breaking news
Market
-
కార్పొరేట్ ఆర్ధిక ఫలితాలు ఇలా..
ప్రముఖ కంపెనీలు ఎట్టకేలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో క్యూ2 ఫలితాలని విడుదల చేశాయి. ఈ ఫలితాలను పరిశీలిస్తే..హ్యాట్సన్పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోని హ్యాట్సన్ ఆగ్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలానికి ఆకర్షణీయమైన పనితీరు చూపించింది. లాభం ఏకంగా 70 శాతం ఎగసి రూ.109 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.64 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం 17 శాతం వృద్ధి చెంది రూ.2,072 కోట్ల నుంచి రూ.2,427 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,991 కోట్ల నుంచి రూ.2,284 కోట్లకు చేరాయి.రేమండ్ లైఫ్స్టైల్బ్రాండెడ్ దుస్తులు, టెక్స్టైల్స్ కంపెనీ రేమండ్ లైఫ్స్టైల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 75 కోట్లను అధిగమించింది. బ్రాండెడ్ టెక్స్టైల్స్, దుస్తుల అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 42 కోట్లు ఆర్జించింది. రేమండ్ గ్రూప్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 1,708 కోట్ల నుంచి రూ. 1,832 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 1,758 కోట్లకు చేరాయి. పార్క్ ఎవెన్యూ, కలర్ప్లస్, పార్క్స్, ఎతి్నక్స్ తదితర బ్రాండ్ల కంపెనీ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 259 కోట్లను తాకగా.. 13.9 శాతం మార్జిన్లు సాధించింది. డీసీఎం శ్రీరామ్డైవర్సిఫైడ్ దిగ్గజం డీసీఎం శ్రీరామ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం రెండు రెట్లుపైగా జంప్చేసి రూ. 159 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 63 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 3,184 కోట్ల నుంచి రూ. 3,531 కోట్లకు బలపడింది. కెమికల్స్, వినైల్, అగ్రికల్చర్ తదితర విభాగాలు కలిగిన కంపెనీ మొత్తం వ్యయాలు సైతం రూ. 3,796 కోట్ల నుంచి రూ. 4,873 కోట్లకు పెరిగాయి. కెమికల్స్, వినైల్ విభాగాల ఆదాయం రూ. 777 కోట్ల నుంచి రూ. 1,108 కోట్లకు ఎగసింది. ధనలక్ష్మీ బ్యాంక్ప్రయివేట్ రంగ సంస్థ ధనలక్ష్మీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 23 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 26 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 380 కోట్ల నుంచి రూ. 418 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం రూ. 329 కోట్ల నుంచి రూ. 384 కోట్లకు పెరిగింది. కాగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.82 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు నిలకడను చూపుతూ 1.12 శాతంగా నమోదయ్యాయి.వరుణ్ బెవరేజెస్గ్లోబల్ పానీయాల దిగ్గజం పెప్సీకోకు బాట్లర్గా వ్యవహరించే వరుణ్ బెవరేజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 745 కోట్లను అధిగమించింది. ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం, ఇతర ఆదాయం పుంజుకోవడం, కరెన్సీ లాభాలు ఇందుకు సహకరించాయి. గతేడాది(2024) ఇదే కాలంలో రూ. 629 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,932 కోట్ల నుంచి రూ. 5,048 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,156 కోట్ల నుంచి రూ. 4,253 కోట్లకు పెరిగాయి. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే విషయం విదితమే. అమ్మకాలు 2.4 శాతం పుంజుకుని 27.38 కోట్ల కేసులకు చేరాయి. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.సెన్సెక్స్ 592.67 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 84,404.46 వద్ద, నిఫ్టీ 176.05 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 25,877.85 వద్ద నిలిచాయి.యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్ప్లోరేషన్, సార్థక్ మెటల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గీకే వైర్స్, ఓసీసీఎల్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ, ZIM లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం జాక్పాట్! తులం ఎంతకు తగ్గిందంటే..
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు తగ్గి 25,920కు చేరింది. సెన్సెక్స్(Sensex) 414 పాయింట్లు నష్టపోయి 84,583 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్రోకరేజీ, ఏఎంసీ చార్జీల్లో కోత!?
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు /ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీలు (ఎక్స్పెన్స్ రేషియో), బ్రోకరేజీ చార్జీలపై సెబీ కీలక మార్పులను ప్రతిపాదించింది. క్యాష్ మార్కెట్ లావాదేవీలపై బ్రోకరేజీ చార్జీ ఇప్పటివరకు గరిష్టంగా 12 బేసిస్ పాయింట్లకు అనుమతి ఉండగా, 2 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డెరివేటివ్స్కు బేసిస్ పాయింట్ల గరిష్ట పరిమితిని ఒక బేసిస్ పాయింట్కు కుదించింది.ఇక ప్రతీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిదారుల నుంచి ఏఎంసీలు టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) వసూలు చేస్తుంటాయి. అయితే, బ్రోకరేజీ, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీసీ), జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ వంటి చార్జీలు ఇప్పటి వరకు టీఈఆర్లో కలసి ఉంటుండగా, ఇకపై వీటిని విడిగా చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల అసలు పెట్టుబడుల నిర్వహణపై ఎంత చార్జీ పడుతుందో ఇన్వెస్టర్లకు తెలుస్తుందన్నది సెబీ ఉద్దేశం.టీఈఆర్ గరిష్ట పరిమితిలోనూ 15–20 బేసిస్ పాయింట్లను తగ్గించాలన్నది మరొక ప్రతిపాదన. పనితీరు ఆధారిత టీఈఆర్ను కూడా ప్రతిపాదించింది. 2018లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 5 బేసిస్ పాయింట్ల మేర అదనంగా వసూలు చేసుకునేందుకు సెబీ అనుమతించింది. ఇప్పుడు దీన్ని తొలగించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై సూచనలకు సెబీ ఆహ్వానించింది.ఇన్వెస్టర్లకు ప్రయోజనంసెబీ ప్రతిపాదనలతో ఇన్వెస్టర్లకు వ్యయాలు తగ్గి, రాబడులు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘బ్రోకరేజీ చార్జీలను క్రమబద్ధీకరించడం వల్ల ఇన్వెస్టర్లు పరిశోధన, అడ్వైజరీల కోసం రెట్టింపు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది’’అని ఆనంద్రాఠీ వెల్త్ జాయింట్ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, ఎస్టీటీ, స్టాంప్ డ్యూటీలను టీఈఆర్లో కాకుండా విడిగా పేర్కొనడం వల్ల వివిధ పథకాల మధ్య అసలు వ్యయాలు ఎంతన్నది పోల్చుకోవడం సులభం అవుతుందన్నారు. ‘‘నికరంగా ఇన్వెస్టర్లకు టీఈఆర్ తగ్గుతుంది. దీంతో రాబడులు అధికం కావడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతారు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు -
ఎఫ్డీఐల్లో అమెరికా, సింగపూర్ టాప్
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) మూడో వంతు వాటాతో అమెరికా, సింగపూర్ అగ్రస్థానంలో నిల్చాయి. మొత్తం రూ. 68,75,931 కోట్ల ఎఫ్డీఐలు రాగా అమెరికా వాటా 20 శాతంగా, సింగపూర్ది 14.3 శాతంగా ఉంది. మారిషస్ (13.3 శాతం), బ్రిటన్ (11.2 శాతం), నెదర్లాండ్స్ (9 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫారిన్ లయబిలిటీస్, అసెట్స్ (ఎఫ్ఎల్ఏ)పై రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వార్షిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 45,702 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో 41,517 సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్స్లో ప్రస్తావించాయి. ఇందులో నాలుగింట మూడొంతుల సంస్థలు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మార్కెట్ వేల్యూ ప్రకారం మొత్తం ఎఫ్డీఐ ఈక్విటీ పెట్టుబడుల్లో తయారీ రంగం అత్యధిక వాటా దక్కించుకోగా, సర్వీసుల రంగం రెండో స్థానంలో నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐల పరిమాణం రూ. 61,88,243 కోట్లుగా నమోదైంది. మరోవైపు, తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల్లో చేసిన ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం రూ. 11,66,790 కోట్లుగా నమోదైంది. ఇందులో సింగపూర్ వాటా 22.2 శాతంగా, అమెరికా వాటా 15.4 శాతంగా ఉంది. బ్రిటన్ (12.8 శాతం), నెదర్లాండ్స్ (9.6 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
అదానీ గ్రూప్ షేర్లదే అదృష్టం!
అదానీ గ్రూపు సంస్థల షేర్లు మెరుపులు మెరిపించాయి. ఒక్కరోజులో దాదాపు రూ.40వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను పెంచుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ నాయకత్వంలోని కీలక గ్రూప్ కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు మదుపరుల ఉత్సాహాన్ని పెంచాయి. పునరుత్పాదక, ఇంధన రంగాల ఫ్లాగ్షిప్ సంస్థల ప్రదర్శనతో ప్రేరణ పొందిన ఈ ర్యాలీ, గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో విస్తృత స్థాయి పెరుగుదలకు దారి తీసింది.అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక్కరోజులో రూ.14,521 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదలకను సాధించింది. బీఎస్ఈలో కంపెనీ షేర్లు 14% పెరిగి రూ.1,145 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి, రూ.1,113.05 వద్ద ముగిశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 111% పెరిగి రూ.583 కోట్లకు చేరుకోగా, మొత్తం ఆదాయం 4% తగ్గి రూ.3,249 కోట్లుగా నమోదైంది.అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్తో జాయింట్ వెంచర్) షేర్లు 8.7% పెరిగి రూ.675 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి, రూ.634.50 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.1,468 కోట్ల మేర పెరిగింది. ఇక ఈ కంపెనీ త్రైమాసిక నికర లాభం ఏడాది ప్రాతిపదికన 9% తగ్గినప్పటికీ, ఇన్పుట్ గ్యాస్ ఖర్చులు 26% పెరగడం వల్ల వచ్చిన ఒత్తిడిని మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు.పునరుత్పాదక, గ్యాస్ వ్యాపారాల బాటలోనే ఇతర అదానీ గ్రూప్ కంపెనీలు కూడా ర్యాలీలో భాగమయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 2% పెరిగి, మార్కెట్ విలువలో రూ.5,592 కోట్లు జోడించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టాక్ 3 శాతం పెరగడంతో రూ.8,500 కోట్ల విలువ జతకలిసింది.అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5% పెరిగి రూ.5,592 కోట్ల విలువను చేర్చుకుంది.ఇక అంబుజా సిమెంట్స్ రూ.4,041 కోట్లు, ఏసీసీ లిమిటెడ్ రూ.261 కోట్లు, అదానీ విల్మార్ రూ.936 కోట్లు, ఎన్డీటీవీ రూ.33 కోట్లు, సంఘి ఇండస్ట్రీస్ రూ.32 కోట్లు మార్కెట్ విలువ పెరుగుదల నమోదు చేశాయి. మొత్తం మీద, బుధవారం ఒక్క రోజులో అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,640 కోట్ల మేర పెరిగింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆశావాదం మధ్య భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిశాయి. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తారనే వార్తలు కూడా మదుపరుల సెంటిమెంట్ను పెంచాయి.ఈరోజు బీఎస్ఈ సెన్సెక్స్ 368.97 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 84,977.13 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.7 పాయింట్లు లేదా 0.45 శాతం లాభపడి 26,053.9 పాయింట్ల వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.64 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.43 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.12 శాతం లాభపడగా, ఎనర్జీ, మెటల్, మీడియా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఎటర్నల్, మహీంద్రా & మహీంద్రా, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్ వెనుకబడినవాటిలో అగ్రస్థానంలో ఉన్నాయి. -
బంగారం ధరల తుపాను! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26వేల మార్కు వద్ద నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 26,004కు చేరింది. సెన్సెక్స్(Sensex) 201 పాయింట్లు పుంజుకొని 84,802 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇక విద్యుత్ షేర్ల వెలుగు
విద్యుత్ రంగంలోని యుటిలిటీస్ షేర్లు ప్రస్తుతం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత 12 నెలల్లో విద్యుత్ రంగ కౌంటర్లు అమ్మకాలతో బలహీనపడటమే దీనికి కారణమని ప్రస్తావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో అంతంత మాత్ర ఫలితాలు ప్రకటించిన పలు విద్యుత్ రంగ కంపెనీలు ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ నిరుత్సాహకర పనితీరు చూపడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం(2025 అక్టోబర్–మార్చి 2026)లో విద్యుత్ డిమాండ్ పుంజుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులోకి వచ్చిన విద్యుత్ రంగ షేర్లు బలపడే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. దీర్ఘకాలిక ట్రెండ్ ఎలాఉన్నప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్(థర్మల్) ప్లాంట్ల సామర్థ్య పెంపు ప్రణాళికలకు తెరలేవనుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక డిమాండుకు అనుగునంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్(బీఈఎస్ఎస్), పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు(పీఎస్పీ) పుంజుకోనున్నాయి. మరోపక్క పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సైతం జత కలవనుంది. అయితే బీఈఎస్ఎస్తోపాటు.. సోలార్కు విదేశీ పరికరాలపై ఆధారపడవలసి ఉంటుంది. దీంతో రాజకీయ భౌగోళిక, సరఫరా చైన్ రిసు్కలు పెరగనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ అధిక వర్షపాతం కారణంగా డిమాండ్ మందగించింది. దీర్ఘకాలిక డిమాండ్ పటిష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలుసహా, వివిధ దశలలో ఉన్న ప్రాజెక్టులరీత్యా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2025–35 మధ్య కాలంలో 86 గిగావాట్లమేర జత కలవనుంది. 68 గిగావాట్ల తొలి అంచనాలకంటే ఇది అధికంకాగా.. వీటికి అనుగుణంగా కనీసం 26 గిగావాట్లమేర పరికరాలకు ఆర్డర్లు ఇవ్వవలసి ఉంటుంది. బీఈఎస్ఎస్ సామర్థ్య విస్తరణకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాలు, జాతీయ స్థాయిలో ప్రసార చార్జీల రద్దు దన్నుగా నిలవనున్నాయి. ఇక 2032కల్లా 32 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్య లక్ష్యాలలో ఎలాంటి మార్పులేదు. అయితే వీటిలో చాల ప్రాజెక్టులు ఎగ్జిక్యూషన్ దశకు చేరుకున్నాయి.షేర్లకు జోష్ఈ ఏడాది ద్వితీయార్థంలో విద్యుత్కు డిమాండ్ పెరగడం ద్వారా ఈ రంగంలో దెబ్బతిన్న కౌంటర్లకు జోష్ లభించనుంది. పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ త్వరలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుకు తెరతీయనుంది. మర్చంట్ పవర్ ఆధారిత జేఎస్డబ్ల్యూ, టాటా పవర్కంటే రెగ్యులేటెడ్ యుటిలిటీ సంస్థలు ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, సీఈఎస్సీ మెరుగైన పనితీరు చూపనున్నాయి. భారీ జలవిద్యుత్(హైడ్రో) ప్రాజెక్టులతో ఎన్హెచ్పీసీ ఏడాదికి నిలకడగా 20 శాతానికిమించిన వృద్ధిని అందుకోనున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్రారంభంకానున్న సోలార్ మాడ్యూల్ ప్లాంట్ ద్వారా సీఈఎస్సీ సోలార్ మాడ్యూల్స్, సెల్స్ తయారీలోకి ప్రవేశించనుంది. మర్చంట్ పవర్ మార్కెట్ బలహీనపడటంతో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఫలితాలు నీరసించవచ్చు. వరదల కారణంగా ఎన్హెచ్పీసీపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవచ్చు. మరోవైపు భారీ హైడ్రో ప్రాజెక్టులు ఆలస్యంకావడం, కొత్తగా ఏర్పాటు చేస్తున్న థర్మల్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు కోసం ఒప్పందం కుదుర్చుకోకపోవడం ఎస్జేవీఎన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.వీక్ డిమాండ్ ఈ ఏడాది ఆగస్ట్వరకూ డిమాండ్లో వృద్ధి 0.6 శాతానికి పరిమితంకావడంతో సెపె్టంబర్లో విద్యుదుత్పత్తి 3 శాతానికి మందగించింది. బొగ్గు నిల్వలు ఏడాది క్రితం నమోదైన 14 రోజులతో పోలిస్తే 20 రోజులకు చేరాయి. దీంతో పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా బొగ్గు విక్రయాల పరిమాణం 2025 ఆగస్ట్వరకూ 4 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ పవర్ ఇండెక్స్ వార్షికంగా 22 శాతం క్షీణించింది. విద్యుత్ సరఫరాలవైపు చూస్తే జల విద్యుత్లో 9 శాతం, సోలార్లో 25 శాతం, పవన విద్యుత్లో 9 శాతం చొప్పున ఉత్పత్తి జరిగింది. థర్మల్ విద్యుదుత్పత్తి యథాతథంగా నమోదైంది. 496 గిగావాట్లు2025 ఆగస్ట్కల్లా మొత్తం ఇంధన స్థాపిత సామర్థ్యం 496 గిగావాట్లను తాకింది. గత ఏడాది కాలంలోనే 45 గిగావాట్లు జత కలసింది. దీనిలో పునరుత్పాదక సామర్థ్య వాటా 89 శాతంకాగా.. మొత్తం సామర్థ్యంలో 39 శాతానికి ఎగసింది. ఆగస్ట్లో కోల్ ఇండియా విక్రయాలు వార్షికంగా 9 శాతం పుంజుకుంది. గత ఆగస్ట్లో అమ్మకాలు తక్కువగా నమోదుకావడం దీనికి కారణం.ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు -
మార్కెట్ అటూ ఇటూ
ముంబై: ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 84,628 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 25,936 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి.ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 560 పాయింట్లు కోల్పోయి 84,219 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు పతనమై 25,810 వద్ద కనిష్ట స్థాయిని తాకాయి. ట్రేడింగ్ చివర్లో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర రికవరీ అయ్యాయి. ఆసియాలో కొరియా, జపాన్, చైనా, హాంగ్కాంగ్ సూచీలు ఒక శాతానికి వరకు పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు అరశాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల ఇండెక్సుల్లో రియల్టీ 1%, యుటిలిటీ 0.82%, ఐటీ 0.72%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.60% నష్టపోయాయి. మరోవైపు మెటల్ 1.30%, కమోడిటిస్ 0.55%, ఇండ్రస్టియల్స్ 0.21%, బ్యాంకెక్స్ 0.06% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.12%, 0.06 శాతం పెరిగాయి. ⇒ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్న చైనా ప్రకటనతో అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆశలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. జిందాల్ స్టీల్ 4%, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 3%, సెయిల్, వెల్స్పన్ కార్ప్ 2% రాణించాయి. హిందాల్కో, ఏపీఎల్అపోలో, ఎన్ఎండీసీ షేర్లు 1–0.50% పెరిగాయి. ⇒ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్డీఐ పరిమితిని 20% నుంచి 49% వరకు పెంచాలని కేంద్రం యోచిస్తుందనే వార్తల నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకుల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండియన్ బ్యాంక్ 3.50%, మహారాష్ట్ర బ్యాంకు 2%, యూనియన్ బ్యాంకు, పీఎస్బీ 1.50%, సెంట్రల్ బ్యాంక్, పీఎన్బీ, యూకో బ్యాంకు, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, కెనరా బ్యాంకు 1% లాభపడ్డాయి. -
గోల్డ్ ఢమాల్..
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ధర భారీగా పడిపోయింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం రేటు ఏకంగా రూ. 4,100 క్షీణించి రూ. 1,21,800కి దిగి వచ్చింది. అంతర్జాతీయంగా కూడా కీలకమైన 4,000 డాలర్ల దిగువకి పడిపోయిన పుత్తడి ధర (ఔన్సుకి – 31.1 గ్రాములు) మరింతగా తగ్గింది.సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ తగ్గడంతో అమ్మకాలు వేగవంతమయ్యాయని, మూడు వారాల కనిష్ట స్థాయికి ధర నెమ్మదించిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వెండి ధర కూడా కేజీకి ఏకంగా రూ.6,250 మేర క్షీణించి రూ. 1,45,000 స్థాయికి పడిపోయింది.ఇక అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 94.37 డాలర్లు (2.37 శాతం) క్షీణించి 3,887.03 డాలర్లకు తగ్గింది. అంతకు ముందు సెషన్లోనే 132.02 డాలర్లు తగ్గి 4,000 మార్కు దిగువన క్లోజయ్యింది. ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ధర ఒక దశలో సుమారు రూ. 1,778 క్షీణించి రూ. 1,19,179 వద్ద ట్రేడయ్యింది. మరోవైపు, పసిడిలో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగిన నేపథ్యంలో మరో 5–10 శాతం క్షీణించవచ్చని పేర్కొన్నారు. బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీపై అందరూ ప్రధానంగా దృష్టి పెట్టారని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్, కరెన్సీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. -
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు!
భారతదేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ఈ రోజు (అక్టోబర్ 28) కూడా ఇదే బాటలో కొనసాగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. నేడు చెన్నైలో పసిడి ధర గరిష్టంగా రూ. 1630 తగ్గింది. హైదరాబాద్ ముంబై నగరాల్లో రూ. 820 తగ్గింది. ఈ కథనంలో బంగారం ధర ఏ ప్రాంతంలో ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ అప్డేట్: లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 72.34 పాయింట్లు (0.085 శాతం) లాభంతో 84,851.19 వద్ద, నిఫ్టీ 10.05 పాయింట్లు (0.039 శాతం) లాభంతో 25,976.10 వద్ద ముందుకు సాగుతున్నాయి.సాయి సిల్క్స్ కళామందిర్, భారత్ వైర్ రోప్స్, తమిళనాడు న్యూస్ప్రింట్ అండ్ పేపర్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మనక్సియా కోటెడ్ మెటల్స్ & ఇండస్ట్రీస్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, బాటా ఇండియా, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్, లాటీస్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాల జాబితాలో సాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్పై 'మోంథా' ప్రభావం ఎంతంటే..
