ఇతర సేవలను సైతం ఏఎంసీలు ఆఫర్ చేసేందుకు సెబీ ప్రతిపాదించింది. వీటిపై ఈ నెల 28 వరకు ప్రజాభిప్రాయాలను సెబీ ఆహ్వానించింది. -
ఎఫ్అండ్వోలో రిటైలర్లకు నష్టాలే..
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) ఈక్విటీ డెరివేటివ్స్లో అత్యధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది నమోదైన రీతిలోనే డెరివేటివ్స్లో చిన్న ఇన్వెస్టర్లు భారీగా దెబ్బతిన్నట్లు తెలియజేసింది. ఈ విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్ల నికర నష్టాలు వార్షికంగా 41 శాతం పెరిగి రూ. 1,05,603 కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఎఫ్అండ్వో విభాగంలో రిటైలర్లకు 2023–24లో రూ. 74,812 కోట్ల నష్టాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య సైతం 20 శాతం తగ్గినట్లు నివేదిక తెలియజేసింది. అంతకుపూర్వం రెండేళ్లలో ఈ విభాగంలో లావాదేవీలు చేపట్టే ప్రత్యేక రిటైలర్ల సంఖ్య 24 శాతం పుంజుకోవడం గమనార్హం! ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ మార్గదర్శకాలను పటిష్టపరుస్తూ 2024 అక్టోబర్ 1 నుంచి కొత్త చర్యలు ప్రకటించాక ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో లావాదేవీలపై సెబీ విశ్లేషణ చేపట్టింది. ఇందుకు 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకూ మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల వ్యక్తిగత లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంది. మొత్తం రిటైల్ ట్రేడర్ల లాభనష్టాలను విశ్లేíÙంచాక దాదాపు 91 శాతం మంది నష్టపోయినట్లు గుర్తించింది. 2024 బాటలోనే రిటైల్ ట్రేడర్లు భారీగా పెట్టుబడులను కోల్పోయినట్లు సెబీ నివేదిక వివరించింది. నష్టాల తీరిలా: గత ఆరు నెలల కాలంలో ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ ప్రీమియంలవారీగా చూస్తే వార్షికంగా 9 శాతం క్షీణించినట్లు సెబీ నివేదిక పేర్కొంది. నోషనల్గా మదింపు చేస్తే 29 శాతం తగ్గింది. అయితే రెండేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇండెక్స్ ఆప్షన్స్ పరిమాణం ప్రీమియంలవారీగా 14 శాతం పుంజుకుంది. నోషనల్గా 42 శాతం ఎగసింది. ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ప్రీమియంలవారీగా రిటైలర్ల టర్నోవర్ 11 శాతం క్షీణించింది. అయితే రెండేళ్ల క్రితం ఇదే కాలంలో 36 శాతం జంప్చేసింది. ఈ హెచ్చుతగ్గులు దేశీ మార్కెట్లో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ప్రధానంగా ఇండెక్స్ ఆప్షన్స్లో అధిక లావాదేవీలను పట్టిచూపుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణ, మార్కెట్ నిలకడ యోచనతో ఇండెక్స్ ఆప్షన్స్లో లావాదేవీలు, టర్నోవర్ను పర్యవేక్షిస్తున్నట్లు సెబీ వివరించింది. ఈ బాటలోనే 2025 మే 29న రిస్కుల పర్యవేక్షణా విధానాలు తదితరాలకు సెబీ తెరతీసింది. జేన్ స్ట్రీట్ లాంటి రిస్క్లు పెద్దగా లేవు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే 3ముంబై: మార్కెట్లో కలకలం రేపిన హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తరహా రిసు్కలేమీ పెద్దగా కనిపించడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. నిఘాపరమైన సవాళ్ల వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో సర్వైలెన్స్పై సెబీ మరింతగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. నియంత్రణాధికారాలకు లోబడే జేన్ స్ట్రీట్పై చర్యలు తీసుకున్నామని, అయితే నిఘా, నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాలకు పాల్పడేవారిని కట్టడి చేయడానికి వీలవుతుందని పాండే పేర్కొన్నారు. డెరివేటివ్స్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నియంత్రణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి డేటా ఆధారితమైనవిగానే ఉంటాయని చెప్పారు. క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో పొజిషన్లతో సూచీలను ప్రభావితం చేయడం ద్వారా రెండేళ్ల వ్యవధిలో అక్రమంగా ఆర్జించిన రూ. 4,800 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు బదలాయించాలని ఆదేశిస్తూ, జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలు చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ప్రకటించపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్గా స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 9.61 పాయింట్లు (0.01 శాతం) స్వల్పంగా లాభపడి 83,442.50 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25,461.3 స్థాయిలో ముగిసింది. విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం, ఎన్ఎస్ఈ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.44 శాతం నష్టపోయాయి.నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.68 శాతం లాభపడగా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఇమామీ, బ్రిటానియా, వరుణ్ బేవరేజెస్ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ కూడా గ్రీన్లో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, బ్యాంక్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్, హెచ్సీఎల్ టెక్, మారుతి, ఇన్ఫోసిస్, ఎస్బీఐ 2.4 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకు లాభపడ్డాయి. -
పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది. క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అధిక రాబడులకు మార్గం!
ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్క్యాప్ ఫండ్స్కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్ క్యాప్స్లో కాకుండా.. తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి. చిన్న కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువ. కానీ, బలమైన ఆర్థిక మూలాలతో, మంచి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే చిన్న కంపెనీలు దీర్ఘకాలంలో మధ్య స్థాయి, బడా కంపెనీలుగా అవతరించగలవు. అటువంటి గొప్ప కంపెనీలను ముందుగా గుర్తించే నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఉండవు. కనుక ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్పై ఆధారపడడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఈ విభాగంలో క్వాంట్ స్మాల్క్యాప్ ఫండ్ మంచి రాబడులను అందిస్తోంది.రాబడులుఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ అద్భుతమైన రాబడులను అందించినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏటా 33 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో ఏటా 46 శాతం, ఏడేళ్లలో 27.60 శాతం, పదేళ్లలో 21 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకంలో నమోదైంది. ఇదే కాలంలో స్మాల్క్యాప్ ఫండ్స్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే 10–12 శాతం వరకు వివిధ కాలాల్లో అధిక రాబడి వచ్చింది. ఈ పథకం 1996లో ప్రారంభమైంది. గతంలో క్వాంట్ ఇనకమ్ ఫండ్ పేరుతో కొనసాగింది. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే 14.43 శాతం ఎక్స్ఐఆర్ఆర్ రాబడి ఆధారంగా రూ.4.08 కోట్లు సమకూరేది. పెట్టుబడుల విధానం..‘క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తాను అనుసరించే డైనమిక్ అస్సెట్ అలోకేషన్ విధానం కారణంగా అధిక ఆల్ఫాతో బలంగా నిలబడగలిగింది. అలాగే స్టాక్స్ ఎంపిక కోసం అనుసరించే చురుకైన విధానాలు, అదే సమయంలో సానుకూల మార్కెట్ పనితీరుతో మంచి పనితీరు చూపించింది. అధిక వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలను ముందుగానే గుర్తించే సామర్థ్యం ఫండ్ మేనేజర్లలో ఉండడం అనుకూలించింది’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. అయినప్పటికీ చిన్న కంపెనీలు స్వల్ప కాలంలో దిద్దుబాట్లకు గురవుతుంటాయని.. లిక్విడిటీ సమస్య కూడా ఉంటుందన్నారు. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి స్మాల్క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు కొనసాగించిన వారికి మెరుగైన రాబడులు వస్తాయని సూచించారు. ప్రధానంగా అధిక వృద్ధి సామర్థ్యాలను, రంగాల వారీ సానుకూల సైకిల్స్ను ఫండ్ మేనేజర్లు ఆరంభ దశలో గుర్తించి ఆయా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడుల దిశగా ప్రయతి్నంచడం ఈ పథకంలో గుర్తించొచ్చు. అధిక రిస్క్ ఉన్న వారికే ఈ తరహా స్మాల్క్యాప్ ఫండ్స్ అనుకూలమన్నది మర్చిపోవద్దు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా పోర్ట్ఫోలియోప్రస్తుతం రూ.28,205 కోట్ల పెట్టుబడులు ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 92.78 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.44% పెట్టుబడులు ఉన్నాయి. 5.79% మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పేరుకు స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ స్మాల్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రస్తుతం 31% మేరే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 43% మేర ఇన్వెస్ట్ చేయగా, లార్జ్క్యాప్ కంపెనీల్లో 24% మేర ఎక్స్పోజర్ కలిగి ఉంది. అయితే ప్రస్తుతం స్మాల్క్యాప్ కంపెనీల విలువలు గరిష్ట స్థాయిలకు చేరినందున ఎక్స్పోజర్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా విభాగాల వ్యాల్యూషన్ల ఆధారంగా ఈ పెట్టుబడులను మారుస్తుండడం గమనించొచ్చు. అత్యధికంగా 17.56% పెట్టుబడులను ఇంధన రంగ, యుటిలిటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 16%, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 15%, హెల్త్ కేర్ కంపెనీల్లో 14% చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. -
యూఎస్తో వాణిజ్య ఒప్పందంపై ఫోకస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరమైన దీర్ఘకాలిక విధానాలు అవసరం
ప్యారిస్: భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి స్థిరమైన, దీర్ఘకాల విధానాలు.. రాష్ట్రాల వ్యాప్తంగా ఏకరూపత అవసమని ఫ్రాన్స్కు చెందిన కార్ల తయారీ సంస్థ స్టెల్లాంటిస్ ఇండియా సీఈవో శైలేష్ హజేలా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఆటోమొబైల్ కంపెనీలు దీర్ఘకాల దృష్టితో వ్యాపార ప్రణాళికలను అమలు చేయగలవన్నారు. జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల రూపంలో భారత మార్కెట్లో స్టెల్లాంటిస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్కు పెట్టుబడులతో వచ్చే వారు విధానాల పరంగా దీర్ఘకాల దృష్టిని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా సరే, దేశవ్యాప్తంగా ఒకే మాదిరిగా, దీర్ఘకాలం పాటు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఈవీలకు సంబంధించి, పన్ను పరమైన ఏకీకృత విధానాలు ఉండాలన్నారు. అప్పుడే కంపెనీలు రాష్ట్రాల వారీగా కాకుండా మొత్తం దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోగలవన్నారు. ఈవీలకు సంబంధించి రాష్ట్రాలు వేర్వేరు విధానాలు అమలును ప్రస్తావించారు. సిట్రెయెన్ బ్రాండ్ విస్తరణ గత కొన్ని సంవత్సరాలుగా స్టెల్లాంటిస్ గ్రూప్ భారత్లో కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని శైలేష్ హజేలా తెలిపారు. ఇప్పుడు సిట్రోయెన్ బ్రాండ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. సేల్స్, నెట్వర్క్ విస్తరణపై దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదిలో విక్రయ కేంద్రాలను రెట్టింపు చేసుకోనున్నట్టు (80 నుంచి 150కు) ప్రకటించారు. చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారిస్తామన్నారు. టైర్4 పట్టణాల వరకు విస్తరిస్తామన్నారు. మార్కెట్ వాటాను వచ్చే 12 నెలల్లో రెట్టింపు చేసుకునే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. సిట్రోయెన్ బ్రాండ్పై రూ.2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు స్టెల్లాంటిస్ ఈ ఏడాదిలో ప్రకటించడం గమనార్హం. -
భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై ఫోకస్!