మోంథా తుఫాన్ విజృంభించింది. ఈ రోజు (మంగళవారం) తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు విమానాలు, రైళ్లను నిషేధించారు. ఈ తుఫాన్ వ్యవసాయం, రవాణా వంటివాటిమీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా పరోక్ష ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది.నిజానికి స్టాక్ మార్కెట్లలో మార్పులు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. టారిఫ్స్ ప్రభావం, కొన్ని దేశాల కీలకనేతలు లేదా దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయాలు స్టాక్ మార్కెట్ మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సందర్భాలను గతంలో మనం చాలానే చూశాము. కానీ మోంథా తుఫాన్ స్టాక్ మార్కెట్ మీద ఈ స్థాయిలో ప్రభావం చూపే అవకాశం లేదు.మోంథా తుఫాన్ ఎఫెక్ట్.. ప్రధానంగా వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయం, కన్స్యూమర్ డిమాండ్ వంటి అంశాల ద్వారా మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. పోర్ట్స్ & లాజిస్టిక్స్, ఎనర్జీ (పవర్) సంబంధించిన రంగాలపై కూడా ఈ ప్రభావం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఉదయం 9:20 గంటలకు స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. 10:20 గంటలకు సెన్సెక్స్ 256.75 పాయింట్లు నష్టపోయి 84,522.09 పాయింట్లు వద్ద, 62.50 పాయింట్ల నష్టంతో 25,903.55 వద్ద సాగుతోంది. ఈ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.ఆసియా మార్కెట్లుఆసియా మార్కెట్లు ఈ రోజు (అక్టోబర్ 28) ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. నికాయ్ 225 (జపాన్), హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ (హాంకాంగ్), కోస్పీ (సౌత్ కొరియా), జకార్తా కంపోసైట్ (ఇండోనేషియా), షాంఘై కంపోసైట్ (చైనా) వంటివి స్వల్ప నష్టాలను చవిచూడగా.. స్ట్రైన్ టైమ్స్, తైవాన్ వైటెడ్ లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావము చూపుతుంది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమ సంకేతాలను సూచిస్తున్నాయి.ఇన్వెస్టర్లకు సూచనలుమోంథా తుఫాన్ స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. ఇన్వెస్టర్లు తప్పకుండా కొంత జాగ్రత్త వహించాలి. ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే విషయాన్ని పరిశీలించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ & లాజిస్టిక్స్, అగ్రికల్చర్, రియల్టీ, టూరిజం & హాస్పిటాలిటీ వంటి రంగాలకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది. అయితే సిమెంట్, పెయింట్స్, బేవరేజెస్ రంగాల్లో తాత్కాలిక ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నందున లాంగ్ టర్మ్ వ్యూహంతో ముందుకు వెళ్లాలి. వర్షపాతం గణాంకాలు, పంటల స్థితి వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేయాలి.తుఫాన్స్ ఎఫెక్ట్: గతంలో స్టాక్ మార్కెట్పై ఇలా2014లో వచ్చిన హుద్హుద్ (విశాఖపట్నం) తుఫాన్ కారణంగా.. పోర్ట్లు & ఇండస్ట్రీస్ 3-5 రోజులు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ తాత్కాలికంగా పడిపోయింది. 2019లో ఒడిశాలో వచ్చిన ఫణి తుఫాన్ దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఒత్తిడికి లోనయ్యాయి. 2021లో వచ్చిన తౌక్టే తుఫాన్ ఎనర్జీ, షిప్పింగ్ రంగాలు తాత్కాలిక ప్రభావం చూసాయి. దీన్నిబట్టి చూస్తే.. తుఫాన్ లేదా ప్రకృతి వైపరీత్యాలు స్టాక్ మార్కెట్ మీద తాత్కాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి చెప్పుకోదగ్గ స్థాయిలో స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసే అవకాశం లేదు. -
ఒకే రోజు రెండుసార్లు తగ్గిన గోల్డ్ రేటు: కారణాలివే!
భారీగా పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజే (అక్టోబర్ 27) గోల్డ్ రేటు రెండోసారి తగ్గింది. ఉదయం గరిష్టంగా రూ. 1050 తగ్గిన రేటు.. సాయంత్రానికి మరో రూ. 1290 తగ్గింది (మొత్తం రూ. 2340 తగ్గింది). దీంతో మరోమారు పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రస్తుత ధరలకు సంబంధించిన వివరాల విషయానికి వస్తే..హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2340 తగ్గి.. రూ. 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150 రూపాయలు తగ్గి రూ. 1,13,000 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2340 తగ్గి రూ. 1,23,430 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2150 తగ్గి రూ. 1,13,150 వద్దకు చేరింది.చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి కూడా అలాగే ఉంది. (24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 540 తగ్గి.. రూ. 1,24,910 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు 500 తగ్గి.. రూ. 1,14,500 వద్ద నిలిచింది).గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధాన కారణాలు➤అమెరికా డాలర్ బలపడం: డాలర్ విలువ పెరిగితే.. బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్లోనే ట్రేడ్ అవుతుంది.➤వడ్డీ రేట్లు పెరగడం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే, ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇచ్చే ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు.➤ద్రవ్యోల్బణం తగ్గడం: ద్రవ్యోల్బణం తగ్గితే, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించేవారు సంఖ్య తగ్గుతుంది.➤రాజకీయ పరిస్థితులు: ప్రపంచ రాజకీయ పరిస్థితులు కొంత స్థిరంగా ఉండడం వల్ల, బంగారం ధరలపై ఒత్తిడి తగ్గుతుంది.➤చైనాలో డిమాండ్ తగ్గడం: బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా, భారత్ ముందు వరుసలో ఉంటాయి. అయితే చైనాలో ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్ కొంత తగ్గింది.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
2 కోట్ల షేర్లు అమ్మేస్తున్న సీఈవో..
ఐవేర్ రిటైలర్ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 31న ప్రారంభంకానుంది. నవంబర్ 4న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 12.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు 30న షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధులను పెట్టుబడి వ్యయాలు, దేశీయంగా కంపెనీ నిర్వహణలోని సొంత స్టోర్ల ఏర్పాటు, లీజ్, అద్దెలు, లైసెన్స్ ఒప్పందాల చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది.వీటితోపాటు.. టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, ఇతర సంస్థల కొనుగోళ్లకు సైతం మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. కాగా.. గత వారం డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకృష్ణన్ దమానీ ప్రీఐపీవో రౌండ్లో భాగంగా కంపెనీలో రూ. 90 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2008లో ఏర్పాటైన కంపెనీ ఫ్యాషనబుల్, ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు, సన్గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్లను రూపొందించి విక్రయిస్తోంది. ఆన్లైన్ అమ్మకాలుసహా ఫిజికల్ స్టోర్లనూ నిర్వహిస్తోంది.లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'షార్క్ ట్యాంక్ ఇండియా' ఫేమ్ పీయూష్ బన్సాల్, ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా 2.05 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ .824 కోట్లు అందుకోనున్నారు. అక్టోబర్ 31 న ప్రారంభమయ్యే ఐపీఓ తరువాత, బన్సాల్ కంపెనీలో 8.78% వాటాను కలిగి ఉంటారు. ఆయన సోదరి, కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ కూడా రూ .40.62 కోట్ల చెల్లింపునకు సుమారు 10.1 లక్షల షేర్లను విడుదల చేస్తున్నారు. వీరితో పాటు ఇతర ప్రమోటర్లు అమిత్ చౌదరి, సుమీత్ కపాహి ఐపీఓలో చొప్పున 28.7 లక్షల షేర్లను విక్రయిస్తున్నారు. వీరిద్దరూ కంపెనీలో 0.8 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 566.96 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో.. 84,778.84 వద్ద, నిఫ్టీ 170.90 పాయింట్లు లేదా 0.66 శాతం లాభంతో 25,966.05 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, భారత్ వైర్ రోప్స్, భాగ్యనగర్ ఇండియా, PSP ప్రాజెక్ట్స్, ఎస్సార్ షిప్పింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. నిరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్, లాటీస్ ఇండస్ట్రీస్, డెల్ఫి వరల్డ్ మనీ, జీఎం బ్రూవరీస్, శ్యామ్ టెలికాం కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి పతనం.. కొనుగోలుదారులకు మంచి తరుణం
పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుదల బాట పట్టాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:30 సమయానికి నిఫ్టీ(Nifty) 91 పాయింట్లు పెరిగి 25,886కు చేరింది. సెన్సెక్స్(Sensex) 301 పాయింట్లు పుంజుకొని 84,509 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ నిర్ణయాలపై మార్కెట్ల దృష్టి
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఈ వారం పాలసీ సమీక్షను చేపట్టనుంది. మరోపక్క దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు జూలై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితోపాటు పలు కీలక అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. ఫెడ్ పాలసీ సమీక్షసహా.. ఆర్థిక గణాంకాలు, భారత్– యూఎస్ వాణిజ్య చర్చలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తదితర పలు కీలక అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచిగా నిలవనున్నాయి. ప్రధానంగా చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) 28 నుంచి రెండు రోజులపాటు పరపతి సమీక్షను చేపట్టనుంది. 29న తుది నిర్ణయాలు ప్రకటించనుంది. సెపె్టంబర్లో నిర్వహించిన గత సమావేశంలో ఫెడ్.. ఫండ్స్ రేట్లను 0.25 శాతంమేర తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4–4.25 శాతంగా అమలవుతున్నాయి. పలువురు ఆర్థికవేత్తలు తాజా సమీక్షలో మరో పావు శాతం వడ్డీ రేటు కోతను అంచనా వేస్తున్నారు. దీంతో 3.75–4 శాతానికి రేట్లు దిగిరావచ్చని భావిస్తున్నారు. కాగా.. ఈ వారం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సైతం పాలసీ సమావేశాలు చేపట్టనుండటం గమనార్హం! క్యూ2 జాబితాలో గత వారాంతాన కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) క్యూ2 ఫలితాలు విడుదల చేయడంతో నేడు ఈ కౌంటర్ వెలుగులో నిలవనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఈ వారం ఇంధన దిగ్గజం ఐవోసీతోపాటు.. అదానీ ఎనర్జీ, ఇండస్ టవర్స్, ఎస్ఆర్ఎఫ్, టీవీఎస్ మోటార్, అదానీ గ్రీన్, టాటా క్యాపిటల్, శ్రీ సిమెంట్స్, ఎల్అండ్టీ, కోల్ ఇండియా, హెచ్పీసీఎల్, యూబీ, ఐటీసీ, పిడిలైట్, సిప్లా, కెనరా బ్యాంక్, డాబర్ ఇండియా, మారుతీ సుజుకీ, బీఈఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, గోద్రెజ్ కన్జూమర్, ఏసీసీ జూలై–సెపె్టంబర్ పనితీరు వెల్లడించనున్నాయి. గత నెల ఐఐపీ.. ఈ నెల 28న సెపె్టంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెల్లడికానున్నాయి. 2025 ఆగస్ట్లో ఐఐపీ 4 శాతం పుంజుకుంది. ఇక ఇప్పటికే ప్రారంభమైన యూఎస్, భారత్ మధ్య వాణిజ్య సంబంధ చర్చల పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్లలో ఫలితాలు, వడ్డీ రేట్ల నిర్ణయాలు, వాణిజ్య చర్చలు తదితరాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్, వెల్త్ మేనేజ్మెంట్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సమీపానికి చేరినట్లు గత వారం చివర్లో వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్న విషయం విదితమే. మరోవైపు వచ్చే వారం నిర్వహించనున్న యూఎస్, చైనా అధినేతల సమావేశంపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర అంశాలు గత వారం రష్యా చమురుపై సరికొత్త ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు జోరందుకున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 98.93కు చేరుకోగా.. బ్రెంట్ చమురు బ్యారల్ 65 డాలర్లను తాకింది. ఇవికాకుండా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు.గత వారమిలాదీపావళి పండుగ సెలవుల నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు(0.3 శాతం) లాభపడి 84,212 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 85 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 25,795 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.25 శాతం చొప్పున బలపడ్డాయి. సాంకేతికంగా..గత వారం తొలుత బలపడిన మార్కెట్లు తుదకు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఒక దశలో 85,290 వద్ద గరిష్టానికి చేరి, చివరికి 84,211 వద్ద ముగిసింది. ఈ బాటలో మరింత నీరసిస్తే 83,300–83,000 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. బలాన్ని పుంజుకుంటే స్వల్ప కాలంలో 85,500కు చేరవచ్చు. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 26,100ను అధిగమించినప్పటికీ చివరికి 25,795 వద్ద స్థిరపడింది. ఈ వారం నిఫ్టీకి 25,600–25,400 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఒకవేళ జోరందుకుంటే 26,100–26,200కు చేరే వీలుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మారిన విధి.. ఖాతాలోకి రూ.2,817 కోట్లు!
లక్ష్మీదేవి తలుపు తట్టిందా అన్నట్లు.. మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి అనుకోకుండా కోటీశ్వరుడైపోయాడు. అయితే.. తేరుకునేలోపే వచ్చిన డబ్బు మొత్తం వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన వినోద్ డోంగిల్ నోటరీ, ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా. ఈయన ఎప్పటిలాగే ఉదయం తన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తరువాత ఖాతాలో డబ్బును చూసి.. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈయన ఖాతాలో ఏకంగా రూ. 2,817 కోట్లు కనిపించాయి. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్కు చెందిన 1,312 షేర్లు ఉన్నట్లు, ఒక్కో షేరు విలువ రూ. 2.14 కోట్లకంటే ఎక్కువ అని తెలుసుకున్నాడు. దీంతో ఇతడు బిలినీయర్ అయిపోయాడు.రాత్రికి రాత్రే నా విధి మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లాటరీ గెలిచినట్లు అనిపించిందని వినోద్ డోంగిల్ పేర్కొన్నారు. కానీ అదృష్టం వచ్చినంత వేగంగా.. దురదృష్టం కూడా వచ్చింది. నిమిషాల్లోనే ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు వెనక్కిపోయింది. ఖాతా సాధారణ స్థితికి చేరుకుంది.ఇదీ చదవండి: కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!వినోద్ డోంగిల్ ఖాతాలోకి అంత డబ్బు రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు. బహుశా సిస్టమ్ లోపాలు, టెక్నికల్ సమస్య లేదా స్టాక్ మార్కెట్ డేటాబేస్లలో డేటా అసమతుల్యత కారణంగా ఇది జారీ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి డోంగిల్ కొన్ని సెకన్ల పాటు బిలినీయర్ అయ్యారు. దీన్ని డిజిటల్ బిలినీయర్ అని నిపుణులు అభివర్ణించారు. -
కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత.. రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇందులో పాత ఆలోచన vs కొత్త ఆలోచన అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నా ఆందోళన అని మొదలు పెట్టిన కియోసాకి పాత ఆలోచన vs కొత్త ఆలోచన అని చెబుతూ.. ధనిక మరియు పేద మధ్య అంతరం ఇలా అవుతుందని వివరించారు. పాత ఆలోచనాపరులు, కొత్త ఆలోచనాపరులు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు.పాత ఆలోచనాపరులు1: పాఠశాలకు తిరిగి వెళ్లండి2: మరింత కష్టపడి పని చేయండి3: నకిలీ డబ్బును ఆదా చేయండి4: పదవీ విరమణ ప్రణాళికలో పెట్టుబడి పెట్టండికొత్త ఆలోచనాపరులు1: సొంత స్టార్టప్ ప్రారంభించండి2: నిజమైన బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియంను ఆదా చేయండిపాత ఆలోచనలతో వెనుకపడిపోకండి. కొత్తగా ఆలోచించండి. మీ ఆలోచనలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని కియోసాకి పేర్కొన్నారు. ఎథెరియం, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టే పెట్టుబడులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని అన్నారు. జాగ్రత్త వహించండి అంటూ.. తన సందేశాన్ని ముగించారు.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకిడబ్బును పొదుపుచేస్తే.. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కాబట్టి మీరు బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. దాని విలువ భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతుంది. మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని.. కియోసాకి చాన్నాళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు.MY CONCERN:“Old Thinking vs New THinking”GAP between rich and poor becomes:GRAND CANYON between rich and poor.Billions of people are struggling to:1: “Make Ends Meet” 2: “Keep Up With Inflation.”3: “Keep their Job”Old Thinkers:1: Go back…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 25, 2025 -
ధరలు తగ్గిన మురిపెం కొంత సేపే! మళ్లీ ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల గడిచిన రెండు సెషన్ల్లో ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. అంతలోనే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ లిస్టింగ్
ఏఐ ఆధారిత గవర్నెన్స్, ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్లు అందించే ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ తాజాగా బీఎస్ఈలో లిస్టయ్యింది. ఈ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలో కంపెనీ ఎండీ, సీఈవో రాజా శ్రీనివాస్ నందిగామ్ షేరు ఓపెనింగ్ బెల్ మోగించారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ రివర్స్ మెర్జర్ ద్వారా బీఎస్ఈ మెయిన్ బోర్డులో లిస్టయ్యింది.జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించడంతో ఆర్ఎన్ఐటీ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ 2023లో ఆటోపాల్ ఇండస్ట్రీస్లో విలీనమైంది. విలీనం తదుపరి కంపెనీ ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్గా రూపాంతరం చెందింది. షేర్ల మార్పిడి తదుపరి తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈలో లిస్టయ్యింది. మల్టీమోడల్ ఏఐ, ఇంటిగ్రేటింగ్ టెక్ట్స్, వాయిస్, విజన్ అనలిటిక్స్పై ఇన్వెస్ట్ చేయడం ద్వారా గవర్నెన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లలో పటిష్ట నిర్ణయాలకు వీలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా -
సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్లో పెట్టుబడులకు అనుమతి
సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) పథకంలోకి తాజా పెట్టుబడులను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులు కుదుటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వెండి ధరలు గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురికావడంతో తాజా పెట్టుబడులకు అనుమతించినట్టు తెలుస్తోంది.సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్లో ఏక మొత్తంలో పెట్టుబడి, క్రమానుగత పెట్టుబడి (సిప్), క్రమానుగత పెట్టుబడి బదిలీ (ఎస్టీపీ)లను నిలిపివేస్తున్నట్టు ఈ నెల 14న టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించడం గమనార్హం. ధరలు అనూహ్యంగా పెరుగుతూ వెళుతున్న తరుణంలో రిస్క్ నియంత్రణలో భాగంగా ఈ చర్య చేపట్టింది. మార్కెట్ పరిస్థితులు సాధారణంగా మారడంతో తిరిగి ఏక మొత్తంలో పెట్టుబడులు, తాజా సిప్లు, ఎస్టీపీలను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా -
ఇవి జరిగితేనే.. బంగారం ధరలు తగ్గుతాయి!
బంగారం ధరలు భారీగా పెరిగి.. వారం రోజుల నుంచి కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ 22న.. ఒకేరోజు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 4690 తగ్గింది. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో పసిడి ధరలు రూ.1,24,370 (24 క్యారెట్స్ 10 గ్రా), రూ.1,14,000 (22 క్యారెట్స్ 10 గ్రా) వద్ద ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గాలంటే.. ఎలాంటి పరిణామాలు జరగాలనే విషయాన్ని నిపుణులు అంచనా వేశారు.గోల్డ్ రేటు అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా తగ్గాలంటే.. యుద్దాలు ఆగాలి, అమెరికా విధించిన సుంకాలు తగ్గాలి, ఆర్థికాభివృద్ధి పెరిగినప్పుడే.. బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉంటుందని.. టాటా అసెట్ మేనేజ్మెంట్ కమొడిటీస్ ఫండ్ మేనేజర్ 'తపన్ పటేల్' తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వారం బంగారం ధరలు 3 శాతం తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలో మాత్రమే ధరల పతనం నమోదైంది. దీంతో గోల్డ్ రేటు ఔన్సుకు 4118.68 డాలర్ల వద్దకు చేరుకుంది.బంగారం పెరగడానికి కారణాలుగోల్డ్ రేటు పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డిమాండుకు తగ్గ సరఫరా లేకపోవడం అని తెలుస్తోంది. డిమాండ్ పెరగడానికి కారణం.. పెట్టుబడిదారుల గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే. బంగారం సురక్షితమైన పెట్టుబడి, కాబట్టి దీనిపై పెట్టుబడులు పెరిగాయి. ఇవి కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి -
ఏమీ చేయలేదు: రూ.45 లక్షలు కోల్పోయాడిలా..
తప్పుచేస్తే.. దాని ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ చేయకపోయినా, కొన్ని సార్లు నష్టాలు చవిచూడాల్సి వస్తుందంటున్నారు.. చార్టర్డ్ అకౌంటెంట్ 'నితిన్ కౌశిక్'. ఇంతకీ ఇదెలా సాధ్యమవుతుందనే.. విషయాన్ని ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.డబ్బు కోల్పోవడానికి నిజమైన కారణం మార్కెట్ పతనం మాత్రమే కాదు. ద్రవ్యోల్బణం వల్ల నష్టాలను చూడాల్సి వస్తుందని నితిన్ కౌశిక్ తన ఎక్స్ ఖాతాలో వివరించారు.రియల్ ఎస్టేట్ రంగంలో బాగా అనుభవం ఉన్న.. నా స్నేహితుడు గుర్గావ్లోని తన ఆస్తిని రూ. 14 కోట్లకు విక్రయించాడు. అయితే.. ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం కోసం వేచి చూసాడు. రోజులు గడుస్తున్నా.. సమయం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. కోవిడ్ సమయంలో పరిస్థితులు మారిపోయాయి. రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉండిపోయాయి. బాండ్లు కూడా అంతంత మాత్రంగానే అనిపించాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేస్తే నష్టం వస్తుందేమో అనే భయంతో డబ్బును ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు.The Real Wealth Killer Nobody Talks AboutYour biggest enemy in wealth creation isn’t a market crash.It’s inaction. 🧵👇🏼#stockmarket #investingtips #finance #realestate pic.twitter.com/HYx8WBTxLS— CA Nitin Kaushik (FCA) | LLB (@Finance_Bareek) October 23, 2025చార్టర్డ్ అకౌంటెంట్ లెక్కల ప్రకారం..డబ్బును ఎక్కడా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల.. కౌశిక్ లెక్కల ప్రకారం, నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల మధ్య లాభాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ లెక్కన ఏడాదికి రూ. 45 లక్షలు కోల్పోవాల్సి వస్తుంది. కాగా ఇప్పటికే తాను అమ్మిన ఆస్తి విలువ కూడా రూ. 1.2 కోట్లు పెరిగింది.నా స్నేహితుడు.. తన దగ్గర ఉన్న డబ్బును ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి ఉన్నా, తనకు లాభాలు వచ్చేవి. కానీ డబ్బును స్థిరంగా ఉంచడం వల్ల, డబ్బు విలువ తగ్గలేదు. కానీ ద్రవ్యోల్బణంలో భారీ మార్పులు వచ్చాయి. తాను అమ్మిన ఆస్తిని కొనాలంటేనే.. ఇంకో రూ. 1.2 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.డబ్బును కేవలం ఒకచోట కాకుండా.. వివిధ ఆస్తులలో పెట్టుబడిగా పెడితే రిస్క్ తగ్గుతుంది. అంటే ఒక దగ్గర కొంత నష్టం వచ్చినా.. ఇంకో దగ్గర లాభం వస్తుంది. కాబట్టి డబ్బును ఒకే దగ్గర ఉంచడం వల్ల లాభాలను గడించలేరు. మొత్తం మీద.. సింపుల్గా చెప్పాలంటే, సరైన సమయం కోసం వెయిట్ చేయడం కంటే.. చిన్నగా ఇన్వెస్ట్ చేయడం మంచిదని స్పష్టమవుతోంది. -
ఎన్ఎస్ఈ మ్యూచువల్ ఫండ్ కొత్త యాప్లు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన ఎన్ఎస్ఈ ఎంఎఫ్ ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ను మరింత మెరుగుపరిచింది. ఇందులో భాగంగా నాలుగు కొత్త మొబైల్ సొల్యూషన్స్, కీలక అప్డేట్లను జోడించినట్లు ప్రకటించింది. మదుపరులు, ట్రేడింగ్ సభ్యులు, లిస్టెడ్ కంపెనీలకు ప్రాప్యత, పారదర్శకత, సౌలభ్యాన్ని పెంచడం లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది.మాన్యువల్ ఎంట్రీ ద్వారా లేదా ఎన్ఎస్ఈలో అమలు చేసిన వారి ట్రేడ్లను లింక్ చేయడం ద్వారా సులభంగా పోర్ట్ఫోలియోను ట్రాక్ చేసేలా అప్గ్రేడ్ చేసిన ఇన్వెస్టర్ యాప్ను ఎన్ఎస్ఈ రూపొందించింది. ఇది ఇంగ్లీష్, హిందీతో సహా 13 భాషలలో అందుబాటులో ఉంది.యూనిక్ క్లయింట్ ఐడెంటిఫికేషన్ (యుసిఐ) లో ఎన్ఎస్ఈలో నమోదు చేసుకున్న తమ బ్రోకర్ ఖాతాకు లింక్ను యూజర్లు పొందవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్లో మొబైల్ యాప్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, ఒరియా, అస్సామీ, ఉర్దూ భాషలలో అందుబాటులో ఉంది.మార్కెట్ అప్డేట్స్, గణాంకాలు, ధరల సమాచారం కోసం ఎన్ఎస్ఈ వాట్సాప్ చాట్బాట్ను కూడా ప్రారంభించింది. సమర్పణ, జరిమానా స్థితి వంటి అంశాలను రియల్ టైమ్లో ట్రాక్ చేయడానికి కంప్లయన్స్ డ్యాష్బోర్డులు, మదుపరుల అవగాహన కార్యక్రమాలు, సర్క్యులర్లు, FII/DII గణాంకాలకు సులభ ప్రాప్యత కలిగించే సభ్య పోర్టల్ యాప్ను ప్రవేశపెట్టింది.కంపెనీలు తమ సమర్పణ స్థితి, సమ్మతి క్యాలెండర్లు, స్టాక్ పనితీరును పర్యవేక్షించడానికి ఎన్ఎస్ఈ ఎన్ఈఏపీఎస్ యాప్ను ఉపయోగించవచ్చు.ఈ అన్ని యాప్లు ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్నాయి.ప్లాట్ఫామ్లో కీలక అప్డేట్లుఒకే సెషన్లో 10 ఆర్డర్లు (లంప్ సమ్, ఎస్ఐపీ, ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ) వరకూ ఉంచే కార్టింగ్ ఫెసిలిటీపేమెంట్ రీట్రిగ్గరింగ్ సౌకర్యంఫోలియో ఆటో-పాపులేషన్ ద్వారా మదుపరుల లావాదేవీలను ఆటోమేటిక్గా మ్యాప్ చేయడం, తద్వారా మాన్యువల్ ఎంట్రీ తప్పులను తగ్గించడంఈయూఐఎన్, సబ్-బ్రోకర్ కోడ్, ఏఆర్ఎన్ వంటి వివరాల ఆటో మ్యాపింగ్ -
బంగారం ధర 2026లో కొత్త రికార్డులు సృష్టిస్తుందా?