న్యూఢిల్లీ: మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా వాణిజ్య సంబంధ రంగాలకు ఈ ఒప్పందం బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు. ‘ఈ వారం ఒక్క భారత్ మార్కెట్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు చాలా కీలకం కానుంది. ఉత్కంఠ రేపుతున్న జూలై 9 అమెరికా టారిఫ్ డెడ్లైన్ దగ్గరకొచి్చంది. ప్రపంచ వాణిజ్య స్థితిగతులను ఇది మార్చేయనుంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదే రోజున విడుదల చేసే పాలసీ మినిట్స్ కూడా మార్కట్లపై ప్రభావం చూపుతుంది’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు.ఫలితాల సీజన్.. టీసీఎస్ బోణీ కార్పొరేట్ ఫలితాల సీజన్ మళ్లీ మొదలవుతోంది. ఈ నెల 10న టీసీఎస్ క్యూ1 (2025–26, ఏప్రిల్–జూన్ క్వార్టర్) ఫలితాల బోణీ కొట్టనుంది. అదే రోజున టాటా ఎలెక్సీ కూడా ఫలితాలను ప్రకటించనుంది. ఈ వారంలోనే 11న అవెన్యూ సూపర్మార్ట్, ఆదిత్య బిర్లా మనీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మార్కెట్ ఫోకస్ క్యూ1 ఫలితాల వైపు మళ్లనుంది. ‘భారత్–యూఎస్ మధ్య వాణిజ్య చర్చల్లో సానుకూల ఫలితం వెలువడితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగాలకు ఇది జోష్ ఇస్తుంది. మార్కెట్లు ఇప్పుడు పై స్థాయిల్లోనే కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న క్యూ1 ఫలితాలు కూడా సూచీల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్రూడ్, రూపాయి ట్రెండ్... బ్రెంట్ క్రూడ్ ధరల ట్రెండ్, డాలర్తో రూపాయి మారకం విలువ కదలికలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. అదేవిధంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్ల బాట పట్టడానికి రెండు అంశాలు కీలకం కానున్నాయి. భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరితే మార్కెట్లకు సానుకూలాంశం. ఎఫ్ఐఐలు మళ్లీ పెట్టుబడులకు సై అంటారు. అలాగే క్యూ1 ఫలితాల్లో రికవరీ సంకేతాలు కనిపించడం కూడా సానుకూలంగా నిలుస్తుంది. ఈ రెండింటి విషయంలో నిరుత్సాహం ఎదురైతే మార్కెట్పైనా, ఎఫ్ఐఐల నిధుల ప్రవాహంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్కుమార్ పేర్కొన్నారు. మొత్తంమీద చూస్తే ఇండో–యూఎస్ వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కోసం వేచిచూసే ధోరణి, క్యూ1 ఫలితాలపై అంచనాల నేపథ్యంలో మార్కెట్లు కన్సాలిడేషన్లో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా వ్యాఖ్యానించారు.గత వారమిలా... దేశీ సూచీలు గత వారంలో రివర్స్ గేర్ వేశాయి. బీఎస్ఎస్ఈ సెన్సెక్స్ 626 పాయింట్లు (0.74%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 176 పాయింట్లు (0.68%) చొప్పున నష్ట పోయాయి.జూలైలో ఎఫ్పీఐలు ఆచితూచి... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఆర్బీఐ రేట్ల కోత వంటి సానుకూలతల నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) గత నెలలోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.14,590 కోట్లు ఈక్విటీల్లో వెచ్చించారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ పెట్టుబడుల బాటలోనే కొనసాగారు. అయితే, ఈ నెలలో మళ్లీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలి వారంలో రూ.1,421 కోట్ల అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా అమెరికా ట్రేడ్ వార్ డెడ్లైన్ దగ్గరపడటం, క్యూ1 ఫలితాల సీజన్పై అంచనా అంచనాల నేపథ్యంలో ఎఫ్పీఐలు ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ ఎనలిస్ట్ వకార్జావెద్ ఖాన్ తెలిపారు. స్వల్పకాలానికి విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని పేర్కొన్నారు. 2025లో ఇప్పటిదాకా రూ.79,322 కోట్లను ఎఫ్పీఐలు వెనక్కి తీసుకోవడం గమనార్హం. -
తగ్గినట్టే తగ్గి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. వరుసగా పెరుగుతూ హ్యాట్రిక్ కొట్టిన పసిడి ధరలు క్రితం రోజున దిగివచ్చి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. అయితే ఈరోజు బంగారం ధరలు (Today Gold Rate) మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘జేన్ స్ట్రీట్’ స్కామ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్ సంస్థ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయకుండా గ్రూప్ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్లో భాగమైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రూప్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్ గ్రూప్ సందేహాస్పద ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్ఎస్ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్ఎస్ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్ గ్రూప్ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్పీఐలు, మార్కెట్ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్ గ్రూప్ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్ గ్రూప్ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్ గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్ గ్రూప్ ట్రేడింగ్ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్ ఆప్షన్లలో ట్రేడింగ్ ద్వారా జేఎస్ గ్రూప్ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్ ఫ్యూచర్స్లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో రూ. 191 కోట్లు, క్యాష్ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్స్లో ట్రేడింగ్ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్ గ్రూప్పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్ గ్రూప్’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్ గ్రూప్ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్ను షార్ట్ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్ షార్ట్ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్పై ప్రభావం.. జేన్ స్ట్రీట్పై సెబీ చర్యలను మార్కెట్ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్ వాల్యూమ్స్పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్లో జేన్ స్ట్రీట్ లాంటి ట్రేడింగ్ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్–ఆస్క్ స్ప్రెడ్ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్ తెలిపారు. స్టాక్స్ కుదేలు.. జేఎస్ గ్రూప్పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్ఈలో నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 11.26%, స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ షేరు 6%, బీఎస్ఈ షేరు 6.42%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్ గ్రూప్పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.ఏమిటీ జేన్ స్ట్రీట్.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000లో ట్రేడింగ్ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్లో ఇది భారత్లో కార్యకలాపాలు ఆరంభించింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 193.42 పాయింట్లు లేదా 0.23 శాతం పెరిగి 83,432.89 వద్ద ముగియగా, నిఫ్టీ 55.7 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 25,461 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ప్రతికూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.03 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో, మెటల్ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. భారత్ పెట్రోలియం, ఐజీఎల్, ఇండియన్ ఆయిల్, మహానగర్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభపడటంతో నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.05 శాతం లాభపడింది.నిఫ్టీ రియల్టీ, ఫార్మా, ఐటీ, బ్యాంక్, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.57 శాతం క్షీణించి 12.32 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: జోరు చూపించిన సేవల రంగం(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:53 సమయానికి నిఫ్టీ(Nifty) 6 పాయింట్లు తగ్గి 25,401కు చేరింది. సెన్సెక్స్(Sensex) 18 ప్లాయింట్లు నష్టపోయి 83,224 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లిస్టింగ్ సూపర్హిట్.. ఇన్వెస్టర్లకు వరుస లాభాలు
హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగులు సూపర్హిట్టయ్యాయి. మార్కెట్ అనిశ్చితుల్లోనూ అదిరిపోయే అరంగేట్రం చేసి ఇన్వెస్టర్లకు తొలిరోజే లాభాలు పంచాయి. హెచ్డీబీ ఫైనాన్స్ షేరు ఇష్యూ ధర(రూ.740)తో పోలిస్తే బీఎస్ఈలో 13% ప్రీమియంతో రూ.835 వద్ద లిస్టయ్యింది.ఇంట్రాడేలో 15% ఎగసి రూ.850 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 14% లాభంతో రూ.841 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.69,758 కోట్లుగా నమోదైంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రెండో రోజూ గురువారం లాభాలను కొనసాగించింది. రూ.890 వరకూ పెరిగి రూ.865 వద్ద ముగిసింది.సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగూ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.82)తో పోలిస్తే బీఎస్ఈలో 34% ప్రీమియంతో రూ.110 వద్ద లిస్టయ్యిది. ట్రేడింగ్లో 35% పెరిగి రూ.111 వద్ద గరిష్టాన్ని తాకింది. గరిష్టాల వద్ద స్వల్ప లాభాలు చోటు చేసుకున్నప్పటికీ.., చివరికి 19% లాభంతో రూ.98 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,875 కోట్లుగా నమోదైంది. -
బ్యాంక్ షేర్లు పతనం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, ఎఫ్ఐఐ అమ్మకాల ఒత్తిడిపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సానుకూలంగా ప్రారంభమై స్వల్ప లాభాలతో ట్రేడయిన భారత బెంచ్మార్క్ సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో స్థిరపడ్డాయి.ఇంట్రాడేలో 83,850 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 170.22 పాయింట్లు (0.2 శాతం) క్షీణించి 83,239.7 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 48.1 పాయింట్లు (0.19 శాతం) క్షీణించి 25,405.3 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ సానుకూల దిశలో ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.26 శాతం నష్టపోయింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 0.89 శాతం క్షీణించి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మెటల్, రియల్టీ, బ్యాంక్, ఫియాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ మీడియా, ఆటో, ఫార్మా, హెల్త్కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.48 శాతం క్షీణించి 12.38 పాయింట్ల వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదేసమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖం పట్టినట్లేపట్టి మళ్లీ పెరుగుతోంది. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’ (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 25,442కు చేరింది. సెన్సెక్స్(Sensex) 48 ప్లాయింట్లు నష్టపోయి 83,383 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐపీవోకు స్టీమ్హౌస్ ఇండియా
ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీ స్టీమ్హౌస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500–700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. మెయిన్బోర్డులో లిస్టింగ్పై కన్నేసిన కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించింది. 2014లో ఏర్పాటైన సంజూ గ్రూప్ కంపెనీ సూరత్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు విస్తరించింది. 167 క్లయింట్లకు సర్వీసులు అందిస్తోంది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’పిరానా, దహేజ్ సెజ్సహా.. వపీ, అంకలేశ్వర్, నందెశారీ, పనోలీ ఫేజ్–2, 3లలో విస్తరణ చేపట్టింది. ఈ బాటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా, రాజస్తాన్లలోనూ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. 2023–24లో రూ. 292 కోట్ల ఆదాయం, రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల రహస్య పద్ధతిలో ఫైలింగ్కు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా క్యాపిటల్, ఫిజిక్స్వాలా, ఇమేజిన్ మార్కెటింగ్(బోట్)తోపాటు.. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్రాకెట్ ఇదే బాటలో సాగాయి. 2024 చివర్లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. -
ట్రావెల్ ఫుడ్ @ రూ. 1,045–1,100