ఆర్థిక భద్రతకు ప్రతీకగా పరిగణించే బంగారం ఇటీవల ధరల పెరుగుదలతో భారత మార్కెట్లో మళ్లీ ప్రధాన చర్చానీయాంశంగా మారింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో ఇప్పటికే బంగారం ధర 10 గ్రాములకు రూ.1.2 లక్షల మార్కును దాటింది.ఇప్పుడు అందరి దృష్టి వచ్చే 2026 సంవత్సరంలో బంగారం ధర ఎలా ఉంటుందా అన్నదాని వైపు మళ్లింది. 2026లో “ఆర్థిక అల్లకల్లోలం” రాబోతుందని ప్రపంచ ప్రసిద్ధ బల్గేరియన్ జ్యోతిషురాలు బాబా వంగా గతంలో చెప్పిన జోస్యం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.ప్రపంచ పరిస్థితుల ప్రభావంనిపుణుల ప్రకారం, బంగారం పెరుగుదల వెనుక ప్రధాన కారణాలు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణ భయాలు, కరెన్సీ అస్థిరత, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం. ఈ అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు నెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.2026 అంచనాలుచరిత్రాత్మకంగా సంక్షోభ సమయాల్లో బంగారం ధరలు 20–50 శాతం వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ ఆర్థిక అస్థిరత కొనసాగితే, బంగారం ధరలు 25–40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీపావళి (అక్టోబర్–నవంబర్) 2026 నాటికి భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షల నుంచి రూ.1.82 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 344.52 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 84,211.88 వద్ద, నిఫ్టీ 93.90 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 25,797.50 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో ఈప్యాక్ ప్రిఫ్యాబ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆరో గ్రీన్టెక్ లిమిటెడ్, రాజశ్రీ పాలీప్యాక్, సెక్మార్క్ కన్సల్టెన్సీ వంటి కంపెనీలు చేరాయి. అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్, సిక్కో ఇండస్ట్రీస్, Xelpmoc డిజైన్ అండ్ టెక్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్, సాగర్ సిమెంట్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి ధరలు రివర్స్! తులం బంగారం ఒక్కసారిగా..
పసిడి ప్రియుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొన్ని రోజులుగా తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు ఒక్కసారి రివర్స్ అయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజు కూడా భారీగా దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26వేల మార్కు కిందే నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 25,878కు చేరింది. సెన్సెక్స్(Sensex) 81 పాయింట్లు నష్టపోయి 84,454 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జేపీ సిమెంట్పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా భిలాయ్ జేపీ సిమెంట్పై దివాలా చట్ట చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జేప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్) అనుబంధ సంస్థ ఇది. రూ. 45 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో భిలాయ్ జేపీ సిమెంట్పై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు సరఫరాకు సంబంధించి రూ. 45 కోట్లు బకాయిపడటంతో భిలాయ్ జేపీ సిమెంట్పై సిధ్గిరి హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఫిర్యాదును ఎన్సీఎల్టీ కటక్ బెంచ్ ఆమోదించింది. దీంతో ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ బెంచ్ తాత్కాలిక దివాల పరిష్కార నిపుణుడిని ఎంపిక చేసింది. అంతేకాకుండా కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. ఇతర దివాల చట్ట సంబంధిత చర్యలకు ఆదేశించింది. -
లిస్టింగ్కు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు ఇటీవల దుమ్ము రేపుతున్న నేపథ్యంలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 7 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ అనుమతించిన జాబితాలో షాడోఫాక్స్ టెక్నాలజీస్, రేజన్ సోలార్, ఏఆర్సీఐఎల్(ఆర్సిల్), సుదీప్ ఫార్మా, సేఫెక్స్ కెమికల్స్(ఇండియా), ఆగ్కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్, పీఎన్జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూన్–ఆగస్ట్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు వేసిన ప్రణాళికలు అమలుకానున్నాయి. వివరాలు చూద్దాం.. లాజిస్టిక్స్ సర్వీసులు గోప్యతా మార్గంలో లాజిస్టిక్స్ సర్వీసులందించే షాడోఫాక్స్ టెక్నాలజీస్ సెబీకి జూలైలో దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తాజా ఈక్విటీ జారీసహా.. ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్వర్క్ బిజినెస్పై వెచి్చంచనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ పునర్వ్యవస్థీకరణ ఆస్తుల(రుణాల) పునర్వ్యవస్థీకరణ కంపెనీ ఏఆర్సీఐఎల్(ఆర్సిల్) ఐపీవోలో భాగంగా 10.54 కోట్ల ఈక్వటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని పూర్తిగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఎవెన్యూ క్యాపిటల్(న్యూయార్క్) 6.87 కోట్ల షేర్లు, పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్ 1.94 కోట్ల షేర్లు, జీఐసీ 1.62 కోట్ల షేర్లు చొప్పున విక్రయించనున్నాయి. కంపెనీ ప్రధానంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి ఒత్తిడిలోపడ్డ రుణాలను సొంతం చేసుకుని పరిష్కార ప్రణాళికలను అమలు చేయడం ద్వారా రికవరీకి ప్రయతి్నంచే సంగతి తెలిసిందే. సోలార్ సెల్ తయారీ గుజరాత్ కంపెనీ రేజన్ సోలార్ ఐపీవోలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. నిధులలో రూ. 1,265 కోట్లు 3.5 గిగావాట్ల సోలర్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకుగాను సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీకి అందించనుంది. 2017లో ఏర్పాటైన కంపెనీ సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో దేశీయంగా టాప్–10లో ఒకటిగా నిలుస్తోంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్పెషాలిటీ కెమికల్స్ ఐపీవోలో భాగంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సేఫెక్స్ కెమికల్స్(ఇండియా) రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.57 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 1991లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా బ్రాండెడ్ ఫార్ములేషన్స్, స్పెషాలిటీ కెమికల్స్, కాంట్రాక్ట్ తయారీలో ఉంది. పీఈ సంస్థ క్రిస్ క్యాపిటల్ 44.8 శాతం వాటా కలిగి ఉంది. రెంటల్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ అద్దెకిచ్చే ఆగ్కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 94 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. పీఎన్ గాడ్గిల్ ద్వారా ఐపీవో ద్వారా పీఎన్జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ నుంచి డైమండ్ జ్యువెలరీ బిజినెస్ను స్లంప్ సేల్ ద్వారా సొంతం చేసుకుంది. ఇలా ఏర్పాటైన కంపెనీ విడిగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ బిజినెస్ నిర్వహిస్తోంది. కలరింగ్ ఏజెంట్స్ 1989లో ఏర్పాటైన వడోదర కంపెనీ సుదీప్ ఫార్మా ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. కంపెనీ ప్రధానంగా 100 రకాలకుపైగా కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ తయారు చేస్తోంది. వీటిని ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వినియోగిస్తారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 130.05 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 84,556.40 వద్ద, నిఫ్టీ 20.30 పాయింట్లు లేదా 0.078 శాతం లాభంతో 25,888.90 వద్ద నిలిచాయి.సిక్కో ఇండస్ట్రీస్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎఫ్సీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, భగేరియా ఇండస్ట్రీస్, కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీ మీడియా కార్పొరేషన్, గల్లంట్ ఇస్పాట్, యూనిపార్ట్స్ ఇండియా, కృష్ణ ఫోస్చెమ్, ఆశాపుర మినెచెమ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
నిజమైన డబ్బును మాత్రమే పొదుపు చేయండి. ఫేక్ కరెన్సీని పొదుపు చేయడం వల్ల ధనవంతులు కాలేరని సూచించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా మరో రెండు ట్వీట్స్ చేశారు.''గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ క్రాష్ అవుతున్నాయి. అయితే బట్కాయిన్ విలువ ఈ నెలలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బిట్కాయిన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 మిలియన్ల మంది బిట్కాయిన్లను కొనుగోలు చేశారు. వీటి సంఖ్య 21 మిలియన్స్ మాత్రమే. కాబట్టి కొనుగోలును వేగవంతం అవుతుంది. దయచేసి ఆలస్యం చేయకండి'' అని కియోసాకి పేర్కొన్నారు.Why I am buying Bitcoin.Bitcoin is first truly scarce money… only 21 million ever to be mined.World close 20 million now.Buying will accelerate.FOMO realPlease do not be late.Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) October 22, 2025''ప్రస్తుతం అమెరికా అప్పు పెరుగుతూనే ఉంది. జాతీయ అప్పు 37 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. వేల సంవత్సరాలుగా నిజమైన డబ్బు అంటే.. బంగారం, వెండి అని నాకు తెలుసు. నేడు ఈ జాబితాలోకి బిట్కాయిన్ & ఎథెరియం కూడా చేరాయి. కాబట్టి డబ్బు సేవ్ చేయడంలో తెలివిగా వ్యవహరించండి. అయితే జాగ్రత్త వహించండి'' అని కియోసాకి స్పష్టం చేశారు.బంగారం, వెండి, బట్కాయిన్2025 అక్టోబర్ 17వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి. దీంతో రూ. 13,000 దాటిన గోల్డ్ రేటు రూ. 12,500 వద్దకు చేరింది. ఇదే సమయంలో రూ. 2.03 లక్షలకు చేరిన వెండి రేటు.. రూ. 17,4000 వద్దకు వచ్చింది. అయితే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..ఇక బట్కాయిన్ విషయానికి వస్తే.. గత వారంలో కొంత తగ్గుముఖం పట్టిన బట్కాయిన్ విలువ.. నేడు 1.87 శాతం పెరిగి రూ. 96,18,503.80 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. బట్కాయిన్ విలువ మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశం కూడా ఉంది.CLICK BAIT??? Don’t get sucked in to anyone who counts on “click bait.”FOR EXAMPLE: I now see “click bait” titles screaming “gold, silver, Bitcoin crashing” or Butcoin to $2 million this month. Then the podcaster then says “To support my channel “click and subscribe”Give…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 23, 2025 -
కొనసాగుతున్న క్రాష్.. బంగారం, వెండి మళ్లీ డౌన్
బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున భారీగా పడిపోయిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు కూడా దిగొచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు మోస్తరుగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
26వేల మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు పెరిగి 26,001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 513 పాయింట్లు పుంజుకుని 84,933 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డెట్ ఫండ్స్కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సెప్టెంబర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఏకంగా రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. అంతకుముందు ఆగస్ట్ నెలలో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకున్న మొత్తం రూ.7,980 కోట్లుగానే ఉంది. సంస్థాగత ఇన్వెస్టర్లు లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తంలో (రూ.66,042 కోట్లు) వెనక్కి తీసుకోవడమే ఇందుకు కారణమని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) డేటా తెలియజేస్తోంది. జూలైలోనూ డెట్ మ్యూచువల్ ఫండ్స్ రూ.1.07 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. డెట్లో మొత్తం 16 కేటగిరీలకు గాను 12 విభాగాల ఫండ్స్ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ పెట్టుబడుల విలువ 5 శాతం తగ్గి రూ.17.8 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆగస్ట్ చివరికి ఈ మొత్తం రూ.18.71 లక్షల కోట్లుగా ఉంది. ‘బడా సంస్థలు త్రైమాసికం చివర్లో నిధులపరమైన సర్దుబాట్లు, ముందస్తు పన్ను చెల్లింపుల అవసరాల దృష్ట్యా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉండొచ్చు’’అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మేనేజర్ నేహల్ మెష్రామ్ తెలిపారు. -
గోల్డ్ ఢమాల్: భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.కారణాలివేనా..? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు నిపుణులు వివరించారు. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘మూరత్’లో స్వల్ప లాభాలు
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం గంటపాటు జరిగిన మూరత్ ట్రేడింగ్లో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం ‘విక్రమ్ సంవత్ 2082’ తొలిరోజున సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 84,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 25,869 వద్ద నిలిచింది. ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు ఉత్సాహంగా కదలాయి.ఒక దశలో సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగసి 84,665 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,934 గరిష్టాన్ని నమోదు చేశాయి. చివర్లో బ్యాంకులు, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సూచీలు మధ్యాహ్నం 2:45 గంటకు స్వల్పలాభాలతో ట్రేడింగ్ను ముగించాయి.⇒ దీపావళి బలిప్రతిపద సందర్భంగా బుధవారం(నేడు) మార్కెట్కు సెలవు. ఎంసీఎక్స్, ఫారెక్స్ మార్కెట్లు సాయంత్రం సెషన్లో పనిచేస్తాయి. -
బంగారం, వెండి క్రాష్..!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. కారణాలేటంటే? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు వివరించారు. -
దీపావళి తర్వాత బంగారం తగ్గుతుందా? అంతర్జాతీయ బ్యాంకు అంచనా
బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. రోజుకో కొత్త రేటుకు చేరుతున్నాయి. ధనత్రయోదశి, దీపావళి (Diwali) రోజుల్లో కాస్త తగ్గినట్లే అనిపించినా మళ్లీ ఎగిశాయి. ఈ క్రమంలో దీపావళి తర్వాత బంగారం ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని చాలామంది కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇప్పట్లో లేదని తెలుస్తోంది.హెచ్ఎస్బీసీ అంచనాఅంతర్జాతయ బ్యాంకు అయిన హెచ్ఎస్బీసీ (HSBC) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. బంగారం ధరలు (Gold Price) ఇప్పట్లో మందగించే అవకాశం లేదని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పటికే ఔన్స్ కు 4,300 డాలర్లు దాటింది. అక్టోబర్ 18న ఇది ఔన్స్ కు 4,362 ట్రేడ్ అవుతోంది. ఇది స్థిరమైన బుల్లిష్ సెంటిమెంట్ను సూచిస్తుంది.పండుగ రద్దీ తర్వాత కూడా బంగారం తన వేగాన్ని కొనసాగిస్తుందని హెచ్ఎస్బీసీ భావిస్తోంది. 2026 ప్రథమార్థం నాటికి బంగారం ఔన్స్ కు 5,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది.అంతకుముందు, హెచ్ఎస్బీసీ 2025లో ఔన్స్ కు సగటు బంగారం ధర 3,355 డాలర్లుగా అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు 3,455 డాలర్లకు సవరించింది. 2026 కోసం అంచనా ఔన్సుకు 3,950 డాలర్ల నుండి 4,600 డాలర్లకు పెంచేసింది. రాయిటర్స్ కూడా ఇవే అంచనాలను ఉదహరించింది.బంగారం ధరల పెరుగుదలకు కారణాలుబంగారం ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బలపడుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రపంచ వాణిజ్య వివాదాలతో ముడిపడి ఉన్న అనిశ్చితులకు లోనుకాని, సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా బంగారం కొనుగోలుదారును ఆకర్షిస్తూనే ఉంది.ఇటీవల స్పాట్ గోల్డ్ వారం రోజుల్లోనే అమాంతం ఎగిసింది. ఇది ఔన్స్ కు 4,300 డాలర్లకు పెరిగింది. 2008 డిసెంబర్ నుండి ఇది వేగవంతమైన వారపు లాభాలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో 2026 ప్రారంభం వరకు పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ నమ్ముతోంది. అయితే ఆ సంవత్సరం చివర్లో మాత్రం కొంత కరెక్షన్ జరగొచ్చని భావిస్తోంది.ఇతర బ్యాంకులదీ అదే అంచనాబంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, మరింత పెరుగుతాయని ఒక్క హెచ్ఎస్బీసీ మాత్రమే కాదు.. కొన్ని ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ భావిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, సొసైటీ జనరల్ కూడా రాబోయే సంవత్సరానికి బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లను చేరుతుందని అంచనా వేశాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర 4,600 డాలర్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని ఏఎన్జెడ్ బ్యాంక్ అంచనా వేసింది.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్.. -
ముహూరత్ ట్రేడింగ్: ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దీపావళి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ ఫ్లాట్గా ముగిసింది. భారత స్టాక్ మార్కెట్లు ‘సంవత్ 2082’ను జాగ్రత్తగా ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప సానుకూలం వైపు స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 62.97 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 84,426.34 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25.45 పాయింట్లు లేదా 0.1 శాతం పెరిగి 25,868.60 స్థాయిల వద్ద స్థిరపడింది.విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.11 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.52 శాతం పెరిగాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో నిఫ్టీ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్, రియల్టీ ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్వల్ప లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్.ట్రేడింగ్ సెషన్ లో 2,213 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. 710 తగ్గుముఖం పట్టాయి. ఎన్ఎస్ఈలో 116 షేర్లలో మార్పులేదు. 106 స్టాక్స్ కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకగా, 36 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.దీపావళి రోజున సాధారణ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు సెలవు ఉంటుంది. కేవలం గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. దీన్ని సంప్రదాయంగా, ఒక శుభప్రదమైన కార్యక్రమంగా భావిస్తూ, నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం విక్రమ్ సంవత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ముహూరత్ ట్రేడింగ్ షురూ.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ముహూరత్ ట్రేడింగ్ను పురస్కరించుకొని లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:50 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు పుంజుకుని 84,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.73బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 60.79 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.96 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.07 శాతం పెరిగింది.నాస్డాక్ 1.37 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టపాసులా పేలిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సెలవున్నా స్టాక్ మార్కెట్లు పని చేస్తాయ్!