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్)తోపాటు విమానాశ్రయాల్లో లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 1,045–1,100 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 7న ప్రారంభమై 9న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 4న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. తద్వారా ఐపీవో నిధులు మొత్తం ప్రమోటర్లకు అందనున్నాయి. ప్రమోటర్ సంస్థ కే హాస్పిటాలిటీ బ్రాండుతో ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్సహా విదేశాలలోనూ పలు ఆతిథ్య సేవలు, ఫుడ్ సర్వీసుల బిజినెస్లను నిర్వహిస్తోంది. ఈ ముంబై కంపెనీ తొలుత 2009లో తొలి ట్రావెల్ క్యూఎస్ఆర్ను ప్రవేశపెట్టింది. కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్తోపాటు ఎస్ఎస్పీ గ్రూప్ పీఎల్సీ కంపెనీని ప్రమోట్ చేశాయి. కంపెనీ ప్రధానంగా ఎంపిక చేసిన ఆహారం, పానీయాల(ఎఫ్అండ్బీ)ను ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా విమానాశ్రయాలు, కొన్ని జాతీయ రహదారి ప్రాంతాలలో సమకూర్చుతోంది. దేశీయంగా 14 విమానాశ్రయాలలో సర్వీసులు అందిస్తోంది. మలేసియాలో 3 ఎయిర్పోర్టులలో లాంజ్ సేవలు కలి్పస్తోంది. 2024 జూన్కల్లా దేశ, విదేశాలలో 117 పార్ట్నర్, సొంత బ్రాండ్లతో కలిపి 397 ట్రావెల్ క్యూఎస్ఆర్ ఔట్లెట్లను నిర్వహిస్తోంది. వీటిలో సుప్రసిద్ధ కేఎఫ్సీ, పిజ్జా హట్, కాఫీ బీన్, టీ లీఫ్, సబ్వే, బికనీర్వాలా, అడయార్ ఆనంద్ భవన్, వౌ మోమో తదితర బ్రాండ్స్ ఉన్నాయి. -
పుత్తడి ప్రియుల ఆశలపై నీళ్లు.. మళ్లీ పసిడి ధరలు పైకి..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖం పట్టినట్లేపట్టి మళ్లీ నిన్నటి నుంచి పెరుగుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు తగ్గి 25,538కు చేరింది. సెన్సెక్స్(Sensex) 14 ప్లాయింట్లు పెరిగి 83,713 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏషియన్ పెయింట్స్పై విచారణకు సీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: డెకొరేటివ్ పెయింట్ల తయారీ, విక్రయ మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ఏషియన్ పెయింట్స్పై వస్తున్న ఆరోపణలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. 90 రోజుల వ్యవధిలో నివేదికను సమరి్పంచాలని డైరెక్టర్ జనరల్కు సూచించింది.డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలో కొత్త సంస్థల రాకుండా అడ్డుకుంటూ, పరిశ్రమ వృద్ధి అవరోధాలు సృష్టించే విధానాలు పాటిస్తోందంటూ ఏషియన్ పెయింట్స్పై గ్రాసిం ఇండస్ట్రీస్ (బిర్లా పెయింట్స్ డివిజన్) చేసిన ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గ్రాసింలాంటి పోటీ సంస్థలతో లావాదేవీలు జరపకుండా డీలర్లకు ఆంక్షలు విధించడం, ముడి సరుకులు..సేవలు అందించకుండా నిరోధించడంలాంటి అంశాలు చూస్తే కొత్త సంస్థలను మార్కెట్లోకి రాకుండా ఆటంకాలు కల్పించడంతో పాటు మార్కెట్లో పోటీపై ఏషియన్ పెయింట్స్ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోందని సీసీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా గ్రూప్లో భాగమైన గ్రాసిం గతేడాది ఫిబ్రవరిలో ’బిర్లా ఓపస్ పెయింట్స్’ పేరిట డెకొరేటివ్ పెయింట్స్ విభాగంలోకి ప్రవేశించింది. -
పసిడికి కొనుగోళ్ల కళ
న్యూఢిల్లీ: పసిడి ధరల్లో ఏడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి బలమైన సానుకూలతల అండతో స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో పసిడి మంగళవారం ఒక్క రోజే రూ.1,200 లాభపడింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.98,670కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,100 పెరిగి రూ.98,150 స్థాయిని తాకింది. వెండి సైతం కిలోకి రూ.2,000 లాభపడి రూ.1,04,800కు చేరుకుంది.డాలర్ బలహీనత కొనసాగుతుందన్న అంచనాల నేపథ్యంలో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అమెరికా ఆర్థిక గణాంకాలపై అంచనాలతో ఈ వారం పసిడి పట్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 3,362 డాలర్ల స్థాయికి పుంజుకుంది. ‘‘డాలర్ బలహీనపడడం, అమెరికా ద్రవ్యలోటు విస్తరణపై ఆందోళనలతో.. ట్రంప్ ప్రతిపాదిత పన్ను తగ్గింపుల బిల్లుపై మార్కెట్లు దృష్టిపెట్టాయి. దీంతో బంగారం ఆకర్షణీయంగా మారింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 83,874.29 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు (0.11 శాతం) లాభపడి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 24.75 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప లాభంతో 25,541.8 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.10 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు నష్టపోయాయి.ఎన్ఎస్ఈలో 3,020 షేర్లలో 1,491 షేర్లు లాభాల్లో, 1,452 షేర్లు నష్టాల్లో ముగియగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. 96 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 119కి పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 43 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.01 శాతం క్షీణించి 12.5 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పడుతోన్న బంగారం ధర నేడు (Today Gold Rate) భారీగా ఎగిసింది. బంగారం ధరలు దిగొస్తున్నాయని ఆశించిన కొనుదారులకు నేడు ఊచించని విధంగా షాకిచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 క్యాలెండర్ ఇయర్ ద్వితీయార్ధం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 124 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 83,730 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్లాట్గా 25,515 వద్ద ప్రారంభమయ్యాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 0.24 శాతం, 0.31 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.65 శాతం లాభపడగా, నిఫ్టీ మెటల్ 0.18 శాతం నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది.నేటి ఐపీవోలుఎల్లెన్ బారి ఇండస్ట్రియల్ గ్యాస్స్ ఐపీఓ (మెయిన్ లైన్ ), కల్పతరు ఐపీవో (మెయిన్ లైన్ ), గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీవో (మెయిన్ లైన్ ), శ్రీ హరే కృష్ణ స్పాంజ్ ఐరన్ ఐపీవో (ఎస్ ఎంఈ), ఏజేసీ జ్యువెల్ ఐపీవో (ఎస్ ఎంఈ) ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో విడుదల కానున్నాయి.వందన్ ఫుడ్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), మార్క్ లోయిర్ ఐపీఓ (ఎస్ఎంఈ), సెడార్ టెక్స్టైల్ ఐపీఓ (ఎస్ఎంఈ), పుష్పా జ్యువెలర్స్ ఐపీఓ (ఎస్ఎంఈ), సిల్కీ ఓవర్సీస్ ఐపీఓ (ఎస్ఎంఈ) సబ్స్క్రిప్షన్ కోసం తెరవనుండగా, నీతూ యోషి ఐపీఓ (ఎస్ఎంఈ), యాడ్కౌంటీ మీడియా ఐపీఓ (ఎస్ఎంఈ) మూడో రోజుకు ప్రవేశించనున్నాయి.ఇండోగుల్ఫ్ క్రాప్ సైన్సెస్ ఐపీఓ (మెయిన్ లైన్), మూవింగ్ మీడియా ఐపీఓ (ఎస్ ఎంఈ), వాలెన్సియా ఇండియా ఐపీఓ (ఎస్ ఎంఈ), ఏస్ ఆల్ఫా ఐపీవో (ఎస్ ఎంఈ), ప్రో ఎఫ్ ఎక్స్ టెక్ ఐపీవో (ఎస్ ఎంఈ)లకు వీటి కేటాయింపులు ఉంటాయి. -
పరిశ్రమలు.. నేల చూపు!
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి మే నెలలో 1.2 శాతానికి పరిమితమైంది. 2024 ఆగస్ట్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ముందస్తు వర్షాల రాకతో తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు నిదానించడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. 2024 మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6.3 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి ఐఐపీ వృద్ధి రేటు 2.7 శాతంగా కాగా, దీన్ని 2.6 శాతానికి ఎన్ఎస్వో సవరించింది. → తయారీ రంగంలో వృద్ధి మే నెల 2.6%కి పరిమితమైంది. గతేడాది ఇదే నెలలో వృద్ధి 5.1%. → మైనింగ్ రంగంలో ఉత్పత్తి మైనస్ 0.1 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగంలో వృద్ధి 6.6 శాతంగా ఉంది. → విద్యుత్ రంగంలో ఉత్పత్తి మైనస్ 5.8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 13.7 శాతం వృద్ధి నమోదైంది. → క్యాపిటల్ గూడ్స్ రంగంలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. 14.1 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది మే నెలలో వృద్ధి కేవలం 2.6 శాతంగానే ఉంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో పనితీరు మైనస్ 0.7 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే నెలలో 12.6 శాతం వృద్ధిని చూసింది. → కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలోనూ ఉత్పత్తి మైనస్ 2.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 7.6 శాతం వృద్ధి కనిపించింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) పారిశ్రామికోత్పత్తి వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.7 శాతంగా ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నాలుగు రోజుల లాభాల పరంపరకు బ్రేక్ వేసిన భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. 84,099.53 - 83,482.13 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 452.44 పాయింట్లు లేదా 0.54 శాతం క్షీణించి 83,606.46 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 120.75 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 25,517.05 వద్ద స్థిరపడింది.అయితే, విస్తృత మార్కెట్ ప్రధాన సూచీలను అధిగమించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.68 శాతం, 0.52 శాతం లాభపడ్డాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. మహారాష్ట్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి.నిఫ్టీ ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, హెల్త్కేర్, మీడియా, ఎనర్జీ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. ట్రెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. -
దిగొస్తున్న బంగారం ధరలు.. పుత్తడి ప్రియుల్లో ఆశలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. గరిష్ఠాల నుంచి గత వారం రోజులుగా బంగారం ధరలో క్షీణత కనిపిస్తోంది. సోమవారం కూడా పుత్తడి ధరలు తగ్గాయి. దాంతో ఈ ధరలు ఇంకెంత పడుతాయోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 25,646కు చేరింది. సెన్సెక్స్(Sensex) 3 ప్లాయింట్లు తగ్గి 84,048 వద్ద ట్రేడవుతోంది.దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్వీసు రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్ మరింత స్పీడు!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరు చూపవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గత వారం అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను దాటి నిలిచింది. ఈ స్పీడ్ కొనసాగనున్నట్లు అధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్విసుల రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్డర్లరాకతోపాటు పరిశ్రమల రంగ ప్రగతిని తయారీ పీఎంఐ తెలియజేయనున్నట్లు బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పేర్కొంది. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. విదేశీ అంశాలు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ మార్కెట్లకు సానుకూల అంశంకాగా.. 1న జపనీస్ తయారీ రంగ క్యూ1 వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు చైనా తయారీ పీఎంఐ తెలియనుంది. 3న జూన్ నెలకు యూఎస్ ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా 9న యూఎస్ టారిఫ్ల గడువు ముగియనుంది. యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు చల్లబడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నాయిర్ తెలియజేశారు. ఎఫ్పీఐల దన్ను విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత వారం భారీస్థాయిలో రూ. 13,108 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా జూన్లో ఇంతవరకూ నికరంగా రూ. 8,915 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లయ్యింది. ఆర్బీఐ రెపో రేటులో 0.5 శాతం కోతకుతోడు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఉపశమించడం, యూఎస్ టారిఫ్ల ఆందోళనలు సైతం తగ్గడం ఎఫ్పీఐల పెట్టుబడులకు దోహదం చేస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. గతేడాది అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచి్చన ఎఫ్పీఐలు ఏప్రిల్ చివరి నుంచి దేశీ స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. వెరసి ఏప్రిల్లో నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయగా..మే నెలలో రూ. 19,860 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.26,100 పాయింట్లపై కన్ను అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బ్రేకవుట్ నమోదైంది. 