స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 21న లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మార్కెట్లకు సెలవు. అయినా మధ్యాహ్నం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు.ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ ఎక్స్పర్ట్లు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్ 22న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణంముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుఅక్టోబర్ 21 మధ్యాహ్నం 1:45కు మార్కెట్ ఓపెన్ అవుతుంది.మధ్యాహ్నం 2:45కు ముగుస్తుంది.అక్టోబర్ 22న బలిప్రతిపద సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు. -
పసిడి ప్రియులకు ‘పండుగ’.. మళ్లీ తగ్గిన బంగారం
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించిన బంగారం ధరలు దీపావళి (Diwali) రోజున కూడా ఊరట కలిగించాయి. వెండి ధరలు (Silver Price) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దలాల్ స్ట్రీట్లో టపాసుల్లా పేలాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు అర శాతానికి పైగా ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 661 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 84,614 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 సూచీ 191 పాయింట్లు లేదా 0.74 శాతం పెరిగి 25,901 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బాన్, బజాజ్ ట్విన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే క్యూ 2 ఫలితాల తరువాత పెట్టుబడిదారులు స్టాక్ లో లాభాలను బుక్ చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం స్టాక్స్ కూడా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. ఇతర రంగాల సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం దాకా పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి. ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు. సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది. పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది. సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి. వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి. -
క్యూ2 ఫలితాల ఎఫెక్ట్
దీపావళి సందర్భంగా మంగళవారం(21) నిర్వహించనున్న మూరత్ ట్రేడింగ్ను మినహాయిస్తే ఈ వారం మార్కెట్లు మూడు రోజులే పనిచేయనున్నాయి. అయితే క్యూ2 ఫలితాలతోపాటు పలు అంశాలు మార్కెట్లను నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాంతాన మార్కెట్లు ముగిశాక డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్(ఆర్ఐఎల్)సహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై–సెపె్టంబర్ ఫలితాలు ప్రకటించాయి. దీంతో నేడు(20న) ఈ కౌంటర్లు యాక్టివ్గా ట్రేడ్కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఈ వారం హిందుస్తాన్ యూనిలీవర్, కాల్గేట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోఫోర్జ్, ఐటీసీ హోటల్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఫలితాల ప్రభావంతో ట్రెండ్ నిర్దేశితంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కార్పొరేట్ ఫలితాల సీజన్కు దారి చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. సంవత్ 2082 షురూ స్టాక్ మార్కెట్లలో మంగళవారం కొత్త ఏడాది సంవత్ 2082 ప్రారంభంకానుంది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకూ ప్రత్యేక(ముహూరత్) ట్రేడింగ్ను నిర్వహించనున్నాయి. మరుసటి రోజు(22న) బలిప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఆపై గురు, శుక్రవారాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఫలితాలు, పండుగ జోష్ సంవత్ 2082 తొలి రోజు సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. గణాంకాలు.. దేశీయంగా 21న సెపె్టంబర్ నెలకు మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. 2025 ఆగస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔట్పుట్ 6.3 శాతం ఎగసింది. ఇది 13 నెలల గరిష్టంకాగా.. కోల్, స్టీల్, సిమెంట్ తదితరాలు ఇందుకు సహకరించాయి. ఇక 24న అక్టోబర్ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. తయారీ పీఎంఐ సెపె్టంబర్లో 57.7కు నీరసించగా.. ఆగస్ట్లో 59.3కు బలపడింది. అంతర్జాతీయ అంశాలు చైనాపై యూఎస్ విధించిన తాజా టారిఫ్లు, వీటిపై చైనా స్పందనతోపాటు.. పరిష్కారం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు తెలియజేశారు. యూఎస్, చైనా మధ్య వాణిజ్య ఆందోళనలకు తెరపడితే సెంటిమెంటు పుంజుకోవచ్చని గౌర్ అభిప్రాయపడ్డారు. జూలై–సెపె్టంబర్కు చైనా జీడీపీ గణాంకాలు 20న విడుదలకానున్నాయి. ఏప్రిల్–జూన్లో 5.2 శాతం వృద్ధి చూపింది. 23న యూఎస్ సెపె్టంబర్ గృహ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. 24న యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇవికాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తీరు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మిశ్రా, గౌర్ పేర్కొన్నారు.కొనుగోళ్లకు ఎఫ్పీఐలు సై ఈ నెలలో రూ. 6,480 కోట్లు గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్పట్ల విముఖత చూపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అక్టోబర్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టపడటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల 1–17 మధ్య రూ. 6,480 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం సెపె్టంబర్లో రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఆగస్ట్లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.గత వారమిలా..13–17 మధ్య ముగిసిన గత వారం వరుసగా మూడోసారి దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,625 పాయింట్లు(2 శాతం) ఎగసి 83,952 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 483 పాయింట్లు(2 శాతం) బలపడి 25,710 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు స్వల్పంగా 0.2 శాతం పుంజుకున్నాయి. -
పసిడి పైపైకే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో పసిడి, వెండి ధరలు రాకెట్లలాగా దూసుకెళ్తున్నాయి. గత దీపావళి నుంచి చూస్తే పసిడి దాదాపు 63 శాతం, వెండి అంతకు మించి 72 శాతం స్థాయిలో రాబడులిచ్చాయి. గత పదేళ్ల వ్యవధిలో రెండు దీపావళి పండుగల మధ్య మూడేళ్లు మినహా ఏడు సందర్భాల్లో ఈ రెండూ సానుకూల రాబడులనే ఇచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్లో కూడా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ షాపింగ్ను కొనసాగిస్తాయని అంచనాలు ఉన్నాయి. 2026 దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో 4,500–5,000 డాలర్లకు చేరొచ్చని, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.1,40,000 – రూ.1,50,000 స్థాయికి చేరొచ్చని నిపుణులు తెలిపారు. అటు వెండి సైతం అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 60–70 డాలర్లకు, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 1,80,000 – రూ. 2,00,000కు చేరొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశి్చతులు తగ్గితే తప్ప, సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి ర్యాలీ ఇకపైనా కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. రిస్క్ ప్రొఫైల్ని బట్టి పోర్ట్ఫోలియోల్లో కనీసం 10 శాతం వాటాని పసిడి, వెండికి కేటాయించాలని పేర్కొన్నారు. -
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్లో మాత్రం కన్సాలిడేషన్కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్ఫోలియో, లోన్ బుక్లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్కేర్తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్మెంట్ లెవెల్కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్హెచ్పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్హెచ్పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెరిగిన యస్ బ్యాంక్ లాభం: రూ. 654 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం రూ. 654 కోట్లకు చేరింది. గత క్యూ2లో నమోదైన రూ. 553 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. ఇక లోన్బుక్ 6.4 శాతం వృద్ధి చెందడంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం మెరుగుపడి 4.6 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 16.9 శాతం పెరిగి రూ. 1,644 కోట్లుగా నమోదైంది.తాజా స్లిప్పేజీలు అంతక్రితం త్రైమాసికంలో ఉన్న రూ. 1,458 కోట్ల నుంచి రూ. 1,248 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి పెద్దగా మార్పు లేకుండా 1.6 శాతం స్థాయిలో కొనసాగుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం స్థాయి రుణ వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఇకనుంచి నికర వడ్డీ మార్జిన్లు మరింత మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. జపాన్ దిగ్గజం ఎస్ఎంబీసీ 24 శాతం పైగా వాటాను కొనుగోలు చేసినప్పటికీ, తక్షణమే వ్యాపార ప్రణాళికల్లో మార్పులేమీ ఉండబోవని కుమార్ వివరించారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్దేశించే వార్షిక సర్వసభ్య సమావేశం యథా ప్రకారంగానే జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 80 శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. -
ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?
ఈ ఏడాది ధంతేరస్ (ధనత్రయోదశి) సందర్భంగా భారతీయ వినియోగదారులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వ్యాపారుల సంఘం శనివారం తెలిపింది. బంగారం, వెండి ధరలు బాగా పెరిగినప్పటికీ.. సుమారు 60,000 కోట్ల రూపాయలు వీటికోసం ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ.బంగారం ధరలు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60 శాతం పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. ధరలు పెరిగినప్పటికీ.. సెంటిమెంట్, డిమాండ్ రెండూ కలిసొచ్చాయని సీఏఐటీ ఆభరణాల విభాగం, ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లలో మాత్రమే రూ. 10,000 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయని ఆయన అన్నారు.ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ కారణంగా ప్రతిఏటా ఈ పండుగల సమయంలో బంగారం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగి.. కేజీ వెండి రేటు సుమారు రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రేటు ఇందుకు ముందు ఏడాదితో పోలిస్తే.. 55 శాతం ఎక్కువ.బంగారం, వెండి అమ్మకాలు కాకుండా.. వంట సామాగ్రి అమ్మకాలు రూ.15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు రూ.10,000 కోట్లు, అలంకరణ.. మతపరమైన వస్తువుల అమ్మకాలు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని వ్యాపారుల సంఘం తెలిపింది.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్ధన్తేరస్ కొనుగోలు పెరుగులపై.. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ రేట్లలో తగ్గింపులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందించడం వల్ల పండుగల సమయంలో వ్యాపారాలు పెరగడానికి దోహదపడ్డాయని అన్నారు. సాంప్రదాయ మార్కెట్లు, స్థానిక ఆభరణాల స్టోర్స్.. రిటైల్ దుకాణాలు రికార్డు స్థాయిలో కస్టమర్ల రద్దీని నమోదు చేశాయని పేర్కొన్నారు. -
సామాన్యులు కన్నెత్తి చూడలేని స్థితిలో బంగారం
బంగారం ధరలు స్టాక్ మార్కెట్తో పోటీపడుతూ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో కొనుగోళ్లు లేక బంగారం వ్యాపారస్తులు డీలా పడుతున్నారు. శనివారం ధనత్రయోదశి నాడైనా వ్యాపారం కళకళలాడుతుందని బంగారు దుకాణాల యజమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.వన్టౌన్(విజయవాడ): భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం. ఏ శుభకార్యం ఉన్నా బంగారం ప్రస్తావన లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. ప్రజలు వారివారి స్థాయిలో ఎంతో కొంత బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. అయితే గడిచిన కొన్ని మాసాలుగా బంగారం ధర ఊహించని స్థాయిలో పెరుగుతుండడంతో ఆ ప్రభావం వ్యాపారంపై పడింది. తత్ఫలితంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వందలాది బంగారు దుకాణాల్లో వ్యాపారం దారుణంగా పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. రెండేళ్లలో రెట్టింపైన ధర.. దేశంలోనే విజయవాడ బంగారం విక్రయాలకు చాలా ముఖ్యమైన ప్రాంతంగా వ్యాపారులు చెబుతారు. ఇక్కడ వ్యాపారులు, బంగారం ఆభరణాలు చేసే కారి్మకుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇక్కడ బంగారం ధరలో మార్పులు ఆయా వర్గాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. విజయవాడలో 2023 అక్టోబర్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.60వేలు ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,450గా ఉంది. తాజాగా శుక్రవారం అదే 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ. 1,35,000 కాగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,21,700గా ఉంది. గడిచిన వారం రోజు లుగా బంగారం పరుగులు పెడుతూనే ఉంది. కొద్దిగా తడబడినా పరుగులు కొనసాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో దిగజారిన వ్యాపారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతి రోజూ 150 నుంచి 200 కిలోల బంగారం వ్యాపారం జరుగుతుందని అంచనా. విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో బంగారు ఆభరణాల విక్రేతలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలుగా ఉన్న దుకాణాలు సుమారుగా 30 నుంచి 40 వరకూ పని చేస్తున్నాయి. ఇవి కాకుండా విజయవాడ పాతబస్తీ, రాజగోపాలాచారివీధి, గవర్నరుపేట, సత్యనారా యణపురం, పటమట, బందరురోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారుగా 800 నుంచి వెయ్యి వరకూ దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో మూడు నుంచి నాలుగు వందల వరకూ దుకాణాలు ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1300 నుంచి 1500 దుకాణాల్లో వ్యాపారం జరుగుతోంది. మామూలు కొనుగోలు దారులు కాకుండా సుమారు 20 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు కూడా భారీగానే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. విజయవాడ నగరంలోని కార్పొరేట్, కొన్ని సంప్రదాయ దుకాణాల్లోనే 80 శాతం వ్యాపారం జరిగితే మిగిలిన దుకాణాల్లో పది నుంచి 20 శాతం వ్యాపారం జరుగుతుందని సంఘ నేతలు చెబుతున్నారు. అయితే గడిచిన కొద్ది మాసాలుగా వ్యాపారం భారీగా దిగజారిందని, పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ సగానికి పైగా పడిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహాల సీజన్ ఉన్నా వ్యాపారం జరగకపోవటంపై వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నా...నగరంలోని పలు కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నా వ్యాపారం జరగటం లేదని చెబుతున్నారు. ప్రధానంగా గ్రాముకు వాల్యూ యాడెడ్ చార్జీలు 10 నుంచి 30 శాతం వరకూ ఆయా ఆభరణాల రకా లను బట్టి వ్యాపారులు విధిస్తారు. అంటే గ్రాము 12 వేలు ఉంటే అత్యధికంగా రూ.3,600 వరకూ వీఏ పేరుతో చార్జీలను వ్యాపారులు వసూలు చేస్తారు. ఇది కాకుండా జీఎస్టీ ఉంటుంది. అయి తే తాజాగా వ్యాపారులు చాలా వరకూ ఈ వీఏ పేరుతో వసూలు చేసే చార్జీలను కొంతమంది సగానికి తగ్గించగా, మరికొంతమంది ఇంకా తగ్గించి ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది వ్యాపారులు గ్రాముకు వంద నుంచి రూ.500 వరకూ తగ్గింపు ఇస్తామని ప్రకటిస్తున్నా.. వ్యాపారం జరగటం లేదని వాపోతున్నారు. ధనత్రయోదశి సెంటిమెంట్ అయినా ఫలిస్తుందా.. బంగారం వ్యాపారులు ధనత్రయోదశిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 18వ తేదీన ధనత్రయోదశి తిథి ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ క్రమంలో గడిచిన దశాబ్ద కాలంగా బంగారం విక్రయాలు ధనత్రయోదశి రోజున నగరంలో భారీగా జరుగుతున్నాయి. వ్యాపారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పెద్ద దుకాణాలు ఎలా ఉన్నా చిన్న వ్యాపారులు ధనత్రయోదశి రోజున ఎంతోకొంత వ్యాపారం పెరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.వ్యాపారం దారుణంగా పడిపోయింది బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో వ్యాపారం భారీగా దిగజారిపోయింది. అసలే కార్పొరేట్ దుకాణాల తాకిడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ వ్యాపారులకు ఈ ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. బంగారం ధరల పెరుగుదలతో చాలా దుకాణాల్లో రోజుల తరబడి బోణీ సైతం కాని పరిస్థితులు ఉన్నాయి. ధనత్రయోదశి, దీపావళి పండుగలను పురస్కరించుకుని అయినా వ్యాపారాలు కోలుకుంటాయని ఆశగా ఎదురు చూస్తున్నాం. – కోన శ్రీహరి సత్యనారాయణ, అధ్యక్షుడు, ది బెజవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ -
బంగారం, వెండి కొనేవాళ్లకు ‘పండగే’
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు (Silver Price) కూడా భారీగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.దిద్దుబాటు వస్తే..అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఆస్తుల వైవిధ్యం అవసరంశ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. -
స్టాక్ మార్కెట్ వరుస సెలవులు.. సోమవారం ట్రేడింగ్ ఉంటుందా?
దేశీయ స్టాక్మార్కెట్కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ అక్టోబరు 22 - బలిప్రతిపాద నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్ డిసెంబర్ 25 - క్రిస్మస్ -
స్టాక్ మార్కెట్.. హాట్రిక్ హిట్!
భారత ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఈ సెషన్ లో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీపావళికి ముందు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడు రోజులు లాభాలను అందుకున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 484.53 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 83,952.19 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 124.55 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,709.85 వద్ద స్థిరపడ్డాయి.బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, హెచ్యూఎల్ టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, హెచ్ఎల్టెక్, ఎటర్నల్, టాటా స్టీల్ టాప్ లూజర్లలో ఉన్నాయి.రంగాలవారీగా నిఫ్టీ ఎఫ్ఎంసిజి 1.37 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ 1.63 శాతం, మీడియా 1.56 శాతం నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.57 శాతం, 0.05 శాతం నష్టపోయాయి. -
తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!
ధనత్రయోదశి, దీపావళి ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. చాలామంది ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడతారు. గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజూ కొత్త గరిష్టాలను చేరుకుంటున్న.. బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు 4,300 డాలర్ల కంటే ఎక్కువకు చేరి.. కొత్త గరిష్టాన్ని తాకింది. ఐదేళ్లల్లో ఈ ధరలు ఆల్టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది. వెండి ధర ఔన్సుకు 54 డాలర్లు దాటి.. 1980 తరువాత జీవితకాల గరిష్టాలను చేరుకుంది. భారతదేశంలో.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.31 లక్షలు దాటేసింది. వెండి రేటు ఏకంగా రూ. 2 లక్షలు దాటేసింది.ధరలు పెరగడానికి కారణాలుప్రపంచ ఉద్రిక్తతల మధ్య సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చుట్టూ ఉన్న భయాలు, అమెరికా & చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాదాలు.. ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి సంకేతాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వైపు నెట్టాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.'బంగారం 4,300 డాలర్లు దాటడం మనం చూడటం ఇదే మొదటిసారి' అని ఒక వస్తువు వ్యాపారి పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ఈ ర్యాలీ కొనసాగుతోందని అన్నారు. ఈ వారం వెండి పెరుగుదల కూడా భారీగానే ఉంది. ఔన్సు 54 డాలర్లు దాటేసింది. నాలుగు దశాబ్దాల తరువాత ధరలు కొత్త రికార్డులను చేరుకున్నాయని అన్నారు.ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యష్ సెడాని, పెరుగుతున్న ధరల గురించి స్పందిస్తూ.. బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. దీనికి కారణం పారిశ్రామిక డిమాండ్ అని తెలుస్తోంది. బంగారంతో పోలిస్తే.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, కొనసాగుతున్న సైనిక సంఘర్షణలు అనిశ్చితిని గణనీయంగా పెంచాయి. దీనివల్ల బ్యాంకులు & పెట్టుబడిదారులు బంగారం.. వెండిని సురక్షితమైన ఆస్తులుగా మార్చడానికి ప్రేరేపించబడ్డాయి. వడ్డీ రేటులో కదలికలు.. కేంద్ర బ్యాంకు చర్యలు కూడా ధరలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాయి.ఇదీ చదవండి: బంగారం కొనగలమా!.. రాకెట్లా దూసుకెళ్లిన రేటుధన్తేరాస్ & దీపావళి పండుగల సమయంలో బంగారం కొనుగోలును సంప్రదాయంగా భావించి.. ఎక్కువమంది గోల్డ్ కొంటారు. ఇది డిమాండును అమాంతం పెంచేస్తోంది. అయితే పండుగల తరువాత.. ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చూచిస్తున్నారు. అయితే దీపావళి నాటికి మరింత రేటు పెరిగే అవకాశం ఉందని కేడియా అడ్వైజరీ ఎండీ & డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. -
నాలుగు నెలల గరిష్టాన్ని చేరిన నిఫ్టీ!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడు రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ర్యాలీలో కీలక సూచీ నిఫ్టీ నాలుగు నెలల్లో ఎప్పుడు లేనంతగా పెరిగింది. ఈరోజు (అక్టోబర్ 17, 2025, శుక్రవారం) మధ్యాహ్నం 12:21 గంటల సమయానికి నిఫ్టీ సూచీ 25,770 స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది జూన్లో వెళ్లిన 25,650 మార్కును దాటడం గమనార్హం. ఈ పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తే...మార్కెట్ పెరుగుదలకు దోహదపడిన కీలక అంశాలువిదేశీ సంస్థాగత మదుపర్ల (FIIలు) కొనుగోళ్లు: భారత మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపర్ల విశ్వాసం మరింత పెరిగింది. గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో FIIలు నికర కొనుగోలుదారులుగా ఉండటం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమైంది. భారత్ ఆర్థిక వృద్ధి సామర్థ్యం, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులపై నమ్మకంతో వారు పెట్టుబడులు పెడుతున్నారు.ద్రవ్యోల్బణం అంచనాల ఉపశమనం: ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుతాయనే ఆశాభావం పెరిగింది. ముఖ్యంగా ముడి చమురు ధరల్లో (క్రూడాయిల్) కొంత స్థిరత్వం లేదా తగ్గుదల ధోరణి కనిపించడం భారత్కు సానుకూలంగా మారింది. ముడి చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందనే అంచనాలు మదుపర్లలో కొనుగోలు ఆసక్తిని పెంచాయి.పటిష్టమైన దేశీయ ఆర్థికాంశాలు: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు పటిష్టంగా ఉండటం, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు మెరుగ్గా ఉండటం మార్కెట్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి.మొత్తంమీద బలమైన అంతర్జాతీయ సంకేతాలు, FIIల విశ్వాసం, ద్రవ్యోల్బణంపై ఉపశమనం, పటిష్టమైన కార్పొరేట్ పనితీరు వంటి అంశాలు కలిసి నిఫ్టీని చాలా రోజుల తర్వాత 25,770 మార్కుకు చేర్చాయి. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వంటి అంశాలపై మార్కెట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి బుల్లిష్ (లాభాల) ధోరణి కొనసాగుతున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
బంగారం కొనగలమా!.. రాకెట్లా దూసుకెళ్లిన రేటు
ధనత్రయోదశి ముందు రోజు.. భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు (అక్టోబర్ 17) గరిష్టంగా రూ. 3330 పెరిగి.. పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన కలిగించింది. అయితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 32 పాయింట్లు పెరిగి 25,619కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పుంజుకుని 83,580 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమీర్ చంద్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్పోర్ట్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా హర్యానా కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్లో సెబీకి దరఖాస్తు చేసిన కంపెనీ తాజాగా అనుమతి పొందింది. ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఏరోప్లేన్ బ్రాండు కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం ప్రాసెసింగ్తోపాటు ఎగుమతులు చేపడుతోంది. దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు కేఆర్బీఎల్, ఎల్టీ ఫుడ్స్సహా సర్వేశ్వర్ ఫుడ్స్ తదితరాలతో పోటీ పడుతోంది. 2024 డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో రూ. 1,421 కోట్ల ఆదాయం, రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
సెబీకి డ్యూరోఫ్లెక్స్ ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: మ్యాట్రెస్ల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్ తమ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. దీని ప్రకారం రూ. 183.6 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్తగా 120 స్టోర్స్ (కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ – కోకో) ప్రారంభించేందుకు, ప్రస్తుత స్టోర్స్.. తయారీ ప్లాంటు లీజులు–అద్దెలు చెల్లించేందుకు, మార్కెటింగ్ వ్యయాలు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 1963లో ప్రారంభమైన డ్యూరోఫ్లెక్స్, మార్కెట్ వాటాపరంగా దేశీయంగా టాప్ 3 మ్యాట్రెస్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్యూరోఫ్లెక్స్, స్లీపీహెడ్ బ్రాండ్స్ పేరిట మ్యాట్రెస్లు, సోఫాలు, ఇతరత్రా ఫర్నిచర్లు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 73 కోకో స్టోర్స్, 5,500 పైగా జనరల్ ట్రేడ్ స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,057 కోట్లుగా ఉన్న ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,134 కోట్లకు చేరింది. -
'అప్పటికి బంగారం ధరలు భారీగా పడిపోతాయ్'
ప్రస్తుతం బంగారం ధరలు(Gold price) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది పుత్తడి ధరలు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2026 ద్వితీయార్థంలో బంగారం ధర గణనీయంగా తగ్గే అవకాశముందని ఏఎన్జెడ్ (ANZ) బ్యాంక్ అంచనా వేసింది.ప్రస్తుత బంగారం ధరల పరిస్థితిస్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు 0.4 శాతం పెరిగి 4,224.79 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ (డిసెంబర్ డెలివరీ) 0.9 శాతం పెరిగి 4,239.70 డాలర్లకు చేరుకుంది. భారత్లో ప్రస్తుతం (అక్టోబర్ 16) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,590 వద్ద ఉంది.అనిశ్చిత భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ఒడిదుడుకులు, యూఎస్ డాలర్ బలహీనత, వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు అన్నీ కలిపి బంగారం ధరను ప్రస్తుతం ఆల్టైమ్ హై స్థాయికి చేర్చాయని నిపుణులు పేర్కొన్నారు.ఏఎన్జెడ్ అంచనాతక్కువ వడ్డీ రేటు వాతావరణంలో బాగా పనిచేసే అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా కనిపించే బంగారం ఇప్పటి వరకు 61 శాతం పెరిగింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పడిపోయి ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకుంది.ఏఎన్జెడ్ అంచనా ప్రకారం (Gold price prediction).. బంగారం ధరలు ఇదే విధంగా పెరిగి 2026 మొదటి ఆరు నెలలు శిఖరానికి చేరుకుంటాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర ఔన్స్కు 4,400 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది రెండో భాగంలో ధరలు పడిపోవొచ్చని ఏఎన్జెడ్ అంచనా వేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్వెండి కూడా..2026 మధ్య నాటికి వెండి (Silver price) ఔన్స్ కు 57.50 డాలర్లకు చేరుకుంటుందని ఏఎన్జెడ్ బ్యాంక్ అంచనా వేసింది. ఏదేమైనా, హాకిష్ ఫెడ్ వైఖరి, ఊహించిన దానికంటే బలమైన యూఎస్ ఆర్థిక వృద్ధి ప్రతికూల ప్రమాదాలను కలిగిస్తుందని ఏఎన్జెడ్ హెచ్చరించింది.(Disclaimer: బంగారం, వెండి గురించి నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. కొనుగోలుదారులకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు వరుస లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఎగిశాయి. కొనసాగుతున్న క్యూ2 ఫలితాల సీజన్ లో స్టాక్-నిర్దిష్ట చర్యల మధ్య వరుసగా రెండవ సెషన్ లోనూ లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 862.23 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 83,467.66 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 261.75 పాయింట్లు లేదా 1.03 శాతం పెరిగి 25,585.3 వద్ద ముగిశాయి.బీఎస్ఈలో టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, ఎటర్నల్ (జొమాటో) మాత్రమే వెనుకబడి ఉన్నాయి.రంగాలవారీగా అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసిజి 2.02 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో, బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.46 శాతం, 0.24 శాతం పెరిగాయి. -
పెరిగిన బంగారం, వెండి దిగుమతులు
అంతర్జాతీయంగా వాణిజ్య అనిషితుల్లోనూ దేశ ఎగుమతుల రంగం పనిష్ట పనితీరు చూపించింది. సెప్టెంబర్లో ఎగుమతులు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.74 శాతం అధికంగా 36.38 బిలియన్ డాలర్ల (3.20 లక్షల కోట్లు) విలువ మేర ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం 16.6 శాతం పెరిగి 68.53 బిలియన్ డాలర్లు(రూ.6.03 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు సెప్టెంబర్ నెలకు మరింత విస్తరించి 31.15 బిలియన్ డాలర్లు(రూ.2.74 లక్షల కోట్లు)గా నమోదైంది. 2024 సెప్టెంబర్ నెలలో దిగుమతులు 58.74 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర వాణిజ్య శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.ప్రధానంగా బంగారం, వెండి, ఎరువుల దిగుమతులు పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 3 శాతం పెరిగి 220 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 4.53 శాతం పెరిగి 375.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 155 బిలియన్ డాలర్లకు విస్తరించింది.అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మెరుగైన పనితీరుకు కారణం ఏంటన్న మీడియా ప్రశ్నకు దేశీ పరిశ్రమ బలంగా ఉందంటూ.. తమ సరఫరా వ్యవస్థలను, వ్యాపార సంబంధాలను మెరుగ్గా కొనసాగించినట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్ల ప్రభావంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దీన్ని తెలుసుకునేందుకు కమోడిటీ వారీగా డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమెరికాకు మొత్తం ఎగుమతుల్లో 45 శాతానికి టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
రూ.1000 తగ్గిన వెండి, అక్కడ మాత్రం పెరిగిన బంగారం!