5 వారాలుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలిన మార్కెట్లు పరిధిని చేదించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను అధిగమించి నిలిచింది. ఫలితంగా 25,600 పాయింట్లను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ఈ బాటలో మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. వెరసి నిఫ్టీ 25,800 పాయింట్లను దాటి 26,100వరకూ పరుగు తీయవచ్చని భావిస్తున్నారు. మధ్యకాలంలో నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టం 26,277 పాయింట్లవైపు పరుగు తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాకాకుండా బలహీనపడితే 25,300 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. గత వారమిలా ఐదు వారాల కన్సాలిడేషన్ తదుపరి గత వారం చివరి 4 రోజుల్లో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 2,162 పాయింట్లు జంప్చేసింది. దీంతో నికరంగా గత వారం సెన్సెక్స్ 1,651 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుంది. 84,059 వద్ద ముగిసింది. ఈ బాటలో చివరి 4 రోజుల్లో 666 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ నికరంగా 525 పాయింట్లు(2.1 శాతం) లాభపడింది. 25,638 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ మరింత అధికంగా 2.35 శాతం, స్మాల్క్యాప్ 3.6 శాతం చొప్పున జంప్ చేయడం గమనార్హం! -
క్రిజాక్ ఐపీవో జులై 2న
న్యూఢిల్లీ: విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందించే క్రిజాక్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. జులై 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జులై 1న షేర్లను కేటాయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు రూ. 860 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కాగా.. గతేడాది నవంబర్లో రూ. 1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. తాజాగా ఇష్యూ పరిమాణాన్ని రూ. 860 కోట్లకు కుదించింది. తొలుత 2024 మార్చిలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే జులైలో ప్రాస్పెక్టస్ను సెబీ తిప్పిపంపింది. ఆపై నవంబర్లో తిరిగి ఐపీవో చేపట్టేందుకు సెబీ తలుపు తట్టింది. 2025 మార్చిలో అనుమతి పొందింది. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెంట్లకు బీటూబీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయస్థాయిలో విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందిస్తోంది. ఈ కోల్కతా కంపెనీ ద్వారా విద్యార్థులు యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు గ్లోబల్ సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారా గత మూడేళ్లలో 75 దేశాలకుపైగా ఎన్రోల్మెంట్ అప్లికేషన్లకు కంపెనీ ప్లాట్ఫామ్ వీలు కల్పించింది. సుమారు 7.11 లక్షల విద్యార్థుల అప్లికేషన్ల ప్రాసెస్ చేసింది. కాగా.. గతేడాది(2024–25) రూ. 849 కోట్లకుపైగా ఆదాయం, రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో స్ట్రీట్ ...లిస్టింగ్కు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్లో గోప్యతా విధాన పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్ సర్వీసెస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్లో బిజినెస్ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ 2009లో ఇన్వెస్ట్ చేసింది. 2010 నుంచి హెచ్డీఎఫ్సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్క్యాపిటల్ గ్రూప్లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్ సోలార్ స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్ సోలార్ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, మైక్రోటెక్ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ హోమ్ అండ్ ఫరీ్నíÙంగ్స్ కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్తోపాటు, లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్లోని నందెసారి యూనిట్లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్ అంట్ న్యూట్రిషన్లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్టాస్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, మెర్క్ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్తోపాటు ఫ్రెంచ్ దిగ్గజం గ్రూప్ దానోన్ చేరింది. గత క్యాలండర్ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్కార్ట్, మిరాయ్ అసెట్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్వర్క్పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. -
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025 -
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. నాలుగు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా తగ్గాయి. దాంతో ఇంకెంత పడుతుందోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. సెన్సెక్స్ కొత్త మార్క్
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో సెషన్ లోనూ లాభాల బాటలో పయనించి, వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను సానుకూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303.03 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 84,058.90 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ సూచీ 84,089.35 - 83,645.41 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 88.80 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 25,657.80 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.27 శాతం, 0.91 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ లాభాల్లో ముగియగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.19 శాతం లాభపడింది.ఎన్ఎస్ఈలో 2,986 షేర్లలో 1,681 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగియగా, 76 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 86 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 105కు పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 40 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.32 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.60 శాతం క్షీణించి 12.39 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. మూడు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం కూడా తగ్గాయి. దేశంలోని ప్రధానం నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,565కు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 ప్లాయింట్లు పుంజుకుని 83,799 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హాట్రిక్ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గి హాట్రిక్ కొట్టిన పసిడి ధరలకు నేడు (జూన్ 26) బ్రేక్ పడింది. దీంతో ఇంకాస్త తగ్గుతుందనుకున్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,100🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,850ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.👉 వెండి విషయంలో అమ్మో.. ఆయన మాటలు నిజమవుతాయా? 👈వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,18,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్గాట్గా కదులుతున్నాయి.30 షేర్ల సెన్సెక్స్ 243 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 82,998 వద్ద, 50 షేర్ల నిఫ్టీ 83 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 25,327 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.31 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. ఇండియా వీఐఎక్స్ 0.7 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.8 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం లాభపడ్డాయి.నేటి ఐపీవోలుహెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, రమా టెలికాం, సన్టెక్ ఇన్ఫ్రా, సూపర్టెక్ ఈవీ ఐపీఓలు సబ్స్క్రిప్షన్ రెండో రోజులోకి ప్రవేశించనున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ, ఎల్లెన్ బారీ ఇండస్ట్రియల్ ఐపీఓ , కల్పతరు ఐపీఓ, ఐకాన్ ఫెసిలిటేటర్స్ ఐపీఓ, శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐపీఓ, అబ్రామ్ ఫుడ్స్ ఐపీఓ తమ సబ్ స్క్రిప్షన్ లో మూడో రోజుకు, ఏజేసీ జువెల్ మాన్యుఫాక్చరర్స్ ఐపీఓ 4వ రోజుకు ప్రవేశిస్తాయి. -
అంబానీ.. అదానీ ఇంధన బంధం!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మరో భారీ వ్యాపార వెంచర్ కోసం చేతులు కలిపారు. ఒకరి ఇంధన రిటైల్ నెట్వర్క్లో మరొకరి ఇంధనాలను విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అదానీ టోటల్ గ్యాస్ (ఏటీజీఎల్) సీఎన్జీ రిటైల్ ఔట్లెట్స్లో జియో–బీపీ తమ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను విక్రయిస్తుంది. అలాగే, జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ తమ సీఎన్జీ పంపులను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతమున్న, భవిష్యత్లో రాబోయే ఔట్లెట్స్ అన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జియో–బీపీ అనేది అంబానీకి చెందిన జియో, బ్రిటన్ సంస్థ బీపీ మధ్య జాయింట్ వెంచర్. ఇక, ఏటీజీఎల్ అనేది అదానీ గ్రూప్, ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీస్ కలిసి ఏర్పాటు చేసిన జేవీ సంస్థ. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ బంకులు ఉండగా, ఏటీజీఎల్కి 659 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఇరు సంస్థల పటిష్టమైన నెట్వర్క్ను ఉపయోగించుకుని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జియో–బీపీ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. ఈ డీల్ ద్వారా ఔట్లెట్స్లో అత్యంత నాణ్యమైన, వివిధ రకాల ఇంధనాలను అందించాలనేది తమ ఉమ్మడి లక్ష్యమని ఏటీజీఎల్ ఈడీ సురేష్ పి. మంగ్లానీ చెప్పారు. పీఎస్యూలకు పోటీ..: ప్రస్తుతం ఇంధనాల రిటైలింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఆధిపత్యం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 97,366 పెట్రోల్ బంకులు ఉండగా మూడు పీఎస్యూలకు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)) ఏకంగా 90% వాటా ఉంది. సిటీ గ్యాస్ పంపిణీ వ్యాపారంలో కూడా అవి ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ, అంబానీ చేతులు కలపడం వల్ల వాటి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏటీజీఎల్ సంస్థ గృహాలు, పరిశ్రమలు, వాహనదారులు, ఇతరత్రా కస్టమర్లకు గ్యాస్ను, ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు మొదలైనవి అందిస్తోంది. మరోవైపు, జియో–బీపీ ఇంధనాల రిటైలింగ్తో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలు, కనీ్వనియెన్స్ స్టోర్స్ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్టులో.. ఇరువురు కుబేరులు వ్యాపార అవసరాలరీత్యా జట్టు కట్టడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని ఓ విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటా కొనుగోలు చేసింది.పోటాపోటీ.. గుజరాత్కే చెందిన అంబానీ, అదానీ ఇద్దరికీ బడా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నులుగా నిలవడంలో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. అంబానీ ఓవైపు ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికం తదితర రంగాల్లో విస్తరించగా అదానీ మరోవైపు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్ తదితర మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తరించారు. పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులను మినహాయిస్తే ఇద్దరూ ఒకరి రంగంలోకి మరొకరు అడుగుపెట్టలేదు. అదానీ మెగా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్లు, సోలార్ మాడ్యూల్స్ .. విండ్ టర్బైన్ల తయారీపై దృష్టి పెట్టారు. అటు అంబానీకి చెందిన రిలయన్స్ గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తోంది. ఇక 2014 నుంచి సీఎన్బీసీ–టీవీ18, సీఎన్ఎన్–న్యూస్18, కలర్స్లాంటి టీవీ చానళ్ల ద్వారా అంబానీ మీడియా రంగంలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా అదానీ కూడా ఇటీవలే ఈ విభాగంలోకి ప్రవేశించారు. -
నా జీవితంలో అతిపెద్ద రిస్క్.. జియో: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఏమన్నారంటే.. → ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్ 1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం. → రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే.. ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా. → డీప్–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్ లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. నాన్నకు మాటిచ్చాను.. ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్ అంబానీ చెప్పారు.