అక్టోబర్ ప్రారంభం నుంచి దాదాపు పెరుగుతూ ఉన్న ధరలు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెండి ధర మాత్రం రూ. 1000 తగ్గింది. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోని గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో పసిడి కొత్త ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 322.86 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 82,928.29 వద్ద, నిఫ్టీ 80.90 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 25,404.45 వద్ద సాగుతున్నాయి.గుజరాత్ రఫియా ఇండస్ట్రీస్, మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, హుహ్తమాకి ఇండియా, ఉమియా బిల్డ్కాన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. కేఈఐ ఇండస్ట్రీస్, సెమాక్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, వీ విన్ లిమిటెడ్, లక్ష్మీ గోల్డోర్నా హౌస్, రీజెన్సీ సెరామిక్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం @ 1,31,800
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో పసిడి ధరలు మరో సరికొత్త రికార్డును సృష్టించాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి బుధవారం మరో రూ.1,000 పెరిగి రూ.1,31,800 (పన్నులు సహా) స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కాస్తంత దిగొచ్చింది. కిలోకి రూ.3,000 తగ్గి రూ.1,82,000 (పన్నులు సహా) వద్ద స్థిరపడింది. మంగళవారం వెండి కిలోకి రూ.6,000 పెరిగి ఆల్టైమ్ గరిష్ట ధర రూ.1,85,000ను నమోదు చేయడం తెలిసిందే. పండుగల సీజన్ కావడంతో రిటైలర్లు, జ్యుయలర్ల కొనుగోళ్లతో పసిడి ధరలు పెరిగినట్టు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా బలమైన ర్యాలీ, దేశీయంగా భౌతిక బంగారం కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ తోడవడంతో బంగారం ధర మరో నూతన రికార్డు గరిష్టానికి చేరింది. రూపాయి బలపడడం ధరల ర్యాలీకి కీలక అవరోధంగా వ్యవహరించింది. దీంతో దేశీ మార్కెట్లో ధరల పెరుగుదల పరిమితమైంది. మొత్తం మీద బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. పండుగల కొనుగోళ్లతో ఇదే ధోరణి కొనసాగుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. -
నష్టాలకు బ్రేక్ లాభాల్లో మార్కెట్లు
రెండు రోజుల వరుస నష్టాల అనంతరం దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ప్రపంచ ఆశావాదం, ముడి చమురు ధరల తగ్గుదల కారణంగా భారతీయ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పుంజుకుని లాభాలలో స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 575.45 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 82,605.43 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 178.05 పాయింట్లు లేదా 0.71 శాతం ఎగిసి 25,323.55 వద్ద ముగిసింది.బీఎస్ఈలో బజాజ్ ట్విన్స్, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్ (జొమాటో) టాప్ గెయినర్స్ లో ఉండగా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ 3.04 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ 1.67 శాతం, నిఫ్టీ మెటల్ 1 శాతం లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 1.11 శాతం, 0.82 శాతం లాభపడ్డాయి. -
‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా పసిడి, వెండి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న ధన త్రయోదశికి ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: యూఏఈలో 6జీ కనెక్టివిటీ టెస్ట్ విజయవంతం(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
340 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:22 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు పెరిగి 25,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 345 పాయింట్లు పుంజుకుని 82,378 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఓ మై గోల్డ్!
కాకినాడకు చెందిన శ్రీనివాస్ వచ్చే ఏడాది తన కుమార్తె పెళ్లి కోసం అప్పోసప్పో చేసి బంగారం కొందామనుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో రేటు దాదాపు రూ.78,000 స్థాయిలో ఉండగా గోల్డ్ షాప్నకు వెళ్లి కూడా కాస్త తగ్గితే కొందామనుకొని వెనక్కి వచ్చేశాడు. అంతే అక్కడి నుంచి కనకం పూనకం వచ్చినట్లు పెరుగుతూనే ఉంది. దీంతో చేసేదేమీ లేక ఈమధ్యే రూ.1,20,000 రేటుతో మూడు తులాలు కొన్నాడు. విచిత్రమేంటంటే ఆర్నెల్ల క్రితం అదే సొమ్ముకు అయిదు తులాలు వచ్చేది! అరెరే ఎంత తప్పు చేశానే.. అంటూ ఇప్పుడు ఆవేదన చెందుతున్నాడు.ఇక హైదరాబాద్వాసి నగేష్ కష్టాలు వేరు. వచ్చే నెలలో బాగా దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది. రెండేళ్ల క్రితం కుమారుడి పెళ్లిలో వారు తులం గోల్డ్ చైన్ చదివించారు. అప్పుడు రేటు 60,000. ఇప్పుడు పెళ్లిలో వాళ్లు పెట్టినంతైనా తిరిగి చదివించాలి.. లేదంటే పరువు పోతుంది. కొనాలంటే రూ.1.3 లక్షల పైమాటే. దీంతో రేటు తగ్గుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. పుత్తడి మాత్రం తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సాక్షి, బిజినెస్డెస్క్: సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో బంగారం ఇప్పుడు పెద్ద గుదిబండగా మారిందనేందుకు ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. నాన్స్టాప్ ర్యాలీతో పసిడి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడాది క్రితం రూ.78,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల (తులం) బంగారం రేటు తాజాగా రూ.1.3 లక్షలకు చేరి ‘నగ’ధగలాడిపోతోంది. రోజుకో కొత్త శిఖరాలకు దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లకు ఇది కనకవర్షం కురిపిస్తున్నప్పటికీ... తులమో పలమో కొందామనుకునే సామాన్యులకు మాత్రం దిక్కుతోచని పరిస్థితి. ఈ ఏడాది ఇప్పటిదాకా దేశీయంగా పసిడి ధర (Gold rate) 67 శాతం ఎగబాకింది. బంగారం రేటు రెండేళ్లలో రెట్టింపైతే... వెండి ఏడాదిలోపే డ‘బుల్‘ర్యాలీ చేయడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో కేజీ వెండి ధర రూ.89,000 కాగా, ఇప్పుడు ఏకంగా రూ.1.85 లక్షలకు చేరింది. అంటే ఏకంగా 107 శాతం ఎగబాకిందన్న మాట! ఇదిలా ఉంటే, మరో మూడు నెలల పాటు పెళ్లిళ్ల బాజా మోగనుండటం... కొనుగోలుదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ధరాభారంతో వివాహాలు, ఇతర శుభకార్యాల ఖర్చుల తడిసిమోపెడవుతాయంటూ ఆందోళన చెందుతున్నారు. ‘మధ్యతరగతి కుటుంబాలకు బంగారం అందని ద్రాక్షలా మారింది. ఈ ఏడాది పసిడి రేటు అమాంతం లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. కూతురు పెళ్లి కోసం నాలుగు తులాల బంగారం పెడదామనుకుంటే ఇప్పుడున్న రేటుతో తులంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది’అని కాజీపేటకు చెందిన మనమ్మ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే బస్సు మిస్సయ్యామన్న ఆత్రుత... ఇంకెంత పెరిగిపోతుందోనన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెట్టుపోతలు... గుదిబండ గృహ ప్రవేశాలు, వోణీ పంక్షన్లు, బారసాలలు ఇలా ఏ శుభకార్యమైన ఎంతో కొంత బంగారం, వెండి గిఫ్టుల వంటి పెట్టుపోతలు కామన్. గోల్డ్, సిల్వర్ జోడు గుర్రాల్లా దూసుకుపోతుండటంతో చాలా వరకు పంక్షన్లలో ఇప్పుడు వీటి ఊసే ఎత్తలేని పరిస్థితి. పావు తులం కొనాలన్నా కనీసం రూ. 35 వేలకు తక్కువ అవ్వడం లేదు. దీంతో చాలా మంది ఐదు.. పది.. పాతిక వేలు చదివించి ‘మమ‘అనిపించుకుంటున్నారు. గతంలో తమ బంధువులు పెట్టినంతగా చదివించకపోతే నలుగురిలో మాట వస్తుందన్న భయం ఒకపక్క,.. పోనీ పెడదామంటే ఆర్థికంగా ఇబ్బంది మరోపక్క మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘మా పెద్ద అమ్మాయికి దగ్గరి బంధువులు బంగారం, వెండి వస్తువులను చదివించారు. ఇప్పుడు వారి ఇళ్లలో ఫంక్షన్ అయితే అంతే బంగారం, వెండి ఆభరణాలను చేయించలేకపోతున్నాం. అందుకే వారు పెట్టిన వస్తువులకు ఖరీదు చేసి నగదును కట్నంగా చదివిస్తున్నాం‘అని హనుమకొండకు చెందిన కత్తుల కవిత వాపోయారు. ఇదిలా ఉంటే, చిన్నాచితకా బంగారం షాపులపైగా రేటు ప్రభావం తీవ్రంగా ఉంది. ధర అమాంతం పెరిగిపోవడంతో కొనుగోళ్లు పడిపోయాయని, బిజినెస్ అంతగా నడవడం లేదని గోల్డ్ షాపుల వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. గోల్డెన్ ర్యాలీ ఎందుకంటే... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన టారిఫ్ వార్తో ప్రంపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలతో అప్పటికే ఎగబాకిన రేట్లకు వాణిజ్య యుద్ధం మరింత ఆజ్యం పోసింది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు అందరూ పరుగులు తీస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,600 డాలర్లు ఉండగా.. అంతకంతకూ పెరుగుతూ తాజాగా 4,190 డాలర్ల ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. అంటే 10 నెలల్లో 61 శాతం జంప్ చేసింది. తాజాగా అమెరికా–చైనా మధ్య టారిఫ్ యుద్ధం మరింత తీవ్రం కావడంతో బంగారం భగభగలాడిపోతోంది. మరోపక్క, గత కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి.. భూగర్భ నిల్వలు అడుగంటుతున్నాయి. ఆభరణాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతో పాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సగటున ఏటా 800 టన్నులు కొనడం గమనార్హం. మన ఆర్బీఐ వద్ద కూడా పసిడి నిల్వలు 880 టన్నులకు ఎగబాకాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్ రన్కు ప్రధాన కారణం. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. సెపె్టంబర్ చివరి నాటికి ప్రపంచ గోల్డ్ ఈటీఎఫ్ల విలువ 472 బిలియన్ డాలర్లకు ఎగబాకడం పెట్టుబడుల జోరుకు నిదర్శనం. మరోపక్క, వడ్డీరేట్లను తగ్గించాలంటూ ట్రంప్ పోరు పెడుతుండటంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు సై అంది. ఏడాది కాలంలో ఫెడ్ రేటును 1 శాతం పైగా తగ్గించే అవకాశం ఉండటం కూడా బంగార ధరలకు మరింత బూస్ట్ ఇస్తోంది. రూపాయి వాత! అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు మోతమోగిస్తుండటే.. దేశీయంగా అంతకుమించి రూపాయి వాత పెడుతోంది. డాలరుతో రూపాయి విలువ అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరను దేశీయంగా మరింత ఎగదోస్తోంది. మూడేళ్ల క్రితం డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండగా... ఇప్పుడు ఏకంగా 88.82 ఆల్టైమ్ కనిష్టాలకు జారిపోయింది. అంటే రూపాయి పతనం దెబ్బకు మనం మరో రూ.10,000 అధనంగా చెల్లించుకోవాల్సి వస్తోందన్నమాట! ఈ పరుగు ఎందాకా..? ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఆర్థిక అనిశ్చితులకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. టారిఫ్ వార్కు తోడు ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న భయాలు అటు మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే.. డాలరు మరింత బలహీన పడే అవకాశాలున్నాయని, ఇది బంగారం మరింత పెరిగేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్మన్ శాక్స్ వచ్చే ఏడాది చివరికి గోల్డ్ అంచనాలను ఇప్పుడున్న 4,300 డాలర్ల నుంచి ఏకంగా 4,900 డాలర్లకు పెంచింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 అంచనా 5,000 డాలర్లు. దీని ప్రకారం చూస్తే, మన దగ్గర రేటు రూ.1.75 లక్షలను తాకొచ్చు. ఇక జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్ సైతం బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింత పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఔన్స్ 6,600 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు అంటే మన దగ్గర అక్షరాలా రూ.2–2.5 లక్షలకు దూసుకుపోయే అవకాశం ఉంది. రూపాయి గనుక ఇంకా బక్కచిక్కితే పసిడి ధర మరింత కాంతులీనడం ఖాయమంటున్నారు విశ్లేషకులు! వస్తువులకు బదులు నగదు ఇస్తున్నాం.. నాలుగేళ్ల క్రితం పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. పది తులాల బంగారం, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి రూ.30 లక్షల వరకు అయ్యాయి. నాలుగు రోజుల క్రితం చిన్న అమ్మాయి పెళ్ళి చేశాం. పెద్ద అమ్మాయికి పెట్టినట్లుగా నగలు చేయించలేకపోయాం. నాలుగేళ్ల క్రితం 10 గ్రాముల బంగారం రూ.50 వేలు. ఇప్పుడు రూ.1.20 లక్షలు అయ్యింది. మా ఆదాయం మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. వెండి కూడా అలాగే పెరిగింది. పెద్ద అమ్మాయికి దగ్గరి బంధువులు బంగారం, వెండి వస్తువులను చదివించారు. ఇప్పుడు వారి ఇళ్లలో ఫంక్షన్ అయితే అంతే బంగారం, వెండి ఆభరణాలను చేయించలేకపోతున్నాం. అందుకే వారు పెట్టిన వస్తువులకు ఖరీదు చేసి నగదును కట్నంగా చదివిస్తున్నాం. – కత్తుల కవిత, హనుమకొండ ఇమిటేషన్ జ్యువెలరీ వాడాల్సి వస్తోంది.. మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షలాగా బంగారం మారిపోయింది. ఈ ఏడాది పసిడి రేటు అమాంతం లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులం బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. కూతురు పెళ్లి కోసం నాలుగు తులాల బంగారం పెడదామనుకుంటే ఇప్పుడున్న బంగారం రేటుతో తులంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రూ. 50–60 వేల మధ్యలో బంగారం రేటు ఉంటే పెళ్లిళ్లకు కొనగలుగుతాం. వెండిదీ అదే పరిస్థితి కావడంతో, ఇమిటేషన్ జ్యువెలరీపై ఆధారపడాల్సి వస్తోంది. – మనమ్మ,, కాజీపేట ధరాభారంతో ఆందోళన... బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆందోళనగా ఉంది. నాలుగేళ్ల క్రితం మా ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు మా దగ్గరి బంధువులు బంగారు, వెండి ఆభరణాలు పెట్టారు. ప్రస్తుతం మా బంధువులకు చెందిన వివాహ శుభకార్యాలు ఉన్నాయి. మా ఫంక్షన్కు వారు పెట్టిన విధంగా మేము పెట్టాలంటే ప్రస్తుతం వెండి, బంగారం ధర రెట్టింపు అయింది. మధ్యతరగతి కుటుంబమైన మేము పెట్టుపోతల విషయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. మాకు వారు పెట్టినంతగా మేము ఇవ్వకుంటే నలుగురిలో మాట వస్తుంది. పెడదామంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. – కొలిపాక సునీత, స్టేషన్ఘన్పూర్, జనగామ జిల్లా సామాన్యులు కొనలేని పరిస్థితి... ఈ మధ్య కాలంలో బంగారం రేటు పెరుగుదల అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సామాన్యులకు ఇక అందని ద్రాక్షే. త్వరలో కూతురు వివాహం చేయాలనుకుంటున్నాము. రేట్లు ఇంకా పెరుగుతాయనే ఆలోచనతో ఇప్పుడే నగలు కొనేస్తున్నాము. – నంద్యాల సరిత, నల్లగొండ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి పసిడి ధరలు చూస్తుంటే బెంబెలెత్తుతోంది త్వరలో చెల్లి వివాహం ఉంది. వివాహంలో అధిక ఖర్చు బంగారానిదే. రేటు భారీగా పెరిగిపోవడం వల్ల కాస్తోకూస్తో కొని సరిపెట్టుకుంటున్నాం. భవిష్యత్లో ధరలు తగ్గితే అప్పుడు మళ్లీ కొంటాం. మధ్య తరగతి కుటుంబాలు ప్రత్యామ్నాయ ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. – అనిల్ రెడ్డి, అన్నెపర్తి, నల్లగొండ నగల వర్తకుల కామెంట్స్ బిజినెస్ పడిపోయింది.. గత కొంత కాలంగా బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2022లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.52 వేల స్థాయిలో ఉండగా.. ఇప్పుడది రూ.1.3 లక్షల పైకి ఎగసింది. దీంతో పుత్తడి కొనాలంటే ప్రజల్లో ఆందోళన నెలకొంది. వెండి కూడా రికార్డు స్థాయిలో కేజీ రూ.1.8 లక్షలకు చేరింది. దీంతో బంగారం కొనే వారి సంఖ్య తగ్గిపోతోంది. షాపుల్లో గిరాకీ సరిగ్గా ఉండడం లేదు. – చొక్కారపు వెంకన్న, గోల్డ్ షాపు యజమాని, నల్లగొండ రేటెంతైనా కొనేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో పసిడి పరుగులు తీస్తోంది. దీంతో ఇప్పుడంతా ఇన్వెస్టింగ్ కోణంలోకి మళ్లారు. పెళ్లిళ్లు, పండుగ సీజన్తో సంబంధం లేకుండా చేతిలో డబ్బు ఉంటే రేటు ఎంతైనా సరే కొనేస్తున్నారు. స్టాక్ ఎంత తెచ్చినా అమ్ముడైపోతోంది. 2028 నాటికి పసిడి రూ. 2.5 లక్షలు, వెండి కేజీ ధర రూ. 5 లక్షలకు చేరొచ్చని అంచనాలున్నాయి. కానీ ఈ పరుగులు చూస్తుంటే అంతకన్నా ముందే ఈ లక్ష్యాన్ని చేరొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పెరిగినందున కాస్త విరామం తీసుకోవచ్చు. అయితే ఒకవేళ తగ్గినా అది 15 శాతం వరకే పరిమితం కావొచ్చు. అంతకు మించి పడదని భావిస్తున్నాం. – ముకేశ్ సురానా, డైరెక్టర్, ఆదిత్యనాథ్ జ్యువెలర్స్ -
రెండో రోజూ మార్కెట్ వెనక్కి..
ముంబై: ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీన ధోరణికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాల బాట పట్టడంతో దేశీ మార్కెట్లు రెండో రోజూ ‘బేర్’మన్నాయి. మెటల్స్తో పాటు కొన్ని వాహన, ఫార్మా షేర్లు సూచీలను వెనక్కిలాగాయి. ముందురోజు అమెరికా మార్కెట్ల బౌన్స్బ్యాక్, చైనాతో టారిఫ్ వార్ విషయంలో ట్రంప్ కాస్త శాంతించేలా చేసిన వ్యాఖ్యలతో మన మార్కెట్లలో ట్రేడింగ్ సానుకూలంగానే మొదలైంది.సెన్సెక్స్ ఒక దశలో 82,573 పాయింట్ల గరిష్టాన్ని తాకినప్పటికీ.. ఆ జోరు ఎంతో సేపు నిలవలేదు. ఇంట్రాడేలో 545 పాయింట్లు కోల్పోయి 81,781 కనిష్టాన్ని కూడా తాకింది. చివర్లో కాస్త కోలుకుని 297 పాయింట్ల నష్టంతో 82,030 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య 82 పాయింట్లు పడి 25,146 వద్ద క్లోజైంది. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలూ నష్టపోయాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ 0.95 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.74 శాతం చొప్పన క్షీణించాయి. జీవితకాల కనిష్టానికి రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి జీవిత కాల కనిష్టం 88.81 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోని ప్రతికూలతలు, అమెరికా కరెన్సీ బలపడటం రూపాయి కోతకు కారణమయ్యాయి. -
పసిడి పండుగ..
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో పసిడి మరో కొత్త మైలురాయి దాటింది. మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర మరో రూ. 2,850 పెరిగి ఏకంగా రూ. 1.30 లక్షలను అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30,800కి చేరింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా అంతే పెరిగి రూ. 1,30,200కి చేరింది. మరోవైపు, వెండి సైతం కేజీకి రూ. 6,000 ఎగిసి సరికొత్త జీవిత కాల గరిష్టమైన రూ. 1,85,000ని తాకింది.పండుగ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ గణనీయంగా పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 88.80కి పడిపోవడం వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమని ట్రేడర్లు తెలిపారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో (ఎంసీఎక్స్) డిసెంబర్ కాంట్రాక్టు రూ. 2,301 పెరిగి రూ. 1,26,930కి చేరింది. ఫిబ్రవరి కాంట్రాక్టు సైతం రూ. 2,450 ఎగిసి రూ. 1,28,220 రికార్డు స్థాయిని తాకింది. పుత్తడికి దీటుగా వెండి డిసెంబర్ కాంట్రాక్టు కూడా కేజీకి రూ. 8,055 పెరిగి రూ. 1,62,700 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా కామెక్స్లో గోల్డ్ రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 1% పెరిగి ఆల్టైమ్ గరిష్టమైన 4,190 డాలర్లను తాకింది. భౌగోళిక–రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, రేట్ల కోత అంచనాలు, ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర 60% పెరిగి కీలకమైన 4,100 డాలర్ల మార్కును దాటిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా సరఫరా కొరత వల్ల వెండి ఔన్సు ధర కూడా 52 డాలర్లను దాటిందన్నారు. వెండి ధర దేశీయంగా రూ.1,94,639కి, అంతర్జాతీయంగా 59.89 డాలర్లకు పెరగవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ తెలిపారు. -
రూ.1.50 లక్షలకు బంగారం!: నిపుణుల అంచనా..
బంగారం ధరల పెరుగుదల తగ్గే సూచనలు కనిపించడం లేదు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటికే దాదాపు 50 శాతం పెరిగిన గోల్డ్ రేటు.. 2022 ధరలతో పోలిస్తే 140 శాతం ఎక్కువని స్పష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితులు పసిడి ధరలను మరింత పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రాబోయే ధంతేరాస్ (ధనత్రయోదశి), దీపావళి.ధంతేరాస్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సమయంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. 2026 ప్రారంభం నాటికి ఈ ధర రూ. 1.50 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో.. ఈ వారం బంగారం ధరలు ఇప్పటికే 10 గ్రాములకు రూ. 1,22,284 వరకు పెరిగాయి. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్లో SVP-రీసెర్చ్ అజిత్ మిశ్రా ప్రకారం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.ఇదీ చదవండి: కొత్త రేటుకు వెండి: రాబర్ట్ కియోసాకిఈ రోజు (అక్టోబర్ 14) విజయవాడలో బంగారం రేటు గరిష్టంగా రూ. 2950 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,350 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 2700 పెరిగి.. రూ. 1,17,650 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ రేటు ధంతేరాస్ నాటికంటే ముందే రూ. 1.35 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. -
లాభాలకు బ్రేక్.. మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 297.07 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టంతో 82,029.98 వద్ద, నిఫ్టీ 81.85 శాతం లేదా 0.32 శాతం నష్టంతో 25,145.50 శాతం వద్ద నిలిచాయి.ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, వీ విన్ లిమిటెడ్, కోఠారి ప్రొడక్ట్స్, MTAR టెక్నాలజీస్, రెప్రో ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. టాటా మోటార్స్, గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ న్యూ లిమిటెడ్, ఏజీఐ ఇన్ఫ్రా, పిల్ ఇటాలికా లైఫ్స్టైల్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. అక్టోబర్ 18న దంతేరాస్కు ముందు పసిడి ధరల ఇలా భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
180 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 64 పాయింట్లు పెరిగి 25,293కు చేరింది. సెన్సెక్స్(Sensex) 181 పాయింట్లు పుంజుకుని 82,501 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఓలా ఈ –బైక్ కంపెనీకి జరిమానా
అనంతపురం: ఓలా ఈ–బైక్ కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషనర్ జరిమానా విధించింది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం బత్తువానిపల్లి గ్రామానికి చెందిన పోలవరపు నాగరాజు 2024 ఏప్రిల్ 19న తన రూపే క్రెడిట్ కార్డు ద్వారా రూ.80,449 మొత్తాన్ని ‘ఓలా ఈ–బైక్’ కొనుగోలు నిమిత్తం చెల్లించాడు. కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ మొత్తాన్ని వారికి జమ చేశాడు. అయితే, ఓలా కంపెనీ వారు బైక్ను ఇవ్వకపోగా ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్కు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2024 అక్టోబర్ 18న ఓలా ఈ–బైక్ కంపెనీకి నాగరాజు లీగల్ నోటీసులు పంపాడు. వినియోగదారుల కమిషన్లో కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓలా కంపెనీ ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తమకు ఎలాంటి మొత్తం చెల్లించలేదని, ఆన్లైన్ ద్వారా చెల్లింపు విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కంపెనీ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే, స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా వారి వివరాల మేరకు ఓలా కంపెనీకి నాగరాజు నగదు చెల్లించినట్లు నిర్ధారణ కావడంతో వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారు వాదనలతో ఏకీభవించింది. డబ్బు వెనక్కి చెల్లించకపోవడం, బైక్ ఇవ్వకపోవడాన్ని సేవాలోపంగా పరిగణించింది. ఫిర్యాదుదారు చెల్లించిన రూ. 80,449 మొత్తానికి 9 శాతం వార్షిక వడ్డీతో 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి చెల్లించాలని తీర్పు వెలువరించింది. అలాగే, మానసిక వేదనకు పరిహారంగా రూ.20 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేల చొప్పున మొత్తం సొమ్మును 45 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ఎం. శ్రీలత, సభ్యులు గ్రేస్మేరీ, బి. గోపీనాథ్ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు సేవా లోపం లేదని నిర్ధారణ కావడంతో ఎస్బీఐపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. -
ముందస్తు హెచ్చరికల వ్యవస్థను పటిష్టపరచాలి
ముంబై: ముందుగా హెచ్చరించే వ్యవస్థలను మరింత పటిష్టపరచవలసిందిగా మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలను తుహిన్ కాంతా పాండే ఆదేశించారు. వీటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవకతవకలను ముందుగానే గుర్తించడం, సమయానుగుణ చర్యలు, ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుంటుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ పాండే పేర్కొన్నారు. సెబీ సంస్కరణల అమలులో నిర్లిప్తతను ప్రదర్శించకుండా ఇన్వెస్టర్ల పరిరక్షణకు క్రియాశీలంగా వ్యవహరించాలని కోరారు. అవసరమైతే ట్రస్టీలు ప్రశ్నించడం, కలుగజేసుకోవడంవంటివి చేపట్టాలని సూచించారు. ఇన్వెస్టర్ల విశ్వాసానికి ట్రస్టీలు వెన్నెముకలాంటి వారు అని వ్యాఖ్యానించారు. డెరివేటివ్స్, ఈఎస్జీ ఇన్వెస్టింగ్, ప్రత్యామ్నాయ ఆస్తులు, రిస్క్ అనలిటిక్స్ తదితర వర్ధమాన అంశాలలో ట్రస్టీలు అప్డేటెడ్గా ఉండాలని సలహా ఇచ్చారు. ఇందుకు ప్రత్యేక శిక్షణ, నిరంతర కృషి అవసరముంటుందని, దీంతో ప్రభావవంతంగా పనిచేసేందుకు వీలుంటుందని వివరించారు. గత దశాబ్ద కాలంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వేగవంత వృద్దిని అందుకోగా.. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) ఆరురెట్లు జంప్చేసిందని తెలియజేశారు. దీంతో ఏయూఎం రూ. 12 లక్షల కోట్ల నుంచి 2025 సెప్టెంబర్కల్లా రూ. 75.6 లక్షల కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. ఫండ్స్ ఇన్వెస్టర్ల సంఖ్య సైతం కోటి నుంచి 5.6 కోట్లకు బలపడినట్లు తెలియజేశారు. క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్)కు నెలవారీగా పెట్టుబడులు సగటున రూ. 28,000 కోట్లు చొప్పున లభిస్తున్నట్లు పేర్కొన్నారు. 2016 ఏప్రిల్లో నెలవారీ సిప్ పెట్టుబడులు రూ. 3,000 కోట్లు మాత్రమేనని ప్రస్తావించారు. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు ఫండ్ పరిశ్రమపై పెరుగుతున్న నమ్మకానికితోడు.. పెట్టుబడులతో మరింతమంది ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. -
బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశం.. కోటక్ నుంచి గోల్డ్, సిల్వర్ ఫండ్
కోటక్ మహీంద్రా ఏఎంసీ కొత్తగా గోల్డ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) అక్టోబర్ 20తో ముగుస్తుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా కోటక్ గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF), కోటక్ సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF)యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది.బంగారం, వెండిలో పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తూ, దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం ఈ ఫండ్ లక్ష్యమని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, పరిశ్రమల్లో వెండి వాడకం పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రెండింటి వృద్ధి ప్రయోజనాలను పొందేందుకు ఈ ఫండ్ అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇన్వెస్కో ఇండియా కన్జంప్షన్ ఫండ్ దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా కన్జంప్షన్ ఫండ్ని (Invesco India Consumption Fund) ప్రవేశపెట్టింది ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. రోజువారీ సిప్ రూపంలో అయితే కనీసం రూ. 100, నెలవారీ అయితే రూ. 500 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు.వినియోగం థీమ్తో ప్రయోజనం పొందే కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సాధనాల్లో కనీసం 80% ఇన్వెస్ట్ చేస్తుంది. మనీష్ బొద్దార్, అమిత్ గణాత్రా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. ట్యాక్స్ శ్లాబులు మార్చడం, జీఎస్టీ సంస్కరణలు మొదలైనవి వినియోగానికి మరింతగా ఊతమిస్తాయని సంస్థ సీఈవో సౌరభ్ నానావటి తెలిపారు. -
బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి
ప్రముఖ అమెరికన్ రచయిత, వ్యాపారవేత్త, ఆర్థిక విద్యా మార్గదర్శకుడైన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. ఆయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ట్రంప్తో కలిసి రాసిన పుస్తకాల గురించి పేర్కొన్నారు.ఐ లవ్ ట్రంప్.. అని మొదలు పెట్టి.. మేము ఇద్దరూ కలిసి రెండు పుస్తకాలు రాశాము. అందులో ఒకటి.. స్టాక్, బాండ్ మార్కెట్లను నియంత్రించే ధనిక పెట్టుబడి బ్యాంకర్లు 401-K(అమెరికాలోని ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రిటైర్మెంట్ సేవింగ్స్ ప్లాన్) ద్వారా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారని చెబుతోంది.బేబీ బూమర్లు (1946 నుంచి 1964 మధ్యకాలంలో జన్మించిన వారు) ఇబ్బందుల్లో పడుతున్నారని.. ద్రవ్యోల్బణం వారి 401-Kల కొనుగోలు శక్తిని తుడిచిపెట్టినప్పుడు, మిలియన్ల మంది బేబీ బూమర్లు నష్టపోయే అవకాశం ఉందని 'వారెన్ బఫెట్' కూడా అంగీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అధ్యక్షుడు ట్రంప్ మధ్యప్రాచ్యానికి శాంతిని తీసుకురావడమే కాకుండా.. రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టోలతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటివే సాధారణ ప్రజలను ధనవంతులను చేస్తాయి.ఇక రెండో పుస్తకం.. ఈఎస్బీఐ (ESBI: ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్) క్యాష్ఫ్లో క్వాడ్రాంట్ ఆర్ధిక సిద్ధాంతాన్ని వివరిస్తుంది. 401-K వైద్యులు, న్యాయవాదుల వంటివారి కోసం రూపొందించబడ్డాయి.ఇదీ చదవండి: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!నాకు (రాబర్ట్ కియోసాకి), ట్రంప్, మస్క్ పెట్టుబడి పెట్టడానికి మరిన్ని, విభిన్నమైన & మెరుగైన ఆస్తులు ఉన్నాయి. మీరు కూడా ప్రత్యామ్నాయ (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్ మొదలైనవి) పెట్టుబడులు పెట్టండి. భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు.మీ కోసం మీరే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. తెలివిగా మారడానికి, మీ భవిష్యత్తుకు ఉత్తమమైన ఆస్తులను ఎంచుకోవడానికి సమయం ఆసన్నమైంది. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.I LOVE TRUMP: We wrote two books together for many reasons. One of those reasons is because the rich investment bankers who control the stock and bond markets are screwing the working class via the workers 401-Ks. Even Warren Buffet has been admitting Baby-boomers are…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 13, 2025 -
రూ.1.95 లక్షల వద్ద వెండి: దూసుకెళ్తున్న బంగారం!
భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు (అక్టోబర్ 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 320 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో స్వల్ప మార్పులు ఏర్పడ్డాయి. ఈ కథనంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేటు ఎలా ఉందో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాలున్నా 25,100 మార్కుపైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు నష్టపోయి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 332 పాయింట్లు దిగజారి 82,158 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్యూ2 ఫలితాలపై కన్ను!
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య మళ్లీ భగ్గుమన్న టారిఫ్ వార్తో అమెరికా మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఈ భౌగోళిక, రాజకీయ పరిణమాలపై ఫోకస్ చేయనున్నారు. మరోపక్క, దేశీయంగా విడుదల కానున్న ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు రెండో త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు కూడా మన మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టి సారించనున్నారు. అమెరికా సూచీలు విలవిల.. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా తాజా ఆంక్షలతో పాటు పోర్టు ఫీజుల పెంపుపై తీవ్రంగా ప్రతిస్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 1 నుంచి 100 శాతం అదనపు సుంకాల మోత మోగిస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా, కొన్ని రకాల సాఫ్ట్వేర్ ఎగుమతులపైనా నియంత్రణలు విధిస్తామని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ టారిఫ్ వార్ తారస్థాయికి చేరుకుంది. ఇరుదేశాలు ప్రతీకార సుంకాలకు దిగితే అది ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఈ దెబ్బకు గత వారాంతం (శుక్రవారం) రోజున అమెరికా సూచీలు కుదేలయ్యాయి. నాస్డాక్ ఏకంగా 3.56 శాతం పతనం కాగా, ఎస్అండ్పీ 500 సూచీ 2.71 శాతం, డోజోన్స్ 1.9 శాతం చొప్పున పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్తో పాటు తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలు ఈ వారం మన మార్కెట్పై ప్రభావం చూపవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ‘దేశీయంగా క్యూ2 ఫలితాలు, ప్రపంచ స్థూల ఆర్థిక గణాంకాలు, యూఎస్–చైనా మధ్య ముదిరిన టారిప్ వార్ వంటివి పలు అంశాలు ఈ వారం మన మార్కెట్ దిశను నిర్దేశించవచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలకు పాల్పడవచ్చు. దీంతో వర్ధమాన మార్కెట్లతో పాటు కరెన్సీ విలువలపై కూడా ఒత్తిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. గణాంకాలు.. ఫలితాలు.. సెపె్టంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు (13న) విడుదల కానున్నాయి. 14న టోకు ధరల ద్రవ్యోల్బణం డేటా వస్తుంది. మరోపక్క, 2025–26 జూలై–సెపె్టంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాల సీజన్ వేగం పుంజుకోనుంంది. ఈ వారంలోనే ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్ (13న), టెక్ మహీంద్రా (14న), ఇన్ఫోసిస్ (16న) విప్రో (16న) ఎల్టీఐ మైండ్ట్రీ (16న)తో పాటు యాక్సిస్ బ్యాంక్ (15న), రిలయన్స్ ఇండస్ట్రీస్ (17న) కూడా ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇప్పటికే విడుదలైన టీఎస్ఎస్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచిన నేపథ్యంలో మిగతా ఐటీ కంపెనీల పనితీరును ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. మరోపక్క, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఈ వారంలో (మంగళవారం) చేసే ప్రసంగం కూడా మానిటరీ పాలసీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తుందదని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య మళ్లీ వాణజ్య ఉద్రిక్తతల ప్రభావంతో యూఎస్ మార్కెట్లు గత వారాంతంలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దిగజారిన గ్లోబల్ సెంటిమెంట్ ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగంలో వ్యాఖ్యలు కూడా వడ్డీ రేట్లపై అంచనాలు, ద్రవ్యోల్బణం తీరుపై ఇన్వెస్టర్లకు సంకేతాలు ఇవ్వనుంది’ అని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్హెడ్ సంతోస్ మీనా పేర్కొన్నారు.గతవారమిలా...మార్కెట్ వరుస పతనానికి ఆర్బీఐ పాలసీ తర్వాత బ్రేక్ పడింది. మళ్లీ లాభాల బాట పట్టిన దేశీ మార్కెట్లు వరుసగా రెండో వారం కూడా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 1,294 పాయింట్లు (1.59%), నిఫ్టీ 391 పాయింట్లు (1.57%) చొప్పున ఎగబాకాయి. -
అప్పుతో ఐపీవో ఆట!
ప్రైమరీ మార్కెట్లో ఐపీవోల (పబ్లిక్ ఆఫర్) సందడి నెలకొంది. పేరొందిన కంపెనీలకే కాదు, చిన్నా చితకా పబ్లిక్ ఆఫర్లకు సైతం స్పందన అదిరిపోతోంది. పట్టణాల్లో ఇంటి వద్దకే పలు రకాల సేవలను ఆఫర్ చేసే ‘అర్బన్ కంపెనీ’ గత నెలలోనే విజయవంతంగా ఐపీవోని ముగించుకుంది. రూ.1,900 కోట్ల సమీకరణకు రాగా.. రూ.1.95 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చిపడ్డాయి. 103 రెట్ల స్పందన వచ్చింది. లిస్టింగ్లోనే ఇన్వెస్టర్లకు 56 శాతానికి పైగా లాభాన్నిచ్చింది. ఇదొక్క ఉదాహరణే. కొన్ని ఐపీవోలు లిస్టింగ్తోనే అదరగొడుతుండడంతో రిటైల్ ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐల్లో (హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు) లాభాల కాంక్ష ఉరకలెత్తుతోంది. రుణం తీసుకుని మరీ ఎక్కువ షేర్ల కోసం బిడ్లు వేస్తున్నారు. ఫలితంగా ఐపీవో ఫండింగ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఇది గమనించిన ఆర్బీఐ ఒక వ్యక్తికి ఐపీవో రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్టు ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించింది. రుణంతో ఐపీవోలో పాల్గొనడం వల్ల లాభాలే కాదు, తేడా వస్తే నష్టాలనూ భరించాల్సి వస్తుంది. ఇందులో ఉండే రిస్క్ లను తెలుసుకోకుండా దూకుడు ప్రదర్శించడం ఎంత మాత్రం మంచిది కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 16 బ్యాంకులు సంయుక్త్తంగా మంజూరు చేసిన ఐపీవో రుణాల మొత్తం రూ.7,748 కోట్లు. ఇందులో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంకే రూ.5,030 కోట్ల రుణ వితరణ చేసింది. కొన్ని బ్యాంక్లు వాటి సబ్సిడరీల రూపంలోనూ ఐపీవో ఫండింగ్ను అందిస్తున్నాయి. బ్యాంకింగేతర ఆరి్థక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), బ్రోకరేజీ సంస్థలు ఈ విభాగంలో ఇంతకంటే పెద్ద మొత్తంలోనే ఫండింగ్ను సమకూరుస్తున్నాయి. అర్బన్ కంపెనీ ఐపీవోలో నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (ఎన్ఐఐ) విభాగంలో 78 రెట్లు అధికంగా బిడ్లు రాగా, రిటైల్ విభాగంలోనూ 41 రెట్ల అధిక స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎన్ఐఐ విభాగంలో ఎక్కువ మంది రుణంతోనే బిడ్లు వేస్తుంటారు. 2022లో ఎల్ఐసీ ఐపీవో సందర్భంగా ఎల్ఐసీ ఉద్యోగులకు ఎస్బీఐ రుణాన్ని ఆఫర్ చేసింది. ఒక్కొక్కరికీ రూ.20 లక్షల రుణాన్ని 7.10 శాతం వడ్డీపై, 60 నెలల కాల వ్యవధితో ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగి, పాలసీదారుడు, రిటైల్ ఇలా మూడు విభాగాల్లోనూ షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో అధిక మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేసింది. రుణ షరతులు, నియమాలు బ్యాంక్లు 3–6 రోజుల కాల వ్యవధికి ఐపీవో ఫండింగ్ను అందిస్తున్నాయి. వీటిపై వడ్డీ రేటు 9–15 శాతం వరకు ఉంటుంది. అదే ఎన్బీఎఫ్సీల్లో అయితే ఇంతకు రెట్టింపులో ఉంటోంది. మార్కెట్లో నగదు లభ్యత, ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ తదితర అంశాలు రుణంపై వడ్డీని ప్రభావితం చేస్తుంటాయి. పైగా రుణ విలువపై ఒక శాతం వరకు ప్రాసెసింగ్ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఐపీవోలో వేస్తున్న బిడ్ విలువకు సరిపడా రుణాన్ని పొందలేరు. ఇన్వెస్టర్ తన వంతుగా కొంత సమకూర్చుకోవాలి. ఇది ఎంతన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేస్తున్నారు? దరఖాస్తుదారుడి గత రుణ చెల్లింపుల చరిత్ర, మార్కెట్ పరిస్థితులను బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా 10–25 శాతం వరకు ఇన్వెస్టర్ తన వంతు వాటా కింద సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మిగిలిన మొత్తానికి రుణం లభిస్తుంది. ‘‘రుణాన్ని 3–4 రోజుల్లో క్లియర్ చేసినప్పటికీ.. 7 రోజుల కాలానికి వడ్డీ చెల్లించాల్సిందే. లిస్టింగ్ రోజునే షేర్లను విక్రయించాలి. ఆ తర్వాత కూడా షేర్లను కొనసాగించుకోవాలంటే సొంత నిధులతోనే సాధ్యపడుతుంది. లిస్టింగ్ రోజునే ప్రిన్సిపల్ (అసలు) మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్లు కోరుతుంటాయి’’ అని జెరోదా వైస్ ప్రెసిడెంట్ మోహిత్ మెహ్రా తెలిపారు. కొన్ని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు లిస్టింగ్ తర్వాత కూడా ఆ షేర్లను కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఒకవేళ ఐపీవోలో కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయి, నష్టాల్లో కొనసాగుతుంటే, వ్యత్యాసం మేర అదనపు నిధులు సమకూర్చాలని ఇన్వెస్టర్లను కోరతాయి. ఆ మేరకు సర్దుబాటు చేస్తే, షేర్లను వెంటనే విక్రయించనక్కర్లేదు. ఎంత రుణం?ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక పాన్ నంబర్పై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి ఇప్పుడు రూ. 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగానే ఉండగా ఆర్బీఐ తాజాగా పెంచింది. ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థలున్న బ్రోకరేజీ సంస్థలు కూడా ఐపీఓ ఫండింగ్ విషయంలో ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నాయి.రిస్క్ లు.. ఐపీవో ధర కంటే ఎక్కువలో లిస్టింగ్ అయితే మంచి లాభాలు కళ్లజూడొచ్చు. దీంతో తీసుకున్న రుణంపై బ్యాంక్లకు/ఎన్బీఎఫ్సీలకు అసలుతోపాటు వడ్డీని సులభంగా చెల్లించేయొచ్చు. తన వంతు ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోవచ్చు. ఒకవేళ కేటాయించిన ధర కంటే తక్కువలో లిస్ట్ అయితే పరిస్థితి ఏంటి?. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా సంస్థ వడ్డీతోపాటు రాబట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఇన్వెస్టర్ లాభ, నష్టాలతో వాటికి అవసరం లేదు. కొన్ని సంస్థలు 90 రోజుల వరకు అనుమతిస్తున్నాయి కదా అని చెప్పి.. వడ్డీ చెల్లించుకుంటూ అంత కాలం పాటు ఆ షేర్లను కొనసాగించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అన్ని రోజులు ఆగినప్పటికీ లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉండదు కదా?! కనుక లాభం వచ్చినా, నష్టం వచ్చినా లిస్టింగ్ రోజునాడు విక్రయించడమే సరైన విధానం అవుతుంది. ఒకవేళ షేర్లపై నష్టం బుక్ చేసుకుంటే, రుణంపై వడ్డీ రూపంలోనూ మరికొంత నష్టపోవాల్సి వస్తుంది. ఇక పెద్ద మొత్తంలో రుణం తీసుకుని ఐపీవోలో బిడ్ వేసినప్పటికీ.. షేర్లు దక్కుతాయన్న హామీ ఉండదు. 50–100 రెట్లకు పైగా స్పందన వచ్చిన ఐపీవోల్లో కేటాయింపు అవకాశాలు చాలా తక్కువ. షేర్లు దక్కకపోతే అప్పుడు ఐపీవో కోసం తీసుకున్న రుణంపై వడ్డీని సొంత జేబు నుంచి చెల్లించుకోవాల్సి ఉంటుందని ఏంజెల్వన్ అడ్వైజరీ చీఫ్ అమర్దియో సింగ్ పేర్కొన్నారు. సాధారణంగా అధిక స్పందన ఉన్న ఐపీవోల్లో అలాట్మెంట్ అవకాశాలు చాలా తక్కువ. పరిమిత స్పందన ఉన్న వాటిల్లోనే కేటాయింపు అవకాశాలు ఎక్కువ. పరిమిత స్పందన వచ్చిన ఐపీవోలు లిస్టింగ్లో మంచి లాభాలు పంచడం తక్కువ కేసుల్లోనే కనిపిస్తోంది. జొమాటో, అర్బన్ కంపెనీ తదితర ఐపీవోలు లిస్టింగ్తోనే లాభాలు పంచగా, పేటీఎం, కల్యాణ్ జ్యువెలర్స్, కార్ట్రేడ్ టెక్, ఎస్బీఐ కార్డ్ కేటాయించిన ధర కంటే తక్కువకే లిస్ట్ కావడం గమనించాలి. హ్యుందాయ్ మోటార్స్ లిస్టింగ్లో లాభాలను ఇవ్వకపోగా, కేటాయించిన ధర కంటే కిందకు పడిపోయి చాలా కాలం స్థిరీకరణకు నోచుకుంది. ఆ తర్వాత కొత్త గరిష్టాలను చూసింది. సెబీ అధ్యయనం ప్రకారం ఐపీవోల్లో హెచ్ఎన్ఐ విభాగంలో 60–75 శాతం మధ్య దరఖాస్తులకు కేటాయింపులు లభించడం లేదు. రూ.75 లక్షల నుంచి రూ.కోటి మొత్తంతో బిడ్ వేసినా ఒక్క షేరు కూడా రాని సందర్భాలు కూడా ఉంటాయి. పెద్ద మొత్తంతో బిడ్ వేసినప్పటికీ.. చివరికి కొన్ని షేర్లే అలాట్ అయిన సందర్భాల్లోనూ వచ్చే లాభం వడ్డీ చెల్లించడానికి సరిపోకపోవచ్చు. లిస్టింగ్ నాటికి మార్కెట్లలో భారీ కరెక్షన్ చోటుచేసుకుంటే, అప్పుడు కూడా నష్టాల రిస్క్ ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు రుణంపై ఐపీవోలో దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఈ పరిస్థితులను సమగ్రంగా విశ్లేíÙంచుకోవాలి. తన రిస్క్ సామర్థ్యం, ఎంత మేరకు నష్టాలను భరించగలమో అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. చెల్లించడంలో విఫలమైతే.. రుణం మంజూరుకు ముందుగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఒప్పందంపై సంతకాలు చేయించుకుంటాయి. ఐపీవోలో కేటాయించే షేర్లను విక్రయించేందుకు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) తీసుకుంటాయి. ఇన్వెస్టర్ నిరీ్ణత గడువులోపు షేర్లను విక్రయించి, అసలు.. వడ్డీ చెల్లించడంలో విఫలమైతే రుణం ఇచ్చిన సంస్థలు బ్రోకరేజీల ద్వారా వాటిని విక్రయించేస్తాయి. ఇన్వెస్టర్ సమకూర్చిన మార్జిన్ మనీకి మించి నష్టాలు వస్తే.. అప్పుడు మిగిలిన బకాయి రాబట్టుకోవడానికి బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు చట్టపరమైన చర్యలు చేపడతాయి.షేర్లు, ఫండ్స్పై రుణం రిటైల్ ఇన్వెస్టర్లు తమ షేర్లు, ఫండ్స్పై రుణం తీసుకుని కూడా ఐపీవోలో పాల్గొనొచ్చు. ఇందుకు బ్రోకరేజీలు, ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు సైతం అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్ల తనఖా విలువపై 50–75% వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.కోటి వరకు రుణం పొందేందుకు ఆర్బీఐ ఇటీవలే అనుమతించింది. హెచ్ఎన్ఐ విభాగంలో దరఖాస్తులు.. రిటైల్ ఇన్వెస్టర్లు రిటైల్ కోటాలో గరిష్ఠంగా రూ.2 లక్షల విలువైన షేర్లకు మాత్రమే బిడ్ వేయగలరు. అదే నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (ఎన్ఐఐ) విభాగంలో రూ.2 లక్షలకు మించి, ఎంత మొత్తానికి అయినా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. ఐపీవోల్లో సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 10–35 శాతం మధ్య, ఎన్ఐఐలకు 15–35 శాతం మధ్య కోటా ఉంటుంది. ఎన్ఐఐలోనూ రెండు విభాగాలు ఉంటాయి. రూ.2–10 లక్షల వరకు బిడ్లను స్మాల్ ఎన్ఐఐ కింద పరిగణిస్తారు. మొత్తం ఎన్ఐఐ కోటాలో వీరికి మూడింట ఒక వంతు షేర్ల కోటా ఉంటుంది. మిగిలినది రూ.10 లక్షలకు మించిన బిడ్లకు రిజర్వ్ చేస్తుంటారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టాటా మ్యుచువల్ ఫండ్ యాప్లో కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: ఈక్వల్–వన్మనీ సంస్థతో కలిసి టాటా మ్యుచువల్ ఫండ్ యాప్లో పోర్ట్ఫోలియో 360 ఫీచరును ప్రవేశపెట్టినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025 సందర్భంగా దీన్ని ఆవిష్కరించింది. వివిధ బ్యాంకు ఖాతాలు, ఫండ్స్, ఈక్విటీలు, ఎఫ్డీలు మొదలైన వాటి వివరాలన్నీ ఒకే దగ్గర చూసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో ప్రతీత్ భోబె తెలిపారు.రిటైర్మెంట్లాంటి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేందుకు ఇన్వెస్టర్లకి సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే టాటా మ్యుచువల్ ఫండ్ యాప్ డౌన్లోడ్లు 6 లక్షల పైగా నమోదైనట్లు వివరించారు. పారదర్శకత, ఆవిష్కరణలపరంగా అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ పోర్ట్ఫోలియో 360ని తీర్చిదిద్దినట్లు ఈక్వల్–వన్మనీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రసాద్ తెలిపారు. -
రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఉండే.. రిచ్ రాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో.. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ జరుగుతుందని హెచ్చరించారు.ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను. ఆ క్రాష్ ఈ ఏడాది జరుగుతుంది. బేబీ బూమ్ రిటైర్మెంట్లు తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. కియోసాకి ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందని, ఇదే అతిపెద్ద క్రాష్ అని స్పష్టంగా అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి టారిఫ్స్ ప్రభావం, ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ అనిశ్చితి మొదలైనవి ప్రధాన కారణాలు.డబ్బు కూడబెట్టొద్దు, నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టండని హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా.. నేను సేవర్స్ ఓడిపోయేవారు అని చెబుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి, బట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు.ఇప్పుడు ఎథెరియంలను సేవ్ చేయమని చెబుతున్నాను. ఈ రోజు నేను వెండి & ఎథెరియం ఉత్తమమైనవని నమ్ముతున్నాను. ఎందుకంటే వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వీటిని ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. దయచేసి వెండి, ఎథెరియం లాభాలు & నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిపెరుగుతున్న వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రూ. 190000 వద్దకు చేరింది. ఈ సందర్భంగా ''వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్'' (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే.. వెండి కూడా మరింత పెరుగుతుందని తెలుస్తోంది.REMINDER: I predicted the biggest crash in world history was coming in my book Rich Dad’s Prophecy. That crash will happen this year. Baby Boom Retirements are going to be wiped out. Many boomers will be homeless or living in their kids basement. Sad.REMiNDER: I have…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 11, 2025 -
‘వెండి ధరలు ఇంకా పెరుగుతాయ్’.. ఎందుకంటే..
ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరిన వెండి ధరలు (Silver Price) మరింత పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ఔన్స్కు 60 డాలర్ల వరకు పెరిగే అవకాశముంది. ఇది సంవత్సరానికి సుమారుగా 20% పెరుగుదలను సూచిస్తుందని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ తెలిపింది.ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన ఈ వెల్త్ అడ్వయిజరీ సలహా విభాగం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో 20 శాతం సరఫరా లోటు నెలకొన్న నేపథ్యంలో బలమైన పారిశ్రామిక డిమాండ్ వల్ల బుల్లిష్ దృక్పథం కొనసాగుతుందని అంచనా వేస్తోంది.ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకివెండి పెట్టుబడిదారులు ఇప్పటికే 2025 క్యాలెండర్ సంవత్సరంలో 90% లాభాన్ని సాధించారు. అంతర్జాతీయ మార్కెట్లో, వెండి ధరలు ఔన్స్కు 49 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో సురక్షితమైన ఆస్థులకు డిమాండ్ పెరిగిపోవడం వల్ల వెండి ధరలు రికార్డు గరిష్టస్థాయికి చేరాయి. కామెక్స్ వెండి ఇప్పటివరకు సుమారు 70% పెరిగింది. ఎంసీఎక్స్ వెండి సుమారు 71% పెరిగింది.(Disclaimer: నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!
హమ్మయ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అనుకునేలోపే.. మళ్లీ ఊపందుకున్నాయి. నేడు (అక్టోబర్ 11) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ నగరం బంగారం ధర ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉంది అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల్లో తగ్గిన జోరు
న్యూఢిల్లీ: మార్కెట్లలో ఆటుపోట్లు, అంతర్జాతీయ అనిశి్చతుల మధ్య ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో జోరు తగ్గినట్టు కనిపిస్తోంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల రాక వరుసగా రెండో నెలలోనూ తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్ నెలలో నికరంగా రూ.30,421 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్ట్లో వచ్చిన రూ.33,430 కోట్లతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూలైలో వచ్చిన రూ.42,703 కోట్లు నెలవారీ ఆల్టైమ్ గరిష్ట పెట్టుబడులుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ వివరాలను విడుదల చేసింది. వరుసగా 55వ నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపిస్తాయనే విషయంలో ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం అన్నది సైక్లికల్ తప్ప (తాత్కాలికం) నిర్మాణాత్మకం కాదని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మేనేజర్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. పెట్టుబడులు మోస్తరు స్థాయికి పరిమితం కావడం వెనుక థీమ్యాటిక్ ఫండ్స్ నిధుల సమీకరణ తగ్గడమే కారణమని శామ్కో మ్యూచువల్ ఫండ్ సీఈవో విరాజ్ గాంధీ తెలిపారు. సిప్ రూపంలో రూ.29,361 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సెప్టెంబర్ నెలలో రూ.29,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులకు ప్రాధా న్యం ఇస్తున్నట్టు ఇది తెలియజేస్తోంది. ఆగస్ట్లో సిప్ పెట్టుబడులు రూ.28,265 కోట్లుగా ఉన్నాయి. సిప్ ఖాతాల సంఖ్య ఆగస్ట్ చివరికి ఉన్న 8.99 కోట్ల నుంచి 9.25 కోట్లకు చేరింది. ఒక ఇన్వెస్టర్కు ఒకటికి మించిన ఖాతాలు ఉండొచ్చు. ఒక పథకంలో పెట్టుబడిని ఒక ఖాతా (ఫోలియో) కింద పరిగణిస్తారు. సిప్ రూపంలోని మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ రూ.15.52 లక్ష లకోట్లకు చేరింది. విభాగాల వారీగా.. → ఈక్విటీ ఫండ్స్ అన్నింటిలోకి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,029 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ విభాగంలోకి పెట్టుబడులు బలంగా రావడం వరుసగా మూడో నెలలోనూ కనిపించింది. మార్కెట్ క్యాప్తో సంబంధం లేకుండా మెరుగైన పెట్టుబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నా ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,085 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.4,363 కోట్ల చొప్పున నికరంగా ఆకర్షించాయి. → లార్జ్క్యాప్ ఫండ్స్లోకి వచి్చన పెట్టుబడులు రూ.2,319 కోట్లుగా ఉన్నాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక రూ.1,220 కోట్లకు పరిమితమైంది. → పన్ను ఆదాకు ఉపకరించే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి రూ.308 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ నుంచి రూ.168 కోట్లు చొప్పున బయటకు వెళ్లాయి. → హైబ్రిడ్ ఫండ్స్ రూ.2,014 కోట్లు, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ రూ.1,747 కోట్లు, ఆర్బిట్రేజ్ ఫండ్స్ రూ.988 కోట్ల చొప్పున ఆకర్షించాయి. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి సెప్టెంబర్లో రూ.1.02 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఆగస్ట్లో డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు రూ.7,980 కోట్లుగానే ఉన్నాయి. దీంతో పోల్చితే ఉపసంహరణలు గణనీయంగా పెరిగాయి. → మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సెప్టెంబర్ నెలలో రూ.43,146 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.75.61 లక్షల కోట్లకు చేరింది. ఆగస్ట్ చివరికి ఇది రూ.75.12 లక్షల కోట్లుగా ఉంది. గోల్డ్ ఫండ్స్కు డిమాండ్ బంగారం ధరలు ఇటీవలి కాలంలో స్థిరమైన ర్యాలీ చేస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఇందుకు నిదర్శనంగా సెప్టెంబర్లో రూ.8,363 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి (గోల్డ్ ఈటీఎఫ్లు) వచ్చాయి. ఒక నెలలో అత్యధిక పెట్టుబడులు రాక ఇదే. ఆగస్ట్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచి్చన పెట్టుబడులు రూ.2,190 కోట్లుగా ఉన్నాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.90,000 కోట్ల మార్క్ను చేరుకుంది. ‘‘బంగారం బలమైన ర్యాలీ చేయడం ఈ పెట్టుబడుల ధోరణికి కారణమని ఏంజెల్ వన్ ఏఎంసీ ఈడీ, సీఈవో హేమెన్ భాటియా తెలిపారు. సిల్వర్ (వెండి) ఈటీఎఫ్లు సైతం మెరిశాయి. ఇటీవలి కాలంలో వెండి ధరలు సైతం భారీగా పెరగడం చూస్తున్నాం. దీంతో సెప్టెంబర్లో సిల్వర్ ఈటీఎఫ్ల్లోకి రూ.5,342 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిల్వర్ ఈటీఎఫ్ నిర్వహణ ఆస్తులు రూ.36,461 కోట్లకు చేరాయి. ఈక్విటీ, డెట్తోపాటు బంగారం వెండిలోనూ పెట్టుబడులు పెట్టే – మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.4,982 కోట్లు వచ్చాయి. -
కొత్త రేటుకు వెండి: రాబర్ట్ కియోసాకి
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్ (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.SILVER over $50.$75 next ?Silver and Ethereum hot, hot, hot.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 10, 2025వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిభారతదేశంలో 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 1,61,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో.. స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్లిన ఎస్బీఐ
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఫార్మా, బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా రెండవ ట్రేడింగ్ సెషన్లోనూ ఎగువన ముగిశాయి.ఐటీ స్టాక్స్ బలహీనత మధ్య 100 పాయింట్ల క్షీణతతో 82,075 వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ వెంటనే పుంజుకుంది. ఇంట్రా-డే డీల్స్ లో 579 పాయింట్లు పెరిగి 82,654 వద్ద గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. ఎట్టకేలకు 329 పాయింట్లు లేదా 0.4 శాతం లాభంతో 82,501 వద్ద ముగిసింది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 25,331 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 104 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 25,285 వద్ద స్థిరపడింది. ఈ ప్రక్రియలో ఎన్ఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ జూన్ 27 నుండి అతిపెద్ద వారాంతపు లాభాన్ని (1.6 శాతం) నమోదు చేయగలిగింది.సెన్సెక్స్ స్టాక్స్ లో ఎస్బీఐ 2 శాతానికి పైగా లాభపడింది. మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ 1 శాతం లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్ 1.5 శాతం పడిపోయింది.క్యూ2 ఫలితాలను నివేదించిన తర్వాత టీసీఎస్ కూడా ఒక రోజు 1 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.4 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం పెరిగాయి.రంగాలవారీగా.. బీఎస్ఈ హెల్త్కేర్, బ్యాంకెక్స్ ఒక్కొక్కటి 1 శాతం వరకు పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఒక్కొక్కటి 0.5 శాతం లాభపడ్డాయి. 2030 నాటికి భారత్-బ్రిటన్ వాణిజ్యం రెట్టింపు అవుతుందనే వార్తల మధ్య ఇంట్రాడే డీల్స్ లో టెక్స్ టైల్ కంపెనీల షేర్లు 17 శాతం వరకు పెరిగాయి. -
ఆల్టైమ్ గరిష్టాలను తాకిన వెండి: 10 రోజుల్లో..
ఇన్నాళ్లు బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందిన ప్రజలకు వెండి కూడా నిరాశ కలిగిస్తోంది. 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 161000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ కూడా గణనీయంగా పెరుగుతోంది.వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. 2012లో ఔన్స్ వెండి ధర 49.50 డాలర్లకు చేరుకుని, తర్వాత గణనీయంగా దిద్దుబాటుకు గురైంది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండి లోహానికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటుపరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ప్రముఖ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగడానికి ముందే.. సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి అని సలహా ఇస్తున్నారు. -
ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు: రూ.2 లక్షలకు చేరువలో వెండి!
అక్టోబర్ ప్రారంభం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (శుక్రవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేటు.. ఏ నగరం ఎంత ఉంది అనే విషయం తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం ఉదయం లాభల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 282.04 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 82,454.14 వద్ద, నిఫ్టీ 86.45 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 25,268.25 వద్ద సాగుతున్నాయి.రిలయన్స్ పవర్ లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంగం (ఇండియా), 5పైసా క్యాపిటల్, జిందాల్ ఫోటో లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ గోల్డోర్నా హౌస్, క్యాపిటల్ ట్రస్ట్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, మెక్లియోడ్ రస్సెల్ (ఇండియా), సోలెక్స్ ఎనర్జీ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398.45 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో 82,172.10 వద్ద, నిఫ్టీ 135.65 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 25,181.80 వద్ద నిలిచాయి.జిందాల్ ఫోటో లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎం బ్రూవరీస్, ఆల్కలీ మెటల్స్, వీ విన్ లిమిటెడ్ వంటివి లాభాల జాబితాలో చేరాయి. నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), మోడీ రబ్బర్ లిమిటెడ్, సుమీత్ ఇండస్ట్రీస్, హెడ్స్ అప్ వెంచర్స్ వంటి కంపెనీలు వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి
బంగారంపై పెట్టుబడి పెట్టండి.. అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని చెప్పిన 'రాబర్ట్ కియోసాకి' మాటలు నిజవవుతున్నాయి. ఇప్పుడు ఎవరిదగ్గర బంగారం ఎక్కువ ఉందో వాళ్లే ధనవంతులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజు (అక్టోబర్ 9) 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,24,000 దాటేసింది. ఇలాంటి సమయంలో.. కియోసాకి వెండి గురించి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.పసిడి ధరల మాదిరిగానే.. ''వెండి ధర దాదాపుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. సిల్వర్ రేటు మరింత పెరుగుతుంది. వెండి ధరలు భారీగా పెరగడానికి ముందే.. దయచేసి సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి'' అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.SILVER near time high.Silver is a dollar away from turning into a rocket ship.Please get a few silver coins before the silver rocket leaves the earth.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 1,71,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తుంటే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి బంగారంపైన మాత్రమే కాకుండా.. వెండిపై చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.గతంలో చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ ప్లానర్లు స్టాక్ కొనుగోలు చేయమని, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సలహాలు ఇచ్చారు. అయితే యూఎస్ డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో స్టాక్స్, ఫండ్స్ అంత సురక్షితం కాదని కియోసాకి వాదన. అమెరికా ప్రభుత్వం చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశం అయినప్పుడు.. ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది. దివాలా తీసిన దేశం నుంచి బాండ్లను కొనుగోలు చేసేంత తెలివితక్కువవారు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లునిజం ఏమిటంటే.. కొన్ని సంవత్సరాలుగా బంగారం విలువ, స్టాక్లు.. బాండ్ల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. నేను ఇప్పటికీ బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయడానికే ఇష్టపడతాను. నిజమైన ఆస్తులు ఇవే. మీరు కూడా ఉత్తమైన వాటిలో పెట్టుబడి పెట్టండని కియోసాకి పేర్కొన్నారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
తులం బంగారం రూ.లక్షా 28 వేల 200
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. మంగళవారం తులం బంగారం రూ. 1,25,400 ఉండగా బుధవారం రూ. 1,28,200కు చేరుకొని రికార్డు సృష్టించింది. తులం వెండి ధర రూ.1610కి చేరింది. దీపావళి పండుగ దాటేసరికి బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరుకోవచ్చని బంగారు దుకాణాదారులు అభిప్రాయపడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ప్రజలు ధరల పెరుగుదలతో తక్కువ బంగారంతోనే సరిపుచ్చుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయని దుకాణాదారులు చెప్తున్నారు.రూ.లక్షా 50వేలు దాటుతుంది..ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండడంతోనే బంగారం రేటు పెరుగుతోంది. రానున్న రోజు ల్లో తులం బంగారం ధర రూ. లక్షా50వేలకు దాటేలా కనిపిస్తోంది. ఇలా ఉంటే సామాన్యుడికి చాలా ఇబ్బందే.– లక్ష్మణచారి, వర్తకుడు, నగరవాసి -
ఇలా అయితే ఎలా 'బంగారం': మరింత పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 09) కూడా గరిష్టంగా రూ. 220 పెరిగింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,000 మార్కుపైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,097కు చేరింది. సెన్సెక్స్(Sensex) 107 పాయింట్లు పుంజుకొని 81,871 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అస్థిర సెషన్ తరువాత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు ప్రారంభ లాభాలు కరెక్షన్కు గురై నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,773.66 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 25,046.15 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.73 శాతం, 0.52 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో, నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియాల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1 శాతం వరకు పడిపోయాయి.సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 21 షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా టాప్ లూజర్స్ గా నిలిచాయి. టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,179కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు పుంజుకొని 82,209 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగో రోజూ లాభాలే
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.అయితే ద్వితీయార్ధంలో ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో టెలికం 2.13%, రియల్టీ 1.09%, ఇంధన 0.50%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.28%, ఫైనాన్సియల్ సర్విసెస్ 0.24%, ఐటీ 0.23 శాతం లాభపడ్డాయి. ⇒ లాజిస్టిక్స్ సర్విసు ప్రొవైడర్ గ్లోటిస్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.129)తో పోలిస్తే బీఎస్ఈలో 32% డిస్కౌంటుతో రూ.88 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 37% క్షీణించి రూ.81 కనిష్టాన్ని తాకింది. చివరికి 35% పతనంతో రూ.84 వద్ద నిలిచింది.⇒ ఇష్యూ ధర (రూ.191) వద్దే ఫ్లాటుగా లిస్టయిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ షేరూ మెప్పించలేకపోయింది. ఇంట్రాడేలో 5% పతనమై రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 4.5% నష్టంతో రూ.182 వద్ద స్థిరపడింది. -
బంగారం @ 4,000
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది. ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నట్టు చెప్పారు. దేశీయంగా రూ.1.24 లక్షలు ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది. -
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.ఇదీ చదవండి: మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) -
ప్యాసివ్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల (ఏయూఎం) విలువ 2025 మార్చి నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2019 నాటికి ఉన్న రూ.1.91 లక్షల కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగింది.మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ మూడో ఎడిషన్ ‘ప్యాసివ్ సర్వే 2025’ ఈ వివరాలు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి చూసినా ప్యాసివ్ ఫండ్స్ ఏయూఎం 1.7 రెట్లు పెరిగింది. మూడు వేల మందికి పైగా ఇన్వెస్టర్లు, ఫండ్స్ పంపిణీదారుల నుంచి అభిప్రాయాలను సర్వేలో భాగంగా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తెలుసుకుంది.ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్లు) అన్నవి నిర్దేశిత సూచీల్లోని స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రాబడి కూడా సూచీల స్థాయిలోనే ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్ మెరుగైన రాబడుల అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. యాక్టివ్ ఫండ్స్తో పోల్చి చూస్తే ప్యాసివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. సర్వే అంశాలు..76 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పడం గమనార్హం.68 శాతం ఇన్వెస్టర్లు కనీసం ఒక ప్యాసివ్ ఫండ్లో పెట్టుబడులు పెట్టారు. 2023లో ఇలాంటి వారు 61 శాతంగా ఉన్నారు.ప్యాసివ్ ఫండ్స్కు ఆదరణ పెరిగినప్పటికీ.. యాక్టివ్ ఫండ్స్పైనా కొందరు ఇన్వెస్టర్లలో అమిత విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు యాక్టివ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరికి ప్యాసివ్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియకపోవడం కూడా ఒక కారణం.ప్యాసివ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వ్యయాలు కారణమని 54 శాతం మంది చెప్పారు. సులభత్వం, పారదర్శక గురించి 46 శాతం మంది ప్రస్తావించారు. 29 శాతం మంది పనితీరును కారణంగా పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల్లోనూ 93% మందికి ప్యాసివ్ ఫండ్స్పై అవగాహన ఉంది.సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మూడేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలం కోసం పెట్టుబడుల ధోరణి వారిలో కనిపించింది. ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెట్టుబడులు కొనసాగిస్తున్న వారు 13 శాతంగా ఉన్నారు.57 శాతం మంది ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఒకే విడతలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 26 శాతం మంది కేవలం సిప్లో, 17 శాతం ఒకే విడత పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 61 శాతం మంది చెప్పగా, రిటైర్మెంట్ నిధి కోసం 49 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 136.63 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 81,926.75 వద్ద, నిఫ్టీ 30.65 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 25,108.30 వద్ద నిలిచాయి.ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, మైండ్టెక్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోటిస్ లిమిటెడ్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, కేఐఓసీఎల్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,122కు చేరింది. సెన్సెక్స్(Sensex) 127 పాయింట్లు పుంజుకొని 81,919 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆరు ఐపీవోలకు గ్రీన్సిగ్నల్
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్కార్ట్ సొల్యూషన్స్, వేక్ఫిట్ ఇన్నోవేషన్స్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, కార్డీలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్వేస్ లీజర్ టూరిజం, కాటన్ యార్న్ల తయారీ కంపెనీ శ్రీరామ్ ట్విస్టెక్స్, ఇండ్రస్టియల్ ల్యామినేట్స్ ఉత్పత్తి చేసే లామ్టఫ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి సుమారు రూ. 6,500 కోట్లు పైగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్–జూలై మధ్య ఈ ఆరు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, సెపె్టంబర్ 26 – అక్టోబర్ 3 మధ్య అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. 2025లో 80 కంపెనీలు ఇప్పటికే ఐపీవోల ద్వారా నిధులు సమీకరించుకోగా, ఈ నెలలో మరిన్ని సంస్థలు లైనులో ఉన్నాయి.లెన్స్కార్ట్తాజాగా షేర్ల జారీ ద్వారా లెన్స్కార్ట్ సొల్యూషన్స్ రూ. 2,150 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 13.22 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఐపీవో నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, స్టోర్ల లీజులు–అద్దెలు మొదలైన వాటి చెల్లింపులకు, టెక్నాలజీ–క్లౌడ్ ఇన్ఫ్రాపై ఇన్వెస్ట్ చేసేందుకు, బ్రాండ్ మార్కెటింగ్కు, ఇతర సంస్థ కొనుగోలుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్రూ. 468.2 కోట్ల వరకు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత వాటాదారులు 5.84 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 82 కోట్లను 117 కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (కోకో)–రెగ్యులర్ స్టోర్స్, ఒక కోకో–జంబో స్టోర్ ఏర్పాటుకు; కొత్త పరికరాల కొనుగోలుకు రూ. 15.4 కోట్లు; ప్రస్తుత స్టోర్ల లీజులు, అద్దెల కోసం రూ. 145 కోట్లు; మార్కెటింగ్ కోసం రూ. 108 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియాఇష్యూ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ ఈ షేర్లను విక్రయించనుంది. వాటర్వేస్ లీజర్ టూరిజంకొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.727 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 552.53 కోట్లను తమ అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్కి సంబంధించిన అడ్వాన్స్లు, లీజులు మొదలైన వాటిని చెల్లించేందుకు, మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించుకోనుంది. శ్రీరామ్ ట్విస్టెక్స్1.06 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులను సొంత అవసరాల కోసం 6.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు, 4.2 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం; అలాగే రుణాల చెల్లింపు, ఇతరత్రా నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనుంది.లామ్టఫ్కొత్తగా 1 కోటి షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. తెలంగాణలో తమకున్న తయారీ ప్లాంటు విస్తరణకు, నిర్వహణ మూలధనం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం నిధులను కంపెనీ ఉపయోగించుకుంటుంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు
సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.ఎన్ఎస్ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే
హైదరాబాద్: లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రతిపాదిత ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్లో తొలి స్టోర్ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది.లలితా జ్యువెలరీ మార్ట్ (Lalithaa Jewellery Mart) దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతీయ బ్రాండ్ల్లో ఒకటి. కొన్నేళ్లుగా కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. నాణ్యత, పారదర్శకత, భారీ స్టోర్ల ఏర్పాటు వ్యూహంతో ఈ సంస్థ దేశీయ నగల మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. నాణ్యతకు నిదర్శనంగా అన్ని ఆభరణాలపై BIS హాల్మార్క్ ప్రమాణాలను పాటిస్తూ బంగారం (Gold), వెండి (Silver), వజ్రాల (Diamond) ఆభరణాలను అందిస్తోంది. ఈ సంస్థకు మొత్తం 6.09 లక్షల చదరపు అడుగుల వ్యాపార స్థలం ఉంది. ఇది సంస్థ విస్తృతికి అద్దం పడుతోంది.ఆర్థిక ప్రగతిలో దూకుడులలితా జ్యువెలరీ గత కొంతకాలంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. సంస్థ ఆదాయ వృద్ధి రేటు 43.62%గా ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఈ రంగంలో సంస్థ బలమైన పనితీరును సూచిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,788 కోట్లు ఆదాయం వస్తే రూ.359.8 కోట్లు లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో (9 నెలలు) రూ.12,594 కోట్లు ఆదాయం వస్తే అందులో రూ.262.3 కోట్లు లాభంగా ఉందని కంపెనీ తెలిపింది.భారీ స్టోర్ల వ్యూహం, తయారీ సామర్థ్యంలలితా జ్యువెలరీ దేశంలోనే అతిపెద్ద నగల స్టోర్లను నెలకొల్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన స్టోర్ల పరిమాణం ప్రత్యేకంగా నిలిచింది. విజయవాడలో 1,00,000 చదరపు అడుగులు, సోమాజిగూడ (హైదరాబాద్)లో 98,210 చదరపు అడుగులు, విశాఖపట్నంలో 65,000 చదరపు అడుగులతో స్టోర్లు నెలకొల్పింది.ఈ సంస్థకు తమిళనాడులో రెండు అత్యాధునిక తయారీ కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు) ఉన్నాయి. ఇక్కడ 563 మంది నిపుణులైన కారిగర్లు(బంగారు ఆభరణాల తయారీదారులు) పనిచేస్తున్నారు. వీరు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల డిజైన్లను రూపొందిస్తున్నారు. -
పసిడి హైజంప్!
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్కు తోడయ్యాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. నాన్ స్టాప్ ర్యాలీ...ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 582.95 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 81,790.12 వద్ద.. నిఫ్టీ 183.40 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 25,077.65 వద్ద నిలిచాయి.అట్లాంటా, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఏఏఏ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిగ్మా సాల్వ్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, మాస్టర్ ట్రస్ట్, ప్రోజోన్ రియాల్టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పసిడి కొత్త ధరలు: వింటే దడ పుట్టడం ఖాయం!!
దేశంలో బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. విజయదశమి సందర్భంగా కాస్త శాంతించినట్టే కనిపించినా మళ్లీ స్పీడ్ను అమాంతం పెంచేశాయి. ధర వింటేనే పసిడి ప్రియులకు దడ పుడుతోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు పెరిగి 24,916కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 పాయింట్లు పుంజుకొని 81,279 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గణాంకాలు, ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలతో పాటు ఐటీ దిగ్గజం టీఎస్ఎస్తో బోణీ కానున్న రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాలు మన మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వరుసగా మూడు నెలల నుంచి అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలను కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని చెప్పారు. మరోపక్క, జారుడు బల్లపై ఉన్న రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. టీసీఎస్ బోణీ... కార్పొరేట్ల క్యూ3 (జూలై–సెపె్టంబర్) ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలతో బోణీ కొట్టనుంది. ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం, 25 శాతం అదనపు టారిఫ్ల మోత తదితర భారత్ వ్యతిరేక చర్యల నేపథ్యంలో క్యూ2 ఫలితాలపై, కంపెనీల భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. ‘క్యూ2 ఫలితాల సందర్భంగా టారిఫ్ల ప్రభావం, వీసా ఫీజుల పెంపు, డీల్స్, కంపెనీల వ్యయాలు, ఉద్యోగాల కోత, హైరింగ్ అవుట్లుక్ వంటి అంశాలపై టీసీఎస్ యాజమాన్యం చేసే వ్యాఖ్యలు ఐటీ రంగంలో పాటు మార్కెట్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. గణాంకాలపై ఫోకస్.. ‘టీసీఎస్ ఫలితాలకు తోడు హెచ్ఎస్బీసీ సర్వీస్ రంగం పీఎంఐ డేటా, బ్యాంకింగ్ రంగ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు రానున్నాయి. టాటా క్యాపిటల్, ఎల్జీ బడా ఐపీఓలతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు జోరందుకోనున్నాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. కాగా, అమెరికాలో ఫెడర్ రిజర్వ్ ఇటీవలి పాలసీ భేటీ వివరాలు (మినిట్స్), నిరుద్యోగ గణాంకాలు, కన్జూమర్ సెంటిమెంట్ డేటా వంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఫోకస్ చేసే అవకాశం ఉంది. కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా కొన్ని కీలక ఆర్థిక గణంకాలు ఇప్పటికే ఆలస్యమయ్యయాని మిశ్రా పేర్కొన్నారు. గత వారమిలా... వరుసగా 8 రోజుల పాటు నష్టాల బాటలో సాగిన దేశీ మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కాస్త ఊరటనిచి్చంది. గురు, శక్రవారాల్లో ప్లస్లో నిలిచిన సూచీలు లాభాలతో వారాన్ని ముగించాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు (0.97%), నిఫ్టీ 240 పాయింట్లు (0.97%) చొప్పున ఎగబాకాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించినప్పటికీ, రానున్న నెలల్లో రేట్ల కోతకు ఆస్కారం ఉందంటూ ఇచ్చిన సిగ్నల్స్ మార్కెట్ను మెప్పించింది. మరోపక్క, ఐపీఓ ఫైనాన్సింగ్, షేర్ల తనఖా రుణ పరిమితిని భారీగా పెంచడం కూడా ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడంతో పాటు పాలసీ సందర్భంగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. ఇటీవలి కరెక్షన్ నుంచి మార్కెట్లు మళ్లీ సానుకూల పథంలోకి మారాయి’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.మెగా ఐపీఓ వారం..పబ్లిక్ ఆఫర్ల వరదతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లను ఈ వారం మెగా ఐపీఓలు (దాదాపు రూ.27,000 కోట్లు) ముంచెత్తనున్నాయి. టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్ల ఇష్యూతో పాటు (6న ప్రారంభమై 8న ముగుస్తుంది). దీని ప్రైస్ బ్యాండ్ను కంపెనీ రూ.310–326గా నిర్ణయించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కూడా ఈ వారమే ప్రారంభమవుతోంది. దాదాపు రూ.11,607 కోట్ల ఈ ఆఫర్ అక్టోబర్ 7న మొదలై 9న క్లోజవుతుంది. దీని ధరల శ్రేణి రూ.1,080–1,140. ఇవి కాకుండా రూబికాన్ రీసెర్చ్ రూ.1,377 కోట్ల ఇష్యూ అక్టోబర్ 9న షురూ కానుంది. ఇప్పటికే మొదలైన రూ.3,000 కోట్ల వియ్వర్క్ ఆఫర్ 7న ముగియనుంది. 2025లో ఇప్పటికే 78 ఐపీఓలు పూర్తవగా.. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు వరుస కట్టనున్నాయి.ఎఫ్పీఐల రివర్స్ గేర్...సెపె్టంబర్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) అమ్మకాల జోరు పెంచారు. ఈ ఒక్క నెలలోనే రూ.23,885 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా ఈక్విటీ మార్కెట్లో ఎప్పీఐల నికర అమ్మకాలు రూ.1.58 లక్షల కోట్లకు చేరాయి. వరుసగా మూడో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం తాజా కరెక్షన్కు ఆజ్యం పోసింది. ఆగస్ట్లో ఏకంగా రూ.34,990 కోట్లు ఉపసంహరించున్న ఎఫ్పీఐలు, జూలైలో రూ.17,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ‘ఇటీవలి అమ్మకాలకు ప్రధానంగా అమెరికా టారిఫ్ల మోతతో పాటు ఇతరత్రా పాలసీ షాక్లు ప్రధాన కారణం. భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్ల విధింపు, హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు వంటివి ఎగుమతి ఆధారిత రంగాలపై, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ సెంటిమెంట్ను దెబ్బతీసింది. రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం వల్ల తలెత్తుతున్న కరెన్సీ రిస్క్, భారతీయ స్టాక్స్లో అధిక వేల్యుయేషన్లు వంటివి కూడా ఎఫ్ఐపీలను తాత్కాలికంగా ఇతర ఆసియా మార్కెట్ల వైపు (రొటేషన్) దృష్టి సారించేలా చేస్తోంది’ అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. -
మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేసిన ఒక ట్వీట్.. నెట్ఫ్లిక్స్ (Netflix) మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్ 27న 514 బిలియన్ డాలర్లుగా ఉన్న దాని మార్కెట్ విలువ.. 2025 అక్టోబర్ 3 నాటికి సుమారు 25 బిలియన్ డాలర్లు తగ్గిపోయి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నమాట.పిల్లల షోలలో ట్రాన్స్జెండర్ సందేశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మస్క్ స్ట్రీమర్ను విమర్శించారు. ''మీ పిల్లల ఆరోగ్యం కోసం నెట్ఫ్లిక్స్ రద్దు చేయండి'' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్హమీష్ స్టీల్ దర్శకత్వం వహించిన.. నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ 'డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్' లింగ మార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, వోక్ ఎజెండాను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా నెట్ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ మార్కెట్ విలువ భారీ పతనాన్ని చవిచూసింది.Cancel Netflix for the health of your kids https://t.co/uPcGiURaCp— Elon Musk (@elonmusk) October 1, 2025 -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్టైమ్ గరిష్టాలకు చేరిన ధర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా.. పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది. డాలర్ విలువ రోజురోజుకి తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో బిట్కాయిన్ వాల్యూ ఆదివారం ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకొని.. 1,25,000 డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక బిట్కాయిన్ విలువ సుమారు రూ. 1.08 కోట్లు.ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విలువ తాజాగా 1,25,689 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 14న నెలకొల్పిన 1,24,514 రికార్డును సైతం.. ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుత పరిస్థితులు బిట్కాయిన్ విలువను అమాంతం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అమెరికా స్టాక్లలో లాభాలు, బిట్కాయిన్ లింక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోలు పెరిగాయి.ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ షట్డౌన్.. డబ్బును సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టేలా చేసింది. మార్కెట్ వర్గాలు దీనిని 'డీబేస్మెంట్ ట్రేడ్' అని పిలుస్తున్నారు. "ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి సేకరణలతో సహా అనేక ఆస్తులు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. డాలర్ విలువ తగ్గడం.. బిట్కాయిన్ విలువ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్ఎక్స్ మార్కెట్ల కో హెడ్ జాషువా లిమ్ అన్నారు.సాధారణంగా అక్టోబర్ నెల బిట్కాయిన్కు అనుకూలమైనది.. దీనిని "అప్టోబర్" అని మార్కెట్ నిపుణులు పిలుచుకుంటారు. గత కొన్నేళ్లుగా బిట్కాయిన్ పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.బిట్కాయిన్ పెరుగుదలపై విక్రమ్ సుబ్బురాజ్ ఏమన్నారంటే?బిట్కాయిన్ విలువ 125000 డాలర్లు దాటడం అనేది మరో మైలురాయి కాదు. గత కొంతకాలంగా దీని విలువ పెరుగుతూనే ఉంది. పరిస్థితులు కూడా బిట్కాయిన్కు అనుకూలంగా మారుతున్నాయి. దీనికి కారణం రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యం.. స్థిరమైన డిమాండ్ అని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. అంతే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బిట్కాయిన్ ఒక ప్రత్యేక ఆస్తి అని కూడా ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ, బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పండుగ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు (gold price) ఇప్పటికే 10 గ్రాములకు రూ .1,18,000 దాటగా, వెండి కిలోకు రూ .1,44,000 దాటింది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 21 నాటికి బంగారం రూ .1.22 లక్షలు, వెండి (silver price)రూ .1.50 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆజ్యం పోస్తున్న ప్రపంచ పోకడలుఅంతర్జాతీయంగా, బంగారం ఔన్స్ కు 3950– 4000 డాలర్లకు చేరుకుంటుందని, అలాగే వెండి ఔన్స్ కు 49– 50 డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ ధరల వేగానికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డోవిష్ (తక్కువ వడ్డీ రేట్లు, వృద్ధికి ప్రాధాన్యం) వైఖరి, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, బలమైన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, భారతదేశ పండుగ, వివాహ సీజన్ల నుండి బలమైన డిమాండ్.వెండికి పారిశ్రామిక డిమాండ్ సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ర్యాలీకి మద్దతు ఇస్తోంది. సరఫరా పరిమితులు, రూపాయి విలువ తరుగుదల మరింత ఊపందుకుంటోంది.ఇదీ చదవండి: ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి -
లిస్టింగ్ బాటలో మరిన్ని కంపెనీలు
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 77 కంపెనీలు లిస్ట్కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్మెంట్, ఎల్జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది. రూ. 2,000 కోట్లపై కన్ను రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది. 1,500 కోట్ల సమీకరణ .. రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్ సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.జెరాయ్ ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్మెంట్ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఉన్నాయి. -
ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి
దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం పసిడి ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం కలిగింది. కానీ శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టాటా క్యాపిటల్ @ రూ.310–326
ముంబై: టాటా క్యాపిటల్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు రూ.310–326 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుంది. జూలైలో చేపట్టిన రైట్స్ ఇష్యూతో పోలిస్తే ఐపీఓ షేరు ధర 5 శాతం తక్కువేనని, విస్తృత స్థాయిలో భాగస్వామ్యంతో పాటు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ షేరుకు రూ.343 చొప్పున రూ.1,750 కోట్లు సమీకరించింది. అతి పెద్ద ఇష్యూ... ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మార్కెట్ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. ఇష్యూలో భాగంగా టాటా సన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) 3.58 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కంపెనీ 21 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేస్తోంది. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్కు 88.6%, ఐఎఫ్సీకి 1.8 శాతం వాటా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా నిలుస్తున్న టాటా క్యాపిటల్ లోన్ బుక్ రూ.2.3 లక్షల కోట్ల పైమాటే. ఇందులో 88 శాతం రుణాలు రిటైల్ ఖాతాదారులు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచి్చనవే కావడం గమనార్హం. 2023లో నవంబర్లో టాటా టెక్నాలజీస్ అరంగేట్రం తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మరో భారీ ఐపీఓ కానుంది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 223.86 పాయింట్లు లేదా 0.28 శాతం లాభంతో 81,207.17 వద్ద, నిఫ్టీ 57.95 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 24,894.25 వద్ద నిలిచాయి.ఓరియంట్ టెక్నాలజీస్, కేఐఓసిఎల్, ఏఏఏ టెక్నాలజీస్, అట్లాంటా, ఒరిస్సా మినరల్స్ డెవలప్మెంట్ కంపెనీ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. సెంటమ్ ఎలక్ట్రానిక్స్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దసరా డబుల్ ధమాకా.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు
దేశంలో భారీగా పెరుగుతూన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Gold price today) మరి కాస్త క్షీణించాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్ద ప్రారంభమయ్యాయి.బీఎస్ఈలో టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ డ్రాగ్స్గా నిలిచాయి. ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉండగా, మాక్స్ హెల్త్, ఐషర్ మోటార్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.మరోవైపు విస్తృత మార్కెట్లు పెరిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా వరుసగా 0.95 శాతం, 0.48 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


